Bathukamma Sarees
-
బతుకమ్మ కానుకలకు స్వస్తి..?
చుంచుపల్లి: బతుకమ్మ పండుగకు మహిళలకు అందించే చీరలకు ప్రభుత్వం ఈసారి స్వస్తి పలికినట్లేనని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది అక్టోబర్లో పంపిణీ చేస్తుండగా, రెండు నెలల ముందు నుంచే లబ్ధిదారుల సంఖ్య, చీరల కొనుగోలు ప్రక్రియపై కసరత్తు జరిగేది. కానీ ఈసారి బతుకమ్మ చీరలకు సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. చీరల స్థానంలో ప్రత్యామ్నాయంగా నగదు లేదా ఇంకేమైనా బహుమతులు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ కానుకగా చీరలను అందించింది. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాలవారికి చీరలు పంపిణీ చేసింది. సిరిసిల్ల, షాద్నగర్, నారాయణపేట్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత చీరలను కొనుగోలు చేసి అందించింది. జిల్లాలో 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలోని 3,66,088 మంది మహిళలకు రేషన్ షాపులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా ఈ బతుకమ్మ కానుకలు నేరుగా అందించేవారు. అయితే ఈ బతుకమ్మ చీరలు నాణ్యమైనవి కాదని, కొనుగోలు ప్రక్రియలో అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి నాణ్యతలేని చీరలను పంపిణీ చేసి అభాసుపాలు కాకుండా చీరలకు బదులు వేరే బహుమతులు ఇవ్వాలనే భావనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
బతుకమ్మ చీరల పంపిణీలో లొల్లి!
మంచిర్యాల: మండల కేంద్రంలో బుధవారం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే దివాకర్రావు సాక్షిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే దివాకర్రావు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు నాణ్యతగా ఉంటే బాగుంటుంది, ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాన్నారు. అక్కడే ఉన్న పలువురు బీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుంటూ గత ఏడాది ఎంపీపీగా ఉన్నప్పుడు ఏం మాట్లాడావు. ఇప్పుడు పార్టీ మారి ఇలా మాట్లాడుతున్నావ్, చీరలకు ఏమైందని ప్రశ్నించారు. దీంతో ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరుపార్టీల వారిని తోసివేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, జెడ్పీటీసీ నాగరాణి, వైస్ఎంపీపీ అనిల్, రైతుసమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ లింగన్న, ఎంపీటీసీలు శ్రీనివాస్, మోహన్, ఉపసర్పంచ్ భూమన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సత్యం, వివిధ గ్రామాల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ డ్రైన్ పనులకు భూమిపూజ.. దండేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన రూ.47.1 లక్షల ఆర్అండ్బీ నిధులతో 600 మీటర్ల పొడవుతో చేపట్టే సైడ్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే దివాకర్రావు భూమి పూజ చేశారు. ఇక్కడ కూడా ఎంపీపీ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ కృష్ణ, ఎస్సైలు ప్రసాద్, లక్ష్మణ్లు ఇరుపార్టీల వారికి నచ్చజెప్పి పంపించారు. ఈ కార్యక్రమాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘పాప పరిహారం కోసమే బతుకమ్మ చీరల పంపిణీ’
బెల్లంపల్లి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తాను చేసిన పాపాలను పరిహరించుకునేందుకే రాష్ట్రంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం యాత్ర సాగించారు. స్థానిక కాంటా చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి.. హామీలకే పరిమితం అయ్యాయన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని సీఎం కేసీఆర్ను ఏమనాలని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే సింగరేణిలో భూగర్భ గనులు తప్ప ఓపెన్ కాస్టు ప్రాజెక్టులు ఉండవని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. 2014కు ముందు సింగరేణి వ్యాప్తంగా 40 భూగర్భ గనులు, 8 ఓపెన్కాస్టులు ఉండగా, రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ గనుల సంఖ్య 20కి పడిపోయిందని, ఓపెన్కాస్టుల సంఖ్య 19కి పెరిగిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఓసీలు తెరిచి కార్మికుల సంఖ్య తగ్గిస్తోందని విమర్శించారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇస్తామని ఏడేళ్ల క్రితం చెప్పిన కేసీఆర్.. ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును కట్టి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఆ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టికూడా తీయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసిన ప్రాణహిత ప్రాజెక్టును లేకుండా చేసి, రైతాంగాన్ని కేసీఆర్ వంచించారని ఆరోపించారు. -
Photo Feature: బతుకమ్మ చీరలను మూటలు కట్టేందుకు వాడుతున్న మహిళలు
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను లబ్ధిదారులు వివిధ పనుల కోసం వినియోగిస్తున్నారు. కొంతమంది పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా చేల చుట్టూ కడుతుండగా.. మరికొందరు మూటలు కట్టేందుకు వాడుతున్నారు. శనివారం ధారూరు సంతకు వచ్చిన ఓ మహిళా రైతు బతుకమ్మ చీరల్లో ఆకు కూరలు మూట కట్టి తీసుకువచ్చింది. ఇదేమని ప్రశ్నించగా.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాలిస్టర్ చీరలు కట్టుకునేలా లేవని, మూడేళ్లుగా వీటిని పొలం వద్ద బెదుర్లు పెట్టేందుకే వినియోగిస్తున్నామని తెలిపారు. – ధారూరు (వికారాబాద్) -
పంట చేలకు పరదాలుగా బతుకమ్మ చీరలు
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను రైతులు పంటల చుట్టూ పరదాలుగా కడుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో ఓ రైతు గ్రామంలో ఒక్కో బతుకమ్మ చీరను రూ.50 చొప్పున కొని పంటలకు అడవిపందుల నుంచి రక్షణకు పొలం చుట్టూ కట్టాడు. బషీరాబాద్ మండలానికి 11,316 చీరలు వస్తే రేషన్ డీలర్ల దగ్గర ఇప్పటి వరకు 20 శాతం మహిళలే తీసుకువెళ్లారు. దీంతో డీలర్ల దగ్గర చీరలు కుప్పలుగా మిగిలి పోయాయి. -
Telangana: కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ చీరలను రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చీరల పంపిణీ జరిగేలా చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు కోటి చీరల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ చీరల తయారీకి రూ.339.73 కోట్లు వెచ్చించింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 24 విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల జరీ అంచులతో (త్రెడ్ బోర్డర్) తెలంగాణ టెక్స్టైల్ విభాగం ఈ చీరలను తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సహకారంతో డిజైన్లను రూపొందించారు. అత్యుత్తమ ప్రమాణాలతో చీరలను ఉత్పత్తి చేశారు. రెండు విభిన్న పొడవుల్లో చీరలను తయారు చేయించగా, ఇందులో ఆరు మీటర్ల చీరలు 92 లక్షలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవైన చీరలు ఎనిమిది లక్షలు తయారు చేయించినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి, 18 ఏళ్లు పైబడిన మహిళలకు అందజేయనున్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో వెలుగు: కేటీఆర్ తెలంగాణ ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక ఇచ్చేందుకు 2017లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. గురువారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీతో భరోసా వచ్చిందన్నారు. నేతన్నల వేతనాలు రెట్టింపు కావడంతో పాటు కార్మికులు తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితికి చేరుకున్నారని తెలిపారు. నేత కార్మికులు ఏడాది పొడవునా ఉపాధి పొందేందుకు ఈ పథకం దోహదం చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న నేత కార్మికులను ఆదుకునేందుకు సొంత రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ వంటి విధానాలతో వారి ఉపాధిని క్లిష్టతరం చేస్తోందన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇదీ చదవండి: టెర్రర్ ఫండింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు -
30 రంగులు.. 240 డిజైన్లు.. కోటీ 18 లక్షల బతుకమ్మ చీరలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు కోటికి పైగా చీరలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ అవతరణ తర్వాత ప్రభుత్వమే మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలను తీరొక్క రంగుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు రాష్ట్ర చేనేత శాఖ తెలిపింది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించిన చీరలను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మహిళలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, చీరల కోసం ఈ ఏడాది రూ.340 కోట్లను వెచ్చించినట్లు తెలంగాణ హ్యాండ్లూమ్ శాఖ తెలిపింది. 30 రంగుల్లో, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో పాటు 800 కలర్ కాంబినేషన్లతో తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో చేయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఒక కోటీ 18 లక్షల చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్: మాజీ సీఎం కుమారస్వామి -
ముందస్తుగా బతుకమ్మ చీరల ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు ఈ యేడు ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు వచ్చాయి. తొలివిడతగా రూ.140.80 కోట్ల విలువైన 4.40 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను సోమవారం టెస్కో అధికారులు సిరిసిల్ల నేతన్నలకు అందించారు. ఈమేరకు సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీలు(మ్యాక్స్), చిన్న తరహా యూనిట్ల(ఎస్ఎస్ఐ) యజమానులకు ఆర్డర్లు సిద్ధమయ్యాయి. ఈసారి బతుకమ్మ పండుగకు చీర, జాకెట్(పీస్)లను వేర్వేరుగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. చీరకు బ్లాక్ రోటోవార్ప్తో డిజైన్ చేయగా.. జాకెట్ను మాత్రం వేరుగా డిజైన్ చేశారు. గతంలో మీటరు బతుకమ్మ చీరల బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 ఇవ్వాలని టెస్కో అధికారులు నిర్ణయించారు. బ్లాక్ రోటోవార్ప్తో 2020 నాటి డిజైన్ను ఈ ఏడాది మరోసారి అమలు చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా ప్రతీ మీటరుకు ఒక్క రూపాయి ధర తగ్గించారు. చీరల్లో 240 రకాల డిజైన్లను రూపొందించి అందులోనే మార్పులు చేశారు. కాగా, బతుకమ్మ చీరల బట్ట ధరను ఒక్క రూపాయి తగ్గించడంపై నేతన్నల్లో నిరాశ నెలకొంది. గతేడాది మీటరు బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బతుకమ్మ చీరల పంపిణీ ఫోటోలు
-
బతుకమ్మ చీరల పంపిణీ బాధ్యత కలెక్టర్లకు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరలు పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చీరలు పంపిణీ చేయాలా లేక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ, వార్డు కేంద్రాల్లో పంపిణీ చేయాలా అనే నిర్ణయాన్ని కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ వెల్లడించారు. బతుకమ్మ చీరలు ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు సరఫరా కాగా, అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ/ వార్డు కమిటీ ద్వారా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి, గ్రామ మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది. మున్సిపల్ వార్డు స్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలరు సభ్యులుగా ఉండే కమిటీ చీరలు పంపిణీ చేస్తుంది. -
Sircilla: సాంచాల సవ్వడి షురూ..
ఇతడి పేరు రాజమౌళి. సిరిసిల్లలోని సుందరయ్యనగర్లో పవర్లూమ్ కార్మికుడు. భార్య అనసూర్య బీడీ కార్మికురాలు. పది రోజులపాటు ఆసాముల సమ్మెతో రూ.3,500 వరకు వేతనం కోల్పోయాడు. మూడు రోజుల కిందట సమ్మె ముగియడంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి మొదలైంది. ఇప్పుడు చీరల ఉత్పత్తి ద్వారా వారానికి రూ.4 వేల వరకు వేతనం పొందనున్నాడు. ఒక్క రాజమౌళే కాదు.. కార్మిక క్షేత్రంలోని సుమారు 20 వేల మంది కార్మికుల జీవన స్థితి ఇది. సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల నేతన్నలకు తయారీ ఆర్డర్లు అందించింది. గతానికి భిన్నంగా ఇప్పుడు సిరిసిల్ల వస్త్రోత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పాత మరమగ్గాలకు (పవర్లూమ్స్) డాబీలను, జకార్డులను అమర్చి ఆధునిక హంగులతో, నేటితరం మహిళలు కోరుకునే డిజైన్లతో బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారు. ఆధునిక హంగులతో.. భూటకొంగుతో, బార్డర్ లైనింగ్తో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. వస్త్ర పరిశ్రమలో 29,680 మరమగ్గాలు ఉండగా.. ఇప్పటికే 14 వేల మగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల మరమగ్గాలపై చీరల ఉత్పత్తి ఐదేళ్లలో ఎంతోమార్పు.. నేతన్నల వస్త్రోత్పత్తి నైపుణ్యాన్ని ఏటేటా జౌళిశాఖ మెరుగు పరుస్తోంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిన తొలిఏడాది 2017లో 52 రంగుల్లో కోటి చీరలను రూ.280 కోట్లతో ఉత్పత్తి చేశారు. 2018, 2019లో 100 రంగుల్లో కోటి చీరలు తయారు చేశారు. 2020లో 225 రకాల బతుకమ్మ చీరలను అందించారు. ఈ ఏడాది భూటకొంగుతో ఉత్పత్తి చేస్తుండగా.. కొత్త డిజైన్లలో లైనింగ్తో నవ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. 136 మ్యాక్స్ సంఘాలకు, 138 చిన్న తరహా పరిశ్రమలకు, టెక్స్టైల్ పార్క్లోని 70 యూనిట్లకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో 20 వేల మంది సిరిసిల్ల నేతన్నలకు ఆరు నెలలపాటు చేతినిండా పని లభిస్తుంది. కార్మికులకు మెరుగైన వేతనాలు అందనున్నాయి. ఇక్కడ చదవండి: కరోనా ఎఫెక్ట్; మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగం! ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది! -
తోటకు కంచెగా బతుకమ్మ చీరలు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలు ఓ గ్రామంలో తోటకు కంచెగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంటి వద్ద తోటను పశువులు పాడుచేయకుండా ఉండడానికి బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా, గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోకుండా అలాగే ఉంచి ఇలా ఉపయోగించినట్లు తెలిపాడు. కాగా నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘బతుకమ్మ చీరలు’పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 17న మొదలయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో చీరల పంపిణీని చేస్తున్నారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశారు. జిల్లాలలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. -
బతుకమ్మ చీరలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘బతుకమ్మ చీరలు’పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ నెల 17న మొదలయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ఆలోపే చీరల పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశారు. క్షేత్రస్థాయిలో చీరల పం పిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించగా, గ్రామ కార్యదర్శులు, రేషన్షాప్ డీలర్లు, సెర్ప్, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో లబ్ధిదారులకు అందజేస్తారు. పంపిణీలో కోవిడ్ నిబంధనలు పాటించాలని కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 287 డిజైన్లతో చీరలు బతుకమ్మ చీరలను ఆకర్షణీయమైన రంగుల్లో బంగారు, వెండి జరీ అంచులతో, 287 డిజై న్లతో 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు తో తయారు చేశారు. సాధారణ చీరలను 6.30 మీటర్లు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని వయోవృద్ధులైన మహిళల కోసం 9 మీటర్ల పొడవైన చీరలను తయారు చేశారు. బతుక మ్మ చీరలకు బహుళ ఆదరణ లభిస్తుండటం తో వీటికి బ్రాండింగ్ ఇవ్వాలని ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని టెస్కో విక్రయ కేంద్రాల్లోనూ వీటిని విక్రయించాలని నిర్ణయించారు. బతుకమ్మ చీరల స్టాక్ ను జిల్లాలకు చేరవేశామని, పంపిణీ సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్ను తట్టుకునేందుకు టెస్కో వద్ద 1.50 లక్షల చీరల బఫర్ స్టాక్ ఉందన్నారు. మరమగ్గాల కార్మికులకు ఉపాధి సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్లో 26 వేలకుపైగా మరమగ్గాలపై పనిచేస్తున్న సుమారు 15 వేల మంది కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ ద్వారా ఉపాధి లభించింది. గతంలో నెలకు రూ.8వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం పొందిన కార్మికులు ప్రస్తుతం రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్జిస్తున్నారు. బతుకమ్మ చీరలను డిజైన్లలో తయారు చేసేందుకు మరమగ్గాల యజమానులు మూడు వేలకుపైగా డాబీలు కొనుగోలు చేసి ఆధునికీకరణ సాధించారు. స్కూల్ యూనిఫారాలు, అంగన్వాడీ, ఐసీడీసీ సిబ్బందికి అందచేసే చీరలు, కేసీఆర్ కిట్ చీరలు కూడా మరమగ్గాలపైనే తయారు చేస్తున్నారు. సంవత్సరం లబ్ధిదారులు ఖర్చు (రూ.కోట్లలో) 2017 95,48,439 222 2018 96,70,474 280 2019 96,57,813 313 2020 కోటి మంది 317.81 -
మాకెందుకియ్యరు? చీరలు..
