candidates list
-
Delhi Elections: బీజేపీ రెండవ జాబితా విడుదల
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయపార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీచేయబోయే అభ్యర్థుల రెండవ జాబితాను బీజేపీ విడుదల చేసింది.ఈ జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కపిల్ మిశ్రా(Kapil Mishra)ను కరవాల్ నగర్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. లక్ష్మీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి అభయ్ వర్మను బరిలోకి దింపింది. వర్మ ఈ స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 58 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ 29 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. కరవాల్ నగర్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కపిల్ మిశ్రాను అభ్యర్థిగా ప్రకటించింది. మోతీనగర్ నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా కుమారుడు హరీష్ ఖురానాను పార్టీ బరిలోకి దింపింది.ఐదుగురు మహిళా అభ్యర్థులుబీజేపీ ప్రకటించిన రెండవ జాబితాలో ఐదుగురు మహిళా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మొదటి జాబితాలో పార్టీ ఇద్దరు మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. ఇప్పటివరకు పార్టీ ఏడుగురు మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. పార్టీ నీలం కృష్ణ పెహల్వాన్ను నజాఫ్గఢ్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి చెందిన కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం నజాఫ్గఢ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ ఆలయ సెల్ అధ్యక్షునిగా కర్నైల్ సింగ్కు పార్టీ షకుర్ బస్తీ టికెట్ ఇచ్చింది. వివిధ స్థానాల నుంచి..ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్ను ఆ పార్టీ కొండ్లి నుంచి పోటీకి దింపింది. దీనితో పాటు తిమార్పూర్ నుండి సూర్య ప్రకాష్ ఖత్రి, నరేలా నుండి రాజ్ కరణ్ ఖత్రి, కిరాడి నుండి బజరంగ్ శుక్లా, చాందినీ చౌక్ నుండి సతీష్ జైన్, సుల్తాన్పూర్ మజ్రా (ఎస్సీ) నుండి కరం సింగ్ కర్మ, ముండ్కా నుండి గజేంద్ర దరాల్, సదర్ బజార్ నుండి మనోజ్ కుమార్ జిందాల్లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఉత్తమ్ నగర్ నుండి పవన్ శర్మ, వికాస్పూర్ నుండి పంకజ్ కుమార్ సింగ్, కస్తూర్బా నగర్ నుండి నీరజ్ బసోయా, మటియాలా నుండి సందీప్ సెహ్రావత్, ద్వారక నుండి ప్రద్యుమాన్ రాజ్పుత్, పాలం నుండి కుల్దీప్ సోలంకి, రాజిందర్ నగర్ నుండి ఉమాంగ్ బజాజ్, తుగ్లకాబాద్ నుండి రోహ్తాస్ బిధురి, సీలంపూర్ నుండి మనీష్ చౌదరిలను ఎన్నికల్లో పోటీకి నిలిపింది. మొదటి జాబితాలో కూడా 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.ఫిబ్రవరి 5న ఒకే దశలో ఎన్నికలుఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించి, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.89 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. మొదటిసారి ఓటు వేయబోయే మొత్తం ఓటర్ల సంఖ్య 2.08 లక్షలు. ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు 13 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 830గా ఉంది. ఇది కూడా చదవండి: ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం -
అతిశీపై అల్కా లాంబా పోటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉంది. కేవలం ఒక్క అభ్యర్థి ఆల్కా లాంబా పేరుతో శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది. కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిశీపై కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత ఆల్కా లాంబా పోటీ చేయబోతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. ప్రస్తుతం అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆల్కా లాంబా 2015లో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థిగా నెగ్గడం గమనార్హం. -
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
నేతలు పార్టీలు మారడం, సిద్ధాంతాలు మార్చుకోవడం రాజకీయాల్లో పరిపాటే. చాలా ఏళ్లుగా ఉన్న ధోరణే. కానీ సిద్ధాంతాలు, విలువలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే బీజేపీ కొన్నాళ్లుగా ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేస్తుండటం విశేషం. ఈ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలో ఉన్న 435 మంది బీజేపీ అభ్యర్థులను గమనిస్తే ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి. వీరిలో ఏకంగా 106 మంది, అంటే నాలుగో వంతు అభ్యర్థులు గత పదేళ్లలో కమలం గూటికి వలస వచి్చనవాళ్లే! అందులోనూ 90 మంది గత ఐదేళ్లలో బీజేపీలోకి ఫిరాయించారు! ఈసారి ఎలాగైనా 2019 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలని అధికార బీజేపీ ప్రయతి్నస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రాంతీయ పారీ్టల్లో టికెట్లు రాని వారు, మోదీ మేనియా కలిసొస్తుందని భావించిన వాళ్లు ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా వారిలో ఏకంగా ఐదుగురు 2019 తర్వాతే పార్టీ తీర్థం తీసుకోవడం విశేషం! తెలంగాణలోనూ 17 మంది బీజేపీ అభ్యర్థుల్లో 11 మంది 2014 తర్వాత వచ్చి చేరిన వారే. వీరిలో చాలామంది మాజీ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ నేతలే. ఇతర రాష్ట్రాల్లోనూ అంతే.. ఏపీ వంటి చోట్ల బీజేపీ బలహీనంగా ఉంది గనుక వలస నేతలకు పెద్దపీట వేసిందనుకుంటే పార్టీ అత్యంత బలోపేతంగా ఉన్న యూపీ, హరియాణా తదితర చోట్లా ఇదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగించేదే! హరియాణాలోని 10 లోక్సభ స్థానాల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్నవారిలో ఆరుగురు 2014 తర్వాత పారీ్టలో చేరినవారే. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ అయితే లోక్సభ ఎన్నికల ముందే బీజేపీ కండువా కప్పుకున్నారు. పీసీసీ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ కూడా అంతే. ఇక యూపీలో బీజేపీ సొంతంగా పోటీ చేస్తున్న 74 లోక్సభ స్థానాలను చూస్తే 23 చోట్ల బరిలో ఉన్నవాళ్లు బయటి నుంచి వచి్చనవారే. అంటే ఏకంగా 31 శాతం! పంజాబ్లోని 13 స్థానాల్లో ఏకంగా ఏడుగురు బీజేపీ అభ్యర్థులు వలస వచి్చన బాపతే. వీరిలో చాలామంది కాంగ్రెస్ మాజీలే. వీరు చాలావరకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసినప్పుడు బీజేపీలోకి వచ్చారు. జార్ఖండ్లో కూడా 13 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఏడుగురు జేఎంఎం, కాంగ్రెస్, జార్ఖండ్ వికాస్ మోర్చాల నుంచి జంప్ చేసిన నేతలే. వీరిలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరదలు సీతా సోరెన్ కూడా ఉన్నారు. ఒడిశాలో 29 శాతం, తమిళనాడులో 26 శాతం మంది బీజేపీ అభ్యర్థులు ఫిరాయింపుదారులే! మహారాష్ట్రలోనూ పావు వంతు బీజేపీ అభ్యర్థులు బయటి నుంచి వచ్చిన బాపతే. ఎందుకని..? బీజేపీ బలహీనంగా ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలే గాక బలంగా ఉన్నచోట కూడా ఇలా ఫిరాయింపులను భారీగా ప్రోత్సహిస్తుండటం వెనుక విజయమే పరమావధి అంటున్నారు. మరీ ముఖ్యంగా గత రెండు లోక్సభ ఎన్నికల నుంచి యూపీలో బీజేపీ హవా నడుస్తోంది. అయినా అక్కడ కూడా 31 శాతం మంది వలసదారులకు టికెట్లివ్వడం ఇందుకు నిదర్శనం. ప్రత్యర్థి పారీ్టలు బలమైన అభ్యర్థులను దింపిన చోట బీజేపీ ప్రధానంగా ఫిరాయింపుదారులనే నమ్ముకుంది. తనకు గెలుపు గుర్రాలు లేరనుకున్న లోక్సభ స్థానాల్లో ఇతర పారీ్టల నుంచి బలమైన నాయకులను ఆకర్షించేందుకు బీజేపీ ఏమాత్రం వెనుకాడటం లేదు!ప్రముఖ జంపర్లు జ్యోతిరాదిత్య సింధియా (కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత–గుణ) జితిన్ ప్రసాద (కాంగ్రెస్ మాజీ నేత–పిలిభీత్) నవీన్ జిందాల్ (ప్రముఖ పారిశ్రామికవేత్త–కురుక్షేత్ర) అశోక్ తన్వర్ (హరియాణా పీసీసీ మాజీ చీఫ్–సిర్సా) ప్రణీత్ కౌర్ (అమరీందర్సింగ్ భార్య–పటియాలా) సీతా సోరెన్ (జేఎంఎం ఎమ్మెల్యే–దుమ్కా)– సాక్షి, నేషనల్ డెస్క్ -
పెండింగ్ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం.. పెండింగ్ స్థానాలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. నాలుగు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లతో శుక్రవారం మధ్యాహ్నాం జాబితా విడుదల చేసింది టీడీపీ. లోక్సభ స్థానాల్లో భాగంగా.. విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఖరారు చేసింది. అలాగే.. అనంతపురం అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయనణ, కడప నుంచి భూపేష్రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇక తొమ్మిది అసెంబ్లీ స్థానాలకుగానూ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తానికి పంతం నెగ్గించుకుని గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి సీటు దక్కించుకున్నారు. విజయనగరం చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీకి మరో సీనియర్ కళా వెంకట్రావ్ను చంద్రబాబు ముందుంచారు. దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి అవకాశం కల్పించారు. కదిరిలో యశోదా దేవిస్థానంలో కందికుంట వెంకట ప్రసాద్కు ఛాన్స్ ఇచ్చారు. బీసీలకు వెన్నుపోటు మొత్తం మీద లోక్ సభ సీట్లకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే బీసీలకు వెన్నుపోటు అన్నది పూర్తిగా స్పష్టమవుతోంది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను కూటమి కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 ఆన్ రిజర్వ్డ్ సీట్లలో ఏకంగా 11 సీట్లను బీసీలకు కేటాయించింది. టీడీపీ కూటమి మాత్రం 20 ఆన్ రిజర్వ్ సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలోనూ చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకున్నారు. కూటమి తరపున 25 సీట్లకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. కాపులకు 17 లోక్ సభ సీట్లలో ఒక్క సీటు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. భీమిలిలో బేరాలు భీమిలిలో గంటా టికెట్ విషయంలో చివరివరకు డ్రామా నడిచింది. ఈ సీటు విషయంలో గంటాకు ఇవ్వడానికి ససేమిరా అన్న చంద్రబాబు.. చీపురుపల్లిలో పోటీ చేయాలని గంటాకు సూచించారు. అయితే గంటా మాత్రం ఓడిపోయే సీటు నాకెందుకంటూ పేచీ పెట్టారు. భీమిలి సీటు ఇస్తే.. ఎంత ఖర్చయినా పెడతానంటూ గంటా ముందుకురావడంతో చంద్రబాబు ఓకే అన్నట్టు తెలిసింది. భీమిలితో పాటు జిల్లాలోని కనీసం నాలుగు చోట్ల ఖర్చంతా పెట్టుకోవాలని గంటాకు షరతు పెట్టినట్టు తెలిసింది. ఓడిపోయే సీటు నాకు వద్దు బాబోయ్.. అని కళా వెంకట్రావు అరిచి గీ పెట్టినా.. ఆయనకు మళ్లీ చీపురుపల్లిని అంటగట్టాడు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కళాకు సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర విమర్శలు రావడంతో.. కళా వెంకట్రావుకు చీపురుపల్లిని ఇచ్చినట్టు తెలిసింది. వారసులకు మొండి చేయి అనంతపురంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరికి నిరాశ మిగిలింది. జేసీ వారసుడు పవన్ కుమార్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. ఇటీవల పరిటాల శ్రీరామ్కు కూడా చంద్రబాబు మొండిచేయే చూపించాడు. ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ను పరిటాల శ్రీరామ్ ఆశించగా.. ఆ టికెట్ను బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయించాడు. దీంతో ఇక్కడ పరిటాల శ్రీరామ్ బద్ధ శత్రువు వరదాపురం సూరికి టికెట్ దక్కింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సూరికి.. టీడీపీ ఇంఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ ఏ మాత్రం మద్ధతివ్వబోడని బహిరంగంగానే అంటున్నారు. చంద్రబాబు పెనుకొండ మీటింగ్ సందర్భంగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. గుమ్మనూరు విషయంలో ఏం జరిగింది? గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను ప్రకటించాడు చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో టిడిపిని సుదీర్ఘకాలం నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కు బాబు వెన్నుపోటు పొడిచినట్టయింది. జయరాంకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జితేంద్రగౌడ్కు చివరకు నిరాశే మిగిల్చాడు చంద్రబాబు. చివరిక్షణంలో YSRCP నుంచి వచ్చిన గుమ్మనూరుకు టికెట్ ఎలా ఇస్తారంటూ స్థానిక టిడిపి నేతలు ఊసురుమంటున్నారు. ఇన్నాళ్లు గుమ్మనూరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన తాము.. ఇప్పుడు ఆయన్ను గెలిపించాలని ఓటర్లను ఎలా అడుగుతామని అంటున్నారు. చివరికి గుమ్మనూరు ఓడిపోతాడని IVRS సర్వేల్లో తేలినా.. వెన్నుపోటు అన్న ప్రచారానికి భయపడి సీటు కేటాయించినట్టు తెలిసింది. మొత్తమ్మీద ఈ వ్యవహారం వెనక భారీగా డబ్బు లావాదేవీలు జరిగినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. గుమ్మనూరు డబ్బు సమర్పించుకోవడం వల్లే జితేంద్రకు అన్యాయం జరిగిందంటున్నారు. -
ఎనిమిది చోట్ల ఖరారుపై తకరారు!
