audio tape
-
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్జాదా హెచ్చరించారు. -
అవసరమైతే ఆత్మాహుతి దాడులకూ ప్లాన్!..
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల హైదరాబాద్–భోపాల్లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేయడానికి ఈ మాడ్యూల్స్ సిద్ధమయ్యాయని, వీటికి విదేశాల నుంచి ఆదేశాలు అందుతున్నాయని ప్రాథమిక ఆధారాలు లభించాయి. మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్ సహా ముగ్గురి నుంచి రికవరీ చేసిన ఫోన్లను ఏటీఎస్ అధికారులు విశ్లేషించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులకు సిద్ధం కావాలంటూ ఓ వ్యక్తి నుంచి వీరికి ఆదేశాలు అందినట్టు గుర్తించారు. ఫోన్ల నుంచి ఆడియోలు రికవరీ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన 16 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు సమాచార మారి్పడికి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారని.. ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేయడం వల్ల కీలకమైన సమాచారమేదీ లభించలేదని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా 50 ఆడియో ఫైళ్లను రికవరీ చేసినట్టు సమాచారం. ఈ ఆడియోల్లో ప్రసంగించిన వ్యక్తి.. ఒకేసారి అనేక మందిని చంపడం (మాస్ కిల్లింగ్), సాబోటేజ్ (విధ్వంసాలు సృష్టించడం), ఎంపిక చేసుకున్న వ్యక్తులను హతమార్చడం (టార్గెట్ కిల్లింగ్)తోపాటు ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తేల్చారు. ఈ ఆడియోలతోపాటు వీరికి అందిన ఆదేశాలు, సూచనల సందేశాలూ రికవరీ అయ్యాయి. ఇక ఈ ఫోన్లకు పాకిస్తాన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, కాంటాక్ట్స్ లిస్టులోనూ ఆ దేశ నంబర్లు ఉన్నాయని గుర్తించారు. ఆ ఫోన్ నంబర్లు ఎవరివి, ఆడియోల్లోని వ్యక్తి ఎవరు అనేది గుర్తించేందుకు కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కొన్ని ఆడియోల్లో కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన ఆడియోల్లో లండన్లోని గ్లాస్గో విమానాశ్రయంపై 2007లో మానవ బాంబు దాడికి ప్రయత్నించిన బెంగళూరు వాసి, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇతను హిజ్బ్ ఉత్ తెహరీర్ (హెచ్యూటీ) సంస్థ తరఫునే మానవబాంబుగా మారాడు. హైదరాబాద్–¿ోపాల్ మాడ్యూల్ ఉగ్రవాదులూ తొలినాళ్లలో ఇదే ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేశారు. ఈ క్రమంలో ఫోన్లలోని ఆడియోలు హెచ్యూటీ హ్యాండ్లర్విగా భావిస్తున్నారు. ఇక ఏటీఎస్ విచారిస్తున్న 16 మంది పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. మరో ఐదు రోజులు కస్టడీ కోరాలని ఏటీఎస్ భావిస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురు హైదరాబాద్ వాసులను సాక్షులుగా చేరుస్తున్నారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 17 రైళ్లు రద్దు -
కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి...
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి పాదాల వద్ద తాను చేసిన ప్రమాణంతో సీఎం కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ జోస్యం చెప్పారు. కేసీఆర్ తప్పుచేశారు కాబట్టే యాదాద్రికి రాలేదని, మునుగోడులో ఓడిపోతున్నామనే భయంతో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్కు తెరలేపారని ధ్వజమెత్తారు. ఈ కేసులో కేసీఆర్తోపాటు ఎమ్మెల్యేలందరూ లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ముఖమండపంలో ఉత్సవ విగ్రహాల వద్ద ఆయన ప్రమాణం చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో తనకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అనంతరం కొండ కింద స్వామివారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఆడియో టేపుల పేరుతో తాజాగా మరో కొత్త సినిమా చూపే యత్నం చేసి కేసీఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ యాడ్ చేసినట్లుగా.. చిత్తయిన డ్రామాను రక్తికట్టించేందుకు ఆడియో టేపు పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ ఆడియో టేపుల్లో చెప్పిన దాని ప్రకారం.. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ అని, సంతోష్ అంటే కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్కుమార్ అని బండి సంజయ్ చెప్పారు. మునుగోడులో దుకాణం నడవలేదని, హైదరాబాద్కు షిఫ్ట్ చేశాడని, అక్కడా ఫెయిల్ కావడంతో ఢిల్లీ పేరుతో డ్రామా చేయబోతున్నాడన్నారు. లిక్కర్ దందాలో తన బిడ్డను, అవినీతి సొమ్మును ఎలా కాపాడుకోవాలన్నదే సీఎం తపన తప్ప ఇంకేమీ లేదన్నారు. తాను దేవుడిని నమ్ముకున్నానని, కేసీఆర్ దయ్యాలను, అవినీతి సొమ్ముతో కుట్రలు కుతంత్రాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తరువాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపాడన్నారు. తడి బట్టలతో ప్రమాణం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పినట్లుగానే బండి సంజయ్ శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. ముందుగా ఆయన కొండపైకి చేరుకుని అక్కడే బిందెడు నీటితో తల స్నానం చేశారు. తడిబట్టలతోనే శ్రీ స్వామి దర్శనానికి వెళ్లారు. గర్భాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద ప్రమాణం చేశారు. బండి సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలతో ఆందోళన చేశాయి. కాగా, చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలంటూ మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో చేనేత కార్మికులు పోస్ట్కార్డులు, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. -
బీజేపీ నేత శ్వేత మృతి కేసులో సంచలన విషయాలు
బీజేపీ నేత శ్వేతా సింగ్ గౌర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన నీచపు బాగోతం బయటపెడుతుందనే ఉద్దేశంతోనే ఆమె భర్తే ఆమెను హత్య చేసి.. అత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడంటూ ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే శ్వేత భర్తను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ బండాకు చెందిన జిల్లా పంచాయితీ సభ్యురాలు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్వేతా సింగ్ గౌర్.. బుధవారం తన ఇంట్లో శవమై కనిపించారు. తన భర్త, బీజేపీ నేత దీపక్ గౌర్ ఇన్వాల్వ్ అయిన ఇంటర్నేషనల్ సె* రాకెట్కు సంబంధించి ఆడియో కాల్స్ ఆమె రికార్డు చేసిందని, ఆ భయంతోనే ఆమె బిక్కుబిక్కుమంటూ గడిపిందని శ్వేత కుటుంబం ఆంటోంది. అందుకే తమ బిడ్డను హత్య చేశారని, ఇందులో దీపక్తో పాటు అతని తండ్రి, తల్లి, అన్న.. అంతా ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా దీపక్ కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. నీచపు పని రష్యా, మొరాకో, ఆఫ్రికా అమ్మాయిలతో కూడిన వ్యభిచార ముఠాలతో దీపక్ లావాదేవీలు జరిపాడని శ్వేత కుటుంబం ఆరోపిస్తోంది. తన భర్త విటులను సంప్రదించిన ఫోన్ కాల్స్ను శ్వేత రికార్డు చేసిందని, ఇందుకు సంబంధించి ఫొటోలు, డబ్బు పంపిన వ్యవహారాలను సైతం ఆమె సేకరించింది. ఈ మేరకు మూడు సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్స్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అంతేకాదు.. లక్నోలోని ఎంజే ఇంటర్నేషనల్ హోటల్ను అడ్డాగా మార్చుకుని రాసలీలలకు దిగాడని శ్వేత తమతో చెప్పిందని ఆ కుటుంబం అంటోంది. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను హత్య చేశాడని, సీలింగ్కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని శ్వేత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ పూర్తి ఆధారాలను యూపీ పోలీసులకు అప్పగించింది ఆ కుటుంబం. పరువు పోకూడదని అమ్మ భరించింది దీపక్కు పలువురు మహిళలతోనే వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయని వీళ్ల ఇద్దరు కూతుళ్లు చెప్తున్నారు. అంతేకాదు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో తమ తండ్రికి మరో వివాహం చేయాలని.. ఆయన కుటుంబం ప్రయత్నించిందని వాళ్లు అంటున్నారు. ఈ విషయమై చాలాసార్లు తమ తల్లి(శ్వేత) మీద దాడి జరిగిందని, కానీ పరువు పోకూడదనే ఉద్దేశంతో ఆమె ఇంతకాలం భరిస్తూ వచ్చిందని ఆ ఇద్దరు కూతుళ్లు అంటున్నారు. అదే టైంలో రాజేష్ అనే వ్యక్తి పేరిట.. దీపక్-శ్వేతల మధ్య ఓ వీడియో వైరల్ కావడం విశేషం. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. -
అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రపన్నారు: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా
-
బాబు శవ రాజకీయాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
-
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: ఎమ్మెల్యే కిలారి రోశయ్య
-
చంద్రబాబు నాటకం బట్టబయలు
-
Avanthi Srinivas: అది తప్పుడు ఆడియో
సాక్షి, విశాఖపట్నం: సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయిన ఆడియో తనది కాదని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు కమిషనర్ మనీష్కుమార్ సిన్హాకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇలా క్రియేట్ చేస్తున్నవారి నిగ్గుతేల్చాలని కోరినట్లు చెప్పారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. మంచితనంతో అంచెలంచెలుగా ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగానని చెప్పారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎవరో కొందరు కుట్ర పన్నారని, దీనివెనుక ఎవరున్నారన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. తాను ఎటువంటి అవినీతిఖి పాల్పడనన్నారు. తన రాజకీయ ఎదుగుదలను, వైఎస్సార్సీపీ సర్కార్ ప్రగతిని చూసి ఓర్వలేక జరిగిన కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు శత్రువులు లేరని చెప్పారు. తాను మహిళతో మాట్లాడిన విషయం వాస్తవం కాదన్నారు. రోజురోజుకు రాజకీయాలు దిగజారుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తనకు దేవుడిపై నమ్మకం ఉందని, ఇలాంటి కుట్రలు ఎవరు పన్నినా అవి ఫలించవని చెప్పారు. తన ప్రత్యర్థి కూడా బాగుండాలి అనుకుంటానన్నారు. తాను తప్పుడు పనులు చేయనని, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పారు. రాజకీయంగా తనపై పోటీచేసిన ప్రత్యర్థులను కూడా మిత్రులుగానే చూసే వ్యక్తినన్నారు. జిల్లాలో ఏకైక మంత్రిగా తాను చేసే మంచిపనులు, పార్టీ అభివృద్ధి చూడలేకనే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో మంచి కన్నా చెడు త్వరగా ప్రచారం జరుగుతుందన్నారు. ఇందులో ఎవరున్నా వదిలేది లేదని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంతవరకు ఎవరూ తన ఎదుగుదలను అడ్డుకోలేరన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలను, రాష్ట్రంలో పార్టీ శ్రేణులను, అభిమానులను కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బవైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రెసిడెంట్ ఆడియో టేప్ లీక్.. రొనాల్డోపై తీవ్ర వ్యాఖ్యలు