సాక్షి, పరిగి: బతుకమ్మ చీరల కొరత అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. చీరల పంపిణీలో ప్రభుత్వం ఈసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. దీంతో చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబంలోని 18 ఏళ్లు నిండిన మహిళలకు చీర అందజేస్తామని సర్కారు ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాకు 3.11 లక్షల చీరలు అవసరమని అధికారులు నివేదిక ఇచ్చారు. కానీ 2.11 లక్షల చీరలు మాత్రమే గోదాంలకు చేరాయి. వీటిని ఆయా గ్రామాలకు పంపిణీ చేసి.. లబ్ధిదారులకు అందజేస్తున్నారు. సర్పంచుల తంటాలు.. జిల్లాకు రావాల్సిన చీరల్లో 30 శాతం తక్కువగా పంపిణీ చేశారు. ఈ గణాంకాల ఆధారంగానే మండలాలు, గ్రామాలకు 70శాతం చీరలు అందజేశారు. 300 చీరలు ఇవ్వాల్సిన గ్రామానికి 200, 3 వేల చీరలు ఇవ్వాల్సిన పంచాయతీకి 2వేల చీరలు ఇచ్చారు. మిగతావి త్వరలో వస్తాయని అధికారులు చెప్పారు. ఈ హామీతో ఆర్భాటంగా పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించిన సర్పంచ్లు, రేషన్ డీలర్లు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు చీరలు అందనివారికి సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు. కొందరికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోవటంపై పేద మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈవిషయమై సర్పంచ్ల వద్ద పేచీ పెడుతున్నారు. గ్రామాల్లో మెజార్టీ సర్పంచ్లు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో దీనిపై నోరు మెదపడం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కో గ్రామంలో 50పైగా ఆహార భద్రత కార్డులు రద్దయ్యాయి. వీరికి సంబంధించి చీరలు రాలేదు. ప్రస్తుతం ఇది కూడా ఓ సమస్యగా మారింది. మిగతావి వస్తాయా...రావా..? గ్రామాలకు 30 శాతం చీరలు తక్కువగా రావడంతో మిగతా చీరలు వస్తాయా..? రావా..? అని మహిళల్లో అయోమయం నెలకొంది. ఒక వేళ వచ్చినా.. పండగ లోపు వస్తాయా.. పండగయ్యాక వస్తాయా.. తెలియక పంపిణీ బాధ్యతలు తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు దిక్కుతోచకున్నారు. తమను నిలదీస్తున్న లబ్ధిదారులకు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్నారు. కొరతను దృష్టిలో పెట్టుకుని మూడు చీరలు ఇవ్వాల్సిన ఇంటికి రెండు చీరలు ఇస్తున్నారు. మిగతాది స్టాక్ వచ్చాక ఇస్తామని సర్ది చెబుతున్నారు. ఒకేసారి ఇవ్వాల్సింది ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన చీరల్లో కోత పెట్టడం సర్పంచులు, డీలర్లకు తలనొప్పిగా మారింది. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా చీరలన్నీ ఒకేసారి ఇస్తే బాగుండేది. కొందరికి ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకపోవడంతో మమ్మల్ని తప్పుబడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన చీరలు పంపిణీ చేస్తే అందరికీ అందజేస్తాం. – నర్సింహ, సర్పంచ్, రూప్ఖాన్పేట్ రెండు రోజుల్లో వస్తాయి మండలానికి ఇవ్వాల్సిన చీరల్లో 30శాతం తక్కువగా వచ్చాయి. ఈ లెక్కన గ్రామాల వారీగా 30 శాతం తగ్గించి చీరలు పంపిణీ చేశాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజుల్లో మిగతా చీరలు కూడా వస్తాయి. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి పండుగలోపే చీరలు వచ్చేలా చూస్తాం. – అనురాధ, తహసీల్దార్ -
బతుకమ్మ చీరలు మాకొద్దు
సాక్షి, మునిపల్లి(అందోల్): బతుకమ్మ చీరలు మా కొద్దు అంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా చౌర స్తాలో కాలనీవాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రేషన్ డీలర్ను బుదేరా చౌరస్తాకు సపరేట్గా ఏర్పాటు చేయాలని నాలుగు నెలలుగా అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అధికారుల తీరుపై మండిపడ్డారు. రేషన్ డీలర్ షాపును ఏర్పాటు చేసేంతవరకు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలు, వివిధ రకాల మొక్కలను కూడా తీసుకోబోమని నినాదాలు చేశారు. దీంతో తహసీల్దార్ సువర్ణ రాజుకు అక్కడికి చేరుకుని నిరసన కారులతో మాట్లాడి రేషన్ డీలర్ను బుదేరా చౌరస్తాకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం విరమించారు. అనంతరం మహిళలు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. -
ఏంది ఈ రోడ్డు ? ఎలా వెళ్లేది !
సాక్షి, భీమ్గల్(నిజామాబాద్) : మండలంలోని సంతోష్నగర్ తండాలో నీటి లీకేజీ కారణంగా ప్రధాన రహదారి దెబ్బ తినడంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన కలెక్టర్ రామ్మోహన్రావుతో కలిసి కారులో బయల్దేరారు. అయితే, తండా వద్దకు రాగానే రోడ్డంతా దెబ్బతిని బురదమయం కావడాన్ని గమనించిన మంత్రి.. వాహనాన్ని ఆపి కిందికి దిగారు. రోడ్డు ఇలా కావడంపై సర్పంచ్ ఎంజీ నాయక్ను ప్రశ్నించారు. పక్కనే ఉన్న భగీరథ పైపులైన్ లీకేజీ కారణంగా నీరు రోడ్డుపై ప్రవహించి బురదమయంగా మరుతోందని సర్పంచ్ తెలిపారు. దీంతో ఆయన అక్కడి నుంచే ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి వెంటనే రోడ్డును సరిచేయాలని ఆదేశించారు. -
ఆడపడుచులకు బతుకమ్మ కానుక
సాక్షి, పాలమూరు: ఆడపడుచులంతా కొత్త దుస్తులు ధరించి బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని న్యూ గంజ్, బండ్లగేరి, పాత పాలమూరు వార్డుల్లో మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరలను కలెక్టర్ రొనాల్డ్రోస్తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేద మహిళ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక అన్నారు. ఇందుకనుగుణంగా గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా మహిళలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. అలాగే పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కు, వికలాంగుల పింఛన్ రూ.1,500 నుంచి రూ.3,016లకు పెంచామన్నారు. తాగునీరు, సాగునీరు సమస్యలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులకు లబ్ధిచేకూర్చడంతోపాటు పంటల సాగులో ఇబ్బందులు తొలిగాయన్నారు. పేదపిల్లల వివాహం కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్ప త్రుల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, పుట్టిన బిడ్డకు అవసరమయ్యే వస్తువుతో కేసీఆర్ కిట్టు అందిస్తున్నామన్నారు. వీటిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్, మహబూబ్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 16,678 మందికి చీరల పంపిణీ పాలమూరు: మహబూబ్నగర్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఇంకా జిల్లాలో ఏడు మండల కేంద్రాలు, ఆయా మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేయాల్సి ఉంది. సోమవారం 6,857 చీరలు పంపిణీ చేయగా.. మంగళవారం 9,821 చీరలు అందించారు. రెండు రోజుల్లో కలిపి జిల్లాలో 16,678 మంది మహిళ లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు. రాజాపూర్, దేవరకద్ర, చిన్నచింతకుంట, మూసాపేట, హన్వాడ, నవాబుపేట, కోయిలకొండ మండలాల్లో బుధవారం నుంచి ప్రారంభం చేయనున్నారు. బాలానగర్ మండలంలో 220, జడ్చర్లలో 6,378, భూత్పూర్లో 1,150, గండీడ్లో 30, మహబూబ్నగర్ అర్బన్ పరిధిలో 5,498, మహబూబ్నగర్ రూరల్లో 110, మిడ్జిల్లో 2,607, అడ్డాకుల మండలంలో 685 మందికి చీరలను అందజేశారు. జిల్లాలో మొత్తం 2.98 లక్షల చీరలను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల 28 వరకు జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగనుంది. -
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సాక్షి, మెదక్: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వితంతవులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని ప్రశంసించారు. అంగన్వాడీల ద్వారా మాత, శిశువులకు పోషక ఆహారాన్ని ఇస్తున్నామని తెలిపారు. రేపటి భావిభారత పౌరుల నిర్మాణానికి పోషకాహారం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. సంగారెడ్డి: ఆందోల్, జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్లు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం జోగిపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోల్ మండలానికి చెందిన 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. -
ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్
సాక్షి, మహేశ్వరం: తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నగామారి దసరా పండుగకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చి గౌరవిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం పోతర్ల బాబయ్య ఫంక్షన్హాల్లో ఆమె జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ హరీష్తో కలిసి ప్రభుత్వం అందజేసిన చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. దసరా పండుగను ఆనందంగా జరుపుకోవడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచు కు బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు తీరోక్క పూలతో మహిళలు బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారని తెలియజేశారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోటి 3 లక్షల బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుందన్నారు. జిల్లాలో 6,65, 686 చీరలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో చేనేత కార్మికులకు అన్నివిధాలుగా ప్రోత్సహించి, వారికి ఉపాధి ఆవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరలను తయారు చేయించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి సహకరించాలని కోరారు. మహిళా సంక్షేమం కోసం కృషి సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం చొరవ చూపలేదని విమర్శించారు. మహిళలందరికీ దసరా కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 100 రకాలు, పది రంగుల చీరలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని ఇన్ చార్జి కలెక్టర్ హరిష్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణలో మహిళలు వైభవంగా నిర్వహించే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ప్రభుత్వం 100 రకాలు, 10 రంగుల్లో బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు వివరించారు. రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేస్తామన్నారు. అంతకు ముందు అతిథలు జ్యోతి ప్రజ్వళన చేసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ప్రశాంత్కుమార్, ఆర్డీఓ రవీందర్రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితానాయక్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కూన యాదయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, మహిళా సమాఖ్య ఏపీఎం సత్యనారాయణ, మహేశ్వరం సర్పంచ్ ప్రియంక ఉన్నారు. బాగా చదువుకుంటున్నారా..? మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగుల్దోని తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతకు ముందు ఆమె టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులకు గణితం బోధించారు. వారితో ఎక్కాలు చెప్పించారు. బాగా చదువుకుంటున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. పాఠ్యంశాల్లోని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. విద్యాశాఖ మంత్రి అయిన సబితారెడ్డి టీచర్ అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సర్పంచ్కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతానాయక్, ఎంపీడీఓ నర్సింహ, ఎంఈఓ కృష్ణ, సర్పంచ్ మెగావత్ రాజు నాయక్, ఉప సర్పంచ్ జగన్ ఉన్నారు. -
పథకాల అమల్లో రాజీ లేదు
సాక్షి, సిద్దిపేట: కరువు కాటకాలు వచ్చినా.. రాష్ట్రంలో ఆర్థిక మాధ్యం ఏర్పడినా, కేంద్రం రాష్ట్రానికి అందించాల్సిన నిధలకు కోతపెట్టినా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తే లేదని, వీటి అమలులో రాజీపడమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట పట్టణాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అలాగే ఉమ్రాకు వెళ్లే 40 మంది ఇమామ్, మౌజమ్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో హరీశ్రావు మాట్లాడారు. తెలంగాణ జీవన చిత్రానికి నిదర్శనం బతుకమ్మ పండుగ అన్నారు. ఈ పండగ సందర్భంగా ఎంతటి పేదవారైనా తమ ఆడపడుచులకు కొత్త చీరె కొని ఇస్తారని, కొత్త చీరెకట్టుకొని బతుకమ్మను పట్టుకొని వెళ్లే ఆడపడుచులు మురిసి పోతారని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బతుకమ్మ పండుగకు కొత్త చీరెలను పంపిణీ చేసి, ఆడపడుచులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా మారారని హరీశ్ అన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల బతుకు మార్చేందుకు బతుకమ్మ చీరెల తయారీ బాధ్యత వారికి అప్పగించామన్నారు. విపక్షాల విమర్శలు శోచనీయం రాష్ట్రంలో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంటే అభినందించాల్సిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణలో మసీదుల నిర్వాహణ కష్టంగా మారిన రోజుల్లో నేను అండగా ఉంటానని కేసీఆర్ భరోసా కల్పించారని చెప్పారు. దీనిలో భాగంగానే మౌజమ్, ఇమామ్ల భృతిని రూ. 5వేలకు పెంచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి మగ్గానికి అండగా ఉంటాం : కేటీఆర్