ఆదిలాబాద్ ఈ లోక్సభ సీటులో స్థానిక నేతలు కాకుండా బయటి నుంచి తెచ్చిన వారిని పోటీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రమేశ్ రాథోడ్ ఇప్పుడు పార్టీలో లేరు. అంతకంటే ముందు పోటీచేసిన డాక్టర్ నరేశ్ జాదవ్ పార్టీలోనే ఉన్నా వేరే అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రిమ్స్లో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సుమలత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణలలో ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వీరిలో సుమలత పేరు ఖరారైందని తొలుత ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆత్రం సుగుణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వరంగల్ ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటించిన రెండు ఎస్సీ రిజర్వుడ్ సీట్లను మాల సామాజిక వర్గానికే ఇచ్చారు. దీంతో ఇక్కడ మాదిగ సామాజికవర్గ నేతకే చాన్స్ ఇవ్వనున్నారు. తొలుత దొమ్మాట సాంబయ్య పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ పార్టీలోకి రావడంతో ఆయన వైపు మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. ఈ ఇద్దరితోపాటు గతంలో లోక్సభకు పోటీచేసిన డాక్టర్ రాగమళ్ల పరమేశ్వర్ కూడా టికెట్ అడుగుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థిని తేల్చడంలో గందరగోళం కనిపిస్తోంది. కరీంనగర్ : ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. వెలిచాల రాజేందర్రావు పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ ప్రవీణ్రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని అంటున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. నిజామాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పోటీ చేస్తారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బాల్కొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ముత్యాల సునీల్రెడ్డి కూడా ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఇక్కడ జీవన్రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందని చెప్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. ఖమ్మం: ఈ ఎంపీ సీటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్టాపిక్గా మారింది. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులలో ఎవరికి అవకాశం అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మల్లు నందిని, పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల యుగంధర్లతోపాటు పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ అడుగుతున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారా? కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తారా? బీసీ వర్గాలకు టికెట్ ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. భువనగిరి: ఇక్కడ కూడా ఖమ్మం లోక్సభ స్థాయిలో పోటీ నెలకొంది. ఈ సీటుకు సంబంధించి తొలినుంచీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అనుచరుడు చామల కిరణ్కుమార్రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి పేరును సీరియస్గా పరిశీలించారు. అయితే రాజగోపాల్రెడ్డి మాత్రం తాము టికెట్ అడగడం లేదని, లోక్సభ ఎన్నికల తర్వాత తాను మంత్రిని అవుతానని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పార్టీలోకి వస్తారని, ఆయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన మరో నాయకుడు పవన్రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. తాజాగా బీసీ నేతకు భువనగిరి టికెట్ వస్తుందనే చర్చ జరుగుతోంది. దీనితో గందరగోళంగా మారింది. మెదక్: ఈ లోక్సభ సీటును బీసీలకు ఇస్తారని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి, పటాన్చెరు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీచేసి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చిన నీలం మధు ముదిరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష కూడా పోటీలో ఉన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల తనకు మెదక్ ఎంపీ టికెట్ కావాలని అడిగినా.. ఆమెను టీజీఐఐసీ చైర్మన్గా నియమించడంతో రేసు నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. మెదక్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ హైదరాబాద్ టికెట్ విషయంలోనూ ఏమీ తేలలేదు. ఇక్కడ ఎంఐఎంకు ప్రతిగా ఎంబీటీని ప్రోత్సహించాలని తొలుత భావించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దింపాలని తర్వాత నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్, ఫిరోజ్ఖాన్తోపాటు అలీ మస్కతిల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా న్యాయవాది షహనాజ్ తబసుమ్ అభ్యర్థిత్వాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నారు. ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఎలాంటి స్పష్టతా లేదు. -
TDP : మూడో జాబితా చూస్తే వెన్నుపోటు అంటే ఏంటో తెలుస్తుంది
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఉదయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఆశావహుల్లో కొందరికి అధిష్టానం మొండి చేయి చూపించింది. సీనియర్లలో కొందరికి సీట్లు దక్కగా.. మరికొందరికి మాత్రం చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసుకున్న చంద్రబాబు.. బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు అంటే రుచి చూపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ మరీ.! భీమిలి నుంచి గంటాకు నో, మూడో జాబితాలో మొండి చేయి, చీపురుపల్లి నుంచి చేస్తే చేయ్.. లేదంటే తప్పుకో అంటూ గంటాకు సూచన చేసినట్టు తెలిసింది. తెలుగుదేశం రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు శ్రీకాకుళంలో సీటు ఆశించి భంగపడ్డ గుండా లక్ష్మీదేవి, డబ్బు సంచులకే ప్రాధాన్యం తనను పక్కనబెట్టారని అంటున్నారు విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్కు చోటు దక్కకుండా చక్రం తిప్పాడు, బాలకృష్ణ తోడల్లుడి కొడుకు భరత్కు విశాఖ ఎంపీ సీటు ప్రకటించాడు, కేవలం కుటుంబ సభ్యుల కోసమే విశాఖ సీటును టిడిపికి అప్పగించారని పురందేశ్వరీ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిజమైన బీజేపీ కార్యకర్తలకు కాకుండా.. కుటుంబ సభ్యుల కోసం పార్టీని తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. మైలవరంలో దేవినేని ఉమా మొదటి నుంచి ఆరోపిస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగానే వంద కోట్లు ఇచ్చిన కృష్ణప్రసాద్కు టిడిపి టికెట్ ఇచ్చినట్టు తాజా జాబితా బట్టి తేలిపోయింది. డబ్బుల పోటీలో దేవినేని ఉమా వెనకబడిపోయారు. పార్టీలో చేరగానే వసంతకు టికెట్ ఇచ్చాడు బాబు. డబ్బు సంచులకే టికెట్లు అన్నది శ్రీకాకుళంలో పక్కాగా నిరూపణ అయింది. శంకర్, గోవింద్రావు ఇద్దరిది అదే అర్హత అన్న విమర్శలున్నాయి పెనమలూరు టికెట్ పార్ధసారధి యాదవ్కు ఇస్తానని టీడీపీ లోకి తీసుకొని నూజివీడుకు పంపించారు చంద్రబాబు. అక్కడ బోడె ప్రసాద్ చౌదరికి ఇచ్చాడు. అలాగే గత ఎన్నికల్లో వైఎస్సార్సిపి నుంచి ఎన్నికైన ఉండవల్లి శ్రీదేవిని ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశ పెట్టి ఓటు వేయించుకున్నాడు. తీరా అవసరం తీరిన తర్వాత మొండిచేయి చూపించాడు బాబు. కాపు ,యాదవ, చేనేత ,బిసీ సామాజిక వర్గాలకు పోటీగా కమ్మలను రంగంలోకి దించినట్టు తేలిపోయింది. విశాఖ ఎంపీగా భరత్ (కమ్మ) vs బొత్స ఝాన్సీ (కాపు) గుంటూరు ఎంపీ గ పెమ్మసాని (కమ్మ) vs కిలారు రోశయ్య(కాపు) నరసారావు పేట ఎంపీగా లావు vs అనిల్ యాదవ్ (యాదవ బీసీ) మంగళగిరి లో లోకేష్ vs కాండ్రు లావణ్య (చేనేత బీసీ ) కుప్పం లో బాబు vs భరత్ (వన్నెకుల క్షత్రియా బిసీ ) -
YSRCP సిద్ధం : వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులు వీరే
Updates సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు 50 శాతం స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్థానాలకు కేటాయించాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఎప్పుడూ జరగలేదు. దాదాపు 99 స్థానాల్లో మార్పులు చేశాం. ప్రజల మీద నమ్మకంతో మార్పులు చేశాం. టికెట్ రాని వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇదే నా భరోసా. విప్లవాత్మక మార్పులతో ఈ ఐదేళ్ల పాలన జరిగింది. ఎక్కడా లంచం లేకుండా సంక్షేప పథకాలు ప్రజలకు అందాయి. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో ఇది లిఖించదగిన అంశం. గ్రామాలు మారాయి. స్కూల్స్ బాగుపడ్డాయి. ఆసుపత్రులు మారాయి. మహిళా సాధికారత, సామాజిక న్యాయం చేసి చూపించాం. మార్పులను ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం మరింత ఎక్కువగా అందిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థులు వీరే.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన నందిగామ సురేష్.. అనకాపల్లి స్థానం పెండింగ్లో ఉంది. మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు 200 సీట్లకు గాను 100 స్థానాలు కేటాయించారు. సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయింపు. ఎంపీల విద్యార్థత.. 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే. ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు. 25 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు. ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్. ఎమ్మెల్యేల విద్యార్హత.. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు. 77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయింపు. 2024 ఎన్నికల బరిలో 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు. 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు. 25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. ►ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే అదనంగా 11 సీట్లు కేటాయించిన సీఎం వైఎస్ జగన్. ►2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయింపు. ►2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. 2024లో నాలుగు స్థానాలు పెంపు. ►2019లో మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా.. 2024లో మరో రెండు స్థానాలు పెంచి ఏడు స్థానాలు కేటాయింపు. ►2019లో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే.. ఈసారి ఒకసీటు అదనంగా మూడు సీట్లకు పెంపు. ►2019లో ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు, బీసీలకు 12 సీట్లు కాగా.. 2024లో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయింపు. ►2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయింపు. ►2024 ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపు. ►2019లో మహిళలు, మైనార్టీలకు 18 సీట్లు ఇస్తే.. ►2024లో ఆరు సీట్లు పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 24 సీట్లు ఇచ్చి తన మార్క్ చాటుకున్న సీఎం జగన్. ►2019 ఎన్నికల్లో మహిళలకు 15 చోట్ల ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. ఈసారి ఆరు సీట్లు పెంచి 24 చోట్ల అవకాశం. ►2024 ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 14 ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు. వైఎస్సార్ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ వైఎస్సార్ సమాధి వద్ద పూలమాలలతో నివాళులర్పిస్తున్న సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు కాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్ కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ కాసేపట్లో ప్రత్యేక హెలికాఫ్టర్లో ఇడుపులపాయకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ ►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ►గన్నవరం నుండి కడప ఎయిర్ పోర్ట్ కి బయల్దేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జాబితాలో పెద్దగా మార్పులు ఉండవు: సజ్జల అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యం మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం వైఎస్సార్సీపీ తుది జాబితాలో ఇది కనిపిస్తుంది ఇడుపులపాయకు బయల్దేరిన సీఎం జగన్ వైఎస్సార్ఘాట్ వద్ద కాసేపట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన మధ్యాహ్నం 12.30కు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళి ఆ తర్వాత.. మధ్యాహ్నాం 12.50 నుంచి 1.20 వరకు జాబితా ప్రకటన సీఎం జగన్ సమక్షంలో.. అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేయనున్న వైఎస్సార్సీపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల కోసం 175, లోక్సభ ఎన్నికల 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించనున్న పార్టీ సామాజిక న్యాయం ప్రతిబింబించేలా జాబితా.. ►మధ్యాహ్నాం 12.58 నిమిషాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన ►సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల్ని ప్రకటించనున్న ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ ►బీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ►అన్ని వర్గాలకు అవకాశాలు ఉండేలా తుది జాబితా ►ఇప్పటికే 68 అసెంబ్లీ స్థానాలకు మార్పులు ప్రకటించిన వైఎస్సార్సీపీ ►32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలకు పక్కన పెట్టిన అధిష్టానం ►సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములే ప్రామాణికంగా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించనున్నారు. ►ఇడుపులపాయ వద్ద 200 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు, నందిగామ సురేష్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ►వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటే అవకాశం. అన్ని వర్గాలకు అవకాశం ఉండే విధంగా వైఎస్సార్సీపీ జాబితా రూపొందించినట్టు సమాచారం. సీఎం జగన్ ఇడుపులపాయ షెడ్యూల్ ఇలా.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. ►అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. ►మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక.. ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరి మోగించనున్నారు. ►ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. ఓవైపు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. మరోవైపు వైఎస్సార్సీపీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులేస్తోంది. -
మరో నలుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్థన్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా నలుగురు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా తొమ్మిదికి చేరింది. ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్ఎస్. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, )మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది. ఇదీ చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు -
నేడే బీజేపీ రెండో జాబితా?.. తెలంగాణ నుంచి రేసులో వీరేనా!
