Blood Test
-
వాయుకాలుష్యంతో రక్తం గడ్డకట్టే ముప్పు
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం మానవుల ప్రాణాలకు అత్యంత హానికరమని మరోసారి రుజువైంది. దీర్ఘకాలంపాటు వాయుకాలుష్యం బారిన పడితే నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఏకంగా 39 శాతం నుంచి 100 శాతందాకా పెరుగుతాయని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 17 సంవత్సరాలపాటు అమెరికాలో 6,650 మంది యుక్తవ యస్కు లపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ‘‘వాయు కాలుష్యం కారణంగా కణజాలం, కండరాల కింద ఉండే ప్రధాన నరాల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరగొచ్చు. చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే రక్తప్రవాహానికి తీవ్ర అవరోధాలు ఏర్పడి ప్రసరణ ఆగిపోవచ్చు. అప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి’’ అని పరిశోధకులు చెప్పారు. నరాల్లో రక్తం గడ్డ కట్టే పరిస్థితిని వేనస్ థ్రోంబోఎంబోలిజం’ అని పిలుస్తారు. ఈ సమస్య కారణంగా ఆస్పత్రిపాలైన రోగుల డేటాను మిన్నెసోటా విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం పరిశీలించింది. ఆయా రోగుల ఇళ్లలో వాయుకాలుష్యం తాలూకు శాంపిళ్లనూ తీసు కున్నారు. న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజెలిస్ సహా ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో, ఆ నగరాల సమీపాల్లో నివసించే యుక్తవయసు రోగులపై ఈ పరిశోధన చేశారు. సూక్ష్మధూళి కణాలు(పీఎం 2.5) , నైట్రోజన్ ఆక్సైడ్ల బారిన పడి వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న వారిలో 3.7 శాతం(248 మంది) జనాభాలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు 39 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. సూక్ష్మధూళి కణాల గాఢత ఎంత ఎక్కువ ఉన్న గాలిని పీల్చితే అంత ఎక్కువగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరుగుతాయి. అత్యధిక స్థాయిలో నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ల బారిన పడితే ఈ రిస్క్ ఏకంగా 120–174 శాతానికి పెరుగుతుంది. వాయు కాలుష్యం ఎక్కువైతే శరీరంలో ఆ మేరకు వాపు పెరిగి రక్తం గడ్డకడుతుంది. చివరకు ఆ వ్యక్తులు హృదయ, శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడతారు’’ అని పరిశోధకులు చెప్పారు. -
కేన్సర్లను ముందుగా గుర్తించే 'రక్ష ఆధారిత పరీక్ష'..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రముఖ జెనోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ కంపెనీ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వివిధ కేన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు రక్త ఆధారిత పరీక్షను ప్రారంభించింది. కేన్సర్ స్పాట్గా పిలిచే ఈ పరీక్షలో కేన్సర్ కణితికి సంబంధించిన డీఎన్ఏ మూలాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మిథైలేషన్ ప్రొఫైలింగ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. రక్తంలో డీఎన్ఏ మిథైలేషన్ని గుర్తించడానికి స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యురాలు ఇషా అంబానీ పిరమల్ మాట్లాడుతూ..మానవ సేవలో భాగంగా ఔషధాల భవిష్యత్తును పునర్నిర్మించే మార్గదర్శక పురోగతికి రిలయన్స్ కట్టుబడి ఉంది. భారత్లో కేన్సర్ మరణాలు ఎక్కువ. అదీగాక ఈ వ్యాధి చికిత్స అనేది రోగుల కుటుంబాలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టే అంశం. ఇది వారి పాలిట ఆర్థిక మానసిక వ్యథను మిగిల్చే భయానక వ్యాధిగా మారింది. ఆ నేపథ్యంలోనే ఇలా ముందుస్తుగా గుర్తించే ఆధునిక చికిత్సతో ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. భారతదేశంలోని ప్రజల జీవితాలను మెరుగపరచడానికి రిలయన్స్ కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే వీ కేర్('WE CARE') చొరవతో కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ ఈ ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షలను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు ఇషా అంబానీ. అలాగే స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ రమేష్ హరిహరన్ మాట్లాడుతూ..కేన్సర్తో పోరాడి గెలవాలంటే ముందస్తు హెచ్చరిక అనేది కీలకం. ప్రజలు ఈ కేన్సర్ని జయించేలా ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షను ప్రారంభించటం మాకు గర్వకారణం అని అన్నారు. కాగా, ఈ కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్స్పాట్ ప్రోగ్రామ్ను ప్రోత్సహించడమే గాక, సరికొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసేలా పరిశోధన ప్రయత్నాలకు మద్దతిస్తుంది.(చదవండి: ఈ 'టీ'తో నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ మాయం..!) -
ముట్టుకున్నా నొప్పి?!
నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతోంది. నార్మల్ డెలివరీనే! కానీ ఇప్పటికీ ఎక్స్టర్నల్ వెజైనా ఏరియాలో చాలా నొప్పిగా ఉంటోంది. ముట్టుకున్నా నొప్పి అనిపిస్తుంది. ఏ మందులు వాడినా, ఇన్ఫెక్షన్కి మందులు వాడినా ఏమీ తగ్గలేదు. నాకు సలహా ఇవ్వండి.విశాల, నాచారంమీరు చెప్పే నొప్పిని వల్వల్ పెయిన్ అంటారు. ఏ ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఏ కారణం తెలియనప్పుడు దీనిని డయాగ్నైజ్ చేస్తారు. కొన్నిసార్లు ప్రసవం జరిగే సమయంలో గాయపడినా, భయానికీ ఒత్తిడికీ గురైనా ఈ నొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఈ నొప్పికి గైనకాలజిస్ట్ని కలవాలి. ఇంటర్నల్గా చెక్ చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అవసరమైతే వెజైనల్ స్వాబ్ చేస్తారు. లిడోకేయిన్ 2% లోకల్ అప్లికేషన్ జెల్లీ వాడమని చెబుతారు. ఈ ఆయింట్మెంట్ని వెజైనా, వల్వా భాగంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది బాగా పని చేస్తుంది. ఈ ఆయింట్మెంట్ని ప్రతిరోజూ 3–4 సార్లు అప్లై చేసుకుంటూ, మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. నడుము కండరాలు బలం పుంజుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. ఈ క్రీమ్కి అలర్జీ చాలా అరుదుగా రావచ్చు. చాలా మందికి ఈ క్రీమ్తో నొప్పి తగ్గుతుంది. వెజైనల్ వాషెస్, స్ట్రాంగ్ సోప్స్, ఫెర్ఫ్యూమ్లు వాడకూడదు. కొంతమందికి సెన్సిటివిటీ తగ్గడానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నొప్పి ఎక్కువకాలం కొనసాగుతుంటే, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడుము కండరాల బలానికి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు.నాకు మొదటి నుంచీ రక్తంలో ఐరన్ శాతం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు 3వ నెల. వయసు 22 సంవత్సరాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ఐరన్ శాతం మాత్రమే ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?– సృజన, శంకరపల్లిఐరన్ తక్కువ ఉన్న వాళ్లకి నీరసం, అలసట ఎక్కువ ఉంటాయి. హీమోగ్లోబిన్ 10 శాతం కన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో రక్తంలో ఐరన్ శాతం బాగా ఉన్నప్పుడే రక్తకణాలు బాగా ఉంటాయి. ఈ రక్తకణాలు ఆక్సిజన్ను శరీరంలోని అన్ని అవయవాలకు పంపిస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహార పదార్థాలు అంటే చికెన్, మటన్, చేప, పౌల్ట్రీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. లివర్, లివర్ ఉత్పత్తుల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉన్నా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. వాటిలోని విటమిన్–ఎ పెరిగే బిడ్డకి ప్రమాదం. శాకాహార పదార్థాలు చాలావాటిలో ఐరన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, రాజ్మా, బఠాణీ వంటి గింజలు, బ్రొకొలీ, సోయా ఉత్పత్తులు, పనీర్లలో ఐరన్శాతం ఎక్కువ ఉంటుంది. ఐరన్ శాతం పెరగాలంటే విటమిన్–సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువ ఉండే ఆహర పదార్థాలతో పాటు విటమిన్–సి కూడా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్– నారింజ, కివీ, నిమ్మ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీలు తాగకూడదు. భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదు. గర్భిణీలకు 3, 7, 9 నెలల్లో తప్పనిసరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేస్తారు. దీనిలో మీ ఐరన్ శాతం తెలుస్తుంది. డైట్తో పాటు కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వవలసి వస్తుంది. కొంతమందికి రక్తహీనతతో పాటు విటమిన్– బి12 కూడా తక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి అదనంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. డైట్, మందులతో ఐరన్ పెరగనప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, ఐరన్ స్టడీస్ అనే అడ్వాన్స్డ్ టెస్ట్ చేసి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టి, ఫిజీషియన్ సూచన మేరకు ట్రీట్మెంట్ చేస్తారు. -
ఒక్క నెత్తుటి చుక్కతో.. అరవైకి పైగా పరీక్షలు!
రక్తంలో చక్కెర ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే, వేలిమొనపై సూదితో గుచ్చుతారు. అప్పుడు వచ్చే నెత్తుటి చుక్కను గ్లూకోమీటర్ మీద పెట్టి పరీక్షిస్తారు. గ్లూకోమీటర్ ద్వారా నెత్తుటి చుక్కను పరీక్షిస్తే, కేవలం రక్తంలో చక్కెర స్థాయి మాత్రమే తెలుస్తుంది. దానివల్ల శరీరంలోని ఇతరేతర లోపాలేవీ బయటపడవు. అయితే, ఒకే నెత్తుటి చుక్కతో అరవైకి పైగా అంశాలను తెలుసుకునే పరీక్షను లండన్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.వేలిమొన నుంచి సేకరించిన ఒకే ఒక్క నెత్తుటి చుక్కతో శరీరంలోని అరవైకి పైగా లోపాలను తెలుసుకోగల పరీక్షను లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లాడియా లాంజెన్బర్గ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరీక్ష ద్వారా పందొమ్మిది రకాల క్యాన్సర్, నరాలకు సంబంధించిన మోటార్ న్యూరాన్ డిసీజ్, గుండెజబ్బులు సహా అరవైఏడు రకాల వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. బ్రిటన్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 40 వేల మంది రోగులపై ఈ పరీక్ష నిర్వహించి శాస్త్రవేత్తలు విజయవంతమైన ఫలితాలను సాధించారు. ఈ వివరాలను ‘నేచర్ మెడిసిన్’ తాజా సంచికలో ప్రచురించారు. -
కదలండి బాస్!
నగరంతో పాటు దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మెడికల్ జర్నల్లో ప్రచురించిన తాజా సమాచారం ప్రకారం.. గత 2022లో ప్రతీ ఇద్దరు వయోజనులలో ఒకరు ఆరోగ్యానికి అవసరమైన కనీసపు శారీరక శ్రమ స్థాయిని కూడా అందుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా, శారీరక శ్రమ లేని పెద్దల శాతం 31% కాగా మన దేశంలో మాత్రం ఇది 49.4% గా ఉంది. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో 57 శాతం మంది కనీసపు శారీరక శ్రమకు సైతం దూరంగా ఉన్నారని అధ్యయనం తేల్చింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి 59.9%కి చేరుతుందని రోగాల నిలయంగా మారుస్తుందని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిజికల్ యాక్టివిటీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలి కారణంగా పలు రకాల వ్యాధులకు చిరునామాగా నగరం మారబోతోందని గతంలోనే జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. నగరంలో 53.6 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని ఉస్మానియా ఆసుపత్రి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనం అప్పట్లో ఇండియన్ జర్నల్ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ మెడికల్ రిసెర్చ్లో ప్రచురితమైంది. అదే విధంగా అబ్డామినల్ ఒబెసిటీ (పొత్తికడుపు పైన కొవ్వు పేరుకుపోవడం) అనేది మన నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోందని గత ఏడాది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. 15–49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు, పురుషుల్లో ఈ పరిస్థితికి కారణం నిశ్చల జీవన శైలేనని స్పష్టం చేసింది.శ్రమనోచని శరీరం.. వ్యాధుల కుటీరంఏదైనా సరే శారీరక కదలికను శారీరక శ్రమగా పరిగణిస్తారు. శరీరాన్ని కాకుండా మెదడుకు అధికంగా కలి్పంచే పని ఒత్తిడితో నగర జనజీవనం ఒక్కసారిగా మారిపోయింది. ఆఫీసుల్లో గంటల తరబడి పని, ఇంటికి ఆఫీసులకు మధ్య ప్రయాణం, వారాంతపు విరామంలో విశ్రాంతి.. ఇది శారీరక శ్రమ తగ్గిపోవడానికి పోషకాహార లోపాలకు దారితీసింది. శారీరక శ్రమ లోపం.. ప్రపంచ ఆరోగ్యానికి నిశ్శబ్ద ముప్పు, ఇది దీర్ఘకాలిక వ్యాధుల భారానికి గణనీయంగా దోహదం చేస్తుంది. అని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్ డాక్టర్ రూడిగర్ క్రెచ్ అన్నారు. గుండెపోటు స్ట్రోక్లతో సహా çహృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాక మధుమేహం, చిత్తవైకల్యం, రొమ్ము పెద్దపేగు క్యాన్సర్లు ముప్పు వీటన్నింటికీ దారి తీస్తుందంటున్నారు.అనారోగ్యాలతో ఆస్పత్రుల చుట్టూ..దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు రక్త పరీక్షలు పోషకాహార మార్గదర్శకాల కోసం ప్రతిరోజూ దాదాపు 5–10 మంది నగర ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ ధోరణి పేలవమైన ఆహారపు అలవాట్లు అధిక ఒత్తిడి స్థాయిల కలయిక కారణమని, వీటన్నింటికీ మూలం నిశ్చల జీవనశైలి అని చెబుతున్నారు. జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, ఉబ్బరం ఆమ్లత్వంతో సహా రోగులలో జీర్ణాశయ సమస్యలు సర్వసాధారణంగా మారా యని చెప్పారు. అలాగే.. అధిక ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటు, డైస్లిపిడెమియా అధిక బరువుతో కూడిన మెటబాలిక్ సిండ్రోమ్ కేసులలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఈ పరిస్థితులకు అనారోగ్య జీవనశైలి, ఒత్తిడి క్రమరహిత నిద్ర విధానాలు కారణమని పేర్కొన్నారు. సరైన పోషకాహారం, వ్యాయామం ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అవలంబించడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను ఎదుర్కోవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.వర్కవుట్.. వ్యాధులు అవుట్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కథనం ప్రకారం.. వారానికి 150 నిమిషాల మితమైన–తీవ్రతతో కూడిన శారీరక శ్రమ లేదా 75 నిమిషాల తీవ్రమైన–తీవ్రతతో కూడిన శారీరక వ్యాయామంలో పెద్దలు పాల్గొనాలి. నడక, సైక్లింగ్, ఆటలు మాత్రమే కాదు శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులు చేయడం కూడా శారీరకంగా చురుగ్గా ఉండటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. సాధారణ శారీరక శ్రమ మధుమేహం ప్రమాదాన్ని 17%, గుండె జబ్బులు, పక్షవాతం 19%, డిప్రెషన్, చిత్తవైకల్యం 28–32% అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాలను 8–28% తగ్గిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల్లో చురుకుదనం అవసరమైనంత పెరిగితే , ఏటా 4–5 మిలియన్ల మరణాలను నివారించవచ్చని అంచనా. కదలికల లోపానికి కారణాలెన్నో.. కోవిడ్ తర్వాత ఒక విధానంగా మారిపోయిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో వండిన భోజనం కంటే ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఇష్టపడటానికి ఫుడ్ డెలివరీ సేవల సౌలభ్యం దారితీసింది దాంతో విపరీతంగా పెరిగిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల వినియోగం, పెరిగిన రెడీ–టు–ఈట్ మీల్స్కు ప్రాధాన్యం వంటివి నిశ్చల జీవనశైలి పెరగడానికి కారణమని నగర వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు సిటీజనుల ఆహారపు అలవాట్లను తద్వారా ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయని నగరానికి చెందిన పోషకాహార నిపుణురాలు రుచికా చెప్పారు. ఇటీవల రకరకాల ఆరోగ్య సమస్యలు, శారీరక చురుకుదనం లోపించిన కారణంగా నిపుణులను సంప్రదించే వారిలో యువకుల సంఖ్య గణనీయంగా ఉండడం గమనార్హం అంటున్నారామె. 100 కిలోలకు దగ్గరగా ఉన్న 17–19 సంవత్సరాల నగర యువతకు ట్రీట్ చేశానని తెలిపారు. ఈ భయంకరపరిస్థితికి తీవ్రమైన నిశ్చల జీవనశైలి కారణమని స్పష్టం చేశారు. వీరిలో కొందరు ప్రీ–డయాబెటిస్ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.కనీస నడక లేకుంటే కష్టాలే.. ప్రస్తుతం నగరవాసుల్లో చాలా మందికి కనీసపు శారీరక శ్రమ ఉండడం లేదు. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. మేం ప్రిస్క్రిప్షన్లో మందులు మాత్రమే కాదు వాకింగ్, వ్యాయామాల గురించి కూడా చెబుతున్నాం. ఓ వ్యక్తి రోజుకు కనీసం 5వేల నుంచి 6వేల అడుగులు నడవాలి. యుక్త వయసు్కలు 2వేల అడుగులు కూడా నడవడం లేదు. మరి రోగాలు రాకుండా ఎలా ఆపగలం? ముఖ్యంగా హృద్రోగాలు, హార్ట్ ఎటాక్స్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోవడానికి కదలిక లేని జీవనశైలే కారణం. ముందుగా 15 నుంచి 20 నిమిషాల నడకతో ప్రారంభించి ఏదైనా ఆసక్తి ఉన్న ఆటలు ఆడడం.. ఇలా శారీరక కదలికల్ని రోజువారీ జీవితంలో భాగం చేయాల్సిందే దీనికి ప్రత్యామ్నాయం లేదని అందరూ గుర్తించాలి. – డా.కిరణ్కుమార్రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇనిస్టిట్యూట్ -
గుర్తిద్దాం... నివారిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా చికిత్స అందించడం కన్నా నివారణ మార్గాలే అత్యంత ప్రామాణికమని కాంటినెంటల్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఒకే రక్త పరీక్షతో కేన్సర్ను ముందస్తుగా గుర్తించేలా కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ‘కేన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్’విభాగాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్లోని ఓ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరోల్ సికోరా ఈ విభాగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాత కేన్సర్ సెంటర్ ఎండీ అండర్సన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో 40 ఏళ్ల పాటు పనిచేసి, ఆ అనుభవాన్నంతా దేశంలోనే సేవలందించాలనే లక్ష్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిని స్థాపించానని తెలిపారు. ఇప్పటికే 40 వేల మందిని పైగా కేన్సర్ కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన తమ కేన్సర్ కేర్ టీమ్... రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని కేన్సర్ బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. లిక్విడ్ బయాప్సీ టెస్ట్తో కేన్సర్ గుర్తింపు ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థల్లో కేన్సర్ విభాగంలో 40 ఏళ్లపాటు సేవలందించిన డాక్టర్ జగన్నాథ్ నిర్వహణలో కేన్స ర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్ విభాగం కొనసాగుతుందని గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగమైన లిక్వి డ్ బయాప్సీ టెస్ట్తో ముందుగా కేన్సర్ను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈ మూడు టెస్ట్లతో... ఆస్పత్రిలో మూడు రకాల జన్యు పరీక్షలను ప్రారంభించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు మొదటగా కేన్సర్ ప్రిడిస్పోజిషన్ టెస్ట్... జన్యు అమరిక, వాటిలోని తేడాలను అర్థం చేసుకుని, భవిష్యత్లో ఏ రకమైన కేన్సర్ వ్యాధి బారిన పడతామో ముందుగానే గుర్తిస్తుందన్నారు. రెండోది కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్.. వంశపారంపర్యంగా వచ్చే కేన్సర్లను గుర్తించడానికి ఈ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జెనెటిక్ మేకప్ను సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. యూఎస్ఏలోని నేషనల్ కాంప్రహెన్సివ్ కేన్సర్ పేర్కొన్న విధంగా... రొమ్ము కేన్సర్, ఓవరిన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్ వంటి ఐదు కేన్సర్లకు కారణం అయ్యే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను ఈ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. మూడోది నెక్స్ట్ – జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) ఆధారిత సీఎఫ్డీఎన్ఏ పరీక్ష. దీని ద్వారా రక్త ప్రవాహంలో తిరుగుతున్న సెల్ ఫ్రీ డీఎన్ఏను విశ్లేషించి కేన్స ర్ను చాలా ముందుగా గుర్తించవచ్చన్నారు. ఇలా 3 దశల్లో జన్యువులోని కేన్సర్ బారినపడ్డ, పడబోతున్న ప్రాంతాలను ఈ రక్త పరీక్ష ద్వారా చాలా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర విశ్లేషణతో కేన్స ర్ చికిత్స మరింత సులభతరం అవుతుందన్నారు. అపోహలను తొలగించాలి: కరోల్ సికోరా ప్రొఫెసర్ కరోల్ సికోరా మాట్లాడుతూ... కేన్సర్ నివారించడం సాధ్యమేనా అనుకునే అపోహలను ప్రయత్నమనే ఒక్క అడుగుతో తొలగించవచ్చన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ కేన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాధ్, డాక్టర్ రవీంద్రనాథన్, డాక్టర్ ఏవీ సురేష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అవగాహనతో భయాందోళనలు తొలగింపు.. కేన్సర్ను ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి కాంటినెంటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో వందలాది మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఆడవారిలో వచ్చే కేన్సర్లు, లక్షణాలు, జాగ్రత్తలపైన, గ్యాస్ట్రో ఇంటస్టైన్, లివర్ కేన్సర్లపైన ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లు, గ్లాడర్, కిడ్నీ, ప్రొస్టేట్, చర్మ కేన్సర్ల పైన అవగాహన కల్పి ంచామన్నారు. మంచి చికిత్సను అందించడమే కాకుండా కేన్సర్ రాకుండా అవగాహన కల్పించడం బాధ్యతగా అలవర్చుకున్నామన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు వారి సేవల్లో కేన్సర్ బాధితులను చేర్చాల్సిన అవసరముందని, 70 శాతం మంది బాధితులు ఆర్థిక సమస్యలతోనే మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
మెడాల్ అక్రమాలకు బీజం అనంతలోనే