సాక్షి, నల్లగొండ : చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. సోమవారం ఆయన నల్గొండ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో చేనేతకు చేయూత ఇచ్చేందుకు కోటి చీరల పంపిణీ జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను అందిస్తున్నామని చెప్పారు. కోటి చీరలను నాణ్యతతో నేసి ఆడబిడ్డలకు అందిస్తున్న నేతన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మగ్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (చదవండి : తీరొక్క కోక.. అందుకోండిక!) ‘బతుకమ్మలాంటి పండుగకు తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను అందిస్తున్నాం. నచ్చిన చీరలు తేవడం భర్త వల్ల కానే కాదు. కానీ ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేతన్నలు చాలా చక్కని చీరలు తయారు చేశారు. పెద్ద మొత్తంలో చీరల పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 2001, 2002 సంవత్సరాల సమయంలో పోచంపల్లిలో ఏడు మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి ఉద్యమనాయకుడు, నేటీ సీఎం కేసీఆర్.. వారికి సహాయం చేయ్యండి.. బతుకు మీద భరోసా కల్పించాలని అడిగితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వయనా కేసీఆరే జోలెపట్టుకుని డబ్బులు అడిగి.. ఏడు కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున సహాయం చేశారు’ అని గుర్తుచేశారు. నేతన్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేత కార్మికులకు చేనేత మిత్ర పేరుతో 50శాతం సబ్సిడీ, నేతన్నకు చేయూత పేరుతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రతి సోమవారం అధికారులతో చేనేత దుస్తులు ధరించేలా నిర్ణయం తీసుకుని ఆచరిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలు ధరించాలని, తద్వారా నేతన్నలకు జీవనోపాధి కల్పించిన వాళ్లం అవుతాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మినీ ట్యాంక్బండ్ ఏర్పాటుకు రూ.35 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్కు నల్లగొండ జిల్లా మీద ఎనలేని ప్రేమ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ చొరవతోనే నల్లగొండలో ఒక మెడికల్ కాలేజ్, సూర్యాపేటలో ఒక మెడికల్ కాలేజ్, భువనగిరిలో ఏయిమ్స్ మంజూరయ్యాయని చెప్పారు. దండు మల్కాపురంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు అవుతుందన్నారు. మిర్యాలగూడ దామరచర్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఉదయ సముద్రంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు 35 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. బతుకమ్మ చీరలు.. ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన కానుక : జగదీశ్ రెడ్డి ఎరరూ అడక్కపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందించి గౌరవిస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం చీరల పంపిణీ జరగడం లేదన్నారు. చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు, కార్మికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బూతాన్ని తరిమి కొట్టేందుకు కేసీఆర్ తీసుకున్న చొరవే మిషన్ భగీరథ రూపకల్పన అని మంత్రి జగదీశ్ అన్నారు. -
నేటి నుంచి బతుకమ్మ కానుకలు
సాక్షి, మహేశ్వరం: మహిళలకు సోమవారం నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. 28న వేడుకలు ప్రారంభం కానుండడంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేసేందుకు నిర్ణయించింది. ఈమేరకు గ్రామాల వారీగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన 6,65,686 మంది మహిళలను గుర్తించగా ఇప్పటికే 3,58,600 చీరలు జిల్లాకు చేరాయి. మొయినాబాద్ గోదాంలో 1,62,000, కందుకూరు మండలం కొత్తురులో 1,96,600 నిల్వ చేశారు. ఇంకా అవసరమైన 3,07,086 చీరలు త్వరలో వస్తాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. రంగురంగలు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, మహిళా సంఘాలు, రేష¯Œ డీలర్లు, బిల్ కలెక్టర్లు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలకు ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడేళ్లగా సర్కారు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మండలాల వారీగా పంపిణీ చేసేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. చీరల పంపిణీ ఇలా.. సోమవారం నుంచి 27వరకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొయినాబాద్ గోదాం నుంచి చేవెళ్ల, చౌదరిగూడ, శంషాబాద్, గండిపేట, శేరిలింగపల్లి, చందానగర్ ప్రాంతాలకు 37 డీసీఎం వాహనాల్లో చీరల తరలింపునకు అధికారులు ఏర్పాటు చేసి రూట్ అధికారులకు నియమించారు. ఒక డీసీఎంకు ఇద్దరు చొప్పున అధికారులకు ఇన్చార్జిలుగా నియమించారు. మొదట గ్రామీణ ప్రాంతంలో పంపిణీ పూర్తయ్యాక అర్బన్ మండలాలపై దృష్టిసారించనున్నారు. ఐదు రోజుల్లో పంపిణీ తంతంగాన్ని పూర్తి చేసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా తహసీల్దార్, పట్టణాలల్లో మున్సిపల్ కమిషనర్లు చీరల పంపిణీని పర్యవేక్షించనున్నారు. చీరల పంపిణీలో మంత్రి, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు. టెప్కో నుంచి టెప్కో నుంచి జిల్లాకు బతుకమ్మ చీరలు వచ్చాయి. సిరిసిల్ల పవర్లూమ్ చీరలను అందించనున్నారు. దసరా పండుగకు రెండు నెలల ముందు నుంచే బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మకు జిల్లాలో చీరలను పంపిణీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా రేషన్కార్డులో పేరున్న ఉన్న ప్రతి మహిళన్నివ్వనున్నారు. జిల్లాలో దాదాపు 943 రేషన్ షాపులు ఉన్నాయి. ఇప్పటికే తహసీల్దార్లు, సివిల్ సప్లయ్ అధికారులు, వీర్వోలు ఇతర అనుబంధ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బతుకమ్మ చీరలు స్టాక్ పాయింట్లు... జిల్లాలోని మొయినాబాద్లోని మార్కెట్ కమిటీ గోదాంలో, కందుకూరు మండలం కొత్తురులో ఉన్న గోదాంలో చీరలను భద్రపరిచారు. జిల్లాలో చేవెళ్ల, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కందుకూరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. హాజరుకానున్న మంత్రి మహేశ్వరం, కందుకూరు మండలాల్లో బతుకమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదతరులు హాజరు కానున్నారు. మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాలులో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు, కందుకూరు మండల కేంద్రంలో 2 గంటలకు బతుకమ్మ చీరలను పంపిణీని మంత్రి తదితరులు ప్రారంభించనున్నారు. అంతా సిద్ధం చేశాం.. జిల్లాలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు చీరలు పంపిణీ చేస్తాం. మొత్తం 6,65,686 మందికి అందజేస్తాం. ఇప్పటి వరకు జిల్లాకు 3,58,600 చీరలు వచ్చాయి. మిగతావి త్వరలో రానున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి బతుకమ్మ చీరల పంపిణీని విజయవంతంగా పూర్తి చేస్తాం. మొయినాబాద్, కందుకూరు మండలం కొత్తూరులో ఉన్న గోదాంల నుంచి చీరలను ఆయా మండలాలకు తరలిస్తాం. రేషన్ దుకాణాల వద్ద బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. – ప్రశాంత్కుమార్, డీఆర్డీఏ పీడీ -
23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి బతుకమ్మ చీర ల పంపిణీ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. 18 ఏళ్లకుపైగా వయసు కలిగి, తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీర అందిస్తామన్నారు. 1.02 కోట్ల మంది అర్హులైన మహిళలకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్ పాల్గొన్నారు. -
కోటి బతుకమ్మ చీరల పంపిణీ : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 23 నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి చీరలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం రూ. 313 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. 10 లక్షల వరకు 9 మీటర్ల చీరలు.. 6 మీటర్లతో 90 లక్షల చీరలు తయారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక బతుకమ్మ చీరలు మార్కెట్లో సైతం దొరికేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టంలోని కోటి మంది మహిళలకు చిరు కానుక అందివ్వనున్నామని, ద్విముఖ వ్యూహంతో కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. వీటి తయారీ కోసం 24 వేల మగ్గాలు పనిచేశాయని, 18 ఏళ్ళు పై పడ్డ మహిళలు అందరికి పంపిణీ బతుకమ్మ చీరలతో నేతన్నలకు భరోసా ఇస్తున్నామని, వీటి పంపిణీ గ్రామ స్థాయిలో, పట్టణాల్లో.. వార్డు స్థాయిలో చేయనున్నట్లు తెలిపారు. 10 రకాల రంగులు, 10 రకాల డిజైన్లతో 100 కాంబినేషన్లో పంపిణీ చేస్తున్నామని, 710 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరలకు ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. 23 నుంచి సాధ్యమైనంత వేగంగా పంపిణీ చేస్తామని, ఇతర రాష్ట్రాలకు మన చీరలు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ చీరలు ఓ బ్రాండ్ కాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. -
బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికార యంత్రాగం సిద్ధమైంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఆహార భద్రత కార్డుల ఆధారంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి జీహెచ్ఎంసీకి అందించింది. తీరొక్క రంగులతో కూడిన బతుకమ్మ చీరలను అందజేయనున్నారు. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలను అర్హులుగా గుర్తిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అర్బన్ పరిధిలో సుమారు 20 లక్షల మంది మహిళలను లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు. జాబితాలో నమోదు కాని అర్హులు ఎవరైనా ఉంటే వారికి సైతం చీరలు అందించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నెల 28 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్కిల్ వారీగా.. నగరంలో సర్కిల్ వారీగా బతుకమ్మ చీరలను కేటాయిస్తున్నారు. ఒక చీర 5.5 మీటర్లు, జాకెట్ 80 సెంటీమీటర్ల చొప్పున చీరలు తయారు చేశారు. తయారైన చీరలు, జాకెట్ స్టాక్ సైతం నగరంలోని గోదాములకు చేరుకుంది. వాటిని నగరంలోని మలక్పేట, యాకుత్పురా, చార్మినార్, నాంపల్లి, మెహిదీపట్నం, అంబర్పేట, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్, సరూర్నగర్, బాలానగర్, ఉప్పల్ పౌరసరఫరాల సర్కిళ్ల వారీగా కేటాయించారు. సర్కిల్లోని ఎంపికచేసిన ప్రాంతాల్లో చౌకధరల దుకాణాలకు సెంట్రల్ పాయింట్గా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం పంపిణీ చేసిన కేంద్రాల్లోనే ఈసారి కూడా బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుంది. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు. చీరల పంపిణీలో వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యమిస్తారు. లబ్ధిదారులకు ఏరోజు పంపిణీ చేస్తారో స్లిప్ల ద్వారా ముందస్తుగా తెలియజేస్తారు. -
బతుకమ్మ చీరలొచ్చాయ్..
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడచులకు బతుకమ్మ కానుకగా అందించే చీరలు జిల్లాకు చేరుకున్నాయి. రెండేళ్లుగా రేషన్కార్డు కలిగిన కుటుంబంలోని 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తోంది. ఈ ఏడాది కూడా అందించడానికి జిల్లాకు చీరలు సరఫరా చేస్తోంది. జిల్లాలో 3.01 లక్షల రేషన్కార్డులు ఉండగా 8.20 లక్షల యూనిట్లు ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 11 వేలు, అన్నపూర్ణకార్డులు 102 ఉండగా, రేషన్ దుకాణాలు 487 ఉన్నాయి. కార్డు దారుల్లో 18 సంవత్సరాలు పైబడిన మహిళలను గతంలోనే రెవెన్యూ సరఫరాల అధికారులు గుర్తించారు. పట్టణాల్లో మెప్మా, గ్రామాల్లో రేషన్ డీలర్ల ద్వారా చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మండలాల వారీగా ఆహార భద్రత కార్డులో మహిళల సంఖ్య.. మండలం పేరు రేషన్ దుకాణాలు 18 ఏళ్ల పైబడినవారు చిగురుమామిడి 27 14,823 చొప్పదండి 34 18,278 ఇల్లందకుంట 17 11,444 గంగాధర 38 18,355 గన్నేరువరం 14 8,099 హుజూరాబాద్ 37 23,879 జమ్మికుంట 33 24,077 కరీంనగర్ అర్బన్ 58 60,522 కరీంనగర్ 26 17,825 శంకరపట్నం 27 16,402 కొత్తపల్లి 23 18,597 మానకొండూరు 41 24,469 రామడుగు 30 17,867 సైదాపూర్ 25 14,665 తిమ్మాపూర్ 29 17,770 వీణవంక 28 17,355 మొత్తం 487 3,24,427 జిల్లాలో రేషన్ దుకాణాలవారీగా కార్డుల్లో ఉన్న వివరాల మేరకు మహిళలను గుర్తించనున్నారు. 3.01 లక్షల కార్డులు ఉండగా 3 లక్షలకుపైగా యువతి, మహిళలు ఉన్నారని సమాచారం. సదరు పర్యవేక్షణ బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించారు. మండల తహసీల్దార్లు, డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి మహిళలను, యువతులను గుర్తించనున్నారు. జిల్లాలో మొత్తం 3 లక్షల 25 వేలకు పైగా చీరెలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 2.50 లక్షలకుపైగా జిల్లాకు చేరుకున్నాయి. మిగతా చీరలు మరో వారం రోజుల్లో రానున్నాయి. అయితే ఈ చీరలను సెప్టెంబర్ మధ్య నెల నుంచి పంపిణీ చేయడానికి డీఆర్డీవో అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. రకరకాల రంగులు, డిజైన్లలో వస్తున్న చీరలను అధికారులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మైదానంలోని ఇండోర్ స్టేడియం గోదాంలో స్టోర్ చేస్తున్నారు. -
చీరలు వస్తున్నాయ్!
