-
పాక్ పరాభవంపై బంగ్లాదేశ్ ఓపెనర్ ట్వీట్.. షాకివ్వనున్న పీసీబీ
గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. టీ20 ప్రపంచకప్-2024లోనూ ఘోర పరాభవం చవిచూసింది.గ్రూప్-ఏలో టీమిండియా, కెనడా, ఐర్లాండ్, అమెరికాలతో కలిసి ఉన్న పాక్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి టీమిండియాతో పాటు పసికూన, ఆతిథ్య అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది.ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కోచ్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో తరచూ మార్పుల కారణంగానే తీరూ తెన్నూ లేకుండా పోయిందని.. అందుకు నిదర్శనమే ఈ వరుస వైఫల్యాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అఫ్గన్, బంగ్లాదేశ్ కూడా ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో పాక్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిబాట పట్టగా.. ఆసియా నుంచి టీమిండియాతో పాటు అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్-8కు చేరుకున్న విషయం తెలిసిందే. నాలుగింట మూడు విజయాలతో గ్రూప్-సి నుంచి అఫ్గన్.. గ్రూప్-డి నుంచి నాలుగింట మూడు గెలిచి బంగ్లా తదుపరి రౌండ్కు అర్హత సాధించాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదే వెటరన్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాక్ వైఫల్యాలపై సానుభూతి వ్యక్తం చేసిన ఈ బంగ్లా బ్యాటర్.. మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వంటి వాళ్లు ప్రస్తుత జట్టుకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందని హితవు పలికాడు.‘‘టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం విచారకరం. వచ్చేసారి వాళ్లు గొప్పగా రాణించాలని ఆశిస్తున్నా. షాహిద్ ఆఫ్రిది వంటి సీనియర్లే వారికి సరైన మార్గం చూపాలి’’ అని తమీమ్ ఇక్బాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇక్బాల్ ట్వీట్కు మద్దతుగా, వ్యతిరేకంగా.. ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.కఠిన చర్యలకు సిద్ధంవన్డే వరల్డ్కప్లో అవమానం తర్వాత పాకిస్తాన్ వరుసగా విఫలమైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లో పరాజయాలు చవిచూసింది.తాజాగా ప్రపంచకప్ రేసు నుంచి లీగ్ దశలోనే వైదొలిగింది. అంతేగాక సీనియర్లు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.సెంట్రల్ కాంట్రాక్టులు, జీతాల విషయంలో సమీక్ష నిర్వహించి.. కోతలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల తీరుపై గుర్రుగా ఉన్న పీసీబీ కొత్త చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. -
పాకిస్తాన్ అస్సలు జట్టే కాదు.. గ్రూపులుగా విడిపోయారు: గ్యారీ కిర్స్టన్
టీ20 వరల్డ్కప్-2024లో మాజీ ఛాంపియన్స్ పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన పాకిస్తాన్ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఈ మెగా టోర్నీ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.టీ20 వరల్డ్కప్ చరిత్రలో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాక్ ప్రస్తుత హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ చేరాడు. ప్రస్తుత పాక్ జట్టులో కొంచెం కూడా ఐక్యత లేదని కిర్స్టెన్ మండిపడ్డాడు. కాగా 2023 వన్డే వరల్డ్కప్ తర్వాత పాక్క్రికెట్ బోర్డు తమ కోచింగ్ బృందాన్ని మొత్తం మార్చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్లో పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్కోచ్గా కిర్స్టెన్ బాధ్యతలు చేపట్టాడు.అయితే భారత్కు వన్డే వరల్డ్కప్ను అందించిన కిర్స్టెన్.. పాక్ జట్టుతో సైతం అద్భుతాలు సృష్టిస్తాడని అందరూ భావించారు. కానీ పాక్ జట్టు మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచి తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది."పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అస్సలు జట్టే కాదు. పాక్ జట్టులో ఐక్యత లేదు. ఒకరికొకరు సపోర్ట్గా లేరు. ఎవరికి వారు నచ్చిన విధంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయారు. నేను నా కెరీర్లో చాలా జట్లతో కలిసి పనిచేశాను. కానీ ఏ జట్టులో కూడా ఇటువంటి పరిస్థితులు నేను చూడలేదు. అదేవిధంగా పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ కూడా అంతంతమాత్రమే అని గ్యారీ కిర్స్టన్ అన్నట్లు" పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
‘బాబర్ స్థానంలో కెప్టెన్గా రమీజ్ రాజా.. ఇప్పటికీ ఫిట్గానే’
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో చెత్త ప్రదర్శనతో ఇంటా.. బయటా విమర్శలు మూటగట్టుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఓవైపు దాయాది టీమిండియా వరుస విజయాలతో సూపర్-8లో సగర్వంగా అడుగుపెట్టగా.. పాక్ మాత్రం లీగ్ దశలోనే నిష్క్రమించింది.పసికూనగా భావించే ఆతిథ్య అమెరికా జట్టు చేతిలో ఓటమితో ఈ ఐసీసీ ఈవెంట్ను ఆరంభించిన బాబర్ బృందం.. తర్వాతి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. అమెరికా కెనడా, పాక్లపై గెలిచి సూపర్-8 మార్గాలను సుగమం చేసుకోగా.. ఐర్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అదృష్టం కూడా కలిసి వచ్చింది.ఈ క్రమంలో పాకిస్తాన్ను వెనక్కి నెట్టి అమెరికా తదుపరి రౌండ్కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా ఫలితం లేకుండా పోయినా.. గెలుపుతో ఈ ఈవెంట్ను ముగించగలిగింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఆట తీరు, కెప్టెన్ బాబర్ ఆజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ స్థానాన్ని మాజీ క్రికెటర్ రమీజ్ రాజాతో భర్తీ చేయాలంటూ సరదాగా పీసీబీకి సూచించాడు.బాబర్ ఆజం బదులు రమీజ్ రాజా అయితే‘‘వాళ్లు(పాక్ జట్టు) ఎప్పుడు కష్టాల్లో ఉన్నా రమీజ్ రాజా కాపాడేవాడు. ఈసారి కూడా జట్టుకు సీఈఓవో అవుతాడేమో ఎవరికి తెలుసు?!..రమీజ్ రాజా ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు. బాబర్ ఆజంకు బదులు రమీజ్ రాజాను కెప్టెన్గా నియమించాలి’’ అని మంజ్రేకర్ సరదాగా వ్యాఖ్యానించాడు.కాగా మాజీ బ్యాటర్, 61 ఏళ్ల రమీజ్ రాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్(2021-2022)గా పనిచేసిన విషయం తెలిసిందే. అతడి హయాంలో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు..2021 టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరింది. అదే విధంగా 2022లో ఫైనల్ చేరి.. రన్నరప్గా నిలిచింది. చదవండి: అవును నిజమే.. నేను కూడా!: రోహిత్ శర్మతో గిల్.. పోస్ట్ వైరల్ -
అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరును టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. అసలు అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదని అభిప్రాయపడ్డాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ సూపర్-8కు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. గత ప్రపంచకప్ టోర్నీ(2022)లో రన్నరప్గా నిలిచిన బాబర్ బృందం.. ఈసారి చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అతడిని కెప్టెన్గా తొలగించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.టాపార్డర్లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలిబాబర్ ఆజం టీ20 ఫార్మాట్కు తగడని.. అతడికి జట్టులో చోటే అనవసరం అని పేర్కొన్నాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలి. బాబర్ ఆజం అలాంటి ప్లేయర్ కాదు.కేవలం స్పిన్నర్ల బౌలింగ్లోనే అతడు హిట్టింగ్ ఆడగలడు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో అతడు ఇలాంటి సాహసం చేయడం నేనెప్పుడూ చూడలేదు.అతడు ఆచితూచి నెమ్మదిగా ఆడటమే మనకు కనబడుతుంది. బాబర్ పరుగులు సాధిస్తున్న మాట నిజమే. కానీ అతడి స్ట్రైక్రేటును కూడా గమనించాలి కదా!అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదునాయకుడిగా ఉన్నపుడు మన ఆట వల్ల జట్టుకు ప్రయోజనం కలుగుతుందా లేదో చూసుకోవాలి. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ అయి.. తన స్థానాన్ని హిట్టింగ్ ఆడగల ప్లేయర్ల కోసం త్యాగం చేయగలగాలి.ఒకవేళ అతడు గనుక కెప్టెన్ కాకపోయి ఉంటే.. అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు.. కానీ ఇదే నిజం. ఎందుకంటే నేటి టీ20 క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లు అతడి ఆట లేనేలేదు’’ అని సెహ్వాగ్ నిక్కచ్చిగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్ తాజా ఎడిషన్లో ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి బాబర్ ఆజం 122 పరుగులు చేశాడు. అయితే అతడి స్ట్రైక్రేటు మాత్రం కేవలం 101.66 కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏ నుంచి టీమిండియాతో పాటు అమెరికా సూపర్-8కు చేరగా.. పాక్, కెనడా, ఐర్లాండ్ ఇంటిబాట పట్టాయి.చదవండి: T20 WC: కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన -
కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
‘‘నేను ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని భావించానో అప్పుడే(2023) కెప్టెన్సీ వదిలేశాను. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాను కూడా!ఆ తర్వాత మళ్లీ బోర్డు నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత.. ఏం జరిగిందన్న అంశం గురించి చర్చిస్తాం.ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటాం. ఒకవేళ నేను కెప్టెన్సీ వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా అందరి ముందు నేనే ప్రకటిస్తా. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు.ఏం జరిగినా అంతా ఓపెన్గానే ఉంటుంది. అయితే, నేనిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో పీసీబీదే తుది నిర్ణయం’’ అని పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం స్పష్టం చేశాడు.వన్డే వరల్డ్కప్-2023లో వైఫల్యం తర్వాతపాక్ బోర్డు ఆదేశాల మేరకే సారథిగా కొనసాగాలా లేదా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే.గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.అయితే, అతడిని పీసీబీ ఎక్కువకాలం కొనసాగించలేదు. బోర్డు యాజమాన్యం మారిన తర్వాత మళ్లీ బాబర్ ఆజంనే వన్డే, టీ20 కెప్టెన్గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024లో బాబర్ సారథ్యంలో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైంది.గ్రూప్-ఏలో ఉన్న పాక్.. తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా.. తాజాగా ఐర్లాండ్పై గెలుపొందినా అప్పటికే సూపర్-8 నుంచి నిష్క్రమించింది. పాక్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా టీమిండియాతో పాటు తదుపరి దశకు అర్హత సాధించింది.అందరి ప్లేస్లో నేను ఆడలేను కదా!ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం స్పందిస్తూ.. ‘‘కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. చాలా మంది కెప్టెన్ వైపు వేలు చూపిస్తున్నారు. కానీ ప్రతి ఆటగాడి స్థానంలో నేను వెళ్లి ఆడలేను కదా! జట్టులోని 11 మంది ఆటగాళ్లకు తమదైన పాత్ర ఉంటుంది. జట్టుగా మేము విఫలమయ్యాం. ఈ విషయాన్ని ముము అంగీకరించక తప్పదు. వైఫల్యానికి ఎవరో ఒకరిని బాధ్యులుగా చూపే పరిస్థితి లేదు’’ అని పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వాళ్లకు ఈ మేరకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు బాబర్ ఆజం.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్కు ఊరట విజయం లభించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై 3 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్లో 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా బాబర్ రికార్డులకెక్కాడు.పొట్టి ప్రపంచకప్లో బాబర్ ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్లలో 549 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని 29 ఇన్నింగ్స్లలో 529 పరుగులు చేశాడు.తాజా మ్యాచ్తో ధోని ఆల్టైమ్ రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఇక ఈ జాబితాలో బాబర్, ధోని తర్వాత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(527) ఉన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అమెరికా వంటి పసికూనపై ఓటమి పాలై సూపర్-8కు చేరే అవకాశాలను పాక్ కోల్పోయింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్ల్లో పాక్ విజయం సాధించింది. -
చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్