లిస్బన్: క్రిస్టియానో రొనాల్డో ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పోర్చుగల్ ఫుట్బాల్ ఆటగాడు. అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో, మేనేజర్ జోస్ మౌరిన్హోలను రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ ఎగతాళి చేసిన ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఆడియోక టేపులో క్రిస్టియానో రొనాల్డో ఓ ఇడియట్, జబ్బు మనిషి అంటూ విమర్షించారు. ‘‘రొనాల్డో ఓ వెర్రివాడు. ఇడియట్, జబ్బు మనిషి. అందరూ అతడు సాధారణంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ అతను చేయాల్సిన పనులు చేయరు. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఏమీ చేయడు.’’ అంటూ విమర్షించారు. మెండిస్కు , మేనేజర్ జోస్ మౌరిన్హో ఇద్దరికీ రొనాల్డోపై నియంత్రణ లేదు. వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. మనం ఈ రోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు.’’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ఆడియో కలకలం.. బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి, నిజామాబాద్: బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతూ వేధిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్ రంజాన్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి అయిన రుద్రంగి మురళీధర్కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. ఒక్కోటి రూ.600 రూపాయల చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో షకీల్ అడ్వాన్స్గా 12 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ నిమిత్తం మురళీధర్కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఎమ్మెల్యే షకీల్, కిరాణా వ్యాపారికి 30లక్షల రూపాయల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్తో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడించాడు. ఈ నేపథ్యంలోనే మురళీధర్పై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదిరా..’ అంటూ చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. చదవండి: వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం! ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ -
కలకలం రేపుతున్న ఆడియో టేపు
-
న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టిస్తుంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని, నేనంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు. పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్ రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
-
వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద తనను బెదిరించాడని గాజుల రామారం వీఆర్ఓ శ్యామ్ కుమార్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆదేశాలమేరకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చినందుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని అన్నారు. తనపై, రెవెన్యూ శాఖ అధికారులపై ఎమ్మెల్యే తిట్ల పురాణానికి సంబంధించి ఆడియో టేపులను పోలీసులకు అందించానని శ్యామ్ తెలిపారు. ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఎమ్మెల్యే వివేకానందపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యామ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అధికారులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలకు సంబంధించినదిగా ఓ ఆడియో టేపు ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ఎమ్మెల్యే తీరుపట్ల రెవెన్యూ ఉద్యోగులు మేడ్చల్ కలక్టర్ వద్ద ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్చల్) -
భక్తి భావంతో...
విలక్షణ నటుడు మోహన్బాబు వాయిస్ చాలా గంభీరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకు నిదర్శనం సినిమాల్లో ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్సే. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మోహన్బాబు ఉద్వేగభరితంగా డైలాగులు చెబుతారు. ఇప్పుడు భక్తి భావంతో ఆయన చెప్పే మాటలను వినబోతున్నాం. ఈ నెల 22న వినాయక చవితి. ఈ సందర్భంగా గణేశుడి పూజా విధానంతో కూడిన ఓ ఆడియో మోహన్బాబు గళంతో రానుంది. వినాయక చవితి పండగకు ఒక రోజు ముందు ఈ నెల 21న ఈ ఆడియో విడుదలవుతుంది. మోహన్బాబు గళంలో వినాయక పూజా విధానాన్ని వింటూ పండగను జరుపుకోవడం ఆయన అభిమానులకు ఓ మంచి అనుభూతి అని చెప్పొచ్చు. -
నా పిల్లలకు చెప్పు వాళ్లని ప్రేమిస్తున్నానని
వాషింగ్టన్: అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగిపోయి, ఊపిరాడక తుదిశ్వాస విడిచిన జార్జ్ ఫ్లాయిడ్కు సంబంధించి ఓ ఆడియో టేప్ బుధవారం రిలీజైంది. దీని ప్రకారం.. అతను ప్రాణాలు విడిచే కొద్ది క్షణాల ముందు తనన చంపవద్దంటూ అధికారులను పదేపదే వేడుకున్నాడు. మరోవైపు అతను పోలీసులను చూసి వణికిపోతూనే వారికి సహకరించాడు. కారు నుంచి కింద పడేసే క్రమంలో అతని నోటి నుంచి రక్తం వచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్ అతని మెడపై మోకాలితో గట్టిగా అదుముతూ క్రూరత్వం ప్రదర్శించాడు. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారిన అతను తనకు కరోనా ఉందని, చచ్చిపోతానేమోనని భయంగా ఉందన్నాడు. "నువ్వు మాట్లాడగలుగుతున్నావ్.. కాబట్టి బాగానే ఉన్నావ్లే" అంటూ సదరు పోలీసు కాఠిన్యంగా మాట్లాడాడు. (జాతి వివక్ష అంతమే లక్ష్యం) 'ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటున్నందున ఈ మాత్రమైనా మాట్లాడుతున్నా'నని సమాధానమిస్తూనే సాయం చేయమని అర్థించాడు. అప్పటికీ ఆ పోలీసు వెనక్కు తగ్గకపోవడంతో "వీళ్లు నన్ను చంపబోతున్నారు, నన్ను చంపేస్తారు" అంటూ ఆర్తనాదాలు చేశాడు. "మామా.. ఐ లవ్ యూ... నా పిల్లలకు చెప్పు వాళ్లంటే నాకు ఎంతో ప్రేమ" అని చెప్పాడు. అనంతరం కొన్ని క్షణాల్లోనే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మిన్నియా పోలీసులు అలెగ్జాండర్ కుంగ్, థామస్ లేన్ దగ్గర లభ్యమైన కెమెరాల ద్వారా ఈ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.ఈ కేసులో వీరితోపాటు చావిన్, టై థావో నిందితులుగా ఉన్నారు. మే 25న పోలీస్ అధికారి ఫ్లాయిడ్ మెడపై సుమారు ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మోకాలిని నొక్కిపెట్టి ఉంచడంతో అతడు మరణించిన విషయం తెలిసిందే. (జార్జ్ ఫ్లాయిడ్కు ఘన నివాళి ) -
ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ వివాదంలో ఇరుక్కుంది. టీవీ సీరియళ్ల షూటింగ్స్ తిరిగి ప్రారంభించడంపై నిర్మాతల వాట్సాప్ గ్రూపులో ఆమె మాట్లాడిన ఆడియో టేప్ బయటకు లీకైంది. ఇందులో "జర్నలిస్టులకు ఇప్పుడు కోవిడ్ తప్ప ఏ వార్తలూ లేవు. షూటింగ్స్ త్వరలో తిరిగి ప్రారంభం అవుతున్నందున వారు ఫొటోలు, వీడియోల కోసం వెంటపడుతారు. కానీ, అస్సలు ఇవ్వకండి. సొంతంగా కథలు అల్లుతూ మనల్ని చీల్చి చెండాడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి" అని పేర్కొంది. ఖుష్బూ వ్యాఖ్యలపై పాత్రికేయ వర్గాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. దీంతో ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ తన వాయిస్ను కొంత ఎడిట్ చేశారని తెలిపింది. (నటి కుష్బూ డాక్టరయ్యారు! ) "నిర్మాతల గ్రూప్లో నుంచి ఒకరు దాన్ని కావాలనే లీక్ చేశారు. ఇలాంటి వ్యక్తుల మధ్య ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. జర్నలిస్టులను అగౌరవపర్చడం నా ఉద్దేశ్యం కాదు. కేవలం స్నేహితుల దగ్గర ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడాను. నాకు ప్రెస్ పట్ల ఎంత గౌరవం ఉందన్న విషయం పాత్రికేయులందరికీ తెలుసు. 34 ఏళ్ల సినీ జీవితంలో ఒక్కసారి కూడా వాళ్లను కించపరుస్తూ మాట్లాడలేదు. ఒకవేళ ఎవరినైనా బాధపెట్టుంటే వారికి నా హృదయపూర్వక క్షమాపణలు" అంటూ పేర్కొంది. ఇక ఆడియో క్లిప్ లీక్ చేసిన నిర్మాత ఎవరో తనకు తెలుసని ఖుష్బూ వ్యాఖ్యానించింది. తన మౌనం, క్షమాగుణమే అతనికి పెద్ద శిక్ష అని పేర్కొంది. (వైరస్ బారిన వారియర్స్) -
‘సహనంతోనే సమస్యలు అధిగమిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ : నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మర్కత్ చీఫ్ మౌలానా సాద్ శుక్రవారం ఆడియో సందేశం విడుదల చేశారు. ‘ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో మీరు సహనంగా ఉండాల్సిన అవసరం ఉంది..సహనంతోనే మీరు మీ సమస్యలను అధిగమిస్తార’ని ఈ ఆడియో క్లిప్లో మౌలానా బిగ్గరగా చెబుతుండటం వినిపించింది. కాగా ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగి జమాత్ మర్కజ్ అనంతరం కోవిడ్-19 కేసులు దేశవ్యాప్తంగా పెరిగాయని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. మౌలానా సాద్ ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కు చేరగా మృతుల సంఖ్య 437కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1007 కేసులు నమోదవగా, 23 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇక మహమ్మారి బారి నుంచి కోలుకుని 1749 మంది డిశ్చార్జి అయ్యారు. చదవండి : తబ్లిగీ నేతపై ఈడీ కేసు -
యువకుడి కిడ్నాప్.. అడియో టేప్ లీక్!