సాక్షి, ఢిల్లీ: లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ సారించింది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇక, ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. రెండో జాబితా అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. అయితే.. ఆ అభ్యర్థుల జాబితా ఇవాళ సాయంత్రమే వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు.. లోక్సభ ఎన్నికల నేపథ్యంతోనే తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీగానే జరుగుతున్నాయి. బరిలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, నిన్న(ఆదివారం) బీఆర్ఎస్ మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్లు బీజేపీలో చేరారు. దీంతో, వీరికి టికెట్స్ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్, రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు. టికెట్ కోసం రేసులో ఉన్న ఆశావహులు.. మహబూబ్నగర్: డీకే అరుణ/ జితేందర్ రెడ్డి మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి ఆదిలాబాద్: నగేష్/సోయం బాపురావు/ అభినవ్ సర్దార్ మహబూబాబాద్: సీతారాం నాయక్ ఖమ్మం: జలగం వెంకట్రావు నల్గొండ: శానం సైదిరెడ్డి వరంగల్: కృష్ణ ప్రసాద్ పెద్దపల్లి: ఎస్. కుమార్ -
మిగతా స్థానాలు 20 తర్వాతేనా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికి నాలుగు లోక్సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశమున్నా ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం. తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశముందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సీఈసీ భేటీ ఎజెండాలో రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ, కేవలం ఐదింటిపైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా నాలుగింటిని మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మలి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకటి రిజర్వుడ్, మూడు జనరల్ తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఒకటి రిజర్వుడ్ కాగా, మూడు జనరల్ స్థానాలు. ఇందులో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి పాతకాపు పోరిక బలరాం నాయక్కే మరోమారు అవకాశమిచ్చారు. ఇక్కడ టికెట్ కోసం విజయాబాయి, బెల్లయ్య నాయక్లు శతవిధాలా ప్రయత్నించినా హైకమాండ్ బలరాం నాయక్వైపే మొగ్గుచూపింది. ఇక మహబూబ్నగర్లో అందరూ ఊహించినట్టుగానే వంశీచంద్రెడ్డి పేరు ఖరారయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు జహీరాబాద్ స్థానాన్ని బీసీ నేత సురేశ్ షెట్కార్కు కేటాయించారు. మరోవైపు నల్లగొండలో సీనియర్ నేత జానారెడ్డి మరోమారు తన పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం విషయంలో చాలా ఊహాగానాలు వచి్చనప్పటికీ తన కుమారుడు రఘువీర్కు టికెట్ ఇప్పించుకోవడంలో జానా సఫలీకృతులు కావడం గమనార్హం. ఇక, నాలుగు ప్రకటిత స్థానాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు. -
BJP: లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా రెడీ..
సాక్షి,ఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ , గుజరాత్, గోవా, చత్తీస్గఢ్ రాష్ట్రాల నేతలతో బీజేపీ సీఈసీ భేటీ అయింది. #WATCH | BJP Central Election Committee (CEC) meeting concludes; Union Home Minister Amit Shah and BJP national president JP Nadda leave from the BJP headquarters, in Delhi. pic.twitter.com/xOM8KmrNns — ANI (@ANI) February 29, 2024 తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్నగర్- డీకే అరుణ, నాగర్కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు -
‘ఇండియా’కు మరో షాక్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
న్యూఢిల్లీ: ఇండియా కూటమి అసలు ఉంటుందా ఉండదా అని అనుమానాలు తలెత్తుతున్న వేళ కూటమి ఉనికిని ప్రశ్నించే మరో పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అయిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఏకపక్షంగా వ్యవహరించింది. కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సంప్రదించకుండా అస్సాంలోని మూడు ఎంపీ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ గురువారం ఢిల్లీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి. మేం ఇండియా కూటమితోనే ఉన్నాం’ అని పాఠక్ అన్నారు. ఇప్పటికే కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలిజాబితాను ప్రకటించింది. ఓ పక్క కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం వివాదాస్పదమైంది. తాజగా కూటమిలోని ఆప్ పార్టీ కూడా ఇదే పని చేయడంతో కూటమి ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించి ఒక దశలో కన్వీనర్ పదవి తీసుకుంటారని ప్రచారం జరిగిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ ఇప్పటికే కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో జతకట్టి బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి.. కాంగ్రెస్ బ్లాక్పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని -
వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ ల నాలుగో జాబితా విడుదల
-
చివరి నిమిషంలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. బీఆర్ఎస్కు అదే ప్లస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కలిసి వచ్చాయి. లేకపోతే మరికొన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్కు ఓటమి ఎదురయ్యేది. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన స్థానాలు ఇవే.. అలంపూర్: అబ్రహం స్థానంలో విజయుడికి సీటు.. గెలుపు. జనగాం: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు.. గెలుపు స్టేషన్ ఘనపూర్: తాటికొండ రాజయ్య స్థానంలో కడియంకు అవకాశం.. గెలుపు. నర్సాపూర్: మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు డా:కల్వకుంట్ల సంజయ్ రావుకు అవకాశం.. గెలుపు ఆసిఫాబాద్: ఆత్రం సక్కు స్థానంలో కోవాలక్ష్మీకి అవకాశం.. గెలుపు దుబ్బాక: ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డికి అవకాశం.. గెలువు బోథ్: రాథోడ్ బాబురావు స్థానంలో అనిల్ జాదవ్కు అవకాశం.. గెలువు ఉప్పల్: బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు. మల్కాజ్గిరి: మైనం పల్లి హన్మంతరావు స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి అవకాశం.. విజయం. -
వీరంతా బీజేపీ అభ్యర్థులేనా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల జాబితాపై పార్టీలోని పాతకాపులతోపాటు ఏబీవీపీ, యువమోర్చా విభాగాల్లోని వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన 111 మంది అభ్యర్థుల్లో 30–35 మంది మాత్రమే పాతనేతలు, పార్టీ సిద్ధాంత భూమిక ఉన్నవారని.. ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక భూమిక ఉన్న పార్టీగా ప్రజలకు ఏరకమైన సందేశాన్నిస్తారని నిలదీస్తున్నారు. అసలు ఈ అభ్యర్థులను బీజేపీ వారిగా భావించవచ్చా? ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక వీరిలో ఎంత మంది పార్టీలో మిగులుతారనే ప్రశ్నలను సంధిస్తున్నారు. పార్టీలో ప్రస్తుత ముఖ్యనేతలు, మరీ ముఖ్యంగా బయట నుంచి వచ్చిన నేతలు వర్గాల వారీగా విడిపోయి తమ అనుయాయులకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇప్పించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ల ఖరారులో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలతో బీజేపీ విమర్శల పాలైదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రపార్టీలోని ముఖ్యనేతలు తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు చేసిన హెచ్చరికలకు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు లొంగిపోవడం ఎలాంటి సంకేతాలిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఉన్న ముఖ్యనేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొందరు వర్గాలుగా విడిపోయి టికెట్ల కేటాయింపులో తమ పట్టును నిలుపుకునేలా ఒత్తిళ్లు తెచ్చి పైచేయి సాధించడం వంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. ఏళ్లకు ఏళ్లు పనిచేసినా... నల్లగొండ, చేవెళ్ల, మహబూబాబాద్ ఎంపీ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా పాతకాపులు, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అవకాశం లభించలేదని వారు వాపోతున్నారు. ఈ స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. రెండు, మూడువారాల వ్యవధిలోనే పార్టీలో చేరిన పది, పదిహేను మందికి సీట్లు ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ స్థానాల్లో వీరంతా కచ్చితంగా గెలుస్తారని నాయకత్వం చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటపుడు అన్నిచోట్లా కాకపోయినా వీలున్న చోట్ల అయినా పార్టీని నమ్ముకున్న వారికి పార్టీకి బలపడేందుకు అవకాశం ఉండేదని వాదిస్తున్నారు. మొత్తంగా 111 స్థానాల వారీగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల పూర్వాపరాలు, గతంలో ఉన్న పార్టీలు వంటి వాటిని పరిశీలిస్తే... వీరిలో చాలామంది రెండు, మూడుపార్టీలు మారిన వారేనని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే యోచనలో దీర్ఘకాలం పార్టీలో పనిచేసిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన కాంగ్రెస్ సీఈసీ సమావేశం
-
నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. లిస్ట్లో రాజాసింగ్ పేరు!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. ఇక, ఈ జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. తొలి జాబితాలో దాదాపు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిన్న అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. ఇక, ఎన్నికల కమిటీ కంటే ముందే జేపీ నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా సూచించారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. ఇక, కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. మరోవైపు.. సస్పెన్షన్ ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ‘ఆ సీట్లలో రూ.కోట్ల వరద’ -
నేడే కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా వస్తుందని ఏఐసీసీ వర్గా లు వెల్లడించాయి. ఆ తర్వాత ఇంకొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కూ డా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈనెల 18న ఆ జాబితా కూడా వస్తుందని తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం 58 మందితో తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం. -
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్. అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా.. 95 శాతం అభ్యర్థుల స్థానాలు సిట్టింగులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేవలం సింగిల్ డిజిట్ లోనే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆసిఫాబాద్, ఉప్పల్, జనగామ, స్టేషన్ ఘాన్ పూర్, అంబర్ పేట, వరంగల్ తూర్పు,కొత్తగూడెం, ఖానాపూర్, పెద్దపల్లి, రామగుండం తదితర నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అసంతృప్తుల బుజ్జగింపులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లే తెలుస్తోంది. -
కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
-
కర్ణాటక: మూడో విడత జాబితాలో భారీ పోటీ.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు
శివాజీనగర(బెంగళూరు): పెండింగ్లో ఉన్న 58 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ నాయకులు సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ముకుల్ వాస్నిక్, వీరప్ప మొయిలీ, కే.సీ.వేణుగోపాల్, రణదీప్ సుర్జెవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్, ప్రతిపక్ష నాయకులు సిద్దరామయ్య తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రెండో విడతలో ప్రకటించిన 42 మంది అభ్యర్థుల లిస్టులో భారీ అసంతృప్తులు వినిపించాయి. టికెట్ రానివారు జేడీఎస్– బీజేపీ వైపు చూశారు. ఇలా పార్టీని వీడిన వారిలో బలమైన నాయకులు ఉండటం కాంగ్రెస్కు మింగుడు పడటం లేదు. మూడో విడత జాబితాలో భారీ పోటీ నెలకొంది. దీని వల్ల నేతల భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్నీ చర్చించిన తరువాతనే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. -
కర్ణాటక ఎన్నికలు: 124 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ‘రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిటీ ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా ఇదే’ అంటూ పార్టీ అభ్యర్థుల జాబితాను ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రకటించిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ఉన్నాయి. కాగా డీకే శివకుమార్ కనకపుర స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. సిద్ధరామయ్య ఈ సారి కోలార్ స్థానం నుంచి కాకుండా వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన కుమారుడు యతీంద్ర తన సీటును త్యాగం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే.. చీతాపూర్ నుంచి, మాజీ ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర కోరటగెరె స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీ కాంగ్రెస్సే. ఈ ఏడాది మే నెలతో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా... మేలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికలు: వయసుల వారీగా కాంగ్రెస్ తొలి జాబితా 30 ఏళ్లలోపు : 1 40 లేదా అంతకంటే తక్కువ: 12 50 లేదా అంతకంటే తక్కువ: 22 55 లేదా అంతకంటే తక్కువ: 26 60 లేదా అంతకంటే తక్కువ: 19 60 : 44 కంటే ఎక్కువ కాంగ్రెస్ తొలి జాబితాలో 20% లింగాయత్లకు కేటాయించారు పంచమశాలి లింగాయత్ 7 రెడ్డి లింగాయత్ 5 సదర్ లింగాయత్ 3 వీరశైవ లింగాయత్ 3 లింగాయత్ (ఇతరులు) 4 బంజిగ లింగాయత్ 3 గణిగ లింగాయత్ 2 నోనాబా లింగాయత్ 1 -