సాక్షి, రంగారెడ్డి : బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. రెండేళ్లుగా మహిళలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. మూడో ఏడాది కూడా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. చీరలను జిల్లాకు చేర్చుతోంది. వీటిని మొయినాబాద్, కందుకూరు మండలం కొత్తూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) గోదాముల్లో అధికారులు భద్రపరుస్తున్నారు. ఈ ఏడాది సుమారు ఐదు లక్షల చీరలు మహిళలకు అందజేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వచ్చేనెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండి.. ఆహార భద్రత కార్డు (రేషన్)లో పేరున్న ప్రతి మహిళకు ఒక చీర చొప్పున పంపిణీ చేస్తారు. రేషన్ కార్డుల ప్రకారం జిల్లాలో గతేడాది 6.59 లక్షల మంది మహిళలు ఉండగా.. వీరిలో 4.78 లక్షల మంది చీరలు అందుకున్నారు. మిగిలిన వారు తీసుకోలేదు. గతంతో పోల్చితే ఈసారి చీరలు తీసుకునే లబ్ధిదారుల సంఖ్య ఐదు శాతం పెరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు జిల్లాకు 2.93 లక్షల చీరలు వచ్చాయి. మిగిలిన చీరలు మరో వారం రోజుల్లో చేరుకుంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఖరారుకాని విధివిధానాలు.. బతుకమ్మ సంబరాలు వచ్చేనెల చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈలోగా మండలాలకు చీరల చేరవేత, లబ్ధిదారులకు పంపిణీ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలు రానున్నాయి. గోదాంల నుంచి ప్రతి మండలానికి తరలించేందుకు వీలుగా రూట్ ఆఫీసర్లను నియమించనున్నారు. అక్కడి నుంచి గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు చేరుస్తారు. రాష్ట్ర స్థాయిలో చీరల పంపిణీకి ప్రభుత్వం తేదీలు ఖరారు చేయనుంది. నిర్దేశిత తేదీల్లో రేషన్ దుకాణాల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. సిరిసిల్లలో పవర్లూంలో వీటిని తయారు చేస్తున్నారు. కాగా, గతంలో రెండుసార్లు పెద్దగా నాణ్యత లేవని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు తీసుకోలేదు. ఈ సారి ఎలా ఉంటాయో వేచి చూడాలి. -
పండుగకు ముందే బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఈ ఏడాది నిర్ణీత గడువులోగా లబ్దిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, గతేడాది ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మూలంగా చీరల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగ నాటికి చీరల పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో బతుకమ్మ చీరల కోసం రూ.320 కోట్లు విలువ చేసే 6.84 కోట్ల మీటర్ల వ్రస్తాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు సిరిసిల్లలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న మరమగ్గాలకు చీరల నేత అప్పగించారు. ఇప్పటివరకు 4.67 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగ్గా.. కోటి చీరలకు గాను 60 లక్షల చీరల తయారీ పూర్తయింది. జిల్లాల వారీ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటివరకు 25 లక్షల చీరలను సరఫరా చేయగా, ఈ నెలాఖరులోగా 50 లక్షల చీరలను జిల్లాలకు చేరవేస్తారు. ప్రత్యేక లోగోతో బతుకమ్మ చీరలు.. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగారు జరీ వర్ణం అంచుతో.. వృద్ధుల కోసం ఆరు గజాలు, మిగతా వారికి ఫ్యాన్సీ చీరలు తయారు చేస్తున్నారు. 80 రంగుల్లో ఉన్న చీరలకు జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (నిఫ్ట్) నిపుణులు డిజైనింగ్ చేశారు. ఏటా లక్షల సంఖ్యలో చీరల తయారీ జరుగుతున్న నేపథ్యంలో గద్వాల, పోచంపల్లి చీరల తరహాలో సిరిసిల్ల చీరలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సిరిసిల్ల చీరలకు ప్రాచుర్యం తెచ్చేందుకు బతుకమ్మ చీరలపై శిరిశాల లేదా శ్రీశాల పేరిట ప్రత్యేక లోగోను తయారు చేయాలని చేనేత శాఖ నిర్ణయించింది. మూడేళ్లలో రూ. 900 కోట్ల ఆర్డర్లు.. సిరిసిల్లలో వివిధ యాజమాన్యాల పరిధిలో 23 వేలకు పైగా మరమగ్గాలు ఉండగా, వీటిలో 17 వేలకు పైగా మగ్గాలపై బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. రోజుకు తొమ్మిది లక్షల మీటర్ల బతుకమ్మ చీరల వస్త్ర ఉత్పత్తి జరుగుతుండగా.. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు క్రమం తప్పకుండా వస్తున్నాయి. బతుకమ్మతో పాటు రంజాన్, క్రిస్మస్ కానుకలు, కేసీఆర్ కిట్లు, యూనిఫామ్లకు సంబంధించిన వస్త్ర ఉత్పత్తి ఇక్కడే జరుగుతోంది. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మూడేళ్లలో రూ.900 కోట్ల మేర ఆర్డర్లు అందాయి. 9,435 మంది కారి్మకులు బతుకమ్మ చీరల తయారీతో ఉపాధి పొందుతుండగా.. గతంలో వీరి నెలవారీ ఆదాయం రూ.8,000 లోపే ఉండేది. ప్రస్తుతం సగటున ఒక్కో కారి్మకుడికి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నట్లు చేనేత శాఖ అంచనా వేస్తోంది. -
బతుకమ్మ చీరల పంపిణీ షురూ..
సాక్షి,సిటీబ్యూరో: మహా నగరంలో బతుకమ్మ చీరల పంపిణీ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. నగరంలోని పలు కమ్యూనిటీహాళ్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో స్థానిక శాసన సభ్యులు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులు మీదుగా పేదమహిళలు, యువతులకు బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల సంక్షేమ, ఆభివృద్ధి పథకాలను ఏకరవు పెట్టారు. యాకుత్పురాలో ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మల్కాజిగిరి నియోజకవర్గం, వెంకటాపురం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవనం, ఆర్కేపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేరేడ్మెట్ కార్పొరేటర్ కె.శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూబ్లీహిల్స్ కార్మికనగర్ కమ్యూనిటీ హల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్, ఆల్విన్కాలనీ, వివేకానందనగర్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్లు జానకి రామరాజు, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఎం. లక్ష్మీబాయిలు పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తొలి రోజు ఎలాంటి అలజడి లేకుండా పంపిణీ కార్యక్రమంలో సాఫీగా సాగింది. మొదటి రోజు సుమారు 12 శాతం వరకు చీరల పంపిణీ పూర్తయినట్లు సమాచారం. 14.74 లక్షల మంది లబ్ధిదారులు... గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సుమారు 14.74 మంది లబ్థిదారులను అధికారులు గుర్తించారు. ఆహార భద్ర కార్డులను ప్రామాణికంగా తీసుకుంటే 11.14 లక్షల కుటుంబాలు ఉండగా అందులో హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో 5,69,645, శివారు ప్రాంతాలైన రంగారెడ్డి–మేడ్చల్ జిల్లాల అర్బన్ పరిధిల్లో సుమారు 5,45,110 కుటుంబాలు ఉన్నాయి. ఆహార భద్రత కార్డులో పేరుండీ 18 సంవత్సరాలు నిండిన యువతులు, వృద్ధ మహిళలు కూడా బతుకమ్మ చీరలకు అర్హులు. దీంతో హైదరాబాద్ జిల్లాలో 6.92 లక్షలు, మేడ్చల్అర్బన్ పరిధిలో 4.61 లక్షలు రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతలో 3.21 లక్షల లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. చీరల పంపిణీకి గాను హైదరాబాద్ జిల్లా పరిధిలోని 16 సర్కిళ్లలోని 632 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా అర్బన్లో 80 , మేడ్చల్లో 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే గోదాముల నుంచి పంపిణీ కేంద్రాలకు 60శాతం వరకు స్టాక్ చేరింది. 23 వరకు చీరల పంపిణీ... ఈనెల 23 వరకు బతుకుమ్మ చీరలు పూర్తి స్థాయిలో పంపిణీ చేసే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు పౌరసరఫరాల అధికారుల సహకార ం తీసుకుంటున్నారు. అందిరికీ అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాళ్లను పంపిణీ కేంద్రాలు నిర్ణయించారు. ప్రతిరోజు బతుకమ్మ చీరల పంపిణీకి లబ్దిదారులకు స్లిప్లను అందజేయనున్నారు. ఆయా స్లిప్లు అందుకున్నవారు బతుకమ్మ చీరల పంపిణీ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. మేడ్చల్ జిల్లాలో... సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కానుకల పంపిణీ లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. ఘట్కేసర్, మేడ్చల్ మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్ మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎంవీరెడ్డి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,21,068 బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని నిర్ణయించగా 3,90,614 చీరలు జిల్లాకు చేరాయి. తొలిరోజు 303 రేషన్ షాపుల పరిధిలో 83,658 మంది మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. బుధవారం ఒక్క రోజే 21.42 «శాతం చీరలను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ కౌటిల్య తెలిపారు. 500 మందికి క్రిస్మస్ కానుకలు... క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో బుధవారం 500 మంది క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. శామీర్పేట్ మండలం అలియాబాద్లో కీసర మేడ్చల్, శామీర్పేట్ మండలాలకు చెందిన వారికి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి , జిల్లా కలెక్టర్ఎంవీరెడ్డి చేతుల మీదుగా కానుకలు అందజేసినట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖ అధికారి విజయకుమారి తెలిపారు. మిగతా 500 కానుకలను గురువారం పంపిణీ చేస్తామన్నారు. -
బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. బుధవారం బతుకమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు 18 లక్షలకు పైగా లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్లో 6.92 లక్షలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 6.49లక్షలు, మేడ్చల్ జిల్లా పరి«ధిలో 4.87 లక్షలు మందిని అర్హులుగా గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలోని 16 సర్కిళ్లలోని 632 కేంద్రాల్లో ఆహార భద్రత కార్డులు ఉన్న లబ్దిదారులకు బతుకమ్మ చీరలు అందజేస్తారు. చీరల పంపిణీపై మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, డీపీఓలతో సమావేశం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ప్రతి సర్కిళ్లలోని ఎంపికచేసిన ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్, శాసన సభ్యుడు, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో చీరల పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం పంపిణీ చేసిన కేంద్రాల్లోనే ఈ ఏడాది కూడా చీరలు పంపిణీ చేయనున్నారు. అయితే ఏ కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందో ఆయా కేంద్రాల వివరాలను లబ్దిదారులకు సంబంధిత డిప్యూటి కమిషనర్ల ద్వారా తెలియజేయనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యం ఇస్తారు. పంపిణీ కేంద్రాల వద్ద తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించడంతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పంపిణీ కేంద్రాల సంబందిత రేషన్ డీలర్ల సమన్వయంతో పంపిణీ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ నెల 21 నుంచి 23 వరకు పూర్తిస్థాయిలో పంపిణీకి ప్రణాళికలు రూపొందించారు. లబ్దిదారులకు ఏరోజు పంపిణీ చేస్తారో స్లిప్ల ద్వారా ముందస్తుగా సమాచారం అందిస్తారు. -
19నుంచి బతుకమ్మ చీరలు
మహిళలకు బతుకమ్మచీరలు త్వరలో అందనున్నాయి. పండగ పూర్తయిన రెండు నెలల తర్వాత ఇప్పుడు చీరల పంపిణీ ఏమిటీ అనుకుంటున్నారా? అవును.. ఇది నిజమే. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 15వరకు మహిళలకు చీరలు అందజేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఆలోపు శాసనసభ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో అప్పట్లో పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. తాజాగా ఎన్నికలు ముగియడం, ఫలితాలు కూడా వెలువడడంతో ఇక బతుకమ్మ చీరలను 19 నుంచి పంపిణీ చేయనున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 19 నుంచి మహిళలకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వీలైనంత త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీపై ప్రకటన చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికల నియమావళి కారణంగా పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా చీరల పంపిణీకి అధికార యంత్రాంగం ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది.. 6.46 లక్షల మందికి చేకూరనున్న లబ్ధి.. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీని గతేడాది ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 18 సంవత్సరాల వయసు నిండి ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి యువతి, మహిళకు అధికారులు ఒకటి చొప్పున చీరలను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 557 గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లే మూడు సర్కిళ్లు, మున్సిపాలిటీల్లో ఒకేసారి పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో రేషన్కార్డుల్లో పేరున్న 6.46 లక్షల మంది మహిళలకు ఈ చీరలు అందనున్నాయి. ఇప్పటికే ఈ చీరలు వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాము ల్లో భద్రపరిచారు. కలెక్టర్ డీఎస్ లోకేశ్కుమార్ వద్ద ఫైల్ పెండింగ్లో ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటనతో చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భవనాల్లో పంపిణీ రేషన్ దుకాణాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో చీరల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్కారు బడులు, కమ్యూనిటీ హాళ్లు వేదికలుగా అందజేస్తారు. రేషన్ కార్డుల్లో పేరుండటంతోపాటు ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్/ఓటర్) తీసుకెళ్తే చీరలు పంపిణీ చేస్తారు. ఎంపీడీఓలు, సెర్ప్ ఏపీఓల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. గతేడాది విస్తృతంగా ప్రచారం చేసినా నాణ్యత లేదన్న కారణంతో చాలామంది మహిళలు చీరలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఈ సారైనా నాణ్యతగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు. -
కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత హయాంలో తెలంగాణలోని పది జిల్లాలను.. 31 జిల్లాలుగా పునర్విభజించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు జిల్లాలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలోని జిల్లాల సంఖ్య 33కు చేరుతుంది. ప్రగతి భవన్లో కేసీఆర్ ఆదివారం పంచాయతీరాజ్ అంశాలతోపాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకృష్ణారావు, వికాస్ రాజ్, స్మితా సభర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్ రావు, పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా 9355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది. నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో గ్రామాలన్నింటికీ అధికారులు ఉంటారని, వీరి ద్వారా గ్రామాభివృద్ధి, పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు కొత్తగ నియామకమైన గ్రామ కార్యదర్శులు, ఇప్పటికే ఉన్న పంచాయతీకార్యదర్శులతో కలిసి మొత్తం 12,751 వేల మంది గ్రామ కార్యదర్శులు, ఎంపిడివోలు, ఇవోపిఆర్డిలు, డిపిఓలు, డిఎల్పీఓలతో కలిపి ఈ నెల 27న ఎల్.బి. స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. అధికారులంతా మద్యాహ్నం 12 గంటల వరకు ఎల్.బి. స్టేడియం చేరుకుంటారు. మద్యాహ్న భోజన అనంతరం 2 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారభోపన్యాసం చేస్తారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు. 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సిఎస్ ను ఆదేశించారు. లబ్దిదారుల లెక్క తేలిన తర్వాత 2019-20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్ మాసం నుంచి పెన్షన్లు అందివ్వాలని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి మండలాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు. 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యేల ద్వారా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను తిరిగి ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిరోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు తిరిగి పాత పద్ధతిలోనే ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. -
చీరలే కాదు.. నగదూ ఉందేమో...!
