Building construction
-
అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్లీ స్కెచ్..!
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నాయకులు తిరగరాస్తున్నారు. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. ఇందులో భాగంగా.. సీఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణల పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్దస్కెచ్చే వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన రెండు సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. పనులను బట్టి వీటి విలువను ఏకంగా 28 నుంచి 55 శాతం మేర పెంచింది. అంటే.. అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి రూ.10 వేల కోట్ల మేర పెంపు చూపడంపై నిర్మాణరంగ నిపుణులే నోరెళ్లబెడుతున్నారు. ఐదేళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్నారు.ధరలు పెద్దగా పెరగకపోయినా..గత టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏలో 2017–18 మధ్య ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని వారంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టిపెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్లు సాగదని.. పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దుచేసి పారేశారు. అలాగే, గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లను సైతం రద్దుచేసి, ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటుకు కట్టబెట్టేందుకు వీలుగా లంప్సమ్ విధానం అనుసరించడం గమనార్హం. రాజధాని ప్రాంతంలో 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ.5వేల కోట్ల మేర పనులు పూర్తిచేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా.. 41, 42 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చారు. ఇందులో రూ.11,467.27 కోట్లతో పనులకు అనుమతినిస్తూ జీఓ సైతం జారీచేశారు. తాజాగా.. మరో రూ.8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28 శాతం వరకు పెంచగా, భవన నిర్మాణాల ఖర్చును ఏకంగా 35 నుంచి 55 శాతం పెంచడం విశేషం. -
మా చెరువు ఎక్కడ? దండం పెట్టి వేడుకున్న రైతు..
-
3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్ భవనం!
అత్యంత ఎత్తయిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం కొత్తేమీ కాదు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, విల్లీస్ టవర్, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వంటివి ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఇవన్నీ నివాసాలు, కార్యాలయాలే. వాటిని తలదన్నేలా 3,000 అడుగుల (914.4 మీటర్లు) ఎత్తయిన భవనాన్ని నిర్మించనున్నట్టు స్కిడ్మోర్, ఒవింగ్స్ అండ్ మెరిల్ (ఎస్ఓఎం) కంపెనీ ప్రకటించింది. నివాసానికే గాక విద్యుత్ నిల్వకు కూడా వీలు కల్పించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం విద్యుత్ స్టోరేజీ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్ను నిల్వచేసే బ్యాటరీలాగా ఇది పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. భవనం వెలుపలి భాగంలో అమర్చే ఫలకాల్లో విద్యుత్ను నిల్వ చేస్తారు. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. ఈ భవనాన్ని ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంధన ఆదాకు రోల్మోడల్ ‘ఈసీబీసీ బిల్డింగ్’
సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది. అదనపు నిధుల కోసం... గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్మెంట్, డిస్కమ్లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా.. బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పొదుపులో అగ్రగామి ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్మోడల్గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్ -
కుప్పకూలిన లిఫ్ట్.. ఏడుగురు కార్మికుల మృతి..!
ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైరైజ్అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. టెర్రస్ నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రంవెలుగు చూసింది. ఈ మేరకు థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కాగా థానేలోని ఘోడ్బందర్ రోడ్లో 40 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది. ఆదివారం బిల్డింగ్ టెర్రస్పై వాటర్ఫ్రూఫింగ్ పనులు జరిగాయి. సాయంత్రం పనులు ముగించుకున్న కార్మికులు 5.30 గంటల సమంలో పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్లోని సపోర్టింగ్ కేబుల్స్లో ఒకటి తెగిపోవడంతో లిఫ్ట్ అమాంతం కిందకు పడింది. ఈ ఘటనలో యిదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతులను మహేంద్ర చౌపల్(32), రూపేష్ కుమార్ దాస్(21), హరున్ షేక్(47), మిత్లేష్(35), కారిదాస్(38)తోసహా మరో ఇద్దరి గుర్తించాల్సి ఉంది. ప్రమాదంపై థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి యాసిన్ తాడ్వి మాట్లాడుతూ.. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదని తెలిపారు. 40వ అంతస్తు నుంచి కుప్పకూలి P3 (అండర్ గ్రౌండ్ థర్డ్ లెవల్ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా) వద్ద పడిందని యాదవ్ పేర్కొన్నారు. చదవండి: అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది... #WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra's Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW — ANI (@ANI) September 10, 2023 -
ముందడుగేదీ?... నిర్మాణానికి నోచని 101 గ్రామపంచాయతీ భవనాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నాయి. అయినా పనులు ప్రారంభానికి నోచలేదు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాలో సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 180 గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసింది. 127 పంచాయతీలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు, 47 భవనాలకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు వచ్చాయి. మరో ఆరింటికి కేంద్ర ప్రభుత్వ ఆర్జీ ఎస్ఏ (రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్) పథకం కింద నిధులు వచ్చాయి. ఒక్కో భవనానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించారు. గతంలో గిరిజన తండాలుగా ఉండీ ఇప్పుడు పంచాయతీలుగా మారిన చోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధుల నుంచి నిధులు మంజూరయ్యాయి. పనులే షురూ కాలేదు వివిధ పథకాల కింద మొత్తం 180 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు కాగా, ఇప్పటి వరకు కేవలం 79 గ్రామ పంచాయతీ భవనాలకే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 101 భవనాలు ఇంకా ప్రారంభానికి నోచలేదు. నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ పనులకు శ్రీకారం చుట్టకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. స్థలాల సమస్య పలు గ్రామ పంచాయతీల్లో స్థలం లేకపోవడం కూడా భవన నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అనువుగా లేదు. బండలు, గుంతలు ఎక్కువగా ఉండటంతో పనులు ప్రారంభించలేకపోయామని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
పారదర్శకత కోసమే టీఎస్బీపాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులను అత్యంత పారదర్శకంగా జారీ చేసేందుకు టీఎస్ బీపాస్ను ప్రవేశపెట్టినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఇదివరకు భవన నిర్మాణ అనుమతుల జారీలో భారీగా అవినీతి జరిగేదని, లంచాలు ఇచ్చి అనుమతులు పొందిన ఘటనలు అనేకమని అన్నారు. కానీ అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకే టీఎస్ బీపాస్ను ప్రవేశపెట్టామని చెప్పారు. కేవలం 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని, నిర్దేశించిన గడువులోగా ఒకవేళ అనుమతి రాకుంటే ఆటోమేటిక్గా ఇచ్చినట్టే పరిగణించాలని పేర్కొన్నారు. టీఎస్ బీపాస్తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ ఈ అంశంపై మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖను రద్దుచేసి.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని తెలిపారు. హిమాయత్సాగర్ కలుషితం కాకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. మెట్రోరైలు రెండోదశకు శ్రీకారం మెట్రోరైలు రెండోదశకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, శంషాబాద్ నుంచి మైండ్ స్పేస్ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే రూ. 650 కోట్ల వ్యయంతో నిర్మించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ లైన్ కేవలం ఎయిర్పోర్టుకు వెళ్లే వారి కోసమనే భావన ఉందని, కానీ అందులో వాస్తవం లేదని ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణించవచ్చని స్పష్టంచేశారు. ప్రజారవాణాను అభివృద్ధి చేయాలనే కోణంలోనే మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మరో రెండు మార్గాలకు సంబంధించిన డీపీఆర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని, కానీ ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, కనీసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. అనంతరం మండలిలో తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. కాగా, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనుసూచి–8కి సవరణ ద్వారా భద్రాచలం, సారపాక, రాజంపేట ఏజెన్సీ గ్రామాలను ఒకటి లేక అంతకు మించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు, ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం సవరణ బిల్లుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. -
వైద్య, విద్య కోసం ప్రత్యేక నిర్మాణాలు: మంత్రి విడదల రజిని
-
ఫోన్పే రూ.1,661 కోట్ల పెట్టుబడి
ముంబై: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్పే డేటా సెంటర్ల నిర్మాణానికి రూ.1,661 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.1,246 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. తాజాగా నవీ ముంబైలో డేటా సెంటర్ను ప్రారంభించింది. సమాచారాన్ని విదేశాల్లో కాకుండా దేశీయంగా భద్రపరచాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో 3 డేటా సెంటర్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తున్నట్టు ఫోన్పే కో–ఫౌండర్ రాహుల్ చారి వెల్లడించారు. గరిష్టంగా సెకనుకు 7,000 లావాదేవీలు జరుగుతున్నాయ న్నారు. డిసెంబర్ నాటికి లావాదేవీల సంఖ్య రోజుకు 20 కోట్ల స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. -
నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సూర్య, కార్తీ విరాళం
Suriya Karthi Donation To Nadigar Sangam Building Construction: దక్షిణ భారత సినీ నటీనటుల (నడిగర్ సంఘం) సంఘం 6వ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 14) ఉదయం చెన్నైలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచి మురుగన్, కరుణాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో సంఘానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అనంతరం సంఘం ట్రస్టు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జాతీయ ఉత్తమ అవార్డులను గెలుచుకున్న నటీనటులు, సాంకేతిక వర్గాన్ని నడిగర్ సంఘం నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా 'విరుమాన్' చిత్ర నిర్మాత సూర్య, కథానాయకుడు కార్తీ, సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సంఘం నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళాన్ని అందజేశారు. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి అందుకోసం మా అమ్మ జాబ్ వదిలేసింది: శృతిక సముద్రాల -
సెల్లార్లో తెల్లారిన బతుకులు
మణికొండ: నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ గుంతలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపై మట్టి కూలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈఐపీఎల్ 10 ఎకరాల్లో 14 అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేప ట్టింది. అందులో భాగంగా పుప్పాలగూడ గ్రామం వైపు వెళ్లే రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ నిర్మిస్తోంది. శనివారం అందులో 8 మంది కూలీలు దిగి సెంట్రింగ్ పనులు చేస్తుండగా సాయంత్రం పక్కన ఉన్న మట్టి ఒక్కసారిగా ఇద్దరిపై కూలింది. మిగిలిన వారు తప్పించు కున్నారు. మృతి చెందిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్ (40), వెంకటర మణ(42)గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరు కొద్దిరోజుల క్రితమే పనిలో చేరినట్టు తోటి కూలీలు పేర్కొన్నారు. వెంకటరమణ వద్ద జగద్గిరి గుట్ట చిరునామా తో ఉన్న ద్విచక్రవాహన ఆర్సీ లభించింది. పుప్పాలగూడలో అపార్ట్ మెంట్ సెల్లార్ గుంతలో మట్టి కూలిన విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక పనుల్లో పాల్గొన్నారు. గంటన్నర వ్యవధిలోనే ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పనులు ఆపాలని నోటీసు ప్రస్తుతం వర్షాకాలం రావటంతో సెల్లార్ల పనులను నిలిపివేయాలని మణికొండ మున్సిపాలిటీ అధికారులు ఈఐపీఎల్ సంస్థకు ఇటీవలే నోటీసు జారీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని భవనాల తోపాటు దీనికీ జారీ చేశామని, అయినా పనులను కొనసాగించటంతోనే అనర్థం జరిగిందని మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారి రాకేశ్ పేర్కొన్నారు. -
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం భవనాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని గురువారం ఆయన సందర్శించి పనులను పరిశీలించారు. పనుల వేగం, పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అధికారుల కృషిని అభినందించారు. మంత్రి, అధికారులు, నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను పరిశీలిస్తూ అప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలిచ్చారు. సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగి..తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర పనులకు సూచనలు చేశారు. ఎలివేషన్ ప్రకాశవంతంగా ఉండాలి సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడళ్లను అధికారులు ప్రదర్శించి చూపారు. వాటి నాణ్యత, కలర్, డిజైన్లను పరిశీలించిన సీఎం.. ఎలివేషన్ ప్రకాశవంతంగా, అందంగా కనిపించేలా చూడాలన్నారు. తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ఫైనల్ చేశారు. మోడల్ వాటర్ ఫౌంటెయిన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను కేసీఆర్ పరిశీలించారు. కాగా స్కై లాంజ్ నిర్మాణం గురించి సీఎంకు అధికారులు వివరించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం ఇదే విధంగా ముందుకు కొనసాగించాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్అండ్బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో.. -
ఈఆర్సీ కోసం నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు నెట్ జీరో ఎనర్జీ భవనాలు దోహదపడతాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. లక్డీకాపూల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కొత్త భవన నిర్మాణానికి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. నెట్ జీరో ఎనర్జీ/ వాటర్/ కార్బన్ భవనంగా దీనిని నిర్మిస్తుండడం అభినందనీయమన్నారు. పర్యావరణ మార్పుల నుంచి భూగోళాన్ని రక్షించుకునేందుకు, మానవాళి మనుగడను కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలు అత్యవసరమని పేర్కొన్నారు. శాస్త్రపరిజ్ఞానంలో వస్తున్న ఇలాంటి అధునాతన మార్పులను వినియోగించుకుని ముందుకు పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. సోలార్ ప్యానెళ్లు, ఇంధన పొదుపు డిజైన్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టం, స్మార్ట్ గ్రిడ్ మీటర్, ఇంధన పొదుపు లైటింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ భవనంలో ఉండనున్నాయని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగరావు, సభ్యులు మనోహర్రాజు, బి.కృష్ణయ్య, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ షర్మన్ తదితరులు పాల్గొన్నారు. నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్ అంటే.. ఏడాదికి అవసరమయ్యే విద్యుత్ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకుని వినియోగించుకునే భవనాలను నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్స్ అంటారు. సౌర విద్యుత్ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసి నిల్వ చేసుకునే సదుపాయాన్ని ఈ భవనాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా భవనంపై కురిసే వర్షపు నీరు, పరిసరాల్లోని మురుగు నీటిని ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ నీళ్లను శుద్ధి చేసి వాడుకుంటారు. ఇలాంటి భవనాలను నెట్ జీరో వాటర్ అంటారు. అంటే ఈ భవనాలకు బయట నుంచి విద్యుత్, తాగునీటి సరఫరా అవసరం ఉండదన్న మాట. -
‘పక్కా’గా కట్టేస్తోంది
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఏడాది కాలంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి 60 భవనాల సముదాయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ మధ్యలో భారత్ భూభాగంలో 6 కి.మీ. పరిధిలో ఈ కొత్త భవనాలు వెలిశాయి. 2019లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతంలో భవనాలేవీ లేవు. ఎన్డీటీవీ వార్తా సంస్థ తాజాగా సంపాదించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో 100 ఇళ్లతో కూడిన ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా దానికి 93 కి.మీ. దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. మరోవైపు భారత్ ఆర్మీ ఈ శాటిలైట్ చిత్రాలను చూసి వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం జరిగిందని, ఆ ప్రాంతం చైనా వైపే ఉందని అంటోంది. అరుణాచల్ సీఎం ప్రేమ ఖాండూ ఇతర ప్రభుత్వ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు. చైనా గత దశాబ్దకాలంగా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలను పెంచుతోంది. నిఘా రెట్టింపు చేస్తోంది. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 100 ఇళ్లతో కూడిన గ్రామాన్నే నిర్మించినట్టు ఈ ఏడాది మొదట్లోనే ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడింది. ఇటీవల అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఈ విషయాన్ని తన నివేదికలో ధ్రువీకరించింది. ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణలు పెంచుకుంటూ వెళితే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరులు నివాసాలు ఏర్పరుచుకోవడానికి వీలుగా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. భూటాన్లో 4 గ్రామాలు నిర్మించిన చైనా భూటాన్లో చైనా దురాక్రమణ జోరుగా సాగుతోంది. డోక్లాం పీఠభూమికి సమీపంలో ఇటీవల చైనా 4 గ్రామాలను నిర్మించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం ట్వీట్చేశారు. ఈ ఏడాది మే–నవంబర్ మధ్య చైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో చైనా భూముల్ని ఆక్రమించడం దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. -
నటుడు విజయ్ సేతుపతి రూ. కోటి విరాళం
తమిళసినిమా: నటుడు విజయ్ సేతుపతి దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (పెప్సీ) భవన నిర్మాణానికి రూ.కోటి విరాళంగా అందించారు. శనివారం చెన్నైలోని స్థానిక ప్రసాద్ ల్యాబ్లో పెప్సీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్కె సెల్వమణి పాల్గొన్నారు. నిర్మాత కలైపులి ఎస్.థాను, కె.భాగ్యరాజ్, ఆర్.వి.ఉదయ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న నటుడు విజయ్ సేతుపతి పెప్సీ భవన నిర్మాణానికి గాను కోటి రూపాయలను చెక్కు రూపంలో పెప్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణికి అందించారు. అనంతరం మాట్లాడుతూ పెప్సీ భవన నిర్మాణానికి తన సాయం కొనసాగుతుందన్నారు. ఆర్.కె.సెల్వమణి మాట్లాడు తూ భవన నిర్మాణం అన్నది పెప్సీకి చెందిన తొమ్మిదివేలమంది సభ్యుల కల అని అన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్సేతుపతికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (కమెడియన్ వడివేలుకు షాక్.. నోటీసులు జారీ చేసిన కోర్టు) -
కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి: సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: నోయిడాలో సూపర్టెక్ లిమిటెడ్కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల జంట భవనాలను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లను విచారించి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో కూల్చివేత పూర్తిచేయాలని, దానికయ్యే ఖర్చులు మొత్తం బిల్డర్ భరించాలని పేర్కొంది. రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. బిల్డర్తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో... అదీ ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో అనధికార నిర్మాణాలలో విపరీతమైన పెరుగుదల, సందేహాస్పదమైన లావాదేవీలు గతంలో కోర్టు గుర్తించినట్లు తెలిపింది. బిల్డర్లు, ప్లానింగ్ అథారిటీ మధ్య ఇలాంటి కుమ్మక్కు లావాదేవీలు చిన్నస్థాయిలో జరిగేది కాదని తీర్పులో పేర్కొంది. చదవండి: మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు -
ధరలన్నీ పైపైకి.. సొంతిల్లు కలేనా!