తెలుగుదేశం పాలనలో జరిగిన భారీ కుంభకోణానికి అనంతపురం జిల్లాలోనే బీజం పడింది. 2015–19 మధ్య కాలంలో ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల నిర్వహణను చంద్రబాబు సర్కారు ఔట్ సోర్సింగ్ కింద ‘మెడాల్’ సంస్థకు కట్టబెట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురంలో ‘బ్రహ్మాండం’గా రక్తపరీక్షలు నిర్వహించారంటూ నివేదిక ఇప్పించి ఆగమేఘాల మీద ఆ సంస్థకే రాష్ట్ర వ్యాప్తంగా రక్తపరీక్షల నిర్వహణను కట్టబెట్టింది. మెడాల్ సంస్థ డాక్టర్లతో కుమ్మక్కై అవసరం ఉన్నా లేకున్నా రక్త పరీక్షలు రాయించి దాదాపు రూ.300 కోట్లు లూటీ చేసింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు వైద్య సేవల ముసుగులో భారీ దోపిడీ జరిగింది. రోగులకు ఉచితంగా చేసే రక్త పరీక్షల నిర్వహణను ఔట్సోర్సింగ్ ద్వారా ప్రైవేట్కు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగమైంది. రక్త పరీక్షల సేవల ఫ్రాంచైజీలు దక్కించుకున్న టీడీపీ నేతలు సైతం అందినంత దోచుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల నిర్వహణను టీడీపీ ప్రభుత్వం 2015లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలనుకుంది. ఇందు కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురాన్ని ఎంపిక చేసింది. ఈ మేరకు జీఓ 17 జారీ చేసింది. తొలుత జిల్లాలో ఆరు నెలల పాటు రక్తపరీక్షలు నిర్వహించి, విజయవంతమైతే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేది జీఓ సారాంశం. ఆ మేరకు ఆ ఏడాది జూన్లో పైలట్ ప్రాజెక్టు మొదలైంది. సెప్టెంబర్ 4న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాధినిర్ధారణ పరీక్షలు ఔట్సోర్సింగ్కు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం సెపె్టంబర్ 28న జీఓ 606 ఇచ్చారు. కుంభకోణం.. అలా మొదలైంది.. అనంతపురంలో మొదలైన పైలట్ ప్రాజెక్టు మూణ్నెల్లు కూడా పూర్తి కాకముందే.. అంతా బ్రహా్మండంగా జరిగిందని నివేదిక ఇచ్చారు. కమిటీ నివేదికకు ఆరు మాసాలు గడువు ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ తుంగలో తొక్కారు. ఓవైపు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లోనే సొంతంగా నిర్ధారణ పరీక్షలు చేసి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసుకుంటుండగా, ఏపీలో మాత్రం ప్రైవేటుకు అప్పజెప్పి భారీ స్కామ్కు తెరలేపారు. ఒక్కో టెస్టుకు రూ.234 అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 2016 జనవరి నుంచి ఔట్సోర్సింగ్కు రక్తపరీక్షల నిర్వహణ అప్పగించారు. ఇందులో 32 రకాల టెస్టులుంటాయి. ఒక టెస్టు చేసినా, అన్ని రకాల టెస్టులు చేసినా ఒక్క నమూనాకు రూ.234 ప్రకారం ప్రభుత్వం ‘మెడాల్’ సంస్థకు ఇవ్వాలి. దీంతో ‘మెడాల్’ పంట పండించుకుంది. కేవలం హిమోగ్లోబిన్, యూరిన్ పరీక్షలే లక్షల సంఖ్యలో చేసేవారు. దీనికి ఒక్కో పరీక్షకు బల్్కలో నాలుగు రూపాయలే అవుతుంది. ఇలా లక్షల టెస్టులు చేస్తే ఎంతవుతుందో అంచనా వేయొచ్చు. నేడు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి.. ఒకప్పుడు ఒక్కో పీహెచ్సీలో రక్తపరీక్షల కోసం ప్రైవేటు కంపెనీకి సగటున నెలకు రూ.6 లక్షలు వ్యయం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రక్తపరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లోనే ఇప్పుడు మెడాల్ చేసిన వాటికంటే ఎక్కువ రక్త పరీక్షలు చేస్తున్నారు. పీహెచ్సీల్లో ల్యాబ్ టెక్నీíÙయన్లను నియమించింది. ప్రతినెలా పీహెచ్సీలో మెరుగైన వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఉచిత రక్తపరీక్షలు, సొంత ల్యా»ొరేటరీలు ఏర్పాటయ్యాయి. ప్రజారోగ్య వ్యవస్థ ఇప్పుడు ఏపీలో కేరళ, తమిళనాడులకు దీటుగా ఉందన్నది నీతి ఆయోగ్ లాంటి సంస్థలే చెబుతున్నాయి. అప్పుడంతా అవినీతే ► ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల డాక్టర్లతో కుమ్మక్కయిన మెడాల్ ప్రతినిధులు యూరిన్, హిమోగ్లోబిన్, లేదా షుగర్ టెస్టులు వేల సంఖ్యలో రాయించుకునేవారు. ► ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఫ్రాంచైజీల పేరిట ప్రైవేటు ల్యాబ్లు అప్పగించారు. ► కొన్ని ఆస్పత్రుల్లో గర్భిణుల రక్తనమూనాలు సేకరించి టెస్టు చేయకుండానే ఫలితాలు ఇచ్చేవారు. ► రాష్ట్రంలో ఏటా 5వేలకు మించి మలేరియా కేసులు నమోదయ్యేవి కావు. అలాంటిది డబ్బు కోసం 2018లో 50 వేల మలేరియా కేసులకు టెస్టులు చేసినట్టు డ్యాష్బోర్డులో పొందుపరిచారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ దినపత్రిలో పతాక శీర్షికతో రాయగా డ్యాష్బోర్డులో ఉన్న మలేరియా టెస్టులు తొలగించి 6వేలకు కుదించారు. ► ఔట్సోర్సింగ్కు రక్తపరీక్షలు నిర్వహిస్తున్నామన్న సాకుతో ఒక్క పీహెచ్సీలో గానీ, సీహెచ్సీలో గానీ ల్యాబ్ టెక్నీషియన్లను నియమించలేదు. ► మెడాల్ సంస్థ అప్పట్లో తెలుగుదేశం నేతలకు ఫ్రాంచైజీలు ఇచ్చినందుకు భారీగా ముడుపులు అందినట్టు తేలింది. -
ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ ఇదే.. వారిలో రిస్క్ తక్కువ
మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. సాధారణంగా మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు (Human Blood Groups) కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయన్నది తెలిసిందే. వీటిలో రేర్ బ్లడ్ గ్రూప్ ఏది? ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారన్నది ఇప్పుడు చూద్దాం. మామూలు బ్లడ్ గ్రూపులలోని ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యుల్స్ ఉంటాయి. ఆ మాలిక్యుల్స్ని బట్టి బ్లడ్ గ్రూపులను నిర్ణయిస్తారు. A- యాంటిజన్ ఉంటే A గ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్గా లేకపోతే నెగిటివ్గా భావిస్తారు. Group A –ఇందులో యాంటిజన్ A, యాంటిబాడీస్ B ఉంటుంది Group B –యాంటిజన్ B and యాంటిబాడిస్ A ఉంటుంది Group AB –యాంటిజన్స్ AB ఉంటుంది కానీ యాంటిబాడీస్ ఉండవు (neither A nor B). Group O – యాంటిజన్స్ ఉండవు కానీ AB యాంటిబాడీస్ ఉంటాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అందించిన వివరాల ప్రకారం.. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారంటే.. O పాజిటివ్ బ్లడ్: 42% A పాజిటివ్ బ్లడ్: 31% B పాజిటివ్ బ్లడ్: 15% AB పాజిటివ్ బ్లడ్ : 5% O నెగిటివ్ బ్లడ్ : 3% A నెగిటివ్ బ్లడ్ : 2.5% B నెగిటివ్ బ్లడ్ : 1% AB నెగిటివ్ బ్లడ్ : 0.5% మందిలో ఉంది. ఈ గణాంకాలు బట్టి అరుదైన బ్లడ్ గ్రూపులు ఏంటన్నది సులభంగా అర్థమవుతోంది. దేశంలో B నెగిటివ్ బ్లడ్ కేవలం 1% మందిలోనే ఉండగా, అత్యల్పంగా AB నెగిటివ్ బ్లడ్ 0.5% మందిలో ఉంది. దీంతో దీంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి రక్తం లభించడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కోసారి సమయానికి సమయానికి రక్తం లభించక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే B నెగిటివ్, AB నెగిటివ్ బ్లడ్ గ్రూపులను అరుదైన బ్లడ్ గ్రూప్స్గా పేర్కొంటారు. అన్ని బ్లడ్ గ్రూప్స్లో కంటే O పాజిటివ్ బ్లడ్ ఉన్నవారు ఎవరికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందుకే వీరిని యూనివర్సల్ డోనర్స్ అంటాం. అంతేకాకుండా మిగిలిన బ్లడ్ గ్రూపుల వారికంటే వీరికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువని పలు పరిశోధనల్లో వెల్లడైంది. భారత్లో O(+,-) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు సుమారు 29% మంది ఉండగా అత్యధికంగా పెరు దేశంలో O(+,-) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 71% మంది ఉండటం విశేషం. -
రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగితే.. ప్రమాదం ఎక్కువే.. లక్షణాలేంటి? చికిత్స ఉందా?
సాధారణంగా ఇతర అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్ తెలుసుగానీ... రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక్కడ ఓ కీలకం దాగి ఉంది. మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకితే... మెల్లగా పాకుతూ అంత త్వరగా ప్రమాదం రాకపోవచ్చు. కానీ రక్తానికి ఇన్ఫెక్షన్ గనక సోకితే అది అన్ని అవయవాలకూ, కణాలకూ వెళ్తూ ఆహారాన్నీ, ఆక్సిజన్ను తీసుకెళ్తూ వెళ్తూ ఇన్ఫెక్షన్ను కూడా దేహమంతటికీ వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి. రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగించే ఈ కండిషన్ను 'సెప్టిసీమియా’ అని పిలుస్తారు. దీనిపై అవగాహన కోసం ఈ కథనం. మామూలుగా ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని వాడుకగా ‘సెప్టిక్’ అయిందని అంటారు. రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది దేహాన్నంతటినీ విషపూరితం చేసే కండిషన్ను ‘సెప్సిస్’ లేదా ‘సెప్టిసీమియా’ అంటారు. దీని గురించి కొన్ని వివరాలివి... సెప్టిసీమియాకు కారణాలు బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఏవైనా పరాన్నజీవులతో పాటు మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చాలాకాలంగా ఆల్కహాల్కు తీసుకుంటూ ఉండటం, దీర్ఘకాలంగా అదుపులేకుండా డయాబెటిస్ బారిన పడటం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం, రోగనిరోధక వ్యవస్థను మందకొడిగా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతుండటం, కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులను విచక్షణరహితంగా వాడటం సెప్టిసీమియాకు దారితీయవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్లలో సెస్టిసీమియా ముప్పు మరీ ఎక్కువ... ♦ గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందని సందర్భాల్లో ♦ ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిలో కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ప్రధానంగా నిమోనియా వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువ. ♦ ఏదైనా కారణంతో పొట్ట (అబ్డామిన్)లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాదాపు మూడోవంతు కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ♦ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో అది సెప్టిసీమియా ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ♦ మెదడు తాలూకు ఇన్ఫెక్షన్స్ కూడా సెప్టిసీమియాగా మారవచ్చు. ♦ ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్ సోకితే చాలా కొద్దిమందిలో (2% మందిలో) అది సెప్టిసీమియాగా మారే అవకాశముంది. నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్–రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో సెప్టిసీమియా ఉనికి, తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా తర్వాత చేయాల్సిన చికిత్సనూ నిర్ణయిస్తారు. నివారణ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగేనీరు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే మరికొన్ని అంశాలూ సెప్సిస్ నుంచి కాపాడతాయి. అవి... ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ♦ నీటిని కాచి, చల్లార్చి లేదా ఫిల్టర్ అయిన నీటినే తాగాలి. ♦ వంటకాల్ని వేడివేడిగా ఉండగానే తినేయాలి. బయటి ఫుడ్కు (వీలైనంతవరకు) దూరంగా ఉండాలి. ♦ కూరగాయలను, ఆకుకూరలను శుభ్రంగా కడిగాకే వంటకు ఉపక్రమించాలి. తొక్క ఒలిచి తినే పండ్లు మినహా మిగతా వాటిని కడిగే తినాలి. ♦ తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ♦ మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ♦ గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్ వేసుకోని, సేవలందించాలి. ♦తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ఫేస్మాస్క్ ధరించాలి. ♦ చెప్పులు, బూట్లు వంటి పాదరక్షల్ని బయటే విడవాలి. ♦ పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦ డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. లక్షణాలు ♦ చలితో వచ్చే జ్వరం ( ఫీవర్ విత్ చిల్స్) ♦ ఊపిరి అందకపోవడం (బ్రెత్లెస్నెస్) ♦ గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్ హార్ట్బీట్) ♦ అయోమయం / మూర్ఛ (ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ / సీజర్స్) ♦ మూత్రం పరిమాణం బాగా తగ్గడం ♦ దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం ♦ పొట్టలో నొప్పి / వాంతులు / నీళ్ల విరేచనాలు ♦ కామెర్లు (జాండీస్). చికిత్స సెప్టిసీమియా రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రొసీజర్స్ చేస్తారు. ♦ రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్ ఫ్లుయిడ్స్) ♦రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ (ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్) ♦ రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే మందులతో సపోర్ట్ ♦ ఆక్సిజెన్ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్తో శ్వాస అందించడం ♦ కిడ్నీ రోగుల్లో డయాలసిస్ ♦ అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్ను ఎక్కించడం) ♦ పేషెంట్కు ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా రక్తనాళం ద్వారానే అందిస్తారు. (ఇంట్రావీనస్ న్యూట్రిషనల్ సపోర్ట్). - డాక్టర్ ఆరతి బెల్లారి ,సీనియర్ ఫిజీషియన్ -
అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆగిన రక్త పరీక్షలు
కడప సెవెన్రోడ్స్: ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యుని వద్దకు వెళతాం. అవసరమైన పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాతే ఆ వ్యాధిని పోగొట్టేందుకు తగిన మందులు ఇస్తారు. ఎక్కడైనా జరిగేది, జరగాల్సింది కూడా ఇదే. కానీ కడప అర్బన్ హెల్త్ సెంటర్లలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. రోగ నిర్ధారణ జరగకుండానే ఏవో మందులు ఇచ్చి రోగులను పంపేస్తున్నారు. అందుకు అక్కడి సిబ్బందిని తప్పుబట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే రక్త పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ (కారకాలు) సరఫరా లేకపోవడంతో వారు అలా చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంది. ఇది వర్షాకాలం. దోమకాటు, కలుషిత నీరు తాగడం వల్ల డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో వ్యాధి బారిన పడిన ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అంతో ఇంతో స్థోమత ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేయలేని పేదలు రిమ్స్, అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అక్కాయపల్లె అర్బన్ హెల్త్ సెంటర్కు పలువురు రోగులు వైద్యం చేయించుకోవడానికి వచ్చారు. తనకు ఐదారు రోజులుగా జ్వరం వస్తోందని, ఇంతకుమునుపు ఇక్కడ చూపించగా పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారని ఓ రోగి వైద్యుడికి తెలిపారు. కానీ జ్వరం తగ్గలేదని, రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరారు. ఇందుకు వైద్యుడు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకు రావాలని చీటీ రాయించారు. అక్కడే ఉన్న ల్యాబ్లోకి వెళ్లి పరీక్ష చేయించగా 11.9 శాతం ఉన్నట్లు తెలిసింది. తనకు కావాల్సింది హిమోగ్లోబిన్ టెస్ట్ కాదని, తనను పీడిస్తున్న జ్వరం ఏదో చెప్పాలని ఆ రోగి అడిగాడు. డెంగీ, మలేరియా, టైఫాయిడో రక్త పరీక్షల ద్వారా తేల్చాలంటే అందుకు అవసరమైన రీ ఏజెంట్స్ ప్రభుత్వం నుంచి సరఫరా కాలేదని సిబ్బంది కుండబద్దలు కొట్టారు. ఇక చేసేది లేక వైద్యుని వద్దకు వెళ్లగా పారాసిటమాల్ ఇంజెక్షన్, పారాసిటమాల్ మాత్రలు, అజిత్రోమైసిన్ యాంటిబయాటిక్ మాత్రలు వాడాలని సూచించారు. అయితే హెల్త్ సెంటర్లో అజిత్రోమైసిన్ మాత్రలు లేవు. అందుకు బదులు అమోక్సీలిన్ క్యాప్సూల్స్ ఇచ్చారు. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటంటే ఏ జ్వరం పీడిస్తున్నదో నిర్ధారణ కాకున్నా, జ్వరం అనగానే రొటీన్గా ఇచ్చే మాత్రలు ఇచ్చి పంపేస్తున్నారు. ఈ పని మందుల షాపు వారైనా చేస్తారు. ఇంత మాత్రానికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఏముందని పలువురు రోగులు ప్రశ్నిస్తున్నారు. కాదు, కూడదని అడిగితే రిమ్స్కు వెళ్లాలని సలహా ఇస్తున్నారు. జ్వరాలు వంటి చిన్నచిన్న వ్యాధులకు దూరం వెళ్లకుండా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసింది. అవసరమైన సిబ్బంది, పరికరాలు ఉన్నా రీ ఏజెంట్స్ వంటివి సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం విచారకరం. రీ ఏజెంట్స్ కొరత నిజమే రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడానికి అవసరమైన రీ ఏజెంట్స్ (కారకాలు) లేని మాట వాస్తవమే. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సీడీఎస్) నుంచి సరఫరా కావాల్సి ఉంది. రీ ఏజెంట్స్ కొరత ఉంది గనుకే ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తేనే రక్త పరీక్షలు చేస్తున్నాం. అర్బన్ సెంటర్లలో లేకపోతే రిమ్స్ వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించుకోవచ్చు. హెల్త్ సెంటర్లలో అజిత్రోమైసిన్ లేకపోతే అందుకు బదులు అమోక్సీలిన్ క్యాప్సూల్స్ వాడినా సరిపోతుంది. – డాక్టర్ కె.నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడప -
రక్తం నోటితో పీల్చాలా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా మారింది.. ఆశ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్–ఏఎస్హెచ్ఏ) కార్యకర్తల పరిస్థితి. చాలీచాలని వేతనాలతో గ్రామస్థాయిలో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశా కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అయ్యేలా చూడటం, పిల్లలకు టీకాలు వేయించడం తద్వారా మాతాశిశు మరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఆశ వర్కర్ల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులోనూ వీరి సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారికి కనీస భద్రతా సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. ప్రస్తుతం హిమోగ్లోబిన్ పరీక్ష, క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల నుంచి శాంపిల్స్ సేకరించే క్రమంలో తామెక్కడ వ్యాధుల బారిన పడతామోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇవి ల్యాబ్ టెక్నీషియన్ వంటి నిపుణులతో చేయించాలి్సన పనులను తూతూ మంత్రంగా శిక్షణ ఇప్పించి.. తమతో చేయించడం అన్యాయమని వాపోతున్నారు. 20 తెమడ శాంపిళ్లు మోసుకురావాలా? ఇదే క్రమంలో వీరికి అప్పగించిన మరో పని టీబీ నిర్ధారణ. గతంలో రెండువారాల పాటు రాత్రిళ్లు జ్వరంతో బాధపడుతూ.. నిర్విరామంగా దగ్గుతూ, బరువు తగ్గిన వారికి మాత్రమే ఉదయంపూట ఆశ కార్యకర్తలు తెమడ సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపేవారు. ► ఈ క్రమంలో వీరిలో నూటికి 99 శాతం పాజిటివ్ రేటు ఉండేది. కానీ, ప్రస్తుతం జిల్లా వైద్యాధికారులు టీబీ పరీక్షల శాంపిల్స్ సేకరణలో టార్గెట్ విధించారు. ప్రతీ సబ్సెంటర్కు ముగ్గురు లేదా నలుగురు (వెయ్యిమందికి ఒక ఆశ) కార్యకర్తలు ఉంటారు. ► వీరు తలా 20 తెమడ పరీక్షలు తేవాలని లక్ష్యం విధించారు. ఆ స్థాయిలో అనుమానిత కేసులు లేవని ఆశ కార్యకర్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా.. అధికారులు మాత్రం ససేమీరా అంటున్నారు. నెలనెలా నిర్వహించే రివ్యూ మీటింగుల్లో ఆశ కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ► ఈ క్రమంలో తెమడ శాంపిల్స్ ఉన్న డబ్బాలను తాము చేతులతో మోసుకుపోతున్నామని, వీటిని పట్టుకుని బస్సు, ఆటో ఏది ఎక్కినా.. భయంతో తోటి ప్రయాణికులు కిందకు దించేస్తున్నారని వాపోతున్నారు. ► వాస్తవానికి హిమోగ్లోబిన్, తెమడ పరీక్షలు రెండూ ఆశలకు కేటాయించిన విధులు కావు. వీటికి ప్రత్యేకంగా టీఏ, డీఏలు ఏమీ రావు. అయినా, వీరు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ పనులు చేస్తున్నారు. ► క్షయ అంటువ్యాధి అని, సరైన రక్షణ లేకుండా రోగి వద్దకు వెళ్లినా, ఏమరుపాటుగా ఉన్నా.. తాము రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులతో భోజనం చేయలేకపోతున్నామని, తమతో కుటుంబ స భ్యులు ఏం వ్యాధులు సంక్రమిస్తాయో అని నిత్యం భయపడుతున్నారని అంటున్నారు. రక్తం నోటితో పీల్చాలా? ► ఫీవర్ సర్వే కోసం ఆశ కార్యకర్తలు ఇల్లిళ్లూ తిరిగి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రతీ ఆశకు వైద్యాధికారులు ఒక కిట్ ఇచ్చారు. దానిసాయంతో జ్వరంతో బాధపడుతున్న వారికి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి. ► కిట్లో డీఅయోనైజ్డ్ వాటర్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ (హెచ్సీఎల్), పరీక్షనాళిక, హి మోగ్లోబినో మీటర్, పిప్పెట్, సూదులు, కాటన్ తదితరాలు ఉంటాయి. ఇందులో సూది సాయంతో రోగి వేలిపై పొడిచి ఆ రక్తాన్ని నేరుగా పిప్పిట్లోకి 20 మైక్రోలీటర్ మార్కు వచ్చేంత వరకు నోటితో పీల్చాలి. ► తరువాత ఈ రక్తాన్ని అంతే ఓపికతో హెచ్సీఎల్ కలిపిన ట్యూబ్లో నోటితో ఊదుతూ వదలాలి. దానికి డీ అయోనైజ్డ్ వాటర్ కలుపుతూ హిమోగ్లోబిన్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, ఇక్కడే ఆశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ► రోగి రక్తాన్ని పిప్పెట్లోకి ఎక్కించే క్రమంలో ఆ రక్తం నోటిలోకి వెళితే? అన్న ఆందోళన వీరిని వెంటాడుతోంది. ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో? అవి తమకు ఎక్కడ సంక్రమిస్తాయో అని భయపడుతున్నారు. రెక్కాడితే గానీ, డొక్కాడని పేద బతుకులు తమవని, అలాంటి తమకు ఇలాంటి పనులు చెప్పడం తగదని అంటున్నారు. మా బతుకులకు రక్షణ ఏది వాస్తవానికి టీబీ, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసే క్రమంలో ఎలాంటి రక్షణను వైద్యాధికారులు కల్పించడం లేదు. కనీసం అవసరాలైన మా స్కు, శానిటైజర్, గ్లోవ్స్, కళ్లద్దాలు లాంటి కనీస సదుపాయాలు లేవు. దీంతో ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడతామోనని భయంభయంగా విధులు నిర్వహిస్తున్నాం. రక్తం నోట్లోకి వెళితే ఎలా? టీబీ అనుమానితుడి తెమడ ద్వారా వ్యాధి సంక్రమిస్తే ఎలా? అన్న భయంతో.. బిక్కుబిక్కుమంటూ విధులు ని ర్వహిస్తున్నాం. మా బతుకులకు రక్షణ లేదు. – మారెళ్ల శ్రీలత, ఆశా యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి -
ఈఎంఎం బ్లడ్ గ్రూప్.. ఎప్పుడైనా విన్నారా?
