Ashwin Babu
-
మరో ఓటీటీలో క్రైమ్ సస్పెన్స్ సినిమా స్ట్రీమింగ్
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయతే, అమెజాన్ ప్రైమ్లో కూడా తెలుగు వెర్షన్లోనే హిడింబ మూవీ తాజాగా విడుదలైంది.ప్రముఖ యాంకర్ ఓంకార్ సోదరుడిగా అశ్విన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజుగారి గది సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఆ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ప్రాజెక్ట్లు ఏవీ ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ చిత్రాలన్నింటికి ఓంకార్ దర్శకత్వం వహించడం గమనార్హం. అయితే, హిడింబ చిత్రాన్ని అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై భారీ అశలు పెట్టకున్న మేకర్స్కు నిరాశే ఎదురైంది. అయితే, కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. అనుకున్న టార్గెట్ రీచ్ కావాడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్గా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.కథేంటి..?హైదరాబాద్లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. -
ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ హీరో ఫేమ్ అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జంటగా నటించిన శివం భజే. ఆగస్టు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. వైవిధ్యమైన కథ, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించినా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ హిట్ కొట్టలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఎలాంటి చడీచప్పుడు లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్ పాత్రలో హీరో నటించారు. ఓ మిషన్లో భాగమైన హీరో తాను అనుకున్నది సాధించాడా లేదా అనేది అసలు కథ. కాకపోతే ఈ స్టోరీకి శివుడు బ్యాక్ డ్రాప్ని కూడా జోడించారు. థియేటర్లలో పెద్దగా మెప్పించలేని ఈ మూవీకి.. ఓటీటీలోనైనా ఆదరణ దక్కుతుందేమో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, తులసి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వికాస్ బడిస సంగీతమందించారు. -
Shivam Bhaje Review: ‘శివం భజే’ మూవీ రివ్యూ
టైటిల్: శివం భజేనటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులునిర్మాణ సంస్థ: గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలిదర్శకత్వం: అప్సర్సంగీతం: వికాస్ బడిససినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్రవిడుదల తేది: ఆగస్ట్ 1, 2024ప్రస్తుతం టాలీవుడ్లో డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తున్నాయి. దీంతో మన దర్శక నిర్మాతలు డివోషనల్ టచ్ ఉన్న కథలలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కిన తాజా చిత్రమే ‘శివం భజే’. ‘హిడింబ’ తర్వాత అశ్విన్ బాబు నటించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంలో ‘శివం భజే’పై బజ్ క్రియేట్ అయింది. మరి డివోషనల్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: చందు(అశ్విన్ బాబు) రికవరీ ఏజెంట్గా పని చేస్తుంటాడు. ఓ కారు ఈఎమ్ఐ వసూలు చేస్తున్న క్రమంలో శైలజ(దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. శైలజ ఓ కెమికల్ ల్యాబ్లో పని చేస్తుంది. ఓ రోజు శైలజను కలిసేందుకు వెళ్లిన చందు ఆమె ఆఫీస్కు వెళ్తాడు. అక్కడ జరిగిన ఓ గొడవ కారణంగా అతను కంటి చూపు కోల్పోతాడు. దాంతో వైద్యులు అతనికి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. కొత్త కళ్లు వచ్చిన తర్వాత చందు ప్రవర్తనలో మార్పు వస్తుంది. డే మొత్తం నిద్రబోతూ.. నైట్ టైమ్లో మెలకువగా ఉంటాడు. అంతేకాకుండా అతని మైండ్లో రెండు హత్యలకు సంబంధించిన జ్ఞాపకాలు మెదులుతుంటాయి. వైద్యులను సంప్రదిస్తే..అతని కళ్లకు సంబంధించి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటి? అసలు ఆ కళ్లు ఎవరివి? అతని కలలోకి వస్తున్న హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? చైనా-పాకిస్తాన్ కలిసి ‘ఆపరేషన్ లామా’పేరుతో భారత్పై చేస్తున్న కుట్ర ఏంటి? ‘ఆపరేషన్ లామా’కు సాధారణ వ్యక్తి చందుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని కథలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. కానీ తెరపై చూస్తున్నప్పడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా.. వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించినప్పుడే ఫలితం ఉంటుంది. అయితే ‘శివం భజే’ విషయంలో అది కొంతవరకు మాత్రమే ఫలించింది. వాస్తవానికి దర్శకుడు అప్సర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తది. ఇలాంటి కాన్సెప్ట్తో తెలుగు తెరపై ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ డైరెక్టర్ అనుకున్న పాయింట్ని తెరపై ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఉగ్రవాదం, మెడికల్ క్రైమ్, సైన్స్, ఫ్యామిలీ, డివోషినల్..ఇలా ఐదారు జానార్లతో కలిపి ఈ కథ రాసుకున్నాడు. జీనోట్రాన్స్ప్లాంటేషన్ అనే కొత్త పాయింట్ని టచ్ చేశాడు. అయితే కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా నడిపిస్తే బాగుండేది.ఇండియా పై పాకిస్తాన్..చైనా చేసే కుట్ర సీన్ తో సినిమా ప్రారంభం అవ్తుంది. ఆ తరువాత వరుస హత్యలు..పోలీసుల ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఒక వైపు.. హీరో..హీరోయిన్ల లవ్ ట్రాక్ మరో వైపు నడుస్తుంది. ఈ రెండిటికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది చెప్పకుండా కథ పై ఆసక్తి కలిగేలా చేశాడు డైరక్టర్. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. సెకండాఫ్ లో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. జీనోట్రాన్స్ప్లాంటేషన్ రివీల్ అవ్వడం..ఆ తర్వాత వెంటనే ‘డోగ్రా’ గురించి తెలియడం..దాని నేపథ్యం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ వరుస హత్యలపై పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చప్పగా సాగుతుంది. బలమైన విలన్ లేకపోవడం సినిమాకు మైనస్. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్.. కాంతార లెవల్లో సాగే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. కథ మాదిరే స్క్రీన్ప్లేని కూడా మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..నటన పరంగా అశ్విన్ బాబుకి వంక పెట్టలేం. ఎలాంటి పాత్రలోనైనా ఆయన అవలీలగా నటించగలడు. తొలిసారి ఆయన ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిగా నటించాడు. రికవరీ ఏజెంట్ చందుగా ఆయన చక్కగా నటించాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్లో అశ్విన్ నటవిశ్వరూపం చూపించాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పాత్రకి ఇందులో పెద్దగా స్కోప్ లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. ఏసీపీ మురళీగా అర్బాజ్ ఖాన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది, బ్రహ్మాజీ కామెడీ వర్కౌట్ అయింది. మురళీ శర్మ, తులసి, ఇనయ సుల్తానాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. వికాస్ బడిస నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- రేటింగ్: 2.75/5 -
హీరో అశ్విన్ కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్
'శివం భజే' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన అశ్విన్ పుట్టినరోజు ఈరోజే (ఆగస్టు 01). ఈ క్రమంలోనే ఇతడికి బర్త్ డే విషెస్ చెబుతూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మెడికో థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్!)ఈ సినిమాలో అశ్విన్ బాబుకి జోడిగా రియా సుమన్ నటిస్తోంది. అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, కొడైకెనాల్లో 75% షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. 'హనుమన్' ఫేమ్ హరి గౌర.. ఈ సినిమాకు సంగీతమందిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం) -