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. వికారాబాద్ పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో 150 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. లాక్డౌన్కు ముందే కట్టుకోవాలని భావించాడు. అప్పటి అంచనాల ప్రకారం ఒక అంతస్తు నిర్మించేందుకు రూ.15 లక్షలు అవుతాయని భావించాడు. కరోనా ప్రభావంతో నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి పనులు ప్రారంభించాడు. స్టీల్, ఇటుక, సిమెంట్, ఇతర సామగ్రి ధరలు పెరగడంతో మొదట తాను అంచనా వేసిన డబ్బులతో నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదని చెబుతున్నాడు. ప్రస్తుత ధరల ప్రకారం ఒక అంతస్తుకు రూ.18 లక్షలు ఖర్చు కావొచ్చని చెబుతున్నాడు. ఇతడి పేరు అఖిలేశ్వర్. వికారాబాద్ మహావీర్ ఆస్పత్రికి వెళ్లే రోడ్డులో 120 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. గతేడాది ప్రారంభించాలని భావించాడు. వ్యక్తిగత కారణాలతో జాప్యం జరిగింది. అంతలోనే కరోనా లాక్డౌన్ రావడంతో కొన్నిరోజుల క్రితం ఇంటి పనులు ప్రారంభించాడు. సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందని చెబుతున్నాడు. స్టీల్, సిమెంట్ ధరలకు రెక్కలు వచ్చాయని, వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని ఆందోళన చెందుతున్నాడు. వికారాబాద్ అర్బన్: కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో సరుకుల తయారీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లాక్డౌన్ తర్వాత సిమెంటు, ఇసుక, ఐరన్ ధరలు అమాంతంగా పెరిగాయి. సొంతిల్లు కట్టుకోవాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో బిల్డర్లు, బడా కాంట్రాక్టర్లు 100 మందికి పైగానే ఉన్నారు. వీరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20వేల మంది ఆధారపడి ఉంటారు. జిల్లాలో నెలవారీగా సరాసరి 1,500 టన్నుల ఐరన్, లక్ష బస్తాల వరకు సిమెంటు అమ్మకాలు జరుగుతుంటాయి. కరోనా సంక్షోభానికి ముందుతో పోలిస్తే సిమెంటు, కాళేశ్వరం ఇసుక, ఎలక్ట్రికల్, ఐరన్, లేబర్ చార్జీలు, పీవీసీ పైపుల ధరలు 34 శాతం నుంచి 45 శాతం వరకు పెరిగాయి. ధరలు పెరగడంతో 30 శాతం మేర అమ్మకాలు పడిపోయాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి ఆశలు కలగానే మిగిలిపోతున్నాయి. ధరలన్నీ పైపైకి.. మూడేళ్లతో పోలిస్తే బస్తా సిమెంటు ధర రూ.110 నుంచి 350 రూ. వరకు పెరిగింది. లాక్డౌన్ కంటే ముందు బస్తా సిమెంట్ రూ. 320 ఉండగా ప్రస్తుతం రూ. 350కి పెరిగింది. కాళేశ్వరం ఇసుక టన్ను రూ. 1000 నుంచి రూ. 1700 వరకు పెరిగింది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో నిర్మాణదారులు ఇసుకను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నాడు. ఇసుక ధరతో పోలిస్తే తెల్ల డస్టు ధర తక్కువ ఉండటంతో కొందరు దానిని వినియోగిస్తున్నారు. లోకల్ ఇసుకకు డిమాండ్ పెరిగింది. జిల్లాకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఇటుకను తీసుకొస్తారు. లాక్డౌన్ కంటే ముందు ఒక్కో ఇటుక ధర రూ. 4 నుంచి రూ. 5 ఉండగా ప్రస్తుతం రూ. 6 నుంచి 7 పలుకుతోంది. పేదలు ఇల్లు నిర్మించుకుందామంటే ధరలు చూసి భయపడుతున్నారు. నిర్మాణ సమయంలో.. ఇల్లు నిర్మించే సమయంలో యజమాని సదరు బిల్డర్ లేదా కాంట్రాక్టర్కు పనులు అప్పగించే సమయంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. చదరపు అడుగు సివిల్ పనులకు (కేవలం సిమెంటు) గతంలో రూ. 500 ఉండగా, ప్రస్తుతం రూ. 850 తీసుకుంటున్నారు. ఫర్నిచర్ మినహా వందశాతం పనుల కోసం చదరపు అడుగు గతంలో రూ. 1200 తీసుకోగా, ప్రస్తుతం రూ. 1,550, ఫర్నిచర్తో కలుపుకొని ప్రస్తుతం రూ. 1,850 ధర పలుకుతోంది. జిల్లా కేంద్రంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుమారు 200 మంది మేస్త్రీలు, ఇతర కారి్మకులు పనిచేసేవారు. కరోనా సమయంలో 50 శాతం మంది సొంత ఊళ్లకు వెళ్లడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఐదునెలల పాటు పూర్తిగా పనులు నిలిచిపోగా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమయ్యాయి. లేబర్ కొరత కూడా తీవ్రంగా ఉంది. గతంలో తాపీ మేస్త్రీకి రూ. 800 కూలి ఇవ్వగా ప్రస్తుతం రూ. 1000కి పెరిగింది. పార పనికోసం వచ్చే వారికి రోజుకు గతంలో రూ. 500 ఇవ్వగా ఇప్పుడు రూ. 600 ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సిమెంట్, స్టీల్, ఇసుక ఇతర సామగ్రి ధరలను ప్రభుత్వం నియంత్రించాలని నిర్మాణదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
15 ఏళ్ల కాలం మనకు అత్యంత కీలకం
న్యూఢిల్లీ: భారత్లాంటి యవ్వన ప్రజాస్వామ్య దేశానికి 2014 నుంచి 2029 వరకు.. 16వ లోక్సభ నుంచి 18వ లోక్సభ వరకు.. 15 ఏళ్ల కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధిలో ఆరేళ్ల కాలం చరిత్రాత్మకమని తెలిపారు. మిగిలిన 9 ఏళ్లలో చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు 16, 17, 18 ఏళ్ల ప్రాయం చాలా ముఖ్యమని, అలాగే 16వ లోక్సభ నుంచి 18వ లోక్సభల వరకు కాలం మనదేశానికి అత్యంత కీలకమని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధానిలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 16వ లోక్సభ(2014–19) కాలం దేశ ప్రగతిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 17వ లోక్సభ కాలంలో ఇప్పటిదాకా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఇవన్నీ చరిత్రలో ఒక భాగమేనని తెలిపారు. అనుకున్నవన్నీ గడువులోగా పూర్తి చేయాలి ప్రస్తుత దశాబ్దంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వచ్చే లోక్సభ(2024–29) కాలం ప్రధానమైన పాత్ర పోషించబోతోందని విశ్వసిస్తున్నట్లు ప్రధాని అన్నారు. దేశాభివృద్ధిలో భాగంగా మనం సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ప్రజల మైండ్సెట్ మారింది 130 కోట్ల మంది ప్రజల కలలను నిజం చేసే వనరులు, గట్టి సంకల్పం మనకు ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వయం సమృద్ధి అనే లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉందని వివరించారు. దేశ ప్రజల మైండ్సెట్ మారిందనడానికి 16వ లోక్సభ ఒక ఉదాహరణ అని అన్నారు. 16వ లోక్సభలో 300 మందికిపైగా ఎంపీలు తొలిసారిగా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రస్తుత లోక్సభలో ఉన్న ఎంపీల్లో 260 మంది ఎంపీలు మొదటిసారిగా ఎన్నికైన వారేనని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. నేడు సీఎంలతో భేటీ ప్రధాని మోదీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో నేడు రెండు వేర్వేరు వర్చువల్ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటగా ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాలతో సమావేశం జరుపనున్నారు. వీటిలో కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇందులో ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ పంపిణీ గురించి చర్చించనున్నారు. కరోనాపై ప్రధాని మోదీ రాష్ట్రాలతో ఇప్పటికే వర్చువల్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘ఇంటి’కి గ్రీన్సిగ్నల్
-
21 రోజుల్లోనే.. ‘ఇంటి’కి గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేస్తూ కొత్తగా తీసుకొస్తున్న తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు, ఆమోద స్వీయ ధ్రువీకరణ విధానం(టీఎస్ బీ–పాస్)తో దళారుల పాత్ర లేని పూర్తి పారదర్శక పద్ధతి అందుబాటులోకి రానుందని పురపాలక మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేస్తాయని, ఏదైనా కారణంతో సకాలంలో అధికారులు అనుమతులు ఇవ్వని పక్షంలో 22వ రోజున అనుమతి వచ్చినట్టుగానే అప్రూవల్ పత్రం వస్తుందని పేర్కొన్నారు. 75 గజాలలోపు స్థలం అయితే అసలు అనుమతులతో ప్రమేయమే లేదని, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి విధానం అందుబాటులో లేదని, కొన్ని విదేశీ నగరాల్లోనే ఇది అమలులో ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ అనుమతులను సరళీకృతం చేయడంతోపాటు పూర్తి పారదర్శకతకు వీలు కల్పించేలా ప్రభుత్వం పేర్కొంటున్న టీఎస్ బీ–పాస్ బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు మంత్రి కేటీఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టి దాని ప్రత్యేకతలను వివరించారు. 21 రోజుల్లోనే అనుమతులు.. కొత్తగా తీసుకొస్తున్న ఈ చట్టం 95 శాతం మందికి ఉపయుక్తంగా ఉండనుందని మంత్రి చెప్పారు. నిర్మాణ వైశాల్యం 75 గజాల లోపు ఉంటే నిర్మాణ అనుమతులే అవసరం లేదని, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాజముద్రతో సంబంధిత పత్రం జారీ అవుతుందని చెప్పారు. 75 గజాల నుంచి 600 గజాలలోపు (500 చదరపు మీటర్ల లోపు) ఉంటే ఆన్లైన్లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు జత చేస్తూ దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే (ఇన్ స్టాంట్) అనుమతులు జారీ చేస్తారని చెప్పారు. 600 గజాలకు పైన ఉన్న స్థలానికి సంబంధించి నిర్మాణ అనుమతులుగాని, లే–అవుట్ అనుమతులుగాని 21 రోజుల్లో జారీ అవుతాయన్నారు. సరైన దరఖాస్తులకు సంబంధించి 21 రోజుల్లో అనుమతి రాని పక్షంలో 22వ రోజు అనుమతి వచ్చినట్టుగానే భావించవచ్చని(డీమ్డ్ టూ అప్రూవల్), ఇందుకు సంబంధించి రాజముద్రతో సంబంధిత పత్రం జారీ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. 15 రోజుల్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. దరఖాస్తుదారులే స్వీయ ధ్రువీకరణ దాఖలు చేసే వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ, ఇతరుల భూముల్లో నిర్మాణాలకు దరఖాస్తు చేసినా, తప్పుడు పత్రాలు సమర్పించినా చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని పక్షంలో పది రోజుల్లోపే అధికారులు తిరస్కరిస్తారని, ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే సిబ్బంది వచ్చి నిర్మాణాలను కూల్చేస్తారని హెచ్చరించారు. ఇన్ స్టాంట్గా వచ్చే అనుమతులు పూర్తి షరతులకు లోబడే ఉంటాయని గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్.. ఈ చట్టం సరైన విధంగా అమలు జరిగేలా, లోటుపాట్లను గుర్తించేలా జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్లు పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో అయితే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఆ పాత్ర పోషిస్తారన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో పురపాలక శాఖ సంచాలకులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఛేజింగ్ సెల్ ఉంటుందన్నారు. చట్టం అంటే భయం ఉండాలి.. అక్రమ నిర్మాణం అంటూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదని, ఒకవేళ అది అధికారుల తప్పువల్ల జరిగిందని తెలిస్తే తర్వాత చేసేదేమీ ఉండదని భట్టి పేర్కొన్నారు. అయితే దీన్ని కేటీఆర్ ఖండించారు. చట్టంపై భయం, గౌరవం లేకపోవటంతోనే ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని, ఇది ఆగిపోవాలంటే కూల్చడమే సరైందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇక నోటరీలకు సంబంధించిన స్థలాలకు కూడా ఈ అవకాశం ఇవ్వాలన్న సూచనపై సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వన్టైమ్ రిలీఫ్ ఇచ్చే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ పత్రం చెల్లుబాటు.. గతంలో కొన్ని చట్టాల్లో ఈ తరహాలో, నిర్ధారిత సమయంలోగా అనుమతులు రాని పక్షంలో ఆటోమేటిక్గా అనుమతులు వచ్చినట్టు భావించే విధానం అమలు చేశారని, అయితే అలాంటి పత్రాలపై సంబంధిత స్టాంప్స్ లేనందున చెల్లుబాటు కాలేదని, వాటికి విలువే లేకుండాపోయిందని కాంగ్రెస్ సభా పక్ష నేత భట్టి విక్రమార్క సందేహాన్ని వెలిబుచ్చారు. కొత్త చట్టం ప్రకారం.. ఇన్స్టాంట్ అనుమతి పత్రాలపై సంబంధిత అధికారుల సంతకం, రాజముద్ర ఉంటుందని, అది అన్ని చోట్లా చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టతనిచ్చారు. అలాగే నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ విభాగాల అనుమతులు కూడా అవసరముంటే సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడతానని కేటీఆర్ అన్నారు. -
విశ్వ శ్రేయస్సు భారత్ ధ్యేయం
న్యూఢిల్లీ: ఇతర దేశాలతో భారత దేశ ప్రగతికాముక సంబంధాలు విశ్వ మానవాళి సంక్షేమం లక్ష్యంగా కొనసాగేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవి ఎలాంటి షరతులకు, వాణిజ్య, రాజకీయ పరిమితులకు లోబడి ఉండేవి కావని తేల్చి చెప్పారు. పోర్ట్ లూయీస్లో నిర్మించిన మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని గురువారం ఆయన మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్తో కలిసి ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. భారత్, మారిషస్ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. భాగస్వామ్య దేశాలను గౌరవించడం భారత్ పాటించే ప్రాథమిక సూత్రమన్నారు. అఫ్గానిస్తాన్ పార్లమెంట్ భవన నిర్మాణంలో, నైగర్లో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో, నేపాల్లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్ క్రీడ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలోభారత్ అందించిన సహకారానికి మారిషస్ ప్రధాని జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. -
భవనాలపై ‘భువనాస్త్రం’!