‘బతుకమ్మ పండగ అయిపోయిందిగా..! బతుకమ్మ చీరలు ఇప్పుడెందుకు వచ్చాయ్...?’ అనేదేగా మీ ప్రశ్న..!! ‘‘ఇప్పుడెందుకొచ్చాయంటే.. ఆ పండగ అయిపోయింది, ఎన్నికల పండగొచ్చింది. చీరలను బహుమతిగా ఇచ్చి, ఓట్లను దండుకునేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది’’ అని, విపక్షాలు సమాధానమిస్తున్నాయి. మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే.. నిన్న (ఆదివారం) ఖమ్మంలో ఏం జరిగిందో చూడాల్సిందే. ఖమ్మంఅర్బన్: వైరాకు చెందిన డీసీఎం వ్యాన్ (టీఎస్04యూబీ3487) పెద్ద లోడ్తో హైదరాబాద్ వైపు నుంచి ఖమ్మం వెళుతోంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోగల మారుతి కాటెక్స్ లిమిటెడ్ వద్ద శనివారం రాత్రి 157 బండిల్స్ లోడయ్యాయి. ఒకొక్క బండిల్లో 160 చీరలు, 160 జాకెట్ ముక్కలు ఉన్నాయి. అన్ని బండిళ్లలో కలిపి మొత్తం సుమారుగా 25,120 చీరలు, జాకెట్లు ఉన్నాయి. కొత్తగూడెంలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో అన్లోడ్ చేసేందుకు ఈ వ్యాన్ బయల్దేరింది. (చీరలు, జాకెట్ ముక్కల వివరాలన్నీ వే బిల్లో ఉన్నాయి). లిఫ్ట్ ప్లీజ్... ఈ వ్యాన్, కూసుమంచి సమీపంలోకి వచ్చేసరికి డీజిల్ అయిపోయింది. కొంచెం దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ డీజిల్ నింపుకునేందుకని క్యాన్తో డ్రైవర్ కిందకు దిగాడు. అటుగా బైక్పై వెళుతున్న ఒకరిని లిఫ్ట్ అడిగాడు. ఆ బైక్పై బయల్దేరాడు. డ్రైవర్కు, ఆ బైక్వాలాకు మాటలు కలిశాయి. ‘‘వ్యాన్ ఎక్కడికి వెళుతోంది? ఆ లోడ్ ఏమిటి..?’’ అని, బైక్వాలా అడిగాడు. ‘‘అవి బతకుమ్మ చీరలు, జాకెట్ ముక్కలు. కొత్తగూడెం తీసుకెళ్తున్నా’’ అని డ్రైవర్ చెప్పాడు. ఆ బైక్వాలాకు బల్బ్ వెలిగింది. ఎన్నికలో ఓట్లు దండుకునేందుకే వాటిని టీఆర్ఎస్, ప్రభుత్వ పెద్దలు తరలిస్తున్నారేమోనని సందేహించాడు. డ్రైవర్కు అనుమానం రాకుండా వ్యాన్ నంబర్ తెలుసుకుని గుర్తుంచుకున్నాడు. అడ్డుకున్నారు... పెట్రోల్ బంక్ వద్ద డ్రైవర్ను దించిన తరువాత, టీడీపీ సానుభూతిపరుడైన ఆ బైక్వాలా.. టీడీపీ కూసుమంచి మండల నాయకుడు కోటేశ్వరరావుకు సమాచారమిచ్చాడు. ఆయన వెంటనే ఖమ్మంలోని జిల్లా నాయకులకు వ్యాన్ నంబర్ సహా వివరాలన్నీ చేరవేశాడు. వారు వీవీపాలెం సమీపంలో కాపుగాశారు. అది రాగానే ఆపేశారు. ఆ లోడ్ ఏమిటని డ్రైవర్ను ప్రశ్నించారు. ‘‘చీరలు ఉన్నాయి. సత్తుపల్లిలోని ఒక అడ్రసులో దింపమన్నారు’’ అని చెప్పాడు. డ్రైవర్ వద్దనున్న వే బిల్ చూశారు. కొత్తగూడెం మార్కెట్ కమిటీ గోదాం వద్దకు వెళుతున్నట్టుగా అందులో ఉంది. దీంతో, నాయకులకు అనుమానమొచ్చింది. పోలీసులకు, ఎన్నికల స్క్వాడ్ అధికారులకు, ఇతర పార్టీల (సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం) నాయకులకు సమచారమిచ్చారు. అందరూ వచ్చారు. చీరలే కాదు.. నగదూ ఉందేమో...! ‘‘ఓటర్లకు పంచేందుకే వీటిని టీఆర్ఎస్ నాయకులు తరలిస్తున్నారు. చీరల చాటున పెద్ద మొత్తంలో నగదు కూడా ఉండొచ్చు, తనిఖీ చేయాల్సిందే’’నని ఆందోళనకు దిగారు. ఎన్నికల స్క్వాడ్ అధికారులు, పోలీసులు వచ్చారు. ఆ వ్యాన్ను రఘునాథపాలెం పోలీస్ స్టేషన్కు తరలించాలనుకున్నారు. అది దూరంగా ఉండడంతో ఖమ్మం అర్బన్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఎన్నికల ప్రత్యేక స్క్వాడ్ బృందం, డీఆర్ఓ మదన్గోపాల్, నగర ఏసీపీ వెంకటరావు, ఖమ్మం అర్బన్ సీఐ సాయిరమణ, ఖమ్మం రూరల్ సీఐ రమేష్, రఘునాథపాలెం ఎస్సై క్రిష్ణ, ఖమ్మం అర్బన్ ఎస్ఐ మోహన్రావు, రఘునాథపాలెం డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఆర్ఐ శ్రావణ్కుమార్, వీఆర్ఓ గిరి, విపక్ష నాయకుల సమక్షంలో ఆ వ్యాన్లోని బండిల్స్ను పోలీసులు కిందకు దించారు. చీరులే ఉన్నాయి.. నగదు లేదు.. అనుమానమున్న బండిల్స్ను తెరిచారు. అధికారులు, నాయకులు పరిశీలించారు. వాటిలో బతుకమ్మ చీరలు మాత్రమే ఉన్నాయని, నగదు లేదని నిర్థారించుకున్నారు. వాటిని మళ్లీ లోడ్ చేయించా రు. పంచనామా తరువాత కొత్తగూడెం పంపిం చేశారు. ఆందోళనకు దిగిన నాయకులను ఏసీపీ వెంకట్రావ్ ఆధ్వర్యంలో పోలీసులు అర్బన్ స్టేషన్ లోకి తీసుకెళ్లారు. వారి జాబితాను రాసుకున్నారు. వ్యాన్ను అడ్డుకున్న వారిలో టీడీపీ నాయకులు గొల్లపూడి హరిక్రిష్ణ, చిరుమావిళ్ల నాగేశ్వరరావు, తోటకూరి శివయ్య, దుద్దుకూరి సుమంత్, కోలేటి రాధాక్రిష్ణ, ఏలూరి శ్రీనివాసరావు, జట్ల శ్రీను, కేతినేని హరిక్రిష్ణ, సీపీఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, సీపీఐ నాయకులు భాగం హేమంతురావు, పోటు ప్రసాద్, జానీమియా, దండి సురేష్, కాంగ్రెస్ నాయకులు చోటేబాబు, మనోహర్, మిక్కిలినేని నరేంద్ర తదితరులు ఉన్నారు. ఎన్నికల అధికారులు ఏమన్నారంటే... ‘‘ఈ వ్యాన్లోని బతుకమ్మ చీరలను ప్రభుత్వమే అన్నిరకాల పత్రాలతో కొత్తగూడెం గోదాముకు తరలిస్తోంది’’ అని, నగర ఏసీపీ వెంకట్రావ్, డీఆర్ఓ మదన్ గోపాల్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి అర్జన్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు కూడా ఒక ప్రకటనలో ఇదే విషయం స్పష్టం చేశారు. వాటి విలువ ఐదులక్షల లోపే... వ్యాన్లోని చీరల మొత్తం విలువ రూ.4.59 లక్షలుగా వేబిల్లో ఉంది. అన్ని రకాల పన్నులతో రూ.5.31లక్షలుగా అందులో ఉంది. ఎనిమిది గంటలపాటు హడావుడి వ్యాన్ను నాయకులు అడ్డుకున్నప్పటి నుంచి దానిని తిరిగి పంపించేంత వరకు దాదాపుగా ఎనిమిది గంటలపాటు హైడ్రామా నడిచింది. పరిశీలిస్తున్న నాయకులు, అధికారులు -
ఎన్నికల వేల నగదు పట్టివేత
సాక్షి, జోగులాంబ : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న నగదును తరలిస్తున్నారు. ఐజ మండలంలో తెల్లవారు జామున 5 గంటలకు ప్లైయిండ్ స్క్వాడ్ బృందం చేసిన తనిఖీల్లో ఐదు లక్షలను గుర్తించారు. ఐజ పట్టణానికి చెందిన షాలు అనే వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద ఏ డాక్యుమెంట్స్ లేని ఐదు లక్షలు రూపాయలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బతుకమ్మ చీరెల లారీని అడ్డుకున్న స్థానికులు ఖమ్మం : బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించిన బతుకమ్మ చీరెలను తీసుకెళ్తున్న లారీని స్థానికులు అడ్డుకున్నారు. బతుకమ్మ చీరెలు అని స్పష్టంగా రాసి ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు. కొత్తగూడెం చేరవేయమని చెప్పారని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. చౌటుప్పల్లో చీరెలను లోడ్ చేసినట్టు తెలుస్తోంది. -
బతుకమ్మచీరకు దూరం
సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో గ్రేటర్ పరిధిలోని దాదాపు 25 లక్షల మంది మహిళలు ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు బతుకమ్మ చీరలకు దూరం కానున్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో ఏదో విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆశించిన గ్రేటర్ టీఆర్ఎస్ నేతలకు నిరాశే మిగిలింది. బతుకమ్మ చీరల పంపిణీపై పలు సంశయాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలు తదితర పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భంగం వాటిల్లకుండా చీరల ప్యాకెట్లలో ముఖ్యమంత్రి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రి ఫొటోలతో కూడిన లేబుళ్లను తొలగించి చీరలు పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్కు వర్తమానం పంపించింది. సీఎం, మంత్రి ఫొటోలు తీసేస్తే ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలుండక పోవచ్చునని అంచనా వేసి ఇందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాంతోపాటు చీరల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులెవరూ జోక్యం చేసుకోరాదని, ప్రభుత్వోద్యోగుల ద్వారా మాత్రమే వీటి పంపిణీ చేయాలని సూచించింది. ఈనెల పదో తేదీలోగా చీరలన్నీ సంబంధిత గోడౌన్లకు చేరడంతోపాటు 12వ తేదీ నుంచి 17వ తేదీలోగా చీరల పంపిణీ పూర్తిచేయాలని పేర్కొంది. అందుకనుగుణంగా గ్రేటర్లోని జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, పట్టణ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ పంపిణీకి సంబంధించి తగిన ఏర్పాట్లకు సిద్ధమవుతుండగానే, బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వెలువడటంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. తెల్లరేషన్ కార్డుల్లో పేర్లున్న 18 సంవత్సరాల వయసు పైబడిన పేద మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ పేరిట ఉచిత చీరల పంపిణీని గత సంవత్సరం నుంచి చేపట్టడం తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో చీరలు పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వ ప్రయత్నం ఎన్నికల సంఘం ఆదేశాలతో బెడిసి కొట్టింది. 25 లక్షల మందికి దూరమైన లబ్ధి.. పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న వివరాల మేరకు, 18 సంవత్సరాల వయసునిండిన, తెల్లకార్డుల్లో పేర్లున్న మహిళలు గ్రేటర్ పరిధిలో 25.20 లక్షల మంది ఉంటారు. -
బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ అడ్డుకట్ట
సాక్షి, న్యూఢిల్లీ : బతుకమ్మ చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆదేశాలను అమలు చేయాలని ఈసీ లేఖలో స్పష్టం చేసింది. ఈ విషయంపై ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చాక బతుకమ్మ చీరెల పంపిణీపై రాజకీయ పార్టీల ఫిర్యాదులు అందాయన్నారు. ఆ ఫిర్యాదులను తాము కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపామని తెలిపారు. బతుకమ్మ చీరెల పంపిణీని నిలిపివేయాలని వారు ఫిర్యాదులో కోరారని పేర్కొన్నారు. రైతు బంధు చెక్కుల పంపిణీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. -
బతుకమ్మ చీరలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలి
-
చీరలెలా ఉన్నాయ్..
భీమ్గల్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పథకం అభాసుపాలు కాకుండా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఏడాది ఈ చీరల పంపిణీ వివాదాస్పదమైంది. నాణ్యత కొరవడిన చీరలను పంపిణీ చేసారని, చౌకబారు చీరలతో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల చీరలను తగుల బెట్టడం, ప్రతిపక్షాలు వీటిపై విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఏడు ఎటువంటి ఆరోపణలు రాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు అవకాశమివ్వకూడదని జాగ్రత్తగా పథక నిర్వహణ చేపట్టనుంది. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తం గా అన్ని మండలాలలో బతుకమ్మ చీరలను ఐదు రోజుల పాటు ప్రదర్శనకు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని మండలాలలో చీరలపై మహిళల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రతి మండలంలో ఐదు చోట్ల వీటిని ఉంచి తద్వారా వాటిపై మహిళల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకుగాను ప్రతి చోట ఒక రిజిస్టర్ను ఏర్పాటు చేసారు. చీరలను పరిశీలించిన వారు అభిప్రాయాలను, పేరు, ఫోన్ నెంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి చీరల ప్రదర్శన నిర్వహించి అభిప్రాయచాలు కోరతున్నారు. ఇందు కోసం ఈ నెల 5 నుంచి 10 వరకు గడువు నిర్ణయించింది. 10వ తేదీ అనంతరం మండలాలవారీగా మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై రాండమ్గా ఫీడ్బ్యాక్ను పైఅధికారులకు పంపిస్తారు. దీని ఆధారంగా చీరల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్డులో పేరుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఇవి కేవలం మహిళల అభిప్రాయం కోసం తీసుకువచ్చిన శాంపిల్ చీరలు మాత్రమే. ఇంకా బతుకమ్మ చీరలు రాలేదు. గత సంవత్సరం జిల్లాకు 5 లక్షల 13 వేల 739 చీరలు వచ్చాయి. అందులో 46 వేల చీరలు మిగలగా వాటిని తిరిగి పంపించాం. ఈ సంవత్సరం మరో రెండు శాతం పెరిగి ఉండచ్చు. – శ్రీనివాస్ డీపీఎం, ఐకేపీ కానుకలకు వెల కట్టవద్దు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకగా ఈ చీరలను అందిస్తోంది. ఇది ఆడపడుచుకు పుట్టింటి వారు ఇచ్చే కానుకగా భావించాలి. దీనికి వెల కట్టడం మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుంది. ప్రతి పక్షాలు ప్రతీది రాజకీయం చేసి ప్రజల్లో దిగజారిపోయాయి. ఈ బతుకమ్మ కానుకలు ఎంపీ కవితమ్మ కలల ప్రాజెక్టు. సగటు మహిళల ఆలోచనలకు ఆమె ప్రతిరూపం. – వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, బాల్కొండ -
చీరలెలా ఉన్నాయి?