కొత్తగా ప్రయత్నించాలని ఈ సినిమా చేశాను: అశ్విన్బాబు
అశ్విన్బాబు హీరోగా నటించిన చిత్రం ‘శివం భజే’. ఇందులో దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్. మూలి మహేశ్వర్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ తర్వాత చాలా కథలు విన్నాను. మళ్లీ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్న సమయంలో ‘శివం భజే’ కథ విన్నాను. చాలా నచ్చింది.నా గత చిత్రాలు ‘రాజుగారి గది, హిడింబ’లా ‘శివం భజే’ పాయింట్ బాగుంటుంది. ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అంతా విధి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా!.. ఆ టైపులో ఇందులోని నా క్యారెక్టర్ ఉంటుంది. అప్సర్ ‘శివం భజే’ కథను రాసుకున్న తీరు, ఐడియాలజీ నాకు నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు కథను డివైన్ పాయింట్కు కనెక్ట్ చేసిన విధానం బాగుంటుంది.నిర్మాత రాజీ పడకుండా ఎక్కువే ఖర్చుపెట్టారు. ఏమన్నా అంటే అంతా శివయ్య చూసుకుంటారు అనేవారు. ఆగస్టు 1న నా బర్త్ డే కాబట్టి ఈ సినిమా రిలీజ్ను ప్లాన్ చేయలేదు. మేం ఓ రిలీజ్ డేట్ అనుకున్నాం. సరిగ్గా అది నా బర్త్ డేకి కుదిరింది... అంతే. ఇక ‘రాజుగారి గది 4’ సినిమా ప్లానింగ్ జరుగుతోంది. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
కొత్తగా ట్రై చేశాను : హీరో అశ్విన్ బాబు
‘హిడింబ తరువాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా ట్రై చేయాలని, యూనిక్ పాయింట్తో రావాలని అనుకున్నాను. ఆ టైంలోనే ఈ శివం భజే కథను విన్నాను. నాకు చాలా నచ్చింది. రాజు గారి గది, హిడింబలా ఇందులోనూ కొత్త పాయింట్ ఉంటుంది. అది ఆడియన్స్కి బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను’ అన్నారు హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించింది. ఆగస్ట్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అశ్విన్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ⇒ శివంభజే చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు డివైన్ పాయింట్ ఉంటుంది. హిడింబలో కారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. అంతా విధి.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే టైపులో ఉండే పాత్ర. అలాంటి పాత్ర చుట్టూ రాసుకున్న కథ నాకు చాలా నచ్చింది. ముస్లిం వ్యక్తి అయినా కూడా అప్సర్ ఈ కథను రాసిన విధానం నాకు చాలా నచ్చింది.⇒ శివం భజేలో చాలా మెచ్యూర్డ్గా, స్టైలీష్ యాక్షన్ చేశావ్ అన్నా అని మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస అన్నారు. అది నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్. టీం అంతా కూడా యాక్షన్ సీక్వెన్స్ పట్ల సంతృప్తి చెందారు. డైరెక్టర్ ఈ కథలో డివైన్ పాయింట్ను ఎలా కనెక్ట్ చేశారన్నదే ఇంట్రెస్టింగ్గా ఉంది.⇒ హిడింబకు సెన్సార్ సమస్యలు వచ్చాయి. కానీ ఈ చిత్రాన్ని చూసి వారంతా సంతోషించారు. సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు. అప్సర్ తీసిన పాయింట్, ఐడియాలజీ చాలా నచ్చింది.⇒ వికాస్ బడిస మ్యూజిక్, అప్సర్ రాసిన కథ, శివేంద్ర విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శివయ్య మన వెనకాల ఉన్నాడు అనే ధైర్యంగా ముందడుగు వేశారు.⇒ నా బర్త్ డే, నిర్మాత పుట్టిన రోజు ఆగస్ట్ 1న కాబట్టి సినిమాను ఆ డేట్ను రిలీజ్ చేయాలని అనుకోలేదు. ఒక డేట్ అనుకున్నాం. ఆ డేట్ మా బర్త్ డే అయింది. అంతే కానీ.. కావాలని ప్లాన్ చేసింది అయితే కాదు.⇒ దిగంగనా అద్భుతంగా నటించారు. అర్బాజ్ ఖాన్ గారితో మంచి సీన్స్ ఉంటాయి. ఆయన పాత్రతోనే సినిమా అంతా నడుస్తుంది. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది.⇒ నేను ఒక మంచి డ్యాన్సర్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంత వరకు తెరపై అంతగా డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. సినిమా కథకు సరిపోతేనే డ్యాన్స్ పెట్టమని అంటాను. కథలో భాగంగానే అన్నీ రావాలని ఫీల్ అవుతాను. థియేటర్లో ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేయాలని అనుకుంటాను.⇒ మా నిర్మాత చాలా మంచి వ్యక్తి. ప్రతీ సారి నేను ఆయన్ను బడ్జెట్ విషయంలో కంట్రోల్ చేస్తుండేవాడ్ని. కానీ ఆయన సినిమాకు ఏం కావాలో అంత కంటే ఎక్కువే పెట్టారు. ఏమైనా అంటే శివయ్య ఉన్నారని అంటుండేవారు. ఆయన ఎలా అనుకున్నారో సినిమా అలా వచ్చింది.⇒ అందరూ రాజు గారి గది ఫ్రాంచైజీల గురించి అడుగుతున్నారు. కానీ నాకు ఎక్కువగా థ్రిల్లింగ్ సబ్జెక్టులే వస్తున్నాయి. రాజు గారి గది 4 ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అన్నయ్య కథను రాస్తున్నారు. మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయి. -
అప్పుడే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు: ‘శివం భజే’ నిర్మాత
‘టికెట్ల రేట్లు తగ్గించినంత మాత్రనా సినిమా చూస్తారనుకోవడం పొరపాటు. కంటెంట్లో దమ్ముండాలి. మౌత్ టాక్ బాగుంటే టికెట్ రేట్లు తగ్గించినా..పెంచినా ప్రేక్షకుడు థియేటర్స్కి వస్తారు’అని అన్నారు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి. ఆయన నిర్మాణ సంస్థలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన చిత్రం‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శివం భజే కథను ముందుగా నేను విన్నాను. నాకు చాలా నచ్చింది. విన్న వెంటనే అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తరువాత ఈ కథను అశ్విన్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా వెంటనే నచ్చింది. ఐదు నిమిషాల్లోనే ఓకే చెప్పేశారు. అలా ప్రాజెక్ట్ ముందుకు కదిలింది.→ హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా అని ఏమీ ఈ సినిమాను ఆగస్ట్ 1న రిలీజ్ చేయడం లేదు. మేం ఒక డేట్ అనుకున్నాం.. అది ఆయన బర్త్ డే అయింది. అంతే కానీ మేమేదో కావాలని పుట్టిన రోజు స్పెషల్గా రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేయలేదు.→ నేను శివుడి భక్తుడ్ని కాబట్టి.. ఈ సినిమాను తీయలేదు. కథలో ట్విస్టులు బాగా నచ్చాయి. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి. ఇది ఒక జానర్కు మాత్రమే పరిమితం అవుతుందని కూడా చెప్పలేను. ఐదారు జానర్లు కలిసి తీసిన సినిమాలా ఉంటుంది. అన్ని రకాల అంశాలుంటాయి. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ట్విస్టులను అయితే ఇప్పుడు రివీల్ చేయలేను→ శివం భజే చిత్ర విడుదలకు ఇదే సరైన సమయం(ఆగస్ట్ 1) అని భావించాను. డిస్ట్రిబ్యూటర్గానూ ఆలోచించాను. అందుకే ఈ డేట్ను ఫిక్స్ చేశాం. ఇక మున్ముందు పెద్ద సినిమాలు రాబోతోన్నాయి. క్వాలిటీ, కంటెంట్ కోసం అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువే బడ్జెట్ పెట్టాను.→ మ్యూజిక్ డైరెక్టరే ఈ చిత్రానికి హీరో. అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ మూవీని హైద్రాబాద్ చుట్టూనే తీశాం. కథ కూడా పూర్తిగా ఇక్కడే తిరుగుతుంది.→ ఐఐటీ కృష్ణమూర్తి టీంతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నా. కార్తికేయతో ఓ సినిమా ఉంది. శివం భజే హిట్ అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాం. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే అమ్ముడుపోయాయి. ఈ చిత్రం హిట్ అయితే.. రెండో పార్ట్ని కూడా ప్లాన్ చేస్తాం. -
షమ్ము హీరోగా క్రేజీ మూవీ.. టైటిల్ రివీల్ చేసిన అశ్విన్ బాబు
షమ్ము హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'క్రేజీ రాంబో'. ఈ సినిమాకు హరీష్ మధురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభం అయింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మూవీ ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. 'క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా తప్పకుండా క్రేజీగా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. హీరో షమ్ము మాట్లాడుతూ.. 'ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రేజీ రాంబో కథ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది' అని అన్నారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ మధు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నా. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది' అన్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