అహ్మదాబాద్: మనుషుల్లో బ్లడ్ గ్రూప్లు సాధారణంగా ఏ, బీ, ఓ, లేదా ఏబీ అని ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, గుజరాత్కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తిలో కొత్తరకం బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు వైద్యులు. దేశంలోనే అరుదైన రక్తం కలిగిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే.. ఇలా ప్రత్యేక రక్త సమూహం కలిగిన వ్యక్తులను గుర్తించటం ప్రపంచవ్యాప్తంగా ఇది 10వ కేసుగా పలు నివేదికలు వెల్లడించాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన వ్యక్తిలో 'ఈఎంఎం నెగెటివ్' బ్లడ్ గ్రూప్ను కనుగొన్నారు వైద్యులు. సాధారణంగా మానవ శరీరంలో నాలుగు రకాల బ్లడ్ గ్లూప్లు ఉంటాయి. అందులో ఏ, బీ, ఓ, ఆర్హెచ్, డఫ్పీ అంటూ 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. అలాగే.. ఈఎంఎం అధికంగా ఉండే 375 రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఈఎంఎం నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఇతరులకు తన రక్తాన్ని ఇవ్వలేరు.. ఇతరుల నుంచి తీసుకోలేరు. ఎలా నిర్ధారించారు? రాజ్కోట్కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ చేయాల్సి రావటం వల్ల రక్తం అవసరమైంది. ఆసుపత్రిలోని ల్యాబ్లో రక్తం పరీక్షించగా గ్రూప్ తెలుసుకోలేకపోయారు. దీంతో రక్తం నమూనాలను సూరత్లోని రక్త నిధి సేకరణ కేంద్రానికి పంపించినట్లు అక్కడి వైద్యులు సన్ముఖ్ జోషీ తెలిపారు. ఆ రక్తాన్ని పరీక్షించగా ఏ గ్రూప్తోనూ సరిపోలలేదు. దీంతో వృద్ధుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను అమెరికాకు పంపించినట్లు చెప్పారు జోషీ. దీంతో అరుదైన బ్లడ్ గ్రూప్గా తేలిందన్నారు. రక్తంలో ఈఎంద్ లేకపోవటం వల్ల దానిని ఈఎంఎం నెగెటివ్గా ఐఎస్బీటీ నామకరణ చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 10 మంది మాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మందిలో మాత్రమే ఇలాంటి అరుదైన ప్రత్యేక బ్లడ్ గ్రూప్లను కనుగొన్నారు. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన వ్యక్తిలో అలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్ను కొనుగొన్న నేపథ్యంలో ఆ సంఖ్య 10కి చేరింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
అరచేతిలో ఆరోగ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పరిశీలించి ఆ వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఈ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాలో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది. వాటి ఫలితా లను ప్రత్యేక పోర్టల్లో నిక్షిప్తం చేయనుంది. ఆ వ్యక్తికి మాన్యువల్ రిపోర్టులు ఇవ్వడం, ఫలితాల్లో తేడాలను గుర్తిస్తే మందులను ఉచితంగా పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు అవసరమైతే పెద్దాసుపత్రికి రిఫర్ చేయడం జరిగిపోనుంది. కార్యక్రమాన్ని అతి త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. కీలక పరీక్షలతో ప్రొఫైల్.. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన వారికే పరిమితం చేశారు. రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు 18 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ధారించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ 30 రకాల పరీక్షలు చేయనుంది. ప్రధానంగా బ్లడ్ గ్రూపింగ్, మూత్రపిండాల పనితీరు, కాలేయం పనితీరుతో పాటు కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా తదితరాలు పరిశీలించనుంది. పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేయనుంది. ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ప్రొఫైల్ పోర్టల్లో వివరాలను నిక్షిప్తం చేస్తుంది. పోర్టల్ రూపకల్పనలో హైదరాబాద్ ఐఐటీ సహకారం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఇలా.. ‘హెల్త్ ప్రొఫైల్’అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రే కీలకం. కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేస్తారు. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ముందుగా కుటుంబానికి చేరుకుని అర్హుల వివరాలు సేకరిస్తారు. వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యను జనరేట్ చేసిన తర్వాత శాంపిల్స్ (నమూనాలు) తీసుకుంటారు. వాటిని ప్యాక్ చేసి బ్లడ్ గ్రూపింగ్, సీబీపీ కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. మిగతా పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్స్కు చేరవేస్తారు. అక్కడ పరీక్షలు ముగిశాక ఉన్నతాధికారు లు, వైద్యనిపుణుల ఆమోదం తర్వాత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు యూనిక్ డిజిటల్ హెల్త్ కార్డుతో పాటు పరీక్షల ఫలితాల ప్రతులను ఇస్తారు. పరీక్షల్లో లోపాలు గుర్తించిన వారికి మెడిసిన్ కిట్, ఆరోగ్యశాఖ మంత్రి సందేశాన్ని ఇస్తారు. ఇతర జబ్బులున్నట్టు తెలిస్తే జిల్లా ఆస్పత్రి, నగరంలోని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు రిఫర్ చేసి ప్రత్యేక చికిత్సను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం కృషి చేస్తుంది. -
దేశంలోనే తొలి సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్
సాక్షి, కొరుక్కుపేట(తమిళనాడు): దేశంలోనే తొలిసారిగా కాంటాక్ట్ లెస్ సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్ను చెన్నైలో అందుబాటులోకి తెచ్చారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్, సినీ దర్శకురాలు కృతికా ఉదయనిధి అతిథులుగా పాల్గొని సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆప్టిమిస్ట్ సంస్థకు చెందిన వేల్ మురుగన్, సరస్వతి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో భాగంగా రక్త పరీక్షల కోసం వినూత్నమైన, సులువైన విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగకరంగా సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్ ఎంతో దోహదపడుతుందని దీనిని రూపొందించిన నిర్వాహకులను అభినందించారు. చదవండి: Helicoter Crash: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ -
‘బి’ బ్లడ్ గ్రూప్ వారికే ఎక్కువగా కరోనా!
సూర్యాపేట: పలానా గ్రూపు రక్తం వారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందట.. పలానా వారికి చాలా తక్కువగా సోకుతుందట అని చాలాసార్లే విని ఉంటాం. అయితే దీని శాస్త్రీయత గురించి తెలుసుకునేందుకు సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ‘ఒ’బ్లడ్ గ్రూప్ వారికి కూడా ఎక్కువగానే సోకుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనానికి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ మెడికల్ మెడ్రివ్ జర్నల్ గుర్తింపు దక్కింది. కరోనా వైరస్ మొదటి, సెకండ్ వేవ్ల సమయంలో సూర్యాపేట మెడికల్ కాలేజీలో కోవిడ్ చికిత్సపొందిన 200 మంది రోగుల రక్తనమూనాలను పాథాలజీ వైద్య బృందం సేకరించింది. సేకరించిన రక్తనమూనాలపై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ శారద ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, పాథాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ అనునయిల, పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రావూరి స్వరూప పాల్గొన్నారు. -
‘ఇలా చేస్తే వారి ప్రాణాలు దక్కుతాయి’
లండన్: కోవిడ్ చికిత్సకు ఉపకరించే కీలక విషయాలు తమ పరిశోధనలో వెల్లడయ్యాయని యునైటెడ్ కింగ్డమ్కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్ బాధితుల రక్త నమూనాలను పరిశీలించగా వారి ప్లాస్మాలోని ప్రొటీన్స్ స్థాయుల్లో తేడాలున్నట్టు తెలిసిందన్నారు. బాధితుల ప్రొటీన్ స్థాయుల్లో మార్పులకు కారణమయ్యే బయోమేకర్స్ను పరిశీలించడం ద్వారా.. బాధితుల్లో వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతోందో తెలుసుకోవచ్చన్నారు. కోవిడ్ బాధితుల్లో కొందరు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే. మరికొందరు తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణిస్తున్నారని అధ్యయనంలో భాగమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: భారత్లో అమెరికా కంటే ఎక్కువ కేసులు: ట్రంప్) ప్లాస్మాలో ప్రోటీన్ స్థాయులను బట్టి ఎవరికి అత్యవసర, ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరమో తెలుసుకోవచ్చన్నారు. తద్వారా ఎందరో ప్రాణాలకు కాపాడుకోవచ్చని వారు ధీమా వ్యక్తం చేశారు. త్వరగా రక్త నమూనాలను పరీక్షించి ప్రోటీన్లలో తేడాలను గమనిస్తే.. ఆ వ్యక్తిలో కోవిడ్ తీవ్రత ఎలా ఉండనుందో తెలిసిపోతుందన్నారు. తమ స్టడీలో వెల్లడైన విషయాలు రోగి పరిస్థితి అంచనా వేసేందకు ఉపయోగపడతాయని అధ్యయనానికి నేత్వత్వం వహించిన ఫ్రాన్సిక్ క్రిక్ యూనివర్సిటీకి చెందిన మార్కస్ రాల్సర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణ కోసం ఇవే కీలకం కానున్నాయని తెలిపారు. వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వివిధ దశలకు చెందిన 31 మందిపై తమ అధ్యయనం జరిగిందని రాల్సర్ వెల్లడించారు. వారిలో వ్యాధి తీవ్రతను బట్టి 27 రకాల ప్రొటీన్ స్థాయుల్లో వైవిధ్యతలు గుర్తించినట్టు చెప్పారు. మరో 17 మంది కోవిడ్ రోగులను, 15 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ప్రొటీన్ స్థాయులను కూడా పరిశీలించి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ నియమాల ప్రకారం.. రోగులను వర్గీకరించామని తెలిపారు. కాగా, సెల్ సిస్టమ్స్ అనే జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. (చదవండి: డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం: బోల్సోనారో) -
రక్త పరీక్ష..శిక్ష
ఎవరైనా అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళితే రక్త పరీక్షలు చేసి.. ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తారు. ఇక సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు.. జ్వరపీడితులకు రక్తపరీక్షలు తప్పనిసరి. రోజూ 2 వేల ఓపీ ఉండే అనంతపురం సర్వజనాస్పత్రిలో రక్త పరీక్షలు సకాలంలో చేయడం లేదు. రక్త పరీక్ష నిర్వహించేందుకు రూ.లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్లు తెచ్చినా వాటినిి వాడే కెమికల్స్ లేకపోవడంతో సిబ్బంది మాన్యువల్గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రక్త పరీక్షల ఫలితం ఆలస్యమవుతుండగా.. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఈ చిత్రంలోని బాలిక పుట్టపర్తి మండలం నిడిమామిడికి చెందిన సాహితి. నవంబర్ నెలలో డెంగీతో సర్వజనాస్పత్రిలో చేరింది. వెంటనే రక్త పరీక్ష చేయాల్సి ఉన్నా.. సెల్కౌంటర్ పనిచేయకపోవడంతో సిబ్బంది వైద్య పరీక్షలు వాయిదా వేశారు. చివరకు చిన్నారి ప్లేట్లెట్ కౌంట్ 30వేలకు తగ్గిపోవడంతో టెక్నీషియన్లు స్పందించి పరీక్షలు చేశారు. చిన్నవార్డులోనే రోజూ 200 మందికిపైగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర సమయంలో కీలకం కానున్న రక్త పరీక్షల నివేదికలు అందక వైద్యులు కూడా సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లా వాసులందరికీ పెద్ద దిక్కు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. అందుకే ఇక్కడ రోజూ 2 వేల మంది ఔట్పేషంట్లు, 1,300 మంది ఇన్పేషంట్లు ఉంటున్నారు. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో దాదాపుగా వెయ్యి మందికి వివిధ రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసమే పెథాలజీ విభాగంలో రక్తపరీక్షల కోసం రూ.20 లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్ మిషన్లు(హెమటాలజీ అనలైజర్) తెప్పించారు. కానీ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. కెమికల్స్ లేవన్న కారణంతో ఐదు నెలలుగా వాటిని మూలకుపెట్టారు. దీంతో వివిధ వార్డుల్లో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. సెల్కౌంటర్ సేవలు ఇలా... సెల్కౌంటర్ మిషన్ ద్వారా ప్లేట్లెట్స్, టీసీ, డీసీ, సీబీపీ, హెచ్బీ తదితర పరీక్షలు నిమిషాల్లో చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా చేసే పరీక్షలు దాదాపుగా 500 వరకు ఉంటాయి. ఫలితం కూడా వేగవంతంగా అందుతుంది. దాన్నిబట్టి పరిస్థితి విషమించిన రోగులను ఇతర ఆస్పత్రులకు పంపడమో, లేదా మెరుగైన వైద్యం అందించడమో చేయవచ్చు. కానీ సెల్కౌంట్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డు, ఎఫ్ఎం, ఎంఎం, చెస్ట్, ఆర్థో, గైనిక్ తదితర వార్డుల్లో టెక్నీషియన్లు మాన్యువల్గా పరీక్షలు చేస్తున్నారు. వివిధ వార్డుల్లో రక్తపూతలు తీయడానికే గంటల సమయం వ్యవధి పడుతోంది. రక్తపూతలు తీసిన వెంటనే వారే మాన్యువల్గా పరీక్షలు చేయడానికి కనీసం రెండు గంటల సమయం పడుతోంది. దీంతో ఫలితం ఆలస్యమవుతుండగా.. వైద్య సేవల్లోనూ జాప్యం జరుగుతోంది. పోని ప్రైవేట్గా రక్త పరీక్షలు చేయించాలంటే రూ.300 నుంచి రూ.400 ఖర్చు అవుతుంది. సర్వజనాస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఇది మరింత భారంగా మారింది. పనిభారంతో పరీక్షలు వాయిదా.. సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. సెల్కౌంట్ మిషన్లు అందుబాటులో లేక ఒక్కోరోజు ఒక్కో యూనిట్ చొప్పున టెక్నీషియన్లు మాన్యువల్గా పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఇక శనివారం, ఆదివారం వస్తే రక్త పరీక్షలకు మూడ్రోజుల సమయం పట్టే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్ష ఫలితం వచ్చే వరకూ వైద్యులూ సరైన చికిత్స అందించలేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిన్నపిల్లల వార్డులోనే కాదు.. ఆస్పత్రిలోని ఎంఎం, ఎఫ్ఎం, ఆర్థో, చెస్ట్, ఓపీ, గైనిక్ తదితర విభాగాల్లో రక్త పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనిభారంతో టెక్నీషియన్లు రక్తపరీక్షలు వాయిదా వేస్తుండటంతో రోగులకు ప్రాణసంకటంగా మారింది. అందుబాటులోకి రావాలంటే.. సెల్కౌంటర్ మిషన్లు అందుబాటులోకి రావాలంటే కెమికల్స్ కావాల్సి ఉంది. సెల్కౌంటర్ మిషన్లో 8 రకాల కెమికల్స్ను వినియోగిస్తారు. వాటికోసం ప్రతి నెలా రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది రెండు మినీ సెల్కౌంటర్ మిషన్లను సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీర్లు ల్యాబ్లలో ఎలక్ట్రికల్, ఏసీ తదితర పనుల్లో జాప్యం చేశారు. దీంతో వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం మేలుకుని రూ.లక్షలు విలువ చేసే సెల్కౌంటర్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. కెమికల్స్కు ఆర్డరిచ్చాం కెమికల్స్ లేకపోవడంతో సెల్కౌంటర్ మిషన్లను ఉపయోగించడం లేదు. కెమికల్స్కు ఆర్డర్ ఇచ్చాం. త్వరలోనే కెమికల్స్ వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో రెండు మినీ సెల్కౌంటర్ మిషన్లున్నాయి. వాటి ద్వారా రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రామస్వామి నాయక్,ఆస్పత్రి సూపరింటెండెంట్ రక్తనమూనాలు సేకరిస్తున్న టెక్నీషియన్ -
నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్
-
వైరల్ : నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్
సాధారణంగా చిన్న పిల్లలు సూదిని చూస్తేనే గజగజ వణికిపోతారు. అలాంటిది ఒక డాక్టర్ మాత్రం తన దగ్గరకు వచ్చిన చిన్నారికి మాత్రం ఏ నొప్పి తెలియకుండా పాట పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. షానన్ తన కూతురుకు రక్తపరీక్ష చేయించడానికి దగ్గర్లోని ఒక క్లినిక్కు తీసుకెళ్లారు. అయితే చిన్నారిని పరీక్షించిన డాక్టర్ ర్యాన్ కోట్జీ రక్తం తీసేటప్పడు తనకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ప్రముఖ పాప్ సింగర్ నాట్ కింగ్ కోల్స్ 'అన్ఫర్గెటబుల్' పాటను పాడారు. అయితే రక్త పరీక్ష నిర్వహిసున్న సమయంలో ఒక్క సెకను కూడా ఏడ్వకుండా డాక్టర్ పాడిన పాటను చిన్నారి ఎంతో ఇష్టంగా వినడం ఆశ్చర్యం కలిగించింది . ఇదంతా గమనించిన చిన్నారి తల్లి షానన్ డాక్టర్ పాడిన పాటను వీడియో రూపంలో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ' డాక్టర్ ర్యాన్ కోట్జీ చేసిన పని నాకు ఆనందాన్ని కలిగించింది. నా బిడ్డకు నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్కు కృతజ్ఞతలు. రక్త పరీక్ష చేసేటప్పుడు తను ఏడుస్తుందేమోనని ఎంతో బయపడ్డా. కానీ డాక్టర్ వ్యవరించిన తీరు నన్ను ఆకట్టుకుంది' అంటూ ఆమె తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. షానన్ షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది. షేర్ చేసిన కాసేపటికే 43 వేల కామెంట్లు వచ్చాయి. చిన్నారికి నొప్పి తెలియకుండా డాక్టర్ కోట్జీ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. -
పెద్దలకూ పరీక్షలు
మనం ముఖం చూసుకోడానికి అద్దం వాడతాం. ఏమైనా తేడా వస్తే వెంటనే గుర్తిస్తాం. ముఖం మీద ఏదో గాయమో, అలర్జీయో లాంటిది కనిపిస్తే వెంటనే తగిన చికిత్స తీసుకునేందుకు హాస్పిటల్కు పరుగెడతాం. ఇక మిగతా ఒళ్లు భాగం కూడా అంతే. కాకపోతే ముంజేతి కంకణానికి అక్కర్లేనట్టే మిగతా శరీరభాగాలకూ అద్దం అవసరం లేదు. ఇలా బయట కనిపించే తేడాలను గుర్తించడం సరే... కానీ మరి ఒంట్లోని మిగతా శరీర భాగాలు, అంతర్గత అవయవాలు, వాటి పనితీరులో తేడాలు ఇవన్నీ గుర్తించడం ఎలా? అందుకు వైద్య పరీక్షలు తోడ్పడతాయి. మరీ ముఖ్యంగా నలభై, యాభై ఏళ్లు దాటాక ప్రతి వ్యక్తిలోనూ అంతర్గత అవయవాల పనితీరులో మార్పులు రావడం మొదలవుతుంది. అయితే ఒంటి మీద వచ్చినట్టుగా అవి బయటకు కనిపించవు కదా. అందుకే ఒక వయసు దాటాక తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలనీ, అందులో కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు లేదా వైద్య సమస్యలు రాబోతున్న విషయం ముందగానే తెలుసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. యాభై ఏళ్లు దాటినవారిలో మరీముఖ్యంగా పురుషుల్లో ఎలాంటి వైద్య పరీక్షలు అవసరమో, అవి ఎందుకు చేయించాలో తెలిపేందుకు ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం. సాధారణంగా యాభై, అరవైలలో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలావరకు వెన్వెంటనే బయటకు తమ లక్షణాలను కనిపించనివ్వవు. బయటకు అంతా బాగున్నట్లు అనిపించినా, లోపల ఆరోగ్యం అంతే బాగుండకపోవచ్చేమో! ఉదాహరణకు హైబీపీ. అది ఉన్నట్లే తెలియదు. కానీ లోపలంతా డొల్ల చేసేస్తుంది. ఆరోగ్యాన్ని గుల్లబారుస్తుంది. అలాగే డయాబెటిస్. ఇలాంటిదే కొలెస్ట్రాల్. అందుకే యాభై, అరవైలలో ఆ వయసు పురుషుల ఆరోగ్యానికి కొన్ని పరీక్షలు అవసరం. ఇక మధ్య వయసు వచ్చే వరకూ వాళ్లకు పొగతాగే అలవాటు ఉంటే పైన పేర్కొన్న జబ్బులతో పాటు గుండెపోటూ, క్యాన్సర్ వంటి వాటికీ అవకాశం ఎక్కువ. ఇక క్యాన్సర్ వంటి కొన్ని జబ్బులను ముందుగానే కనుగొంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు చాలా రకాల క్యాన్సర్లను మొదటి దశలోనే కనుగొన్నామనుకోండి. 85కి పైగా రకాలను దాదాపుగా నూరుపాళ్లు పూర్తిగా నయం చేయవచ్చు. యాభై ఏళ్ల పురుషులకు చేయించాల్సిన పరీక్షలు చక్కెర వ్యాధి కోసం: సాధారణంగా ఉదయాన్నే పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించాలన్న విషయం ఈ రోజుల్లో చాలామందికి తెలిసిందే. అనంతరం భోజనం చేసిన రెండు గంటల తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ కూడా చేయించాలి. ఈ రెండు పరీక్షలతో రక్తంలోని చక్కెర పాళ్ల ఆధారంగా డయాబెటిస్ తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక వీటితో పాటు సీరమ్ క్రియాటినిన్, సీయూఈ అనే పరీక్షలు కూడా అవసరమవుతాయి. డయాబెటిస్ కారణంగా మూత్రపిండాలూ ప్రభావితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియాటినిన్ పరీక్షలో మూత్రపిండాలు ఏమైనా ప్రభావితం అయ్యాయా అన్న విషయం తెలుస్తుంది. అలాగే సీయూఈ పరీక్ష అన్నది మూత్రపరీక్ష. దీని ద్వారా జాండిస్ ఏమైనా వచ్చాయా అన్నది తెలుసుకుంటారు. అంతేగాక చక్కెర పాళ్లు నియంత్రణలో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోడానికి హెచ్బీఏ1సీ, జీటీటీ (గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్) అనే పరీక్షలు అవసరమవుతాయి. గుండె జబ్బుల నిర్ధారణ కోసం: ► గుండెజబ్బుల నిర్ధారణ కోసం కొన్ని సాధారణ వైద్య పరీక్షలు ►ఈసీజీ, ►లిపిడ్ ప్రొఫైల్ వంటివి చేయిస్తారు. ఇక గుండెజబ్బల కోసమే చేయించాల్సిన ప్రత్యేక పరీక్షలు... ►2డి ఎకో ►టీఎమ్టీ ►సీటీస్కాన్తో పాటు అవసరాన్ని బట్టి ►కరోనరీ యాంజియో వంటివి డాక్టర్ల సలహా మేరకు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు: ►క్యాన్సర్ నిర్ధారణ కోసం ఈ కింది సాధారణ పరీక్షలు చేస్తారు. ►పురుషుల్లో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) అనే పరీక్షను ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం చేస్తారు. చాలా చిన్న రక్త పరీక్ష అయిన దీని ద్వారా త్వరగా ప్రోస్టేట్ క్యాన్సర్ను దాదాపుగా నయం చేయవచ్చు. ►ఛాతీ ఎక్స్–రే (ఇది అనేక వ్యాధులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లనూ నిర్ధారణ చేస్తుంది), అల్ట్రాస్కాన్ అబ్డామిన్ ప్రత్యేక పరీక్షలు కూడా చేస్తారు. ►బోన్స్కాన్ పరీక్ష, ► పెట్ స్కాన్ పరీక్ష వంటివి ఎముకల పరిస్థితిని ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, పెట్ స్కాన్ ద్వారా ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందేమో తెలుసుకునేందుకు చేస్తారు. (ఇవి క్యాన్సర్ నిర్ధారణలో ముందుగా చేసే ప్రాథమిక పరీక్షలు, వీటిలో ఏదైనా తేడా ఉన్నట్లు తెలిస్తే మరి కాస్త అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. వీటిలో ఏమీ లేదని తెలిస్తే ఇప్పటికి క్యాన్సర్ ముప్పేమీ లేదని నిశ్చింతగా ఉండవచ్చు. అయితే యాభై ఏళ్ల వయసు దాటాక ఈ క్యాన్సర్ను కనుగొనే స్క్రీనింగ్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో (ఇంటర్వెల్స్లో) చేయించాలి.) పళ్లకు సంబంధించిన పరీక్షలు: మన నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్) మీదే అనేక ఒంటి సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మన నోటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది గుండె సమస్యలకూ దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకుంటే దేహంలోని అంతర్గత అవయవాల్లో చాలా వాటిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. అందుకే దంతాలను పరీక్షింపజేసుకోవడం కోసం ప్రతి ఆర్నెల్లకు ఒకమారు డెంటిస్ట్ను సంప్రదించాలి. వాటి సలహా మేరకు అవసరాన్ని బట్టి పళ్లు క్లీన్ చేయించుకోవాలి. ఇక చిగుళ్ల వ్యాధులు ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండాలి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కంటి పరీక్షలు: మీ కళ్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి కంటి నిపుణులకు చూపించుకోవాలి. ఎందుకంటే ఓ వయసు దాటాక కళ్లలో ఇంట్రాఆక్యులార్ ప్రెషర్ అనే ఒక రకం ప్రెషర్ను చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇది ఎక్కువైతే గ్లకోమాకు దారితీయవచ్చు. అందుకే ఇంట్రాఆక్యులార్ ప్రెషర్ను పరీక్ష చేయించుకుని గ్లకోమా అవకాశాలు ఏవీ లేవని తెలుసుకుని నిర్భయంగా ఉండవచ్చు. మీకు మద్యం, సిగరెట్ అలవాట్లు ఉంటే... ►పురుషుల్లో చాలామందికి పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు ఉంటాయి. మీరు పొగతాగేవారైతే... గుండె పరీక్షలతో పాటు... ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునే పీఎఫ్టీ పరీక్ష కూడా చేయించుకోవాలి. ►ఇక ఆల్కహాల్ అలవాటు ఉన్నవారైతే... కాలేయ సామర్థ్యాన్ని తెలుసుకుని లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్టీ పరీక్ష), గుండె పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్షలు చేయించుకోవాలి. ►స్థూలకాయం ఉంటే... మీరు ఏ మేరకు స్థూలకాయులో తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)తో పాటు, థైరాయిడ్ సమస్యలను తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి టీ3, టీ4, టీఎస్హెచ్ పరీక్షలనూ చేయించుకోవాలి. ఇక స్థూలకాయులు ఎఫ్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్స్ చేయించడం కూడా అవసరం. ►ఇక్కడ ప్రస్తావించిన సమస్యలేగాక ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే... వాటిని బట్టి మీ ఫిజీషియన్ సలహా మేరకు అవసరమైన మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అరవైలలో ఆరోగ్య పరీక్షలివే... పురుషుల్లో వయసు అరవైకి చేరాక ఆ వయసుకు తగినట్లుగా కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవి... ►అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ స్క్రీనింగ్: పురుషుల వయసు 65–75 మధ్య ఉన్నవాళ్లు... గతంలో వాళ్లకు పొగతాగిన అలవాటు ఉంటే... అయోర్టిక్ అన్యురిజమ్ అనే కండిషన్ కోసం ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. బీపీ స్క్రీనింగ్: ఒక వయసు దాటాక ఇక తరచూ బీపీ చెక్ చెయించుకోవడం అవసరం. ఇకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఏవైనా జబ్బులు ఉంటే దానికి సంబంధించి డాక్టర్ పేర్కొన్న పరీక్షలను క్రమం తప్పకుండా చేయంచాలి. కొలెస్ట్రాల్ స్క్రీనింగ్: యాభై దాటాక ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించి, అది నార్మల్ గనక వస్తే ఇక అప్పట్నుంచి ప్రతి ఐదేళ్లకోమారు కొలెస్ట్రాల్ స్థాయులు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ►ఒకవేళ వారికి డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ పరీక్ష చేయిస్తూ ఉండాల్సిందే. ►డయాబెటిస్ కోసం తరచూ పరీక్షలు చేయిస్తూనే ఉండాలి. ఒకవేళ అది ఉన్నట్లు తేలితే డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా చక్కెర నిర్ధారణ పరీక్షలు చేయించాలి. గుండె పరీక్షలు: ఈసీజీ, 2 డి ఎకో, టీఎమ్టీ వంటి పరీక్షలు డాక్టర్ సలహా మేరకు చేయించాలి. పెద్ద వయసులో ఈ పరీక్షలతో ఇక నిశ్చింత ►ఏడాదిలో ఒకసారి మల పరీక్ష ►ప్రతి ఐదేళ్లకోసారి ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ. దీనితో పాటు స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ కొలనోస్కోపీ అనే పరీక్ష యాభై దాటిన నాటి నుంచి ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది. ►కొలనోస్కోపీ అనే పరీక్షను ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది. ►ఇక వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలను, కుటుంబ చరిత్రను, రిస్క్ ఫ్యాక్టర్స్ను బట్టి డాక్టర్ సూచించిన ఇతర పరీక్షలు చేయించుకోవాలి. వయసు పైబడ్డాక తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు : పురుషులు 65 ఏళ్లు దాటాక అంతకు ముందు ఎప్పుడూ తీసుకుని ఉండకపోతే ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటినా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ► ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ► ప్రతి పదేళ్లకోమారు టెటనస్–డిఫ్తీరియా బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి. ►గతంలో ఎప్పుడూ తీసుకోకపోతే 65 ఏళ్లు దాటక టీ–డాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది). ►అరవై దాటక షింగిల్స్ లేదా హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు. చివరగా... ఇవేగాక సాధారణంగా చూసుకునే పరీక్షలైన బరువు చెక్ చేయించుకోవడం, కింద జారిపడకుండా చూసుకోవడం, చెవులు చక్కగా వినిపిస్తున్నాయేమో చూసుకోవడం, ఆహ్లాదంగా లేకపోతే డిప్రెషన్కు గురికాకుండా జాగ్రత్త పడటం వంటి ఎవరికి వారు చేసుకునే పరీక్షలతోపాటు పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే వయసు పైబడ్డా సరే... ఆ సమయంలోనూ దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా చాలాకాలం ఆరోగ్యంగా ఉంటారు. మహిళల కోసంఉద్దేశించిన ప్రత్యేక పరీక్షలివి... ఇక మహిళల విషయానికి వస్తే... పైన పేర్కొన్న పరీక్షలతో పాటు (పురుషుల కోసం ఉద్దేశించిన పీఎస్ఏ వంటివి కాకుండా... వారికే ప్రత్యేకమైన మామోగ్రామ్ పరీక్షలు, పాప్స్మియర్ పరీక్షల వంటివి చేయించుకుంటూ ఉండాలి. మహిళల్లో మెనోపాజ్ దాటాక వారిలో కొన్ని సమస్యలు కనిపించడం చాలా సాధారణం. వారి వచ్చే ఆ సమస్యలను బట్టి అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటివి అవసరం కావచ్చు. అందుకోసం డాక్టర్లు సూచించిన మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరమవుతాయి. ఇక మెనోపాజ్ దశకు చేరకముందు... మహిళల్లో వారిలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా వారి గుండెకు ఒక స్వాభావికమైన రక్షణ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఆ స్వాభావిక రక్షణ తొలగిపోతుంది కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలనూ దాంతోపాటు క్రమం తప్పకుండా హైబీపీ, షుగర్ పరీక్షలను చేయించుకుంటూ ఉండాల్సిందే. డాక్టర్ జి. హరిచరణ్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బాలుడికి హెచ్ఐవీ రక్తం ఎక్కిస్తారా?
సాక్షి, చెన్నై : శస్త్రచికిత్స సమయంలో ఓ తొమ్మిది నెలల బాలుడికి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటనపై చెన్నై కోర్టు సివిల్ కోర్టు తీవ్రంగా స్పందించింది. 20 ఏళ్ల నాటి ఈ కేసులో బాధిత బాలుడికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్’ ను ఆదేశించింది. అలాగే ఆ యువకుడికి ఉద్యోగం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 1999లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై నగరంలో దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్న ఓ పేద దంపతుల కుమారునికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో నగరంలోకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్ర చికిత్స వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి, రక్తాన్ని ఎక్కించారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. మరోచోట రక్త పరీక్ష చేయగా హెచ్ఐవీ ఉన్నట్టు తేలడంతో కోర్టును ఆశ్రయించారు. 20 ఏళ తర్వాత కోర్డు తీర్పును వెల్లడించింది. కాగా ఆ బాలుడి కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేలు చెల్లించామని ఆస్పత్రి అధికారులు పేర్కొనగా.. అది అతని వైద్య ఖర్చులకే సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. హెచ్ఐవీ బ్లడ్ను ఎలా ఎక్కించారని సిబ్బందిపై మండిపడింది. సిబ్బంది నిర్లక్ష్యంగానే ఆ బాలుడికి హెచ్ఐవీ సోకిందని..పరిహారంగా రూ. 20లక్షలు చెల్లించాలని కోర్టు తేల్చిచెప్పింది. యువకుడి తల్లిదండ్రులు పేదవారని, కుటుంబ పోషణ కోసం ఆ యుకుడికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి... రాకుండా జాగ్రత్తలేమిటి?
ఈమధ్య ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చనిపోయారు అనే వార్తలు తరచూ వింటున్నాం. అసలు హార్ట్ఫెయిల్యూర్ అంటే ఏమిటి? ఎందుకిలా జరుగుతుంది? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అయితే మనిషి ఎలా బతుకుతాడు? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరంగా తెలపండి. గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేస్తుండే ఒక అద్భుతమైన పంపింగ్ మోటార్ ఇది. ఈ రక్తప్రసరణ వల్లనే అన్ని అవయవాలకూ పోషకాలు, ఆక్సిజన్ అందడం మాత్రమే కాకుండా రక్తంలో చేరిన కార్బన్ డై ఆక్సైడ్, శరీరంలోని జీవక్రియల వల్ల ఉత్పన్నమైన ఇతర వ్యర్థపదార్థాల తొలగింపు జరుగుతుంటుంది. ఈ విధంగా దేహంలో ప్రసరణ వ్యవస్థ నిర్వహణలో గుండె కీలకమైన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది.ప్రాణవాయువైన ఆక్సిజన్ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్ను బయటకు పంపించే ప్రక్రియను నిర్వహించడంలో ఊపిరితిత్తులతో కలిసి పనిచేస్తుంది. అనేక రకాల పరిస్థితుల్లో గుండె దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యమైనది అధికరక్తపోటు (హైపర్టెన్షన్/హైబీపీ), కరోనరీ ఆర్టరీ డిసీజ్, డయాబెటిస్, స్థూలకాయం (ఒబేసిటీ). వీటితో పాటు వాల్వ్లార్ డిసీజ్, వైరల్ ఇన్ఫెక్షన్లు, మితిమీరిన మద్యపానం, పోషకాహార లోపం, కీమో–రేడియేషన్ల (క్యాన్సర్ చికిత్సల్లో) అనంతర స్థితి, వాపు (ఇన్ఫ్లమేటరీ స్టేట్) వల్ల కూడా గుండె దెబ్బతింటుంది.ఈ పరిస్థితులను నివారించడం, ఇందుకు కారణమయ్యే అంశాల నుంచి దూరంగా ఉండటం వల్ల గుండెకు జరిగే నష్టాన్ని చాలావరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల గుండెకు వాటిల్లబోయే నష్టాన్ని చాలావరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలను గుర్తించడం ముఖ్యం. ఒకసారి గుండె దెబ్బతింటే మళ్లీ మునపటి స్థితిని పునరుద్ధరించుకునే సామర్థ్యం గుండెకు ఉండదు. అందుకే గుండె దెబ్బతినకుండానే తీసుకునే నివారణ చర్యలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమైన భూమిక నిర్వహిస్తాయి. లక్షణాలు ఇటు డాక్టర్లు, అటు పేషెంట్లు హార్ట్ఫెయిల్యూర్ లక్షణాలను వెంటనే గుర్తించాలి. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా, పడుకొని ఉన్నా శ్వాస అందకపోవడం, అలసట, కాళ్లవాపు, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి ఏర్పడటం, పొట్ట ఉబ్బడం మొదలైనవి హార్ట్ఫెయిల్యూర్ లక్షణాలు. ఇవి కనిపించిన వెంటనే రోగి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి, తీవ్రతను అంచనా వేయాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈసీజీ, 2–డి ఎకో కార్టియోగ్రఫీ, మరికొన్ని రక్తపరీక్షల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ను డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.ఇటీవల మరిన్ని ఆధునిక విధానాలు వాడుకలోకి వచ్చాయి. బయోమార్కర్లను ఉపయోగించి హార్ట్ఫెయిల్యూర్ను గుర్తించడం, వర్గీకరించడం చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఇమేజింగ్ పద్ధతులు కూడా చాలా అభివృద్ధి చెందాయి. వీటివల్ల వ్యాధిని వేగంగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతున్నారు. వీటిలో 3–డితో కూడిన ఎకోకార్డియోగ్రఫీ వ్యాధి నిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచింది. ఇది గుండెపనితీరు, గుండె కవాటాల పనితీరు, గుండెలోని ఒత్తిడిని అధ్యయనం చేయడానికి సాయపడుతుంది. ఎకో ద్వారా పూర్తిగా నిర్ధారణకు రాలేని సందర్భాల్లో కార్డియాక్ ఎమ్మారై ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం. వీటితోపాటు కార్డియాక్ కాథటరైజేషన్, న్యూక్లియార్ స్కాన్ (పెట్, స్పెక్), ఎండోకార్డియల్ బయాప్సీ, టాక్సికాలజీతో రోగనిర్ధారణ చేస్తున్నారు. గుండెను కాపాడుకోవడం ఇలా... మనం ముందుగా మన అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవాలి. అయితే అధిక రక్తపోటు విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానో లేదా ఉదాసీనంగానో వ్యవహరిస్తుంటారు. అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచడం ద్వారా రక్తనాళాలకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అలా జరగకపోతే గుండె దమనులు తీవ్రంగా దెబ్బతీసి, గుండెకండరాలను మందంగా తయారుచేస్తుంది. దాంతో గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం చాలావరకు తగ్గిపోతుంది. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నప్పుడు కూడా దాదాపు ఇలాంటి అంశాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా హార్ట్ఫెయిల్యూర్కు దారితీస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అటు హైబీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవడం, ఇటు స్థూలకాయాన్ని నివారించుకొని ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం అవసరమవుతుంది. జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా గుండెకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 30 – 35 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, తాజా పండ్లు, కూరగాయలు–ఆకుకూరలతో కూడిన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగతాగడం వల్ల గుండె మీద తీవ్రమైన భారం పడుతుంది. మద్యం కూడా గుండెకు అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఆ అలవాట్లను వెంటనే ఆపేయాలి. ఇక రక్తంలో కొలస్ట్రాల్ ఉంటే దానివల్ల కరొనరీ దమనల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే రక్తంలోని కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవాలి.మొత్తంమీద పూర్తిగా నష్టం జరగకమునుపే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల గుండెకు వాటిల్లే నష్టం నివారించడానికి వీలవుతుంది. తద్వారా హార్ట్ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఒకసారి గుండెపోటుకు గురైతే ఆలస్యం చేయకుండా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించడం కూడా చాలా కీలకం. దానివల్ల తక్షణ రక్షణతో పాటు మున్ముందు మరింత నష్టం జరగకుండా చూసుకోడానికి, దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఏర్పడకుండా చూడవచ్చు. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
బాబుకు పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో ఎరుపు
మా బాబుకి తొమ్మిదేళ్లు. మూడు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంసీయూ... ఇలా కొన్ని టెస్ట్లు చేశారు. రిపోర్ట్స్ నార్మల్ అనే వచ్చాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ అని యాంటిబయటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు మళ్లీ బాధ పడుతున్నాడు. పదిరోజుల కిందట మళ్లీ మూత్రంలో రక్తం పడింది. డాక్టర్ దగ్గరకెళితే మళ్లీ పరీక్షలు చేశారు. అవి కూడా నార్మలే. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, రక్తం ఎందుకు పడుతోంది? మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకూ ఎలాంటి ప్రమాదం ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచన. పిల్లల యూరిన్లో రక్తం కనబడానికి గల కొన్ని కారణాలు: మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యున్లాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ కాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా కాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ప్రధానం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి. మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండటం ముఖ్యం. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను మీ డాక్టర్తో మరోసారి చర్చించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. రోజుల పాప... తలలో తెల్ల వెంట్రుకలు మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి. పాపకు తలలో ర్యాష్... పరిష్కారం చెప్పండి మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా డాక్టర్గారికి చూపించాం. మొదట తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచనా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్. పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనకభాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్ను లేదా డర్మటాలజిస్ట్ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
సచివాలయంలోనే మందుల్లేవ్..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పాలనకు కేంద్రంగా ఉండే సచివాలయంలోనే మందులకు దిక్కులేని పరిస్థితి నెలకొని ఉంది. గత రెండు మాసాలుగా మధుమేహం నివారణ (షుగర్)కు ఇచ్చే మాత్రలు లేకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మందులను రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సరఫరా చేయాలి. కానీ గడిచిన రెండు మాసాలుగా మధుమేహం నివారణ మందులు సరఫరా చేయలేదు. సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతాయి. సచివాలయ ఉద్యోగులు 2 వేల మంది ఉండగా, వారికే సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. చాలా మంది ఉద్యోగులు సచివాలయంలోని డిస్పెన్సరీకి వెళ్లడం, మందులు లేవని చెప్పడంతో వెనుదిరిగి వస్తున్నారు. ఈ మందులతో పాటు మరికొన్ని యాంటీబయోటిక్స్, బీకాంప్లెక్స్, విటమిన్ మాత్రలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సచివాలయంలోని డిస్పెన్సరీలో ఎప్పుడూ మందులు లేవని చెప్పేవారు కాదని, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు మందులు ఉంటాయో, ఎప్పుడు ఉండవో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. అలాగే సచివాలయం ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకూ రక్తపరీక్షలు కూడా చేయలేని పరిస్థితి నెలకొని ఉందని ఉద్యోగులు వాపోయారు. ఏ రక్తపరీక్ష చేయించుకోవాలన్నా బయటికి వెళ్లి చేయించుకోవాల్సి వస్తోందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి వాపోయారు. ఇప్పటివరకు లేబొరేటరీ కూడా ఏర్పాటు చేయలేక పోవడం దారుణమని, అంబులెన్సు కూడా అందుబాటులో ఉండదన్నారు. ఎవరైనా ఉద్యోగులు 108కు ఫోన్ చేస్తే తూళ్లూరు నుంచి గాని, మరెక్కడనుంచో ఇక్కడకు రావాలని, దీనికి బాగా సమయం పడుతోందని పేర్కొన్నారు. -
హాజీపూర్ బాధితుల రక్త నమూనాల సేకరణ
బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లోని మర్రిబావి, తెట్టెబావులలో లభించిన కల్పన, మనీషాల మృతదేహాల నిర్ధారణ కోసం పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా సోమవారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులనుంచి రక్త నమూనాలను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. -
నిద్రపట్టడం లేదు... సలహా ఇవ్వండి
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 33 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రతి రెండు వారాలకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఎమ్. నవీన్, హైదరాబాద్ మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు లక్షణాలు: ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ) చికిత్స: హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 43 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. సలపరంతో కూడిన తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్. కళ్యాణ్, గుంటూరు గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీళ్లు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటివి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటున్నారు... నా వయసు 62 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటంతోబాటు కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మాలకొండారావు, ఒంగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకేకీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగానియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించాల్సిందేనా?