టీ20 వరల్డ్కప్-2024ను పాకిస్తాన్ విజయంతో ముగించింది. ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన పాకిస్తాన్.. తమ చివరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో గారెత్ డెలానీ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్కు 2 వికెట్లు దక్కాయి.తీవ్రంగా శ్రమించిన పాక్..అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు పాక్ తీవ్రంగా శ్రమించింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటకి కెప్టెన్ బాబర్ ఆజం(32) ఆజేయంగా నిలవగా.. ఆఖరిలో షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి పాక్కు రెండో విజయాన్ని అందించాడు.107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు."టోర్నమెంట్ను విజయంతో ముగించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో బౌలింగ్లో మేము బాగానే రాణించాము. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును ఒత్తడిలోకి నెట్టాము. ఫ్లోరిడా వికెట్ పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.కానీ బ్యాటింగ్లో మాత్రం మేము మా మార్క్ను చూపించలేకపోయాము. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. ఏదో విధంగా టెయిలాండర్ల సాయంతో మ్యాచ్ను ముగించాము. ఇంతకుముందు మ్యాచ్ల్లో కూడా యూఎస్ఎ, భారత్పై కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయాం. జట్టు అవసరం బట్టి నేను ఏ పొజిషన్లోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అది ఓపెనింగ్ అయినా, ఫస్ట్డౌన్ అయినా కావచ్చు. ఇక జట్టులో మాత్రం అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మాకు కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మేము బంగ్లాపర్యటనకు వెళ్లనున్నాం. ఈ నేపథ్యంలో మా బాయ్స్ తిగిరి కమ్బ్యాక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ టోర్నమెంట్లో ఎక్కడ తప్పు జరిగిందో అంచనా వేయాల్సిన అవసరం మాకు ఉందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బాబర్ పేర్కొన్నాడు.చదవండి: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం -
పాపం పాకిస్తాన్.. అస్సలు ఊహించలేదు! టీ20 వరల్డ్కప్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ తొలి రౌండ్లోనే ఇంటుముఖం పట్టింది. తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన పాక్.. ఆ తర్వాత భారత్పై పోరాడి ఓటమి పాలైంది.అనంతరం కెనడాపై తిరిగి పుంజుకుని బాబర్ సేన అద్బుత విజయం సాధించింది. దీంతో తమ సూపర్-8 ఆశలను పాక్ సజీవంగా నిలుపునకుంది. అయితే పాక్ భవితవ్యం ఆతిథ్య అమెరికాపై ఆధారపడింది.ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోతుందని, ఆ తర్వాత ఐర్లాండ్ను ఓడించి సూపర్-8కు వెళ్లాలని భావించిన పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాక్ టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.ఇదే తొలిసారి..కాగా టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టడం ఇదే తొలిసారి. ఇంతకుముందు టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో పాక్ ఒక్కసారి కూడా గ్రూపు స్టేజిలో నిష్క్రమించలేదు. 2007లో షోయబ్ మాలిక్ సారథ్యంలో రన్నరప్గా పాక్ నిలిచింది. అనంతరం 2009లో కూడా యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో ఫైనల్కు చేరింది. ఆ తర్వాత షాహిద్ అఫ్రిది(2010), మహ్మద్ హాఫీజ్(2012) కెప్టెన్సీలో పాక్ సెమీఫైనల్స్కు చేరింది. అదే విధంగా బాబర్ ఆజం నాయకత్వంలో 2021 పొట్టి వరల్డ్కప్లో సెమీఫైనలిస్ట్గా, 2022 వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచింది.కానీ ఈ సారి మాత్రం పాక్ గ్రూపు స్టేజిని దాటలేకపోయింది. దీంతో టీ20 ప్రపంచకప్లో గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించిన తొలి పాక్ జట్టు కెప్టెన్గా బాబర్ ఆజం చెత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో బాబర్పై ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. -
అతడినే కెప్టెన్గా ఉండనివ్వాల్సింది: బాబర్పై ఆఫ్రిది ఆగ్రహం
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తీరును మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. షాహిన్ ఆఫ్రిది స్థానంలో బాబర్ పగ్గాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఒకవేళ బోర్డు ఆఫర్ చేసినా.. షాహిన్నే కెప్టెన్గా కొనసాగించాలని బాబర్.. కోరి ఉంటే బాగుండేదంటూ తన అల్లుడికి మద్దతు పలికాడు.వన్డే ప్రపంచకప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజం తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి పాక్ క్రికెట్ బోర్డు టెస్టులకు షాన్ మసూద్, టీ20 ఫార్మాట్కు ప్రధాన పేసర్, షాహిద్ ఆఫ్రిది అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్లుగా ప్రకటించింది.షాహిన్పై వేటుఅయితే, మసూద్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ అయిన పాకిస్తాన్.. షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 4-1తో ఓడిపోయింది.ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ షాహిన్ ఆఫ్రిది వైఫల్యం కొనసాగింది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు కొత్త యాజమాన్యం అతడిపై వేటు వేసింది. వన్డే, టీ20లకు బాబర్ ఆజంనే తిరిగి కెప్టెన్గా నియమించింది.అయితే, బాబర్ సారథ్యంలోనూ పాకిస్తాన్కు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తొలుత ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను 0-2తో కోల్పోయిన పాక్.. తాజాగా టీ20 ప్రపంచకప్-2024లో గ్రూప్ దశ దాటకుండానే ఎలిమినేట్ అయింది.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. షాహిద్ ఆఫ్రిది తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్కప్ వరకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్గా ఉంటాడని ఒకవేళ పీసీబీ చెబితే.. బాబర్ ఆజం అతడికి మద్దతుగా నిలవాల్సింది.‘లేదు. నాకు కెప్టెన్సీ వద్దు. మేమంతా షాహిన్ సారథ్యంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. అతడు నాతో పాటు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాడు. అందుకే అతడికే కెప్టెన్సీ అప్పగించండి. నేను అతడికి మద్దతుగా ఉంటూ.. అతడి నాయకత్వంలో ఆడతాను’’ అని బాబర్ ఆజం చెప్పాల్సింది.బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదుఇలా చేసి ఉంటే అతడిపై గౌరవం పెరిగేది. అయినా.. ఇందులో బాబర్ ఒక్కడినే తప్పుబట్టడానికి లేదు. సెలక్షన్ కమిటీకి కూడా ఇందులో భాగం ఉంది.సెలక్షన్ కమిటీలోని కొందరకు వ్యక్తులు.. బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదని డైరెక్ట్గానే చెప్పారు. అయినా మళ్లీ అతడి చేతికే పగ్గాలు వచ్చాయి’’ అని షాహిద్ ఆఫ్రిది ఘాటు విమర్శలు చేశాడు.ఏదేమైనా బాబర్ ఆజం.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదినే కెప్టెన్గా కొనసాగించాలని బోర్డును కోరి ఉండాల్సిందని షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా బాబర్ నాయకత్వంలో 2021 వరల్డ్కప్లో సెమీస్ చేరిన పాకిస్తాన్.. 2022లో రన్నరప్గా నిలిచింది. ఈసారి మాత్రం గ్రూప్ స్టేజిలోనే ఇంటిబాట పట్టింది. చదవండి: WC: ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాం: ఇంగ్లండ్ పేసర్ -
పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్