అశ్విన్ ‘శివం భజే’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
అశ్విన్ బాబు ని ఒక ఆట ఆడుకున్న తమన్
-
అశ్విన్ కెరీర్లో శివం భజే నిలిచిపోతుంది: విశ్వక్ సేన్
‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. నేపథ్య సంగీతం అదిరిపో యింది. ఆగస్ట్ 1న అశ్విన్కు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. తన కెరీర్లో ‘శివం భజే’ నిలిచిపోతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా అప్సర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదలవుతోంది.మంగళవారం జరిగిన ‘శివం భజే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విశ్వక్ సేన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘శివం భజే’ ట్రైలర్ బాగుంది. యూనిట్కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు అనిల్ రావిపూడి.‘‘అశ్విన్ క్రికెట్లో బాల్ను ఎలా బాదుతాడో బాక్సాఫీస్ను కూడా అలానే బాదాలి’’ అన్నారు తమన్. ‘‘పరమేశ్వరుడి కథతో రూపొందిన ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు అప్సర్. ‘‘ముస్లిం అయిన అప్సర్గారు ‘శివం భజే’ లాంటి కథను ఎలా రాశారో అనుకున్నాను. ఇదంతా శివ లీల అనిపించింది’’ అని అన్నారు అశ్విన్బాబు. -
నా దృష్టిలో పాన్ ఇండియా అంటే అదే: టాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్స్
మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం శివం భజే. ఈ మూవీని అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో దిగాంగన సూర్యవన్షి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై అశ్విన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అశ్విన్ బాబు మాట్లాడుతూ..'తెలుగులో చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. చాలా వరకు హిట్ అయ్యాయి. నేను మాత్రం ఎక్కువగా స్క్రిప్ట్ను నమ్ముతాను. కంటెంట్ మాత్రమే పాన్ ఇండియా అనుకుంటా. ఎందుకంటే హిడింబ చిత్రాన్ని మనకంటే హిందీలో ఎక్కువగా చూశారు. ఇది నేను ఊహించలేదు. శివం భజే పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా సరే.. సినిమా రీచ్ అయితే చాలు' అని అన్నారు.ట్రైలర్ చూస్తే ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్గా అశ్విన్ బాబు కనిపించనున్నారు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హైపరి ఆది, మురళి శర్మ, సాయిధీనా, బ్రహ్మజీ, తులసి, దేవి ప్రసాద్, షకలక శంకర్, ఇనయా సుల్తానా కీలక పాత్రలు పోషించారు. నాకు ప్యాన్ ఇండియా వద్దు.. సినిమా రీచ్ అయితే చాలు!Hero @imashwinbabu says, "I believe in only content!"💥💥#AshwinBabu #ShivamBhaje #TeluguFilmNagar pic.twitter.com/mFdt7s8Mfs— Telugu FilmNagar (@telugufilmnagar) July 23, 2024 -
ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లే 'శివం భజే' ట్రైలర్
టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ వస్తుంటుంది. అలా ప్రస్తుతం డివోషనల్ తరహా స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. రెగ్యులర్ కాన్సెప్ట్కి చిన్న డివోషనల్ టచ్ ఇచ్చి సినిమాలు తీస్తున్నారు. రీసెంట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'కల్కి' కూడా ఇలాంటిదే. ఇప్పుడు డివోషనల్ ప్లస్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన మూవీ 'శివం భజే'. తాజాగా దీని ట్రైలర్ రిలీజైంది.(ఇదీ చదవండి: రోలెక్స్ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్)ట్రైలర్ చూస్తే బాగానే ఉంది. ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్ మన హీరో. ఓ మిషన్ కోసం పనిచేస్తుంటాడు. చివరకు ఏమైంది? అనుకున్న సాధించాడా లేదా అనేది పాయింట్. కాకపోతే ఈ స్టోరీకి శివుడు బ్యాక్ డ్రాప్ని జోడించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి రిఫరెన్స్ల వరకు చాలాచోట్ల శివుడు కనిపించాడు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?) -
హం పరమేశ్వరం...
‘రం రం ఈశ్వరం... హం పరమేశ్వరం... యం యం కింకరం... వం గంగాధరం...’ అంటూ మొదలవుతుంది ‘రం రం ఈశ్వరం’ పాట. అశ్విన్బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన ‘శివం భజే’ సినిమాలోనిది ఈ పాట. ఆధ్యాత్మిక అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు.ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రం రం ఈశ్వరం’ పాట లిరికల్ వీడియోను సంగీత దర్శకుడు తమన్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. సంగీత దర్శకుడు వికాస్ బడిస సారథ్యంలో పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటను సాయిచరణ్ పాడారు. ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి’’ అన్నారు మహేశ్వర్ రెడ్డి. -
అశ్విన్ బాబు ‘శివం భజే’ రిలీజ్ డేట్ ఫిక్స్
‘రాజుగారి గది’ ఫేమ్ అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జోడీగా నటించిన ‘శివం భజే’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ఆగస్టు 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘శివం భజే’. వైవిధ్యమైన కథతో, ఉన్నత సాంకేతిక విలువలతో మా సంస్థలో నిర్మించిన తొలి చిత్రం ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘టైటిల్, టీజర్తో అందరి దృష్టిని ఆకర్షించిన మా ‘శివం భజే’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి’’ అన్నారు అప్సర్. ‘‘ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించినదానికంటే అద్భుతంగా వచ్చింది. ఆ శివుని అనుగ్రహంతో ΄ాటు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నాం’’ అన్నారు అశ్విన్ బాబు. అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, తులసి ఇతర ΄ాత్రలు ΄ోషించిన ఈ చిత్రానికి మ్యూజిక్: వికాస్ బడిస, కెమెరా: దాశరథి శివేంద్ర. -
సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తోన్న శివం భజే.. టీజర్ వచ్చేసింది!
అశ్విన్ బాబు, దిగంగనా జంటగా నటించిన చిత్రం 'శివం భజే'. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర్ రెడ్డి నిర్మాతగా.. అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథతో మా సంస్థ నిర్మాణంలో వస్తోన్న చిత్రం 'శివం భజే'. టైటిల్, ఫస్ట్ లుక్కు మించి టీజర్కు స్పందన రావడం ఆనందంగా ఉంది. జూలైలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. " శివం భజే టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించాం. టీజర్కు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత మహేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందిస్తాం. విడుదల తేదీ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని అన్నారు.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. "టీజర్కు అనూహ్య స్పందన వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న 'శివం భజే' ఫస్ట్ లుక్
అశ్విన్బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మాలి నిర్మించిన చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ సినిమా నుంచి అశ్విన్బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. సరికొత్త కథతో ఈ సినిమాను రూపొందించాం. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు వికాస్ బాడిస స్వరకర్త. -
తిరుమలలో ఓంకార్ సోదరుడు అశ్విన్, తమన్ సందడి (ఫోటోలు)
-
సరికొత్త కథతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న అర్బాజ్ ఖాన్!