మా పాప పుట్టిన తర్వాత తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే పరీక్షచేసి హీమోగ్లోబిన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అప్పటినుంచి నెలనెలా రక్తం ఎక్కిస్తూ ఉండాలని చెప్పారు. మూడేళ్ల తర్వాత ప్లీహం (స్లీ్పన్) తొలగిస్తే ఇలా తరచూ రక్తం ఎక్కించే అవసరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్ చేయించాం. తర్వాత రెండు నెలలకోసారి రక్తం ఎక్కిస్తున్నారు. మంచి ఆహారం పెడుతూ నెలకోసారి పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేయిస్తున్నాం. రక్తం ఎక్కించాక నెలన్నరకే... పాప పాలిపోయి నీరసంగా తయారవుతోంది. ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించే బాధ తప్పదా? దీనికి శాశ్వత చికిత్స లేదా? సాధారణంగా మన రక్తంలోని ఎర్ర రక్తకణాలు మధ్యన కాస్తంత నొక్కినట్లుగా బిళ్లలలా ఉంటాయి. కానీ మీ పాపకు ఉన్న సమస్య వల్ల తయారయ్యే ప్రక్రియలోనే అవి బంతిలా గుండ్రంగా తయారవుతుంటాయి. పాపకు ఇది పుట్టుకతో జన్యుపరంగా వచ్చిన సమస్య. ఇలా కణాల ఆకృతి భిన్నంగా ఉండటంతో మన శరీరంలోని ప్లీహం (స్పీ›్లన్) వాటిని లోపభుయిష్టమైన కణాలుగా గుర్తించి, ఎప్పటికప్పుడు నాశనం చేసేస్తుంటుంది. అందుకే పాపకు తరచూ రక్తహీనత వస్తోంది. సాధారణంగా ఒక ఎర్రరక్తకణం జీవితకాలం 120 రోజులు. కానీ ప్లీహం ఈ రక్తకణాలన్నింటినీ చాలా ముందుగానే నాశనం చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోయి, తరచూ రక్తహీనత వస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా బయటి నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. అలాగే ఉన్న రక్తకణాలు నాశనం కాకుండా కాపాడుకునేందుకు ప్లీహాన్ని కూడా తొలగించారు. ఇక పుట్టిన ఎర్రరక్తకణాలు త్వరత్వరగా నాశనమైపోతున్నాయి. కాబట్టి ఎముక మూలుగ/మజ్జ ఇంకా ఎక్కువెక్కువ ఎర్రరక్తకణాలను తయారు చేస్తుంటుంది. అది అవసరం కూడా. అందుకే దానికి కావాల్సిన మూలవనరులైన ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఐరన్ తదితరాలను మనం మాత్రల రూపంలో బయటి నుంచి ఇస్తుండాలి. దీనివల్ల పుట్టిన ఎర్రరక్తకణాలు ఎంతోకొంత సమర్థంగా ఉంటాయి. ప్లీహాన్ని తొలగించారు కాబట్టి ఒంట్లో నుంచి హానికారక/వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటివి త్వరగా బయటకు పోవు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే ముప్పు ఎక్కువ. దీన్ని నివారించేందుకు పాపకు తరచూ నెలనెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇది చాలా అవసరం. ►ఇక మీ పాప విషయంలో ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి రావడం ఇబ్బందికరమే. మామూలుగా ప్లీహం తొలగించిన తర్వాత కొందరిలో రక్తం ఎక్కించాల్సిన అవసరమే తలెత్తదు. కానీ సమస్య తీవ్రంగా ఉన్న కొద్దిమందిలో మాత్రం ఇలా తరచూ రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది. ►తరచూ రక్తం ఎక్కిస్తున్నప్పుడు ఒంట్లో నుంచి ఇనుమును తొలగించే మందులు వాడుకోవడం తప్పనిసరి. ఎందుకంటే రక్తం ఎక్కించిన ప్రతిసారీ దాదాపు 100–150 మి.గ్రా. ఇనుము మన శరీరంలో పేరుకుపోతుంది. దీన్ని తొలగించేందుకు పాపకు నిత్యం మందులు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇనుము... కాలేయం, గుండె వంటి అవయవాల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తుంది. ►నిజానికి జన్యుపరంగా వచ్చే ఇలాంటి వ్యాధులన్నింటికీ రక్తం ఎక్కించడం తప్పించి, ఇతరత్రా చికిత్స ప్రక్రియలు తక్కువనే చెప్పాలి. ఇలాంటి వారికి కచ్చితమైన చికిత్స ఎముక మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్). మిగతా చికిత్సలన్నీ సమస్యను నియంత్రణలోకి తెచ్చేందుకే. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని రక్తవ్యాధుల నిపుణుడిని సంప్రదించండి. పచ్చకామెర్లకు కారణం ఏమిటి? జాగ్రత్తలు చెప్పండి మా బాబుకు పదమూడేళ్లు. అతడికి ఈ మధ్య పచ్చకామెర్లు వచ్చాయి. దయచేసి దానికి కారణాలు, జాగ్రత్తలతోపాటు వీలైతే నివారణోపాయాలు కూడా చెప్పగలరు. రక్తంలోని ఎర్ర రక్తకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురుబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురుబిన్ పరిమాణం రెట్టింపు అవ్వడం వల్ల వచ్చేవే పచ్చకామెర్లు. వీటినే జాండిస్ అని కూడా అంటారు. కామెర్లు వచ్చిన వారి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది వ్యాధి తాలూకు ఒక లక్షణం. మనం సాధారణంగా బాధపడే పచ్చకామెర్లు మన శరీరంలోని కాలేయం అనే అవయవం సూక్ష్మజీవుల బారిన పడటం వల్ల వస్తుంది. ఇది రావడానికి మూడు ముఖ్య కారణాలు. అవి... 1) రక్తంలో ఎర్రరక్తకణాలు అత్యధికంగా విచ్ఛిత్తికావడం. దీన్ని హీమోలిటిక్ జాండీస్ అంటారు. 2) ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి వల్ల చోటు చేసుకున్న బిలురుబిన్ లివర్ కణాలలోకి చేరలేకపోవడం. దీన్ని ‘హెపాటిక్ జాండీస్’ అంటారు. 3) లివర్లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్) ప్రవాహమార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవడం. దీన్ని ‘అబ్స్ట్రక్టివ్ జాండిస్’ అంటారు. లివర్ ఇన్ఫెక్షన్కు గురైనట్లయితే ‘హెపటైటిస్’ అని వ్యవహరిస్తారు. హెపటైటిస్ కేసుల్లో హెపాటిక్ జాండిస్ చోటుచేసుకుంటుంది. హెపటైటిస్కు ప్రధాన కారణాలు: ►ఇన్ఫెక్షన్ ►ఆల్కహాల్ ► పౌష్టికాహార లోపం. ఇన్ఫెక్షన్ పరంగా ఐదు రకాల వైరస్లను గుర్తించారు. ఇవి... హెపటైటిస్ ఎ, బి, సి, డి. చికిత్స: నీటి ప్రభావానికి లోనై వచ్చే వ్యాధులలో పచ్చకామెర్లు వ్యాధి ఒకటి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సత్వర నివారణ చర్యలు చేపట్టకుంటే ఇది మన శరీరంలోని అత్యంత ప్రధాన భాగమైన కాలేయాన్ని పనిచేయకుండా చేసి పరిస్థితిని మరింత విషమింపజేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి వస్తే మళ్లీ రాకూడదన్న నియమం లేదు. దీని నివారణకు ఆహారంలోని కొన్ని నియమాలు పాటించాలి. ►ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడబోసి, చల్లార్చి వాడటం మంచిది. లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు. ►పచ్చకామెర్లు వ్యాధి సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణం కానివి ఏవీ వాడకూడదు. ►మజ్జిగ బాగా వాడాలి. కొబ్బరినీళ్లు తాగాలి. అరటిపండ్లు బాగా తినాలి. ►మాంసాహారులు మాంసానికీ, చేపలకు దూరంగా ఉండాలి. ►గోంగూరకు దూరంగా ఉండాలి. ఆవకాయ, మాగాయ లాంటి పచ్చళ్లకు కొన్నాళ్లు వాటికి దూరంగా ఉండాలి. కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీసీనియర్ హిమటాలజిస్ట్, హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్టీ స్పెషలిస్ట్, స్టార్ హాస్సిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
తెల్లరక్తకణాలు అపరిమితంగా పెరిగాయి... సమస్య ఏమిటి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా అబ్బాయి వయసు ఆరున్నర ఏళ్లు. మాది హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఒక చిన్న టౌన్. ఈమధ్య వాడికి తరచూ జ్వరం వస్తూ ఉంది. పిల్లాడు కూడా చాలా పాలిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇలా రెండుమూడుసార్లు యాంటీబయాటిక్స్తో చికిత్స చేశాక... ఒకసారి మా ఫ్యామిలీ డాక్టర్ గారు అబ్బాయికి రక్తపరీక్ష చేయించారు. దాంతో అతడి బ్లడ్కౌంట్ పరీక్షలో తెల్ల రక్తకణాలు అపరిమితంగా కనిపించాయి. పైగా డాక్టర్ పరీక్ష చేసే సమయంలో స్పీ›్లన్ ఉబ్బినట్లుగా ఉందని చెబుతూ అది లుకేమియా కావచ్చనీ, వీలైనంత త్వరగా పిల్లవాడిని సిటీలో క్యాన్సర్ స్పెషలిస్ట్కు చూపించమని అన్నారు. మావాడి సమస్య ఏమిటి? దయచేసి వివరించండి. – ఎల్. రామ్ప్రసాద్, చిట్యాల మనకు ఉండే రక్తకణాల్లో ప్రధానమైనవి తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలు, ప్లేట్లెట్స్ ముఖ్యమైనవి. మన రోగనిరోధక శక్తి ప్రధానంగా తెల్లరక్తకణాల వల్ల కలుగుతుంది. ఈ రక్తకణాలన్నీ మన ఎముక లోపల డొల్లగా ఉండే భాగంలోని ఎముకమజ్జ లేదా మూలుగ అని మనం పిలుచుకునే బోన్ మ్యారోలో అనునిత్యం తయారవుతుంటాయి. అక్కడి మూలకణాల్లో వృద్ధిచెందిన తొలి కణాలు ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్లెట్స్గా రూపొందుతుంటాయి. సాధారణంగా ప్రతి రక్తకణానికీ కొంత జీవన వ్యవధి ఉంటుంది, కొత్త కణాలు పాత కణాల స్థానంలోకి వచ్చి చేరుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియని కారణాలతో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా అమాంతం పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్క్యాన్సర్ అని చెప్పవచ్చు. అయితే అక్కడ జరిగే ప్రక్రియకు ఇది స్థూలంగా చెప్పగలిగే వివరణ మాత్రమే. ఈ తరహా బ్లడ్ క్యాన్సర్లలోనూ అనేక రకాలు ఉన్నాయి. అపరిమితంగా పెరిగిపోయిన తెల్లరక్తకణాల వల్ల ఎర్రరక్తకణాల కౌంట్కు కూడా తగ్గి పిల్లలు పాలిపోయినట్లుగా కనిపిస్తారు. తరచూ జ్వరం అన్నది ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఇక మరికొందరిలో రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్లెట్స్ కూడా తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా బ్లీడింగ్ స్పాట్స్ కనిపిస్తుంటాయి. ఇక మరికొందరు పిల్లల్లో ఎముకల కీళ్ల దగ్గర నొప్పులు, చిగుర్లలోంచి రక్తస్రావం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. మీరు మీ టౌన్లోని డాక్టర్ చెప్పినట్లుగా వీలైనంత త్వరగా మీ సమీపంలోని పెద్దనగరానికి వెళ్లి హిమటోఆంకాలజిస్ట్కు చూపించండి. వారు ఎముకమూలుగను పరీక్షించే ‘బోన్మ్యారో టెస్ట్’ చేసి మీ పిల్లవాడికి ఉన్న వ్యాధిని బట్టి చికిత్స మొదలుపెడతారు. బ్లడ్ క్యాన్సర్కు చికిత్స ఉందా? మా అబ్బాయి వయసు ఏడేళ్లు. ఈమధ్య మావాడికి చేయించిన ఒక రక్తపరీక్షలో అబ్బాయికి లుకేమియా అని ప్రాథమిక రిపోర్టు వచ్చింది. దాంతో బోన్మ్యారో పరీక్ష చేయించమని మా డాక్టర్ చెప్పారు. బోన్మ్యారో పరీక్ష అంటే ఏమిటి? ఆ తర్వాత కూడా ఏమైనా పరీక్షలు అవసరమవుతాయా? లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అని తెలిశాక మాకు చాలా ఆందోళనగా ఉంది. బ్లడ్ క్యాన్సర్లకు చికిత్స ఉంటుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – బి. మాలతి, నెల్లూరు మీవాడికి చేసిన రక్తపరీక్షల్లో బ్లడ్క్యాన్సర్ ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో దాన్ని పూర్తిగా నిర్ధారణ చేయడం కోసం బోన్మ్యారో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో చిన్నారికి తాత్కాలికంగా కొద్దిగా మత్తు కలిగేలా చేసి, ఎముక మూల నుంచి, కాస్తంత ఎముక మూలుగను సేకరిస్తారు. ఆ తర్వాత ఆ నమూనాలను ల్యాబ్లో పరీక్షించి బ్లడ్క్యాన్సర్ను నిర్ధారణ చేస్తారు. దీనితర్వాత కూడా నిర్దిష్టంగా అది ఏ తరహా క్యాన్సర్ అన్నది కచ్చితంగా నిర్ధారణ చేయడానికి ఫ్లోసైటోమెట్రీతోపాటు మరికొన్ని క్రోమోజోము పరీక్షలు అవసరమవుతాయి. అయితే ఇక్కడ మీరు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలారకాల బ్లడ్ క్యాన్సర్లకు ఆధునిక కీమోథెరపీతోపాటు ఇంకొన్ని సపోర్ట్ థెరపీల వంటి చాలా మంచి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల కొత్త చికిత్సా మార్గాలతో బ్లడ్ క్యాన్సర్ను ఇంకా సమర్థంగా చికిత్స చేయవచ్చు. కొన్ని హైరిస్క్ క్యాన్సర్లకు ‘బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్’ అనే చికిత్స కూడా అదించవచ్చు. అంటే... బ్లడ్క్యాన్సర్కు ఎముక లోపల ఉండే లోపభూయిష్టమైన మూలుగను పూర్తిగా అణచివేసి, ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి సేకరించిన మంచి మూలుగను ప్రవేశపెడతారు. ఈ చికిత్స తర్వాత బ్లడ్క్యాన్సర్ వచ్చిన వారు పూర్తిగా ఆరోగ్యకరమైన సాధారణమైన వ్యక్తిగా మారిపోతారు. డాక్టర్ శిరీషరాణి ,పీడియాట్రిక్ హిమటోఆంకాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రెన్స్ హాస్పిటల్, హైదరాబాద్ -
ఈసీజీకి కృత్రిమ మేధ హంగు!
ఈసీజీ గురించి మీరు వినే ఉంటారు. గుండె పనితీరును అంచనా వేసేందుకు అందుబాటులో ఉన్న ఈ పురాతన పద్ధతిని పూర్తిగా మార్చేశారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. గుండె విద్యుత్ సంకేతాలను గుర్తించడానికి పరిమితం కాకుండా గుండెజబ్బులను చాలా తొందరగా గుర్తించడం ఈ కొత్త పద్ధతి ప్రత్యేకత. ఖరీదైన పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారించే వీలున్న లెఫ్ట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్ను ఈ కొత్త పద్ధతి ద్వారా గుర్తించవచ్చు. ఎటువంటి సంకేతాలు కూడా చూపకపోవడం ఈ లెఫ్ట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్.. రక్త పరీక్షల ద్వారా గుర్తించేందుకు అవకాశమున్నా ఫలితాలు ఎప్పుడూ ఒకేలా లేకపోవడం నేపథ్యంలో ఈ కొత్త ఈసీజీ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ కొత్త ఈసీజీ పద్ధతి గుండెజబ్బు అవకాశాలను అంచనా వేస్తుందని చవకగా కేవలం పది సెకన్లలో అయిపోవడం మరో లాభమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ ఫ్రైడ్మ్యాన్ తెలిపారు. దాదాపు ఆరు లక్షల మంది ఈసీజీ వివరాల ఆధారంగా పనిచేసే ఈ కృత్రిమ మేధ వ్యవస్థను ఇప్పటికే 50 వేల మందిపై విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా. అతిసున్నితమైన అంశాలను పసిగట్టడం ద్వారా గుండెజబ్బులను చాలాముందుగా గుర్తించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పార -
ఒక్క మాత్రతో వారం మందులు!
పూటపూటకూ మాత్రలు మింగాలంటే ఎవరికైనా చిరాకే. అందుకే చాలామంది మాత్రలేసుకోవడం మరచిపోతూంటారు కూడా. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మాత్రను సిద్ధం చేశారు. వారానికి ఒక్కసారి వేసుకుంటే చాలు. ఈ క్యాప్సూల్లోని ఆరు అరలు రోజుకొకటి చొప్పున విచ్చుకుని అవసరమైన మందులు అందిస్తాయి. ఈ మాత్రలపై జరిగిన క్లినికల్ పరీక్షలు కూడా విజయవంతం కావడంతో త్వరలోనే ఇవి మార్కెట్లోకి వచ్చేస్తాయని అంచనా. నక్షత్రపు ఆకారంలో ఉండే అరలు.. వాటిలో మందులు.. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒక అర విచ్చుకుని మందులు విడుదల కావడం.. ఖాళీ అరలు సహజసిద్ధంగా నాశనం కావడం. ఇదీ స్థూలంగా ఈ క్యాప్సూల్ పని చేసే తీరు. రెండేళ్ల క్రితమే ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఈ క్యాప్సూల్ను పందులకు మలేరియా మందుల రూపంలో అందించడం ద్వారా పరీక్షించారు. తాజాగా ఎనిమిది మంది మనుషులకు అటై్జమర్స్ వ్యాధికి ఇచ్చే మందు 50 మిల్లీగ్రాములను అందించారు. వారం తరువాత జరిపిన పరీక్షల్లో మందు శరీరంలోకి శోషించుకోబడిందని, అవసరమైన మేరకు మందు విడుదలైందని స్పష్టమైంది. ఆక్సిజన్ అందించే చెప్పులు మధుమేహుల కాలి అల్సర్లను వేగంగా మానేలా చేసేందుకు పర్డ్యూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఆయుధాన్ని అందుబాటులోకి తెచ్చారు. అల్సర్ ఉన్న ప్రాంతానికి నేరుగా ఆక్సిజన్ను అందించే చెప్పుల అడుగుభాగం (సోల్) ను వీరు తయారుచేశారు. పాలిడైమిథైల్సైలోక్సేన్ అనే ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ రెండు పొరల సోల్.. అడుగు పొరలో ఆక్సిజన్ అర ఉంటుంది. పై పొరను ఆక్సిజన్ను మాత్రమే ప్రసారం చేసేలా లేజర్ కిరణాల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ సోల్తో కూడిన కాలిజోళ్లు వేసుకుని నడిచినప్పుడు కింది పొరపై ఒత్తిడి కారణంగా అరలోని ఆక్సిజన్ విడుదల, అల్సర్ ఉన్న ప్రాంతాన్ని నేరుగా తాకుతుంది. దీనివల్ల గాయం వేగంగా మానేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాడే హైపర్బేరిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్లో రోగి కదలికల్లేకుండా ఒకచోట కూర్చోవాల్సి వస్తే.. తాజా ఆవిష్కరణతో రోజువారి పనులు సులువుగా చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే.. వీటిని రోగి కాలి ఆకారం, సైజులకు అనుగుణంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చు. కేన్సర్ నిర్ధారణకు కొత్త రక్తపరీక్ష కేన్సర్ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ కూడా సమస్యలతో కూడుకుంది. కణితి భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా వేరు చేయడం, పరీక్షించడం వల్ల వ్యాధి వేగంగా విస్తరిస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో కేవలం రక్త పరీక్షలతోనే కేన్సర్ను నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ప్రిన్సెస్ మార్గరెట్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో విజయం సాధించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న లిక్విడ్ బయాప్సీ పద్ధతులకు ఎపిజెనిటిక్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలను జోడించి అభివృద్ధి చేసిన ఈ కొత్త పద్ధతి కేన్సర్ను గుర్తించడం తో పాటు ఏ దశలో ఉన్నది కూడా తెలియజేస్తుంది. కేన్సర్ తాలూకు లక్షణాలు కనిపించక ముందే వ్యాధిని గుర్తించడం వల్ల చికిత్స సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ కార్వాలో తెలిపారు. ప్రస్తుత పద్ధతులు, జన్యు క్రమంలో వచ్చిన మార్పులు.. డీఎన్ఏ ముక్కల ఆధారంగా నిర్ధారణ జరుగుతూంటే, కొత్త పద్ధతిలో ఎపిజెనిటిక్స్ ఆధారంగా జరుగుతోంది. ఒక్కో రకమైన కేన్సర్కు ఈ మార్పులు వేర్వేరుగా ఉంటాయని, తగు స్థాయిలో ఉన్న ఈ మార్పులను మెషీన్ లెర్నింగ్ ద్వారా గుర్తించడం ఈ కొత్త పద్ధతి ప్రత్యేకత అని వివరించారు. -
హైబీపీతో కిడ్నీలు దెబ్బ తినవచ్చా?