సాక్షి, హైదరాబాద్ : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడి విన్నాం కానీ.. ఒకే దెబ్బకు ఆరేడు పిట్టలను కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పురపాలక శాఖలో పారదర్శక పాలనను శాస్త్రీయంగా అమలు చేయాలనే ఉద్దేశంతో నగరాలు, పట్టణాల్లోని భవంతులపై భువనాస్త్రం’ప్రయోగించనుంది. భువన్ పేరుతో డిజిటల్ యాప్ను తయారు చేసి.. పట్టణ ప్రాంతాల్లోని అన్ని భవనాల సమాచారాన్ని మొబైల్ ఫోన్లలో బంధించి.. ఆయా భవంతుల నుంచి ఏ శ్లాబ్ కింద ఎంత పన్ను వసూలు చేయాలనేది నిర్ణయించనుంది. ప్రతీ భవనాన్ని 360 డిగ్రీల కోణంలో డిజిటలైజ్ చేయడం ద్వారా ఏ భవంతికి ఏ శ్లాబ్లో ఆస్తి పన్ను, నల్లా చార్జీ విధించాలి.. ఆ భవంతిలో కరెంట్ వినియోగాన్ని గృహ, వాణిజ్య అవసరాల కేటగిరీలో చేర్చాలా? ఆయా బిల్డింగ్లపై అడ్వర్టైజింగ్ చేసుకునేందుకు, సెల్ టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయించనుంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, భువన్ యాప్ ద్వారా రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ మినహా మిగతా నగర, పురపాలక సంస్థల్లో ఉన్న భవనాలను నిక్షిప్తం చేసి.. తదుపరి కార్యాచరణ చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఆదాయానికి గండి పడుతుండటంతో.. రాష్ట్ర జనాభాలో సగం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు లెక్కలున్నా.. ఆదాయం మాత్రం అంతంత మాత్రమే వస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఏటా రూ.1,123 కోట్ల (గ్రేటర్ హైదరాబాద్ మినహా) రాబడి మాత్రమే లభిస్తోంది. ఇందులో ప్రధానంగా ఆస్తి పన్ను రూపేణా రూ.671.33 కోట్లు, ఇతర ఆదాయం రూ.452.53. కోట్లు సమకూరుతోంది. ఆస్తి పన్ను మదింపులో శాస్త్రీయత పాటించకపోవడం, గృహ, వాణిజ్య కేటగిరీల నిర్ధారణలో హేతుబద్ధీకరణ లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీనికి తోడు ప్రభుత్వ రికార్డుల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీగా కొనసాగతూ.. కమర్షియల్గా మారిన పాత పద్ధతుల్లోనే పన్నులు వసూలు చేస్తుండటం కూడా రాబడిలో తేడా రావడానికి దారితీస్తోంది. వాస్తవానికి గృహ సముదాయాలను వాణిజ్యావసరాలకు వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలున్నా.. క్షేత్రస్థాయిలో అవేమీ పట్టడం లేదు. దీంతో ఆస్తి పన్ను మాత్రమే కాదు.. కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్ సహా ట్రేడ్ లైసెన్సులు, జీఎస్టీలను ఎగ్గొడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి తోడు ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై పెనాల్టీలు వడ్డించాలని, అక్రమ నిర్మాణాల నుంచి 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని నిబంధనల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో పకడ్బందీ వ్యవస్థ లేకపోవడంతో ప్రభుత్వం ఇన్నాళ్లు మిన్నకుండి పోయింది. ఉపగ్రహ ఛాయచిత్రాలతో... నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ప్రాపర్టీని మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ఇప్పటికే తీసిన ఉపగ్రహ ఛాయచిత్రాల సహకారంతో భవనాల సమాచారాన్ని డిజిటలైజ్ చేయనుంది. ఈ క్రమంలో ఆ భవనం ఏ కేటగిరీలో ఉంది? ప్రస్తుతం ఏ కేటగిరీలోకి వస్తోంది.. భవనంలో జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సు కలిగి ఉన్నారా.. అనే సమాచారాన్ని సేకరించనుంది. దీనికి అనుగుణంగా జిల్లా ప్రణాళిక కార్యాలయం నుంచి గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారం, ఎన్పీడీసీఎల్, సీపీడీసీఎల్ నుంచి విద్యుత్ కనెక్షన్లు, వాణిజ్య శాఖ నుంచి కమర్షియల్ ట్యాక్సులు, స్థానిక మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్సులు, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన వివరాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. భువన్ యాప్లో క్రోడీకరించిన ఈ సమాచారంతో భవనాల నిగ్గు తేల్చాలని పురపాలకశాఖ భావిస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి ఆగస్టు పదో తేదీవరకు ఈ సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ 360 డిగ్రీల కోణంలో భవనం కేటగిరీని నిర్ధారించడం ద్వారా మున్సిపాలిటీలు సహా అన్ని శాఖలకు భారీగా ఆదాయం సమకూరుతుందని, లీకేజీలకు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తోంది. -
నిర్మాణాల కోసం.. ఇక టీఎస్–బీపాస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఏకగవాక్ష (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు జారీ చేసేందుకు ఐదేళ్ల కిందట చేపట్టిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్–ఐపాస్’సత్ఫలితాలను సాధించిపెట్టింది. ఈ తరహాలోనే భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ త్వరలో ‘టీఎస్–బీపాస్’పేరుతో కొత్త పాలసీని తీసుకురాబోతోంది. పురపాలనలో సంస్కరణల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన కొత్త మునిసిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ‘టీఎస్–బీపాస్’విధానానికి రూపకల్పన చేసింది. ఖాళీ స్థలాల్లో లే–అవుట్లు, భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు, డెవలపర్లతో పాటు సాధారణ పౌరులు సైతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పలు రకాల అనుమతులు పొందాల్సిన వస్తోంది. వాటి జారీలో అవినీతి, జాప్యం కారణంగా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ‘టీఎస్–బీపాస్’అనే కొత్త విధానానికి టౌన్,కంట్రీప్లానింగ్ విభాగం అభివృద్ధిపరిచింది. భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులన్నింటినీ ఒకే చోట (సింగిల్ విండో) నుంచి జారీ చేయనున్నారు. భూయజమాని/డెవలపర్ కేవలం స్వీయధ్రువీకరణ పత్రం ఇస్తే టీఎస్–ఐపాస్ తరహాలో 21 రోజుల నిర్దేశిత గడువులోగా సత్వర అనుమతులు జారీ చేయనున్నారు. సాధారణ పౌరులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు ఈ కొత్త విధానంతో ప్రయోజనం పొందనున్నారు. త్వరలో ఈ వెబ్సైట్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ►భవనాలు, లేఅవుట్ల అభివృద్ధి కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టీఎస్–బీపాస్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అనుమతులు పొందిన తర్వాత నిర్దేశిత ప్లాన్ప్రకారమే నిర్మాణాలు జరిపారా? లేక ఉల్లంఘనలున్నాయా? అనుమతులు లేకుండా జరిపారా? అన్న అంశాలను ఈ కమిటీ తనిఖీ చేసి చర్యలు తీసుకోనుంది. ►75 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుదారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ►500 చదరపు మీటర్లలోపు ప్లాట్లలో 10 మీటర్లలోపు ఎత్తు వరకు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ అనుమతులు జారీ చేయనున్నారు. ►నివాసేతర భవనాలు, 10 మీటర్లకు మించిన ఎత్తైన భవనాల నిర్మాణానికి 21 రోజుల నిర్దేశిత గడువులోగా సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతుల జారీ. ►200 చదరపు మీటర్ల వరకు ప్లాట్లలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ►అనుమతుల అనంతరం జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను తనిఖీ చేయనుంది. ►దరఖాస్తుదారులు తప్పుడు సమాచారమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ►అనుమతులను ఉల్లంఘించి నిర్మిస్తే.. ఎలాంటి నోటీసులు లేకుండా తొలగిస్తారు. ►స్వీయధ్రువీకరణ ఆధారంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ. -
మనమే భేష్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల్లో మన విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. అనుమతుల జారీలో పారదర్శకత పాటిస్తున్నామని, ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ సంఘాల ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. బిల్డింగ్ పర్మిషన్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం గురించి అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి..దీన్ని మరింత సులభతరం చేసే దిశగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్నతాధికారుల బృందం కసరత్తు మొదలుపెట్టిందని, బిల్డర్ల సంఘాల నుంచి ప్రతినిధులకు ఇందులో అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో భవన నిర్మాణ అనుమతులను పరిశీలించి.. అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి చొరవచూపాలని కోరారు. ఇప్పటికే పురపాలక సంఘాల్లో ఈ–ఆఫీస్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నామని, దీంతో అనుమతులు ఏ దశలో ఉన్నాయో తెలుస్తాయని, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసే అవకాశం ఉండదని చెప్పారు. రియల్టీలో జోష్.. స్థిరాస్తి రంగం వృద్ధిలో దేశంలోనే హైదరాబాద్ టాప్లో ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన సరళీకరణ విధానాలతో ఇది సాధ్యపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ టౌన్ షిప్ పాలసీని బిల్డర్ సంఘాలకు అందిస్తామని, ముసాయిదాపై సలహాలు, సూచనలివ్వాలని సూచించారు. రియల్ ఎస్టేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో క్రెడాయ్ తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, ఇతర సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిశారు. -
అక్రమాల్లో విక్రమార్కులు
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? రాష్ట్రాధినేత అక్రమ నిర్మాణాలు సాగిస్తే... వాటిని యథేచ్ఛగా ప్రోత్సహిస్తే... ఆ అక్రమ భవనాల్లో మకాం పెడితే... ఆయన వంది మాగధులు ఊరుకుంటారా? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా అనుసరిస్తారు. తామేమీ తక్కువ కాదన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. అధినేత చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఆదర్శంగా తీసుకుని ఇష్టమొచ్చిన రీతిలో దందాలు చేశారు. తమను అడ్డుకునేదెవరని అధికార దర్పంతో చెలరేగిపోయా రు. టీడీపీ కార్యాలయం కోసం అక్రమ కట్టడాన్ని నిర్మించేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చేతిలో అధికారం ఉందని పార్టీ కార్యాల యం కోసం ఎకరానికి బదులు రెండెకరాలు తీసుకున్నారు. 30 సంవత్సరాల లీజుకు బదులు 99 సంవత్సరాల లీజుకు రాయించుకున్నారు. రూ.12 కోట్ల విలువైన భూమిని సంవత్సరానికి రూ.25 వేల లీజు ధరకు చేజిక్కించుకున్నారు. అంతటితో ఆగలేదు. వుడా, టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు పొందకుండానే ఏకంగా (జీ ప్లస్ 2) రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించేశారు. పనిలో పనిగా పక్కనున్న కొంత స్థలాన్ని నిర్మాణంలో కలిపేసుకున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయించారు. అనుమతుల కోసం ఒక్క రూపాయీ చెల్లించని టీడీపీ కార్యాలయం.. జీ ప్లస్ 2 భవనం కోసం 2017 ఫిబ్రవరిలో విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) అధికారులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష దరఖాస్తు చేశారు. వుడా, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి బెటర్మెంట్ చార్జి కింద రూ.6 లక్షల 7 వేల 50లు చెల్లించాలని నోటీసు జారీ చేశారు. ఇంత మొత్తం చెల్లించలేమని, రెండెకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ కేవలం 25 సెంట్లలో మాత్రమే నిర్మాణం చేపట్టామని, ఆమేరకు తమకు ప్లాన్ అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఆ అధికారం తమకు లేదని, మొత్తం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటామని, భవనం మేరకు ప్లాన్ ఇవ్వలేమని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వానికి ఫైలు పంపిస్తే అక్కడ మేం చూసుకుంటామని టీడీపీ నేతలు సూచించారు. దీంతో ప్రభుత్వానికి ఫైలు వెళ్లింది. ప్రభుత్వం వాళ్లదే కావడంతో సంబంధిత ఉన్నతాధికారులు జీ హుజూర్ అనేశారు. చెప్పినట్టుగా సంతకం పెట్టేశారు. అంతటితో ఆగకుండా 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని హుటాహుటిన వుడా, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధం... కట్టడం ఎంత ఉన్నా ప్రహరీతో కూడిన విస్తీర్ణానికే ప్లాన్ తీసుకోవాలి. ఆమేరకు కార్పొరేషన్ అధికారులు నిర్దేశించిన ఫీజు చెల్లించి అనుమతి పొందాలి. కానీ ఎక్కడ బెటర్మెంట్ చార్జీ ఎక్కువగా ఉందని చెప్పి రెండెకరాల విస్తీర్ణంలో ప్రహరీ, భవనం నిర్మించినా కేవలం భవనానికి మాత్రమే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని అధికారులపై కత్తి పెట్టారు. వారిపై ఒత్తిడి తెచ్చి ఫైలు పెట్టించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులతో సానుకూలంగా సంతకం చేయించుకున్నారు. వెలుగు చూసిన ఆక్రమణ.. ప్రభుత్వ ఉన్నతాధికారులు 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన వెంటనే వుడా అధికారులు జాగ్రత్తపడ్డారు. ఇదేదో సమస్యగా మారి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ చోటు చేసుకున్న ఆక్రమణ విషయాన్ని కాగితంపై పెట్టారు. టీడీపీ భవన్కు దక్షిణం వైపు ఉన్న రోడ్డును ఆనుకొని కొంత ఆక్రమిత స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారని, దాని తొలగించి, రిమార్క్స్తో కూడిన ప్లాన్ ఫైలు పెట్టాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతల దృష్టికి కార్పొరేషన్ అధికారులు తీసుకెళ్లారు. కానీ వారంతా గమ్మున ఉండిపోయారు. అధికార చేతిలో ఉంది... ఎవరేమి చేస్తారు అన్న ధోరణితో వుడా అధికారులు సూచించిన విధంగా ప్లాన్కు దరఖాస్తు పెట్టుకోలేదు. ఒక్క రూపాయి ఫీజు చెల్లించకుండా... ప్లాన్ అనుమతి పొందకుండానే చంద్రబాబు చేతుల మీదుగా అట్టహాసంగా కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయించారు. ప్రస్తుతానికి ఇది అక్రమ కట్టడమే కాకుండా ఆక్రమిత స్థలంలో నిర్మించిన భవనంగా కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకుండా కొనసాగుతున్న భవనం జోలికే వెళ్లడం లేదు. టీడీపీ నేతలు చెప్పినట్టు ప్లాన్ ఇస్తే... మిగులు భూమి స్వాధీనం చేసుకోవల్సిందే... ప్రభుత్వం నుంచి పొందిన స్థలాన్ని రెండు సంవత్సరాల్లోగా పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి. ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఆమేరకు నిర్మాణాలు చేపట్టాలి. నిరుపయోగంగా ఉంటే స్వాధీనం చేసుకునే అధికారం కలెక్టర్కు ఉంది. రెండెకరాల స్థలంలో ప్రహరీతో కూడిన భవనాన్ని నిర్మించినప్పటికీ తాము కేవలం 25 సెంట్లలోనే భవనం నిర్మించామని, దానికే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని డిమాండ్తో కూడిన అర్జీని టీడీపీ నేతలు పెట్టారు. దానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఈ లెక్కన మిగతా ఎకరా 75 సెంట్లు ఖాళీగా ఉన్నట్టుగానే భావించాలి. ఆ ప్రకారం నిరుపయోగంగా ఉం దని గుర్తించి.. ఇప్పుడున్న డిమాండ్, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా కలెక్టర్ స్వాధీనం చేసుకోవచ్చు. ఆ దిశగా చర్యలు చేపడితే పట్టణంలోని ఎకరా 75 సెంట్ల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికైతే, ఈ భూమిని షెడ్యూల్ కులాల నివాసిత స్థలాల కోసమే గతంలో సాంఘిక సంక్షేమ శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ భూమి ఖాళీగా ఉందని టీడీపీ కన్నేసి కొట్టేసింది. ఇప్పుడు టీడీపీ నేతలే 25 సెంట్లలోనే నిర్మాణం చేపట్టామని అధికారికంగా అంగీకరించారు. ఈ లెక్కన మిగతా ఎకరా 75 సెంట్లు ఖాళీగా ఉందని వేరొక అవసరాలకు కేటాయిస్తే సరిపోతుంది. టీడీపీ భవన్కు అనుమతుల్లేవు.. టీడీపీ కార్యాలయ భవన్కు అనుమతుల్లేవు. కార్పొరేషన్కు ఒక్క రూపాయి చెల్లించలేదు. 6 లక్షల 7 వేల 50 రూపాయలు బెటర్మెంట్ చార్జి చెల్లించమని నోటీసు ఇస్తే అభ్యంతరం తెలిపారు. రెండు ఎకరాలకు కాకుండా కేవలం 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని మరో అర్జీ పెట్టారు. దానికి ఉన్నతాధికారుల ఆమోదం రావడంతో తదుపరి ఎండార్స్మెంట్ ఇచ్చారు. కానీ దానిపై టీడీపీ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతానికి టీడీపీ భవనం అక్రమ కట్టడమే. – దేవకుమార్, కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ -
హంగులకే కోట్లు ఇస్తున్నారు
సాక్షి, ఆదిలాబాద్ : అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్టుంది ఆదిలాబాద్ కొత్త మున్సిపాలిటీ భవన నిర్మాణం తీరు. భవన నిర్మాణం కంటే మిగితా హంగులకే రెట్టింపు ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా ప్రారంభమైన ఈ భవన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడంలేదు. పైపెచ్చు.. అంచనా వ్యయాలు పెరుక్కుంటూ ఇంతవరకూ వచ్చింది. మొదట మున్సిపల్ ఫండ్ కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకవర్గం ఆదిలాబాద్ బల్దియాలో కొలువుదీరిన తర్వాత 2017లో మున్సిపాలిటీ కోసం కొత్త భవనం నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో భవనం అన్ని సదుపాయాలతో నిర్మించాలని భావించారు. అప్పుడు మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చే బీఆర్జీఎఫ్ నిధులను దీనికోసం వెచ్చించాలని యోచించారు. అయితే బీఆర్జీఎఫ్ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో అసలు సమస్య వచ్చింది. దీంతో అప్పటికే మిగులు బీఆర్జీఎఫ్ నిధులు, మున్సిపల్ ఫండ్ కలిపి రూ.1.70 కోట్లతో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. టెండర్ను ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. ఆ నిధుల మేరకు కేవలం భవన నిర్మాణం చేసి వదిలిపెట్టారు. భవనానికి లోపల, బయట తుది మెరుగులకు నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నాసిరకంగా నిర్మాణం అప్పట్లో కాంట్రాక్టర్ భవన నిర్మాణానికి సంబంధించి నాణ్యత పాటించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ భవన నిర్మాణంలో పెచ్చులు ఊడిపోయాయని చెబుతున్నారు. అంతేకాకుండా నిర్మాణ సమయంలో వాటర్ క్యూరింగ్ సరిగా చేయకపోవడంతో భవనం నాణ్యతపై ప్రశ్న తలెత్తుతోంది. దీంతోనే పెచ్చులు ఊడిపోయాయని పలువురు పేర్కొంటున్నారు. కోట్ల నిధులు వెచ్చించి భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అధికారులు కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులొత్తడం ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఆర్అండ్బి కింద ఆరునెలల క్రితం ఈ టెండర్ మంజూరైంది. అయితే వరుసగా ఎన్నికలు రావడంతో టెండర్ పనులు పూర్తికాలేదు. తాజాగా టెండర్ పూర్తిచేసి కాంట్రాక్టర్కు రూ.3 కోట్ల పనులను అప్పగించారు. అందులో భాగంగా మున్సిపాలిటీ భవనాన్ని ఆకర్షణీయమైన హంగులతో నిర్మాణం పూర్తి చేసేందుకు 15 రోజుల కిందట పనులు ప్రారంభించారు. అయితే మున్సిపల్ అధికారుల తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రధానంగా వరుసగా ఎన్నికలు వచ్చిన సమయంలో కలెక్టర్ అనుమతి తీసుకొని వివిధ పనులు చేపట్టారు. మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులు ఇదివరకే ప్రారంభమైన దృష్ట్యా కలెక్టర్ అనుమతితో ఎప్పుడో మళ్లీ టెండర్ చేసి పనులు అప్పగించేందుకు చర్యలు తీసుకొని ఉంటే ఈపాటికి భవన నిర్మాణం పూర్తయ్యేది. అయితే పాలకవర్గం పదవీకాలం జూలై 2వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో అప్పటివరకు వేచిచూసిన అధికారులు ఇటీవల టెండర్ పనులు పూర్తిచేయడం వెనక ఆంతర్యమేమిటో? ఆర్అండ్బీ నిధులతో మళ్లీ జీవం బీఆర్జీఎఫ్ నిలిచిపోవడం, ఇటు మున్సిపాలిటీలో నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో అసలు భవన నిర్మాణం పూర్తవుతుందా?.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల పట్టణ శివారులో ఉన్న పలు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన విషయం విదితమే. అందులో భాగంగా ఆదిలాబాద్ బల్దియాను 36 వార్డుల నుంచి 49 వార్డులకు పెంచారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందికి మరింత బాధ్యత, పనితీరు పెరగనుంది. దీనికితోడు ప్రస్తుతం ఉన్న భవనం విస్తరించిన మున్సిపాలిటీ కార్యకలాపాలకు సరిపోనివిధంగా ఉండడం కూడా రానున్న రోజుల్లో కొత్త భవనం ఆవశ్యకతను తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న భవనానికి ఎదురుగానే ఇందిరా టౌన్హాల్ స్థలంలో ప్రస్తుతం సంప్హౌజ్కు సమీపంలోనే ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. జీ ప్లస్ 3 నమూనాలో నిర్మిస్తున్న ఈ సముదాయంలో పైఅంతస్తు పూర్తిగా సమావేశ మందిరం కోసం చేపడుతున్నారు. ప్రస్తుతం 49 వార్డులకు పెరగడంతో కౌన్సిలర్ల సంఖ్య 49తో పాటు కోఆప్షన్ సభ్యులు, అధికారులు అందరూ కలిపి సుమారుగా వందమంది సమావేశ మందిరంలో కూర్చునేందుకు వీలుగా భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవనం నిర్మించినప్పటికీ మెరుగులు దిద్దాల్సి ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ పనులు చేపట్టేందుకు వీలుగా రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. సమావేశ మందిరంలో పూర్తిగా సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భవిష్యత్లో గ్రేడ్–1 మున్సిపాలిటీ నుంచి మరింత ఉన్నత గ్రేడ్ సాధించినా ఈ భవనంలో కార్యకలాపాలకు సరిపోయేలా పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్ను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో మున్సిపల్ ఏఈ అరుణ్ను వివరణ కోరగా భవన నిర్మాణ పనులు మళ్లీ 15 రోజుల కిందట ప్రారంభించినట్లు తెలిపారు.త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
నిర్మాణాలయ్యాకే అనుమతులు!