'జై చిరంజీవ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అర్బాజ్ ఖాన్. ఆ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడు ఈ పాపులర్ బాలీవుడ్ నటుడు. యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక డిఫరెంట్ కథలో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని అర్బాజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'అని అన్నారు. -
వైవిధ్యమైన కథ
‘రాజుగారి గది, హిడింబ’ చిత్రాల ఫేమ్ అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా సోమవారం కొత్త సినిమాప్రారంభమైంది. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వశిష్ఠ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత ఓంకార్ యూనిట్కి స్క్రిప్ట్ అందించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘‘వైవిధ్యమైన కథ, సరికొత్త కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిస, కెమెరా: దాశరధి శివేంద్ర. -
మెడికో థ్రిల్లర్.. యంగ్ హీరో ప్రయోగం
అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్ ఖరారు చేశారు. మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో ఆలూరి సురేష్ నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్టు 1) అశ్విన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ను ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘మెడికో థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అశ్విన్ ఫిజికల్గా మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: గౌర హరి. -
అనుకున్నవన్నీ జరిగాయి
అశ్విన్బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శనివారం థ్యాంక్స్ మీట్లో అశ్విన్ మాట్లాడుతూ– ‘‘హిడింబ’ విషయంలో మేం అనుకున్నవన్నీ జరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘రెండు రోజులకే రూ. 3 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసిందీ చిత్రం’’ అన్నారు అనిల్ కన్నెగంటి. ‘‘వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. -
స్టేజిపైనే బోరున ఏడ్చేసిన హీరోయిన్.. కారణమిదే!
అశ్విన్ బాబు, నందితా శ్వేత పోలీస్ పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్పై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. అమ్మాయిల సీరియల్ కిడ్నాప్లకు సంబంధించిన కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నందితా శ్వేత ఫుల్ ఎమోషనలయ్యారు. స్టేజ్పై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. (ఇది చదవండి: వేకేషన్కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్పోర్ట్లో సందడి!) నందితా శ్వేత మాట్లాడుతూ.. ' హిడింబ టైటిల్ చూడగానే అందరికీ కేవలం థ్రిల్లర్ మూవీ అనుకుని ఉంటారు. కానీ ఫ్యామిలీ కూడా వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ రోల్ నేను చేస్తానని అనుకోలేదు. దర్శకుడు అనిల్ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అశ్విన్ - అనిల్ వల్లే నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశా. వాళ్లు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు.' అని అన్నారు. నందితా మాట్లాడుతూ..' ఈ మూవీ నాకు సెంటిమెంటల్గా ఎంతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మూవీ చేసేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఈ మూవీ వల్లే నాకు పేరు వచ్చింది. ఆయన ఆశీస్సుల వల్ల నేను ఇక్కడ ఉన్నాఅంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ‘హిడింబ’తోనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని' నందితా శ్వేత అన్నారు. (ఇది చదవండి:'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే' ) -
Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ
టైటిల్: హిడింబ నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె తదితరులు నిర్మాత: గంగపట్నం శ్రీధర్ సమర్పణ: అనిల్ సుంకర దర్శకత్వం: అనిల్ కన్నెగంటి విడుదల తేది: జులై 20, 2023 కథేంటంటే.. హైదరాబాద్లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు అర్థమయ్యేలా, వారు ఆ కథలో ప్రయాణించేలా చేస్తేనే ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. లేదంటే ఎంత గొప్ప కథ అయినా, ఎంత క్రియేటివ్గా చూపించినా వారికి అర్థం కాకపోతే అంతే సంగతి. ‘హిడింబ’లో ఆ పొరపాటే జరిగింది. వాస్తవానికి ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తది. తెలుగు తెరపై ఇంతవరకు రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దర్శకుడి తప్పిదమే లేదా ఎడిటింగ్ లోపమో తెలియదు కానీ ఈ చిత్రం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నాన్ లినియర్ స్క్రీన్ప్లేతో(ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే..మరొక సీన్ గతంలో సాగుతుంటుంది) కాస్త డిఫరెంట్గా ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి దర్శకుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడేమో కానీ అది వర్కౌట్ కాకపోవడమే కాకుండా ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తుంది. నగరంలో వరుస కిడ్నాపులు జరగడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో వాళ్లకు కొన్ని సవాళ్లు ఎదురు కావడం, చివరకు ఆ కేసును చేధించడం ఇలా రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఫస్టాఫ్ సాగుతుంది. కాలబండాలో బోయ ముఠాలో హీరో చేసే ఫైట్ సీన్ ఆకట్టకుంటుంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ చూడడానికి బాగుంటుంది కానీ సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్లో ఉంటుంది. హిడింబ తెగకు సంబంధించిన నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. నగరంలో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు సంబంధం ఉండడం.. చివర్లో వచ్చే ట్విస్టులు, సర్ప్రైజ్లు ప్రేక్షకులను ధ్రిల్కు గురిచేస్తుంది. అయితే దర్శకుడు చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. పోలీసులు పెద్దగా కష్టపడకుండానే కిడ్నాప్కు సంబంధించిన క్లూలు లభించడం, నగరం దాటి వెళ్లొద్దని ఆద్యకు డీజీపీ చెప్పినా.. ఆమె కేరళ వెళ్లడం, ఇలా చెప్పుకుంటూ చాలా సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. స్క్రీన్ప్లే మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. పోలీసు అధికారి అభయ్ పాత్రకు అశ్విన్ బాబు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో అశ్విన్ చాలా మెరుగుపరుచుకున్నాడు. యాక్షన్ సీన్స్ స్టార్ హీరోలకు తగ్గకుండా చేశాడు. క్లైమాక్స్లో అతని నటన అద్భుతంగా ఉంటుంది. ఐపీఎస్ అధికారి ఆద్యగా నందితా శ్వేతా తనదైన నటనతో మెప్పించింది. హీరోతో సమానమైన పాత్ర తనది. మకరంద్ దేశ్ పాండే పాత్ర ఈ సినిమాకు చాలా ప్లస్. ఆ పాత్రలో ఆయనను తప్పా మరొకరిని ఊహించుకోలేం. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం వికాస్ బాడిస సంగీతం. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
అశ్విన్ బాబు, అనిల్ సుంకర కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
-
ఒక చరిత్రను వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే కథే ‘హిడింబ’
‘‘కథని బలంగా నమ్మి చేసిన చిత్రం ‘హిడింబ’. స్క్రీన్ప్లే, విజువల్స్ రెగ్యులర్గా కాకుండా మా మూవీలో కొత్తగా ఉంటాయి. సినిమా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అని హీరో అశ్విన్ బాబు అన్నారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘హిడింబ’ రివర్స్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ– ‘‘ఒక చరిత్ర వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిడింబ’. నాకు గొప్ప తృప్తి ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అన్నారు గంగపట్నం శ్రీధర్. ఈ కార్యక్రమంలో నటులు శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచె పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా: హీరోయిన్
‘‘స్టార్డమ్ అనేది నా చేతుల్లో లేదు. నాకు వచ్చిన పాత్రలకు న్యాయం చేయడంపైనే దృష్టి పెట్టాను. వైవిధ్యమైన పాత్రలు చేశాను. ‘హిడింబ’తో నాకు స్టార్డమ్ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అన్నారు నందితా శ్వేత. అశ్విన్బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. (ఇది చదవండి: రెండో భర్త మరణం.. 23 ఏళ్లకే జీవితం ముగిసిపోయింది: నటి) ఈ సందర్భంగా హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ ‘‘హిడింబ’లో ఆద్యా అనే పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటుంది. ఇక దాదాపు నాలుగేళ్లుగా కండరాలకు సంబంధించిన ఫైబ్రోమాల్జియాతో ఇబ్బంది పడుతున్నాను. దీనివల్ల భారీగా కసరత్తులు, డైట్ చేయకూడదు. నిద్రలేమి ఉండకూడదు. కానీ ‘హిడింబ’ కోసం ఇవన్నీ జరిగాయి. ఆ విధంగా కొంత స్ట్రగుల్ అయ్యాను. నేను చేసిన ‘మంగళవారం’ , ఓ మంచి ఘోస్ట్’ చిత్రాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. తెలుగులో ఒకటి, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. (ఇది చదవండి: అందుకే సినిమాలకు దూరమయ్యా..: తమ్ముడు హీరోయిన్) -
'హిడింబ' సినిమాకు రీ–సెన్సార్ చేశాం.. కారణం ఇదే'
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం 'హిడింబ'. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వీకే సినిమాస్పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ, ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని జానర్' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్లో వేశారు మేకర్స్. (ఇదీ చదవండి: రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్తో!) 'యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, థ్రిల్ని ఇచ్చేలా ‘హిడింబ’ని మలిచారు అనిల్ కన్నెగంటి. ఈ చిత్రంలో కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ వారు చెప్పారు. దీంతో రివ్యూ కమిటీ ద్వారా సినిమాని రీ–సెన్సార్ చేసి విడుదల చేస్తున్నాం' అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాదిసా, కెమెరా: బి. రాజశేఖర్. -
'ఇప్పటి వరకు అన్నీ నువ్వే'.. ఏడ్చేసిన హీరో అశ్విన్!