-
‘పోలీసు ఏజెంట్లకు ప్రజలే శిక్ష వేస్తారు’
సాక్షి, విశాఖపట్నం: ఒరిస్సా రాష్ట్ర మల్కన్గిరి జిల్లా జంతురాయి ఘటనపై మావోయిస్టులు స్పందించారు. ఏవోబీ ఎస్జడ్సీ ఆధికార ప్రతినిధి గణేష్ పేరుతో బుధవారం ఆడియో టేపులు విడుదల అయ్యాయి. జంతురాయి ఘటనపై పోలీసులు అసత్య ప్రచారం చేశారు. పోలీసు ఏజెంట్లు అదమ, జిప్రోను పట్టకొని కొట్టారు. నిరాయుధులు అయిన దళ సభ్యుల్ని చిత్ర హింసలకు గురిచేశారని గణేష్ ఆరోపించారు. అదమను హత్య చేసి.. జిప్రోను పోలీసులకు అప్పగించారన్నారు. పార్టీ ప్రజల పక్షానే ఉంది.. కటాఫ్లో పార్టీ సహకారంతో ప్రజలే 50 కిలోమీటర్ల రోడ్డును వేసుకున్నారని అయన తెలిపారు. దీన్ని ఓర్వలేక ప్రజలను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని గణేష్ మండిపడ్డారు. చుట్టు పక్కల గ్రామస్తులు వ్యతిరేకించినా చిత్రహింసలకు గురిచేశారు. ప్రతిగా పోలీసు ఏజెంట్ల ఇళ్లను ప్రజలే తగలబెట్టారు. చేసిన తప్పును జొడంబో గ్రామస్తులు ఒప్పుకున్నారని.. వారిని ప్రజా జీవితంలో జీవించేందుకు పార్టీ ఒప్పుకుందని ఆయన తెలిపారు. పోలీసు ఏజెంట్లకు ప్రజలే శిక్షవేస్తారు. ప్రజలపై పోలీస్ దాడులు ఆపకపోతే ప్రతిఘటన తప్పదు అని ఆ ఆడియో టేపుల్లో గణేష్ హెచ్చరించారు. -
కలకలం రేపుతున్న మల్లారెడ్డి ఆడియో టేపు
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రి మల్లారెడ్డి ఆడియో టేపు కలకలం రేపుతోంది. తనకు టికెట్ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని బోడుప్పల్ టీఆర్ఎస్ నేత రాపోలు రాములు ఆరోపిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారని, తన వర్గానికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. టికెట్ కేటాయింపు విషయమై ఆయన మల్లారెడ్డితో మాట్లాడిన ఫోన్కాల్కు సంబంధించిన ఆడియో టేపు ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో ఈ ఆడియోటేపు అధికార పార్టీలో చర్చనీయాంశమైందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
బయటపడ్డ ఆడియో టేపులు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కుంభకోణానికి సంబంధించిన అక్రమాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరో సంచలన విషయం శనివారం బయటపడింది. డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్ర నాథ్ బెదిరించిన ఆడియో టేపులు బయటకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణంలో ఈ ఆడియో టేపులు బయటకి వచ్చినట్టు సమచారం. వీటి ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సురేంద్ర నాథ్, డాక్టర్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈఎస్ఐ డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ ఒత్తిడి చేశాడు. క్యాంపుల పేరుతో మెడిసిన్ పంపించినట్లు రాసుకొని ఓ రికార్డు తయారుచేయాలని డాక్టర్కు చెప్పాడు. అయితే డాక్టర్ ఒప్పుకోకపోవడంతో సెక్షన్ ఆఫీసర్ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా మరో మహిళా డాక్టర్కు కూడా సురేంద్ర ఫోన్ చేసి బెదిరించాడు. ఏడాది తర్వాత క్యాంప్ నిర్వహించినట్లు బిల్లులు తయారు చేయాలని ఆ మహిళా వైద్యురాలిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఏడాది తర్వాత బిల్లులు తయారు చేయలేనని ఆ ఈఎస్ఐ డాక్టర్ తెగేసి చెప్పారు. అయితే డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ బిల్లుల కోసం అడుగుతున్నారని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ డాక్టర్ మాత్రం నిబంధనల ప్రకారమే ముందకు వెళ్తానని సురేంద్రకు స్పష్టంగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగాతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణితోపాటు వరంగల్ జాయింట్ డైరెక్టర్ కె.పద్మ, అడిషనల్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, రిప్రజెంటేటివ్ శివ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఆమ్ని మెడికల్కు చెందిన హరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 455 (ఏ), 465, 468, 471, 420, 120–బీ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 17మంది ఐఎంఎస్ ఉద్యోగులు, ఐదుగురు మెడికల్ కంపెనీల ప్రతినిదులు, ఓ టీవీ చానల్ రిపోర్టర్పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే.. -
టీచర్స్ మీట్ మిస్కావద్దు
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సుదీర్ఘ విరామం తర్వాత మంగళవారం మరో ఆడియో సందేశం విడుదల చేశారు. ఈసారి తమ చిన్నారులపై శ్రద్ధ తీసుకోవాలంటూ సిబ్బందికి హితవు పలికిన ఆయన.. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులకు సహకరించిన వలంటీర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ‘గణేష్ నవరాత్రి, నిమజ్జనాన్ని సమర్థమంతంగా నిర్వహించిన సిటీ పోలీసుల్ని అభినందిస్తున్నా. ఈ నేపథ్యంలోనే జోన్ల వారీగా బడా ఖానా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మూడింటిలో పూర్తయింది. అన్ని స్థాయిల్లోని సిబ్బంది, అధికారులు కలుసుకునే అవకాశం వీటి వల్ల కలుగుతుంది. ఇటీవల నాతో మాట్లాడి వివిధ స్కూళ్ల ప్రిన్సిపల్స్ చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేసింది. తాము క్రమం తప్పకుండా పేరెంట్–టీచర్ మీట్స్ ఏర్పాటు చేస్తామని, అయితే, పోలీసు పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఈ కార్యక్రమాలకు రావట్లేదని ఆ ప్రిన్సిపల్స్ చెప్పుకొచ్చారు. ఇది సరైంది కాదని నేను భావిస్తున్నా. మీ పిల్లలు, కుటుంబం కోసం కాకపోయినా మనందని బంగారు భవిష్యత్ కోసం ప్రతి పోలీసు ఈ మీట్స్కు వెళ్ళాలి. వీలున్నంత వరకు భార్యభర్తలు ఇద్దరూ వెళితే ఉత్తమం. అలా కానప్పుడు కనీసం మీ భార్యనైనా పంపండి. ఉపాధ్యాయుల్ని కలిసి మాట్లాడటం వల్ల మీ చిన్నారుల వ్యవహారశైలి, వారి ప్రతిభాపాటవాలు, లోటుపాట్లు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం దొరుకుతుంది. తల్లిదండ్రులకు కుదరకపోతే కనీసం గార్డియన్ని అయినా పంపండి. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసు వలంటీర్లు చేసిన సేవ అనిర్వచనీయమైంది. పోలీసుకు పోటీగా అద్భుతంగా పనిచేశారు. అలాంటి దాదాపు రెండు వేల మంది వలంటీర్ల జాబితా ప్రస్తుతం మన వద్ద ఉంది. వారితో సంబంధాన్ని కొనసాగించండి. తరచుగా ఠాణాలకు పిలిచి వారితో కాసేపు కూర్చుని టీ తాగండి. మీరు వారి ప్రాంతాలకు వెళ్ళి కలుసుకోండి. తద్వారా వారూ మనలోని భాగమే అని భావన కలిగించండి. వలంటీర్లతో ఈ బంధం శాశ్వతం కావాలి. ఈ క్రతువులో బ్లూకోల్ట్సŠ, పెట్రోల్ కార్స్ సిబ్బంది పాత్ర చాలా కీలకం. వారంలో కనీసం ఒక్కసారైనా వలంటీర్లతో కార్యక్రమం నిర్వహించడం లేదా కలవడం చేయండి. ఈ అంశంపై ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు దృష్టి పెట్టాలి. నగర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయడం ద్వారా హైదరాబాద్ను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి’ అని అంజనీకుమార్ కోరారు. -
బట్టబయలైన టీడీపీ హత్యా రాజకీయాలు
-
ఆ గొంతు నాదే : యడ్యూరప్ప
బెంగళూరు : కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ఆడియో టేపు వ్యవహారంలో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ టేపులో మాటలు తనవేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పరోక్షంగా అంగీకరించిన అంశం సంచలనం సృష్టించింది. తమ ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో యడ్యూరప్ప తమ శాసనసభ్యులను కొనేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ ఆడియో టేపును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆరోపణలను ఖండించిన యడ్యూరప్ప ‘ఆ ఆడియో సంభాషణ నాదేనని నిరూపిస్తే రాజీనామా చేస్తా’నంటూ సవాలు కూడా చేశారు. అయితే ఆదివారం హుబ్బళ్లిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ.. ‘నేను దేవదుర్గకు వెళ్లినప్పుడు అర్ధరాత్రి ముఖ్యమంత్రి కుమారస్వామి తన పార్టీ ఎమ్మెల్యే కుమారుడిని పంపి నాతో మాట్లాడేలా ప్రేరేపించారు. ఆ సంభాషణలో తనకు అవసరమైన మాటల్ని కత్తిరించి ఎడిట్ చేసి వాటిని విడుదల చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహించిన యడ్యూరప్ప ఆడియోలో సంభాషణ తనదేనని అంగీకరించారు. ఆడియో టేపుల విషయంలో యడ్యూరప్ప నిజం ఒప్పుకోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ పక్షాలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి. యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిందేనంటూ ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర డిమాండ్ చేశారు. -
పరీకర్ పడకగదిలో ‘రఫేల్’ ఫైల్స్!