సాక్షి, బాన్సువాడ( నిజామాబాద్): మున్సిపాలిటీలల్లో ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు అవుతున్నాయి. అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు. తోచిన రీతిలో రాత్రికి రాత్రే కట్టడాలను చేపట్టి మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ యంత్రాంగం చేష్టలుడిగి చోద్యం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాన్సువాడ మున్సిపాలిటీలో చట్టాల ఉల్లంఘన జరుగుతోంది. కొందరు అక్రమంగా, మరికొందరు దౌర్జన్యంగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఏ రకమైన నిర్మాణాలు చేపట్టాలన్నా.. ముందస్తుగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పన్నులు చెల్లించి, మున్సిపాలిటీ నుంచి నిరభ్యంతరపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. శాశ్వత కట్టడం నిర్మించే ప్రాంతం భూమి వివరాలు, పట్టాభూమి పత్రం వంటి అంశాలను పరిశీలించి భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. బాన్సువాడలో ఉన్న భూమి ప్రకారం ప్రతికూల అంశాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఇక్కడనే ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అక్రమార్కుల తీరు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ శాశ్వత కట్టడాలు చేపడుతున్నారు. ఈ తంతు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నా.. అక్రమ నిర్మాణాలను ఆపడంలో మున్సిపల్ యంత్రాగానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కమ పద్ధతుల్లో హక్కుదారులు? మున్సిపాలిటీలలో శాశ్వత కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం సంపన్న వర్గాలు, వ్యాపారులు అనేక మంది లీగల్గా ఆక్రమిత భూములపై హక్కు కలిగి ఉండగా.. లీగల్గా భూమిపై హక్కు సాధించేందుకు కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ఇళ్లు, దుకాణ సముదాయాలను నిర్మించడం, ఆ భూమిపై ఎవరు రాకుండా కోర్టులో దావా వేయడం, రెవెన్యూ అధికారులను బెదిరించేలా వ్యవహరించడం, మున్సిపల్ అధికారులను లెక్కలోకి తీసుకోకపోవడం, కొందరు అధికారుల బలహీనతలను ఆసరా చేసుకుని మున్సిపల్ అనుమతి లేకుండా బాహాటంగానే ఇళ్ల ఇర్మాణాలు జరిగాక ప్రభుత్వ మార్గదర్శకాలను అతి తెలివిగా పాటించడం వంటివి చేస్తున్నారు. శాశ్వత నిర్మాణం చేశాక మున్సిపాలిటీల నుంచి ఇంటి నంబర్లు తీసుకుని పన్నులు చెల్లిస్తున్నారు. ఆ ఇంటి నంబరు ఆధారంగా ట్రాన్స్కో నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకుని లీగల్గా హక్కు పొందుతున్నారు. ఇళ్లు, దుకాణాలు నిర్మాణాలు చేశాక ఆలస్యం చేయకుండా ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. అసలు శాశ్వత కట్టడాలు చేపడుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నవవుతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు ధనికులు, చోటామోటా లీడర్ల జోలికి వెళ్లలేకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా దృష్టికి రాలేదు... మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు ఎక్కడ జరగడం లేదు. అలాంటివి ఏమైన ఉంటే చర్యలు తీసుకుంటాం. రోడ్డుపై నిర్మాణాలు చేపడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులైతే ఇప్పటి వరకు తమకు రాలేదు. –కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ. -
హైకోర్టుకు వందనం
అది పేరుకే భవనం..నిజానికది ఓ అద్భుత కళాఖండం..నిజాం జమానాకు నిజమైన ప్రతీక...నిర్మాణ కౌశలానికి నిండైన రూపం.విశిష్ట శిల్పకళారీతులకు విశేష దర్పణం.. రాచఠీవికి ప్రతిబింబం.వాస్తురీతులకు వాస్తవరూపం.చూపరులకు కనువిందు. మూసీ ఒడ్డున ముచ్చటైన నిర్మాణం. వందేళ్లు పూర్తి అయినా చెక్కుచెదరని వైభవం దాని సొంతం. వన్నె తగ్గకుండా కాంతులీనుతున్న ఆ కళాఖండమే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు భవనం. అది వందేళ్ల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. నేడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ భవనంపై ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ మూసీ ఒడ్డున సుందర భవనం.. హైదరాబాద్ నగరంలో మూసీనది ఒడ్డున అత్యంత సుందరంగా నిర్మించిన హైకోర్టు భవనం శతాబ్ది వేడుకలకు ముస్తాబవుతోంది. హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1919 మార్చి 31 నాటికి పూర్తయినా 1920 ఏప్రిల్ 20న అధికారికంగా ప్రారంభించారు. చరిత్రలోకి ఓసారి... నిజాం హయాంలో హైదరాబాద్ రాజ్యంపై బ్రిటిష్ ప్రభావం ఎక్కువగా ఉండేది. 1800 అక్టోబరులో ఈస్టిండియా కంపెనీతో నిజాం రాజు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో నిజాం కోర్టు నిర్వహణ బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోనే సాగేది. సాలార్ జంగ్ హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సరికొత్త న్యాయ వ్యవస్థను రూపొందించారు. హైకోర్టు మొదట పత్తర్ఘట్టిలో ఉండేది. 1909లో వరదలు రావడంతో లాల్బాగ్లోని నవాబ్ సర్ ఆస్మాన్ ఝా దేవిడిలోకి మారింది. 1912లో కలరా వ్యాధి వ్యాపించడంతో దేవిడి నుంచి పబ్లిక్ గార్డెన్లోకి, 4 నెలల తరువాత చత్తాబజార్ లక్కడ్కోట్లోని సాలార్ జంగ్ బహదూర్ నివాసంలోకి తరలించారు. అక్కడా అనువుగా లేకపోవడంతో 1914లో సైఫాబాద్లో నవాబ్ సత్రజ్ జంగ్ నుంచి భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడికి మార్చారు. ఈ దశలోనే సర్వోన్నత న్యాయస్థానానికి శాశ్వత భవనం నిర్మించాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది. తీరైన నిర్మాణ కౌశలం ఈ భవనం సొంతం. జైపూర్కు చెందిన ఇంజనీరు, ఆర్కిటెక్ట్ శంకర్లాల్ హైకోర్టు భవన నమూనాను రూపొందించారు. స్థానిక ఇంజనీరు మెహర్ అలీ ఫజల్ నిర్మాణపనుల పర్యవేక్షణ చేపట్టారు. బ్రిటిష్ ఇంజనీరు విన్సెంట్ జె.ఎక్ ప్రపంచమంతా పర్యటించి ఎక్కడా లేని విధంగా భవనం నిర్మాణ ఆకృతి రూపొందించారు. సుమారు రూ.18,22,750 వ్యయ అంచనాతో నవరతన్ దాస్ కాంట్రాక్ట్ పొందారు. నిజాం నవాబు ఇచ్చిన 300 కిలోల వెండితో హైకోర్టు నమూనాను రూపొందించి భవనానికి తాపడం చేశారు. గులాబీ రంగు గ్రానైట్, రాతితో అద్భుత కళాఖండంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఇండోఇస్లామిక్ సంప్రదా య రీతిలో డోమ్ల ఆకృతిని ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. భవన నిర్మాణం, రాతి శిల్పాలన్నీ నిజాం కాలంనాటి కళానైపుణ్యానికి అద్దంపట్టేలా ఉన్నాయి. మొదట ఆరుగురు జడ్జీల కార్యకలాపాలు, బార్ అసోసియేషన్కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. 1958 జులై 10న అదనంగా మరో రెండు బ్లాక్లను నిర్మించారు. 1976లో మరో బ్లాక్, 1998లో బహుళ అంతస్తుల పరిపాలనాభవనాలను నిర్మించారు. హైకోర్టు భవనం పక్కనే నిజాం కాలం నుంచి సేవలందిస్తున్న జజ్జిఖానా (ప్రసూతి ఆస్పత్రి)ను మరో ప్రాంతానికి తరలించి ఆస్పత్రికి చెందిన 9.5 ఎకరాలను 2009లో హైకోర్టుకు అప్పగించారు. అక్కడ కూడా ప్రత్యేక బ్లాకు నిర్మించారు. ఒకే భవనం.. వివిధ పేర్లు.. నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో 1928 హైకోర్టు యాక్ట్ కింద బెంచ్లను ఏర్పాటు చేసి కేసుల విచారణ మొదలుపెట్టారు. అప్పీళ్లపై విచారణకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటైంది. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన తరువాత హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ పేరిట కొనసాగింది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. ఇదే భవనంలో దీపావళి, రంజాన్ పండుగల సందర్భంగా 1956 నవంబరు 5న 11 మంది జడ్జీలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభమైంది. మొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు, మొదటి అడ్వొకేట్ జనరల్గా దువ్వూరి నరసరాజు పనిచేశారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతో అదే తేదీ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైంది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ భవనంలోనే కొనసాగుతోంది. న్యాయస్థానాల పేర్లు మారుతూ వస్తున్నా వందేళ్లుగా ఈ భవనం సేవలందిస్తూ వస్తోంది. భవనంలో అగ్నిప్రమాదం 2009 ఆగస్టు 31న రాత్రి హైకోర్టు ప్రధాన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లైబ్రరీ హాలు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఇందులో ఇంగ్లిష్ లా రిపోర్ట్స్, జర్నల్స్ అన్నీ కాలి బూడిదయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు పోరాటంతో మద్రాసు హైకోర్టు నుంచి తీసుకువచ్చిన పుస్తకాలన్నీ ఆగ్నికి ఆహుతయ్యాయి. చిత్రాలు, నిజాం కాలం నాటి ఫర్నిచర్ కాలిపోయాయి. అనంతరం అదే రూపంలో భవనాన్ని పునరుద్ధరించి 2011 అక్టోబరు 13న ప్రారంభించారు. ఘనంగా శతాబ్ది ఉత్సవాల నిర్వహణ.. హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వ హించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్తో కలసి న్యాయ మూర్తులందరూ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తీరైన ఆర్కిటెక్చర్కు నిదర్శనం చారిత్రక సంపదకు, నిజాం కాలంనాటి అద్భుత నిర్మాణ కౌశలానికి ఈ భవనం అద్దం పడుతోంది. గతంలో ఓ సారి అగ్నిప్రమాదం సంభవించి కొంత మేర నష్టం వాటిల్లినప్పటికీ భవనం చెక్కు చెదరలేదు. హైకోర్టు భవనంతోపాటు నగరంలోని అన్ని చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పరిరక్షించాలి. హైకోర్టు భవనం వందేళ్ల పండగ జరుపుకోవడం ఆనందం కలిగిస్తోంది. – అనురాధారెడ్డి, ఇన్టాక్ సంస్థ ప్రతినిధి -
చంపావత్ ప్రశ్నల భవంతి
ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే చంపావత్ జిల్లా గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవలసి వస్తోంది! మాధవ్ శింగరాజు ‘ఫైనాన్స్ కమిషన్’ అనే మాట ఎంచేతో భయంగొల్పేలా ఉంటుంది. ఇంతకన్నా పోలీస్ కమిషన్ కొంచెం స్నేహపూర్వకంగా ఉంటుందేమో. ఉంటుందేమో కానీ, భారత రాజ్యాంగంలో పోలీస్ కమిషన్ అనేది లేదు. ఉంటే అది కూడా భయమో, అభయమో గొల్పుతూ ఉండేది ఇప్పటికి.ప్రస్తుతం దేశాన్ని నడిపిస్తున్నది పద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్. కమిషన్ ఐదేళ్ల కాలపరిమితిలో ఇంకా రెండేళ్లు మిగిలే ఉన్నాయి. 2020 వరకు. అయినప్పటికీ రెండేళ్ల క్రితమే 2017లో పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ కూడా రెడీ అయిపోయింది. 2020 నుంచి 25 వరకు. ఆ కమిషన్కు ఛైర్మన్ ఎన్.కె.సింగ్. పద్నాల్గవ ఫైనాన్స్ కమిషన్ తరఫున వచ్చిన కొంతమంది అధికారులు ఇప్పుడు ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లాలో ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్నారు! మొదట వాళ్లు ఆ జిల్లాలోని ఘర్చమ్ గ్రామానికి వెళ్లారు. వాళ్లకేదో ఇన్ఫర్మేషన్ అందింది.. పంచాయతీ నిధులతో అక్కడ కొత్తగా కట్టిన ఒక భవంతి లెక్కల్లో అవకతవకలు జరిగాయని. ఆ నిధులు ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన నిధులే. పని సక్రమంగానే జరిగింది. అయితే ఆ భవంతిని వినియోగిస్తున్న తీరే సక్రమంగా లేదు! లేకపోవడమే కాదు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా కూడా ఉంది. భవంతి లోపలంతా మహిళలు ఉన్నారు! వాళ్లేమీ డ్రాక్వా మహిళలు, స్వయం సహాయ బృందాల మహిళలు కాదు. రుతుక్రమంలో ఉన్న మహిళలు! కేంద్ర నిధులతో పంచాయతీ కట్టించిన భవనంలో వీళ్లు ఉండడం ఏంటి? ఇది రెండో ప్రశ్న. ఊళ్లో రుతుక్రమంలో ఉన్న మహిళలందర్నీ ఇలా ఊరికి దూరంగా ఉంచడం ఏమిటి? ఇది మూడో ప్రశ్న. మరి మొదటి ప్రశ్న ఏమిటి? రుతుక్రమంలో ఉన్న మహిళను అసలు ఇంటి బయట ఉంచడం ఏమిటి? ప్రశ్నల క్రమం ఎలా ఉన్నా మహిళల్ని ఇలా ఇంటికి దూరంగా , ఊరికి దూరంగా, రాజ్యాంగ హక్కుకు దూరంగా ఉంచడం సక్రమం కాదు. భవన నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందని గ్రామస్తులు కొందరు జిల్లా మేజిస్ట్రేట్ రణ్బీర్ చౌహాన్ దృష్టికి తెచ్చినప్పుడు, ఆ భవనాన్ని ‘బహిష్టు కేంద్రం’లా వినియోగిస్తున్నట్లు బయటపడింది. చౌహాన్ నివ్వెరపోయారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి ‘పంచాయతీ నిధుల బహిష్టు కేంద్రాలు’ ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు. ఉన్నదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తెలుస్తుంది. అయితే ఉండేందుకే అవకాశం ఉందనిపిస్తోంది.చంపావత్ జిల్లా.. భారత్–నేపాల్ సరిహద్దుల్లో ఉంది. నేపాల్ గ్రామాల్లో ‘నెలసరి పాక’ల (పీరియడ్ హట్స్) ఆచారం ఉంది. రుతుక్రమం వచ్చిన మహిళల్ని ఆ ఐదు రోజులూ వాటిలో ఉంచుతారు. ఆ అనాగరిక ఆచారానికి సరిహద్దుకు ఇవతల ఉన్న మన గ్రామాలు కూడా ప్రభావితం అవుతున్నాయనేందుకు నిదర్శనమే ఇప్పుడు బయట పడిన ఘర్చమ్ గ్రామంలోని బహిష్టు కేంద్రం. ఇటీవలే నేపాల్లోని బజురా జిల్లాలోని ఒక గ్రామంలో అంబా బొహారా (35), పన్నెండు, తొమ్మిదేళ్ల వయసు గల ఆమె కొడుకులిద్దరు నిద్రిస్తున్నప్పుడు నెలసరి పాకకు నిప్పంటుకుని ఊపిరి ఆడక ఆ ముగ్గురూ చనిపోయినట్లు వార్తలు వ చ్చాయి. గత నవంబర్లో వచ్చిన గజ తుఫాన్లో తమిళనాడులో విజయలక్ష్మి అనే పన్నెండేళ్ల బాలిక నెలసరి పాకలో ఉన్నప్పుడు ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలిపడి చనిపోయింది. ఆమె తల్లి గాయపడింది. ఇంకా ఇలాంటి వార్తలు మిగతా రాష్ట్రాల నుంచీ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి కనుక ఆడపిల్లల విషయంలో నేపాలైనా, భారత్ అయినా, ఇంకో దేశమైనా ఒకటే అనుకోవాలి. ఇంకొకటి కూడా అనుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవాలి. చంపావత్ జిల్లా మేజిస్ట్రేట్కు ఈ సంగతి తెలిసినప్పుడు మొదట ఆయన అన్నమాట.. ‘ఇదేంటీ!’ అని. రెండో మాట.. ‘అలా ఉంచేశారా, ప్యాడ్స్ ఏమైనా ఇచ్చారా?’ అని. మంచి మాట. అరవై ఏడేళ్లుగా ఫైనాన్స్ కమిషన్ దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డబ్బు లెక్కలు చూస్తోంది. మహిళా సంక్షేమం అన్నది కమిషన్ పరిధిలోకి రాని విషయమే అయినా, అభివృద్ధిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన విధంగానే, స్త్రీల జీవితాలను దుర్భరం చేసే దురాచారాలను పాటిస్తున్న గ్రామాలకు నిధులను తగ్గిస్తాం అన్న భయం పెట్టొచ్చు. డబ్బు ఇచ్చే కాదు, డబ్బును ఇవ్వకుండా కూడా అభివృద్ధిని సాధించవచ్చు.. స్త్రీ సంక్షేమం కూడా దేశాభివృద్ధిలో ఒక భాగం అనుకుంటే. -
విశాల్ లవ్ మ్యారేజ్
‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అంటుంటారు. కానీ విశాల్ విషయంలో ఇది రివర్స్. ‘బిల్డింగ్ కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనాలి. తమిళ నటీనటుల సంఘానికి సొంత భవనం నిర్మించాకే పెళ్లి అని గతంలో విశాల్ పలు సందర్భాల్లో చెప్పారు. అది నిర్మాణంలో ఉంది. దాంతో పాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా నిర్మాతల మండలి కోసం ఓ భవంతి కట్టిస్తున్నారు విశాల్. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. పెళ్లి కూడా ఖరారైంది. ప్రస్తుతం విశాల్ పెళ్లి గురించే కోలీవుడ్లో చర్చ. (విశాల్ పెళ్లి.. వరలక్ష్మి ఘాటు రిప్లై) ‘త్వరలోనే హైదరాబాద్కు చెందిన బిజినెస్మేన్ కూతురు అనీషాతో విశాల్ వివాహం చేయబోతున్నాం’ అని విశాల్ తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అది పెద్దలు కుదిర్చిన వివాహం అనుకున్నారంతా. కానీ ప్రేమ వివాహమే అని విశాల్ కన్ఫర్మ్ చేశారు. హైదరాబాద్ బిజినెస్మేన్ విజయ్ రెడ్డి, పద్మజ కుమార్తె అనీషను విశాల్ పెళ్లాడనున్నారు. ‘‘మాది లవ్ మ్యారేజ్. వచ్చే వారంలో మా రెండు కుటుంబాలు కలుసుకొని ఎంగేజ్మెంట్ డేట్ని ఫిక్స్ చేస్తారు. నిర్మాతల సంఘం నూతన భవన నిర్మాణం పూర్తయ్యాక, అందులోనే పెళ్లి చేసుకుంటాను’’ అని విశాల్ పేర్కొన్నారు. -
స్థలం రూ.200 కోట్లు.. భవనం రూ.20 కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఇంజినీరింగ్ అలూమ్ని అసోసియేషన్కు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలంలో కొత్త భవనం నిర్మాణం కోసం వీసీ ప్రొ.రాంచంద్రం ఇటీవల శంకుస్థాపన చేశారు. దేశ విదేశాల్లో స్థిరపడిన ఓయూ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థులు దాదాపు రూ.20 కోట్ల నిధులను సేకరించి అధ్యాపకులు, విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ భవనం నిర్మాణం చేపట్టనున్నారు. కేవలం 10వేల మంది పూర్వ విద్యార్థులున్న ఇంజినీరింగ్ కళాశాల అలూమ్నికి రూ.200 కోట్ల విలువైన వర్సిటీ భూమి కేటాయించడం చర్చనీయాశంగా మారింది. కేవలం రూ.20 కోట్లతో నిర్మించనున్న భవనం కోసం ఏకంగా రూ.200 కోట్ల భూమి ఎలా కేటాయిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కోట్లు విలువైన భూమిలో కొత్త భవనం నిర్మించే బదులు... గతంలో నిర్మించిన భవనాల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చని సూచిస్తున్నారు. గత పదేళ్లుగా ఓయూలో కోట్ల రూపాయాలతో అనేక కొత్త భవనాలను నిర్మించారు. అవి పూర్తిగా వినియోగంలో లేవు. లా కాలేజీ ఎదుట సెంట్రల్ ఫెసిటిలిటీస్ భవనం, ఇంజినీరింగ్ కళాశాల లైబ్రరీ పక్కన ట్రైనింగ్ సెంటర్ బిల్డింగ్, సీ గ్రౌండ్స్ పక్కన సైన్స్ బిల్డింగ్, దూరవిద్య తరగతుల భవనం తదితర కొత్త భవనాలు పూర్తిగా వినియోగంలో లేవు. కొన్ని భవనాల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. సేవలో చురుగ్గా... విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో పదేళ్ల క్రితం ఓయూ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అయితే మిగతా కళాశాలల పూర్వ విద్యార్థుల కంటే ఇంజినీరింగ్ విద్యార్థులు అనేక కార్యక్ర మాలు చేసి ఓయూ అభివృద్ధిలో ముందజలో ఉ న్నారు. దీంతో ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థులే ప్ర త్యేక అలూమ్ని అసోసియేషన్ ఏర్పాటు చేసి వి వి« ద కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటి వ ర కు రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు... పూర్వ విద్యార్థులు ఓయూను ఒక వైపు నుంచే చూస్తున్నారు. ప్రస్తుతం ఓయూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితి. హాస్టల్ మెస్ బిల్లులు, వివిధ కోర్సుల ఫీజులు సైతం చెల్లించలేని దుస్థితిలో ఓయూ విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. దాతలు సహాయం అందిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోపక్క అధ్యాపకులు, ఉద్యోగుల కొరత ఉంది. విద్యార్థులకు హాస్టల్ గదుల సమస్య ఉంది. లేడీస్ హాస్టల్లో గదుల కొరతతో పాటు స్నానాల గదులు, మరుగుదొడ్ల సమస్య, మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. 1200 మంది అధ్యాపకులు ఉండాల్సిన ఓయూలో 526 మంది మాత్రమే పని చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఓయూకు ఎవరు సహాయం చేయడం లేదు. పూర్వ విద్యార్థులు సైతం భవనాలు, మౌలిక వసతులపై మాత్రమే దృష్టిసారించారు. ఓయూలో ప్రస్తుతం చదవుతున్న విద్యార్థులకు చేయుతనివ్వడం లేదు. చాలామంది ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు తీసుకుపోలేదు. ఒక్క ఆర్ట్స్ కళాశాలలోనే మూడు బీర్వాల నిండా సర్టిఫికెట్లు ఉన్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. టెక్విఫ్ నిధులతోనే... నిజానికి ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలల అభివృద్ధికి మూడు విడతలుగా కోట్ల రూపాయాల నిధులు టెక్విఫ్ ద్వారా లభించాయి. టెక్విఫ్ నిధులతోనే అభివృద్ధి చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు కూడా టెక్విఫ్ నిధులతోనే పనులు చేస్తున్నారు. -
బిల్ట్ భవితవ్యం ఎటువైపు?
సాక్షి, ములుగు: ఐడీబీఐ బ్యాంకు నోటీసులతో బిల్ట్ భవితవ్యం ఎటువైపు అనే ఆందోళన కార్మికుల్లో నెలకొంది. పున ప్రారంభమా... మూసివేతా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిణామాలు కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమ పునరుద్ధరణకు సబ్సిడీ ఇస్తామని హామీఇచ్చినా యాజమాన్యం ముందుకురాకపోవడం, తమకు బాకీపడ్డ రుణాన్ని చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని ఐడీబీఐ బ్యాంకు నోటీసులు ఇవ్వడంతో కలవరం మొదలైంది. రెండో విడతలో భాగంగా చేపడుతున్న కార్మికుల సమ్మె శుక్రవారంతో 343 రోజులకు చేరుకుంది. ఉపాధి కరువై రోడ్డునపడ్డ కార్మికులు బిల్ట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే పల్ప్ కంటే ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పల్ఫ్ తక్కువ ధరకు లభిస్తుండటంతో గ్రాసిమ్ కంపెనీ అటువైపు దృష్టి సారించింది. బిల్ట్ పల్ప్ను కొనుగోలు చేయడం నిలిపేసింది. దీంతో బిల్ట్ పరిశ్రమ పరిస్థితి అయోమయంగా మారింది. బిల్ట్కు చెందిన పల్ఫ్కు మార్కెట్ లేకపోవడంతో నష్టాలతో ఫ్యాక్టరీని నడపలేమనే కారణంతో యాజమాన్యం 2014న ఏప్రిల్ ఐదో తేదీ రాత్రి 10 గంటలకు పీఎఫ్ కార్మికులను విధులకు రాకుండా అడ్డుకుంది. ఆరో తేదీన ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపేసింది. ఫ్యాక్టరీలో పనిచేసే 658 మంది పర్మినెంటు కార్మికులు, స్టాఫ్, క్లరికల్ స్టాఫ్ 200 మంది, 534 మంది పీఎఫ్, సుమారు 1200 మంది నాన్పీఎఫ్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరోక్షంగా మరో 10 వేల మందికి ఉపాధి కరువైంది. దీంతో మూతపడ్డ బిల్ట్ కార్మాగారాన్ని పునప్రారంభించి ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బిల్ట్ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి మార్చి తొమ్మిది 2015 నుంచి మార్చి ఆరు 2016 వరకు 362 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. స్పందించిన టీఆర్ఎస్ ప్రభుత్వం బిల్ట్ పునప్రారంభం కోసం సంవత్సరానికి రూ. 30 కోట్లు చొప్పున ఏడేళ్లకు గానూ రూ. 210 కోట్ల రాయితీని 22 ఏప్రిల్ 2015న ప్రకటించింది. దీనికి సంబంధించి మార్చి ఆరో తేదీ 2016న ప్రత్యేక జీఓ విడుదల చేసింది. అయినా బిల్ట్ యాజమాన్యం నుంచి నేటి వరకు స్పందన లేకపోగా రాయితీ ప్రకటించి జీఓ తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సైతం సమస్యను పట్టించుకోలేదు. దీంతో కొందరు కార్మికులు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకు పలు కారణాలతో 18 మంది కార్మికులు చనిపోయారు. 2017 డిసెంబర్ తొమ్మిదో తేదీన బిల్ట్ సమస్య పరిష్కారంకోసం కార్మికులు, కార్మికుల కుటుంబాల సారథ్యంలో మలిదశ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం, బిల్ట్ యజమాన్యం, కార్మికశాఖ, బిల్ట్ జేఏసీ నాయకుల సమక్షంలో పలు దఫాలుగా చర్చలు జరిపాయి. అయినా యజమాన్యం వాయిదాలతో కాలయాపన చేసింది. ఈ తరుణంలో జూలై 25న యజమాన్యంతో ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు జరిపి ఫ్యాక్టరీ పునప్రారంభం కోసం రూ. 350 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఆగస్ట్ 30న మరో సమావేశం నిర్వహించి 10 రోజుల్లోగా పునరుద్ధరణ పనులు ప్రాంభించేందుకు వారం రోజుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని బిల్ట్ యజమాన్యానికి పరిశ్రమల శాఖ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవాల్సిన యజమాన్యం కార్మిక జేఏసీ నాయకులతో సెప్టెంబర్ 10న సమావేశం నిర్వహించి కార్మికులు పొందుతున్న అలవెన్సులలో 75 శాతం తగ్గించుకోవాలని అలా ఒప్పుకుంటేనే ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ముందుకొస్తామని యజమాన్యం స్పష్టంగా వెల్లడించింది. ఈ విషయంపై ఇంకా కార్మిక జేఏసీ, యజమాన్యం మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మూతపడిన నాటి నుంచి 39 నెలల వేతనాలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీలో 592 ఉండగా పర్మినెంటు కార్మికులు 566, క్లరికల్ స్టాఫ్ 22 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆస్తుల జప్తునకు ఐడీబీఐ బ్యాంకు నోటీసు బిల్ట్ ఫ్యాక్టరీ యజమాన్యం తమకు రూ. 551 కోట్ల 17లక్షల అప్పు ఉందని ఐడీబీఐ బ్యాంక్ ఈ నెల మూడో తేదీన బిల్ట్ ప్రధాన గేటుకు నోటీసు అంటించింది. గతంలో కర్మాగారం రీకన్స్ట్రక్షన్ పేరుతో యజమాన్యం తమ బ్యాంకు ఉంచి అప్పు తీసుకుని నేటివరకు చెల్లించలేదని నోటీసులో పేర్కొంది. 60 రోజుల్లో యజమాన్యం తమకు సంజాయిషీ ఇవ్వాలని లేనిపక్షంలో బిల్ట్ యాజమాన్యానికి చెందిన ఆస్తులను జప్తుచేస్తామని నోటీసులో హెచ్చరించింది. కర్మాగారం పునప్రారంభం విషయంపై అటు ప్రభుత్వం నుంచి ఇటు యజమాన్యం నుంచి స్పష్టమైన వైఖరి వెల్లడి కాకపోవడంతో కార్మికుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. సంవత్సరానికి 40 వేల టన్నుల పల్ప్ ఉత్పత్తి కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీలో 1981 నుంచి రేయాన్స్ గ్రేడ్ పల్ప్ ఉత్పత్తి ప్రారంభమైంది. 1986లో ఫ్యాక్టరీని ఆధునీకరించి సంవత్సరానికి 5400 టన్నుల ఉత్పత్తి చేశారు. 1995లో రెండోదఫా ఆధునీకరించి రోజుకు 270 టన్నుల ఉత్పత్తి అంచనాతో నెలకు 8500 నుంచి 9000 టన్నుల అంచనాతో ఉత్పత్తి చేశారు. తదనంతరం ఫ్యాక్టరీని నిబంధనల మేరకు ఆధునీకరించకపోవడంతో రోజుకు 270 టన్నుల మేర ఉన్న ఉత్పత్తి 240 నుంచి 230 టన్నులకు పడిపోయింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే పల్ప్ను మహారాష్ట్రలోని నాగ్దాలోగల బిర్లా గ్రూపుకు చెందిన గ్రాసిమ్ కంపెనీ కొనుగోలు చేసేంది. వేతనాలు మొత్తం చెల్లించాల్సిందే ఫ్యాక్టరీ మూపడిన నాటి నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మొత్తం 39 నెలల వేతనం చెల్లించాల్సిందే. వేతనాల్లో ఒక్క రూపాయి తక్కువ చెల్లించినా ఒప్పుకునేది లేదు. ఫ్యాక్టరీ పునప్రారంభిస్తామని యజమాన్యం హామీ ఇస్తే అవసరమైతే తాము ఒక గంట ఎక్కువగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కార్మికులకు వర్తించే అలవెన్సులలో యజమాన్యం అడిగిన విధంగా 75 శాతం తగ్గించుకోకుండా 20 నుంచి 25 శాతం తగ్గించుకునేందుకు సుముఖంగానే ఉన్నాం. విషయంపై కార్మిక శాఖ అధికారులు, యజమాన్యంతో చర్చించి ఫ్యాక్టరీని పునప్రారంభించేందుకు చొరవచూపాలి. –గుజ్జుల అచ్చిరెడి, కార్మికుడు యాజమాన్యం ముందుకు రాకపోవడం బాధాకరం ప్రభుత్వం రాయితీ ప్రకటించినా యజమాన్యం ముందుకు రాకపోవడం బాధాకరం. ఫ్యాక్టరీ పున ప్రారంభించాలంటే కార్మికులకు వర్తించే అలవెన్సుల్లో 75 శాతం తగ్గించుకుంటే ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని యజమాన్యం చెపుతుంది. ఫ్యాక్టరీ పున ప్రారంబిస్తామంటే తాము 25 నుంచి 35 శాతం వరకు అలవెన్సులు తగ్గించుకుంటామని చెపుతున్నా యజమాన్యం అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా బకాయి ఉన్న 39 నెలల వేతనాన్ని చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నాం. విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం బిల్ట్ యజమాన్యంతో కార్మికుల సమక్షంలో చర్చలు జరిపి త్వరిత గతిన సమస్యను పరిష్కరించాలి.–వడ్డెబోయిన శ్రీనువాసులు, జేఏసీ నాయకుడు -
జీపీ భవనాలకు అదనపు నిధులు
మోర్తాడ్(బాల్కొండ) : ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను కేటాయించి నిర్మిస్తున్న పంచాయతీలకు అదనంగా మరిన్ని నిధులను కేటాయించాలని ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో భవనానికి రూ. 3 లక్షల చొప్పున కేటాయించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనాలకు కొత్త భవనాలను నిర్మించడానికి ఉపాధి హామీ పథకం నుంచి రూ. 13 లక్షల చొప్పున కేటాయించారు. అయితే ఈ నిధులతో భవన నిర్మాణం పూర్తయినా చిన్న చిన్న సౌకర్యాలను కల్పించడానికి నిధులు సరిపోకపోవడంతో పంచాయతీ భవనాలు వినియోగంలోకి రాలేకపోయాయి. అదనంగా నిధులు కేటాయిస్తేనే పనులు పూర్తి చేసి భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు భావించారు. జిలాŠోల్ల మొదటి విడతలో కొన్ని భవనాలను నిర్మించగా అప్పట్లో ఒక్కో భవనానికి రూ. 11 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండడంతో నిధులు సరిపోయాయి. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మరో 52 పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేశారు. నిర్మాణ వ్యయం పెరగడంతో ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 13 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 6 కోట్ల 76 లక్షలను కేటాయించారు. భవనాల నిర్మాణం పూర్తయినా సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్ వేయడానికి నిధులు సరిపోలేదు. అంచనాలకు మించి వ్యయం పెరిగిపోవడంతో అదనంగా మరింత నిధులు అవసరం అని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఒక్కో పంచాయతీకి రూ. 3 లక్షల చొప్పున కేటాయిస్తే నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు సూచిస్తున్నారు. సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్ కోసం రూ. 3 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 1.56 కోట్ల నిధులు అదనంగా అవసరం అవుతున్నాయి. ఈ నిధులను కేటాయిస్తే జిల్లాలోని పంచాయతీ భవనాల కోసం ఉపాధి హమీ పథకం ద్వారా రూ. 8.32 కోట్లు కేటాయించినట్లు జరుగుతుంది. ప్రభుత్వమే అదనపు నిధులను విడుదల చేయడానికి ప్రతిపాదనలు కోరగా ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ నిధులు తొందరలోనే విడుదల అవుతాయని నిధుల కేటాయింపు జరగగానే పంచాయతీ భవనాలను వినియోగంలోకి తీసుకు రావడానికి పనులను పూర్తి చేయిస్తామని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. అదనపు నిధులు కేటాయించడం సబబే.. గ్రామ పంచాయతీ భవనాలకు అదనంగా రూ. 3 లక్షల చొప్పున నిధులను కేటాయించడం సబబే. రూ. 13 లక్షలతో భవన నిర్మాణం పూర్తి కాగా ఇతర సౌకర్యాల కోసం అదనంగా నిధులు అవసరం ఉన్నాయి. పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండడంతో ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించడం సమంజసమే. – నాగం పోశన్న, సర్పంచ్, వడ్యాట్ నిధులు మంజూరైతేనే భవనాలు వినియోగంలోకి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా కేటాయించిన రూ. 13 లక్షల నిధులతో భవనాలను నిర్మించారు. కానీ సౌకర్యాలు మెరుగుపడలేదు. ఇప్పుడు రూ. 3 లక్షల అదనపు నిధులు మంజూరైతే సౌకర్యాలు వృద్ధి చెంది భవనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయి. – లింగన్న, సర్పంచ్, దోన్పాల్ -