పాకిస్తాన్ సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మండిపడ్డాడు. మిడిలార్డర్లో ఆడే బ్యాటర్లు కనీసం ఒక్కరైనా జట్టులో ఉన్నారా అని ప్రశ్నించాడు.నాణ్యమైన ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేసే అలవాటే లేదా అంటూ మిస్బా సెలక్టర్లను తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే చెత్త ప్రదర్శన కనబరిచింది.గ్రూప్-ఏలో తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన బాబర్ ఆజం బృందం సూపర్-8 అవకాశలను సంక్లిష్టం చేసుకుంది. తాజాగా అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సూపర్-8 రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది.ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు బాబర్ బృందం, సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో మిస్బా ఉల్ హక్ పాక్ మిడిలార్డర్ బ్యాటర్ల తీరును తూర్పారబట్టాడు. ‘‘మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లే లేరు.గత మూడు ప్రపంచకప్ టోర్నీల్లో.. 4, 5, 6 స్థానాల్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. అయినా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు.అందరూ టాపార్డర్లోనే బ్యాటింగ్ చేస్తామంటే.. 4, 5, 6 స్థానాల్లో ఆడేది ఎవరు? బాబర్ ఆజం, ఇఫ్తికార్ అహ్మద్ వంటి అత్యుత్తమ ప్లేయర్లు జట్టులో ఉన్నా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారు.జట్టు ఇలా పతనమవడానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?’’ అంటూ మిస్బా ఉల్ హక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్లు సాధించిన పరుగులు👉ఫఖర్ జమాన్- అమెరికా మీద- 11 (7) ఇండియా మీద- 13 (8), కెనడా మీద 4 (6).👉ఇఫ్తికార్ అహ్మద్- అమెరికా మీద 18 (14), ఇండియా మీద 5 (9).👉ఆజం ఖాన్- అమెరికాతో మ్యాచ్లో గోల్డెన్ డక్👉ఇమాద్ వసీం- ఇండియా మీద 15 (23).👉షాదాబ్ ఖాన్- అమెరికా మీద 40 (25), ఇండియా మీద 4 (7).చదవండి: T20 WC 2024- SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి! -
T20 WC: పాకిస్తాన్కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలతో చతికిలపడ్డ బాబర్ ఆజం బృందాన్ని దురదృష్టం కూడా వెంటాడింది.అమెరికా- ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించింది. గతేడాది రన్నరప్గా నిలిచిన ఈ జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టింది.మరోవైపు.. గ్రూప్-ఏ టాపర్గా సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియాతో పాటు అమెరికా కూడా తదుపరి దశకు అర్హత సాధించింది.బాబర్ ఆజంకు మరో చేదు అనుభవంగతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లోనూ పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్ కూడా చేరుకుండానే ఐసీసీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో అతడు జట్టు ఓటములకు బాధ్యత వహిస్తూ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.ఆ తర్వాత బాబర్ ఆజం స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లుగా నియమితులయ్యారు. అయితే, వీరి సారథ్యంలో ఘోర పరాజయాలు.. అదే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మార్పుల అనంతరం.. బాబర్ ఆజం మళ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఎంపికయ్యాడు.ఆ సిరీస్లో వైట్వాష్టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు పీసీబీ అతడి పునర్నియామకానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వన్డే, టీ20 జట్లకు సారథిగా ప్రకటించింది. అయితే, బాబర్ కెప్టెన్సీలో తొలుత ఇంగ్లండ్తో సిరీస్ ఆడిన పాకిస్తాన్ వైట్వాష్(2-0)కు గురికాగా.. వరల్డ్కప్ టోర్నీలో పరాజయాల పరంపర కొనసాగింది.అమెరికా చేతిలో చిత్తుగ్రూప్-ఏలో టీమిండియా, ఐర్లాండ్, కెనడా, అమెరికాలతో పాటు ఉన్న పాకిస్తాన్.. తొలుత అమెరికా(సూపర్ ఓవర్ ద్వారా ఫలితం), అనంతరం టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. తద్వారా సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.మరోవైపు.. ఆతిథ్య అమెరికా తొలుత కెనడా.. తర్వాత పాకిస్తాన్ను ఓడించి మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో కెనడాపై విజయం సాధించిన పాకిస్తాన్.. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆశలు పెట్టుకోగా అది కాస్తా వర్షం వల్ల రద్దైంది.ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే అవుట్ఫలితంగా అమెరికా ఖాతాలో ఐదు పాయింట్లు చేరగా.. కేవలం రెండు పాయింట్లే కలిగి ఉన్న పాక్.. తమకు ఐర్లాండ్తో మిగిలిన మ్యాచ్లోనూ గెలిచినా లాభం లేకుండా పోయింది. ఐరిష్ జట్టుపై పాక్ గెలిచినా నాలుగు పాయింట్లే అవుతాయి కాబట్టి.. అమెరికాపై పైచేయి సాధించలేదు. దీంతో అమెరికా సూపర్-8కు చేరగా.. బాబర్ బృందం గ్రూప్ దశ కూడా దాటలేక నిష్క్రమించింది. చదవండి: T20 WC: అతడిని వదిలేశారు... కివీస్కు తగినశాస్తి: మాజీ క్రికెటర్ ఫైర్ -
T20 WC: పాకిస్తాన్కు ‘శుభవార్త’.. కానీ ఆ గండం దాటితేనే!
అమెరికాపై టీమిండియా విజయం నేపథ్యంలో పాకిస్తాన్ సంతోషంలో మునిగిపోయింది. సూపర్-8 దశకు చేరుకునే క్రమంలో తమ ఆశలు పదిలం కావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.టీ20 ప్రపంచకప్-2024 ఆరంభంలో పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో ఉన్న అమెరికా, టీమిండియా చేతిలో చిత్తైన బాబర్ ఆజం బృందం... కెనడాపై గెలుపుతో ఊపిరి పీల్చుకుంది.అయితే, సూపర్-8లో అడుగుపెట్టాలంటే అమెరికాతో పోటీ పడాల్సిన పరిస్థితి. అప్పటికే మొనాంక్ పటేల్ సేన రెండు విజయాలు సాధించి.. పాకిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో ఉండటమే ఇందుకు కారణం.మొన్న ఏడిపించి... ఇపుడేమో శుభవార్తఇలాంటి దశలో టీమిండియా- అమెరికా మ్యాచ్ ఫలితంపై పాక్ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన అమెరికాను ఓడిస్తే పాక్ సూపర్-8కు చేరవయ్యే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే భారత జట్టు బుధవారం నాటి మ్యాచ్లో అమెరికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.దీంతో పాయింట్ల పరంగా అమెరికా కంటే వెనుకబడి ఉన్నా.. రన్రేటు పరంగా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలోకి వెళ్లింది పాక్ జట్టు. ఈ క్రమంలో తదుపరి ఐర్లాండ్తో మ్యాచ్లో తాము గెలవడం.. అమెరికా ఓడటం జరిగితే పాక్ సూపర్-8లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచింది. కాగా గత మ్యాచ్లో భారత్ పాక్ను ఓడించిన విషయం తెలిసిందే.పాకిస్తాన్ సూపర్-8కు చేరాలంటే..గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా ఇప్పటికే మూడు విజయాలతో(ఆరు పాయింట్లు) టాపర్గా నిలిచి సూపర్-8కు చేరుకుంది.రెండో స్థానం కోసం అమెరికా, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే గ్రూప్ దశలో మూడేసి మ్యాచ్లు ఆడాయి.అమెరికా రెండు విజయాలు(4 పాయింట్లు) సాధించగా.. పాకిస్తాన్ ఒకటి గెలిచింది(2 పాయింట్లు). అయితే, టీమిండియా చేతిలో ఓటమి తర్వాత నెట్ రన్రేటు పరంగా అమెరికా(+0.127) పాక్ కంటే (+0.191) కాస్త వెనుకబడింది.ఈ నేపథ్యంలో లీగ్ దశలో తమకు మిగిలిన ఆఖరి మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-8కు చేరుతుంది. అయితే, రెండూ తమ తమ మ్యాచ్లలో గెలిస్తే అప్పుడు నెట్ రన్రేటు కీలకంగా మారుతుంది. ఇక ఆఖరి మ్యాచ్లలో అమెరికా, పాకిస్తాన్ల ప్రత్యర్థి ఐర్లాండ్ కావడం విశేషం. ఈ రెండు జట్లలో ఏది సూపర్-8 చేరాలన్నా ఐర్లాండ్ ఆట తీరుపైనే ఆధారపడి ఉంది.చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే -
అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్ ఆజం
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. కెనడాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, రన్రేటు పరంగా వేగంగా లక్ష్యాన్ని ఛేదించాలని భావించినా.. పిచ్ స్వభావం కారణంగా వీలుపడలేదని విచారం వ్యక్తం చేశాడు.గ్రూప్-ఏలో భాగమైన పాకిస్తాన్- కెనడాల మధ్య మంగళవారం రాత్రి మ్యాచ్ జరిగింది. న్యూయార్క్ వేదికగా టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెనడా ఓపెనర్ ఆరోన్ జాన్సన్(44 బంతుల్లో 52) అర్థ శతకంతో మెరవగా.. మిగతా వాళ్లలో ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా కనీసం పది పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి కెనడా కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారిస్ రవూఫ్, ఆమిర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్యం చిన్నదే అయినా.. దానిని ఛేదించడానికి పాకిస్తాన్ కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్కు అంతగా అనుకూలించని పిచ్పై పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీ(53 బంతుల్లో 53) చేయగా.. బాబర్ ఆజం(33 బంతుల్లో 33) పరుగులు చేశాడు. మిగత వాళ్లలో సయీమ్ ఆయుబ్ 6, ఫఖర్ జమాన్4, ఉస్మాన్ ఖాన్ 2(నాటౌట్) పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ క్రమంలో 17.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి పాక్ 107 పరుగులు చేయగలిగింది.ఇక గ్రూప్-ఏలో ఉన్న పాక్ ఇప్పటికే వరుసగా యూఎస్ఏ, టీమిండియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, తాజా విజయంతో పాక్ ఖాతాలో రెండు పాయింట్లు చేరినా.. యూఎస్ఏ(4 పాయింట్లు) కంటే వెనుకబడే ఉంది.నిజానికి కెనడాతో మ్యాచ్లో పాక్ లక్ష్యాన్ని 14 ఓవర్లలోనే పూర్తి చేస్తే సూపర్-8 దశకు చేరే క్రమంలో యూఎస్ఏకు గట్టి పోటీ ఇచ్చి ఉండేది. ఇక పాక్ అవకాశాలు మెరుగుపడాలంటే తదుపరి ఐర్లాండ్తో మ్యాచ్లో గెలవడంతో పాటు.. గ్రూప్-‘ఏ’లోని ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో కెనడాపై విజయానంతరం బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మాకు ఈ గెలుపు అత్యసవరం. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.తొలి ఆరు ఓవర్లలో మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. అయితే, యూఎస్ఏ కంటే నెట్ రన్రేటు పరంగా మెరుగుపడాలనే ఆలోచనతోనే ముందుకు సాగాము. నిజానికి 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సింది. కానీ పిచ్ అందుకు సహకరించలేదు’’ అని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శనతో టోర్నీలో ముందుసాగుతామని బాబర్ ఆజం ఈ సందర్భంగా పేర్కొన్నాడు.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలా..ఇండియా- 2(ఆడినవి)- 2(గెలిచినవి) - 0(ఓడినవి) - 4(పాయింట్లు) - +1.455(నెట్ రన్రేటు)యూఎస్ఏ- 2(ఆడినవి)- 2(గెలిచినవి)0(ఓడినవి)- 4(పాయింట్లు)- +0.626(నెట్ రన్రేటు)పాకిస్తాన్- 3(ఆడినవి)- 1(గెలిచినవి)- 2(ఓడినవి)- 2(పాయింట్లు) - +0.191(నెట్ రన్రేటు)కెనడా- 3(ఆడినవి) - 1(గెలిచినవి)- 2(ఓడినవి)- 2(పాయింట్లు)- -0.493(నెట్ రన్రేటు)ఐర్లాండ్- 2(ఆడినవి)- 0(గెలిచినవి)- 2(ఓడినవి)- 0(పాయింట్లు)- -1.712(నెట్ రన్రేటు) View this post on Instagram A post shared by ICC (@icc) -
‘ప్లీజ్.. కెప్టెన్సీ వదిలెయ్.. మంచే జరుగుతుంది’
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. సారథిగా, బ్యాటర్గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలవుతున్నాడు.అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పాక్ జట్టు ఇంత వరకు బోణీ కొట్టకపోవడంతో సూపర్-8 అవకాశాలు కూడా సంక్లిషంగా మారిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో అనూహ్య రీతిలో ఆతిథ్య యూఎస్ఏ చేతిలో ఓటమి పాలైంది పాకిస్తాన్.ఆ తర్వాతి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్లోనూ బాబర్ బృందానికి మరోసారి పరాభవం తప్పలేదు. న్యూయార్క్లో ఆదివారం నాటి ఈ మ్యాచ్లో భారత్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.యూఎస్ఏతో పోటీపడాల్సిన దుస్థితిసూపర్-8 దశకు అర్హత సాధించాలంటే పసికూన యూఎస్ఏతో పోటీపడాల్సిన స్థితిలో నిలిచింది. ఇక బాబర్ ఆజం వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. ప్రపంచంలోని మేటి బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన ఈ రైట్హ్యాండర్ ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.యూఎస్ఏతో మ్యాచ్లో 44 పరుగులు చేయగా.. భారత్పై కేవలం 13 పరుగులకే బాబర్ పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.ఈ క్రమంలో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ బాబర్ ఆజంను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశాడు.ప్లీజ్ బాబర్.. కెప్టెన్సీ వదిలేసెయ్!‘‘చాలా కాలం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా. ప్లీజ్ బాబర్.. కెప్టెన్సీ వదిలేసెయ్! నువ్వొక క్లాస్ ప్లేయర్వి. నీలోని క్లాస్ మాత్రమే చూపించు.అదనపు బాధ్యతలు, భారం నెత్తిన పెట్టుకోనట్లయితే ఇంకా ఎంతో బాగా ఆడగలవు. ఒకవేళ బాబర్ గనుక కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లయితే కచ్చితంగా అతడికి మంచే జరుగుతుంది’’ అని మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ బాబర్కు సూచించాడు.బ్యాటింగ్, కెప్టెన్సీ మధ్య ఊగిసలాడవద్దని.. ఆటగాడిగా ఉండేందుకే మొగ్గుచూపాలని అతడికి విజ్ఞప్తి చేశాడు షోయబ్ మాలిక్. కాగా వన్డే వరల్డ్కప్-2023లో కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఇటీవలే కెప్టెన్గా మరోసారి బాధ్యతలుభారత్ వేదికగా ఎదురైన ఈ పరాభవానికి బాధ్యత వహిస్తూ ఈ మెగా టోర్నీ అనంతరం బాబర్ ఆజం కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అయితే, అనేక పరిణామాల అనంతరం తిరిగి పాక్ వన్డే, టీ20 జట్ల సారథిగా ఇటీవలే పునర్నియమితుడయ్యాడు. ఇక కొత్తగా బాబర్ నాయకత్వంలో ఇంగ్లండ్తో సిరీస్లో 2-0తో ఓటమిపాలైన పాకిస్తాన్.. ప్రపంచకప్-2024 ఈవెంట్లోనూ తన పరాజయాలు కొనసాగిస్తోంది.చదవండి: నువ్వేమీ గిల్క్రిస్ట్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్వి: సెహ్వాగ్ -
జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్పై విమర్శల పర్వం కొనసాగుతోంది. మెగా టోర్నీకి జట్టు ఎంపిక మొదలు.. బాబర్ ఆజం కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన వరకు ఏ ఒక్కటి సరిగ్గా లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా సహా వసీం అక్రం, కమ్రన్ అక్మల్, సలీం మాలిక్ తదితరులు భారత్తో మ్యాచ్లో పాక్ ఆట తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా ఈ జాబితాలో చేరాడు. ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్తాన్ కెప్టెన్గా తిరిగి నియమితుడైన బాబర్ ఆజంపై అతడు విమర్శలు ఎక్కుపెట్టాడు.‘‘కెప్టెన్ అనే వాడు జట్టును ఒకే తాటి మీదకు తెస్తాడు. జట్టును నాశనం చేయగల.. లేదంటే నిర్మించగల శక్తి అతడికి ఉంటుంది. ఈ వరల్డ్కప్ టోర్నీ ముగిసిన తర్వాత నేను ఈ విషయంపై ఇంకాస్త స్పష్టంగా మాట్లాడతాను’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు.అదే విధంగా తన అల్లుడు షాహిన్ ఆఫ్రిది కెరీర్లోని ఎత్తుపళ్లాల గురించి ప్రస్తావన రాగా.. ‘‘అతడితో నాకున్న బంధుత్వం కారణంగా.. నేను నా కూతురికి, అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నానని చాలా మంది అనుకుంటారు.నిజానికి నేను ఎప్పుడూ అలా మాట్లాడను. ఒకవేళ నా కూతురైనా.. అల్లుడైనా తప్పు చేస్తే తప్పు చేశారనే చెప్తాను. అంతేతప్ప వెనకేసుకురాను’’ అంటూ షాహిద్ ఆఫ్రిది ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు.ఫలితంగా పాకిస్తాన్ టీ20 కెప్టెన్సీ పదవి ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని వరించింది. అయితే, అతడి సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో కోల్పోయింది.ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో పలు మార్పుల అనంతరం బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్గా నియమితుడయ్యాడు. అతడి నాయకత్వంలో వరల్డ్కప్నకు ముందు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడిన పాకిస్తాన్ 0-2తో ఓడిపోయింది.ఇక వరల్డ్కప్-2024లోనూ బాబర్ బృందం పరాజయాల పరంపర కొనసాగుతోంది. తమ తొలి మ్యాచ్లో యూఎస్ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్లో భారత్ చేతిలోనూ పరాజయం పాలైంది. గ్రూపు దశలో మిలిగిన రెండు మ్యాచ్లలో గెలిస్తేనే ఈ టోర్నీలో పాక్ ముందడుగు వేయగలుగుతుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఐక్యత లేనందువల్లే ఈ పరిస్థితి అంటూ షాహిద్ ఆఫ్రిది బాబర్ ఆజంను టార్గెట్ చేయడం గమనార్హం.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
Ind vs Pak: పాక్ ఓటమి.. ఢిల్లీ పోలీస్ విభాగం పోస్ట్ వైరల్
దాయాదులు టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. చిరకాల ప్రత్యర్థులు నువ్వా- నేనా అన్నట్లు పోటీపడితే చూడాలని కోరుకుంటారు ఇరు దేశాల అభిమానులు. తామూ ఈ జాబితాలో భాగమే అంటున్నారు ఢిల్లీ పోలీసులు.టోర్నీ ఏదైనా భారత్- పాక్ మ్యాచ్ అంటే తమకూ ఆసక్తేనని.. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడం అసలైన మజా అందిస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రోహిత్ సేన చేతిలో మరోసారి పరాభవం పాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టును దారుణంగా ట్రోల్ చేసింది ఢిల్లీ పోలీస్ విభాగం.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా పాకిస్తాన్తో తలపడ్డ టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 119 పరుగులకు ఆలౌట్ అయింది.అయితే, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో 113 పరుగులకే పాక్ కథ ముగియగా.. టీమిండియా జయకేతనం ఎగురవేసింది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు(7) గెలుపొందిన తొలి జట్టుగా నిలిచింది.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే గెలుపోటములు మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ విభాగం తమ ఎక్స్ ఖాతాలో న్యూయార్క్ పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేసింది.‘‘హే.. న్యూయార్క్ సిటీ పోలీస్. మాకు రెండు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఒకటి.. ‘ఇండియా.. ఇండియా!’.. రెండోది.. బహుశా టీవీలు పగిలిన శబ్దం అనుకుంటా. నిజమో కాదో కాస్త చెప్తారా?’’ అంటూ ఢిల్లీ పోలీస్ విభాగం చమత్కరించింది. ఈ ట్వీట్ వైరల్గా మారింది.ఇప్పటికే ఈ టోర్నీలో పసికూన యూఎస్ఏ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. తాజాగా టీమిండియా చేతిలోనూ ఓడిపోవడంతో సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బాబర్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.Hey, @NYPDnewsWe heard two loud noises. One is "Indiaaa..India!", and another is probably of broken televisions. Can you please confirm?#INDvsPAK#INDvPAK#T20WorldCup— Delhi Police (@DelhiPolice) June 9, 2024 -
టీమిండియా విజయం.. క్రెడిట్ మొత్తం మా వాళ్లకే: అక్తర్
‘‘టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం పాకిస్తాన్కే ఇవ్వాలి. ఓడిపోవడానికి అత్యుత్తమంగా ప్రయత్నించారు. ఇంతకంటే గొప్పగా వాళ్ల గురించి చెప్పడానికి ఏమీ లేదు.పాకిస్తాన్ మిడిలార్డర్ను గమనించారా? మిమ్మల్ని ఎవరూ షాట్లు ఆడమని అడుగలేదు. కనీసం చెత్త షాట్లు ఆడకుండా ఉంటే చాలని మాత్రమే కోరుకున్నాం.కానీ మీరదే చేశారు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్ను ప్రత్యర్థికి అప్పగించేశారు. విజయం చేరువగా వచ్చినా.. మాకొద్దే వద్దు అన్నట్లు వెనక్కి నెట్టేశారు. ఇది నిజంగా షాకింగ్గా.. సర్ప్రైజ్గా ఉంది’’ అని పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ బాబర్ ఆజం బృందంపై విరుచుకుపడ్డాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్ వేదికగా తలపడ్డ దాయాదుల పోరు ఆద్యంతం ఆసక్తి రేపింది.తొలుత అద్భుత బౌలింగ్తో టీమిండియాను 119 పరుగులకే కట్టడిచేయగలిగిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో మాత్రం చేతులెత్తేసింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచి మరోసారి టీమిండియా చేతిలో భంగపాటుకు గురైంది. నిజానికి ఏ ఒక్క బ్యాటర్ కాసేపు ఓపికగా నిలబడినా ఫలితం వేరేలా ఉండేదేమో!అయితే, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధాటికి పరుగులు రాబట్టలేక చతికిల పడ్డ పాక్ బ్యాటర్లు.. ఓటమిని చేజేతులా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియాతో మ్యాచ్లో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో పాక్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు చేశారు.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం: బాబర్ ఆజం