కిడ్నీ కౌన్సెలింగ్స్ నా వయసు 35 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించగా ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. లేదంటే నాకు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. నేను మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? – విశాల్, హైదరాబాద్ మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. కాళ్ల వాపులు వస్తున్నాయి... కిడ్నీల సమస్యా? నాకు 67 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇటీవల ప్రయాణాలు చేసేప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. యూరియా 28 మి.గ్రా. అని చూపిస్తున్నది. యూరిన్ టెస్ట్లో ప్రొటిన్ విలువ 3 ప్లస్గా ఉంది. నాకు షుగర్ వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏమైనా వచ్చిందా? – ఎల్. కృష్ణమూర్తి, జనగామ మీరు తెలిపిన వివరాలను, మీ రిపోర్టుల్లో నమోదైన అంశాలను బట్టి చూస్తే మీకు మూత్రంలో ప్రొటిన్లు ఎక్కువగా పోతున్నాయి. అయితే ఇది డయాబెటిస్ వల్ల వచ్చిన మూత్రపిండాల సమస్యా లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మూత్రంలో ప్రొటిన్లు పోవడానికి డయాబెటిస్ వ్యాధే కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు పాడుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తమలో చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. మీరు తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా/డీఎల్ లోపు తిన్న తర్వాత 160 మి.గ్రా/డీఎల్ లోపు ఉండేటట్లుగా చూసుకోవాలి. బీపీ 115/75 లోపు ఉంచుకోవాలి. ఇవే కాకుండా మనం తీసుకునే భోజనంలో ఉప్పు తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నొప్పినివారణ మందుల (పెయిన్కిల్లర్స్)ను సొంతవైద్యంగా వాడకూడదు. మీరు ఒకసారి వెంటనే దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్ను సంప్రదించండి. నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా అమ్మగారు, వారి తండ్రిగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు. జన్యుపరమైన అంశాలు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలే చదివాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు నివారణ మార్గాలున్నాయా? దయచేసి నాకు సలహా ఇవ్వండి. – డి. రమేష్కుమార్, కాకినాడ మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 50 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సైలెంట్ కిల్లర్స్గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటనిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్ఆర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబంలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రం నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. డాక్టర్ విక్రాంత్రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు నివేదిక
తాడితోట (రాజమహేంద్రవరం): వివాహమై ఆరు నెలలైంది. గర్భిణి అని తెలియడంతో రక్త పరీక్షల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఆ యువతికి పిడుగులాంటి వార్త అందింది. తనకు హెచ్ఐవీ ఉందంటూ ఆస్పత్రి సిబ్బంది నివేదిక ఇచ్చారు. తనకు వచ్చే అవకాశమే లేదని బాధితురాలు వాపోయినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరువు పోయిందని భావించిన ఆమె భర్త, ఆ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, సన్నిహితుల సలహా మేరకు ప్రైవేట్ ల్యాబ్లో ఆ యువతి పరీక్షలు చేయించగా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు ల్యాబ్లలో పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ లేదనే తేలింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని నిరసనకు దిగారు. తప్పుడు నివేదిక ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సంతోష్నగర్కు చెందిన నల్లామట్టి నాని ఆటో డ్రైవర్. అతని భార్య మనీషా గర్భిణి. ఈ నెల 4న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగానికి వైద్య పరీక్షలకు వెళ్లింది. రక్త పరీక్షలు నిర్వహించేందుకు రక్తం శాంపిల్ తీసుకొని ఇంటికి పంపించేశారు. మరుసటి రోజున ‘మీ భర్తను తీసుకొని ఆస్పత్రికి రండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది. తన భర్తను వెంటబెట్టుకొని ఆమె హడావుడిగా వెళ్లింది. ‘నీకు హెచ్ఐవీ ఉందని’ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో ఆ దంపతులు హడలిపోయారు. ‘నేను బయట తిరిగేదాన్ని కాదు. పెళ్లయి ఆరు నెలలైంది. నాకు హెచ్ఐవీ ఎలా వస్తుంది’ అంటూ ఆ యువతి విలపించినా పట్టించుకోకుండా ఆస్పత్రిలో ఉన్న హెచ్ఐవీ కౌన్సిలర్ లలిత బలవంతంగా హెచ్ఐవీ విభాగం (ఏఆర్టీ సెంటర్)కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, భీతిల్లిన ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయింది. బాధితురాలి కుటుంబం ఆత్మహత్యాయత్నం ఆ రిపోర్టుతో తీవ్ర మనోవేదనకు గురైన మనీషా 5న ఆత్మహత్య చేసుకునేందుకు బయటకు వెళ్లిపోతుండగా స్థానికులు రక్షించారు. ఆమె తల్లి, భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రిపోర్టు మీద నమ్మకం లేక మరో ల్యాబ్లో రక్త పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ లేదని తేలింది. మరో మూడు చోట్ల రక్త పరీక్షలు చేయించినా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం వల్లే తప్పుడు రిపోర్టులు వచ్చాయని నిర్ధారణకు వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మశ్రీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తప్పుడు రిపోర్టు ఇచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ రవిపైనా, గర్భిణి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిలర్ లలితపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ తెలిపారు. ఇప్పటికే ఈ సంఘటనపై ఎంక్వెరీ వేశామని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామన్నారు. -
రిపోర్టులో హెచ్ఐవీ.. యువకుడి ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రమాణాలు పాటించని రక్త పరీక్ష కేంద్రాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు రిపోర్టులు ఇస్తూ రోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ రిపోర్టులను గుడ్డిగా నమ్ముతున్న కొంత మంది వైద్యులు టెస్ట్లకు సంబంధించిన వివరాలను పూర్తి అవగతం చేసుకోకుండానే రోగాలను నిర్థారించేస్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మచిలీపట్నంలో గురువారం వెలుగుచూసింది. బిహార్కు చెందిన ఒక యువకుడు కొంత మంది స్నేహితులతో కలిసి జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం మచిలీపట్నం వచ్చాడు. స్థానికంగా మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ నుంచి నలతగా ఉండటంతో 8న మచిలీపట్నం హైనీ హైస్కూలుకు సమీపంలో ఉన్న ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లాడు. దీంతో అతడు సద్దాంకు పలురకాల టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. డాక్టర్ చెప్పిన విధంగానే ఆ యువకుడు ఆర్ఎంపీ వైద్యశాలలో ఉన్న ల్యాబ్లో రక్త నమూనాలను ఇచ్చాడు. మరుసటి రోజు ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రిపోర్టును వైద్యుడికి చూపించాడు. రిపోర్టు చూసిన వైద్యుడు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్థారించి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని పంపేశాడు. మానసిక ఒత్తిడితో కెమికల్స్ తాగే యత్నం తనకు హెచ్ఐవీ ఉన్నట్లు వైద్యుడు నిర్థారించటంతో ఆ యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. స్నేహితులకు దూరంగా ఉంటూ మదనపడుతూ ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి మగ్గం పనులకు సంబంధించిన కెమికల్స్ కలుపుకుని తాగే ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన స్నేహితులు అతడిని నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. స్నేహితులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి హెచ్ఐవీకి సంబంధించిన పరీక్షలు చేయించారు. అన్ని రిపోర్టులు నెగిటివ్గానే వచ్చాయి. దీంతో స్నేహితులు గురువారం ఆర్ఎంపీ వైద్యుడిని నిలదీశారు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. దీంతో సదరు వైద్యుడు ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్ట్ వల్లే తప్పిదం జరిగిందని బుకాయించాడు. ఇలాంటి తప్పు మరోసారి చేయనంటూ ల్యాబ్ టెక్నీషయన్ బతిమిలాడడంతో స్నేహితులు శాంతించారు. -
క్యాన్సర్ను ఇట్టే పట్టేస్తుంది..
లండన్ : క్యాన్సర్ చికిత్స, నియంత్రణలో ముందడుగు పడింది. కేవలం ఒకే పరీక్షతో ఎనిమిది రకాల క్యాన్సర్లను గుర్తించే పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పలు ప్రాణాంతక క్యాన్సర్లను హోలీ గ్రెయిల్గా పిలిచే పరీక్షతో ముందుగానే పసిగట్టవచ్చు.ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ పరీక్షను సాధారణ వైద్యులు కూడా సులభంగా చేయడంతో పాటు ఎలాంటి లక్షణాలు కనపడని దశలోనూ క్యాన్సర్లను గుర్తించవచ్చని భావిస్తున్నారు. ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే వ్యాధిని త్వరగా గుర్తించే వీలుండటంతో క్యాన్సర్ రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంది. ఈ పరీక్ష అత్యంత సామర్థ్యం కలిగినదని దీన్ని అభివృద్ధి చేసిన బృందానికి నేతృత్వం వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్కు చెందిన డాక్టర్ గెట్ అటార్డ్ చెప్పారు. స్కానింగ్లు, కొలనోస్కోపీ వంటి పద్ధతుల అవసరం లేకుండా హోలీ గ్రెయిల్గా పిలిచే రక్త పరీక్షతో క్యాన్సర్ను గుర్తించవచ్చని ఆయన తెలిపారు. -
ఎనిమిది రకాల కేన్సర్లకు ఒకే రక్తపరీక్ష!
ప్రాణాంతక కేన్సర్ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే మనం బతికే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. అందుకే ఒకే రక్త పరీక్ష ద్వారా దాదాపు ఎనిమిది రకాల కేన్సర్లను గుర్తించేందుకు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. ‘కేన్సర్సీక్ అని పిలుస్తున్న ఈ కొత్త పద్ధతి శరీర కణజాలాన్ని కోసి పరీక్షించడం (బయాప్సీ) కంటే ఎంతో సురక్షితమైన, కచ్చితమైన ఫలితాలిచ్చేది కూడా అంటున్నారు వీరు. దాదాపు 90 శాతం మరణాలకు కారణమవుతున్న కేన్సర్లను కేన్సర్సీక్ ద్వారా గుర్తించవచ్చంటున్నారు నికోలస్ పాపాడోపౌలోస్. శరీరంలో కేన్సర్ కణాలు ఏర్పడితే... కొంత సమయం తరువాత వీటి తాలూకూ అవశేషాలు కొన్ని రక్తంలో తిరుగుతూ ఉంటాయి. కేన్సర్సీక్ ద్వారా ఇలాంటి డీఎన్ఏ ముక్కలను.. కేన్సర్ కణాలకు మాత్రమే పరిమితమైన కొన్ని రకాల ప్రొటీన్లను గుర్తిస్తారు. అండాశయ, కాలేయ, ఉదర, క్లోమ, ఆహారనాళం, ఊపిరితిత్తులు, రొమ్ములతో పాటు పెద్ద పేవు/మల ద్వార కేన్సర్ కణాలన్నింటిలో సామాన్యంగా కనిపించే ప్రోటీన్లు, డీఎన్ఏ ముక్కలను గుర్తించేందుకు తాము కొన్ని వందల జన్యువులు, దాదాపు 40 ప్రోటీన్ మార్కర్లను పరిశీలించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జోషువా కోహెన్ తెలిపారు. ఇతర అవయవాలకు వ్యాప్తి చెందని దశలో కేన్సర్లు ఉన్న దాదాపు వెయ్యిమందిపై ఈ పరీక్ష నిర్వహించి చూశామని, అండాశయ కేన్సర్ను ఇది 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగా... రొమ్ము కేన్సర్ విషయంలో ఫలితం 33 శాతం ఉందని వివరించారు. ఈ ఎనిమిది రకాల కేన్సర్లలో ఐదింటికి ఇప్పటివరకూ ఏ రకమైన పరీక్ష కూడా లేదని చెప్పారు. -
తల వెంట్రుకల్లో 4 నెలలు.. రోమాల్లో ఏడాది..
పరీక్షల ద్వారా వెల్లడయ్యే డ్రగ్స్ ఆనవాళ్లు సాక్షి, హైదరాబాద్: ఏ వ్యక్తి అయినా డ్రగ్స్ తీసుకున్నట్టు రుజువు చేయాలంటే అతడికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అయితే రక్త నమూనాల్లో అంత పక్కాగా డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు రాకపోవచ్చని ఫోరెన్సిక్ వైద్య నిపుణులు చెబుతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల క్రితం వరకు తీసుకున్న డ్రగ్స్ ఆనవాళ్లు మాత్రమే రక్త పరీక్ష ద్వారా దొరికే అవకాశం ఉందంటున్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్ కేసుల్లో 20 శాతమే రుజువవుతున్నాయని ఫోరెన్సిక్ విభాగం గతంలోనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి స్పష్టం చేసింది. సీడీఎఫ్డీ(కేంద్ర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్) అధికారులు మాత్రం.. తల వెంట్రుకలు, శరీరంపై రోమాలను పరీక్ష చేస్తే పక్కా ఆధారాలు లభిస్తాయని తెలిపారు. తల వెంట్రుకలను పరీక్ష చేస్తే 4 నెలల క్రితం వరకు డ్రగ్స్ తీసుకున్నా అందుకు సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయన్నారు. అదే శరీరంపై ఉన్న రోమాలను పరీక్ష చేస్తే 260 రోజుల నుంచి 360 రోజుల క్రితం వరకు అంటే దాదాపు ఏడాది క్రితం డ్రగ్ తీసుకున్నా ఇట్టే పట్టేయవచ్చని పేర్కొంటున్నారు. దీనిద్వారా 90 శాతం కేసుల్లో పక్కా ఆధారాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. అలాగే మూత్ర పరీక్షల్లోనూ డ్రగ్ తీసుకున్న ఆధారాలు లభిస్తాయని, అయితే అందులో కేవలం వారం పది రోజులకు మించిన ఆనవాళ్లు కనిపించవని చెప్పారు. డ్రగ్ను బట్టి ఆనవాళ్లు ⇒ వ్యక్తి తీసుకున్న డ్రగ్ను బట్టి ఎన్ని రోజుల క్రితం తీసుకున్నారో పక్కాగా చెప్పవచ్చని కేంద్ర ఫోరెన్సిక్ విభాగం సైంటిస్టులు తెలిపారు. ⇒ గంజాయి తీసుకుంటే... వారం నుంచి నెల వరకు మాత్రమే ఆధారాలు లభిస్తాయి. అదే తల వెంట్రుకలు పరీక్షిస్తే 90 రోజుల వరకు ఆధారాలు సేకరించవచ్చు. రక్త పరీక్ష ద్వారా అయితే 2 వారాల వరకు మాత్రమే ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ⇒ కొకైన్ తీసుకుంటే.. 3–4 రోజుల్లో మూత్ర పరీక్ష ద్వారా, 90 రోజుల వరకు తల వెంట్రుకల ద్వారా డ్రగ్ ఆనవాళ్లు దొరుకుతాయి. అదే శరీరంపై రోమాల ద్వారా 250 రోజుల వరకు నమూనాలు సేకరించి డ్రగ్ ఆనవాళ్లు గుర్తించవచ్చు. ⇒ జనరిక్ డ్రగ్స్.. ఇది కేవలం 12 గంటలు మాత్రమే రక్తంలో ఉంటుంది. మూత్రంలో ఒక రోజు ఉండగా, వెంట్రుకల్లో 3 నెలల వరకు ఉంటుంది. ⇒ హెరాయిన్ తీసుకుంటే... మూడు నుంచి నాలుగు రోజుల పాటు మూత్రంలో ఆనవాళ్లు గుర్తించవచ్చు. 12 గంటల్లో బ్లడ్ శాంపిల్స్లో దొరికిపోతుంది. తల వెంట్రుకల్లో 100 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ⇒ ఎల్ఎస్డీ, ఎండీఎంఏ డ్రగ్..: వెంట్రుకల పరీక్ష ద్వారా 90 రోజుల నుంచి 250 రోజుల వరకు డ్రగ్స్ ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంటుంది. -
పారా‘చెక్’
► మలేరియా నిర్ధారణకు మీనమేషాలు ► పాత పద్ధతిలో స్లైడ్లతో రక్తపరీక్షలు ► జ్వర పీడితులకు సకాలంలో అందని వైద్యం ► ఎపిడమిక్కు ముందస్తు చర్యలు చేపట్టని ప్రభుత్వం మలేరియా అనగానే విశాఖ ఏజెన్సీ గుర్తుకొస్తుంది. ఈ మహమ్మారి విజృంభణతో ఆదివాసీలు పిట్టల్లా రాలిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుంటే భయం గొలుపుతుంది. ఈ ఏడాది మాత్రం దీని నియంత్రణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేకపోయింది. గిరిజనుల సంక్షేమమే ధ్యేయమని ఊకదంపుడు ప్రసంగాలిచ్చే పాలకులు మలేరియాను క్షణాల్లో నిర్ధారించే పారాచెక్ కిట్లను కూడా ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేకపోయారు. హుకుంపేట (అరకులోయ): పారాచెక్ కిట్లు ఏజెన్సీలోని పీహెచ్సీల్లో లేకపోవడంతో మలేరియా నిర్ధారణ సకాలం జరగడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే 28వ తేదీ వరకు మన్యంలో 11,073 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జ్వర పీడితులకు రక్తపరీక్షలను స్లైడ్స్ పద్ధతిలో ఇప్పుడు చేపడుతున్నారు. ఈ నివేదిక వచ్చేందుకు 24 గంటల సమయం పడుతోంది. మలేరియా బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించకుంటే ప్రాణాంతక సెరిబ్రల్గా మారి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అదే పారాచెక్లతో రక్తపరీక్షలు చేపడితే క్షణాల్లో అది మలేరియా..కాదా అన్నది నిర్ధారణ అవుతుంది. కానీ గ్రామాలలో తిరిగే వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తల వద్ద పారాచెక్లు లేవు. ఒకటి,రెండు కిట్లతో గ్రామాలను వైద్యసిబ్బంది సందర్శించాలిసిన దుస్థితి. ఏటా ఏప్రిల్ నెల నుంచి మన్యంలో వ్యాధుల కాలం మొదలవుతుంది. మలేరియా, ఇతరత్రా వ్యాధుల నివారణకు జనవరి నెల నుంచే ముందస్తుగా ,ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం, వైద్యఆరోగ్య, మలేరియా శాఖలు ప్రణాళికలు రుపోందించాలి. ఈ ఏడాది జనవరి నెల నుంచే మలేరియా తీవ్రత నెలకొంది. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 36 ఆరోగ్య కేంద్రాలతో పాటు, అరకులోయ, పాడేరు, నర్సీపట్నం, కె.కోటపాడు ఏరియా ఆస్పత్రులలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రులన్నింటిలోనూ పారాచెక్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో జ్వరపీడితులకు ,క్షణాల్లో రక్తపరీక్షలు జరగడం లేదు. ప్రతి ఆస్పత్రి పరిధిలో కనీసం 2వేల పారాచెక్ కిట్లు అందుబాటులో ఉండాలి. ఒక్కోదానిలో ప్రస్తుతం 100 కూడా లేవు. జ్వరంతో పరిస్థితి విషమించిన వారికి మాత్రమే ఉన్నవాటితో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. మిగతా జ్వరపీడితులకు రక్తపరీక్షలు ఆలస్యమవుతున్నాయి. పారాచెక్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని, ఈమేరకు జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చామని మలేరియా శాఖాధికారులు గత నెలలో ప్రకటించారు.కానీ కొత్త కిట్లు మన్యానికి రాలేదు. పాత పద్ధతిలో స్లైడ్లపై రక్తపూతలు సేకరించి తెచ్చి ల్యాబ్లలో పరీక్షలు చేస్తున్నారు. ఎపిడమిక్ దృష్ట్యా ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి అధికంగా ఉంటోంది. ఈ కారణంగా పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. మరుసటి రోజున వ్యాధి నిర్ధారణ చేసి, సంబంధిత రోగి ఉండే గ్రామాలకు వైద్యసిబ్బంది పరుగులు తీస్తున్నారు.ఆసమయంలో మలేరియా సోకిన గిరిజనుడు ఉంటే వైద్యసేవలు కల్పిస్తున్నారు. రోగి లేకపోతే వైద్యసేవలు ఆలస్యమవుతున్నాయి. రెండు రోజుల్లో 20వేల కిట్లు... మలేరియాను సకాలంలో నిర్ధారించే పారాచెక్ ఆర్డీ కిట్లు 20వేలు రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తాం. జిల్లా కలెక్టర్ అనుమతి లభించడంతో పారాచెక్లను ఏజెన్సీలోని అన్ని ఆస్పత్రులకు పంపిణీకి చర్యలు చేపట్టాం. ప్రతి జ్వరపీడితుని క్షణాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలు జరుపుతాం. - ప్రసాదరావు, జిల్లా మలేరియా అధికారి -
రక్త పరీక్షతోనే కేన్సర్ నిర్ధారణ
వాషింగ్టన్: సాధారణ రక్త పరీక్షతోనే ప్రాణాంతక వ్యాధి కేన్సర్ మహమ్మారిని నిర్ధారించవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడున్న కేన్సర్ వ్యాధి నిర్ధారణ పద్ధతులు చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నవని, త్వరలో అందుబాటులోకి రానున్న ఈ నూతన పద్ధతిలో కేన్సర్ నిర్ధారణ ఇకపై సులభతరం కానుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ పద్ధతి ప్రకారం ఓ వ్యక్తి రక్తంలోని ప్లాస్మాలో ఫాస్పోప్రోటీన్ల శాతం పెరగడం అతనికి కేన్సర్ వ్యాధి ఉన్నట్లు సూచిస్తుందని అమెరికాలోని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా బ్రెస్ట్ కేన్సర్ ఉన్నవారి నుంచి రక్త నమూనాలు సేకరించామని, అలాగే ఈ పద్ధతిలో ఇతర కేన్సర్ల గుర్తింపుతోపాటు ఇతర రోగాలను నిర్ధారించుకోవచ్చని చెప్పారు. -
'మెడాల్'కు మేత!