‘న్యాక్’ సర్టిఫికెట్కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ రంగంలోని పలు అంశాల్లో యువతకు శిక్షణనిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ) మరో ఘనత సాధించింది. న్యాక్లో శిక్షణ పొందినవారికి అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు మెరుగుకాబోతున్నాయి. ఈ మేరకు బ్రిటన్కు చెందిన నేషనల్ ఓపెన్ కాలేజ్ నెట్వర్క్(ఎన్వోసీఎం), ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్తో కలసి త్రైపాక్షిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి ఆ సంస్థల ప్రతినిధులతో కలసి సంతకాలు చేశారు. ప్రస్తుతం న్యాక్ జారీ చేస్తున్న సర్టిఫికెట్కు అంతర్జాతీయంగా గుర్తింపు లేదు. ఇక్కడ అత్యంత మెరుగైన శిక్షణ ఇస్తున్నట్టు తెలిసినా కొన్ని అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తటపటాయిస్తున్నాయి. సర్టిఫికెట్కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటే వారిని నేరుగా ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. దీన్ని గుర్తించిన న్యాక్ డీజీ భిక్షపతి ఈ ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే సంస్థ హైదరాబాద్లోని న్యాక్ క్యాంపస్ను పరిశీలించి అక్కడి మౌలిక వసతులు, శిక్షణ తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీకి చెందిన సంస్థతో కలిసి న్యాక్తో త్రైపాక్షిక భాగస్వామ్యం ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. దీంతో ఇక నుంచి న్యాక్లో శిక్షణ పొందిన వారికి ఏ దేశంలోనైనా ఉద్యోగాలు పొందేందుకు మార్గం సులభమవుతుందని న్యాక్ డీజీ భిక్షపతి ‘సాక్షి’తో చెప్పారు. -
నకిలీ ధ్రువపత్రాలతో భవన నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణానికి సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించడమే కాకుండా వాటితోనే హైకోర్టును ఆశ్రయించారని ఓ బహుళ భవన నిర్మాణం కేసులో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు మంజూరు చేసిన స్టే ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. కేసును విచారించిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి.. భవనానికి సంబంధించి పూర్తి వివరాలివ్వాలని, ఆలోగా భవనం వ్యవహారాల్లో ఇతరులను హక్కుదారులు చేయొద్దంటూ బిల్డర్, ఇతరులకు మధ్యంతర ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ సీతాఫల్మండిలోని నామాలగుండు ప్రాంతంలో 1,000 గజాల స్థలం బహుళ అంతస్తుల భవనం (జీ ప్లస్ ఫోర్), 2 సెల్లార్ల నిర్మాణానికి అనుమతి కోసం 2013 జూలైలో జీహెచ్ఎంసీకి స్థల యజమానుల పేరుతో పి.రుక్మమ్మ సహా మరో నలుగురు, బిల్డర్ ఏడుకొండలు దరఖాస్తు చేసుకున్నారు. సెవెన్ హిల్స్ కన్స్ట్రక్షన్స్ పేరిట చేసుకున్న ఈ దరఖాస్తుకు జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వకపోవడంతో.. నకిలీ పత్రాలు సృష్టించి భవనం నిర్మించారు. దీంతో 2016లో జీహెచ్ఎంసీ వారికి నోటీసులు జారీ చేసింది. అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి రూ.60 లక్షలు వెచ్చించామని, నిర్మాణ అనుమతి పత్రాలు ఉన్నాయని బిల్డర్, యజమానులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అయితే భవనానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ కమిషనర్.. నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వలేదని, దరఖాస్తు తిరస్కరించామని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. భవనం నిర్మించిన స్థలం ప్రభుత్వ భూమి కాదని కలెక్టర్ ధ్రువపత్రం ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని, హైకోర్టుకూ ఆ పత్రాలే సమర్పించారని, కాబట్టి స్టే ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. దీంతో భవనానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ విచారణను జనవరి 2కు న్యాయమూర్తి వాయిదా వేశారు. -
ఆశయానికి గ్రహణం
పెండింగ్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు నిధులు లేక నిలిచిపోయిన పనులు ఏడాదిన్నర దాటినా అదే పరిస్థితి జాప్యంతో పెరిగిన వ్యయం సీఎం ఆదేశాలకు అడ్డంకులు బంజారాహిల్స్ రోడ్ నెం.12 ఎన్బీటీనగర్ బస్తీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 5న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాళ్లతో, గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రాంతంలో భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ఇంజినీర్లు వేసిన ప్రణాళికలు అమలుకు నోచుకోలేదు. అధికారుల డిజైన్ మేరకు రాళ్ల ప్రదేశంలో నిర్మాణం సాధ్యం కాక ఏడాది కాలంగా పనులు వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సీఎం వేసిన శిలాఫలకం వెక్కిరిస్తోంది. సిటీబ్యూరో: రాజు తలచుకుంటే డబ్బులకు కొదవుంటుందా..! కానీ మహానగరంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి సూచించిన పనులకే నిధుల కష్టాలు వెంటాడుతున్నాయి. ఏడాదిన్నర గడిచినా ఎక్కడి గొంగడి అక్కడేనన్న చందంగా మారింది. మహానగరంలో సామాన్యులు శుభకార్యం చేయాలంటే తలకుమించిన భారమవుతుంది. ఫంక్షన్ హాళ్లకు చెల్లించే అద్దెలు ఆకాశంలో ఉంటాయి. గతంలో నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిగువ మధ్యతరగతి వారికోసం చాలినన్ని ఫంక్షన్హాళ్లు లేకపోవడాన్ని గుర్తించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్లోని పేద, దిగువ మధ్యతరగతి వారు భరించగలిగే ధరతో శుభకార్యాలు చేసుకునేందుకు అనువుగా మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అప్పటికప్పుడు రూ.90 కోట్లతో టెండర్లు పిలిచారు. మొత్తం 50 హాళ్లను నిర్మించాలన్నది లక్ష్యం కాగా, తొలుత సర్కిల్కు రెండు చొప్పున 18 సర్కిళ్లలో వెరసి 36 నిర్మించాలని భావించారు. స్థలం అందుబాటులో ఉన్న 31 ప్రదేశాల్లో టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు 16 ప్రాంతాల్లో మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి. ఒక్కో ఫంక్షన్హాల్ అంచనా వ్యయం రూ.2.90 కోట్లుగా ప్రతిపాదించారు. అయితే, ఏడాదిన్నర గడచినా ఒక్క ఫంక్షన్హాల్ నిర్మాణం కూడా పూర్తిచేయలేదు. ఇందులో స్థలం అందుబాటులోకి రానివి కొన్నయితే, నిధుల లేమితో నిలిచిపోయినవి మరికొన్ని. పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం పెరిగి, రివైజ్డ్ అంచనాలతో అనుమతుల కోసం ఎదురు చూస్తున్నవి ఇంకొన్ని. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అన్నింట్లోకి నిధుల లేమే పెద్ద సమస్యగా మారింది. ఏడాదిన్నరగా కుంటుతున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్ల పనులపై ‘సాక్షి’ ఫోకస్.. ఒకే నమూనాతో ఉండాలని.. ఫంక్షన్ హాళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేందుకు తగిన మార్గదర్శకాలతో ప్రణాళికలు రూపొందించారు. అవి ఒక్కోటి దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలో ఉండాలి. మూడంతస్తులుగా నిర్మించాలి. ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలి. మరో అంతస్తులో భోజనాలకు ఏర్పాట్లు.. సెల్లార్లో పార్కింగ్ సదుపాయం.. పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునే అవకాశం ఉండాలని నిర్ణయించారు. స్థలం లేమితో వీటిలో కొన్నింటికి మినహాయింపులిచ్చారు. శంకుస్థాపన చేసిన ఏడాదికి పనులు సీతాఫల్మండిలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణ పనులకు 2015 డిసెంబర్ 2న మంత్రి పద్మారావు శంకుస్థాపన చేశారు. అనంతరం దాదాపు ఏడాదికి పనులు ప్రారంభించారు. తొలుత రూ.1.30 కోట్లతో నిర్మించాలనుకున్నారు. మంత్రి సూచన మేరకు మరోమారు జీహెచ్ఎంసీ అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో వ్యయం రూ. 1.70 కోట్లకు పెరిగింది. నిర్మాణ పనులు జాప్యం కావడానికి ఇదొక కారణం కాగా, మరొకటి స్థలం బదలాయింపు సమస్య. ఇక్కడ ఫంక్షన్హాలు నిర్మించాలని ప్రతిపాదించిన స్థలం రాష్ట్ర కార్మికశాఖకు చెందినది. కార్మికశాఖ నుంచి జీహెచ్ఎంసీకి స్థల బదలాయింపు జరగడంలో ఆలస్యం జరిగింది. కొత్త ప్రతిపాదనలు, స్థల బదలాయింపు సమస్యలు పరిష్కరించే నాటికి ఏడాది కాలం గడిచింది. ఎకరం మేర విస్తీర్ణం కలిగిన ఈ స్థలంలో గతంలో కార్మికశాఖ నిర్మించిన వెల్ఫేర్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని కూల్చివేశారు. ప్రస్తుతం నేల చదును పనులు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. -
సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు
అల్లాదుర్గం: అల్లాదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నామని మెదక్ డీఎస్పీ నాగరాజు చెప్పారు. మంగళవారం అల్లాదుర్గం పోలీస్స్టేషన్లో సర్కిల్ ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను, రోడ్డు ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో అల్లాదుర్గం సీఐ రవీందర్రెడ్డి, ఎస్సై ఎండీ గౌస్, సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు. -
సీఆర్డీఏలో ‘డీపీఎంఎస్’ ఏర్పాటు
ఇకపై ఆన్లైన్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు సాక్షి, అమరావతి: ఆన్లైన్లో భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్)ను ప్రవేశపెడుతున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సత్వర అనుమతుల కోసం ఇప్పటికే ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం, ప్రతి శనివారం ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి దరఖాస్తుదారులకు అన్నివిధాల సహకారం అందిస్తున్నట్లే ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు పేర్కొంది. ఈ విధానంలో నివాస, వాణిజ్య, హైరైజ్, గ్రూపు, ప్రత్యేక భవనాలకు సంబంధించి ప్లాన్లకు ఆన్లైన్లో త్వరితగతిన అనుమతిస్తామని తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వినియోగదారుడి సెల్ఫోన్కు ఎస్ఎంఎస్, ఇ–మెయిల్ ద్వారా దాని పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని పేర్కొంది. వినియోగదారులు తమ దరఖాస్తు ఏ దశలో ఉన్నదీ సీఆర్డీఏ కార్యాలయానికి రాకుండానే తెలుసుకోవచ్చని, అనుమతి వచ్చిన తర్వాత వెబ్సైట్ నుంచే సంబంధిత ప్లాన్ కాపీలు, సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫీజులను నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
నాణ్యతకు చెల్లుచీటీ!
ఇష్టానుసారంగా సమీకృత వసతిగృహ భవన నిర్మాణం ఇసుకకు బదులు రాతి పౌడర్ వినియోగం కొరవడిన అధికారుల పర్యవేక్షణ కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా మెదక్: సమీకృత వసతి గృహ భవన నిర్మాణంలో నాణ్యతకు మంగళం పాడుతున్నారు. సిమెంట్, ఇసుకతో నిర్మించాల్సిన భవనాన్ని చౌకగా లభించే రాతి పౌడర్ను కలిపి నిర్మాణాలు సాగిస్తున్నారు. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన ఈ భవనం ఎన్నాళ్లపాటు ఉంటుందో ఎవరికి అంతుబట్టని ప్రశ్న. అదే సమయంలో కోట్లాది రూపాయల ప్రజాధనం మట్టిపాలవుతుంది. మెదక్ పట్టణంలోని జంబికుంట ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో ఈ మూడు వర్గాలకు చెందిన హాస్టళ్లను ఒకేచోట సమీకృత వసతి గృహ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.2.27కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను ఆన్లైన్ ద్వారా చేజిక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. భవన నిర్మాణానికి నాణ్యమైన ఇసుకతోపాటు సిమెంట్ కలిపి నిర్మిస్తారు. కాని ఈ కాంట్రాక్టర్ మాత్రం ఇసుక సిమెంట్తోపాటు రాతి పౌడర్ను సైతం కలుపుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. కాంట్రాక్టర్ ఓ వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. గోడలు, మరుగుదొడ్లను మాత్రమే నిర్మిస్తున్నామని సదరు వ్యక్తి పేర్కొన్నారు. ఇంతపెద్ద భవనాన్ని నిర్మిస్తున్న సంబంధిత శాఖ అధికారులు అక్కడ లేకపోవడం గమనార్హం. ఈ భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేద విద్యార్థులు వందలాది మంది వసతి పొందుతారు. ఇంతటి ప్రాధాన్యత గల భవన నిర్మాణంపై నిర్లక్ష్యపు నీడలుకమ్ముకున్నాయి. మార్కెట్లో అతి చౌకగా లభించే రాతిపౌడర్ చూడటానికి సిమెంట్లాగే ఉంటుంది. అందులో ఎంతపౌడర్ కలిపినా గుర్తించేందుకు వీలుకాదు. సిమెంట్, ఇసుకతో నిర్మిస్తేనే ఏ భవన నిర్మాణమైనా పదికాలాలపాటు మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. కానీ రాతిపౌడర్ను కలిపితే నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ విషయమై విద్యాశాఖ ఏఈ అంసర్ అలీని సాక్షి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ నెల్లూరు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కార్మికుల సమస్యలు పరిష్కరించుకుందామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు. నగరంలోని ఓ హోటల్ సోమవారం జరిగిన భవన నిర్మాణ కార్మిక సంగం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ బ్రిటీష్ ప్రభుత్వం కన్నా దారుణంగా మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కార్పొరేట్ శక్తులకు దాసోహంగా ఉంటూ కార్మికులను చులకనగా చూడడం ఏంటని ప్రశ్నించారు. ఎంతో కష్టపడి పో రాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మార్చాలని చూడడం సరికాదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టం బర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘం జాతీయ అధ్యక్షుడు సింగారవేలు, గౌరవ అధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు, నాయకులు మూలం రమేష్ పాల్గొన్నారు. -
భూమి లేదు.. భవనం లేదు!