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఓ దస్త్రం అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పడక గదిలో ఉందని, ఆయన సహచర మంత్రి ఒకరు వ్యాఖ్యానిస్తున్న ఆడియోను కాంగ్రెస్ బయటపెట్టింది. అయితే ఈ వీడియో ఎంత వరకు నిజమో తెలియరాలేదు. ఓసారి కేబినెట్ సమావేశంలో పరీకర్ ఈమేరకు వ్యాఖ్యానించినట్లు గోవా మంత్రి విశ్వజిత్ రాణె గుర్తుతెలియని వ్యక్తితో అంటున్నట్లు ఆడియోలో ఉంది. రఫేల్ ఒప్పంద విషయమై మోదీని పరీకర్ బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఆడియో టేపులు అబద్ధం, కట్టుకథలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని సుప్రీంకోర్టే ఎండగట్టిందని, నిజాల్ని తారుమారు చేసేందుకు మరే మార్గం లేకపోవడంతో ఆ పార్టీ ఇలా నకిలీ ఆడియోల్ని విడుదలచేస్తోందని పరీకర్ దుయ్యబట్టారు. ఆడియోలో ఉన్నట్లుగా తానెప్పుడూ కేబినెట్ సమావేశంలోగానీ, మరే ఇతర సమావేశంలోగానీ చర్చించలేదని స్పష్టం చేశారు. ‘సీఎం పరీకర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రఫేల్కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయన పడకగదిలోనే ఉందట. దీనర్థం.. ఏదో ఆశించే ఆయన ఆ సమాచారాన్నంతా తన వద్ద భద్రపరుచుకున్నారు’ అని రాణెను ఉటంకిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఈ ఆడియో కల్పితమని, దాని విడుదల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాణె అమిత్ షాకు చెప్పారు. పరీకర్కు లైడిటెక్టర్ పరీక్షలు: గోవా కాంగ్రెస్ రఫేల్ ఒప్పంద ఫైల్ను గుర్తించడానికి పరీకర్ నివాసంపై సీబీఐతో సోదాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీకర్, ఆయన సహచరులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ ఆడియోను వెలుగులోకి తెచ్చిన వేగును గుర్తించి రక్షణ కల్పించాలని, దివంగత జడ్జి లోయా లాంటి పరిస్థితి ఎదురుకాకుండా, పరీకర్కు కూడా భద్రతను పెంచాలని గోవా కాంగ్రెస్ ప్రతినిధి సిద్ధాంత్ బుయావో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
దమ్ముంటే చర్చకు రండి
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందం సహా ఏ వ్యూహాత్మక అంశంపై అయినా దమ్ముంటే తనతో 20 నిమిషాలు ముఖాముఖి చర్చకు రావాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాలు విసిరారు. రాహుల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చ కోసం నాకు కేవలం 20 నిమిషాలు ఇవ్వండి. ఆ తర్వాత వాస్తవమేంటో మీరే నిర్ణయించుకోండి. కానీ ప్రధాని మోదీకి మీ(మీడియా) ముందు కూర్చుని మాట్లాడే దమ్ము లేదు. మీరంతా మంగళవారం ప్రధాని ఇంటర్వ్యూ చూశారా? ఆయనేమో అక్కడ నవ్వుతున్నారు. ఎదురుగా ఉన్న జర్నలిస్ట్ మాత్రం ప్రశ్నలతో పాటు ప్రధాని ఇవ్వాల్సిన జవాబులను చెప్పేస్తున్నారు’ అని విమర్శించారు. రఫేల్ ఆడియో టేపు విషయమై మాట్లాడుతూ..‘రఫేల్కు సంబంధించిన ఫైలు మొత్తం తన దగ్గర ఉందని గోవా సీఎం పరీకర్ చెప్పినట్లు ఆయన కేబినెట్ సభ్యుడు రాణే బయటపెట్టారు. తనను ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించకుండా ఉండేందుకు పరీకర్ దీన్ని వాడుకుంటున్నారు. ఇలాంటి ఆడియో టేపులు ఇంకా చాలా ఉండొచ్చు. పరీకర్ ప్రధానిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం.. రఫేల్ ఒప్పందంపై తనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాలేదని మోదీ చెప్పడంపై స్పందిస్తూ..‘ఆయన ఏ లోకంలో జీవిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మోదీజీ.. మీకు వ్యతిరేకంగా ప్రశ్నలు వస్తున్నాయి. మీరు అనిల్ అంబానీ(ఏఏ)కు రూ.30,000 కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. -
లోక్సభలో ‘రఫేల్’ రచ్చ
న్యూఢిల్లీ రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ల మధ్య బుధవారం పార్లమెంటులో హైడ్రామా నడిచింది. రఫేల్ వ్యవహారంలో దేశ ప్రజలకు జవాబు ఇచ్చే ధైర్యంలేక ప్రధాని మోదీ ఇంట్లో దాక్కుంటున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందంపై గోవా మంత్రి విశ్వజిత్ రాణే మరొకరితో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపును సభలో వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని రాహుల్ స్పీకర్ను కోరారు. వెంటనే కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ స్పందిస్తూ, అవినీతిలో నిండా మునిగిన కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు. ఈ టేపు నకిలీ, కల్పితమని ఆరోపించారు. ఈ టేపు నిజమైనదేనని రాహుల్ నిరూపించగలరా? అని సవాలు విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రివిలేజ్ మోషన్ను రాహుల్ ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, అలాగే సభ నుంచి సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. దీంతో బీజేపీ సభ్యులు భయపడుతున్నందున ఈ టేపును పార్లమెంటులో వినిపించబోనని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా, ఆడియో టేపు నకిలీ అని తెలుసు కాబట్టే రాహుల్ భయపడి వెనక్కి తగ్గారని జైట్లీ దుయ్యబట్టారు. సభలో కాగితపు విమానాలు అరుణ్ జైట్లీ మాట్లాడుతుండగా విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగితపు విమానాలను సభలో విసిరి ఆందోళనకు దిగడంతో కార్యకలాపాలు కొద్దిసేపు స్తంభించాయి. దీంతో కాంగ్రెస్ సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ‘మీరంతా ఇంకా చిన్నపిల్లలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫేల్ టేపును సభలో వినిపించేందుకు అనుమతి నిరాకరించారు. బీజేపీ మిత్రపక్షం శివసేన సైతం విపక్షాలకు మద్దతు పలికింది. రఫేల్పై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. రఫేల్ జెట్లు మంచివే అయినప్పటికీ ఒప్పందం మాత్రం లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు కావేరీ నదీజలాల వివాదంలో ఆందోళనకు దిగిన 24 మంది అన్నాడీఎంకే ఎంపీలను స్పీకర్ మహాజన్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. బీజేపీ నేతలు భయపడొద్దు: రాహుల్ లోక్సభలో రాహుల్ మాట్లాడుతూ..‘మీరు(మోదీ) ఈ కాంట్రాక్టును మీ ప్రియమైన మిత్రుడు ఏఏ(అనిల్ అంబానీ)కి ఎందుకు ఇచ్చారు? ఖనాజాపై రూ.30వేల కోట్ల భారాన్ని ఎందుకు మోపారు. మోదీకి పార్లమెంటులో ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే ప్రధాని తన ఇంట్లోని బెడ్రూమ్లో దాక్కుంటుంటే, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యుల వెనుక దాక్కుంటున్నారు. ఈ విషయంలో వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ఆదేశించాలి. నిజం నిదానంగా బయటకు వస్తుంది. ప్పటికైనా మోదీ వెంటనే సభకు వచ్చి జవాబు చెప్పాలి. దేశమంతా ఆయన ఏం చెబుతారోనని ఆసక్తిగా చూస్తోంది’ అని తెలిపారు.రఫేల్ యుద్ధవిమానాల ధరను రూ.526 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు పెంచడాన్ని రక్షణశాఖ అధికారులు స్వయంగా వ్యతిరేకించలేదా? అని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఒప్పందాన్ని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) నుంచి లాక్కుని ఏఏకు అప్పగించారని ఆరోపించారు. అలాగే యుద్ధ విమానాల సంఖ్యను 126 నుంచి 36కు తగ్గించేశారని విమర్శించారు. మోదీ ఇటీవల ఇచ్చిన 90 నిమిషాల ఇంటర్వ్యూలో రఫేల్పై ప్రశ్నలకు జవాబివ్వలేదని దుయ్యబట్టారు. రఫేల్ ఒప్పందం విషయంలో తనపై ఎవరూ వేలెత్తి చూపడం లేదని ప్రధాని అంటున్నారనీ, కానీ దేశమంతా ఆయనవైపే వేలెత్తి చూపుతోందని అన్నారు. జేపీసీతో నిష్పాక్షిక విచారణ జరగదు: జైట్లీ రఫేల్ ఒప్పందంలో అవకతవకల్లేవని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిందని కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ తెలిపారు.అలాంటప్పుడు రఫేల్పై జేపీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ‘అవినీతిలో నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తోంది. బోఫోర్స్ కుంభకోణంపై ఏర్పాటైన జేపీసీని గుర్తుకు తెచ్చుకోండి. లంచం అందుకున్నారన్న ఆరోపణలను అది కొట్టివేసింది. అసలు అవినీతే జరగలేదని స్పష్టం చేసింది. జేపీసీ అన్నది ఇరుపార్టీలకు చెందిన కమిటీ. దీనివల్ల నిష్పాక్షిక విచారణ జరగదు. యూపీఏతో పోల్చుకుంటే మా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధవిమానం 9 శాతం చవకగా, ఆయుధ వ్యవస్థలు అమర్చిన రఫేల్ 20 శాతం చవకగా అందుబాటులోకి రానుంది. కొందరు వ్యక్తులు నిజాలను ఇష్టపడరు. వాళ్లు గత ఆరు నెలలో పార్లమెంటు లోపల, బయట రఫేల్పై చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలను వండివార్చడం వారికి వారసత్వంగా సంక్రమించింది. నిజాలను అంగీకరించలేని అలవాటు రాహుల్కు ఉంది. అందుకే ఆయన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడితో మాట్లాడినట్లు కట్టుకథలు అల్లారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు’ అని జైట్లీ వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కాగితపు విమానాల్ని విసరడంపై స్పందిస్తూ.. ‘ఐఏఎఫ్ కాంట్రాక్టును దక్కించుకోడానికి డసో కంపెనీతో పోటీపడిన యూరో ఫైటర్కు గుర్తుగా కాంగ్రెస్ నేతలు వీటిని విసురుతున్నారేమో’ అని ఎద్దేవా చేశారు. అగస్టాస్కాæం, నేషనల్ హెరాల్డ్ కేసు, బోఫోర్స్లో మధ్యవర్తి ఖత్రోచీ పేర్లను ప్రస్తావించిన జైట్లీ.. కాంగ్రెస్కు డబ్బుపై ఉన్న శ్రద్ధ దేశభద్రతపై లేదన్నారు. గతంలో పలు కుంభకోణాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారని దుయ్యబట్టారు. ‘జేమ్స్బాండ్’పై సంవాదం చర్చలో మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. ‘‘రాహు ల్ గతంలో జేమ్స్బాండ్ సినిమాలు చూసుంటారు. అందులో ‘ఏదైనా ఘటన ఒకసారి జరిగితే అనుకోకుంటే జరిగిందనుకోవాలి. రెండుసార్లు అదే జరిగితే యాదృచ్ఛికమనీ, మూడుసార్లు జరిగితే అది కుట్ర అని అర్థం చేసుకోవాలి’ అని బాం డ్ చెబుతాడు. కాంగ్రెస్ చీఫ్ అదే చేస్తున్నారు’’ అని అన్నారు. దీనికి తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ.. ‘జైట్లీ ఆ డైలాగ్ తప్పుగా చె ప్పారు. ఓ ఘటన మొదటిసారి జరిగితే దాన్ని అనుకోకుండా జరిగిన విషయంగా భావించాలి. అదేరెండుసార్లు జరిగితేయాదృచ్ఛికమనీ, మూడు సార్లు జరిగితే అది శత్రువుల చర్య అని అర్థం చేసుకోవాలి’ అని సినిమాలో ఉంటుందన్నారు. -