యూపీలో 172 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 172 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఒకట్రెండు రోజుల్లో తొలి జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటివరకు శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సిరాథూ నియోజకవర్గాల నుంచి బరిలో నిలవచ్చు. చదవండి: UP Assembly Election 2022: అఖిలేశ్కు అగ్ని పరీక్షగా సీట్ల కేటాయింపు! ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమై ఏడు దశల్లో సాగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశల్లో పోలింగ్ జరిగే నియోజకవర్గాలపైనే బీజేపీ అత్యధిక దృష్టి సారించింది. 172 మంది అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి బీజేపీ తీవ్ర కసరత్తు చేసింది. గురువారం జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు రాష్ట్ర నేతలు నేరుగా హాజరు కాగా ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆరుగురు కొత్తవారికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు అవకాశమిచ్చారు. మరో ఆరుగురు పాతవారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. సామాజిక, కుల సమీకరణాలు, తాను ఇచ్చిన హామీలు, మంత్రుల అభిప్రాయాలు, పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు తదితర అంశాల ప్రాతిపదికగా 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు నామినేషన్లు సిద్ధం చేసుకోవాలని ఒక్కొక్కరుగా అభ్యర్థులకు సమాచారం అందింది. కేసీఆర్ ఈ బాధ్యతలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావుకు అప్పగించి ఢిల్లీ వెళ్లగా.. హరీశ్రావు అభ్యర్థులకు ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు సమాచారం. అన్నింటినీ బేరీజు వేశాకే.. ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక, కుల సమీకరణాలను బేరీజు వేసుకున్నాకే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఐదుగురే పాతవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో శంభీపూర్రాజు, పట్నం మహేందర్రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి (వరంగల్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్నగర్), టి.భానుప్రసాదరావు (కరీంనగర్) ఉన్నారని.. వారు మరోమారు స్థానిక కోటాలో పోటీలో ఉంటారని సమాచారం. నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత.. ఈసారి పోటీకి అనాసక్తిగా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఆమె వద్దనుకుంటే ఎమ్మెల్యే కోటాలో రిటైరైన ఆకుల లలితకు స్థానిక కోటాలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. కవిత పోటీకి దిగితే మాత్రం ఆరుగురు సిట్టింగ్లకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. అయితే ఆకుల లలిత అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు చెప్తున్నాయి. కొత్తగా అవకాశం వచ్చిన జాబితాలో గాయకుడు సాయిచంద్ (మహబూబ్నగర్), ఎల్.రమణ (కరీంనగర్), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), దండె విఠల్ (ఆదిలాబాద్), తాతా మధు (ఖమ్మం), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్) ఉన్నారు. ఈ మేరకు ఎన్నికలు జరగనున్న తొమ్మిది జిల్లాల మంత్రులతో కేసీఆర్ సమావేశమై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. చేజారనివ్వొద్దు.. ఎన్నికలు జరగనున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో టీఆర్ఎస్కు సంపూర్ణ బలం ఉందని.. ఓటర్లు చేజారకుండా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్టు సమాచారం. అవసరమైన చోట క్యాంపులు ఏర్పాటు చేయడం సహా ఇతర జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో నామినేషన్లు సిద్ధం చేసుకునేలా అభ్యర్థులకు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రులతోపాటు, పార్టీపక్షాన మంత్రి హరీశ్రావు సదరు అభ్యర్థులకు ఫోన్చేసిన సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అభ్యర్థిత్వం ఖరారైన నేతలు సోమ లేదా మంగళవారాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమకు పార్టీపరంగా సమాచారం అందిందని, నామినేషన్లకు సిద్ధమవుతున్నామని కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి ధ్రువీకరించారు. హామీలు, సాన్నిహిత్యంతో.. శాసన మండలిలో పద్మశాలి సామాజికవర్గానికి అవకాశమిస్తామనే సీఎం హామీ మేరకు ఎల్.రమణకు అవకాశం వచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎంసీ కోటిరెడ్డికి.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ యాదవరెడ్డికి జాబితాలో చోటు దక్కింది. గతంలో సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దండె విఠల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన స్వస్థలం సిర్పూర్ కాగజ్నగర్ కావడంతో ప్రస్తుతం ఆదిలాబాద్ ‘స్థానిక’ కోటా అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో సాన్నిహిత్యంతోపాటు చాలాకాలంగా టీఆర్ఎస్లో కొనసాగుతుండటంతో తాతా మధుకు ఖమ్మం అభ్యర్థిత్వం దక్కినట్టు చెప్తున్నారు. ఉద్యమ సమయం నుంచి సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా ఉన్న సాయిచంద్కు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. 12 మంది ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఏడుగురు ఓసీలు, నలుగురు బీసీలు, ఒక ఎస్సీ సామాజికవర్గ అభ్యర్థికి ప్రాతినిధ్యం లభించింది. అభ్యర్థుల వారీగా చూస్తే.. పట్నం మహేందర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి (రెడ్డి), భానుప్రసాద్రావు (వెలమ), తాతా మధు (కమ్మ) ఓసీ కేటగిరీలో ఉన్నారు. బీసీ కేటగిరీలో శంభీపూర్ రాజు, ఆకుల లలిత, దండె విఠల్ (మున్నూరు కాపు), ఎల్.రమణ (పద్మశాలి) అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఎస్సీ (మాల) కేటగిరీలో సాయిచంద్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. సిట్టింగ్లు రంగారెడ్డి: శంభీపూర్రాజు, పట్నం మహేందర్రెడ్డి వరంగల్: పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కరీంనగర్: భానుప్రసాదరావు మహబూబ్నగర్: కసిరెడ్డి నారాయణరెడ్డి కొత్తవారు ఎల్.రమణ, సాయిచంద్, దండె విఠల్, కోటిరెడ్డి, యాదవరెడ్డి, తాతా మధు. మళ్లీ పోటీకి అవకాశం దక్కనివారు నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్), కూచుకుళ్ల దామోదర్రెడ్డి (మహబూబ్నగర్), పురాణం సతీశ్ (ఆదిలాబాద్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), వి.భూపాల్రెడ్డి (మెదక్) ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం రాత్రి పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలతో ఈ విషయమై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో పార్టీకి తగినంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీజేపీ స్ధానిక సంస్థల ప్రతినిధులు ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని, ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా మద్దతు కోరితే ఆలోచించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు..
రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన ఆరు పేర్లను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. వారి వివరాలను పరిశీలిస్తే.. సి.రామచంద్రయ్య చార్టర్డ్ అకౌంటెంట్గా మొదలుపెట్టి.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన సి.రామచంద్రయ్య 1948, మే 27న కడపలో జన్మించారు. ఆయన కొంతకాలం చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. 1985–89 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 1986–88 మధ్య ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిగా ఉన్నారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 1999–2004 మధ్యకాలంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ చైర్మన్గా పనిచేశారు. 2011లో ఎమ్మెల్సీగా ఉన్నారు. 2012లో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చల్లా భగీరథరెడ్డి తండ్రి బాటలో నడుస్తూ.. ఎమ్మెల్సీ అభ్యర్థి చల్లా భగీరథరెడ్డి 1976లో చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి దంపతులకు జన్మించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2008 వరకు జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్ సెక్రటరీగా, 2009 నుంచి 2010 వరకు ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. రాజకీయంగా తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ చదివి.. దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడైన 36 ఏళ్ల బల్లి కళ్యాణ్చక్రవర్తి బీఈ వరకు చదివారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని 16వ వార్డు ఆయన స్వస్థలం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడుగా కొనసాగుతున్నారు. గత 12 ఏళ్లుగా తండ్రి బల్లి దుర్గాప్రసాద్రావుకు రాజకీయంగా చేదోడుగా ఉంటున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఖాకీ వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. షేక్ మహమ్మద్ ఇక్బాల్ విశ్రాంత ఐజీ. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రశాంత్నగర్లో నివాసముంటున్నారు. ఎంఏ వరకు చదివిన ఆయన 35 ఏళ్లపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో మొదటిసారి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. మార్చి 29తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కరీమున్నీసా కార్పొరేటర్గా మొదలై.. ఎండీ కరీమున్నీసా విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్. భర్త ఎండీ సలీం. ఏడవ తరగతి వరకు ఆమె చదివారు. 2014లో జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 54వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కూడా డివిజన్ అభివృద్ధికి కరీమున్నీసా కృషి చేశారు. అలాగే పార్టీ బలోపేతానికీ కృషి చేశారు. ప్రస్తుతం 59వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ఎంపిక చేసింది. దువ్వాడ శ్రీనివాస్ పోరాటాలతో ప్రస్థానం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన దువ్వాడ శ్రీనివాస్ 1964లో దువ్వాడ కృష్ణమూర్తి, లీలావతి దంపతులకు జన్మించారు. కాకినాడ పీఆర్ కళాశాలలో ఎంఏ లిటరేచర్, బీఎల్ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా వ్యవహరించారు. 2006లో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. అలాగే 2014లో టెక్కలి అసెంబ్లీకి, 2019లో శ్రీకాకుళం ఎంపీ పదవికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. రాజకీయ ఆరంభం నుంచి కింజరాపు కుటుంబ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ పోరాటం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో అత్యధికంగా 112 సర్పంచ్ స్థానాల గెలుపునకు కృషి చేశారు. చదవండి: (ఎమ్మెల్సీ ఎన్నికలు: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్) -
టీడీపీలో గందరగోళం..