♦ కళాశాల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు ♦ స్థలం కేటాయింపు లేక ఇప్పటికే రెండుసార్లు నిధులు వాపస్ ♦ శివ్వంపేట జూనియర్ కాలేజీ విద్యార్థుల ఇబ్బందులు శివ్వంపేట: ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అంటే ఇదే! శివ్వంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి నిధులు పుష్కలంగా ఉన్నా.. అవసరమైన స్థలం కేటాయింపు జరకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. 2008లో శివ్వంపేటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మం జూరైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో తాత్కాలికంగా కాలేజీ ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో చాలీచాలని గదుల్లో ఎంపీసీ, సీఈసీ గ్రూపులు ప్రారంభమయ్యాయి. కాగా, ఎనిమిదేళ్లుగా కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణం చేత గత ఏడాది రెండు గ్రూపులకు సంబంధించి 60 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా.. ఈసారి ప్రవేశాలు సగానికి పడిపోయాయి. రూ.10 కోట్లు మంజూరు కాలేజీ నిర్మాణానికి వారం రోజుల క్రితం రూ.10 కోట్ల మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రూ.8.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించాయి. దీంతో పాటు కరీంనగర్ జిల్లా గొల్లపల్లి, మహబూబ్నగర్ జిల్లా కొడంగల్, ఆదిలాబాద్ జిల్లా దండెపల్లిలో కాలేజీ భవన నిర్మాణాలకు ఈసారి నిధులు మంజూరయ్యాయి. శివ్వంపేటలో భవన నిర్మాణానికి 2010లో రూ.75 లక్షలు మంజూరు కాగా స్థలం కేటాయించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. 2012లో రూ.కోటి మంజూరు కాగా భూమి సమస్యే ఎదురైంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ఈక్రమంలో అనువైన స్థలాన్ని కేటాయిస్తే అన్ని వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి కాలేజీ నిర్మాణం జరుగనుంది. ఇందులో పూర్తిస్థాయి ఫర్నిచర్, కంప్యూటర్, డిజిటల్ క్లాస్, ఆర్వోప్లాంట్, ల్యాబ్ ఏర్పాటుచేయనున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కాలేజీ భవన నిర్మాణానికి సంబంధించిన భూమిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మండల కేంద్రంలో తూప్రాన్-నర్సాపూర్ ప్రధా న రహదారి పరిసరాల్లో ప్రభుత్వ భూ ములు ఉన్న అన్యాక్రాంతం కావడంతో స్థలం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేకు వినతి కాలేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని, భూమి కేటాయింపు చేపట్టాలని రెండు రోజుల క్రితం శివ్వంపేట పర్యటనకు వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యేకు కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు మెమెరాండం ఇచ్చారు. -
భూగర్భంలో కలిసిపోతున్న వినాయకుడి గుడి
► వర్షం వస్తే నీటిలో మునిగిపోవడమే.. ► విగ్రహాలు తొలగించి చేతులు ► దులుపుకున్న అధికారులు సీతానగరం (తాడేపల్లి రూరల్): వినాయకుడి గుడి కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోతోంది. కనకదుర్గమ్మ దత్తత దేవాలయమైన సీతానగరం శ్రీకోదండరామ ఆంజనేయస్వామి ఆలయం, రాష్ట్ర దేవాలయ పరిపాలన విభాగం (సీత కార్యాలయం) మధ్య ఈ గుడి ఉంది. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వల్ల వినాయకుడి గుడికి ఈ పరిస్థితి దాపురించిందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలప్పుడన్నా దేవాదాయ శాఖ అధికారులు దేవాలయాలకు మరమ్మతులు నిర్వహించేవారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరో 70 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సీత కార్యాలయ భవన నిర్మాణంలో భాగంగా వినాయకుడి గుడి పక్కనే 15 అడుగుల మెరక తోలారు. దీనివల్ల వర్షం కురిస్తే దేవాలయం నీటిలో మునిగిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో గుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం, నాగేంద్రస్వామి విగ్రహాలను తీసివేసి, పక్కనున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో భద్రపరిచారు. అప్పటి నుంచి భక్తులకు ఆ విగ్రహాల దర్శన భాగ్యం కలుగడంలేదు. పుష్కరాల కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు కానీ, వినాయకుడి గుడి పునర్నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పక్కనే ఉన్న సీత కార్యాలయానికి కోట్ల రూపాయలు వెచ్చించి అధికారులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు గార్డెన్లు, వాకింగ్ టైల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదట పూజించే బొజ్జ గణపతికి ఆలయ పునర్నిర్మాణం మాత్రం అధికారులు చేపట్టడం లేదు. గత సంవత్సర కాలంలో సీత కార్యాలయానికి దేవాదాయ శాఖ మంత్రి మూడు సార్లు వచ్చారు. అయినా పక్కనే ఉన్న వినాయకుడి గుడి దుస్థితిపై స్పందించలేదు. గతంలో రూ.18 లక్షలతో వినాయక గుడిని పునర్నిర్మించాలని టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని అలా వదిలేయడం మన దేవాదాయ శాఖ అధికారులకే చెల్లింది. -
బహుళ అంతస్తులు.. బీ కేర్ఫుల్..!
బందరు రోడ్డు పక్కన ప్రమాదకరంగా నిర్మాణాలు కుప్పకూలిన మట్టి తప్పిన ప్రమాదం అనుమతులపై అనుమానాలు జాగ్రత్తలు పాటించడం లేదని ఆరోపణలు కానూరు (పెనమలూరు) : మొన్న గుంటూరులో మట్టిపెళ్లలు పడి ఏడుగురు మృతిచెందారు.. ఆ ఘటన మరువకముందే కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు సిరీస్ పక్కన నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం వద్ద శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మట్టి జారిపోయి కుప్పకూలింది. ఈ ఘటనలతో బహుళ అంతస్తుల భవన నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానూరు సిరీస్ పక్కన ఓ బహుళ అంతస్తు భవన నిర్మాణం బందరు రోడ్డుకు ఆనుకుని జరుగుతోంది. భవన నిర్మాణానికి పెద్దఎత్తున మట్టి తొలగించి సెల్లార్ నిర్మిస్తుండడంతో శుక్రవారం వర్షం కారణంగా ఈ నిర్మాణం వద్ద మట్టి ఒక్కసారిగా జారిపోయి కుప్పకూలింది. బందరు రోడ్డుకు, అలాగే కానూరు పంటకాలువ రోడ్డుకు ఆనుకుని పెద్దఎత్తున మట్టి తవ్వి సెల్లార్ పనులు చేస్తున్నారు. సిరీస్ పక్కన పంటకాలువ రోడ్డు కింద ఉన్న మట్టి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఎవ్వరికి ప్రమాదం జరుగకపోయినా స్థానికులు మాత్రం తీవ్ర ఆందోళన చెందారు. బందరు రోడ్డు మార్జిన్ కూడా తక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం బందరు రోడ్డుకు బాగా మార్జిన్ వదలాల్సి ఉంది. మరి అధికారులు ఎలా అనుమతించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మట్టి జారుతుండడంతో బందరు రోడ్డుకు కూడా ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రసూతి ఆస్పత్రికి మహర్దశ
అదనంగా రూ.57.2 కోట్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం 57.30 కోట్లతో మూడువందల పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం రూ.20 కోట్లతో అధునాతన పరికరాల కొనుగోలుకు వెసులుబాటు..! తిరుపతి : రూయా ఆస్పత్రి పరిధిలోని ప్రసూతి(మెటర్నిటీ) ఆస్పత్రికి మహర్దశ పట్టనుంది. మూడు వందల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆస్పత్రికి అదనంగా రూ.57.2 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మెటర్నిటీ ఆస్పత్రి అంచనా వ్యయం రూ.77.30 కోట్లకు పెంచినట్లు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ.సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. రాయలసీమలో ప్రత్యేకమైన ప్రసూతి ఆసుపత్రి ఒక్క రుయా పరిధిలో మాత్రమే ఉంది. ప్రసూతి ఆసుపత్రికి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.20.10 కోట్లతో వంద పడకల ప్రసూతి ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మార్చి 29, 2012న ఉత్తర్వులు జారీచేసింది. భవన నిర్మాణ స్థాయిని వంద పడకల నుంచి మూడు వందల పడకలకు పెంచాలని డిసెంబర్ 14, 2012న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు రూ.57.20 కోట్లను(రూ.37.20 కోట్లతో భవన నిర్మాణం.. రూ.20 కోట్లతో అధునాత పరికరాల కొనుగోలు) మంజూరు చేయాలని కోరింది. ఇందుకు ఆమోదం తెలిపిన కేంద్రం 2013-14లో రూ.20 కోట్లు.. 2014-15లో రూ.37.20 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. 2013-14లో రూ.20 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరం నిధులు ఇప్పటిదాకా విడదల చేయలేదు. దాంతో.. భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని స్విమ్స్ నేతృత్వంలోని శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రుయా ఆసుపత్రి వర్గాలు.. జూనియర్ డాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసూతి ఆసుపత్రికే ఆ భవనాన్ని కేటాయించాలంటూ భారీ ఎత్తున ఉద్యమించారు. ఈ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సెప్టెంబర్లో రుయా ఆసుపత్రికి వెళ్లిన తిరుపతి ఎంపీ వరప్రసాద్.. మూడు వందల పడకల ఆసుపత్రి స్థితిగతులపై సమీక్షించారు. కేంద్రం 2014-15లో నిధులు విడుదల చేయని విషయాన్ని రుయా అధికారవర్గాలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చాయి. నిధుల విడుదలపై కేంద్రంతో చర్చిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ.. అదనంగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదనంగా రూ.20.10 కోట్లు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 27న ప్రతిపాదనలు పంపారు. అంటే.. ప్రసూతి ఆసుపత్రికి నేషనల్ హెల్త్ మిషన్ కింద మొత్తం రూ.77.30 కోట్లను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రతిపాదలనపై కేంద్రం ఆమోదముద్ర వేసింది. రూ.57.30 కోట్లతో మూడు వందల పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం.. రూ.20 కోట్లతో అధునాతన పరికరాలు కొనుగోలు చేయాలని కేంద్రం సూచించింది. నిధులను సకాలంలో విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించడంతో రుయాలోని ప్రసూతి ఆసుపత్రి భవన నిర్మాణం వేగం పుంజుకోనుంది. మూడు వందల పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. గర్భిణులకు సమస్యలు తీరినట్లవుతుందని రుయా అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
మరో 50 కొత్త పాల కేంద్రాలు
బడేవారిపాలెం(కోడూరు) : మరింత పాల ఉత్పత్తి పెంచేందుకుగానూ కృష్ణామిల్క్ యూనియన్ పరిధిలో కొత్తగా మరో 50 పాలకేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కృష్ణామిల్క్ యూనియన్ అధ్యక్షుడు మండవ జానకిరామయ్య చెప్పారు. మండల పరిధిలోని బడేవారిపాలెంలో కొత్తగా నిర్మించిన పాలకేంద్రం నూతన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మండవ మాట్లాడుతూ కృష్ణామిల్క్ యూనియన్ రోజుకు 2.50లక్షల లీటర్లు పాలసేకరణ లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు. దేశంలోనే పాల ఉత్పత్తిదారులకు అత్యధికంగా రూ.47కోట్ల బోనస్ ఇస్తున్న ఘనత కృష్ణామిల్క్ యూనియన్కే దక్కిందన్నారు. బడేవారిపాలెంలో నూతన భవన నిర్మాణం కోసం రూ.30వేలు సాయమందించిన బడే నారాయణరావు, రూ.50 వేలతో భవన నిర్మాణానికి తోడ్పడిన అధ్యక్షుడు మలిశెట్టి వీరబ్రహ్మవెంకటేశ్వరరావును జానకిరామయ్య అభినందించారు. మండవ జానకిరామయ్యతో పాటు అతిథులను పాలకేంద్రం పాలకవర్గం ఘనంగా సత్కరించింది. జిల్లాలో మరో 12బీఎంసీలు... అవనిగడ్డ : జిల్లాలో మరో 12మిల్క్బల్క్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మండవ జానకిరామయ్య తెలిపారు. జిల్లాలోని పడమటిపాలెం, పెడనలో ఇప్పటికే స్థల సేకరణ చేశామని, మోపిదేవి, శ్రీకాకుళం, గరికిపర్రులో ఈ కేంద్రాల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని ఆయన చెప్పారు. స్థానిక మిల్క్బల్క్ సెంటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013-14 ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా లీటరుకు రూ.6 చొప్పున రూ.27కోట్లు పాల ఉత్పత్తిదారులకు బోనస్గా చెల్లించామన్నారు. ప్రస్తుతం పాలసేకరణ ధరను లీటరురూ.55కు పెంచామని తెలిపారు. యూనియన్ మేనేజర్ ఎం.జగన్మోహనరావు, సంఘం డెరైక్టర్లు జాస్తి రాధాకృష్ణ, వేమూరి రత్నగిరి, పామర్రు పాలశీతల కేంద్రం మేనేజర్ గరికపాటి శ్రీధర్, పీఏసీఎస్ అధ్యక్షుడు బడే వెంకటరమణ, ప్రముఖులు బడే నాగరాజు, గుత్తి ప్రసాద్, మారుబోయిన పులేంద్రరావు , బీఎంసీ సూపర్వైజర్ బీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మిల్క్యూనియన్ డెరైక్టర్ జాస్తిని మండవ ఘనంగా సత్కరించారు. -
అనుమతులకు బ్రేక్!
- నగరంలో ఆగిన నిర్మాణాలు - కమిషన్ నివేదికతో తదుపరి చర్యలు - మౌళివాకం ప్రమాదం ఎఫెక్ట్ సాక్షి, చెన్నై: మౌళివాకంలో ప్రైమ్ సృష్టి సంస్థకు చెందిన బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 61 మంది విగత జీవులయ్యారు. ఈ ఘటన అటు అధికారులను, ఇటు నిర్మాణ రంగంలో ఉన్న వారిని కలవరంలో పడే సింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన సీఎండీఏ వర్గాలను వీడటం లేదు. ఆ భవన నిర్మాణంలోని నాణ్యత లోపం కుప్పకూలడానికి ప్రధాన కారణంగా తేలడంతో అధికారులకు ముచ్చెమటలు పెడుతున్నారు. అలాగే, ఏదేని సంఘటన జరిగినప్పుడే స్పందిస్తామన్నట్టుగా ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యత మీద దృష్టి పెట్టే పనిలో అధికారులు పడ్డారు. ఇప్పటి వరకు 400 భవనాలను పరిశీలించారు. కొన్నింటికి నోటీసులు జారీ అయ్యాయి. మరికొన్ని భవనాల నిర్మాణాలను నిలిపేశారు. మరో 300 భవనాలను పరిశీలించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మౌళివాకం ఘటనపై విచారణ వేగవంతం కావడం రిటైర్డ్ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలోని కమిషన్ నివేదిక సిద్ధం చేయడానికి సిద్ధమవుతుండడంతో సీఎండీఏ వర్గాలు కలవరంలో పడ్డాయి. అనుమతులకు బ్రేక్: ప్రత్యేక కమిషన్ నివేదిక తమ మెడకు చుట్టుకునేలా ఉన్న పక్షంలో ఇరకాటంలో పడుతామన్న బెంగ సీఎండీఏ వర్గాల్ని వెంటాడుతోంది. దీంతో ఆ నివేదిక వచ్చే వరకు అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చారు. నెల రోజులుగా కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో అనుమతి దరఖాస్తుల జాబితా రోజురోజుకూ పెరిగి పోతోంది. ఇప్పుడు అనుమతుల్ని మంజూరు చేస్తే, ఏదేని సవరణలు, నిబంధనల్లో మార్పు చేయాల్సిన అవసరం వచ్చిన పక్షంలో తదుపరి భవన యజమానుల వద్దకు అధికారులు పరుగులు తీయాల్సి ఉంటుందని, అందుకే అనుమతులు ఇవ్వడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రత్యేక కమిషన్ తన నివేదికలో తప్పనిసరిగా కొత్త సూచనలు సలహాలు ఇవ్వడం ఖాయమని, అలాగే, ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉందన్నారు. ఇది వరకు ఇచ్చిన అనుమతుల మేరకు అడ్డగోలుగా నిర్మించిన భవనాల్ని క్రమబద్ధీకరించేందుకే తలలు పట్టుకోవాల్సి వస్తోందని మరో అధికారి పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయం ఉత్తర్వులు అమల్లోకి వచ్చే వరకు భవన యజమానులకు పడిగాపులు తప్పవని ఆ అధికారి స్పష్టం చేశారు. ఆగిన నిర్మాణాలు: నగర శివారుల్లో కొన్ని బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలు ఓ వైపు అనుమతులకు దరఖాస్తులు చేసుకుని, మరో వైపు నిర్మాణ పనులు చేపట్టాయి. తాజాగా, అనుమతుల మంజూరుకు బ్రేక్ పడటంతో ఉన్న ఫలంగా నిర్మాణాలు ఆపుకోవాల్సిన పరి స్థితి. అనుమతులు దక్కుతాయన్న ధీమాతో నిర్మాణాలు చేపట్టిన అనేక సంస్థలు, ఇప్పుడు వెనక్కు తగ్గక తప్పడం లేదు. పునాదుల దశలో అనేక భవనాల నిర్మాణాలు నెల రోజులుగా ఆగి ఉన్నాయి. దీంతో కూలీలు పనులు లేక గగ్గోలు పెట్టాల్సి వస్తోంది. రోజు వారీ వేతనాల మీద ఆధార పడిన కూలీలు, పనులు లేని దృష్ట్యా, కొందరు స్వగ్రామాల బాట పడుతుం టే, మరి కొందరు ప్రత్యామ్నాయ పనుల మీద దృష్టి పెట్టారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు మరెందరో సీఎండీఏను ఆశ్రయించారు. ఈ బహుళ అంతస్తుల అడ్డగోలు నిర్మాణాల పుణ్యమా అని, తమ ఇళ్ల నిర్మాణాలకు సైతం అనుమతులు మంజూరు కాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎండీఏ అనుమతులు వచ్చే నాటికి స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగిన పక్షంలో తమ మీద భారం తప్పదంటూ సొంత ఇంటి కల సాకారం చేసుకునే పనిలో ఉన్న మధ్య తరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఒక్క ఫుట్బాల్... ఆ ఊరినే మార్చేసింది!