మీనాను హత్య చేసింది గ్రేహౌండ్స్ పోలీసులే
-
మీనా ఎన్కౌంటర్.. స్పందించిన మావోలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)వద్ద ఈ నెల 12 జరిగిన మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాండర్ మీనా ఎన్కౌంటర్, మరి కొంత మంది అరెస్ట్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ ఆడియో టేప్ విడుదల చేశారు. ఏవోబీ డివిజన్ కార్యదర్శి కైలాష్ అలియాస్ చలపతి పేరిట రిలీజ్ చేసిన ఆడియో టేప్లో సరిహద్దుల్లో పోలీసుల ప్రవర్తిస్తున్న తీరును తప్పుబట్టారు. ‘కామ్రేడ్ మీనా మృతి మావోయిస్టు పార్టీకి తీరని లోటు. ఆ లోటును భర్తీ చేసుకుంటూ అమరులైన వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. శత్రువులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రే హౌండ్స్ పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి ఏకదాటిగా రాపిడ్ ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్కు తూటాలు తగిలిన మీనా తీవ్రంగా గాయపడింది. గ్రే హౌండ్స్ పోలీస్లే మీనాను హత్య చేశారు. గత వారం రోజుల నుంచి కాల్పులతో పోలీస్లు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కట్ ఆఫ్ ఏరియాలో ప్రధానంగా ఆంధ్రలో పెద బయలు, ముంచంగిపుట్టు, ఒడిశాలోని మల్కన్ గిర, ఆండ్రపల్లి, జంత్రీ వంటి గిరిజన గ్రామాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఆండ్రపల్లిలోని మహిళలందరినీ హింసించారు. పోలీసులు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను నిర్బంధించారు. వారిని బేషరతుగా విడుదల చేయాలి’అంటూ ఆడియో టేప్లో మావోలు కోరారు. చదవండి: ‘గిడ్డి ఈశ్వరి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది’ ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం -
వైరల్గా మారిన బాబా ఆడియో టేప్
అనంతపురం,ఉరవకొండ: వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని గోవిందప్ప ఆశ్రమ పీఠాధిపతి గురునాథస్వామి ఓ భక్తురాలిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లున్న ఆడియో టేప్ ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది. వేలాదిమంది తరలివచ్చే ఈ ఆశ్రమంలో అమావాస్య రోజు పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక భజనలు, పూజలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లాకు చెందిన ఓ భక్తురాలిని పీఠాధిపతి లైంగికంగా వేధించినట్లు ఓ ఆడియో టేపు ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉరవకొండ సీఐ సయ్యద్ చిన్నగౌస్ సోమవారం ఆశ్రమానికి వెళ్లి విచారించారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఆశ్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. -
ఫోన్లో ఓ మహిళతో రాజయ్య సరసం
ఆమె : హలో సార్ నేను.. అతను: నాకు తెలుసురా.. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటవో నాకు తెలుసురా. నువ్వు ఎంత కొంటె పురుగువంటే..! బాగా కొంటె పనులు చేస్తవు.. కొంటెతనం అంటే..! చిలిపి చేష్టలు అన్నట్టు.. చిలిపి..చిలిపి పనులు అన్నట్టు.. ..అంటూ సంభాషణ సాగుతుంటే మహిళ పగలబడి నవ్వుతుండడంతో మొదలైన మాటలు.. ‘నువ్వే నా మొగుడివి’ అనే మాటలతో ముగుస్తుంది. మధ్యలో రాయలేని పదజాలంతో సంభాషణ ఉంటుంది. మొత్తం 5.43 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సంభాషణలో వినిపిస్తున్న మహిళ గొంతు టీఆర్ఎస్ పార్టీలో పదవి ఆశిస్తున్న ఆమెది కాగా.. పురుష గొంతు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యదే అని నెటిజన్లు కరాఖండీగా చెబుతున్నారు. పార్టీలో పదవి కోసం ఓ మహిళ.. నేతల చుట్టూ తిరిగే క్రమంలో వారి మధ్య సన్నిహిత సంబం ధానికి దారితీసినట్లు.. ఇది 5 నుంచి 8 నెలల క్రితం రికార్డు చేసిన సంభాషణగా తెలుస్తోంది. తొలి నుంచి అసమ్మతే.. రాజయ్యకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించిన నాటి నుంచీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత రాజారపు ప్రతాప్తో మొదలైన అసమ్మతి.. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అనుచరుల చేతిలోకి వెళ్లిపోయింది. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్తో కొంత కాలంగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజయ్యను రాజకీయంగా అణగదొక్కాలనే పక్కా పథకం ప్రకారమే ఆడియో క్లిప్పింగ్ను సోషల్ మీడియాలోకి వదిలారని రాజయ్య వర్గం అంటోంది. నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న నిరసనలపై ఉప ముఖ్యమంతి కడియం శ్రీహరిని కలిసేందుకు మంగళవారం ఉదయం రాజయ్య తన అనుచరులతో కలిసి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్పింగ్ను చూసి మార్గమధ్యలోనే ఆయన వెనుదిరిగినట్లు సమాచారం. దయాకర్, వెంకటేశ్వర్లు ఎవరు ? మాటల మధ్యలో ‘ఏవ్వా.. ఏవ్వా.. నాకు పోస్టు ఎప్పుడిస్తవ్ ఏవ్వా.. ఎప్పుడు చేతుల పెడుతవ్.. ఏవ్వా ’ అని మహిళ నవ్వుతూ అడుతుండగా.. రాజయ్య గొంతును పోలిన స్వరం నుంచి ‘నీకు పోస్టు దయాకర్ ఇస్తడు.. వెంకటేశ్వర్లేమో రికమండ్ చేస్తడు.. దయాకరేమో ఇస్తడు ’ అనే మాటలు వినిస్తున్నాయి. సదరు మహిళకు వారితో కూడా వివాహేతర సంబంధం అంటగడుతూ నీకు ముగ్గురు హీరోలు అని మాట్లాడుతుండగా.. మహిళ కల్పించుకుని ‘నువ్వే నా హీరో’ అంటూ.. దయాకర్కు మరో మహిళతో సంబంధం ఉందని దయాకరే తనకు చెప్పినట్లు మహిళ చెప్పింది. ఈ నేపథ్యంలో దయాకర్, వెంకటేశ్వర్లు ఎవరు ? అనే చర్చ జోరుగా సాగుతోంది. వాళ్లు కూడా రాజకీయ నాయకులేనా? లేక వ్యాపారవేత్తలా? పోస్టింగ్ పేరుతో మహిళలను ఎంత కాలం నుంచి తిప్పుకుంటున్నారు? అనే అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాగా, రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఒక ఫేక్ ఆడియోను సృష్టించారని రాజయ్య వివరణ ఇచ్చారు. తన గొంతును మిమిక్రీ చేశారని చెప్పారు. ఇలాంటి యత్నాలను చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. -
సంచలనం రేపుతున్న ఎమ్మెల్యే ఆడియో టేపులు
-
ర్యాలీల సంస్కృతిని విడనాడదాం
-
మరో ఆడియో విడుదల చేసిన కొత్వాల్
సాక్షి, సిటీబ్యూరో : నగరవాసులతో పాటు రాకపోకలు సాగించే వారినీ ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్ ర్యాలీల సంస్కృతిని విడనాడాలంటూ సీపీ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ఆడియో విడుదల చేశారు. అందులో కొత్వాల్ చెప్పిన వివరాలివీ.అందమైన హైదరాబాద్ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరం. దాదాపు 80 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ మహానగరం ఎప్పటికప్పుడు కొత్తగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందరో టూరిస్ట్లు, వ్యాపారులు బయటి ప్రాంతాల నుంచి నిత్యం వస్తున్నారు. కేవలం వీరే కాదు... స్థానికులు సైతం ఊరేగింపులు, ర్యాలీల వల్ల వారికి కలుగుతున్న ఇబ్బందులను నిత్యం నా దృష్టికి తీసుకువస్తున్నారు. వారంతా ప్రధానంగా మోటారు సైకిల్/బైక్ ర్యాలీల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మిత్రులారా మనం క్రమంగా నగరంలో ఉన్న కొన్నింటిని అధిగమించే దిశగా అడుగులు వేద్దామా! అలాంటి బైక్ ర్యాలీలు, ఊరేగింపుల వల్ల సాధారణ ప్రజలు ప్రభావితం కాకుండా చూడాలి. ఎలాంటి బైక్ ర్యాలీలు చేయకుండా నిర్వాహకులను ఒప్పించడానికి, వారిలో అవగాహన పెంచడానికి కృషి చేయాల్సిందిగా సహచర అధికారులు, సిబ్బందిని కోరుతున్నా. సామాన్యులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ బైక్ ర్యాలీల కోసం దరఖాస్తు కూడా చేయని విధంగా వారిలో మార్పు తీసుకురావాలి. నగరంలో జీవన ప్రమాణాల పెంచడానికి ఇది మనందరి కలిసి నిర్వర్తించాల్సిన బాధ్యత. నగరంలో ఉండే వారికి, పర్యటనలకు వచ్చే వారికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూద్దాం. అంతా కలిసి మన నగరాన్ని బైక్ ర్యాలీలు లేని విధంగా మార్చుకుందాం. దీన్ని సాకారం చేసుకుంటే కాలేజీలు, పాఠశాలలకు వెళ్ళే మీ పిల్లలు, వారి స్నేహితులతో పాటు ఆస్పత్రులకు వెళ్ళే రోగులు, వారి సంబంధీకులు ఎంతో ఉపశమనం పొందుతారు. ఈ చిన్న మార్పును సాకారం చేయడం ద్వారా మన నగరాన్ని రానున్న తరాలకు ఓ స్వర్గాధామంగా మార్చుకోవచ్చు. నగరాన్ని సుఖసంతోషాలతో నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. -
ఆమె.. అనుకూలమేనా?