ప్రలోభాలు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ప్రజలు పూర్తి స్వేచ్ఛతో ఓటు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి ప్రతిపక్ష టీడీపీ తూట్లు పొడవడానికి సిద్ధమవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కోట్లు కుమ్మరించేందుకు సమాయత్తమవుతోంది.అందు కోసం అభ్యర్థులను ఖరారు చేయకుండా.. ఆర్థిక బలం ఉన్న వారికే సీటు ఖరారు చేయడానికి బేరసారాలు సాగిస్తున్నారు. వార్డుల్లో డబ్బులు వెదజల్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినాయకత్వం మల్లగుల్లాలుపడుతోంది. ప్రజా బలాన్ని పక్కనపెట్టి ఆర్థిక బలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని నిర్ణయించింది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసినప్పటికీ.. టీడీపీ తమ అభ్యర్థులను ఖారారు చేయలేని పరిస్థితి నెలకొంది. పార్టీ తరఫున బీ ఫారం కావాలంటే రూ.కోటికిపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కరాఖండిగా చెబుతోంది. దీంతో టీడీపీ ఆశావహులు తెల్లముఖం వేయాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల కార్యాలయాలే అభ్యర్థుల కొనుగోలు కేంద్రాలుగా మారిపోయిన వైనం పార్టీ శ్రేణుల్లో చర్చనీయంశంగా మారింది. దేశంలో గందరగోళం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసినప్పటికీ.. టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో పారీ్టలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వైసీపీ బీ ఫారాలతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేయడం ప్రతిపక్ష పార్టీ ఆశావహులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ టీడీపీ అధినాయకత్వం తమ కార్పొరేటర్ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థులు అప్పుడే ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే.. తేదేపా ఆశావహులు పార్టీ బీ ఫారాల కోసం ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేషన్ల దాఖలుకు శుక్రవారం మధ్యాహ్నంతో గడువు ముగియడంతో తేదేపా ఆశావహులందరితో నామినేషన్లు వేయించడంతో అభ్యర్థులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. ఆర్థిక బలాలపై ఆరా ఆయా పార్టీల అభ్యర్థులకు బీ ఫారాలు సమర్పించడానికి ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. దీంతో నామినేషన్లు వేసిన వారిని టీడీపీ ఎమ్మెల్యేల కార్యాలయాలకు పిలిపించి అభ్యర్థుల ఆర్థిక బలంపై ఆరా తీస్తున్నారు. కోటి ఉంటేనే బీఫారం! నామినేషన్లు వేసిన అభ్యర్థులను టీడీపీ ఎమ్మెల్యేలు తమ కార్యాలయాలను పిలిపించి వారి బలాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. వార్డులో అభ్యర్థుల ప్రజా బలం కంటే ఆర్థికంగా బలమైన వారికే బీ ఫారాలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారని ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీని గట్టిగా ఢీకొట్టాలంటే.. భారీగా ఖర్చు చేయాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. ఒక్కో వార్డుకు రూ.కోటికి పైగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్న అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీంతో రూ.కోటికి పైగా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల వడబోతకు టీడీపీ ఎమ్మెల్యేల కార్యాలయాలే వేదికగా మారాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. శుక్రవారం రాత్రి వరకు ఆశావహులతో నాయకులు ఎన్నికల ఖర్చు అంశంపై చర్చ జరిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నామినేషన్లు వేసిన వారిని ఒక్కొక్కరిని పిలిచి ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయగలరని స్వయంగా ఎమ్మెల్యేలే అడుగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అత్యధికంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్న వారి పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది పేర్లను ఖరారు చేసినప్పటికీ.. శని, ఆదివారాల్లో తుది జాబితా వెల్లడించాలని అధినాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ రేసులో పీలా, గండి? టీడీపీ నుంచి మేయర్ అభ్యరి్థగా పీలా శ్రీనివాస్, గండి బాబ్జిలు రేసులో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మేయర్ స్థానానికి ముందు నలుగురు అభ్యర్థుల పేర్లు వినిపించాయి. మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, తిప్పలగురుమూర్తి రెడ్డి, గండి బాబ్జి, అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద్ సోదరుడు పీలా శ్రీనివాస్ పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలించింది. అయితే ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఈ విషయంపై గురువారం నిర్వహించిన సమావేశంలో మేయర్ అభ్యర్థి రూ.25 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే అంతమొత్తంలో తాము ఖర్చు చేయలేమని నలుగురు వెనకడుగు వేయడంతో కనీసం రూ.15 కోట్లు అయినా సర్ధుబాటు చేసుకోవాల్సి ఉంటుందని చర్చకు వచ్చినట్టు తెలిసింది. దానికి కూడా పల్లా శ్రీనివాస్, తిప్పల గురుమూర్తి రెడ్డి అంగీకరించలేదు. దీంతో పీలా శ్రీనివాస్పై అధినాయకులు మొగ్గు చూపించారు. అయితే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పీలా శ్రీనివాస్, గండి బాబ్జిల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గండి బాబ్జి పేరును ప్రతిపాదించడం పట్ల పెందుర్తి మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి ఇతర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా గండి బాబ్జి పేరును పరిశీలిస్తుండడం పట్ల ఆయన కొంత అసహనంతో ఉన్నట్లు పారీ్టలో చర్చజరుగుతోంది. -
213 మంది అభ్యర్థులపై కేసులు..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు నానాపాట్లు పడుతున్నారు. తొలిదశ ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల సమయమే మిగిలి ఉంది. ఈలోపు బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలిదశ బరిలో ఉన్న అభ్యర్థుల్లో దాదాపు 213 మంది అభ్యర్థులు వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ చేసిన సర్వేతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో మొదటి దశ పోలింగ్ జరిగే 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సుమారు 213 అభ్యర్థులపై పలు కేసులున్నాయని ఏడీఆర్ తెలిపింది. వీటిలో హత్య, మహిళలపై దాడులు, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 1,266 మంది అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ, వీరిలో 12 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. 10 శాతం అభ్యర్థులు తమ మీద పలు హత్య కేసులున్నాయని అఫిడవిట్లో తెలుపగా.. హత్యాయత్నం కేసులున్నట్టు 25 శాతం మంది, కిడ్నాప్ కేసులు ఉన్నట్టు నలుగురు, మహిళలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నట్టు 16 మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. విద్వేశపూరిత ప్రసంగాల కేసులు తమపై ఉన్నట్టు మరో 12 శాతం మంది, తమ మీద రెడ్ అలర్ట్ కేసులు ఉన్నట్టు 37 మంది తెలిపారు. ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 83 మంది అభ్యర్థుల్లో 30 మందిపై కేసులు ఉండగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 32లో ఎనిమిది మంది, బీఎస్పీ పోటీ చేస్తున్న 32లో ఎనిమిది మంది నేరచరితులు ఉన్నట్టు తెలిపింది. -
ఈవీఎంలు 12.. అభ్యర్థులు 185
సాక్షి, జగిత్యాల: లోక్సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ప్రాంతంలోని పసుపు రైతులు లోక్సభ బరిలో అత్యధిక సంఖ్యలో నిలబడి వారి సమస్యలపై చర్చ జరిగేలా చేశారు. ప్రధాన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలతో కలుపుకొని 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికల సంఘం ఇక్కడి ఎన్నికలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికలకు ఎం–3 తరహా ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్హైస్కూల్ ప్రాంగణంలో మోడల్ పోలింగ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ నిఖిల్కుమార్ బృందం గురువారం సందర్శించింది. దేశంలోనే మొదలు..! తమ సమస్యల పరిష్కారం కోసం పసుపు రైతులు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ నుంచి ప్రధాన అభ్యర్థులతోపాటు ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల నిర్వహణ క్లిష్టతరంగా మారింది. మొదట బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహిస్తారని.. వాయిదా వేస్తారనే చర్చలు జరిగాయి. ఎన్నికల సంఘం మాత్రం బ్యాలెట్ పేపర్ కాకుండా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం గతంలో వినియోగించిన ఎం–2 రకం ఈవీఎంలను కాకుండా ఎం–3 తరహా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఒక్క ఈవీఎంకు బదులుగా ఒకే పోలింగ్కేంద్రంలో 12 ఈవీఎంల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. 12 ఈవీఎంల్లో 185 అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులతోపాటు చివరన నోటాకు స్థానం కల్పించనున్నారు. ‘ఎం–3’ ఈవీఎంల వినియోగం నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికలకు ఎం–3 రకం ఈవీఎంలను వినియోగించాలని ఈసీ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 785 పోలింగ్కేంద్రాలు ఉండగా.. నిజామాబాద్ పార్లమెంట్లో భాగమైన జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 516 పోలింగ్కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్కేంద్రాల్లో ఒక ఈవీఎంకు బదులుగా 12 ఈవీఎంలను వినియోగించనున్నారు. దీంతో మొత్తం 6,192 ఈవీఎంలు అవసరంకానున్నాయి. ఇందుకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే సమకూర్చింది. దేశ చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఈ తరహా ఈవీఎంలను వినియోగించలేదు. టెక్నికల్ సిబ్బందితో విధులు ప్రత్యేకమైన ఈవీఎంలలో నోటాతో సహా 185 అభ్యర్థుల పేర్లు నిక్షిప్తమై ఉంటాయి. ఓటు వేసిన తర్వాత ఓటరు వేసిన ఓటును చెక్ చేసుకునేందుకు వీలుండే వీవీప్యాట్ను 12 ఈవీఎంలకు అనుసంధానం చేయనున్నారు. ఓటరు తాము వేసిన ఓటు ఏ అభ్యర్థికి పడిందన్నది 7 సెకన్లపాటు వీవీప్యాట్ మిషన్లో కనిపించనుంది. ఎం – 3 రకం ఈవీఎంల నిర్వహణకు ఈ ఎన్నికల్లో సుశిక్షితులైన టెక్నికల్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. మోడల్ పోలింగ్కేంద్రం 12 ఈవీఎంలలో ఎన్నికలు నిర్వహించనుండడంతో ఓటుహక్కు వినియోగించుకోవడంలో ఓటర్ల అవగాహన కోసం ఎన్నికల అధికారులు జిల్లాకేంద్రంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఎం–3 ఈవీఎంలను మూడు టేబుళ్లపై ‘యూ’ ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు. 12 ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ మిషన్ను టేబుల్పై ఏర్పాటు చేయనున్నారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్ మిషన్తో అనుసంధానం ఉంటుంది. పోలింగ్రోజు వరకు మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల ముందు ఈవీఎంల నమూనా, అభ్యర్థుల జాబితాతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించనున్నారు. -
అసెంబ్లీ బరిలో పచ్చ రౌడీలు
తూటాలు దూసుకొస్తున్నాయి.. కత్తులు కరాళనృత్యం చేస్తున్నాయి.. తంతారో, నరుకుతారో మీ ఇష్టం అనే భరోసా. అడ్డూఅదుపులేని ఆర్థిక నేరాలు. ఆనవాలు కూడా దొరకని హత్యలు. పసుపు కండువాలకు అంటుకున్న రక్తపు మరకల్ని కుంకుమ అంటూ మభ్య పెట్టే ప్రయత్నాలు. మహిళల నుదుటన బొట్టును చెరిపేసే.. ఖద్దరు చీకటి కోణాలకు సజీవ సాక్ష్యాలు ఇవిగో. భావి తరాలకు ఎలాంటి సందేశం ఇద్దాం.. ఎవరికి ఓటేద్దాం.. ఆలోచించండి. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేర చరిత్ర కలిగిన టీడీపీ అభ్యర్థుల్లో ప్రముఖుడు. ఈయనపై నాలుగు కేసులు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్పై కాల్పులు జరిపి హతమార్చేందుకు యత్నించారు. తీవ్ర రక్తగాయాలు కాగా.. ఒక కిడ్నీ తొలగించారు. అతికష్టం మీద ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసు నుంచి బయట పడేందుకు బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని అప్పట్లో నిమ్స్ వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు కూడా బాలకృష్ణ తరచూ ఎవరి మీదనో ఒకరిమీద చేయి చేసుకుంటూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పరిటాల శ్రీరాం రామగిరి పోలీసుస్టేషన్లో కిడ్నాప్, హత్యాయత్నం తదితర నేరాల కింద( నెంబర్ 57/2018) పరిటాల శ్రీరాంపై కేసు నమోదైంది. ఇదే కాదు రాప్తాడు మాజీ మండల కన్వీనర్ ప్రసాద్రెడ్డి హత్యకేసులో ఇతని ప్రమేయం ఉందని అప్పట్లో మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేయలేదు. కందుకూరు శివారెడ్డి హత్య శ్రీరాం చేయించారని శివారెడ్డి కుమారుడు స్టేషన్లో ఏకంగా ఫిర్యాదు చేశారు. ఇతను రాప్తాడు నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న కాలవ శ్రీనివాసులుపైనా నాలుగు కేసులు ఉన్నాయి. మూడు కేసులు ఉంటే రౌడీషీట్ తెరవచ్చు. కాకపోతే అధికారపార్టీ నేత కావడంతో పోలీసులు ఆ దిశగా ముందడుగు వేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈయన మంత్రి. వరదాపురం సూరి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గోనుగుంట్ల సూర్యనారాయణపై స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టులో కేసు(సీసీ నెంబర్:48/2014) పెండింగ్లో ఉంది. దీన్ని ఇటీవలే విజయవాడ స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. ఈయన ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్నెళ్ల్ల పాటు ఎవరినైనా చంపేసుకోవచ్చు. కేసులు లేకుండా చూస్తామని భరోసా కల్పించారు. కందికుంట ప్రసాద్ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట ప్రసాద్పై మొన్నటి వరకు ఏడు కేసులు ఉండేవి. ప్రస్తుతం సీబీఐ కోర్టులో(సీసీ నెంబర్2/2003, సీసీ నెంబర్ 33/2007) ఓ కేసు నడుస్తోంది. చెక్బౌన్స్ కేసుల్లో శిక్షపడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా కోర్టు తీర్పు వెల్లడించింది. ఇటీవలే ఆ తీర్పుపై స్టే తెచ్చుకుని తిరిగి పోటీలో ఉన్నారు. ‘అనంత’లో ఎలాగైనా ఎన్నికలు గెలవాలనే ఏకైక లక్ష్యంతో ఎన్ని అరాచకాలు చేసేందుకైనా వెనుకాడకూడదని తెలుగుదేశంపార్టీ నిర్ణయించుకుంది. ఆ పార్టీ బరిలో దింపిన అభ్యర్థులను చూస్తే ఈ విషయం బోధపడుతోంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు జిల్లాకు ఫలానా మంచి చేసినట్లు చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. శంకుస్థాపనలకు పరిమితమైన సంస్థలు కేంద్రప్రభుత్వానివి! సిమెంట్ రోడ్ల నిధులు ఉపాధిహామీ పథకానికి చెందినవి. చివరకు చంద్రన్నబీమా లాంటి పథకాలు కూడా కేంద్రానివే! తనకంటూ ప్రత్యేకంగా చెప్పుకునే ఒక్క సంక్షేమ పథకాన్నీ చంద్రబాబు అమలు చేయలేకపోయారు. ఇది టీడీపీపై ప్రజావ్యతిరేకతను పెల్లుబికేలా చేసింది. నేర చరితులకు టికెట్లు ప్రజావ్యతిరేకత వెల్లువెత్తడంతో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని చంద్రబాబుకు స్పష్టంగా తెలిసిపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబుకు సవాల్గా మారాయి. ఈ దఫా అధికారంలోకి రాకపోతే రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు కుటుంబం ఉనికి కోల్పోయే ప్రమాదముంది. ఇప్పటికే వయోభారంతో నలిగిపోతున్న చంద్రబాబు.. తన వారసుడి రాజకీయ భవిష్యత్తుపై అంతులేని బెంగతో నలిగి పోతున్నారు. ఆయన వారసుడికి రాష్ట్రంలో ఎంత గొప్ప పేరు ఉందో తెలియంది కాదు. దీంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ధనబలం, కండబలం ఉన్నవారిని పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. డబ్బు.. దౌర్జన్యం ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం చంద్రబాబు తొలిమార్గం. అందుకు అనుగుణంగానే ఈ ఐదేళ్లు ప్రజలను నిలువునా దోచేసిన సొమ్ములో నుంచి ఓటుకు రూ.2 వేలు నుంచి రూ. 