ప్రపంచమంతా ఫుట్బాల్ మానియాతో ఊగిపోతున్న ఈ సమయంలో, ‘ఫుట్బాల్’ ఆటతో అభివృద్ధి చెంది పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘రుక్ర కలన్’ ఊరి గురించి చెప్పుకోవడం సందర్భోచితమే కాదు స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది. పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఉంది ఈ గ్రామం. చిన్న ఊరే అయినా ఊరి చరిత్రకు మాత్రం పెద్ద పేరు ఉంది. ‘గదర్ ఉద్యమం’లో ఈ ఊరి నుంచి 22 మంది స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు. ఇక ఫుట్బాల్ విషయానికి వస్తే ఈ ఊరు ‘ట్రెండ్ సెట్టర్’గా గుర్తింపు పొందింది. ఈ ఊరి నుంచి అయిదుగురి వరకు అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలలో ఆడారు. జాతీయస్థాయిలో నైతే వందల మంది ఆడారు. ఆట ఆట కోసమేనా? ఆటను ఊరు బాగా కోసం ఉపయోగించుకోలేమా? అని ఆలోచించారు గ్రామస్థులు. తమ ప్రియమైన ఆటను ఊరి సంక్షేమం కోసం వినియోగించాలనుకున్నారు. అలా ఊళ్లో ఫుట్బాల్ క్లబ్ కొత్తగా ఏర్పడింది. ఈ క్లబ్ దేశవ్యాప్తంగా రకరకాల ఫుట్బాల్ టోర్నమెంట్లలో పాల్గొని గెలుచుకున్న బహుమతి మొత్తాన్ని, భవన నిర్మాణం, విద్య, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. దీనికి దాతల సహాయం కూడా తోడైంది. ఆటతో పాటు పాటను కూడా నమ్ముకుంది ఫుట్బాల్ క్లబ్. జిల్లాలో ఉత్సవాలు జరిగినప్పుడు భాంగ్రా నృత్య ప్రదర్శన ఇచ్చి ఆ మొత్తాన్ని కూడా ‘విలేజ్ డెవలప్మెంట్ ఫండ్’కు జత చేసేవారు. గురుద్వారాల దగ్గర సైకిల్స్టాండ్ నిర్వహించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా ఊరి అభివృద్ధికి ఖర్చు చేసేవారు. దీనికి ఊరి పెద్ద రైతులు, ఎన్ఆర్ఐలు తమ వంతు సహాయం అందించడం ప్రారంభించారు. ‘‘మన ఊరికి ఒక మంచి ఫుట్బాల్ మైదానం ఉంటే బాగుంటుంది’’ అని క్లబ్ సభ్యులు అడగగానే ఊరి చివర ఉన్న ఖాళీ స్థలంలో రైతులందరూ కలిసి 300 ట్రాలీల మట్టిని పోశారు. ఫీల్డ్ తయారు చేయడానికి ఆబాలగోపాలం చెమట చిందించింది. మట్టి మీద పచ్చటి గడ్డిని మొలిపించారు. అండర్గ్రౌండ్ ఇరిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. అలా బ్రహ్మాండమైన ఫుట్బాల్ఫీల్డ్ తయారైంది. ఊళ్లో వాళ్లకు ఏ సమస్య వచ్చినా ‘‘మేమున్నాం’’ అంటూ క్లబ్లో ఉన్న 40 మంది సభ్యులు ముందుకు వస్తారు. సంక్షేమ కార్యక్రమాలు... యాభై లక్షల వ్యయంతో గ్రామంలో ‘యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్’ నిర్మించారు. ఇలాంటి కేంద్రం జిల్లాలోనే ఎక్కడా లేదు. ఇందులో కంప్యూటర్ లేబరేటరి, స్టడీ రూమ్లు, మల్టీ యాక్టివ్ రూమ్లు ఉన్నాయి. ఎల్సిడి ప్రాజెక్టర్, థియేటర్ సిస్టమ్, బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో పాటు ఒక ఎన్ఆర్ఐ సహకారంతో అల్ట్రా మోడ్రన్ హెల్త్ క్లబ్ను కూడా నిర్మించారు. దీనిలో కెరీర్ కౌన్సెలింగ్, గైడ్లైన్ సెంటర్తో పాటు చిన్న గ్రంథాలయం కూడా ఉంది. ఊరి ప్రజలకు ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది ఈ కేంద్రం. ఇక సెమినార్ హాల్లో గ్రామ అభివృద్ధి గురించి రకరకాల చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. దేశం నలుమూలల్లో తమ తమ ఊరి అభివృద్ధికి పాటు పడిన వారి ఉపన్యాసాలు ఉంటాయి. పేద విద్యార్థుల కోసం క్లబ్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ కేంద్రం, బ్యూటీషియన్ ట్రైనింగ్ సెంటర్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లు నడుస్తున్నాయి. శిక్షణ తీసుకునేవారికి ఉపకారవేతనం కూడా ఇస్తారు. ఆయన వల్లే... ఊరి వారందరిని ఏకతాటిపై నడిపించిన ఘనత గురుమంగళ్ దాస్ సోనికి దక్కుతుంది. అమెరికాలోని ‘యూనివర్శిటీ ఆఫ్ నెవద రెనో’లో ఇంజనీరింగ్ చదువుకున్న దాస్కు ఊరంటే ఎంతో ప్రేమ. అయితే చాలామందిలా ఆ ప్రేమ మాటలకే పరిమితం కాలేదు. ఊరి వాళ్లకు ఫుట్బాల్ ఆట అంటే వ్యామోహం అనే విషయం అతనికి తెలుసు. అందుకే- ‘ఆటతో అభివృద్ధి’ అనే నినాదంతో రంగంలోకి దిగాడు. గ్రామంలోని తన ఇంట్లో పుట్బాల్ దిగ్గజాలుగా పేరున్న స్థానిక ఆటగాళ్లతో సమావేశం నిర్వహించాడు. వారి నుంచి సూచనలు తీసుకున్నాడు. గ్రామ యువకులకు ఫుట్బాల్లను ఉచితంగా పంచిపెట్టాడు. యూరప్లోని వివిధ దేశాలకు వెళ్లి అక్కడి స్వచ్ఛందసంస్థలు, ఫుట్బాల్క్లబ్లతో మాట్లాడి నిధుల సమీకరణ చేశాడు. ఏదో ఒకరోజు ఫుట్బాల్ ఆటలో తమ ఊరు అంతర్జాతీయ స్థాయికి వెళుతుందనేది దాస్ కల. ఆయన కల నెరవేరే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది! ఒక పద్ధతి ప్రకారం, శాస్త్రీయంగా పిల్లలకు శిక్షణ ఇస్తే ఫుట్బాల్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. ఏదో ఒక రోజు అంతర్జాతీయ స్థాయిలో మా ఊరి ఆటగాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. - గురుమంగళదాస్ -
‘అభివృద్ధి’ లక్ష్యాలు సాధించండి : కలెక్టర్
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్లైన్ : జిల్లాలోని వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఎం.రఘునందన్రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం అధికారులతో ఆయా శాఖల పరిధిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు ఈ నెల 25లోగా లక్ష్యాలు సాధించేలా చూడాలన్నారు. గృహనిర్మాణం, హాస్టల్ భవనాల నిర్మాణం, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు నిర్మాణ దశలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. సంక్షేమశాఖకు సంబంధించి వసతి గృహాల్లోని విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ వెంటనే పంపిణీ చేయాలని చెప్పారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు 35 శాతం రెన్యువల్ చేసినట్లు, కొత్తగా వచ్చిన దరఖాస్తులకు వెంటనే స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యాలు సాధిస్తామని అధికారులు కలెక్టర్కు వివరించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం అమలు చేస్తున్న జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం రెండో దశ పాఠశాలల్లో వేసవి సెలవులు ఇవ్వకముందే అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. సర్పంచులకు శిక్షణ ఇప్పుడే పూర్తయ్యిందని, వార్డు సభ్యులకు మాత్రం షెడ్యూలు ప్రకారం మార్చి ఏడో తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమం కింద సామూహిక వివాహాలు కార్యక్రమం, నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. ఈవీఎం గోడౌన్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి... కలెక్టరేట్లో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీలం తుపాను పంట నష్టపరిహారం రైతులకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. సొంత భవనాలు లేని 15 సీడీపీవో కార్యాలయాలకు స్థలాల సేకరణ త్వరగా చేయాలని చెప్పారు. పీహెచ్సీల భవన నిర్మాణాలు, ప్రారంభించిన వాటిని పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ ద్వారా మత్స్యకారులకు వివిధ పథకాల కింద పంపిణీ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మెరైన్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించామని, స్థలాల సేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, సీపీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, డీపీవో కె.ఆనంద్, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, డీఎంఅండ్హెచ్వో సరసిజాక్షి, ఆర్వీఎం పీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
అందమైన సత్రం రాజకీయ చిత్రం
వేములవాడలోని మున్నూరుకాపు ధర్మసత్రం అధ్యక్షునిగా ఉన్న కొండా దేవయ్య విరాళాల సేకరణ మొదలు.. భవన నిర్మాణంలో అన్నీ తానై అన్నట్లు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అదే సమయంలో దేవయ్యకు రాజకీయ నేపథ్యం ఉండటం, ఎన్నికల తరుణంలో ప్రారంభోత్సవానికి హడావుడి పడుతుండటం హాట్ టాపికైంది. చిరంజీవి అభిమానిగా గుర్తింపు సాధించిన కొండా గత ఎన్నికల్లో వేములవాడ నుంచి పీఆర్పీ టికెట్ ఆశించారు. ఆఖరి నిమిషంలో భంగపడటంతో స్వతంత్య్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో నిలిచారు. 5వేల పైచిలుకు ఓట్లతో అయిదు స్థానంలో నిలిచారు. అప్పట్నుంచీ ప్రధాన పార్టీలకు దూరంగా ఉన్న కొండా దేవయ్య వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారా? అందుకే ఈ సంఘ భవనాన్ని పాచికగా వాడుకొని.. అదే ప్రధాన ఆకర్షణగా మలుచుకుంటున్నారా? అనే చర్చలు జోరందుకున్నాయి. అందుకు తగ్గట్లుగానే తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చిరంజీవిని రప్పించేందుకు కొండా పట్టుబట్టి.. జిల్లాలోని అధికార పార్టీ ముఖ్యుల సాయంతో పర్యటన ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవం రోజున తమ సంఘం ప్రతినిధులతో భారీ ర్యాలీ చేపట్టి బల ప్రదర్శన చేసుకునేందుకు దేవయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విరాళాలతో నిర్మించిన ధర్మ సత్రంతో సొంతంగా రాజకీయం చేస్తున్నాడని, సంఘ బలాన్ని తన బల ప్రదర్శనకు వాడుకుంటున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. -
ఆ కాస్తా నిర్మిస్తే..
ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్: ఇబ్రహీంపట్నం సమీపంలో వినోబానగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన నిర్మాణం పనులను పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భవన సముదాయానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 126 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని 2008లో ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఇబ్రహీంపట్నం, శంషాబాద్, వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో హాస్టళ్ల భవనాలను నిర్మించాలని సంకల్పించారు. ఒక్కో హాస్టల్ భవనానికి రూ.కోటీ 60 లక్షలు మంజూరయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర హాస్టళ్లన్నింటినీ ఒకే సముదాయంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వినోబానగర్ వద్ద భవన నిర్మాణానికి భూదాన్ భూమిని కేటాయించారు. ఫిబ్రవరి 19, 2009న అప్పట్లో గనుల శాఖా మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవ న నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటికీ అరకొర పనులు జరిగాయి. గ్రౌండ్ఫ్లోరులో కొన్ని భవనాల నిర్మాణం పూర్తి కాగా మొదటి ఫ్లోరులో భవనాల నిర్మాణాలు కేవలం స్లాబ్కే పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో తెలియదు గానీ కొన్నాళ్లుగా పనులే జరగడం లేదు. ఇదిలా ఉండగా గ్రౌండ్ఫ్లోర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల్లోకి ఇబ్రహీంపట్నంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టళ్లను తరలించాలని అధికారులు ఇటీవలే నిర్ణయించారు. ఈ రెండు హాస్టళ్లలో దాదాపు 300 మంది బాలికలున్నారు. అయితే వీరికి గదులు సరిపోకపోవడంతోపాటు ఇతరత్రా పలు సమస్యలు ఎదురయ్యాయి. ఈ భవనాలకు ప్రహరీ నిర్మించకపోవడం సమస్యగా మారింది. బాలికల హాస్టళ్లకు ప్రహరీ గోడలు తప్పనిసరి. దీంతో బాలికల హాస్టళ్ల తరలింపును విరమించుకున్నారు. ఇదిలాఉంటే హాస్టళ్లకు ప్రహరీలు నిర్మాణానికి కలెక్టర్ శ్రీధర్ కొన్నాళ్ల క్రితమే నిధు లు మంజూరు చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఒకరు ‘న్యూస్లైన్’కు తెలిపారు. ప్రహరీ నిర్మాణం పనులు పూర్తికాగానే హాస్టళ్లను అక్కడికి తరలించడం జరుగుతుందన్నారు. -
ఉసురు తీస్తున్న నిర్లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం.. బహిరంగ ప్రదేశాల్లో తవ్వి వదిలేసిన గుంతలు, మూతల్లేని సంపులు, మ్యాన్హోళ్లు, పైకప్పులేని నాలాలు.. ఇవన్నీ ప్రాణాంతకంగా మారుతున్నాయి. క్షణాల్లో విలువైన ప్రాణాల్ని హరిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో సరైన రక్షణ ఏర్పాట్లు చేయని యంత్రాంగం, అటువంటి చోట్లకు వెళ్లకుండా చూడటంలో ఒక్కోసారి పెద్దలు చూపే ఆదమరుపు పిల్లల్ని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి. ఈ తరహా దుర్ఘటనలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. గుంతల్లో మునిగి, సంపుల్లో పడి చనిపోతున్న వారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. శుక్రవారం నాచారంలో ఓ భవన నిర్మాణం కోసం తవ్వి వదిలేసిన గుంతలో ఈత కొట్టేందుకు దిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన కూడా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ గుంతలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. చుట్టూ రక్షణ ఏర్పాట్లు లేవు. పాఠశాలకు వెళ్లిన చిన్నారులు ఇక్కడకు ఈత కొట్టేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. భవన నిర్మాణ యాజమాన్యం గుంత చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేపట్టి ఉంటే ఈ దుర్ఘటన చోటుచేసుకునేది కాదని స్థానికులు అంటున్నారు. రోజూ మాదిరిగానే పిల్లలు స్కూలు నుంచి ఇంటికి చేరుకుంటారని తల్లిదండ్రులు భావించారు. కానీ అనుకోని రూపంలో విషాదం వారి కుటుంబాలను కకావికలం చేసింది. అవగాహన లేక కొంత.. పొరుగు జిల్లాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న వారికి స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండట్లేదు. భవన నిర్మాణాల కోసం తవ్వి వదిలేస్తున్న గుంతలు, మూతల్లేని సంపులు వంటి వాటి గురించి వీరికి పెద్దగా తెలియట్లేదు. పైగా, కుటుంబపోషణ నిమిత్తం కూలీ పనులకు వెళ్లిపోతున్నారు. దీంతో పిల్లలపై నిఘా, పర్యవేక్షణ కరువవుతున్నాయి. ఇక, పిల్లల ఆలనాపాలనా ఇంటి పట్టున ఉండి చూసుకునే పెద్దదిక్కు కరువవుతోంది. ఇదే వారి కుటుంబాల పాలిట శాపమవుతోంది. ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యమూ చిన్నారుల ఉసురు తీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లోని సంపులు, నీటి గుంతలు ఉన్న చోట్ల రక్షణ ఏర్పాట్లు మర్చిపోతున్నారు. ఇక ఓపెన్ నాలాలు, మ్యాన్హోళ్ల విషయం వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీ అపశృతులకు కారణమవుతున్నాయి. చిన్నారులకు కుతూహలం మరికొంత.. పరిపక్వత లేని పసి మనసులు. అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూసే కళ్లు. ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలం. పెద్దలు ఏ పనులు చేయొద్దని వారిస్తారో అదే చేయడానికి పిల్లలు ఉత్సుకత చూపిస్తారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు నీళ్లు సైతం వీరికి ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. తరచు వాటి వద్దకు వెళ్లాలని, ఆడుకోవాలని చూస్తుంటారు. పెద్దలు ఏమాత్రం ఆదమరుపుగా ఉన్నా ఆటలు, సరదా పేరుతో ఈత కొలనులు, గుంతలు వద్దకు చేరుకుంటున్నారు. ఆ సరదానే ప్రాణాల మీదికి తెస్తోంది.