పరీక్షల పేరుతో ప్రైవేట్ సంస్థకు రోజుకు రూ.50 లక్షలు చెల్లింపు ఏడాదికి రూ.180 కోట్లు.. మూడేళ్లకు రూ.540 కోట్లు • ఈ సొమ్ముతో అన్ని ఆస్పత్రుల్లో యంత్రాలు • సమకూర్చుకోవచ్చంటున్న అధికారులు • నిధులు గాలికి... ప్రైవేట్పైనే పాలకుల మోజు • రక్త పరీక్షల కోసం మెడాల్ మాయోపాయాలు • ఆ సంస్థ పరీక్షల ఫలితాలన్నీ తప్పుల తడకలే • ఫ్రాంజైజీలను అమ్ముకుంటున్న ప్రైవేట్ సంస్థ • అవసరం లేకపోయినా పరీక్షలు రాస్తున్న వైద్యులు కాలు బెణికిందని ఆస్పత్రికి వెళ్తే మెదడుకు ఎమ్మారై స్కానింగ్ చేయించుకోమని వైద్యుడు చీటీ రాస్తే ఎలా ఉంటుంది?.. వాంతులతో బాధపడే వారిని వెన్నుపూస ఎక్స్రే తీయించుకోమని చెబితే ఏమనిపిస్తుంది?.. జబ్బొకటైతే ఔషధం వేరేదిస్తే రోగం నయమౌతుందా?.. సర్కారీ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న ఓ సంస్థ తీరు అచ్చం అలాగే ఉంది. సాక్షి, హైదరాబాద్/పార్వతీపురం/గుడివాడ టౌన్ : ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జి.శ్రీనివాసరావు గ్యాస్ట్రిక్ సమస్యతో ప్రభుత్వ ఆస్పత్రికెళ్లగా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్తోపాటు అవసరం లేని మరికొన్ని పరీక్షలు రాశారు. మరోచోట కుక్క కరిచి ఆసుపత్రిలో చేరినా ఎనిమిది రకాల పరీక్షలు రాశారు. ఇంతేకాదు.. సాధారణ వైరల్ జ్వరాలకూ 10 రకాల టెస్టులు చేయించుకురావాలని పురమాయిస్తున్నారు. ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు?.. ఒక్క ‘మెడాల్’కు మేత పెట్టేందుకే! రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న మెడాల్ సంస్థకు దోచిపెట్టేందుకు ఇలా అడ్డగోలు రక్త పరీక్షలన్నీ రాస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహించడం కోసం ఓ ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర సర్కారు చెల్లిస్తున్న సొమ్ము ఎంతో తెలిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. రక్త పరీక్షల కోసం మెడాల్ అనే సంస్థతో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం రోజుకు అక్షరాలా రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అంటే ఏడాదికి రూ.180 కోట్లు... మూడేళ్లకు రూ.540 కోట్లు. ప్రభుత్వాసుపత్రిలో ఈసీజీ యంత్రం పాడైతే మరమ్మతుల కోసం కనీసం రూ.2 వేలు కూడా విదల్చని ప్రభుత్వం ఇలా ప్రైవేట్ సంస్థకు భారీగా నిధులు ఇస్తుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.50 లక్షల దండుకుంటున్న మెడాల్ సంస్థ కనీసం పరీక్షలనైనా సక్రమంగా చేస్తోందా? అంటే అదీ లేదు. ఆ సంస్థ నిర్వహస్తున్న పరీక్షల ఫలితాలు తప్పుల తడకలేనని తేలుతోంది. కొందరు మంత్రుల బంధువులు, మాజీ నేతలు, ఎంపీలు ఇందులో భాగస్వాములు మారి ప్రభుత్వ ధనాన్ని దోచుకుతింటున్నట్టు వైద్య ఆరోగ్య వర్గాలే చెబుతున్నాయి. అసలు మెడాల్ చేస్తున్న వ్యాపారం దారుణమని రోజువారీ నివేదికలు అందుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పట్టణాల్లో రక్త పరీక్షల నిర్వహణను కొన్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు ఫ్రాంచైజీల లెక్కన మెడాల్ అమ్మేసుకుంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు స్థానిక నేతల కనుసన్నల్లో ఉండడంతో వారు మెడాల్పై ఈగ వాలనివ్వడం లేదు. రూ.100 కోట్లకు మించి అవసరం లేదు రాష్ట్రంలో 32 ఏరియా ఆస్పత్రులు, 1,075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రులన్నింటిలో రక్త పరీక్షల యంత్రాల ఏర్పాటు, నిర్వహణకు రూ.100 కోట్లకు మించి అవసరం లేదని నిపుణుల పరిశీలనలో తేలింది. ఆటో అనలైజర్, సెల్కౌంటర్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్ ఇలాంటి పరికరాలన్నింటికీ కలిపి రూ.30 లక్షలు వెచ్చిస్తే చాలు. ఈ పరికరాలు ఏరియా, జిల్లా ఆస్పత్రులకు మాత్రమే అవసరం. పీహెచ్సీ స్థాయిలో అయితే రూ.5 లక్షలు వెచ్చిస్తే ప్రాథమిక పరీక్షలకు నిర్వహించవచ్చు. ఇది ఒకసారి పెట్టుబడి మాత్రమే. ప్రధాన పరీక్షలన్నీ ఈ పరికరాలతోనే చేయచ్చు. ఇక నెలవారీ సిబ్బంది వేతనాలు, పరీక్షలకు కావల్సిన కిట్లు, రసాయనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి నెలకు రూ.1.50 లక్షలు మాత్రమే అవుతుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.180 కోట్లు అప్పనంగా చెల్లిస్తుండడం గమనార్హం. సొంతంగా రక్త పరీక్షలు నిర్వహిస్తే ఖర్చు భారీగా తగ్గి, నిధులు ఆదా అయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రజల సొమ్మును ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టడంపైనే పాలకులు శ్రద్ధ చూపుతున్నారు. రోజుకు 21 వేల మందికి పరీక్షలు రక్త పరీక్షల నిర్వహణ కోసం ఆరు నెలల క్రితం టెండర్లు పిలిస్తే మెడాల్ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ దక్కేలా చేశారని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో రక్త నమూనాకు ప్రభుత్వం రూ.245 చొప్పున చెల్లించాలి. రోజుకు 12 వేల మంది రక్త నమూనాలు ఇప్పిస్తామని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మెడాల్ సంస్థ రాష్ట్రంలో రోజుకు 21 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహిస్తోంది. అంటే ఒక్కో పరీక్షకు రూ.245 చొప్పున ప్రభుత్వం రోజుకు రూ.50.45 లక్షలు చెల్లిస్తోంది. కేవలం రక్త పరీక్షలకే రోజుకు అర కోటి చెల్లిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ సంస్థకు ఏడాదిపాటు చెల్లించే సొమ్ముతో రాష్ట్రంలోని 1,075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తపరీక్షల కోసం అత్యుత్తమ యంత్రాలను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు పువ్వులు.. ఆరు కాయలు మెడాల్ వ్యాపారం ఆరు మాసాల్లోనే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. రక్త పరీక్షల కేసులు అమాంతం పెరిగిపోయాయి. వ్యాపారం రూ.కోట్లలోకి చేరింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు కలెక్టర్లు కూడా మెడాల్కు ఇబ్బడిముబ్బడిగా రక్త పరీక్షల కేసులు రాయాలని వైద్యులకు ఆదేశాలిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. 2016 జనవరి నుంచి మెడాల్ చేసిన రక్త పరీక్షలను చూస్తే వీరి వ్యాపారం ఏస్థాయిలో పెరిగిందో తెలిసిపోతుంది. నెల మెడాల్ చేసిన టెస్టులు --------------------------- జనవరి 940 ఫిబ్రవరి 81,755 మార్చి 1.77 లక్షలు ఏప్రిల్ 2.03 లక్షలు మే 2.62 లక్షలు జూన్ 2.80 లక్షలు ఫ్రాంచైజీల లెక్కన అమ్మకం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం మెడాల్ సంస్థ సొంతంగా ల్యాబ్లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ, స్థానిక డయాగ్నోస్టిక్ సెంటర్లతో మాట్లాడుకొని గుడ్విల్ కింద రూ.లక్షలు వసూలు చేసుకుని ఫ్రాంచైజీల లెక్కన అమ్ముకున్నారు. ఇలా ప్రతి జిల్లాలో ప్రైవేట్ ల్యాబ్లతో మాట్లాడుకొని నయాపైసా పెట్టుబడి పెట్టకుండా మెడాల్ సంస్థ దాదాపు రూ.25 కోట్లు వసూలు చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఫ్రాంచైజీలు మెడాల్కు చెల్లించిన సొమ్మును రాబట్టుకునేందుకు డాక్టర్లకు విదేశీ పర్యటనల ఆఫర్లు ఇస్తూ ఎక్కువ సంఖ్యలో బ్లడ్ టెస్టులను రాయించుకుంటున్నాయి. మెడాల్కు మేలు చేసేందుకు అవసరం లేకపోయినా వైద్యులు రక్త పరీక్షలు రాస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. వరదాయపాలెంలో మాయ చిత్తూరు జిల్లా వరదాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు నాలుగైదుకు మించి రక్త పరీక్షలు జరగవు. గత రెండు నెలల్లో 90 టెస్టులు జరిగినట్టు పీహెచ్సీలోని రిజిస్టర్ నమోదైంది. కానీ, 250 టెస్టులకు పైగా జరిగినట్టు కోర్ డ్యాష్బోర్డులో చూపిస్తున్నారు. అంటే ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ప్రమేయం లేకుండా మెడాల్ సంస్థే ఇష్టారాజ్యంగా టెస్టులు చేసుకుంటున్నట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఇదేమి కౌంట్.. మెడాల్ తప్పుడు నివేదికలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది మెడాల్ సంస్థ. విజయనగరం జిల్లా కొమరాడ మండలానికి చెందిన సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తికి సోమవారం పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో మెడాల్ సంస్థ రక్త పరీక్షలు నిర్వహించింది. ఆ సంస్థ రిపోర్టులో ప్లేట్లెట్ కౌంట్ 65,000గా ఉంది. అంత తక్కువగా కౌంట్ రావడంపై అనుమానం వచ్చి ఆయన ఆ రిపోర్టు వచ్చిన రెండు గంటల్లోనే పట్టణంలోని ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించుకున్నారు. ఆ ల్యాబ్ రిపోర్టులో కౌంట్ 2,38,000గా ఉంది. బుధవారం ఏరియా ఆసుపత్రిలోని మెడాల్ సిబ్బందిని నిలదీయగా.. తమకేమీ తెలియదని, రక్తం తీసి పంపించేంతవరకే తమ పని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 4 గంటల తర్వాతే రక్త పరీక్షలు వాస్తవానికి రక్త నమూనాలను సేకరించిన 2 గంటల్లోగానే ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించాలి. కానీ, ఉదయం 11 గంటలకు సేకరించి, సాయంత్రం 4 గంటలకు కూడా పరీక్షలు చేయడం లేదు. సాయంత్రం 4 గంటల వరకూ రక్తపరీక్షలు జరిగినట్టు చూపించడం లేదు. ఆ తర్వాత ఒక్కసారిగా వేలల్లో పరీక్షలు జరిగినట్టు కోర్డ్యాష్ బోర్డులో చూపిస్తున్నారు. అంటే నాలుగైదు గంటల తర్వాత పరీక్షలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈలోగా రక్తం గడ్డకడుతోంది. దీంతో తప్పుడు రిపోర్టులు వస్తున్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం ‘‘రక్త పరీక్షల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం వల్ల భవిష్యత్లో ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ప్రధానమైన హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్ పరీక్షలు మెడాల్ ప్యాకేజీలో లేవు. అయినా ఇంత డబ్బు ఎందుకు ఖర్చవుతుంది? ప్రస్తుతం రోజుకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నారు. రేపు రూ.కోటి అవుతుందని ప్రైవేట్ సంస్థ చెబితే, ప్రభుత్వం చేతులెత్తేస్తే బాధ్యత ఎవరిది? రక్త పరీక్షలను ప్రైవేట్కు కట్టబెట్టకుండా ఆ డబ్బుతో ప్రభుత్వమే నిర్వహించాలి’’ - డా.గేయానంద్, ఎమ్మెల్సీ -
రోజుకు ఐదారు టెస్టులు రాయండి!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్కో డాక్టర్ రోజుకు ఐదారు టెస్టులు రాయాల్సిందే..’ నంటూ వైద్యాధికారులపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు అవసరం లేకపోయినా పరీక్షలు ఎలా రాసేదంటూ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ బాధ్యతను మెడాల్ అనే ప్రైవేటు సంస్థకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడాల్ సంస్థ.. డాక్టర్లతో వీలైనన్ని ఎక్కువ పరీక్షలకు సిఫారసు చేయించుకోవడం లేదా అసలు పరీక్షలే చేయకున్నా చేసినట్టుగా బిల్లులు పెట్టుకోవడం వంటి చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల గోదావరి జిల్లాలకు చెందిన ఓ కలెక్టర్... వైద్యాధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎందుకు టెస్టులు రాయడం లేదంటూ కొందరు అధికారులు, వైద్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. ‘ఇది మన ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును భారీగా సక్సెస్ చేయాలి. రోగులకు టెస్టులు ఎవరైనా రాయకపోతే నాకు చెప్పండి..’ అంటూ జిల్లా వైద్యాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో సమావేశంలో పాల్గొన్న వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, డీఎంహెచ్ఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు నివ్వెర పోయారు. రోగికి అవసరమనుకుంటే టెస్టులు రాస్తాం కానీ, అవసరం లేకపోతే ఎలా రాస్తామని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వైద్యుడు వాపోయారు. రోజుకు 8 వేల రక్త నమూనాలు ఇస్తామని ప్రభుత్వం మెడాల్కు చెప్పిన నేపథ్యంలోనే.. ఆ సంస్థకు లబ్ధి చేకూర్చే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లపై పెట్టిందని, ఆ మేరకు కలెక్టర్లు తమపై ఒత్తిడి తెస్తున్నారని వైద్యాధికారులు వాపోతున్నారు. మరోవైపు పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రి వైద్యుల వద్దకు మెడాల్ తమ ప్రతినిధులను పంపించి మీరు ఖాళీ ప్రిస్క్రిప్షన్లు ఇస్తే, తామే టెస్టులు రాసుకుంటామని, దీనికి ప్రతిఫలంగా దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు టూర్లు ఎరగా వేస్తోందని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైద్యుడు తెలిపారు. ఇదిలా ఉండగా మెడాల్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 81 రక్తపరీక్షల ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు చేయలేదు. పైగా ప్రైవేటు డయాగ్నిస్టిక్స్ కేంద్రాలకు ఫ్రాంచైజీల లెక్కన అమ్మేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్థాయిలో, ఉన్నతాధికారుల వద్ద ఉన్న పరపతి కారణంగానే మెడాల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వైద్యాధికారులు అంటున్నారు. -
లివర్ పెరుగుతోంది... ఎందుకు?
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 45 ఏళ్లు. నేను గత రెండేళ్లుగా తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాను. నేను చాలా మంది డాక్టర్లను కలిశాను. కానీ తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తుంది. హోమియోపతిలో దీనికి ప్రత్యేక పరిష్కారమార్గాలు ఏవైనా ఉన్నాయా? - శ్యామ్, కరీంనగర్ మైగ్రేన్ అనేది ఒక విధమైన తలనొప్పి. తలనొప్పిలో చాలా రకాలు ఉంటాయి. ఈ మైగ్రేన్ అనేది తలకు ఒక పక్కనే వస్తుంది కాబట్టి దీనికి పార్శ్వపు నొప్పి అంటారు. కారణాలు: మానసిక ఒత్తిడి అధిక శ్రమ ప్రకాశవంతమైన వెలుతురు కళ్లపైన పడటం ఋతుక్రమంలో తేడాలు మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం పొగ తాగడం వంటివి దీనికి కారణాలు. కొందరిలో గర్భనిరోధక మాత్రలు మైగ్రేన్ను ప్రేరేపించే అవకాశం ఉంది తలకు ఒక వైపు వెళ్లే నరాలు ఒక్కసారిగా కుచించుకుపోవడం వల్ల లక్షణాలు ప్రారంభమవుతాయి. మైగ్రేన్ రకాలు 1) క్లాసికల్ మైగ్రేన్: ఈ రకం తలనొప్పి స్త్రీ, పురుషులకు సమానంగా ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ రకం తలనొప్పి మొదట చెవి పై భాగంలో మొదలై తరువాత తల సగ భాగానికి వ్యాపిస్తుంది. 2) కామన్ మైగ్రేన్: ఈ రకం తలనొప్పి సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా మధ్య వయస్సు వారిలో కనిపిస్తుంది. ఈ నొప్పి తలలో ఎక్కడైనా రావచ్చు. ఈ నొప్పి మంద్రంగా కళ్లల్లో సందులతో గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. లక్షణాలు: ఉదయం నిద్ర మేల్కొన్నప్పుడు ఎక్కువగా తలనొప్పి వస్తుంది కొందరిలో వాంతి వచ్చినట్లు ఉంటుంది అధిక వెలుతురును భరించలేకపోవడం ఎక్కువ శబ్దాలను తట్టుకోలేకపోవడం కళ్ల ముందు వెలుతురు చుక్కలాగా కనిపించడం ఆకలి తగ్గిపోవడం స్త్రీలలో రుతుక్రమ సమయంలో ఈ నొప్పి ఎక్కువవుతుంది ముఖంలోని ఒక భాగంలో కాని, ఒక చేయి కాని, తిమ్మిరి పట్టడం జరుగుతుంది కళ్లు తిరగడం నిర్థారణ: వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం, సిటీ స్కాన్, ఎమ్మారై, రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు నివారణ: పోషకాఆరం తీసుకోవడం రోజూ వ్యాయామం చేయడం ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడం పొగతాగడం, మత్తు పానీయాలకు దూరంగా ఉండడం ఎక్కువగా యాంటీ బయాటిక్స్కు వాడకుండా ఉండడం. హోమియో చికిత్స: హోమియోలో ఎటువంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. - విజయ్, ఆమదాలవలస మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ లివర్ సైజు పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ మితిమీరి తీసుకునేవారిలో, స్థూలకాయుల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. - ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. మా బాబు వయసు పదేళ్లు. అతడికి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు పచ్చకామెర్లు వచ్చాయి. అవి నెలలోపు వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం నుంచి కళ్లు పచ్చగా కనిపిసర్తున్నాయి. దయచేసి సలహా ఇవ్వగలరు. - సుభాష్, నవీన్నగర్ మీ అబ్బాయి వయసులోని వారికి ప్రధానంగా హైపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ అనే వైరస్ల వల్ల కామెర్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీవాడికి ఇంతకుముందు కూడా ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు. కాబట్టి ఈ వైరస్ వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. ఒకసారి పై ఇన్ఫెక్షన్లు సోకితే వాటి పట్ల వ్యాధి నిరోధకశక్తి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే మీ బాబు కామెర్లకు ఇతర కారణాలు అంటే... విల్సన్ డిసీజ్ వంటివి ఉండవచ్చు. మీ బాబుకు దురద, రక్తహీనత వంటి లక్షణాలు ఉన్నాయా, లేవా అన్న విషయం మీరు రాయలేదు. మీరు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్కు చూపించుకోండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా తాతగారు, నానమ్మ, పెద్దనాన్న, మా నాన్నగారు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్బారిన పడి ఉంటే, ఆ కుటుంబ వారసులూ జాగ్రత్తగా ఉండాలని చదివాను. మా కుటుంబ వైద్య చరిత్రలో క్యాన్సర్ ఉంది కాబట్టి నేనూ క్యాన్సర్తో చనిపోతాననే ఆందోళన ఉంది. దయచేసి నా అనుమానాలకు తగిన సమాధానాలు ఇవ్వండి. - రఘు, విజయవాడ మీ అనుమానాలకు తగిన బలముంది. క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోయిన కుటుంబ చరిత్ర ఉంటే వాళ్ల వారసులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీనికి స్త్రీ, పురుషులు, వయసు వంటి అంశాలతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు. అయితే మా తాతగారి కాలంలో క్యాన్సర్ వ్యాధికి సరైన చికిత్సే కాదు... దానిని ముందుగా కనిపెట్టేందుకు తగినంత వైద్యపరిజ్ఞానం కూడా లేదు. దాంతో అప్పట్లో క్యాన్సర్ పదం వింటేనే ఆ వ్యాధి బారిన పడ్డవారిపై ఆశలు వదలులుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో పాటు నిపుణులైన డాక్టర్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా ఈ క్యాన్సర్ వ్యాధిని ముందే గుర్తించే అధునాతనమైన వైద్య పరిరకాలు, ఉపకరణాలు, వైద్య పరీక్షలు, ఇతరత్రా అనేక ప్రక్రియలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఏ రకమైన క్యాన్సర్నైనా మొదటిదశలోనే గుర్తిస్తే దాన్ని సమూలంగా రూపుమాపవచ్చు. సకాలంలో గుర్తిస్తే దాదాపు 75 శాతం వరకు దీనిని ఎదుర్కొనే వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ దీని బారిన పడ్డవారు చివరిదశలో చికిత్స కోసం వస్తే వారి జీవితానికి 25 శాతం మాత్రమే హామీ ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే... మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న అలవాట్లను బట్టి మీరు వెంటనే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే మీకు క్యాన్సర్ వస్తుందా, రాదా అని కూడా చెప్పవచ్చు. మీకు ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి ఉంటే క్యాన్సర్ను జయించవచ్చు. ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే క్యాన్సర్బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే అందరూ గుర్తించి, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... పొగతాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానేయాలి విపరీతంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు తినాలి చిన్నప్పుడు ఇవ్వాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్ను పిల్లలకు ఇవ్వాలి. డాక్టర్ జి. వంశీకృష్ణారెడ్డి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ మలక్పేట హైదరాబాద్ -
హన్సికకు రక్తపరీక్ష
చెన్నై: తనకేం కాలేదని, తాను బాగానే ఉన్నానని హీరోయిన్ హన్సిక తెలిపింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కంగారు పడాల్సిన పనిలేదని ట్విటర్ ద్వారా సోమవారం వెల్లడించింది. హన్సిక రక్త పరీక్ష చేయించుకుందని తెలియడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందారు. 'ఏం జరిగింది. ఏమైనా సీరియస్సా' అంటూ ట్వీట్లు చేశారు. విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యమే ముఖ్యమని ఆమెకు సలహా ఇచ్చారు. అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే టెస్టు చేయించుకున్నానని హన్సిక వివరణ ఇచ్చింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్ష కోసం రక్తం తీసుకున్నప్పుడు తాను గట్టిగా ఏడ్చానని, తన తల్లి ఎంతో ఓపికగా సముదాయించిందని అంతకుముందు హన్సిక ట్వీట్ చేసింది. దీంతో కంగారు పడిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం హన్సిక పలు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. I can cry the loudest when it comes 2 taking a blood test!Thank god for my mothers patiences!Squeezed the poor thing!#earlymorncrybaby lol — Hansika (@ihansika) November 30, 2015 -
రక్త పరీక్షతో.. అకాల మరణాన్ని గుర్తించొచ్చు!