-
'నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా'.. హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం!
టాలీవుడ్లో యంగ్ హీరో అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజు గారి గది సిరీస్తో అభిమానులను మెప్పించారు. ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. జీనియస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమయ్యారు. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో మెప్పించారు ఆయన నటించిన రాజుగారి గది సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. రాజు గారి గది సిరీస్ చిత్రాలకు అతడి అన్నయ్యే దర్శకుడు కావడం విశేషం. (ఇది చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్) హిడింబ చిత్రం మరోసారి అభిమానులను పలకరించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఓంకార్ యాంకర్గా హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. అశ్విన్తో పాటు హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్ కూడా వచ్చారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ షోలో పాల్గొన్న తమ్ముడిని చూసి ఓంకార్ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి తమ్ముడితో సిక్త్ సెన్స్ షో ఆడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో పాల్గొన్న వారిని ప్రశ్నించిన ఓంకార్.. తన తమ్ముడికి కూడా ఓ ప్రశ్న వేశాడు. నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా అని అడిగాడు. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ ప్రశ్నకు అశ్విన్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. 'ఇప్పటివరకు నాకు అన్నీ నువ్వే. నేను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నా అన్నయ్యా. నిన్ను అడగాలంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ' కన్నీటి పర్యంతమయ్యాడు. తమ్ముడిని చూసిన అన్నయ్య కూడా ఫుల్ ఎమోషనల్గా కనిపించారు. వీరు మొత్తం ముగ్గురు అన్నదమ్ముులు కాగా.. చిన్నతమ్ముడు నిర్మాణరంగంలో రాణిస్తున్నారు. తన తమ్ముళ్ల కోసం ఓంకార్ ఎంత ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. -
‘హిడింబ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది
‘‘క్రికెట్ వల్ల అశ్విన్ తో నాకు పరిచయం ఏర్పడింది. అశ్విన్ హీరోగా నటించిన ‘హిడింబ’ ట్రైలర్ లాంచ్కు రావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం ‘హిడింబ’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సాయిధరమ్ ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. అశ్విన్ బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ నా కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నుంచి హిస్టారికల్ ఫిక్షన్ కు వెళ్లే చిత్రమిది. అశ్విన్ యాక్టింగ్ స్కిల్స్ ఈ సినిమాతో తెలుస్తాయి’’ అన్నారు అనిల్. ‘‘అశ్విన్ సపోర్ట్ వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: బి. రాజశేఖర్. -
ఘనంగా ప్రారంభమైన అశ్విన్ బాబు కొత్త సినిమా
‘రాజుగారి గది’ ఫేం అశ్విన్ బాబు కొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత అశ్విన్ నటిస్తున్న ఈ చిత్రం ఇది. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో పాలక్ లాల్వాని, విలక్షణ నటుడు నాజర్, కాంతారా ఫేమ్ అచ్యుత్, ఆర్.జె. హేమంత్, సంజ జనక్, మాధవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వచ్చిన వాడు గౌతం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. డీఎస్సార్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఎంఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర ఓపెనింగ్ షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్రలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
అశ్విన్ బాబు యాక్షన్ థ్రిల్లర్.. కొత్త ఏడాదిలో ప్రారంభం..!
విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ రాజు గారి గది సినిమా సిరీస్తో ఘన విజయాన్ని సాధించిన హీరో అశ్విన్ బాబు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్గా 'హీడింబ'తో మరోసారి తన సత్తా చాటనున్నారు . దమ్మాలపాటి కృష్ణారావు ఆశీస్సులతో.. శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్పై అశ్విన్ బాబుతో కొత్త ఏడాదిలో ప్రముఖ నిర్మాత డీఎస్ఆర్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటిస్తున్న అశ్విని బాబు తదుపరి చిత్రం ఒక విభిన్న మైన స్టోరీ లైన్తో,మెడికల్ థ్రిల్లర్గా రూపొందుతుంది. ఈ చిత్రంతో ఎం.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో.. మంచి టెక్నికల్ వాల్యూస్తో ఉన్న చిత్రాలు నిర్మించనున్నట్లు చిత్ర నిర్మాత డీఎస్ఆర్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
యాక్షన్తో అదరగొట్టిన అశ్విన్.. ఆసక్తిగా 'హిడింబ'
Ashwin Babu Nandita Swetha Hidimba First Glimpse Released: విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నాడు అశ్విన్ బాబు. జీనియస్, రాజుగారి గది 2, రాజుగారి గది 3 చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు వాటన్నింటికి డిఫరెంట్గా అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం 'హిడింబ'. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్లో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్గా నందితా శ్వేత నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ రిలీజైన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. 'పోలీసు ఆపరేషనా' అంటూ సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే డైలాగ్తో ప్రారంభమైన ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఓ బాలుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కినట్లు సమాచారం. హీరో, విలన్ల మధ్య పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్్ అద్భుతంగా ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీతో అశ్విన్కు మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. చదవండి: అదరగొట్టిన కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్.. టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. -
అశ్విన్బాబు కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
యాంకర్ ఓంకార్ తమ్ముడు, ‘జీనియస్’ఫేమ్ అశ్విన్బాబు హీరోగా, అనిల్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అశ్విన్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఆదివారం ఆ సినిమా టైటిల్తో పాటు, ఫస్ట్లుక్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘హిడింబ’ అనే విభిన్న పేరుని ఖరారు చేశారు. తలపై రక్తపు చుక్కలు.. చేతిలో ఇనుప చువ్వను పట్టుకుని సీరియస్లో లుక్లో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాడు అశ్విన్. బట్టి చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో అశ్విన్ సరసన నందితా శ్వేత నటిస్తోంది. రఘుకుంచె, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్ పతాకంపై గంగాపట్నం శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వికాస్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రేక్షకుల సపోర్ట్ చాలు
ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘రాజుగారి గది–3’. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్బాబు, అవికాగోర్ జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ –‘‘నా తమ్ముడు అశ్విన్ను హీరోగా యాక్సెప్ట్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సాధారణంగా పెద్ద íహీరో సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఫుల్ అవుతుంటాయి. అలాంటిది మా ‘రాజుగారి గది 3’ చిత్రం ఫుల్ అవుతోంది’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నేను కూకట్పల్లిలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాను. వారందరూ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఆడాలంటే ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే చాలు’’ అన్నారు. ‘‘4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. అశ్విన్ ప్రాణం పెట్టి నటించారు’’ అన్నారు కెమెరామెన్ ఛోటా. కె. నాయుడు. ‘‘సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. ఈ చిత్రంతో నాకు ఓ మార్కెట్ ఏర్పడింది అని ఫ్రెండ్స్ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అశ్విన్. ‘‘సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు మా యూనిట్కి అభినందన లు’’ అన్నారు అవికాగోర్. సంగీత దర్శకుడు షబ్బీర్ పాల్గొన్నారు. -
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
-
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
టైటిల్ : రాజుగారి గది 3 జానర్ : హర్రర్ కామెడీ నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్ శ్రీను, శివశంకర్ మాస్టార్, హరితేజ సంగీతం : షబీర్ దర్శకత్వం : ఓంకార్ నిర్మాణం : ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ‘ఆట’లాంటి షోస్తో టెలివిజన్ తెరపై సత్తా చాటిన ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్ కామెడీ జానర్లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్లో తీసే చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్ కామెడీనే నమ్ముకున్న ఓంకార్ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్ బాబుకు జోడీగా అవికా గోర్ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా? అసలు గదిలో ఏముంది? ఈ మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా? తెలుసుకుందాం పదండి! కథ..: మాయా (అవికా గోర్) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్ ఓ కాలనీలో ఆటోడ్రైవర్. నిత్యం తాగి తందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్, తన మామ అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి. ఎవరు ఎలా చేశారు? రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్ మాడ్యులేషన్ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్లో కాసేపు దెయ్యంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్లో అలీ, అశన్లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టార్, గెటప్ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్ హాఫ్లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్ ఘోష్, సీనియర్ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు. విశ్లేషణ..! హర్రర్ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్.. ఈ హర్రర్ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్ పాయింట్నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్ ఆడటమనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. సెకండాఫ్లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్గా చెప్పవచ్చు. సెకండాఫ్లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్రూపంలో చెప్పడం కన్విన్సింగ్గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్ టేకింగ్ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. షబీర్ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్ బావుంది. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు. బలాలు కామెడీ సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓంకార్ టేకింగ్ బలహీనతలు కథ, కథనాలు సాలిడ్గా లేకపోవడం హార్రర్ పెద్దగా లేకపోవడం ఫస్టాఫ్లో సాగదీత ఫీలింగ్ - శ్రీకాంత్ కాంటేకర్ -
మూడో గదిలో వినోదం కూడా ఉంది
‘‘నా సినిమాలో కథకే ప్రాధాన్యం ఇస్తాను. కథ నచ్చితేనే ప్రేక్షకులు హిట్ చేస్తారు. ‘రాజుగారి గది 3’ సినిమా కథపై నాకు నమ్మకం ఉంది. తప్పక విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఓంకార్. అశ్విన్బాబు, అవికా గోర్ జంటగా ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓంకార్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రాజుగారిగది 3’. ఈ చిత్రం నేడు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఓంకార్ చెప్పిన విశేషాలు. ► ‘రాజుగారి గది’ (2015) విజయానికి ఆ సినిమాలోని హాస్యభరిత సన్నివేశాలే కారణం. అందులో మంచి సందేశంతో పాటు వినోదం కూడా ఉంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ‘రాజుగారి గది 2’ (2017)లో మంచి సందేశం ఉంది కానీ వినోదాన్ని మిస్సయ్యాం అని ప్రేక్షకులు అన్నారు. ‘రాజుగారి గది 3’ మంచి వినోదాన్ని అందిస్తుంది. ► ఈ సినిమా కథ రాసుకుంటున్నప్పుడే నా తమ్ముడు అశ్విన్ హీరోగా సరిపోతాడనిపించింది. నేను దర్శకత్వం వహించిన సినిమాల్లోనే కాక, ఇతర సినిమాల్లోనూ అశ్విన్ నటించాడు. కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు. ‘రాజుగారి గది 3’ తర్వాత అశ్విన్కు హీరోగా మంచి గుర్తింపు వస్తుందనుకుంటున్నాను. అవికా అద్భుతంగా నటించింది. ► ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా కోసం కాజల్, తాప్సీలను సంప్రదించాం. కానీ కుదర్లేదు. ఫైనల్గా అవికాను తీసుకున్నాం. కథలో కూడా కొన్ని మార్పులు చేశాం. కానీ తమన్నాకు నేను చెప్పిన కథ వేరే. ఈ కథతో ఓ అగ్ర కథానాయికతో భవిష్యత్లో సినిమా చేయాలనుకుంటున్నాను. అలాగే ‘రాజుగారి గది 2’ సినిమాను వెంకటేశ్గారితో తెరకెక్కించాలనుకున్నా. వేరే సినిమాలతో ఆయన బిజీగా ఉండటం వల్ల నాగార్జునగారితో తీశాం. వెంకటేశ్గారితో ఓ సినిమా చేయాలన్నది నా కోరిక. ‘రాజుగారి గది’ సిరీస్లో ఓ చిత్రాన్ని ఆయనతో చేయాలని ఉంది. ► నేను అక్టోబరులో పుట్టాను. ‘రాజుగారి గది’ సిరీస్లో వస్తోన్న ప్రతి సినిమా అక్టోబరులోనే విడుదలవుతోంది. ‘రాజుగారి గది 3’ సినిమా నాకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. నాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడినిగానే కొనసాగుతాను. ► నేను చేస్తోన్న ఓ రియాలిటీ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నా దగ్గర ‘రాజుగారి గది 4’ కథతో పాటు, ఓ క్రీడా నేపథ్యంలో సాగే కథ ఉంది. వీటిలో ఏ సినిమా ముందు సెట్స్పైకి వెళ్తుందనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. -
‘నా డ్రీమ్ 18న చూడబోతున్నారు’
బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా రిజల్ట్ బెడసి కొట్టింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తన తమ్ముడు అశ్విన్ హీరోగా ‘రాజుగారి గది 3’ చిత్రాన్ని ఓంకార్ తెరకెక్కించాడు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అవికాగోర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యూ/ఏ’ సర్టిఫికేట్ను సొంతం చేసుకుంది. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను బుధవారం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. ‘18న విడుదలవుతున్న ఈ చిత్రం చిన్న పిల్లలతో సహా అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అశ్విన్, కళ్యాణ్ నా తమ్ముళ్ళు ఇద్దరూ నన్ను నమ్ముకుని నాతో ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. నేను ఎప్పుడూ అశ్విన్ని హీరోని చెయ్యాలని, కళ్యాణ్ని ప్రొడ్యూసర్ చేయాలన్నది నా కోరిక. 18న అశ్విన్ హీరోగా మీ ముందుకు వస్తాడు. ఇక కళ్యాణ్ బాధ్యత ఒకటి ఉంది. మీరందరూ మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నాన్నగారూ లాస్ట్ ఇయర్ చనిపోయారు. అప్పటి నుంచి నేను వైట్ డ్రస్లో ఉంటున్నాను. తమ్ముళ్ళని సక్సెస్ చేసిన తర్వాతే డ్రసింగ్ మార్చుకుంటాను. నన్ను ఆదరించినట్లే నా తమ్ముడు అశ్విన్ని రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను’అని ఓంకార్ అన్నారు. ‘నా డ్రీమ్ 18న చూడబోతున్నారు. జీనియస్ నుంచి నేను ఒక ఐదు చిత్రాల్లో చేశాను. కానీ చోటా గారి లాంటి పెద్ద టెక్నీషియన్తో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జూన్ 21న మొదలై ఇంత త్వరగా పూర్తవడానికి మొయిన్ కారణం కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అందరూ ఇష్టపడి మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’అని అశ్విన్ బాబు పేర్కొన్నారు. హీరోయిన్ అవికాగోర్ మాట్లాడుతూ..‘మొదటిసారి నేను చాలా నెర్వస్గా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ‘రాజుగారి గది3’ చిత్ర యూనిట్ను నా ఫ్యామిలీగా భావిస్తున్నాను. ఈ క్యారెక్టర్ని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారా అని వెయిట్ చేస్తున్నాను. చోటాగారు, ఓంకార్ బ్రదర్స్ చాలా కష్టపడ్డారు’అని అన్నారు. -
అందుకే వారు గొప్ప నటులయ్యారు
‘‘దర్శకుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో నటుడిగా దాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నేనెప్పుడూ దర్శకుణ్ణి ఇబ్బంది పెట్టలేదు. ‘వీడు బాగా నవ్విస్తాడు, ఏడిపిస్తాడు’ అని ప్రేక్షకులు ఎవర్ని భావిస్తారో వారే గొప్ప నటుడు’’ అన్నారు నటుడు అలీ. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా తెరకెక్కిన ‘రాజుగారి గది 3’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన అలీ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ‘రాజుగారి గది 3’ ఒకఎత్తు. విభిన్నమైన భావోద్వేగాలున్న పాత్రను నాకు ఇచ్చారు ఓంకార్. డైరెక్టర్గా తనకు చాలా క్లారిటీ ఉంది. ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో రాబట్టుకుంటారు. మొదటి రెండు భాగాలకంటే ఈ సినిమా చాలా బావుంటుంది. ఛోటా కె.నాయుడు విజువల్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లాయి. ఈ చిత్రంతో అశ్విన్ నటుడిగా మరో ఎత్తుకి ఎదుగుతాడు. సెకండ్ హాఫ్లో సాయిమాధవ్ బుర్రా గారి డైలాగ్స్కు థియేటర్లో నవ్వులే. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. డీటీఎస్ మిక్సింగ్ చేసిన వ్యక్తి చూసిన ప్రతిసారీ నవ్వుతూనే ఉన్నారని నాకు తెలిసింది. దీన్ని బట్టి థియేటర్లో ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. బ్రహ్మానందం, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణగార్లు నాకు నచ్చిన హాస్యనటులు. రైటర్గా కెరీర్ స్టార్ట్ చేసి కామెడీ యాక్టర్స్ అయ్యారు. కామెడీ ఎంత మోతాదులో ఉండాలో వాళ్లకు తెలుసు. అందుకే గొప్ప హాస్యనటులుగా పేరు తెచ్చుకున్నారు’’ అన్నారు. -
చిన్నారి దెయ్యం
-
రాజుగారి గది 10 కూడా ఉండొచ్చు
‘‘మంచి మంచి సినిమాలు చేయాలి. అవి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయాలి. ‘వీడు బాగా చేశాడ్రా’ అని ప్రేక్షకులు అనుకుంటే చాలు ’’ అంటున్నారు అశ్విన్బాబు. ‘రాజుగారి గది’ సిరీస్లో వస్తున్న మరో చిత్రం ‘రాజుగారి గది 3’. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్బాబు, అవికా గోర్ జంటగా నటించారు. అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ – ‘‘రాజుగారి గది’ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే ఆలోచనే లేదు. ప్రేక్షకులు కోరుకోవడంతో సీక్వెల్ రూపొందించాం. మూడో పార్ట్ వరకూ వచ్చింది. వాళ్లకు నచ్చితే ‘రాజుగారి గది 10’ కూడా ఉండొచ్చు. సెకండ్ పార్ట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందన్నారు. అందుకే థర్డ్ పార్ట్లో ఫుల్ ఎంటర్టైన్మైంట్ గ్యారెంటీ. ఓ మలయాళ సినిమా నుంచి తీసుకున్న పాయింట్ ఆధారంగా ఈ సినిమా చేశాం. ముందు హీరోయిన్గా తమన్నాను అనుకున్నాం. డేట్స్ విషయంలో క్లాష్ ఏర్పడి ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. మొదటి రెండు భాగాల్లో నేను కీలక పాత్రలు చేసినా ఈ సినిమా మాత్రం నా భుజాల మీద నడుస్తుంది. సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉన్నాం. ప్రస్తుతం నాకు మార్కెట్ లేదు. మార్కెట్ ఏర్పరచుకుంటున్నాను. నాతో సినిమా చేసే నిర్మాతకు డబ్బు మిగలాలన్నదే నా లక్ష్యం. అన్నయ్య (ఓంకార్) టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటి నుంచి ప్రొడక్షన్లో ఉన్నాం. అందుకే నిర్మాతల గురించి ఆలోచిస్తాను. విభిన్న కథల్లో నటించాలనుంది. కుస్తీ బ్యాక్డ్రాప్కి సంబంధించిన కథ చర్చల్లో ఉంది. ఆ సినిమా వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. -
భయపెడుతూ నవ్వించే దెయ్యం
‘‘రాజుగారి గది’ రెండు భాగాలు మంచి సక్సెస్ అయ్యాయి. సెకండ్ పార్ట్లో కామెడీ మిస్ అయింది అన్నారు. అది దృష్టిలో ఉంచుకొని ‘రాజుగారి గది 3’ కథ రెడీ చేశా’’ అన్నారు దర్శకుడు ఓంకార్. ‘రాజుగారి గది’ సిరీస్ నుంచి వస్తున్న మూడో సినిమా ‘రాజుగారి గది 3’. అశ్విన్బాబు, అవికా గోర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్ను హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ– ‘‘రెండు నెలల్లో సినిమా పూర్తి చేశాం. అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. మా సినిమా వందశాతం ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘మూడేళ్ల తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఓంకార్గారు కథ చెప్పగానే థ్రిల్ అయ్యాను’’ అన్నారు అవికా గోర్. ‘‘ఓంకార్ అన్నయ్య నన్ను కొత్త కోణంలో చూపించాడు’’ అన్నారు అశ్విన్బాబు. ‘‘ఈ సినిమాలో దెయ్యం ఆహ్లాదంగా నవ్విస్తుంది. భయపెడుతూ నవ్విస్తుంది. ఓంకార్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. ‘‘భయపడుతూ, నవ్విస్తూ ఉండే సినిమా ఇది. ఆర్టిస్టులకు గౌరవం ఇచ్చి నటన రాబట్టుకుంటారు ఓంకార్’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ‘‘చిన్నప్పుడు విఠాలాచారి సినిమాలు చూసేవాణ్ణి. ఇప్పుడు ఓంకార్ అలాంటి దర్శకుడు’’ అన్నారు నటుడు అలీ. -
భయపెట్టేందుకు వస్తున్నారు!