నల్లగొండ టూటౌన్ : జిల్లాకు బతుకమ్మ చీరలు వచ్చాయి. బతుకమ్మ పండుగ కానుక కింద జిల్లాలో ఈ ఏడాది 5.07 లక్షల చీరలు అవసరం ఉంటాయని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రస్తుతానికి జిల్లాకు 1.08 లక్షల చీరలు చేరాయి. మిగతావి త్వరలో రానున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ చీరల తయారీలో నాణ్యత తీసుకుంది. వాటిపై మహిళలనుంచి ఫీడ్బ్యాక్ను తీసుకుంటోంది. అధికారులు జిల్లాలోని మున్సిపల్ పట్టణాల్లో ఎంపిక చేసిన చోట్ల చీరలను మహిళలకు చూపించి వారినుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జిల్లాకు చేరిన 1.08 లక్షల చీరలు తెల్లరేషన్, అంత్యోదయ తదితర కార్డుదారులకు బతుకమ్మ కానుక కింద చీరలు అందించనున్నారు. జిల్లాకు 5.07 లక్షలకు గాను ఇప్పటికే 1.08 లక్షల చీరలు వచ్చాయి. నల్లగొండ రెవెన్యూ డివిజన్కు సంబంధించి తిప్పర్తి గోదాములో 90 వేల చీరలు భద్రపరిచారు. మరో 18 వేల చీరలను దేవరకొండ డివిజన్కు సంబంధించి కొండమల్లేపల్లి గోదాములో ఉంచారు. మిర్యాలగూడ డివిజన్ కోసం అక్కడి గోదాములో పెట్టనున్నారు. మరో 15 రోజుల్లో జిల్లాకు అవసరమైన చీరలు చేరనున్నట్లు తెలిసింది. ఒక్కో చీరను టెస్కో నుంచి రూ.280కి కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. జేసీ నేతృత్వంలో కమిటీ జిల్లాలో మున్సిపల్ పట్టణాలతోపాటు గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ చీరల పంపిణీకి జేసీ నారాయణరెడ్డి నేతృత్వంలో నోడల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాస్థాయిలో జేసీ, చేనేత జౌళీశాఖ ఏడీ, మెప్మా పీడీ, హౌజింగ్ పీడీతోపాటు మరికొంత మంది అధికారులు ఉంటారు. అదే విధంగా డివిజన్ పరిధిలో ఆర్డీఓ నేతృత్వంలో, మండల స్థాయిలో ఎంపీడీఓ, గ్రామస్థాయిలో పంచాయతీ, వీఆర్వోల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బతుకమ్మ చీరల పంపిణీ సాఫీగా సాగేలా కమిటీలు పర్యవేక్షణ చేయనున్నాయి. మహిళలనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం ... గత ఏడాది జరిగిన సంఘటలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లాలోని మున్సిపాలిటీ పట్టణాల్లో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి బతుకమ్మ చీరలను మహిళలకు చూపించి వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఒక్కో పట్టణంలో ఐదు పాయింట్లు ఏర్పాటు చేసి మహిళలు వ్యక్తం చేసిన వారి అభిప్రాయాలను నోట్ బుక్లో రాసుకుంటున్నారు. కొన్నిచోట్ల మహిళలు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక్కో చోటుకు ఐదు చీరలను పంపించగా.. అన్నీ ఒకే మోడల్గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పండుగకు ముందు చీరలు పంచుతాం మహిళలకు పంపిణీ చేయడానికి 1.08 లక్షల బతుకమ్మ చీరలు జిల్లాకు వచ్చాయి. మరో 15 రోజుల్లోగా అన్ని చీరలు గోదాముల్లోకి వచ్చాక మండలాలకు పంపిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం.. వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తాం. – జహీరొద్దీన్, చేనేత, జౌళీశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
‘బతుకమ్మ’తో భరోసా
సిరిసిల్ల : మరమగ్గాల (పవర్లూమ్స్) మధ్య వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు బొమ్మెన నాగరాజు (41). సిరిసిల్లలోని శివనగర్లో సాంచాలపై బతుకమ్మ చీరలను నేస్తున్నాడు. నిత్యం 12 గంటలపాటు సాంచాల మధ్య నిలబడి వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే.. నాగరాజుకు వారానికి రూ.4 వేల కూలి వస్తుంది. అంటే నెలకు రూ.16 వేలు వస్తున్నాయి. ఇదే పనికి గతంలో నెలకు రూ.8 వేలకు మించి కూలి రాకపోయేది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కార్మికులకు చేయూతనందించటం కోసం ప్రభుత్వం ఈ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అప్పగించింది. దీంతో ఒక్క నాగరాజుకే కాదు.. స్థానికంగా ఉన్న పదివేల మంది నేత కార్మికులకు చేతినిండా పనిదొరికింది. కూలి రెట్టింపు అయింది. ప్రస్తుతం ఇక్కడ నిత్యం 1.07 లక్షల చీరలను తయారు చేస్తున్నారు. 80 రంగుల్లో చీరలు.. సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. గతేడాది బతుకమ్మ చీరలను సిరిసిల్లలో ఉత్పత్తిచేసినా.. గడువులోగా పూర్తి స్థాయిలో చీరల వస్త్రం అందలేదు. 45 లక్షల చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేయగా, మరో 55 లక్షల చీరలను సూరత్ నుంచి టెండర్ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో నాసిరకం చీరలు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లో గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ.. మొత్తం ఆర్డర్ను సిరిసిల్ల నేతన్నలకు అందించారు. దీంతో జరీ అంచుతో కూడిన నాణ్యమైన చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్నారు. 20 వేల పవర్లూమ్స్పై చీరలను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 14 వేల మగ్గాలపై ఉత్పత్తి సాగుతోంది. మరో 6 వేల సాంచాలపై బతుకమ్మ చీరల బీములను ఎక్కించేందుకు జౌళిశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తే, గడువులోగా 90 లక్షల చీరలను ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఉంది. కార్మికుల ఉపాధే లక్ష్యం.. సంక్షోభంలో ఉన్న నేతన్నలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖ మంత్రి కె.తారక రామారావు కార్మికుల ఉపాధి లక్ష్యంగా బతుకమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులైన ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరను సారెగా ఇవ్వడం.. ఇటు సిరిసిల్ల నేతన్నలకు బతుకుదెరువు చూపడమే ఈ పథకం ఉద్దేశం. ఇందులో చీరల వస్త్రం ఉత్పత్తికి ప్రతీ మీటరుకు రూ.32 ఇస్తుండగా.. ఆసామికి మీటరు వస్త్రం ఉత్పత్తి చేస్తే రూ.8.50, కార్మికుడికి రూ.4.25 చొప్పున ముందే కూలి ధరలను నిర్ధారించారు. వార్పిన్ కార్మికుడికి ఒక్కో బీముకు రూ.430, వైపని కార్మికుడికి ఒక్కో బీముకు రూ.375 కూలి రేట్లను నిర్ణయించడంతో గతంతో పోలిస్తే రెండింతల కూలి కార్మికులకు గిట్టుబాటు అవుతోంది. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో ఈ పథకంవల్ల అన్నిరంగాలకు చెందిన పదివేలమంది కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. మంత్రి కేటీఆర్ చొరవతోనే తమకు మంచి ఉపాధి లభిస్తోందని కార్మికులు అంటున్నారు. చీరల ఉత్పత్తిపై నిఘా.. ఇక్కడి నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. అయితే ఎవరైనా వస్త్ర వ్యాపారులు సూరత్, భివండి, షోలాపూర్, ముంబై వంటి ప్రాంతాల నుంచి చీరల బట్టను దిగుమతి చేస్తారనే అనుమానంతో అధికారులు బతుకమ్మ చీరల ఉత్పత్తిపై నిఘా ఉంచారు. హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ నుంచి సిరిసిల్లలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. జౌళిశాఖకు చెందిన ఏడు బృందాలతో వార్పిన్ యూనిట్లపై నిఘా ఉంచారు. ట్యాబ్లలో చీరల ఉత్పత్తి వివరాలను నమోదు చేస్తున్నారు. 20 మంది సాంకేతిక సిబ్బంది చీరల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఉత్పత్తి అయిన చీరల బట్టను ఎప్పటికప్పుడు సేకరిస్తూ.. గోదాములో నిల్వ చేస్తున్నారు. రేయింబవళ్లు సాంచాలు ఆగకుండా బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. శ్రమ అధికమైనా మెరుగైన వేతనాలు రావడంతో కార్మికులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. నేడు చైతన్య ర్యాలీ.. 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను నేయాలని కోరుతూ సోమవారం కార్మికులు చైతన్య ర్యాలీని నిర్వహించనున్నారు. బీవై నగర్లోని నేతబజారు నుంచి వస్త్రోత్పత్తిదారులతో బైక్ ర్యాలీని నిర్వహిం చనున్నారు. ‘బతుకమ్మ’తో బతుకుదెరువు ఉందని చాటిచెప్పేందుకు పట్టణాల్లో ఈ ర్యాలీని నిర్వహించాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ అధికారులకు సూచించారు. రోజుకు రూ.వెయ్యి వస్తున్నాయి.. బతుకమ్మ చీరల బీములు నింపితే రోజుకు రూ.వెయ్యి కూలీ లభిస్తుంది. గతంలో రూ.500 వచ్చేవి. రోజూ రెండు, మూడు బీములు నింపుతున్నా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు. నా భార్య నవ్య బీడీ కార్మికురాలు. సిరిసిల్లలో కిరాయి ఇంట్లో ఉండి పని చేస్తున్నా. గతంలో భివండిలో పని చేశాను. అక్కడి కంటే సిరిసిల్లలోనే మంచి జీతం వస్తోంది. నా కంటే ఎక్కువ కూలీ సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు. – మెండు శ్రీనివాస్, వార్పర్ చెల్లింపులకు ఇబ్బంది లేదు.. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తున్న వారికి డబ్బు చెల్లింపుల్లో ఇబ్బంది లేదు. ఆర్డర్ ప్రకారం వస్త్రొత్పత్తిదారులకు చెల్లింపులను ఆన్లైన్లోద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. గడువులోగా అందరూ బతుకమ్మ చీరలను అందించాలి. సిరిసిల్లలో సాంచాలపై ఇతర ఉత్పత్తులను నిలిపివేసి బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయాలి. – పి.యాదగిరి, టెస్కో జనరల్ మేనేజర్ అందరికీ ఆర్డర్లు ఇచ్చాం.. సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులందరికీ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాం. 120 మ్యాక్స్ సంఘాలకు, మరో 77 చిన్నతరహా పరిశ్రమల యజమానులకు ఆర్డర్లు ఇచ్చాం. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే ఇస్తాం. ప్రస్తుతం 14 వేల మగ్గాలపై చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. కొందరు ఇంకా తెల్లని పాలిస్టర్ బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్లు బతుకమ్మ చీరలు నేయాల్సి ఉంది. – వి.అశోక్రావు, జౌళిశాఖ ఏడీ ఇవీ బతుకమ్మ చీరల ఆర్డర్లు.. అవసరమైన చీరలు : 90 లక్షలు ఇప్పటికే ఉత్పత్తయినవి : 30 లక్షలు చీరలు ఉత్పత్తి చేసే పవర్లూమ్స్: 14 వేలు అవసరం అయిన వస్త్రం : 5.94 కోట్ల మీటర్లు నిత్యం ఉత్పత్తవుతున్న వస్త్రం : 7 లక్షల మీటర్లు శ్రమించే నేత కార్మికులు : 10వేల మంది (అన్ని విభాగాల్లో) చీరల ఆర్డర్ల ఖరీదు : రూ.300 కోట్లు ఆర్డరు గడువు : సెప్టెంబర్ నెలాఖరు -
బతుకమ్మ చీరల పేరిట రూ.150 కోట్ల స్కాం
జగిత్యాలటౌన్ : నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ చీరల పేరిట రూ. 150 కోట్ల స్కాం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు సాధించిందుకు బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు 104 వాహనాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జగిత్యాలకు చెందిన బీజేపీ నాయకులు మంచినీళ్ల బావి వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక దేవిశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ అభద్రత భావంతోనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు చేరనీయడం లేదన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత కాదని కమీషన్ల కవిత అని ఆరోపించారు. ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలోనే బీజేపీని ఆదరిస్తారని, దక్షిణ భారతదేశంలో బీజేపీకి పట్టు లేదని విపక్షాల ఆరోపణలకు కర్ణాటక ఫలితాలు తేటతెల్లం చేశాయన్నారు. 2014 ఎన్నికల తర్వాత 15వ రాష్ట్రంగా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో మోడీ ప్రభంజనాన్ని ఏ దొర ఆపలేరన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజీ భాస్కర్, నియోజకవర్గ ఇన్చార్జి ముదుగంటి రవీందర్రెడ్డి, నాయకులు సాజిద్, బస్వ లక్ష్మినారాయణ, మారంపల్లి శ్రీనివాస్, పల్లె గంగాధర్, గోపాల్, యాదగిరిబాపు, సీపెల్లి రవీందర్, ఆముదరాజు, ఆన్కార్ సుధాకర్, లింగంపేట శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'చీరల పంపిణీ అట్టర్ ఫ్లాప్'
హైదరాబాద్: బతుకమ్మ చీరల పేరుతో తెలంగాణ మహిళా లోకాన్ని ప్రభుత్వం అవమాన పరిచిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ మండిపడ్డారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చేనేత చీరలు ఇస్తామని చెప్పి నాసిరకం చీరల అంటగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదు. చీరల కోసం లైన్లో నిలబడిన మహిళలు ఈ నాసిరకం చీరలను చూసి బేజారయ్యే దగ్ధం చేస్తున్నారు. చీరల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ కుంభకోణంపై సిటింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. రాష్ట్ర మహిళాలోకానికి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
చీరలను గుంజుకుని తగలబెడతారా?