ఏరి కోరి నియమించుకున్న పీఏ. అర్హతలు లేకపోయినా ఈ నియామకం మూడేళ్లుగా చెల్లుబాటు అవుతోంది. పేనుకు పెత్తనం ఇచ్చిన చందంగా.. మంత్రి అండదండల నేపథ్యంలో ఆ వ్యక్తి ముదిరిపోయాడు. ఎంతలా అంటే.. మంత్రిదేముంది, ఆమె కుమారునిదేముంది అంతా నేనే అనే స్థాయికి వ్యవహారం చేరుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. మహిళలు శాఖాపరమైన సమస్యతో ఆయన్ను ఆశ్రయిస్తే.. నాకేంటి అనే ధోరణి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఆయన తెరచాటు బాగోతాలకు అద్దం పట్టింది. డబ్బుదేముంది.. మరో రూపంలో తనను మెప్పించాలని ఓ ‘మధ్యవర్తి’తో సాగించిన సంభాషణ మంత్రి చుట్టూ చేరిన అనధికార వ్యక్తుల అసలు రూపం ఇట్టే అర్థమవుతోంది. అనంతపురం సిటీ: జిల్లాలో ఓ మంత్రి వద్ద సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తి తీరు వివాదాస్పదమవుతోంది. పలు సమస్యలతో మంత్రి వద్దకు వచ్చే వారంతా అతగాడి చేతులు తడపాల్సిందే. అదే మహిళలు అయితే కాసులు ముట్టడు. తన కామవాంఛ తీర్చమంటాడు. మంత్రిని కలిసిననా చివరకు పని చేయాల్సింది తామే కాబట్టి.. తాము చెప్పినట్టు వింటే అన్నీ సాఫీగా జరిగిపోతాయంటూ నమ్మబలికి లోబరుచుకుంటున్నాడు. ఇందుకు తోటి ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నాడు. ఇతగాడి చేష్టలతో విసిగిపోయిన పలువురు మహిళలు ఆ మంత్రి గడప తొక్కడమే మానేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని అన్ని విధాలా వాడుకునేందుకు కుట్రలు పన్నుతున్న ప్రబుద్ధిడి గురించి మంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ.. తమ సామాజిక వర్గానికి చెందినవాడని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ♦ అర్హతలు లేకపోయినా మంత్రి వద్ద పీఏగా చలామణి అవుతున్న ఆ ఉద్యోగి వ్యవహారం గతంలో పెద్ద దుమారమే రేగింది. ఏకంగా ఛైర్మన్ స్థాయి నేతకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసి పాలకవర్గం కోపాగ్నికి ఆ శాఖ ఉద్యోగుల ముందు అబాసుపాలయ్యాడు. ఇలా చెబుతూ పోతే అతగాడి పాపాల చిట్టా పుట్టలా పెరిగిపోతుంది. ఇటీవల సొంత శాఖకు చెందిన మహిళా ఉద్యోగి మధ్యవర్తి ద్వారా అతగాడిని ఆశ్రయించింది. సహోద్యోగితో ఫోన్లో ‘పీఏ’ సాగించిన ‘లైంగిక కోర్కెల’ సంభాషణ ఆడియో టేపు ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. సంభాషణ సాగిందిలా.. సన్నిహితుడు: సార్ నమస్తే. ఆ పల్లెకు చెందిన మహిళా ఉద్యోగి మీ కోసం వచ్చింది. తన పని చేసిపెట్టమని అడుగుతోంది. ఏం చేయమంటారు? పీఏ: ఆ.. నిన్న వచ్చింది. నాతో ఏవో తన సమస్యలన్నీ చెప్పింది. పని చేసి పెట్టామప్ప..ఏం హ్యాపీనా?! సన్నిహితుడు: ఆ.. హ్యాపీనే సార్. పీఏ: ఇంతకీ ఏంటి ఆమె క్యారెక్టర్? సన్నిహితుడు: మంచిదే...పాపం ఎవరూ ‘తోడు’ లేరు. పీఏ: అదికాదయ్యా.. నేనడిగేది...! ‘ఏంటి ఆ..మె పరిస్థితి’ అని? సన్నిహితుడు:చిన్నగా ‘పర్వాలేదు..సార్’ అంటుండగానే పీఏ: ఏమయ్యా గట్టిగా మాట్లాడు. ఎక్కడున్నావ్ సన్నిహితుడు: జెడ్పీ క్యాంటిన్లో టిఫిన్కు వచ్చా సార్. పీఏ: సరే అక్కడి నుంచి పక్కకు రా? సన్నిహితుడు: వచ్చాను సార్. పీఏ: ఏంటి ఆమె ఎలాంటిది.. పర్వాలేదా.. అని అడుగుతున్నా? గట్టిగా సమాధానం చెప్పు. సన్నిహితుడు: భర్తతో విభేదాలొచ్చి దూరంగా ఉంటోంది. పీఏ:ఆఆ..పర్వాలేదా? సన్నిహితుడు: ఊ పర్లేదు సార్? పీఏ: అంటే ఎలాంటిది అని అడుగుతున్నా? సన్నిహితుడు: అంటే క్యారెక్టర్ గురించి అడుగుతున్నా రా? పీఏ: అవును... డిబ్యాచ్లరా? సన్నిహితుడు: క్యారెక్టర్ మరీ అంత బ్యాడ్ కాదు సార్.. భర్తకు దూరంగా ఉంటోందంట సార్! పీఏ: అవునా...సరే ఆమె పని చేసిపెట్టాలంటే ఖర్చులుంటాయప్ప. అవెవరూ భరించరు. మేమే చేతినుంచి పెట్టుకుని చేయాలి. ఈ విషయం చెప్పావా? సన్నిహితుడు: సరే లక్ష దాకా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాస్తవంగా మంత్రి, ఆమె కుమారుడిని కలవాలని చాలా ప్రయత్నించింది. వారు సమయానికి దొరకలేదు. పీఏ: వారిని కలసినా మాకే ఆ పని అప్పగిస్తారు. వాళ్లేం డబ్బు ఇవ్వరు. ఎవరికి చెప్పినా చివరికి పని చేయాల్సింది నేనే. సన్నిహితుడు: మీరు మంత్రి దగ్గర పీఏగా ఉన్న విషయాన్ని తెలుసుకుని మన డిపార్టు మెంటతనే కదా అని నా వద్దకు వచ్చింది. నన్నడిగితే మీకు చెప్పి మంత్రి ఇంటి వద్దకు పంపుదామనుకున్నా. మీరు మధ్యలోనే కలసి ఫోన్లోనే ‘పని’ చేసి పెట్టారని చెప్పింది. పీఏ: ఇప్పుడేమంటోంది. హ్యాపీనా ఆమె... సన్నిహితుడు: ఆ హ్యాపీనే సార్. పీఏ: కాకపోతే ఆమె లక్ష ఇస్తానంటోంది కదా.. డబ్బు రూపంగా కాకుండా ‘మరోలా సహకరించమని’ చెప్పు. -
చంద్రబాబు అవినీతి ఆకాశయానం
-
ఆ వాయిస్ నా భార్యది కాదు
యశవంతపుర : బీజేపీ నాయకులు తన భార్య వనజాక్షితో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేప్ అబద్ధమని కారవార జిల్లా యల్లాపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే శివరామ హెబ్బార ఖండించారు. బీజేపీకి మద్దతివ్వాలని చూపిన ప్రలోభాలపై ఎమ్మెల్యే శివరామ హెబ్బార మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్టు చేస్తూ న్యూస్ చానల్లో రూ.15 కోట్ల డబ్బులు, మంత్రి పదవిని ఇస్తామంటూ వచ్చిన టేప్ వాయిస్పై తాను శనివారం శాసనసభలో ఉండగా అలస్యంగా తెలిసిందన్నారు. తన భార్యకు ఎవరూ ఫోన్ చేయలేదని, చానల్లో వచ్చిన వాయిస్ తన భార్యది కాదని ఖండించారు. అబద్ధపు టేప్ను విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫేస్బుక్లో పోస్టు చేశారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర వనజాక్షితో మాట్లాడినట్లు కాంగ్రెస్ నాయకుడు వీఎస్ ఉగ్రప్ప ఆరోపించటంతో వివాదం పెద్దదైంది. దీనిపై యల్లాపుర ఎమ్మెల్యే శివరామ హెబ్బార్ స్పష్టీకరణ ఇచ్చారు. -
ఆమె ‘సెల్’లో పెద్దల రాతలు
విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి వ్యవహారం సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరింది. డీజీపీ రాజేంద్రన్ మంగళవారం ఈ కేసును సీబీసీఐడీ విచారణకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న నిర్మలాదేవి విచారణలో నోరు మెదపనట్టు సమాచారం. అయితే, ఆమె సెల్ఫోన్లో పెద్దల తలరాతలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె సెల్లోని నంబర్లు, ఫోన్ కాల్స్, చాటింగ్స్ ఆధారంగా ఈ తతంగంవెనుక ఉన్న పెద్దల్ని పసిగట్టేందుకు సీబీసీఐడీ ప్రయత్నిస్తోంది. కాగా, గవర్నర్బన్వరిలాల్లతో కామరాజర్ వర్సిటీ వీసీ చెల్లదురై భేటీ అయ్యారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నారు. అందరి కన్నా ముందుగా, ఉన్నతస్థాయి విచారణకు గవర్నర్ ఆదేశించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సాక్షి, చెన్నై :విద్యార్థినుల్ని లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తూ విరుదునగర్ జిల్లా అరుప్పు కోట్టైలోని దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి సాగించిన ఆడియో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్టుచేసిన అరుప్పు కోట్టై పోలీసులు రాత్రంతా విచారించారు. అయితే, ఆమె ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం, నోరు మెదపకుండా ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. విద్యార్థినుల్ని ఎవరి కోసం ప్రేరేపించారో అన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని పలు విధాలుగా సమాధానం రాబట్టే యత్నం చేసినా ఫలితం లేదని తెలిసింది. అయితే, ఆమె సెల్ఫోన్లో అసలు బండారం ఉన్నట్టు తేల్చినట్టు సమాచారం. మదురై కామరాజర్ వర్సిటీలో ఉన్నఉన్నతాధికారులతో ఆమెకు ఉన్న సంబంధాలు, ఆయా