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్పై టీమిండియా మరోసారి పైచేయి సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని చాటుకుంటూ మెగా ఈవెంట్లో బాబర్ ఆజం బృందాన్ని ఓడించింది. తద్వారా వరల్డ్కప్-2024లో వరుసగా రెండో విజయం నమోదు చేసి గ్రూప్-ఏలో అగ్రస్థానం నిలబెట్టుకుంది.ఇక ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఓటమిపై స్పందించాడు.మా ఓటమికి ప్రధాన కారణం అదేటీమిండియా చేతిలో పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మేము అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోవడం.. ఎక్కువగా డాట్ బాల్స్ కావడంతో వెనుకబడ్డాం.స్ట్రైక్ రొటేట్ చేస్తూ నెమ్మదిగా పరుగులు రాబట్టాలనే ప్రయత్నం విఫలమైంది. తొలి ఆరు ఓవర్లలోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించాం.కానీ.. తొలి వికెట్ పడిన తర్వాత నుంచి మళ్లీ కోలుకోలేకపోయాం. నిజానికి పిచ్ బాగానే ఉంది. బంతి బ్యాట్ మీదకు వస్తోంది. వికెట్ కాస్త స్లోగా.. అదనపు బౌన్స్కు అనుకూలించింది.వారి నుంచి ఎక్కువగా ఆశించకూడదుఅయినా.. పరుగుల కోసం టెయిలెండర్ల మీద ఆధారపడటం.. వారి నుంచి ఎక్కువగా ఆశించడం కూడా సరైంది కాదు’’ అని బాబర్ ఆజం తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు.న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియాను 119 పరుగులకే ఆలౌట్ చేసిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో 113 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో ఓడింది. పాక్ ఆటగాళ్లలో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.మిగిలిన వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు సాధించారు.ఇంకో రెండు గెలిస్తేనేకాగా గ్రూప్-ఏలో భాగమైన పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో తమ తొలి మ్యాచ్లో యూఎస్ఏ చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైన బాబర్ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో భారత్ చేతిలోనూ ఓడిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిస్తేనే పాక్ ఈ టోర్నీలో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మా ఆట తీరులో లోపాలేమిటో కూర్చుని చర్చిస్తాం. ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.వాటిలో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం’’ అని తెలిపాడు. కాగా పాకిస్తాన్ తదుపరి జూన్ 11న కెనడా, జూన్ 16న ఐర్లాండ్తో తలపడనుంది.చదవండి: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్ View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు ఆటంకాల నడుమ ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ పేసర్ల ధాటికి 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 12; ఫోర్, సిక్స్), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) రెండంకెల స్కోర్ చేయగా.. విరాట్ కోహ్లి (3 బంతుల్లో 4; ఫోర్), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 7; ఫోర్), శివమ్ దూబే (9 బంతుల్లో 3), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 12; ఫోర్), రవీంద్ర జడేజా (0), అర్ష్దీప్ సింగ్ (13 బంతుల్లో 9; ఫోర్), బుమ్రా (0) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బుమ్రా (4-0-14-3), హార్దిక్ (4-0-24-2), సిరాజ్ (4-0-19-0), అర్ష్దీప్ సింగ్ (4-0-31-1), అక్షర్ పటేల్ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. పాక్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకుముందు ఓవర్లో బుమ్రా మ్యాజిక్ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో భారత్ ప్రపంచకప్ టోర్నీల్లో పాక్పై తమ రికార్డును 7-1కి మరింత మెరుగుపర్చుకుంది. పాక్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ రిజ్వాన్ (31) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. ఈ ఓటమితో పాక్ సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా టీమిండియాతో ఇవాళ (జూన్ 9) జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తేలికపాటి జల్లులు, ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా టాస్ అరగంట ఆలస్యమైంది. ఈ మ్యాచ్లో భారత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. పాక్ గత మ్యాచ్లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. పాక్ వికెట్కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్కు పక్కన పెట్టి ఇమాద్ వసీంను తుది జట్టులోకి తీసుకుంది. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్ -
బాబర్.. విరాట్ కాలిగోటికి కూడా సమానం కాడు: పాక్ మాజీ ప్లేయర్
టీ20 వరల్డ్కప్ 2024లో భారత్-పాకిస్తాన్ మెగా సమరానికి ముందు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సొంత జట్టు సారధి బాబర్ ఆజమ్పై దుమ్మెతిపోశాడు. విరాట్తో బాబర్కు పోలిక ఏంటని షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాబర్ విరాట్ కాలిగోటికి కూడా సమానం కాదని పరుష పదజాలాన్ని వాడాడు. బాబర్ సెంచరీ చేసిన ప్రతిసారి పాక్ అభిమానులు అతన్ని విరాట్తో పోలుస్తారని.. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. బాబర్ను విరాట్తో పోలిస్తే అస్సలు ఒప్పుకోనని అన్నాడు. 16 ఏళ్ల కెరీర్లో విరాట్ 80 సెంచరీల సాయంతో దాదాపు 27000 పరుగులు చేస్తే.. బాబర్ తన తొమ్మిదేళ్ల కెరీర్లో 31 సెంచరీల సాయంతో 13000 పైచిలుకు పరుగులు మాత్రమే చేశాడని గుర్తు చేశాడు.ప్రస్తుత వరల్డ్కప్లో యూఎస్ఏపై బాబర్ ఆడిన ఇన్నింగ్స్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. పసికూనల బౌలింగ్లోనే తేలిపోయిన బాబర్కు విరాట్తో పోటీపడే అర్హత ఎక్కడ ఉందని నిలదీశాడు. సాధారణ యూఎస్ఏ బౌలర్లను ఎదుర్కోలేక చతికిలబడిన బాబర్.. ప్రపంచ స్థాయి బౌలర్లను ఏరకంగా ఎదుర్కొంటాడని ప్రశ్నించాడు. యూఎస్ఏతో మ్యాచ్లో బాబర్ ఆడిన ఇన్నింగ్సే పాక్ ఓటమికి ప్రధాన కారణమని దుమ్మెత్తిపోశాడు. 