3వేలు పంచేందుకు టీడీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇక చంద్రబాబు రెండో మార్గం.. డబ్బుకు లొంగని వారిని భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందడం. ఇందుకు నేరస్తులైతే సరిపోతారు. ఈ లక్ష్యంతోనే ‘నేరస్తుల టీఎం’ను చంద్రబాబు ఎంపిక చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి పాత నేర చరిత్ర చూస్తే భవిష్యత్తులో వీరు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు లోపించి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా పోతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులు పేర్కొన్న నేరచరిత్ర పరిశీలిస్తే.. - హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై యు/ఎస్ 500 ఐపీసీ కింద సీసీ నంబరు 48/2014 కేసు అమరావతి ప్రత్యేక కోర్టులో ఉంది. గుంతకల్లు స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో యు/ఎస్ 174(ఎ), 147 ఆఫ్ రైల్వే చట్టం ప్రకారం ఎస్టీసీ నంబర్ 1477/2013, ఎస్టీసీ నంబరు 473/2013, ఎస్టీసీ 313/2013 కేసులు ఉన్నాయి. - పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథిపై అనంతపురం వన్టౌన్ పోలీస్స్టేషన్లో క్రై మ్ నంబర్ 193/2013 కేసు పెండింగ్లో ఉంది. అనంతపురం ప్రిన్సిపల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ వద్ద సీసీ నెం: 88/2018 పెండింగ్లో ఉంది. ఈ కేసులు యూ/సెక్షన్ 147, 148, 336, 427, 506, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కింద నమోదయ్యాయి. - నందమూరి బాలకృష్ణపై బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్లో సీఆర్.నెం.10/09, గుత్తి పోలీసు స్టేషన్లో సీఆర్.నెం.20/09, విజయవాడ స్పెషల్ కోర్టులో సీసీ 40/18, సీసీ 43/18, విజయవాడ కోర్టులో యూ/ఎస్ 188, 283 ఆఫ్ ఐపీ, యు/ఎస్ 188, 283 ఐపీసీ కేసులు ఉన్నాయి. - మడకశిర టీడీపీ అభ్యర్థి ఈరన్నపై మడకశిర పోలీస్స్టేషన్లో అండర్ సెక్షన్ 171–ఇ, 188 ఆఫ్ ఐబీపీ కింద క్రైమ్ నెం: 76/2013 కేసు నమోదైంది. మడకశిర జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో సీసీ నెం: 91/2013 ఉన్న ఈ కేసు విజయవాడ స్పెషల్ కోర్టుకు (సీసీ నెం: 7/19) బదిలీ అయింది. - తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డిపై ఎలాంటి కేసులు లేవు. అయితే ఇతని తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి గతంలో రౌడీషీటర్! తాడిపత్రి టౌన్ పోలీసుస్టేషన్లో డిసెంబర్ 1, 1993న జేసీ ప్రభాకర్రెడ్డిపై 240/ఏఎన్ నంబర్తో రౌడీషీట్ తెరిచారు. ఇతనిపై రౌడీషీటే కాదు పదుల సంఖ్యలో వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తర్వాత కొట్టేయించుకున్నారు. తన కుమారుడి గెలుపు కోసం ఓటర్లపై రౌడీయిజం చెలాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. - ధర్మవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జి.సూర్యనారాయణపై ఐపీసీ 500 కింద సీసీ నెం:48/2014గా ధర్మవరం జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో కేసు ఉంది. ఈ కేసు ఇటీవలనే విజయవాడలోని స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. - మంత్రి కాలవ శ్రీనివాసులుపై అనంతపురం వన్టౌన్ పోలీస్స్టేషన్లో అండర్ సెక్షన్ 147, 148, 336, 427, 506, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కింద క్రైమ్ నెం: 193/2013 కేసు నమోదైంది. బుక్కరాయసముద్రం పోలీస్స్టేషన్లో అండర్ సెక్షన్ 283, 188 ఐపీసీ కింద క్రైమ్ నెం: 10/2009 ఓ కేసు, గుత్తి పోలీస్స్టేషన్లో అండర్ సెక్షన్ 283, 188 కింద ( క్రైమ్ నెం: 20/2009) మరో కేసు నమోదైంది. - కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుపై బెళుగుప్ప పోలీస్స్టేషన్లో అండర్ సెక్షన్ 143, 188, ఆర్/డబ్ల్యూ34 ఆఫ్ ఐపీసీ కింద క్రైమ్ నెం:62/2019 కేసు నమోదైంది. కళ్యాణదుర్గం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో పీఓఆర్ నెం:21/2016–17 మరో కేసు నమోదైంది. - పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డిపై అండర్ సెక్షన్ 188, 283 ఆఫ్ ఐపీసీ కింద గుత్తి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 20/2009 కేసు నమోదైంది. - రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్ మీద రామగిరి పోలీస్స్టేషన్లో క్రైమ్ నెం: 57/2018 (సెక్షన్లు 363, 324, 384, 342, 307, 506, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ) నమోదైంది. బోయ నారాయణ అలియాస్ సూర్యం అనే వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. - ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మీద బుక్కరాయసముద్రం పోలీస్స్టేషన్లో క్రైమ్ 10/2009 కేసు నమోదైంది. అనంతపురం మొదటి క్లాస్ మెజిస్ట్రేట్ ఫర్ ఎక్సైజ్ అఫెన్స్ కోర్టులో ఉన్న ఈ కేసును ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు పరిశీలించే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. - కదిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్పై హైదారాబాద్ సీబీఐ కోర్టులో సీసీ నెం:2/2003, సీసీ నెం:33/2007 కేసులు నడుస్తున్నాయి. - గుంతకల్లు అభ్యర్థి జితేంద్రగౌడ్ మీద గుంతకల్లు వన్టౌన్ పోలీస్స్టేషన్లో క్రైమ్ నెం:99/2005 కేసు నమోదు అయింది. -
అనంతపురం: నామినేషన్ వేసిన అభ్యర్థులు
సాక్షి,అనంతపురం అర్బన్: ఎన్నికల ప్రక్రియలో తొలి అంకమైన నామినేషన్ పర్వం సోమవారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన 18వ తేదీ నుంచి చివరి రోజు 25వ తేదీ వరకు అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు 40 మంది అభ్యర్థులు 54 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు 278 మంది 400 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున అనంతపురం పార్లమెంట్ నియోకవర్గానికి 14 మంది అభ్యర్థులు 16 సెట్లు , 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 208 మంది అభ్యర్థులు 262 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. రెండు పార్లమెంట్ స్థానాలకు 40 మంది 54 సెట్లు దాఖలు 14 అసెంబ్లీ స్థానాలకు 278 మంది 400 సెట్లు దాఖలు నేడు నామినేషన్ల పరిశీలన సోమవారం ప్రధాన పార్టీల నామినేషన్లు అనంతపురం పార్లమెంట్: టి.రంగయ్య (వైఎస్సార్సీపీ), జేసీ దివాకర్రెడ్డి (టీడీపీ), డి.జగదీశ్ (సీపీఐ), హంస దేవినేని (బీజేపీ) హిందూపురం పార్లమెంట్: గోరంట్ల మాధవ్ (వైఎస్సార్సీపీ), కురబ సవిత (వైఎస్సార్సీపీ), ఎన్.కిష్టప్ప (టీడీపీ), పార్థసారథి (బీజేపీ) జిల్లా ఓటర్లు 32,39,517 పురుషులు 16,25,192 మహిళలు 16,14,071, ఇతరులు 254 జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 11న తుది జాబితాలో 30,58,909 మంది ఓటర్లు నమోదుతో పెరిగిన ఓటర్లు 1,80,608 మంది అనంతపురం అర్బన్ : ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఆ మేరకు జిల్లా ఓటర్లు 32,39517 మంది. ఇందులో పురుషులు 16,25,192 మంది, మహిళలు 16,14,071 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ 24 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి 11న విడదుల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 30,58,909 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 15,39,936 మంది, మహిళలు 15,18,769 మంది, థర్డ్ జెండర్ 204 మంది ఉన్నారు. నవంబరు ఒకటి నుంచి ఈనెల 15 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించారు. దీంతో జిల్లాలో 1,80,608 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో పురుషులు 85,256, మహిళలు 95,302, థర్డ్ జెండర్ 50 మంది ఉన్నారు. -
విజయ సారథులు వీరే..
ఎన్నో వడపోతలు, సర్వేల అనంతరం ప్రజలు మెచ్చిన అభ్యర్థులనే విజయ సారథులుగా వైఎస్సార్ సీపీ బరిలో దించింది. ఐదేళ్ల ప్రజాకంటక పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజా క్షేమమే అజెండాగా పార్టీ అభ్యర్థులు జనం ముందుకు వచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే చేపట్టే నవరత్న పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రజల ఆశీర్వాద బలంతో విజయతీరాలకు చేరతామని ధీమాగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఇడుపులపాయలో ప్రకటించారు. జిల్లాలోని ఒంగోలు, నెల్లూరు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎంపిక చేశారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్రెడ్డిని ప్రకటించగా బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా నందిగం సురేష్కు టికెట్ కేటాయించారు. ఇక ఒంగోలు అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు. బాలినేని గతంలో నాలుగు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. కందుకూరు అభ్యర్థిగా మాజీ మంత్రి మానుగుంట మహీధర్రెడ్డిని ఎంపిక చేయగా కొండపి అభ్యర్థిగా డాక్టర్ వెంకయ్యను బరిలో నిలిపారు. గిద్దలూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కేటాయించారు. మార్కాపురం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు కుందురు నాగార్జున్రెడ్డిని ఎంపిక చేశారు. యర్రగొండపాలెం నుంచి సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్కు టికెట్ కేటాయించారు. దర్శి అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ను ఎంపిక చేయగా కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. పర్చూరు టికెట్ సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించగా చీరాల అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను ఎంపిక చేశారు. సంతనూతలపాడు నుంచి టీజేఆర్ సుధాకర్బాబుకు టికెట్ కేటాయించారు. మొత్తంగా ఒకే విడతలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటుకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి, కొండపి, ఒంగోలు నియోజకవర్గాలు ఉండగా బాపట్ల పార్లమెంటు పరిధిలో సంతనూతలపాడు, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు నియోజకవర్గం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి కందుకూరు మానుగుంట మహీధరరెడ్డి అద్దంకి బాచిన చెంచుగరటయ్య చీరాల ఆమంచి కృష్ణమోహన్ గిద్దలూరు అన్నా వెంకటరాంబాబు పర్చూరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ మార్కాపురం కుందురు నాగార్జునరెడ్డి కనిగిరి బుర్రా మధుసూదన్ యాదవ్ కొండపి (ఎస్సీ) మాదాసి వెంకయ్య సంతనూతలపాడు (ఎస్సీ) టీజేఆర్ సుధాకర్బాబు యర్రగొండపాలెం (ఎస్సీ) ఆదిమూలపు సురేష్ పార్లమెంటు అభ్యర్థులు 1. ఒంగోలు – మాగుంట శ్రీనివాసులురెడ్డి 2. బాపట్ల – నందిగం సురేష్ 3. నెల్లూరు – ఆదాల ప్రభాకరరెడ్డి -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుం దో లేదోననే టెన్షన్లో ఉన్నారు. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికే గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కొన్నిచో ట్ల విందు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యా యి.రిజర్వేషన్లు ఖరారైతే మరింత వేగంగా పరి ణామాలు మారే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 16 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు 4,31,778 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,16,008 మంది, స్త్రీలు 2,15,770 మంది ఉన్నారు. బీసీలు 2,53,384 మంది, ఎస్టీలు 64,058 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 77,076 మంది, ఓసీలు 37,277 మంది ఉన్నారు. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. రిజర్వేషన్లు 2011 గ్రామీణ జనాభా లెక్కల ప్రకారం, నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరిస్తూ ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్గా, జెడ్పీటీసీలకు జిల్లాను, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్గా తీసుకుంటారు. ఎంపీటీసీల రిజర్వేషన్లను ఎంపీడీఓలు తయారుచేస్తే కలెక్టర్ ఫైనల్ చేయనున్నారు. రాష్ట్రం, జిల్లా, మండల యూనిట్గా రిజర్వేషన్ల కేటాయింపుల్లో ముందుగా ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తొలుత ఎస్సీలకు, తరువాత ఎస్టీలకు రిజర్వేషన్లను కేటాయించి మిగిలినవి బీసీలకు కేటాయిస్తారు. తర్వాత జనరల్ స్థానాలను ప్రకటిస్తారు. జిల్లా నుంచి నేడు(మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు రిజర్వేషన్ల ప్రకటనల కోసం తర్జనబర్జన అవుతున్నారు. మండలం ఎంపీటీసీ స్థానాలు ఆత్మకూరు 09 చెన్నారావుపేట 11 దామెర 08 దుగ్గొండి 12 గీసుకొండ 09 ఖానాపురం 09 నడికూడ 10 నల్లబెల్లి 11 నర్సంపేట 11 నెక్కొండ 16 పరకాల 05 పర్వతగిరి 14 రాయపర్తి 16 సంగెం 14 శాయంపేట 12 వర్దన్నపేట 11 మొత్తం 178 తమకు అనుకులంగా కావాలని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు తమకు అనుకులంగా వచ్చే విధంగా చేయాలని ఇప్పటికే ఆశావహులు ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా, మండల నాయకుల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అనుకులంగా రిజర్వేషన్ తీసుకవస్తే గెలుపించుకుని వస్తామని జిల్లా, మండల నాయకులు ఆఫర్లు సైతం ఇస్తున్నారు. పార్టీ ఫండ్ సైతం ఏమీ లేకుండానే స్వంత డబ్బులు పెట్టుకుని గెలుస్తాడని హామీలు ఇస్తున్నారు. ఎంపీలు, శాసన సభ్యులు సైతం గ్రామంలో బలమైన నాయకులకు అనుగుణంగా రిజర్వేషన్ వచ్చే విధంగా పావులు కదుపుతున్నారని సమాచారం. బలమైన నాయకుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయితే పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తారని అధికార పార్టీ నేతలు రిజర్వేషన్లు అనుకులంగా ఉండే విధంగా చూస్తున్నారని తెలుస్తోంది. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో మండల, జిల్లా ప్రాదేశిక స్థానాల (ఎంపీ టీసీలు, జెడ్పీటీసీలు) సంఖ్య తేలింది. కొత్త జిల్లా, రెవెన్యూ మండలాల ప్రాతిపదికన రూపొందించిన తుది జాబితాకు యంత్రాంగం ఆమోదం తెలిపింది. 258 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీలతో కూడిన జాబితాను విడుదల చేసింది. 21 గ్రామీణ మండలాలకు ఒకటి చొప్పున జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా కొనసాగిన సమయంలో జిల్లా వ్యాప్తంగా 753 ఎంపీటీసీలు, 33 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ.. జిల్లా పరిషత్ను విభజించలేదు. దీంతో పాత స్థానాలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జెడ్పీ పాలకవర్గ కాలపరిమితి వచ్చే జులై మొదటి వారంలో ముగియనుంది. ఈ గడువులోగా నూతన జిల్లాల ప్రాతిపదికన మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఈ క్రమంలో కసరత్తు చేసిన పంచాయతీరాజ్ విభాగం కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. గతంతో పోల్చుకుంటే జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లా మూడు జిల్లాలుగా విభజించడం.. రాజేంద్రనగర్, సరూర్నగర్ గ్రామీణ మండ లాలు సంపూర్ణంగా పురపాలనలో విలీనం కావడం.. శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంజాల్, శంకర్పల్లిలు మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో ఆ స్థానాలకు కత్తెర పడింది. అలాగే మహబూబ్నగర్ జిల్లా నుంచి కొత్త రంగారెడ్డి జిల్లాలో కలిసిన ఆమనగల్లు కూడా పురపాలికగా మారడంతో ఇక్కడి ఎంపీటీసీ స్థానాల్లోనూ కోత పడింది. తుది జాబితాలో ఉన్న స్థానాలు అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఒక తేదీని ఖరారు చేస్తుంది. ఆ సమయం నుంచి కొత్త స్థానాలు మనుగడలోకి వస్తాయని అధికారులు తెలిపారు. సంఖ్య పెంచండి.. జిల్లా పరిషత్ విడుదల చేసిన ముసాయిదా జాబితాపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38 అభ్యంతరాలు అధికారులకు అందాయి. ముసాయిదా జాబితాలో ఉన్న వాటి కంటే ఎంపీటీసీల సంఖ్యను పెంచాలని పలువురు నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎంపీటీసీ స్థానాల ఏర్పాటు నిర్ధిష్ట నిబంధనలు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు. ప్రతి 3500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీని కారణంగా సంఖ్య పెంచలేకపోయామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ప్రస్తుతం ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉన్న గ్రామాలను.. కొత్తగా ఏర్పడే స్థానం పరిధిలోకి మార్చాలని కూడా వినతులు అందాయి. భౌగోళిక విషయాలను పరిగణనలోకి తీసుకుని గ్రామాలను ఖరారు చేశారు. అవకాశం ఉన్న చోట రెండు మూడు గ్రామాలను ఆయా ఎంపీటీసీ స్థానాల్లో కలిపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంతేగాక ఎంపీటీసీ స్థానాల పేర్లను కూడా మార్చాలన్న డిమాండ్ వచ్చింది. ఒక ఎంపీటీసీ స్థానం పరిధిలో అధిక జనాభా ఉన్న గ్రామం పేరిటే సదరు ఎంపీటీసీ స్థానాన్ని ఖరారు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది సాధ్యపడకపోవడంతో ఈ వినతులను యంత్రాంగం పక్కనబెట్టింది. 15లోగా ఓటర్ల జాబితా కొత్తగా ఏర్పాటయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితాని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. తొలుత ముసాయిదా జాబితా రూపొందించి దానిపై అభ్యంతరాలు, ఆక్షేపణలకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత వీటిని పరిష్కరించి 15 కల్లా తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. -
తుది జాబితా ప్రకటించిన టీజేఎస్ అధినేత
సాక్షి, వరంగల్/హసన్పర్తి: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పడిన మహాకూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితా ఎట్టకేలకు ఆదివారం రాత్రి విడుదలైంది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు తెలంగాణ జన సమితి(టీజేఎస్) ఆదివారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ తూర్పు స్థానానికి గాదె ఇన్నయ్య, వర్ధన్నపేటకు డాక్టర్ పగిడిపాటి దేవయ్యను ఖరారు చేసింది. దీంతో వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పడిన మహాకూటమి సీట్ల సర్దుబాటులో అనేక మలుపులు, కుదుపులు చోటుచేసుకున్నాయి. పొత్తులో భాగంగా తమ పార్టీలకు కేటాయించిన సీట్లకు ఆయా పార్టీలు అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించాయి. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలను కాంగ్రెస్కు కేటాయించగా, ఒక స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, పాలకుర్తి, జనగామ, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి, వరంగల్ పశ్చిమ టీడీపీకి, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట స్థానాలు టీజేఎస్కు దక్కాయి. తొలుత వరంగల్ పశ్చిమ స్థానాన్ని తొలుత టీజేఎస్కు కేటాయిస్తారని అనుకున్నప్పటికీ టీడీపీలో అగ్రనేతలు ఇతర చోట్ల నిలబడేందుకు వీలు కాకపోడంతో తప్పని పరిస్థితుల్లో టీడీపీకి కేటాయించి ప్రకాశ్రెడ్డిని ఇక్కడకు పంపించారు. జనగామ టీజేఎస్కు కేటాయించడంతో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో మంతనాలు జరపడంతో చిట్టచివరికి కాంగ్రెస్ నుంచి టికెట్ను ప్రకటించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట స్థానాలను టీజేఎస్కే కేటాయించినట్లు తెలిసింది. కూటమి పొత్తులో టీజేఎస్ అభ్యర్థులుగా వరంగల్ తూర్పు నుంచి గాదె ఇన్నయ్య, వర్ధన్నపేట నుంచి పగిడిపాటి దేవయ్య సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రెబల్స్ తంటా... కూటమి పొత్తుల్లో వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు టీడీపీ, టీజేఎస్కు దక్కడంతో ఆ పార్టీలోని నేతలు ఇప్పటికే నామినేషన్లు వేసి రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ప్రకటించారు. వరంగల్ పశ్చిమ నుంచి రాజేందర్రెడ్డి, తూర్పు నుంచి రాజనాల శ్రీహరి, వర్ధన్నపేట నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. రవిచంద్ర గత రెండు రోజులుగా స్థానిక కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించడంతో పోటీ చేస్తారని తెలుస్తోంది. బరిలో నిలిచేవారు ఎవరనే విషయం నేడు తేలనుంది. -
కూటమి కథ క్లైమాక్స్కు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కథ క్లై్లమాక్స్కు చేరుతోంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలతో సీట్ల సర్దు బాటు వ్యవ హారం దాదాపుగా తుది అంకానికి వచ్చింది. నామినేషన్ల ఘట్టానికి ఇక 3రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపికను శనివారం పూర్తిచేయాలని ఆయా పార్టీలు కృత నిశ్చయంతో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు కాంగ్రెస్ 75 మందిని, టీడీపీ 12 మందిని, సీపీఐ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన 29 స్థానాల్లో 19 చోట్ల కాంగ్రెస్, 8 స్థానాల్లో టీజేఎస్, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించడానికి శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. ఐదు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో టీజేఎస్ కార్యాలయానికి వెళ్లి కోదండ రాంతో చర్చలు జరిపారు. అవి కొలిక్కి రాకపోవడంతో శనివారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. జనగామ, మిర్యాలగూడపై వీడని ప్రతిష్టంభన.. పొత్తుల్లో భాగంగా టీజేఎస్కు 8 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించింది. అయితే, తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల టీజేఎస్ నేతలు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ వెళ్లి, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చిన టీజేఎస్ అధినేత కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. తమకు కేటాయించిన 8 స్థానాల్లో ఆరింటిలోనే స్పష్టత వచ్చిందని, మిగిలిన స్థానాల గురించి కాంగ్రెస్ నేతలతో మాట్లాడాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, ఢిల్లీలో ఆయన ఎవరిని కలిశారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు జనగామ, మిర్యాలగూడ సీట్ల విషయంలో కాంగ్రెస్–టీజేఎస్ల మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. జనగామ నుంచి కోదండరాం పోటీచేయాలని యోచిస్తుండగా, అక్కడ కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య టికెట్ ఆశిస్తున్నారు. తన స్థానాన్ని టీజేఎస్కు ఇస్తున్నారనే సమాచారం వచ్చిన వెంటనే పొన్నాల మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి అక్కడే మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పార్టీ పెద్దలను కలిసి టికెట్ విషయంలో తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, గురువారం అర్ధరాత్రి కోదండరాంతో జరిగిన చర్చల్లోనూ జనగామ విషయం ఏమీ తేలలేదని తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్ వర్గాలు మాత్రం జనగామ బరి నుంచి కోదండరాం తప్పుకుంటున్నారని, అక్కడ పొన్నాలకు లైన్ క్లియర్ అయిందని అంటున్నాయి. ఇక, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్రెడ్డి మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్నారు. ఈ స్థానం కూడా తమకు కావాలని టీజేఎస్ పట్టుపడుతోంది. అయితే, ఈ వ్యవహారంపై రఘువీర్తో రాహుల్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో తెలియకపోయినప్పటికీ, రాహుల్తో భేటీ తర్వాత తన నామినేషన్ పత్రాలను సిద్ధం చేయాలని రఘువీర్ హైదరాబాద్లోని తన అనుచరులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రఘువీర్కు టికెట్ ఇవ్వడం సాధ్యం కానందునే రాహుల్ పిలిపించి మాట్లాడి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ రఘువీర్కు టికెట్ ఇవ్వకపోతే ఆ స్థానాన్ని టీజేఎస్కు కేటాయిస్తారా, కాంగ్రెస్కు ఇస్తారా... కాంగ్రెస్కు ఇస్తే ఇటీవలే పార్టీలో చేరిన అల్గుబెల్లి అమరేందర్రెడ్డికి అవకాశం ఇస్తారా..? టీజేఎస్కు వదిలిపెడితే విద్యాధర్రెడ్డి పోటీచేస్తారా.. లేదంటే కొత్తగా తెరపైకి వచ్చిన జానారెడ్డి బంధువు విజయేందర్రెడ్డికి టికెట్ కేటాయిస్తారా అనే విషయాలు శనివారం తేలనున్నాయి. అలాగే జనగామలో కోదండరాం పోటీచేస్తారా లేక పొన్నాల బరిలో ఉంటారా అనే సస్పెన్స్కు కూడా నేడు తెరపడనుంది. 19 స్థానాలతో కూడిన కాంగ్రెస్ పెండింగ్ జాబితా కూడా శనివారం విడుదల కానుంది. అవి ఇటు.. ఇవి అటు.. తెలుగుదేశం పార్టీ పెండింగ్ స్థానాలపైనా ఢిల్లీలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. టీడీపికి కేటాయించిన 14 స్థానాల్లో 12 చోట్ల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మరో రెండు స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అయితే, టీడీపీ ఇప్పటికే ప్రకటించిన ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను తిరిగి కాంగ్రెస్కు ఇచ్చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. వీటికి బదులుగా హుజూరాబాద్, పఠాన్చెరు స్థానాలను టీడీపీకి ఇస్తారని అంటున్నారు. ఈ సర్దుబాటు జరిగినప్పటికీ మరో రెండు స్థానాలు టీడీపీకి ప్రకటించాల్సి ఉంటుంది. అవి ఏమిటనేది కూడా శనివారమే తేలనుంది. ఇక టీడీపీ తిరిగి ఇచ్చే ఇబ్రహీంపట్నం సీటును మల్రెడ్డి రంగారెడ్డికి, రాజేంద్రనగర్ స్థానాన్ని సినీ నిర్మాత బండ్ల గణేశ్కు కేటాయించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కూకట్పల్లి సీటు ఆశించిన పెద్దిరెడ్డికి హుజూరాబాద్ స్థానం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. అయితే, అక్కడి నుంచి సైకిల్ గుర్తుపై పోటీ చేయడానికి పెద్దిరెడ్డి నిరాకరించినట్టు సమాచారం. ఒకవేళ పెద్దిరెడ్డి అక్కడ నుంచి బరిలో దిగకపోతే ఆ స్థానం తిరిగి కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ స్థానం నుంచి రేసులో ఉన్న పాడి కౌశిక్రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి అక్కడ కా>ంగ్రెస్ నుంచి ప్రధానంగా కౌశిక్రెడ్డి పేరే వినిపించినప్పటికీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి బంధువు అనే కారణంతో ఆయన పేరు పెండింగ్లో ఉంచారు. ఐదు నియోజకవర్గాల ఆశావహులతో రాహుల్ భేటీ... కాంగ్రెస్ పెండింగ్లో ఉంచిన 19 స్థానాల్లో పీటముడి పడి ఉన్న ఐదు నియోజకవర్గాల నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తుంగతుర్తి సీటు ఆశిస్తున్న అద్దంకి దయాకర్, డాక్టర్ వడ్డేపల్లి రవి, మిర్యాలగూడ నుంచి కుందూరు రఘువీర్రెడ్డి, ఇల్లెందు నుంచి బాణోతు హరిప్రియ, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్రెడ్డి, బోధ్ నుంచి అనిల్జాదవ్ రాహుల్తో భేటీలో పాల్గొన్నారు. ఒక్కో నేతతో విడివిడిగా సమావేశమైన ఆయన.. సీట్ల కేటాయింపులో ఉన్న సమస్యలను వారితో చర్చించారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, సీటు వస్తుందా లేదా అన్నది మాత్రం రాహుల్ చెప్పలేదు. దీంతో తమకు సీటు వస్తుందా లేదా అన్నది తేలకపోవడంతో వారంతా జాబితా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. -
మూడో జాబితా రెడీ!