అధికారులకు తరచూ కాల్స్ చేయడం, వారితో సాగిన చాటింగ్ తదితర అంశాల్ని పోలీసులు పరిగణించి ఉన్నారు. ఆయా నంబర్ల ఆధారంగా ఆ అధికారులెవరో విచారించే పనిలో పడ్డారు. ఆ వర్సిటీలో ఉన్న అధికారుల నంబర్లును గుర్తించినా, ఆ ఉన్నతాధికారులు ఎవరో అన్న ప్రశ్నకు సమాధానం రాబట్టడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో అరుప్పు కోట్టై పోలీసులు ఉన్న సమయంలో డీజీపీ రాజేంద్రన్ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నేడు అరుప్పుకోట్టైకి సీబీసీఐడీ నిర్మలాదేవి వ్యవహారంపై ఇప్పటికే దేవాంగర్ ఆర్స్ కళాశాల, కామరాజర్ వర్సిటీ వేర్వేరుగా విచారణ చేపట్టే పనిలో నిమగ్నం అయ్యాయి. అలాగే, ఉన్నతస్థాయి విచారణకు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆదేశించారు. మాజీ ఐఏఎస్ సంతానం నేతృత్వంలో ఆ కమిషన్ను రంగంలోకి దించారు. ఈ పరిస్థితుల్లో కేసు తీవ్రతను పరిగణించిన డీజీపీ రాజేంద్రన్ విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆ విభాగం అదనపు డీజీపీ, ఎస్సీల నేతృత్వంలో విచారణ ముమ్మరం కానుంది. సీబీసీఐడీ బృందం బుధవారం అరుప్పుకోట్టై చేరుకుని, నిర్మలా దేవిని విచారించేందుకు, తమ కస్టడీకి తీసుకునే విధంగా కోర్టును ఆశ్రయించనుంది. గవర్నర్పై విమర్శలు నిర్మలా దేవి ప్రేరణ వ్యవహారంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్పై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదని పీఎంకే నేత రాందాసు ఆరోపించారు. నిర్మల దేవికి ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడం, ఈ వ్యవహారం వెనుక పెద్దలు సైతం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తంచేశారు. దీనిపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ఆగమేఘాలపై గవర్నర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడాన్ని బట్టి చూస్తే, ఎవరినైనా రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయా..? అని అనుమానాలు వ్యక్తంచేశారు. ఇలాంటి విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదన్నారు. అయితే, గవర్నర్కు అన్ని అధికారులు ఉన్నాయని, విచారణకు ఆదేశించవచ్చంటూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్భళగన్ వెనకేసుకొచ్చారు. కాగా, గవర్నర్ బన్వరి లాల్ పురోహిత్తో కామరాజర్ వర్సిటీ వీసీ చెల్లదురై భేటీ అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో తనకు తెలిసిన వివరాలను చెల్లదురై వివరించారు. కఠిన చర్యలు తప్పదు తాజా వ్యవహారాలపై గవర్నర్ బన్వరిలాల్ స్పందించారు. ప్రథమంగా రాజ్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆయన వ్యాఖ్యలు చేశారు. చట్ట నిబంధనలకు లోబడే సంతానం నేతృత్వంలో కమిషన్ను రంగంలోకి దించినట్టు తెలిపారు. వర్సిటీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, నియమనిబంధనల మేరకు వర్సిటీ చాన్స్లర్గా తనకే అధికారం ఉన్నట్టు తెలిపారు. అందుకే ఉన్నత స్థాయి విచారణ కమిషన్ను ఏర్పాటు చేశానన్నారు. కామరాజర్ వర్సిటీ తన ప్రమేయం లేకుండా విచారణకు ఆదేశించిందని, ఇందుకు నా వర్సిటీ వీసీ వివరణ ఇచ్చారన్నారు. ఆ కమిటీని వెనక్కు తీసుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా, ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్సిటీల వ్యవహారాలు అందరికీ తెలియజేయడం, బహిర్గతంగా ఉంచేందుకు తాను చర్యలు తీసుకుంటూ వస్తున్నట్టు వివరించారు. ఆగని ఆందోళనలు ప్రొఫెసర్ వెనుక ఉన్న వాళ్లను త్వరితగతిన గుర్తించి కఠినంగా శిక్షించాలనే నినాదంతో ఆందోళనలు మంగళవారం కూడా సాగాయి. అనేక కళాశాలల విద్యార్థులు తరగతుల్ని బహిష్కరించి ఆందోళన చేశారు. చెన్నై గిండిలోని రాజ్ భవన్ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నాలు చేస్తున్న సమాచారంలో అక్కడ భద్రతను పెంచారు. ఇక, మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో చెన్నై చేపాక్కం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆ విభాగం అధ్యక్షురాలు ఝాన్సీ రాణి, అధికార ప్రతినిధి కుష్భు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనను అడ్డుకునే విధంగా పోలీసులు వ్యవహరించడంతో వారిపై తీవ్ర స్థాయిలో కుష్భు విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా, వర్సిటీల్లో విద్యార్థినులపై లైంగిక ప్రేరణ, ఒత్తిళ్లు మరీ ఎక్కువేనని పలువురు మాజీ ప్రొఫెసర్లు పెదవి విప్పే పనిలో పడడం గమనార్హం. రిమాండ్కు నిర్మలా దేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని 12రోజుల రిమాండ్కు తరలించారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు ఆమెను విరుదునగర్ కోర్టు న్యాయమూర్తి ముంతాజ్ ఎదుట హాజరు పరిచారు. రిమాండ్కు ఆదేశించడంతో మదురై కేంద్ర కారాగారానికి తరలించారు. -
తప్ప తాగి.. అధ్యక్షుడి కొడుకు చీప్ మాటలు
టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ తనయుడు యెర్ నెతన్యాహూ తన స్నేహితుడితో జరిపిన సంభాషణ ‘ఆడియో టేపు’ ప్రస్తుతం ఇజ్రాయెల్ రాజకీయాలను కుదిపేస్తోంది. టేపులో గ్యాస్ దిగ్గజం మొఘల్ కొబి మైమన్ తనయుడు ఒరి మైమన్తో యెర్ నెతన్యాహూ సంభాషించినట్లు తెలుస్తోంది. అప్పటికే తప్పతాగిన ఇరువురూ స్త్రీల గురించి, తండ్రుల గురించి చర్చించినట్లు టేపులో ఉంది. 2015లో ఒరి మైమన్తో కలసి యెర్ తరచుగా ప్రభుత్వ వాహనంలో స్ట్రిప్ క్లబ్స్కు వెళ్లారు. ఈ ఆడియో టేపు కూడా అప్పట్లో రికార్డు చేసిందే. ఆడియో టేపును ఇజ్రాయెల్ మీడియా దిగ్గజం చానెల్ 2 మంగళవారం ప్రసారం చేసింది. టేపులో ఏముందంటే.. యెర్ నెతన్యాహు (ఒరి మైమన్ను ఉద్దేశించి) : బ్రో.. నువ్వు నాకు ట్రీట్ ఇవ్వాలి. మీ డాడ్కు అనుకూలంగా మా నాన్న మంచి డీల్ కుదిర్చారు. పార్లమెంట్లో చట్టం పాస్ కాకుండా చూశారు. ఇందుకు ఆయన చాలా కష్టించారు. దానికి అదనంగా మీ కంపెనీకి 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా ఇచ్చారు. నేను వేశ్య కోసం ఆన్లైన్ వెతుకుతున్నాను. నువ్వు నా కోసం కనీసం 400 డాలర్లు కూడా ఖర్చు చేయలేవా?. తీవ్ర వ్యతిరేకత యెర్ నెతన్యాహు ఆడియో టేపులో చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయెల్నే కాక ప్రపంచ దేశాలను కూడా విస్తుపోయేలా చేసింది. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన యెర్పై ఇజ్రాయెల్ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఆడియో టేపులో తన వ్యాఖ్యలపై స్పందించిన యెర్ నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. మహిళలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని చెప్పారు. మద్యం మత్తులో చెప్పుకోలేని వ్యాఖ్యలు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని తనను చూడొద్దని కోరారు. తమ కుటుంబంపై బురద జల్లేందుకే మీడియా 2015లోని ఆడియో టేపును ఇప్పుడు బయటపెట్టిందని ఆరోపించారు. కాగా, బెంజిమన్ నెతన్యాహు భార్య సారాపై ఇప్పటికే పలు అవినీతి కేసులు ఉన్నాయి. లక్షా పదివేల డాలర్ల చీటింగ్ కేసుతో పాటు, ప్రభుత్వ నిధులను విలాసవంతమైన విందులకు వినియోగించారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. -
మళ్లీ చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
’నారాయణ’ఆడియో టేపుల్లో ఉన్నదంతా నిజమే
-
సంచలనం రేపుతున్న 'నారాయణ' ఆడియో
-
శిరీష కేసులో రోజుకో ట్విస్ట్