-
25 లక్షల బతుకమ్మ చీరల పంపిణీ
- తొలిరోజు 8 వేల కేంద్రాల్లో.. - పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు - చీరల నాణ్యతపై పలు జిల్లాల్లో నిరసన - నాసిరకం చీరలు పంపిణీ చేయలేదన్న - చేనేత శాఖ ఎండీ శైలజా రామయ్యర్ సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని మహిళలకు చీరలు ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తొలిరోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల చీరలను పంపిణీ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ 1.04 కోట్ల బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలిరోజు 25 శాతం మేర పూర్తి చేశారు. మొత్తం 8 వేల కేంద్రాల్లో చీరలు పంపిణీ చేశారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. మంత్రి హరీశ్రావు సిద్దిపేట, హుస్నాబాద్లో పాల్గొనగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేటలో కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొన్నారు. మరోవైపు నాసిరకం చీరలు ఇస్తున్నారంటూ కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. జగిత్యాల, సిరిసిల్ల, నల్లగొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలో కొన్నిచోట్ల మహిళలు చీరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల చీరలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. అయితే బతుకమ్మ చీరల పంపిణీ పకడ్బందీగా చేస్తున్నామని, ఎక్కడా నాసిరకం చీరలు పంపిణీ చేయడం లేదని చేనేత శాఖ ఎండీ శైలజా రామయ్యర్ తెలిపారు. ఇదే విషయమై మంత్రి కేటీఆర్ కూడా సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, బట్ట కాల్చి మీద వేసే స్థాయికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దిగజారాయని ఆరోపించారు. -
మరో నాలుగైదు రోజులు చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగైదు రోజులు పొడిగిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ ఎండీ శైలజా రామయ్యర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గడువు పెంచాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. చీరల పంపిణీ తొలి రోజైన సోమవారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్లకార్డులున్న కుటుంబాల్లోని 1.04 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం తొలిరోజు సాఫీగా జరిగిందని చెప్పారు. సిరిసిల్ల చేనేత, మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించటంతోపాటు పేద మహిళలకు పండుగ కానుక అందించే సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం బృహత్తరమైందన్నారు. అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా అవేవీ పరిగణనలోకి తీసుకునే అంశాలు కావన్నారు. ఇప్పటికే 80 శాతం చీరలు అన్ని ప్రాంతాలకు పంపిణీ కాగా.. మిగతా ఇరవై శాతం రెండ్రోజుల్లో రవాణా అవుతాయని చెప్పారు. చీరల నాణ్యత విషయంలో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘‘ప్రతీ లాట్ను పక్కాగా పరిశీలించిన తర్వాతే పంపిణీకి సిద్ధం చేశాం. ఎక్కడన్నా చీరల్లో లోటుపాట్లు, డ్యామేజీ ఉంటే వెనక్కి ఇచ్చి మరొకటి తీసుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రానికి అవసరమైన చీరలన్నీ సిరిసిల్లలోనే తయారు చేయాలంటే మూడేళ్లు పడుతుంది. కేవలం 3 నెలల ముందు రూపకల్పన చేసిన పథకం కావటంతో.. అందుబాటులో ఉన్న సమయం, వనరుల దృష్ట్యా సిరిసిల్ల మరమగ్గాలపై తయారు చేయించిన 58 లక్షల పాలిస్టర్ చీరలతో పాటు అదనంగా బయటి కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఓపెన్ టెండర్ పిలిచి సూరత్ కంపెనీలకు ఈ ఆర్డర్ ఇచ్చాం’’ అని వివరించారు. సిరిసిల్లలో ఫిలమెంట్ పాలిస్టర్ రకం వస్త్రంతో చీరలు తయారు కాగా.. సూరత్లో ట్విస్టెడ్ పాలిస్టర్ రకం అందుబాటులో ఉందని, దీంతో చీరల్లో తేడా కనిపిస్తోందని పేర్కొన్నారు. సిరిసిల్ల చీరలకు ఒక్కో దానికి రూ.224, కంపెనీల నుంచి కొన్నవాటికి రూ.200 వెచ్చించినట్లు తెలిపారు. ఒకట్రెండు చోట్ల తప్ప రాష్ట్రమంతటా చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని, అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తమకు నివేదికలు అందినట్లు జయేశ్ రంజన్ చెప్పారు. -
బట్టకాల్చి మీదేస్తారా?
- మహిళల చేతిలోంచి చీరలను గుంజుకుని తగలబెడతారా? - ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపాటు - వారం కిందే దుష్ప్రచారానికి కుట్రపన్నారు - ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమేముంది? - ఒక్క జగిత్యాలలోనే మూడు సంఘటనలు జరగడమేంటి? - ప్రభుత్వం చేసే మంచి పనులతో ప్రతిపక్షాల గుండెలు అదురుతున్నాయి - ఆగమాగమై కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారు - కుంభకోణం ఆరోపణలపై ఆధారాలు చూపితే ఏ విచారణకైనా సిద్ధం సాక్షి, హైదరాబాద్ : ‘‘జగిత్యాలలోని ఓ ఊరిలో మహిళలు వెళ్తుంటే చీరలు గుంజుకుని తగలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు దగ్గరుండి ఈ చీరలు కాల్చారు. బట్ట కాల్చి ప్రభుత్వంపై వేయడమంటే అక్షరాల ఇదే. లేని అపవాదును మీద వేయడానికి ఇలా కుసంస్కారమైన పనులతో తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించారు..’’అని చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరమేముంది.. ఒక్క జగిత్యాలలోనే మూడు సంఘటనలు జరగడమేంటి అని ప్రశ్నించారు. ఏ మహిళల నుంచి చీరలు లాక్కున్నారో ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కాంగ్రెస్ సర్పంచ్, ఎంపీటీసీ భర్తలపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇంత నీచమైన, హీనమైన రాజకీయం చేస్తారా అంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. తప్పులు, లోటుపాట్లు ఉంటే తప్పకుండా సమీక్షించుకుంటామని, 25 లక్షల చీరలు ఒక్కరోజే పంపిణీ చేస్తే అందులో 250 చీరలు బాగా లేకున్నా మొత్తం చీరల్లో అవి కేవలం 0.0001 శాతమేనని అభిప్రాయపడ్డారు. దీనికే కాంగ్రెస్, టీడీపీ గొంతులు చించుకుంటున్నాయని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు లాభం చేకూర్చేలా రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఖర్చుతో పెట్టుబడి ఇవ్వబోతున్నాం. 34 లక్షల మంది గొర్ల, కుర్మ సోదరులకు 1.40 కోట్ల గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. 2 లక్షల బర్రెలకు సబ్సిడీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవన్నీ చూసి విపక్షాల గుండెలు అదిరిపోయి, ఆగమాగమై పోయి కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారు. గోరంతలను కొండంతలు చేసే విపక్షాల కార్యక్రమంలో పాల్గొనవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. 8 వేలకుపైగా కేంద్రాల్లో చీరలు పంపిణీ చేస్తే ఐదారు కేంద్రాల్లో జరిగిన గొడవలను భూతద్దంలో చూపి ఆగమాగమై పోవడం ఎంత వరకు మంచిది’’ అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పంపిణీపై సోమవారం సాయంత్రం ఆయన సచి వాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఏ పని చేసినా, చేయదలుచుకున్నా ఏదో ఒక విధంగా బద్నాం చేసేందుకు దిగజారుడు, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. ఇంత నీచనికృష్ట రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం. బతుకమ్మ అనేది ఓ సెంటిమెంట్. ప్రపంచంలో ఎక్కడా ఇంత అద్భుతమైన, అపురూపమైన పండుగ ఉండదు. బతుకమ్మ సందర్భంగా పేర్చిన పూలను సైతం చెరువులో భద్రంగా వేస్తారు. బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వమిచ్చిన చీరలు బాగా లేవని కాల్చడమేంటి? ఇంతకు మించిన దిగజారుడు రాజకీయం చూడలేదు’’అని అన్నారు. సోమవారం ఉదయం నుంచే కృత్రిమమైన నిరసనలకు శ్రీకారం చుట్టారని, ఉదయం 10 గంటలకే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు ఇంకా స్టాక్పాయింట్లో ఉండగానే అవి నాసిరకంగా ఉన్నాయని ఓ పత్రికలో వార్త వచ్చిందని, వారం నుంచే ప్రణాళికాబద్ధంగా ఈ దుష్ప్రచారానికి ప్లాన్ వేశారన్నారు. మొదటిరోజు మొత్తం 25 లక్షలకు పైచిలుకు చీరలను పంపిణీ చేశామన్నారు. 1.04 కోట్ల చీరల పంపిణీకి లక్ష్యం పెట్టుకున్నా.. మరో 2 లక్షల చీరలను అదనంగా ఉంచుకొని మొత్తం 1.06 కోట్ల చీరల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్, గంభీరావుపేట మండల కేంద్రాల్లో 4 వేల మహిళలు, చిప్పలపల్లి గ్రామంలో ఐదారు వందల మంది మహిళలకు తానే చీరలు అందజేసి మాట్లాడానని, వారంతా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేస్తే.. నాలుగైదు చోట్లే సంఘటనలు జరిగాయని కేటీఆర్ తెలిపారు. ‘‘అందులో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో మూడు చోట్ల, సత్తుపల్లిలో ఒకచోట నిరసనలు జరగడం వెనుక అర్థమేంటి? ప్రజల కోసం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సిన సంస్కారం, సోయి ప్రతిపక్షాలకు లేదు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులకు కోటి మందికి చీరలు పంపిణీ చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా పొరపాటుగానైనా వచ్చిందా? కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి చీరలు ఇచ్చారు. నచ్చకపోయినా మహిళలు చీరలు తగలబెట్టరు. ఇంటికి తీసుకెళ్లి పక్కన పెడ్తారు. లేకుంటే పని మనిషికి ఇస్తారు. ఇంకోటి చేస్తారు తప్ప తగలబెట్టే కుసంస్కారం వారికి ఉండదు.’’అని అన్నారు. చేనేత, మర నేత, సిరిసిల్ల–పోచంపల్లి చీరల మధ్య తేడా తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే సన్నాసులు ముందు విషయం తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల కార్మికుల జీతం రూ.7 వేల నుంచి రూ.20 వేల దాకా పెరిగిందని, ఇది చూసి విపక్షాల కన్ను కుడుతోందన్నారు. చేనేత కార్మికులకు రూ.1,200 కోట్ల బడ్జెట్ ఏ ప్రభుత్వం పెట్టలేదన్నారు. ఏ విచారణకైనా సిద్ధం సూరత్ చీరలు నాసిరకమైతే సిరిసిల్ల చీరలు మంచివని చెప్పవచ్చు కదా అని కేటీఆర్ విలేకరులను ప్రశ్నించారు. సమయం సరిపోకపోవడం వల్లే సూరత్ నుంచి చీరలు కొన్నామన్నారు. ‘‘ఎంతసేపు నల్ల మచ్చలు చూడటమెందుకు.. తెల్లవి కూడా చూడాలి. చీరలు గుంజుకొని కాల్చితేనే జగిత్యాలలో కేసులయ్యాయి. కాల్చినా తప్పులేదు.. గుంజుకున్నా తప్పులేదు.. గుంజినా తప్పు లేదు.. ఇలా ఏం చేసినా కేసులు పెట్టొద్దంటారా?’’ అని అన్నారు. సూరత్ చీరల కొనుగోలులో కుంభకోణం జరిగిందని టీడీపీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆధారాలుంటే ఏ విచారణకైనా సిద్ధమన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని మహిళలపై కేసులు పెట్టినట్టు తన వద్ద సమాచారం లేదన్నారు. -
చీరలు తగులబెట్టిన వారిపై కేసులు
-
చీరలు తగులబెట్టిన వారిపై కేసులు: కేటీఆర్
- ఘటనల వెనుక కాంగ్రెస్, టీడీపీల కుట్ర ఉందన్న మంత్రి - సోషల్ మీడియాలో ఉదయం నుంచే వ్యతిరేక ప్రచారం - బట్ట కాల్చి మీదేయడమంటే ఇదేనని విమర్శ - కేసుల వివరాలను పోలీసులు చెబుతారని వివరణ - ఒక్కరోజులోనే 10 వేల సెంటర్ల ద్వారా 25 లక్షల చీరలు పంచామని వెల్లడి హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను రోడ్లపై కాల్చివేసిన ఘటనల్లో పలువురిపై పోలీసు కేసులు నమోదయినట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తోన్ననియోజకవర్గాల్లో మాత్రమే ఈ ఘటనలు జరిగాయని, కాంగ్రెస్, టీడీపీ నాయకులు మహిళల చేతుల్లోనుంచి చీరలను బలవంతంగా లాక్కొని తగులబెట్టారని చెప్పారు. చీరల పంపకం సందర్భంగా సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్తితులపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘బతుకమ్మలో పేర్చిన పూలను కూడా ఎలా పడితే అలా పారేయకుండా భద్రంగా చెరువులో వదిలేస్తారు. అంత సెంటిమెంట్ ఉన్న తెలంగాణలో.. బతుకమ్మ పేరుతో ఇచ్చిన చీరలను మహిళలు తగులబెట్టరు. నిజంగా చీరలు బాగోకపోతే కట్టుకోవడం మానేస్తారు లేదంటే వేరేవాళ్లకు ఇచ్చేస్తారు. ఇదంతా ప్రతిపక్ష పార్టీల నీచపు కుట్ర. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని ఈ రోజు ఉదయం నుంచే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న జగిత్యాలలో, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య నియోజకవర్గం సత్తుపల్లిలో మాత్రమే.. అదికూడా నాలుగైదు చోట్ల గందరగోళం సృష్టించారు. జగిత్యాల జిల్లాలోని చెల్గల్ గ్రామంలో కాంగ్రెస ఎంపీటీసీ భర్త.. మహిళల చేతుల్లోని చీరలు లాక్కొని మంట పెట్టిండు. ఆ మహిళలే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఆ వివరాలను జగిత్యాల ఎస్పీ వెల్లడిస్తారు’’ అని కేటీఆర్ అన్నారు. 10 వేల సెంటర్లలో 25 లక్షల చీరలు పంచాం.. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 10 వేల సెంటర్ల ద్వారా 25 లక్షల చీరలను మహిళలకు పంచామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ఉన్నతంగానే ఆలోచిస్తారని, గతంలో ప్రభుత్వాలు నడిపిన ఏ నాయకుడూ పండుగకు కోటి మంది మహిళలకు చీరలు ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదని గుర్తుచేశారు. రైతులకు ఆర్థిక సాయం, గొర్రెల పంపకం తదితర పథకాలు చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచమైన కుట్రలు చేస్తున్నాయని, చీరలను తగులబెట్టడం ద్వారా మహిళలను అవమానించారని ఆరోపించారు. మిగిలిన 75 లక్షల మందికి కూడా త్వరితగతిన చీరలను అందజేస్తామని కేటీఆర్ చెప్పారు. సమావేశంలో మంత్రి వెంట చేనేత శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ కూడా ఉన్నారు. -
బతుకమ్మ చీరలు: కొట్టుకున్నమహిళలు
- చెప్పులతో కొట్టుకున్న మహిళలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాబాసగా మారింది. క్యూ లైన్లలో తలెత్తిన వివాదం.. ఒకరినొకరు సిగలు పట్టుకుని చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. కనీసం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయకుండా, గొడవలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టక పోవడంతో మహిళలు ముష్టియుద్దాలకు దిగారు. యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సరస్వతీ శిశుమందిర్ సోమవారం మొదటిరోజు బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. మొదలు పెట్టిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న మహిళలు కొందరు గొడవపడ్డారు. ఒకరి జుత్తు మరొకరు పట్టుకొని గొడవకు దిగినా అధికారులు ఏమీ చేయలేకపోయారు. దీంతో చీరల పంపిణీ కొంతసేపు నిలిచిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, అధికారులు వారించినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా పరస్పరం దూషణలు చేసుకుంటూ తన్నుకున్నారు. అత్యంత కష్టంతో పోలీసుల జోక్యం చేసుకుని మహిళలు అక్కడి నుంచి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చింది. -
బతుకమ్మ చీరలు: కొట్టుకున్నమహిళలు
-
'అందరూ చిరునవ్వుతో ఉండాలనేదే లక్ష్యం'