44 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్న బాబర్.. విరాట్తో సరిసమానమైన ప్లేయర్ అయ్యుంటే చివరి వరకు క్రీజ్లో నిలబడి పాక్ను గెలిపించేవాడని అన్నాడు. నేటి మెగా సమరంలో భారత్.. పాక్ను చిత్తు చేయడం ఖాయమని ఘంటాపథంగా తెలిపాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో పాక్పై భారత్ డామినేషన్ (6-1) కొనసాగుతుందని జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో పోటీపడే ప్రతిసారి బౌలింగే తమ ప్రధాన బలమని జబ్బలు చరుచుకునే పాక్.. అదే బౌలింగ్ కారణంగా యూఎస్ఏ చేతిలో ఓడిందని అభిప్రాయపడ్డాడు. ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా ఈ మేరకు వ్యాఖ్యానించాడు.కాగా, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో పాక్ తామాడిన తొలి మ్యాచ్లో పసికూన యూఎస్ఏ చేతిలో చావుదెబ్బ తిన్న విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా.. తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను మట్టికరిపించి గెలుపు జోష్లో ఉంది. భారత్, పాక్లు ఇవాళ (జూన్ 9) న్యూయార్క్ వేదికగా అమీతుమీకి సిద్దమయ్యాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు వేదిక అయిన న్యూయార్క్లో మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు న్యూయార్క్ మైదానంలోని పిచ్ ఇరు జట్లను కలవరపెడుతుంది. ఈ పిచ్ ఎవరికీ అంతుచిక్కని విధంగా స్పందిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. -
T20 WC: పాక్ కొంపముంచిన అమీర్.. చెత్త బౌలింగ్తో
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో జట్లు సమంగా పోరాడనప్పటకి.. సూపర్ ఓవర్లో మాత్రం విజయం యూఎస్ఎనే వరించింది.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది.పాక్ కొంపముంచిన అమీర్..ఇక పాకిస్తాన్ తరపున సూపర్ ఓవర్ వేసే బాధ్యతను సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్కు కెప్టెన్ బాబర్ ఆజం అప్పగించాడు. బాబర్ ఆజం నమ్మకాన్ని అమీర్ వమ్ము చేశాడు. సూపర్ ఓవర్ వేసిన అమీర్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఏడు పరుగులు వైడ్ల రూపంలోనే రావడం గమనార్హం. అనంతరం 19 పరుగుల లక్ష్య చేధనలో పాక్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. ఇక పాక్ ఓటమికి పరోక్షంగా కారణమైన మహ్మద్ అమీర్ను ఆ జట్టు అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అమీర్ కంటే అఫ్రిదికి బౌలింగ్ బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు బద్దలు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా యూఎస్ఎతో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్లు ఆడిన ఆజం 4067 పరుగులు సాధించాడు. ఇక ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 117 టీ20 మ్యాచ్ల్లో 4037 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో కోహ్లిని బాబర్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో బాబర్ ఆజం, విరాట్ కోహ్లి తర్వాత రోహిత్ శర్మ(4026) మూడో స్ధానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్కు అమెరికా ఊహించని షాకిచ్చింది. సూపర్ ఓవర్లో పాకిస్తాన్పై అమెరికా విజయం సాధించింది. -
అదే మా కొంపముంచింది.. మా కంటే వారే బెటర్: బాబర్ ఆజం
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్కు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు సమంగా పోరాడనప్పటికి.. సూపర్ ఓవర్లో మాత్రం పాక్కు భంగపాటు తప్పలేదు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్తాన్ 13 మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్ను కెప్టెన్ బాబర్ ఆజం(44), షాదాబ్ ఖాన్(40) పరుగులతో ఆదుకున్నారు. అమెరికా బౌలర్లలో నాస్తుష్ కెన్జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్ నేత్రావల్కర్ 2 వికెట్లు తీశాడు.అనంతరం బ్యాటింగ్ దిగిన యూఎస్ఎ నిర్ణీత 20 ఓవర్లలో కూడా 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో నిర్ణయించాల్సి వచ్చింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో విఫలమయ్యామని బాబర్ తెలిపాడు."తొలుత బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాం. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోలేపోయాము. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసింది. ఏ మ్యాచ్లోనైనా గెలవాలంటే భాగస్వామ్యాలు చాలా కీలకం. ఈ మ్యాచ్లో మేము అది చేయలేకపోయాం.మరోవైపు బంతితో కూడా మేము నిరాశపరిచాం. మా స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదు. ఇలా అన్ని విభాగాల్లో విఫలమైనందన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక యూఎస్ఎ చాలా కష్టపడింది. కాబట్టి వారికి క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో మా కంటే మెరుగ్గా ఆడారని" పోస్ట్మ్యాచ్ ప్రేజంటేషన్లో బాబర్ పేర్కొన్నాడు. -
T20 WC 2024: అమెరికాతో పాకిస్తాన్ పోరు.. తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్తో తొలి మ్యాచ్కు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా యూఎస్ఎతో పాకిస్తాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఎస్ఎ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఎస్ఎ తమ తొలి మ్యాచ్ ఆడిన జట్టుతోననే ఈ మ్యాచ్లో బరిలోకి దిగింది. మరోవైపు పాకిస్తాన్ ఏకంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇక పాకిస్తాన్కు ఇదే తొలి మ్యాచ్ కాగా.. యూఎస్ఎ జట్టు మాత్రం తమ మొదటి మ్యాచ్లో కెనడాపై అద్బుత విజయం సాధించింది.తుది జట్లుపాకిస్తాన్: బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఆజం ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ అమీర్, హరీస్ రవూఫ్యునైటెడ్ స్టేట్స్ : స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
బలగం వేణుకి షాక్ ఇచ్చిన నాని..?
టాప్ 50 హెడ్ లైన్స్@1PM 18 June 2024
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డలో మారుతున్న రాజకీయాలు
శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఆర్జిత సేవ
జనసేనలో చేరిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీకృష్ణపై అనర్హత వేటు
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ఆసీస్, భారత్కు కూడా సాధ్యం కాలేదు
KSR Comment: త్వరలో ప్రజల్లోకి వైఎస్ జగన్
బన్నీ మూవీ పక్కన పెట్టి.. సల్మాన్ వైపు అట్లీ చూపు..
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్తో పవన్.. క్యాంపు ఆఫీసు పరిశీలన
బన్నీకి షాక్ ఇస్తున్న తమిళ్ డైరెక్టర్స్ ..
Advertisement