రాజుగారి గది, రాజుగారి గది2 సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఓంకార్ ఇప్పుడు అదే సిరీస్లో మూడు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా రాజుగారి గది3 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తరువాత అవికా గోర్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. అలీ, బ్రహ్మాజీ, ధనరాజ్, అజయ్ ఘోష్, ఊర్వశి, హరితేజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సీనియర్ హీరో విక్టరి వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ విజువల్స్తో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. షబీర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘రాజుగారి గది 3’ మూవీ ప్రారంభం
-
రాజుగారి గదిలోకి మూడోసారి!
బుల్లితెర నుంచి వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన ఓంకార్ రాజుగారి గది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో అదే జానర్లో నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించిన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ రాజుగారి గది 3ని తెరకెక్కిస్తున్నాడు ఓంకార్. వరుసగా హారర్ చిత్రాలతో సత్తా చాటుతున్న తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. -
నాగార్జునతో నటించడం అదృష్టం
మహానంది: రాజుగారి గది–2లో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని యువ హీరో అశ్విన్బాబు అన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు మిత్రులతో కలిసి సోమవారం ఆయన మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా అశ్విన్బాబు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మొదటి చిత్రం జీనియస్ కాగా ఆ తర్వాత రాజుగారి గది, జతకలిసే, నాన్న..నేను నా బాయ్ఫ్రెండ్, రాజుగారి గది–2 చిత్రాల్లో నటించానన్నారు. త్వరలో మరో మూడు ప్రాజెక్టులు చేయబోతున్నట్లు చెప్పారు. -
ప్రేమ, కామెడీ జత కలిసే?
చిత్రం : 'జత కలిసే' తారాగణం : అశ్విన్బాబు, తేజస్వి సంగీతం : ఎం.సి.విక్కీ, సాయి కార్తీక్ కెమేరా : జగదీశ్ ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్ నిర్మాతలు : నరేశ్ రావూరి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : రాకేశ్ శశి ప్రయాణంలో పదనిసలు తరహా రోడ్ జర్నీ కథలు తెరపై సుపరిచితమే. ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని, ప్రేమ, పెళ్ళి, జీవితాశయం లాంటి అంశాలను కలగలిపి కథ అల్లుకుంటే? ఈ ఆలోచనతో చేసిన యత్నం- ‘జత కలిసే’. అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతుంటాడు ఋషి (అశ్విన్ బాబు). అతను తన స్నేహితుడి పెళ్ళి కోసం వైజాగ్ వస్తాడు. తీరా అక్కడ పెళ్ళికొడుకుతో తాగుడు పందెం కట్టి, ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణమవు తారు - హీరో, అతని ఫ్రెండ్స్. హైదరాబాద్లో అమెరికా తిరుగు ఫ్లైట్ ఎక్కడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్కు ట్యాక్సీలో బయలుదేరతాడు హీరో. వైజాగ్లోనే సూర్య (సూర్య) దంపతుల కూతురు తేజస్వి అలియాస్ పింకీ (తేజస్వి). ఐ.ఏ.ఎస్. ఇంటర్వ్యూ కోసం ఈ హీరోయిన్ కూడా హీరోతో ఒకే ట్యాక్సీలో హైదరాబాద్కు ప్రయాణించాల్సి వస్తుంది. తన స్నేహితురాలి పెళ్ళి చెడిపోయింది తాగుబోతులైన హీరో బృందం వల్లేనని గుర్తించిన హీరోయిన్ వాళ్ళకు బుద్ధిచెప్పాలని రంగంలోకి దిగుతుంది. కలసి ప్రయాణిస్తున్న హీరో గారికి తెలియకుండానే, ఎఫ్.ఎం. రేడియో, ఫేస్బుక్, యూ ట్యూబ్ లాంటి వాటిని ఆశ్రయించి, హీరో బ్యాచ్ గురించి గబ్బు రేపుతుంది. ఈ లోగా ఒకటీ అరా పాటలు... హీరో హీరోయిన్ల లవ్ సిగ్నల్స్... హీరోయిన్ మంచితనం చూపే ఘట్టాలు వస్తాయి. ఇంతలో ఆ అమ్మాయే తమపై దుమారం రేపుతోందని హీరో కనిపెడతాడు. అక్కడికి ఇంటర్వెల్. సెకండాఫ్ మొదలయ్యాక తాను మంచివాడినేనన్న సంగతి హీరోయిన్కు అర్థమయ్యేలా చేస్తాడు హీరో. ఒక దశలో హీరోయిన్ అక్క తన భర్తతో పొసగక, బెంగుళూరులో ఆత్మహత్య చేసుకోబోతుంటే, ‘స్వీట్ మెమొరీస్’ సీడీ చూడమంటూ ఫోన్లోనే చెప్పి, ఫ్యామిలీ కౌన్సెలర్ అవతారమూ ఎత్తుతాడు. ఆ తరువాత ఏమైంది? హీరో, హీరోయిన్ల మధ్య మనస్పర్థలు ఏమయ్యాయి అన్నది మిగతా సినిమా. నట-దర్శకుడు ఓంకార్ సోదరుడు అశ్విన్బాబు హీరోగా హుషారుగా చేసిన మరో ప్రయత్నమిది. తేజస్వి ఎప్పటిలానే చలాకీతనంతో కనిపిస్తారు. ఇక, లేడీ ట్యాక్సీ డ్రైవర్ బంగారంగా స్నిగ్ధ, వారానికి ఆరు రోజులే డ్యూటీలో ఉండే దొంగ కల్యాణ్బాబు పాత్రలో షకలక శంకర్ లాంటివాళ్ళు వినోదమందిస్తారు. ధన్రాజ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి లాంటి ఇతర కమెడియన్లు కూడా ‘ఆఖరి నిమిషంలో పాలుపంచుకొని’, తెరపై నవ్విస్తారు. ‘గబ్బర్సింగ్’ మొదలు తాజా ‘శ్రీమంతుడు, కుమారి 21 ఎఫ్, బెంగాల్ టైగర్’ దాకా పలు చిత్రాల్ని అనుకరిస్తూ, సైటైరికల్ స్పూఫ్ ఒకటి చేశారు. మందు సీసా మీద ఓపెన్ అయి, ఒక పాటతో సహా చాలాసేపు మద్యం వాసన కొట్టే ఈ సినిమా ముగింపు కూడా ఆసక్తికరంగా మద్యం తాగననే హీరో ఒట్టుతోనే! కథ చిన్నది కాబట్టి, కథనం కోసం సందర్భాలు, సన్నివేశాలు అనేకం అల్లుకుంటూ వెళ్ళిన ఈ ఫిల్మ్లో లాజిక్లు వెతకకూడదు. ఇటు పూర్తి కామెడీ సినిమా చేయాలా, అటు రోడ్ జర్నీలో రొమాంటిక్ ఫిల్మ్ తీయాలా అనే విచికిత్స దర్శక, నిర్మాతలను వెంటాడి నట్లు అనిపిస్తుంది. ఆ సక్సెస్ ఫార్ములా అన్వేషణలో పాత్రల ప్రవర్తన తీరు ఇ.సి.జి. గ్రాఫే. కథలానే సినిమా ఎక్కడో వైజాగ్లో మొదలై ఇక్కడ హైదరాబాద్ దాకా వస్తుంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కొన్నేళ్ళ క్రితం పెట్టిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో బహుమతి అందుకొన్న రాకేశ్ శశికి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. అతనికి ఆ పాత వాసనలు ఇంకా పోలేదని గుర్తుచేస్తుంది. ఏమైనా స్పూఫ్ కామెడీ, సవాలక్ష ప్రేమకథల రెడీ మిక్స్ ‘జత కలిసే’నా?