సాక్షి, సిద్ధిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సోమవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండ భూదేవి గార్డెన్స్ వేదికైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరయ్యారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని.. కొత్త దుస్తులు లేకుండా ఉండకూడదు. అంతా చిరునవ్వులతో ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో బతకాలని, ప్రభుత్వం తరపున కుల, మతాలకు అతీతంగా ముస్లిం మైనారిటీ పండుగలు అధికారికంగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున క్రిస్టియన్స్ కొత్త బట్టలు పంపిణీ చేశామని, అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టిందని చెప్పారు. ఇవాళ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిలో నమ్మకం, విశ్వాసాన్ని కల్పిస్తున్నామన్నారు. విద్య, వైద్యంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా చేనేత బతకాలి.. అక్కా చెల్లెళ్ళకు చీరలు అందించాలనే సీఎం కేసీఆర్ సమాలోచన చేశారని చెప్పారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వడంతో పాటు తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం తరపున చీరలు పంపిణీ చేయాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి లేక ఆకలితో సతమతం అవుతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు. రాష్ట్రంలోని ప్రతి మహిళా పండుగకు కొత్త దుస్తులు కట్టుకోవాలని బతుకమ్మ చీరలు అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణకు అవసరమైన కోటి చీరలు చేనేత కార్మికులు అందించలేకపోవడంతో.. సూరత్ నుంచి 50 లక్షల చీరలు తెప్పించామని., వచ్చే యేటా నుంచి నేత కార్మికుల వేసిన చీరలను సేకరిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం కేసీఆర్ కిట్, సిద్ధిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు, పట్టణ పారిశుధ్యం, హరిత హారం, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండాలనే విషయం గురించి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ.. పలు అంశాలపై మహిళల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. -
బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం
►బతుకమ్మ చీరలపై మహిళల అసంతృప్తి ►చీరలు కాల్చి బతుకమ్మ ఆడిన మహిళలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలను పంపిణీ చేస్తామన్న ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం...తీరా డామేజ్ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు. కేవలం వంద రూపాయల విలువచేసే సాధారణ చీరలు పంపిణీ చేసిందని ఆరోపిస్తూ పలు జిల్లాల్లో మహిళలు.. చీరలు కాల్చేసి బతుకమ్మ ఆడారు. జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని 12వ వార్డు బుడగ జంగాల కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఆందోళనకు దిగారు. 50రూపాయలు విలువ కూడా చేయని చీరలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అగౌరవ పరుస్తున్న అని ఎద్దేవా చేశారు. ఆ చీరలు బతుకమ్మకు కట్టుకోమని మహిళలు వాటిని అక్కడే పడేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 22, 23వ వార్డులో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అయితే వాటిని అందుతున్న మహిళలు చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే కుప్పగా వేసి నిప్పు పెట్టారు. చీరలు కాలుతుండగా చుట్టూ చేరి బతుకమ్మ ఆడారు. పోచంపల్లి చేనేత చీరెలు పంపిణీ చేస్తానని కేవలం 50 రూపాయలు విలువచేసే పాలిస్టర్ చీరెలు పంపుతారా అని కోపోద్రుక్తులయ్యారు. జగిత్యాల జిల్లా జిల్లా మండలం చల్గల్, లింగంపేటలో ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళల ధర్నాకు దిగారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేసి మహిళలు తమ నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోనూ బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వాలీబాల్ కోర్టులోని నెట్కు చీరలను కట్టి తమ అసంతృప్తిని వెల్లడించారు. పంట చేళ్లల్లో పక్షుల కోసం బెదురుగా కట్టే చీరల కంటే హీనంగా బతుకమ్మ చీరలు ఉన్నాయని మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలో భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్ కాలనీవాసులు బతకమ్మ చీరలను కుప్పగా పోసి నిప్పంటించారు. బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలను ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మళ్లీ మంచి చీరల్ని పంపిణీ చేయాలని కోరారు. బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వ ధనాన్ని నాశనం చేస్తున్నారని, డబ్బులిస్తే తామే మంచి చీరల్ని కొనుక్కుంటామని మహిళలు తెలిపారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
నేటి నుంచి బతుకమ్మ చీరలు
► పంపిణీకి సర్వం సిద్ధం ► 1.04 కోట్ల మంది ఆడపడుచులకు అందించేందుకు చర్యలు ► 7 కోట్ల మీటర్ల వస్త్రం.. ► రూ.222 కోట్ల వ్యయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చింది. చీరల తయారీకీ సూమారు 7 కోట్ల మీటర్ల వస్త్రాన్ని వినియోగించారు. ఇందులో సగానికిపైగా చీరలను ప్రభుత్వం రాష్ట్రం నుంచే సేకరించింది. గత రెండు నెలలుగా రాష్ట్రంలోని మరమగ్గాలన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేసి ఈ చీరలను ఉత్పత్తి చేశాయి. అత్యధికంగా సిరిసిల్ల నుంచి 52 లక్షల చీరలను సమీకరించింది. మిగిలిన చీరలను జాతీయ స్థాయి టెండరింగ్ ప్రక్రియ ద్వారా సేకరించారు. వచ్చే ఏడాది నుండి పూర్తిగా ఇక్కడి నేతన్నల నుంచే చీరలు సేకరిస్తామని ప్రభుత్వం తెలిపింది. కొంగు, బార్డర్లపై ప్రత్యేక శ్రద్ధ బతుకమ్మ చీరల తయారీలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చేనేత విభాగం డైరెక్టర్ శైలజా రామయ్యర్ ఆధ్వర్యంలో వందల డిజైన్లతో చీరలను తయారు చేయించారు. ఈ డిజైన్ల నుంచి సీఎం కార్యాయల మహిళా ఉన్నతాధికారులు కొన్ని చీరలను ఎంపిక చేశారు. ఇలా మహిళల అభిరుచి మేరకు చీరల డిజైన్ల ఎంపిక జరిగింది. పండుగ రోజు మహిళలందరూ ఒకే విధమైన చీరలతో కనిపించకుండా 500పైగా డిజైన్లు, వందల రకాల రంగుల్లో తయారు చేయించారు. వస్త్రాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు, బార్డర్లు, ప్యాకేజీ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సూరత్ నుంచి వచ్చే చీరల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు శైలజా రామయ్యర్ స్వయంగా అక్కడికి వెళ్లి వచ్చారు. పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు: కేటీఆర్ బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కోటి నాలుగు లక్షల మంది అడబిడ్డలకు చీరలు అందించడం సంతోషం గా ఉందన్నారు. చీరల పంపిణీకి ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో ఎన్నికల తర హాల్లో ప్రత్యేక పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 18 ఏళ్లు నిండి, తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతి సోదరికి చీర ఇస్తామ న్నారు. ఇప్పటికే జిల్లా గోడౌన్లకు 80% చీరలు చేరాయని, 18, 19, 20 తేదీల్లో మొత్తం చీరల పంపీణి జరుగుతుందని వెల్లడించారు. -
చేనేతల సంక్షేమానికి ప్రాధాన్యం
- నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు తక్షణం ప్రారంభించండి - బతుకమ్మ చీరల పంపిణీపై సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమం కోసం తలపెట్టిన యార్న్, రసాయనాలు, అద్దకాల సబ్సిడీ వంటి కార్యక్రమాలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపుల్లో చేనేత శాఖకు పెద్ద పీట వేశామన్నారు. డిమాండ్ ఉన్న జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టెస్కో షోరూమ్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ చీరల పంపిణీతో పాటు శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సోమవారం ఆయన బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ నెల 16 నాటికి చీరలన్నీ జిల్లా కేంద్రాలకు చేరతాయని, 17, 18, 19 తేదీల్లో పంపిణీ పూర్తవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. చీరల పంపీణీలో ఏ ఇబ్బందులూ లేకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రెండు నెలల వ్యవధిలో 1.06 కోట్ల అడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేతన్నలకు ఉపాధితో పాటు, పండగ సందర్భంగా అడపడుచులకు సంతోషం పంచిన ట్టవుతుందన్నారు. త్వరలో చేనేత వార్షిక ప్రణాళిక... ఇకపై ప్రభుత్వం సేకరించే ప్రతి మీటర్ వస్త్రాన్ని రాష్ట్రం నుంచే తీసుకొంటామని కేటీఆర్ చెప్పారు. త్వరలో చేనేత వార్షిక ప్రణాళికను ప్రకటిస్తా మన్నారు. దీని ద్వారా వచ్చే ఏడాది నుంచి నేతన్నలకు కనీసం ఏడాదిలో 8 నెలల పాటు ప్రభుత్వం సేకరించే వస్త్రాల ఉత్పత్తిపై పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆర్డర్లతో నెలకు కనీసం రూ.15 వేలు చొప్పున 3 నెలలు లభించిందన్నారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పంపిణీ చేసే స్కూల్ యూనిఫాంల సేకరణను వ్యవస్థీకృతం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే సమావేశాలు జరపాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే చేనేత మగ్గాలు, కార్మికుల పూర్తి సమాచారముందని, పవర్లూమ్ కార్మికుల సమాచారం సేకరించి డిజిటలైజ్ చేయా లన్నారు. ఇకపై కేంద్ర మంత్రులను కలిసే సంద ర్భంలో తెలంగాణ చేనేత వస్త్రాలు, గోల్కొండ కళాకృతులను అందిచాలని సూచించారు. -
500 డిజైన్లలో బతుకమ్మ చీరలు...!
సిరిసిల్ల, సూరత్ నుంచి తయారు చేయించి తెప్పిస్తున్న ప్రభుత్వం ఇందూరు (నిజామాబాద్అర్బన్): ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేదింటి మహిళలకు కానుకగా చేనేత చీరలను ఉచితంగా అందించనుంది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిరిసిల్లా, సూరత్లలో 500 డిజైన్లలో నేత చీరలను తయారు చేయించింది. అన్ని జిల్లాలకు సరఫరా చేయడం కూడా ప్రారంభమైంది. రేషన్ కార్డుల ఆధారంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఒక్కో కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన మహిళల వివరాలను ప్రభుత్వం సేకరించింది. బతుకమ్మ పండుగ ఈ నెల మూడో వారంలో వస్తున్న నేపథ్యంలో చీరల పంపిణీ క్షేత్ర స్థాయిలో 18,19 తేదీల్లో పూర్తి చేయాలని, ఇంకా మిగిలిన వారుంటే 20వ తేదీన కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. -
స్వశక్తి మహిళలకు ‘బతుకమ్మ’ చీరలు
మంత్రి కేటీఆర్ చొరవతో సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో 61 లక్షల మందికి సిరిసిల్ల చీరలు సిరిసిల్ల నేతన్నలకు రూ.105 కోట్ల ఆర్డర్లు పరిశీలించిన జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ సిరిసిల్ల: రాష్ట్రంలోని స్వశక్తి సంఘాల మహిళ లకు ప్రభుత్వం చీరలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఆడపడు చులకు అతిపెద్ద పండుగగా భావించే వచ్చే బతుకమ్మ పండుగకు కానుకగా స్వశక్తి సంఘాల్లోని మహిళలందరికీ ప్రభుత్వం ఉచి తంగా చీరలు అందించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పవర్లూమ్స్పై ఉత్పత్తి అయ్యే చీరలను పంపిణీ చేయాలని భావిస్తోంది. సిరిసిల్ల నేత న్నలకు నిరంతరం ఉపాధి కల్పించడంతో పాటు మహిళలకు బతుకమ్మ కానుకగా చీర లు అందించాలని యోచిస్తోంది. చీరల పంపి ణీకి ఇప్పటికే సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేతన్నలకు శాశ్వత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని బతు కమ్మ పండుగ ఆర్డర్లు ఇవ్వాలని భావిస్తున్నా రు. దీంతో సిరిసిల్ల నేత కార్మికులకు రూ.105 కోట్ల విలువైన వస్త్రం కొనుగోలు ఆర్డర్లును ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మూడున్నర కోట్ల మీటర్ల చీరలు.. రాష్ట్రంలోని 31 జిల్లాలో 4 లక్షలకుపైగా స్వశక్తి సంఘాలు ఉండగా 61 లక్షల మంది మహిళ లు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలోని 61 లక్షల మంది మహిళలకు చీరలు అందించేం దుకు మూడున్నర కోట్ల మీటర్ల వస్త్రం అవ సరమని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలను రాష్ట్ర చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజారామ య్యర్ మూడు రోజుల కిందట పరిశీలించి వెళ్లారు. సిరిసిల్లలో సాంచాలపై ఉత్పత్తి అవు తున్న చీరలు నాణ్యమైనవిగా ఉండడంతో మహిళలకు పంపిణీ చేసేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడుకు సరఫరా అయ్యేవాటిS కంటే నాణ్యమైన, మెరుగైన డిజైన్లతో చీరలను ఇవ్వాలని భావిస్తున్నారు. సిరిసిల్ల నేతన్నలకు చేతి నిండా పని.. ప్రభుత్వ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభిస్తే.. సంక్షోభంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు మంచి రోజులు వస్తాయి. నేత కార్మికుల చేతికి నిరం తరం పని ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర పరి శ్రమ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు చొరవతో రాజీవ్ విద్యామిషన్ ద్వారా స్కూల్ యూనిఫాం వస్త్రం ఆర్డర్లు సిరిసిల్లకు లభించాయి. క్రిస్మస్ వేడుకలకు కొత్త బట్టలు అందించే ఆర్డర్లను సైతం ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకే ఇచ్చింది. ఇప్పుడు తాజాగా బతుకమ్మ పండుగకు స్వశక్తి సంఘాలకు ఉచితంగా చీరలు అందించే ఆర్డర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రూ.105 కోట్ల చీరలను ఆర్డర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం చీరలను ప్రజలకు అం దించాలనే ప్రతిపాదనను సిద్ధం చేశారు. టీడీపీ హాయాంలో జనతా వస్త్రాలు పంపిణీ చేసిన విధంగా రేషన్ కార్డులపైనే తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒకరోజు సిరిసిల్ల వస్త్రం ధరించాలని, మున్సిపల్, సింగరేణి, వైద్యశాలలకు సైతం సిరిసిల్ల వస్త్రాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. చాలా ప్రతిపాదనలున్నాయి సిరిసిల్ల నేత కార్మికు లకు ఉపాధి కల్పించేందుకు చాలా ప్రతి పాదనలు ఉన్నాయి. రాష్ట్రంలోని స్వశక్తి సంఘం మహిళల కు బతుకమ్మ పండుగకు చీరలు అందించేందుకు ప్రభుత్వం పరిశీలి స్తుంది. జౌళిశాఖ కమిషనర్ ఇటీవలే సిరిసిల్లకు వచ్చి వెళ్లారు. ఇక నేత కార్మికులు చేతి నిండా లభించేలా ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తుంది. – అశోక్రావు.ఏడీ.రాజన్న సిరిసిల్ల జిల్లా చేతి నిండా పని ఉంటుంది.. సిరిసిల్లలో ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ప్రభుత్వ ఆర్డర్లు వస్తే మాకు చేతి నిండా పని ఉంటుంది. రో జూ 12 గంటలు సాం చాల మధ్య పని చేస్తే వారానికి రూ.2500 వస్తున్నాయి. కొంచెం కూలి పెంచి పని కల్పించాలి. – బాసబత్తిని కేదారి, నేత కార్మికుడు