హైదరాబాద్: మేకప్ ఆర్టిస్ట్ శిరీష అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఆడియో టేపులు సంచనలం రేపుతోంది. రాజీవ్ స్నేహితులతో శిరీష ఫోన్ సంభాషణ టేపులు బయటకు వచ్చాయి. రాజీవ్పై తన ప్రేమను ఫోన్లో నవీన్, నందుతో శిరీష చెప్పింది. తనకు రాజీవ్ అంటే ప్రాణం అని పేర్కొంది. రాజీవ్ను ఎవరన్నా ఏమన్నా అంటే చంపేస్తానని ఆమె హెచ్చరించింది. రాజీవ్ ప్రియురాలు తేజశ్విని గురించి శిరీష మాట్లాడిన మాటలు ఆడియోలో ఉన్నాయి. తమ మధ్య తేజశ్విని రాకుండా చూడాలని రాజీవ్ స్నేహితులను కోరింది. అయితే ఈ ఆడియో టేపులు ఎవరి బయటపెట్టారనేది వెల్లడికాలేదు. అంతకుముందు విడుదలైన ఆడియో టేపులు తాము విడుదల చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, శిరీషపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తి నిర్ధారణకు రానున్నారు. ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్పల్లి పోలీస్ క్వార్టర్లో చోటుచేసుకున్న విషయాలను పోలీసులు రిమాండ్ డైరీలో కోర్టుకు వివరించారు. -
రిపబ్లిక్ టీవీ: లాలూకు ఆడియో టేపు షాక్
తన చానెల్ రిపబ్లిక్ టీవీని శనివారం ప్రారంభించిన అర్ణబ్ గోస్వామి బాంబు పేల్చారు. రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తీహార్ జైల్లో జీవితఖైదులో అనుభవిస్తున్న షహబుద్దీన్తో మాట్లాడుతున్న ఆడియో టేప్ను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. జైలు నుంచి లాలూకు, షహబుద్దీన్ సూచనలు ఇస్తున్నట్లు అందులో ఉంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్యాదవ్కు పాట్నాలో ఓ పెట్రోల్ పంపును 2011లో అక్రమంగా కేటాయించారని బీహార్కు చెందిన బీజేపీ నేత సుశీల్కుమార్ మోదీ ఆరోపణలు చేసిన కొద్ది గంటలకే ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో విపక్షాలు లాలూ, అధికార బీజేడీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. క్లిప్పింగ్పై మాట్లాడిన సుశీల్.. లాలూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. క్లిప్పింగ్పై మాట్లాడిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆడియో టేపును విన్న దేశం నివ్వెరవపోయిందని అన్నారు. ప్రారంభంతోనే నాయకుల అక్రమాలను బయటపెట్టడం మొదలుపెట్టిన అర్ణబ్ను పలువురు నాయకులు ప్రశంసించారు. కాగా, ఆడియో క్లిప్పింగ్పై ఆర్జేడీగానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఇంకా స్పందించలేదు. -
ఐసిస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
గోగ్జాలీ: ఐసిస్ పట్టుకలిగిన ఇరాక్ లోని మోసుల్ నగరంలో భద్రతా దళాలను అడ్డుకోవాలని ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది ఉగ్రవాదులకు గురువారం పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఆన్ లైన్ లో బగ్దాది ఆడియో టేపు హల్ చల్ చేస్తోంది. బలగాలకు భయపడి వెనక్కు తిరగడం కన్నా పోరాడటమే వెయ్యిరెట్లు ఉత్తమమని టేపులో వ్యాఖ్యానించాడు. బలగాల బలహీనతలు తెలుసుకోవాలని ఉగ్రవాదులకు సూచించాడు. మోసుల్ యుద్ధంలో ఐసిస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికా, ఇరాక్ సేనలను ఓడిస్తామని పేర్కొన్నాడు. 2014 జూన్ లో ఇరాక్ లోని కీలక నగరాలను తన అదుపులోకి తీసుకున్న సందర్భంగా బగ్దాది ఇస్లామిక్ స్టేట్ ను స్ధాపిస్తున్నట్లు ప్రకటించాడు. కాగా గత ఏడాది నుంచి ఐసిస్ పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు. అప్పటినుంచి ఐసిస్ ఆధీనంలోని నగరాలను ఒక్కొక్కటిగా సాయుధ బలగాలు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నాయి. గత వారమే అమెరికా, ఇరాక్ లకు చెందిన సాయుధ బలగాలు మోసుల్ నగరంలోకి ప్రవేశించాయి. మోసుల్ లో బగ్దాది దాగివున్న స్ధావరాన్ని బలగాలు చుట్టుముట్టాయనే వార్తలు కూడా వచ్చాయి. సౌదీ అరేబియాతో పాటు టర్కీలో కూడా ఉగ్రదాడులు చేయాలని ఆడియోలో బాగ్దాది పేర్కొన్నాడు. సిరియా, ఇరాక్ లకు రాలేని సానుభూతిపరులు లిబ్యాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని సూచించాడు. ఆపద సమయాల్లో ఐసిస్ ఫైటర్లందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరాడు. -
మా వాళ్లు.. దే బ్రీఫ్డ్ మీ!
-
ముగిసిన ఏపీ కేబినేట్ మీటింగ్
-
'టీడీపీని ఇబ్బంది పెట్టడానికే ఆడియో టేపు విడుదల'
-
'టీడీపీని ఇబ్బంది పెట్టడానికే ఆడియో టేపు విడుదల'
గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లనరేంద్ర తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే తెలంగాణ ప్రభుత్వం టేపులు విడుదల చేసిందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేస్తోందని మండిపడ్డారు. -
సూత్రధారి బాసే !!
-
'ఆ సంభాషణ చంద్రబాబుది కాదు'
-
ఆ సంభాషణ చంద్రబాబుది కాదు: పరకాల
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ముడుపుల వ్యవహారంలో తాజాగా బహిర్గతమైన ఆడియో టేపుల్లోని సంభాషణ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. అసలు ఈ ఆడియో ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అక్కడక్కడ మాట్లాడిన మాటలన్నీ కలిపి టెక్నాలజీ సాయంతో ప్రజలను నమ్మించేందుకే సృష్టించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నేరం అని, కావాలనే ట్యాప్ చేశారేమో చెప్పాలని పరకాల డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టబోమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ప్రభాకర్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు.. *ఆడియో టేపుల్లో ఉన్న సంభాషణలు చంద్రబాబువి కావు *ఈ సంభాషణ ఎక్కడ్నుంచి వచ్చింది.. టెలిఫోన్ ట్యాపింగ్ నేరం *అక్కడక్కడ మాట్లాడిన మాటలను పేర్చి ఆడియో టేపులను తయారు చేశారు *ఇది మామాలుగా విడిచిపెట్టే వ్యవహారం కాదు..దీని అంతు చూస్తాం. *మా సీఎంను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు *మాకు నోటీసులు రాలేదు, పంపే ధైర్యం చేయరు *రేపు తాము నిర్వహించే మహాసంకల్ప దీక్షను ప్రజలు దిగ్విజయం చేయాలి * మా సభను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తాం *మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే కుట్ర *తెలంగాణ హోంమంత్రి టేపులున్నాయని ముందే చెప్పారు *ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారా? *ఇదంతా తమపై కుట్ర కాదా? * మహాసంకల్ప దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర *రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తున్నారు *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పని కాదా? *ఇది ఎలా తీసుకొచ్చారో చెప్పండి.. * ఏపీ సీఎం ఫోన్ ను ట్యాప్ చేశామని చెప్పగలరా? *దీనిపై అన్నిరకాలుగా ఫైట్ చేస్తాం *ఇది చాలా నీచమైన పని.. కుట్రపూరితమైన పని *బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పనికాదు *అన్నీ టేపులు కోర్టుకు సమర్పించామన్నప్పుడు మరి ఈ టేపులు ఎక్కడివి? -
'యోగేంద్ర యాదవ్ లీక్ చేశారు'
కలిసికట్టుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుతో ఊడ్చేసిన ఆప్ లో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో రోజులో పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుండగా ఆ పార్టీలో వివాదాలు తారా స్థాయినందుకున్నాయి. పార్టీకి సంబంధించిన కీలక సమాచారాన్ని నేత యోగేంద్ర యాదవ్ మీడియాకు చెప్పినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అనుచరుడు దిలీప్ పాండే ఆరోపించారు. యోగేంద్ర యాదవ్ మీడియా వ్యక్తితో మాట్లాడిన మాటల రికార్డును విడుదల చేశారు. ఓ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం సదరు పత్రికా విలేకరితో బ్రేక్ ఫాస్ట్ చేసిన యాదవ్ అంతర్గతంగా ఉంచాల్సిన పార్టీ ముఖ్యమైన అంశాలను బహిర్గతం చేశాడని తెలిపారు.