మెల్బోర్న్: ఒక్క రక్త పరీక్షతోనే అకాల మరణానికి గల అవకాశాలను గుర్తించవచ్చని చెబుతున్నారు మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. 10,000 మంది వ్యక్తుల రక్తనమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను గుర్తించారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 'గ్లిక్-ఏ' అనే మాలిక్యులార్ బై ప్రొడక్ట్ను కొత్తగా గుర్తించారు. రక్తంలో గ్లిక్-ఏ పరిమాణం అధికంగా ఉన్న వారిలో రానున్న 14 సంవత్సరాల కాలంలో వివిధ వ్యాదులు, ఇన్ఫెక్షన్ల బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ఈ ఇన్ఫెక్షన్లు అకాల మరణానికి దారితీసేంత తీవ్రమైనవిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త మైకెల్ ఇనోయ్ మాట్లాడుతూ.. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి ఈ పరిశోదన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్లిక్-ఏ పై మరింత పరిశోధన జరగాల్సిన అవసంరం ఉందని తెలిపారు. రక్తంలో దీని పరిమాణంను అధిక మోతాదులో గుర్తించినట్లయితే ప్రాణాంతక వ్యాధులకు దగ్గరగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. -
వీర్యంలో పస్సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి?
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ ఆహారం సరిగా జీర్ణం కావడం లేదు! నా వయసు 26 ఏళ్లు. బరువు 64 కేజీలు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. కొద్దిరోజులుగా పొట్ట అంతా ఉబ్బరంగా ఉంటోంది. తేన్పులు ఎక్కువగా వస్తున్నాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కావడం లేదు. వీటితో పాటు కోపం, చిరాకు ఎక్కువగా కలుగుతున్నాయి. శారీరకంగానూ, మానసికంగానూ బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరని ప్రార్థిస్తున్నాను. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే మీరు పెప్టిక్ అల్సర్తో గానీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధితో గాని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ సమస్యతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో రాయలేదు. చాలావరకు అల్సర్స్కు సంబంధించిన వ్యాధి వల్ల కడుపులో నొప్పి రావడం, మంటరావడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత నొప్పి ఎక్కువ కావడం గానీ, తక్కువ కావడం గానీ జరుగుతుంది. ఒక్కోసారి కడుపులో అల్సర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ జరిగేలా చూసుకోండి. ఎండోస్కోపీ పరీక్షతో మీ వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ అయితే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. నాకు ఆర్నెల్ల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు చేసిన రక్త పరీక్షల్లో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తిరిగి ఆ టెస్ట్ చేయిస్తే మళ్లీ పాజిటివ్ అని తెలిపారు. ఈ వ్యాధికి తగిన చికిత్స అందుబాటులో ఉందా? నాకు సరైన సలహా ఇవ్వండి. - సుదర్శన్నాయుడు, చిత్తూరు మీరు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ఆరు నెలల తర్వాత కూడా మీకు మీ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి ఉందని అర్థం. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని, వ్యాధి ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి చాలామందిలో నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి చైతన్యవంతం అయ్యే అవకాశం ఉంది. మీరు ప్రతి మూడు నెలలకోసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు నడుచుకోండి. యాండ్రాలజీ కౌన్సెలింగ్ వీర్యంలో పస్సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి? నా వయుస్సు 34 ఏళ్లు. నాకు వివాహం జరిగి పదేళ్లు దాటింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. దాంతో దంపతులిద్దరం వైద్యపరీక్షలు చేయించుకున్నాం. ఆమెలో ఏ లోపం లేదు. కానీ నా వీర్యంలో పస్ సెల్స్ ఎక్కువగా (ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్) ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. పస్ సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? - కేజేఎన్., విజయవాడ చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు వీర్యం నాణ్యత తగ్గుతుంది. దాంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహా మీద సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే వీర్యం నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటిబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, ఈసారి వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉన్నట్లు రిపోర్టు వస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి. నాకు కుడిపక్కన వరిబీజం (బుడ్డ) వచ్చింది. డాక్టర్ను సంప్రదిస్తే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అన్నారు. కానీ ఆపరేషన్ వల్ల సెక్స్లో ఇబ్బందులేమైనా వస్తాయేమోననీ, పిల్లలు కలగరేమో అని చేయించుకోవడం లేదు. నాకు మార్గం చెప్పగలరు. - జీడీఎస్పీ., గుణదల హైడ్రోసీల్, హెర్నియా... ఈ ఆపరేషన్లకూ అంగస్తంభనకూ ఎలాంటి సంబంధం లేదు. అంగస్తంభనకు కావాల్సిన నరాలు అంగంలో చాలా లోపలికి ఉంటాయి. మీకు ఆపరేషన్ వృషణాల దగ్గర చేస్తారు. దీని వల్ల సెక్స్ చేయడానికి ఇబ్బంది అయ్యే అవకాశమే లేదు. పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా జరగదు. నిజానికి మీ సమస్యకు ఆపరేషన్ చేయించుకోకపోతేనే చాలా ప్రమాదం. సర్జరీ తర్వాత సమస్యలన్నీ తొలగి, అంతా నార్మల్ అయిపోతుంది. కాబట్టి నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. నా వయసు 40. మూడేళ్లుగా షుగర్వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతం చక్కెరపాళ్లు కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ రెండు మూడు నెలల నుంచి మూత్రంలో మంట, పురుషాంగం చివరిభాగంలో చర్మంపై పగుళ్లు వస్తున్నాయి. సెక్స్ చేసేటప్పుడు పురుషాంగం చివరన ఉన్న చర్మం మంటపుడుతోంది. దాంతోపాటు సెక్స్ సమయంలో పురుషాంగం చివర ఉన్న చర్మం వెనక్కిపోవడం లేదు. నా సమస్యకు సరైన మార్గాన్ని సూచించండి. - ఎస్.ఆర్.ఎస్.ఎమ్., నెల్లూరు షుగర్ వ్యాధి ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మంపై పగుళ్లు రావడం, ఇన్ఫెక్షన్ రావడం, తెల్లగా పాలిపోయినట్లుగా కావడం వంటి సమస్యలు చాలా సాధారణం. ఈ సమస్యను బెలనోఫ్తైస్ అంటారు. సాధారణంగా యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ క్రీమ్లతో ఇది తగ్గిపోతుంది. కాకపోతే పదే పదే వస్తుండటంతో పాటు... ప్రధానంగా చర్మం వెనక్కిపోకుండా సెక్స్లో సమస్యగా మారిన వారు దీనికోసం సున్తీ (సర్కమ్సిషన్) ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అదేవిధంగా షుగర్ ఉన్న పేషెంట్స్లో యూరిన్లో ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తున్నా కూడా సున్తీ ఆపరేషన్ను సూచిస్తాం. ఈ ఆపరేషన్ తర్వాత మీరు పేర్కొన్న సమస్యలన్నీ దూరం కావడం వల్ల నిశ్చింతగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ తుంటి ఎముక ఫ్రాక్చర్, సర్జరీ తప్పదా? మా చిన్నమ్మగారి వయసు 77 ఏళ్లు. ఆమె ఆర్నెల్ల క్రితం బాత్రూమ్లో జారిపడింది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆయన ఎక్స్-రే తీసి, తుంటి ఎముక ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పడంతో మేం ఆమెను ఆర్థోపెడిక్ సర్జన్ వద్దకు తీసుకెళ్లాం. ఆమెకు మేజర్ సర్జరీ అవసరమనీ, దానికి సంబంధించిన అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వివరించారు. మా కుటుంబ సభ్యులమంతా ఆ రిస్క్ ఫ్యాక్టర్లు విన్న తర్వాత చాలా ఎక్కువగా ఆందోళన పడ్డాం. కొందరు సన్నిహితుల సలహా మేరకు ఆమెను ఇంగ్లిష్ వైద్యులకు బదులుగా సంప్రదాయ వైద్యం చేస్తూ, ఎముకలను సరిచేసే వారిదగ్గరకు తీసుకెళ్లాం. వారేదో బ్యాండేజీ లాంటిది కట్టి, బెడ్రెస్ట్ తీసుకొమ్మని సలహా ఇచ్చారు. ఒక మూడు నెలల్లో ఆమె లేచి తిరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమె మంచం దిగలేపోతోంది. పైగా ఎప్పుడూ మంచం మీదే పడుకొని ఉండటం వల్ల వీపు మీద అంతటా పుండ్లు (బెడ్సోర్స్) వచ్చాయి. ఈ దశలో మాకు తగిన సలహా ఇవ్వమని ప్రార్థన. - వెంకటదుర్గారావు, విజయవాడ తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడం అన్నది పెద్ద వయసువారిలో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఆ వయసువారు సాధారణంగా డయాబెటిస్, గుండెజబ్బులతో బాధపడుతుంటారు. తుంటిఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. అయితే ఆ వయసు వారిలో శస్త్రచికిత్స అంటే ప్రపంచంలోని ఉత్తమమైన ఆసుపత్రికి వెళ్లినా ఆ వయసుకు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్లు ఉండనే ఉంటాయి. అయితే ఆ రిస్క్ ఫ్యాక్టర్లకు జడిసి మీరు ఆపరేషన్ చేయించుకోకపోతే మున్ముందు మరింత తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుత సమస్యకు వస్తే ఆమె మళ్లీ లేచి నిలబడి తిరగాలంటే శస్త్రచికిత్స తప్పనిసరి. కాకపోతే ఆర్నెల్ల కిందటితో పోలిస్తే ఈసారి రిస్క్ మరింత పెరుగుతుందని గుర్తించండి. ప్రమాదం జరిగినపుడు సాధ్యమైనంత త్వరలో శస్త్రచికిత్స చేయిస్తే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్ను కలవండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ పిల్లల కోసంమీరంత నిరాశ పడనక్కరలేదు! నా వయసు 26 ఏళ్లు. నేను రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాను. నాకు పెళ్లయి నాలుగేళ్ల అవుతోంది. గత మూడేళ్లుగా పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. అయితే నాకు పీరియడ్స్ నాలుగైదు నెలలకొకసారి వస్తున్నాయి. డాక్టర్ను కలిశాను. స్కానింగ్ తీసి పాలీ సిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. నాకు ఎప్పటికైనా పిల్లలు పుడతారా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరి, హైదరాబాద్ పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్యను చాలా మంది మహిళల్లో మేం రోజూ చూస్తుంటాం. మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉంది కాబట్టి ఇలా రుతుస్రావం క్రమంగా రాదు. దాంతో మీలో అండాలు ఉత్పత్తి అయ్యే సంఖ్య కూడా బాగా తగ్గుతంది. ఫలితంగా మీలో గర్భధారణకు చాలా టైమ్ పట్టవచ్చు. మొట్టమొదట మీరు చేయాల్సిన పని... మీరు ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే దాన్ని క్రమంగా తగ్గించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చేసుకోండి. ఇదే జరిగితే...మీలో రుతుస్రావం క్రమబద్ధంగా రావడం మొదలవుతుంది. ఇక మీ ఆహారంలో ముదురాకుపచ్చటి తాజా ఆకుకూరలు చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పిజ్జా, బర్గర్, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ఫుడ్ను పూర్తిగా మానేయండి. ఈరోజుల్లో మీలో అండం ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు చాలా మంది మందులు, వైద్యప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. మొదట టాబ్లెట్స్తో ప్రారంభించి, చికిత్సకు మీరు స్పందిస్తున్న తీరు ఆధారంగా క్రమంగా మీకు గొనాడోట్రాపిన్ ఇంజక్షెన్ ఇవ్వడం వంటివి చేస్తాం. లేదా మందులూ, గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ కలిపి కాంబినేషన్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీలాంటి వారిలో చాలామంది చాలా ప్రాథమిక చికిత్సకే బాగా స్పందిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం. ఐవీఎఫ్ అనే అధునాతన చికిత్స చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమవుతుంది. మీరు అప్పుడే అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుట్టేందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. ఇక మీకు పీసీఓఎస్ ఉందంటే దీంతోపాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, యుటెరైన్ క్యాన్సర్, గుండెసమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మీరు మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి. సరైన చికిత్స తీసుకుంటూ క్రమబద్ధంగా రుతుస్రావం జరిగేలా చూసుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి. -
లేనిరోగాన్ని అంటగట్టారు
గాంధీ లేబొరేటరీ సిబ్బంది నిర్లక్ష్యం గాంధీ ఆస్పత్రి(హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ రోగికి లేని రోగాన్ని అంటగట్టారు. ప్రాణాంతకమైన వ్యాధి సోకిన భర్తతో కాపురం చేయలేనని, విడాకులు ఇవ్వాలంటూ అతని భార్య పట్టుబట్టింది. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాలియాతండాకు చెందిన రవి (23) ఈనెల 1వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురై గాంధీ ఆస్పత్రి అత్యసర విభాగంలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త నమూనాలు సేకరించిన సిబ్బంది ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి తరలించారు. రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబొరేటరీ సిబ్బంది రవికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. దీంతో రోగితోపాటు అతని బంధువులు నిర్ఘాంతపోయారు. అయితే, ప్రాణాంతకమైన వ్యాధి ఉన్న రవితో కాపురం చేయలేనని, విడాకులు కావాలంటూ భార్య జ్యోతి పట్టుబట్టింది. అయితే, గాంధీ ఆస్పత్రి ల్యాబ్ రిపోర్టుపై అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు రవికి నగరంలోని రెండు ప్రై వేటు ఆస్పత్రుల్లో వేర్వేరుగా రక్త పరీక్షలు చేయించారు. ఆ రిపోర్టుల్లో రవికి ఎలాంటి ప్రాణాంతక వ్యాధి లేదని స్పష్టమైంది. దీంతో ఆగ్రహంతో బంధువులు, కుటుంబసభ్యులు గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి అధికారులు స్పందించి ఆందోళనకారులను శాంతింపజేశారు. రవి రక్తాన్ని మరోమారు సేకరించి పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ నెగిటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది. -
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నాకు ఎనిమిది నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో జరిగిన రక్తపరీక్షలో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే మళ్లీ హెపటైటిస్-బి పాజిటివ్ అని అన్నారు. ఈ వ్యాధికి చికిత్స ఉందా లేదా? - లక్ష్మయ్య, వరంగల్ మీకు ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్-బి పాటిజివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి అనే వ్యాధి ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని (ఉదా: హెచ్బీఈఏజీ, యాంటీ హెచ్బీఈఏజీ, ఎల్ఎఫ్టీ, హెచ్బీవీ డీఎన్ఏ అనే పరీక్షలు) వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకోవాలి. వ్యాధి చాలా మందిలో సుషుప్తావస్తలో (ఇనాక్టివ్గా) ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి చురుకైన (యాక్టివ్) దశలోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి సుషుప్తావస్థలో ఉన్నవారికి ఏ మందులూ అవసరం లేదు. కానీ మీరు చేయాల్సిందల్లా ప్రతి 3 నుంచి 6 నెలలకోసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించి ఎల్ఎఫ్టీ పరీక్ష చేయించుకుంటూ వ్యాధి చురుకైన దశలోకి ఏమైనా వచ్చిందా అని చూసుకోవాలి. యాక్టివ్ దశలోకి వెళ్తే దానికి వివిధ రకాల మందులు వాడాల్సి ఉంటుంది. ఏ మందు వాడాలో డాక్టర్గారే నిర్ధారణ చేస్తారు. -
డయాబెటిక్ కౌన్సెలింగ్
నేను ఇటీవలే రక్తపరీక్ష చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్లైన్లో ఉందన్నారు. అంటే నాకు డయాబెటిస్ వచ్చినట్లేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సునీల్, భట్టిప్రోలు మీరు పరగడపున రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 100 కంటే తక్కువ ఉండటం; భోజనం చేశాక చేయించిన రక్తపరీక్షలో ఆ విలువ 140 కంటే తక్కువ ఉండటం జరిగితే మీకు డయాబెటిస్ లేదని అర్థం. ఒకవేళ మీరు పరగడుపున చేయించిన పరీక్షలో రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 125 కంటే ఎక్కువగానూ, భోజనం చేసిన తర్వాత చేసిన రక్తపరీక్షలో ఆ విలువ 200 కంటే ఎక్కువగానూ, హెచ్బీఏ1సీ అనే పరీక్షలో వచ్చిన విలువ 6.5 శాతం కంటే ఎక్కువగానూ ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్లు లెక్క. ఇలా కాకుండా పూర్తిగా డయాబెటిస్ లేకుండా ఉండి, ఆ విలువలకు దగ్గరగా రక్తపరీక్షల ఫలితాలు వస్తే అప్పుడు దాన్ని బార్డర్లైన్ డయాబెటిస్ అంటారు. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఇలాంటివారు రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం, తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవడం, స్థూలకాయం లేకుండా చూసుకోవడం చేస్తుంటే చాలాకాలం పాటు డయాబెటిస్ దరిచేరకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ అరుణ్, ఎండోక్రైనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
ఆమెకు..రక్త ‘పరీక్ష’..!
వైద్య వృత్తి వ్యాపారంగా మారుతోంది. రోగిని దోచుకోవడమే ధ్యేయంగా రక్త, మూత్ర, ఎక్స్రే పరీక్షలకు పురమాయించడం పరిపాటిగా మారింది. ఇక పుట్టగొడుగుల్లా..వెలసిన ల్యాబ్ల నిర్వాహకులు..తప్పుడు రిపోర్టులిస్తూ..దోచేస్తున్నారు. రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బొద్దాం గ్రామానికి చెందిన ఓ గర్భిణికి నాలుగు చోట్ల..నాలుగు రకాలుగా బ్లడ్గ్రూప్ను నిర్ధారించారంటే..ల్యాబ్ల నివేదికల్లోని డొల్లతనం ప్రస్ఫుటమవుతోంది. రాజాం రూరల్: రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన నిరుపేద గర్భిణి కొత్తపల్లి లక్ష్మీకి ఎవరూ ఊహించని కష్టం వచ్చి పడింది. విశాఖపట్నంకు చెందిన ఈమెకు ఏడాది క్రితం బొద్దాంకు చెందిన ఆదినారాయణతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు చూలాలు. ప్రసవానికి సిద్ధపడుతున్న ఆమెకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. రక్తహీనతతో బాధపడుతున్న లక్ష్మికి ప్రసవ సమయంలో ఆపరేషన్ చేస్తే.. రక్తం అవసరం అవుతుందేమోనన్న భావనతో బ్లడ్గ్రూప్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. అయితే..ఒక్కో చోట ఒక్కో గ్రూపుగా నిర్ధారణ కావడంతో అంతా విస్తుపోతున్నారు. చివరికి ఆమెది ఏ గ్రూపో.. ఏ గ్రూపు రక్తం సేకరించాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తొలుత ఆమెను విశాఖలోని విక్టోరియా ఆస్పత్రిలో ఈ ఏడాది జూన్ 28న రక్త పరీక్ష చేయించగా.. ఓ నెగిటివ్గా నిర్ధారించారు. ఆ తర్వాత రాజాం సామాజిక ఆస్పత్రిలో జూలై 30న పరీక్ష నిర్వహించగా ఓ నెగిటివ్గానే వచ్చింది. అనంతరం లక్ష్మి మలేరియా బారిన పడడంతో మళ్లీ రక్త పరీక్ష నిర్వహించి..ఓ నెగిటివ్గా మళ్లీ నిర్ధారించారు. అయితే..సెప్టెంబర్ 23న రాజాంలోని చాందిని డయగ్నోస్టిక్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా..బి-పాజిటివ్ రావడంతో అంతా విస్తుపోయారు. ఇదేంటి ఇలా జరిగింది..మరోసారి నిర్ధారించుకుందామని రాజాం జీఎంఆర్ కేఆర్ ఆస్పత్రిలో ఒకే రోజు మూడు సార్లు రక్త పరీక్ష నిర్వహించగా..ఓ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మూడు చోట్ల మూడు రకాల గ్రూపింగ్లు రావడంతో.. ఆశ్చర్యానికి గురై..మరోసారి రాజాంలోని ఆర్ఆర్ డయగ్నోస్టిక్ సెంటర్లో పరీక్ష చేయించుకుంటే ఓ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంతా అయోమయం ఎందుకైనా మంచిదని కుటుంబ సభ్యులు గతంలో బి పాజిటివ్గా నిర్ధారించిన చాందిని డయగ్నోస్టిక్లో మరోసారి పరీక్షించుకోగా..ఓ పాజిటివ్గా తేల్చారు.దీంతో లక్ష్మి కుటుంబం అయోమయానికి గురవుతోంది. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. హిమోగ్లోబిన్ శాతం కూడా తక్కువగా ఉండడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద రజక కుటుంబానికి చెందిన తాము..ఆపరేషన్ సమయంలో రక్తం అవసరమొస్తే..ఏ గ్రూపు రక్తం తేవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి..తమకు న్యాయం చేయాలని, తప్పుడు నివేదికలు ఇస్తూ..అయోమయానికి గురిచేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
రక్త పరీక్షతో కేన్సర్ నిర్ధారణ
వాషింగ్టన్: వివిధ రకాల కేన్సర్లు, అవి ఏ స్థాయిలో ఉన్నాయన్నది నిర్ధారించేందుకుగాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ సులభమైన రక్తపరీక్ష పద్ధతిని అభివృద్ధిపర్చారు. సాధారణంగా చికిత్స చేయకున్నా కే న్సర్ కణాలు విభజన చెందుతూ, నశిస్తూ ఉంటాయి. కేన్సర్ కణాలకు సంబంధించిన డీఎన్ఏ రక్తంలో క లుస్తూ ఉంటుంది. రక్తపరీక్షలో ఆ డీఎన్ఏను విశ్లేషించడం ద్వారా అది ఏ రకమైన కేన్సర్ వ్యాధో, ఏ స్థాయిలో ఉందో కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘కేన్సర్ పర్సనలైజ్డ్ ప్రొఫైలింగ్ బై డీప్ సీక్వెన్సింగ్ (సీఏపీపీ-సెక్)’ అనే ఈ పద్ధతి ద్వారా పలువురు రోగుల్లో వివిధ కేన్సర్లను గుర్తించామని వారు వెల్లడించారు.