సాక్షి, న్యూఢిల్లీ: రెండు విడతలుగా 75 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు మల్ల గుల్లాలు పడుతోంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎట్టకేలకు మరొక జాబితా సిద్ధం చేసింది. తాము 12 స్థానాల్లో పోటీ చేయనున్నామంటూ తెలంగాణ జన సమితి ప్రకటించడంతో కాంగ్రెస్ ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ సమావేశ మయ్యారు. ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థులతో కూడిన జాబితాను మరోసారి సమీక్షించారు. ఈ సమావేశంలో 14 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిత్ర పక్షాలు కోరుతున్న జన గామ, సనత్నగర్ తదితర స్థానాల్లో ఆశా వహులైన పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్రెడ్డి తదితరులకు కుంతియా ఫోన్ చేశారని తెలిపాయి. వీరిని బుజ్జగించే బాధ్యతను కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్కు అప్పగించినట్టు వివరించాయి. కాంగ్రెస్ తుది అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించనున్నట్లు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా తెలిపారు. బీసీలకు టీఆర్ఎస్ కంటే తామే ఎక్కువ సీట్లు ఇస్తామని స్పష్టంచేశారు. ఇప్పటివరకు బీసీలకు 15 సీట్లు ఇచ్చామని, తుది జాబితాలో మరో ఏడు సీట్లు కేటాయిస్తామని వివరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణ లపై రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. మల్లేశం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని పీసీసీని ఏఐసీసీ ఆదేశించింది. రాహుల్ను కలిసిన పొన్నాల, పొంగులేటి... మధ్యాహ్న భోజన విరామ సమయంలో రాహుల్గాంధీని తానూ, పొన్నాల లక్ష్మయ్య కలిసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఖమ్మం స్థానాన్ని ఆశిస్తున్న ఆయన.. ఆ స్థానాన్ని టీడీపీకి అప్పగించడం పార్టీకి నష్టదాయకమైన చర్య అని వివరించినట్టు తెలిపారు. ‘‘నా జీవితకాలాన్ని పార్టీ సేవకు వినియోగించినప్పటికీ, ప్రతిసారీ ఏదో ఒక నెపంతో అన్యాయం చేశారని వివరించాను. పొన్నాల లక్ష్మయ్య 35 ఏళ్లపాటు ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే, ఇప్పుడు ఈ స్థానాన్ని మిత్రపక్షాలకు కట్టబెడుతున్నారంటూ వస్తున్న వార్తలు ఆయన్ను కలవరపరుస్తున్నాయని చెప్పాను. దీనిపై కుంతియా అనుమతితో కోదండరామ్తో సంప్రదింపులు జరపాలని రాహుల్ సూచించారు. దీంతో కోదండరామ్తో సంప్రదింపులు జరుపుతున్నాం’’అని పొంగులేటి తెలిపారు. నిరసనల హోరు... టికెట్ ఆశించి భంగపడిన నేతలు హస్తినలో నిరసనలు నిర్వహించారు. హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి.. రాహుల్ నివాసం ముందు ధర్నా చేశారు. ఓబీసీ కన్వీనర్ చిత్తరంజన్దాస్ తెలంగాణ భవన్లో దీక్ష నిర్వహించారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని, బీసీలకు 40 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో సమావేశమయ్యారు. అయితే, తాను రాహుల్ను కలవలేదని ఆయన చెప్పారు. -
‘మర్రి’కి సనత్నగర్ డౌటే.. బాబు హామీతో ‘కూన’ ప్రచారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారులో తన ముద్ర కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా ఢిల్లీ హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారు! తాను అనుకున్న సీట్లను సాధించడమే కాకుండా టీడీపీలో సీట్లు ఆశిస్తున్న ఒకరిద్దరిని కాంగ్రెస్లో చేర్పించి మరీ బీ ఫారాలు ఇప్పించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు!! బాబు ఒత్తిడి వల్లే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏమాత్రం పోటీ లేని నియోజకవర్గాల్లో సైతం పార్టీ అధిష్టానం కొందరు కాంగ్రెస్ ప్రముఖుల సీట్లను పెండింగ్లో పెట్టిందని తెలుస్తోంది. మరోవైపు బాబు మార్కు రాజకీయంపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు చంద్రబాబు ఆమోదం కోసమే రాహుల్ గాంధీ దూతగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఏపీ రాజధాని అమరావతిలో ఆయనతో సమావేశమయ్యారన్న ప్రచారం సోమవారం ప్రకటించిన మొదటి జాబితాతోనే తేటతెల్లమైందని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తుంటే మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినట్లే మంత్రివర్గం కూర్పు సహా ఇతర అంశాలు ముడిపడి ఉండేటట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. సనత్నగర్, జూబ్లీహిల్స్పై బాబు గురి... మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడైన మర్రి శశిధర్రెడ్డి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సనత్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు ఆయన దరఖాస్తు కూడా చేశారు. మరెవరూ ఇక్కడి నుంచి పోటీలో లేకపోవడంతో ఆయనకు కచ్చితంగా సీటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో మర్రి కంగుతిన్నారు. ఓటర్ల జాబితాలో అవకవతకలకు సంబంధించి టీఆర్ఎస్పై ఒంటరి పోరాటంచేసిన తనకు మొదటి జాబితాలో సీటు దక్కకపోవడంపట్ల మర్రి శశిధర్రెడ్డి అవమానంగా భావిస్తున్నారు. అయితే సనత్నగర్ సీటును టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ నేత కూన వెంకటేశ్గౌడ్ ఈ సీటు తనకే దక్కుతుందన్న ధీమాతో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. చంద్రబాబు హామీ మేరకు తాను ప్రచారం చేసుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. దీంతో ఇప్పుడు శశిధర్రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానంగానే ఉంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకరవ్గం నుంచి తనకు టికెట్ వస్తుందని ఆశించిన సీఎల్పీ మాజీ నేత పీజేఆర్ తనయుడు విష్ణవర్ధన్రెడ్డి మొదటి జాబితా చూసి కంగుతిన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి ఎలాంటి కారణాలు లేవని, ఎందుకు పెండింగ్లో పెట్టారో తెలియదని ఆయన అన్నారు. అయితే మాగంటి గోపీనాథ్ (టీఆర్ఎస్ అభ్యర్థి)ని ఓడించడానికి అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే బాగుంటుందని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎల్బీ నగర్, పటాన్చెరు కూడా... శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన వెంటనే రెండు నెలల క్రితమే ప్రచారం ప్రారంభించి ఇప్పటికే ఓ దశ ప్రచారాన్ని పూర్తి చేసిన ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సామ రంగారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. రంగారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకుని బీ ఫారం ఇవ్వాలన్న చంద్రబాబు సూచనతోనే ఎల్బీ నగర్ సీటును కాంగ్రెస్ పెండింగ్లో పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తు పెట్టుకున్న పార్టీలో టీడీపీ నేతలను చేర్చించి బీ ఫారం ఇప్పించడం బాబుకు కొత్తేమీ కాదు. ఏపీ ఎన్నికల సందర్భంగా 2014లో టీడీపీకి చెందిన కామినేని శ్రీనివాస్ను బీజేపీలో చేర్పించి ఆ పార్టీ బీ ఫారం ఇప్పించడమే కాకుండా బీజేపీ తరఫున మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకరవ్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నా ఆ సీటును టీడీపీకి కేటాయించాలని చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న కాట శ్రీనివాసగౌడ్కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ తీవ్ర స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే ఇక్కడి నుంచి కొలను బాల్రెడ్డికి టికెట్ ఇప్పించాలన్న విజయశాంతి ప్రయత్నాలను కూడా పార్టీ పట్టించుకోలేదు. ఈ సీటును చంద్రబాబు డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే... తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు హవా ఎక్కువగా నడిచే అవకాశం కనిపిస్తోందంటూ కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈలోపే టీఆర్ఎస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయన్నది పార్టీ సీనియర్ నేతల అభిప్రాయంగా ఉంది. టీడీపీతో పొత్తుకన్నా నేరుగా టీఆర్ఎస్తో తలపడితే కాంగ్రెస్ విజయవకాశాలు మెరుగుపడేవని కూడా వారంటున్నారు. చంద్రబాబు సూచనతో ఇప్పుడు అభ్యర్థుల జాబితాలో మార్పులకు అవకాశం ఇచ్చినట్లే భవిష్యత్తులో మంత్రివర్గం కూర్పుకు కూడా అవకాశం ఉంటుందేమోనని ఓ మాజీ ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. -
మళ్లీ ఢిల్లీకి హస్తం నేతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మళ్లీ ఢిల్లీ పయనమయ్యారు. రానున్న ఎన్నికల్లో పోటీచేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు అధిష్టానంతో చర్చల కోసం సోమవారం రాత్రి కొందరు, మంగళవారం ఉదయమే కొందరు హస్తిన బయల్దేరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్తో పాటు ముఖ్య నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, రేవంత్రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్లు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. కాగా, మంగళవారం భక్తచరణ్దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీతో టీపీసీసీ ముఖ్యులు సమావేశం కానున్నారు. స్పష్టత వచ్చిన 54 స్థానాలను వదిలేసి సందిగ్ధత ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంపై చర్చించనున్నారు. రెండు, మూడు పేర్లు పరిశీలనలో ఉన్న స్థానాల్లో టికెట్ ఎవరికి కేటాయించాలనే దానిపై అన్ని కోణాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న అన్ని స్థానాల అభ్యర్థులపై స్పష్టత వచ్చాక జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీ సమావేశం బుధవారం జరగనుంది. ఇందులో అన్ని స్థానాల అభ్యర్థిత్వాలపై మరోసారి చర్చించి తుది జాబితా ఖరారు చేస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇదంతా ఓ కొలిక్కి వచ్చాక 8న రాహుల్ ఆమోదముద్ర తీసుకుని 9న అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. మిత్రులకిచ్చే స్థానాల జాబితాతో ఢిల్లీకి సోమవారం అర్ధరాత్రి వరకు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో చర్చలు జరి పిన టీపీసీసీ నేతలు.. మిత్రపక్షాలకు ఇవ్వాలని నిర్ణయించిన స్థానాల జాబితాను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం వద్ద జరిగే చర్చల్లో మిత్రపక్షాలకిచ్చే స్థానాలను వదిలేసి పార్టీ పోటీచేయాలని నిర్ణయిం చిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. -
అందరికీ తలా ఇంత
సాక్షి, హైదరాబాద్: బీజేపీ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు కసరత్తు చేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలుంటే ఇప్పటివరకు 66 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 53 స్థానాలకు అభ్యర్థులను ఈ నెల 12 నాటికి ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకు ప్రకటించిన 66 స్థానాల్లో ఓసీలకు 31 స్థానాలను కేటాయించింది. అందులో 21 స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి, 7 స్థానాలను వెలమలకు కేటాయించింది. మరో రెండు స్థానాలను బ్రాహ్మణులకు, ఒక స్థానాన్ని వైశ్యులకు కేటాయించింది. 16 స్థానాలకు బీసీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎస్సీలకు 9, ఎస్టీలకు 8 స్థానాలను కేటాయించింది. మరో రెండు స్థానాలను మైనారిటీలకు కేటాయించింది. 66 స్థానాల్లో మహిళలకు 9 స్థానాలు ఖరారు చేసింది. త్వరలో ప్రకటించనున్న మిగతా 53 స్థానాల్లోనూ మరో 8 మంది మహిళలను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్లో మిగిలింది రెండే.. రాష్ట్రంలోని 10 పూర్వ జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు అభ్యర్థుల ఖరారును పూర్తి చేసింది. ఇంకా రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కరీంగనర్లోనూ 13 స్థానాలకు 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రక టించింది. హైదరాబాద్లో 15 స్థానాలుంటే 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎంఐఎంపైనా పోటీకి దింపే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్నగర్లో 14 స్థానాలకు గాను 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు ఉంటే కేవలం 4 స్థానాల్లోనే అభ్యర్థులను ఖరారు చేసింది. మెదక్లో ఇంకా 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. మొదటి, రెండో జాబితాలో పాత మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 14 స్థానాలుం టే అందులో 8 స్థానాలకు, నిజామాబాద్లో 9 స్థానాలు ఉంటే అందులో 4 స్థానాలకు అభ్యర్థు లను ఖరారు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాలు ఉంటే 5 స్థానాలకు, ఖమ్మంలో పది స్థానాలు ఉంటే 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. త్వరలోనే మిగితా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. -
మరో పది స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మరో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నిజమాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. ఇందులో 10 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. వీటిల్లో నిజామాబా ద్ అర్బన్ నుంచి యెండల లక్ష్మీనారాయణ పేరు ఉన్నట్లు సమాచారం. ఖరారు చేసిన నియోజకవర్గాల పేర్లు బయటకు వెల్లడించలేదు. ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా అందులో కొన్నింటిలో అసంతృప్త నేత లు పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పరకాలలో డాక్టర్ సంతోష్ టికెట్ ఆశించగా పార్టీ డాక్టర్ విజయచందర్రెడ్డికి టికెట్ ఇచ్చింది. కోరుట్లలో మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ టికెట్ ఆశిస్తున్నవారు ఉండగా, అమిత్షా నేతృత్వంలో జేఎన్ వెంకట్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ లభించడంతో అసంతృప్తులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యం లో ఖరారైన అభ్యర్థుల పేర్లను బయటకు రానివ్వకుండా చూసుకుంటున్నా రు. ఈ నెల 31న మరోసారి ఎన్నికల కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. ఆ రోజున మరిన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపి నవంబర్ 1న ఆమోదం తరువాతే అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీనియర్ నేత దత్తాత్రేయ, కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో ఉచిత విత్తనాల హామీ! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు ఉచితంగా విత్తనాలు అందించడం సాధ్యమా? ఆ హామీని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిస్తే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ లోతుగా పరిశీలిస్తోంది. సోమవారం ఇక్కడ పార్టీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు వాటిని ఉచి తంగా అందించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న భావనకు వచ్చారు. కృష్ణా, గోదావరి నదీజలాలను కలిపే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చాలని నిర్ణయించారు. మొత్తానికి 3, 4 రోజుల్లో మేనిఫెస్టోలో పొందుపరుచాల్సిన అంశాలతో డ్రాఫ్ట్ రూపొందించి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్కు ఎన్నికల కమిటీ అందజేయనుంది. తరువాత సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. సమావేశంలో కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, మేనిఫెస్టో కమిటీ సభ్యులు మాధవి, రాకేష్, నందా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
ఢిల్లీకి బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. 31 మంది అభ్యర్థులతో కూడిన ఓ షార్ట్ లిస్ట్ను కమిటీ తయారు చేసింది. ఎటువంటి ఇబ్బందిలేని కొంతమంది పేర్లను ఫైనల్ చేసింది. ఈ రాత్రికి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, కృష్ణ దాస్ ఫైనల్ లిస్ట్తో ఢిల్లీ చేరనున్నారు. ఫైనల్ లిస్ట్లోని అభ్యర్థులు : 1. ముషీరాబాద్ : డాక్టర్ లక్ష్మణ్ 2. అంబర్ పేట : కిషన్ రెడ్డి 3. ఉప్పల్ : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 4. ఖైరతాబాద్ : రామచంద్రా రెడ్డి 5. గోశామహల్ : రాజా సింగ్ 6. కల్వకుర్తి : ఆచారి 7. కరీంనగర్ : బండి సంజయ్ 8. మల్కాజిగిరి : రాం చందర్ రావ్ 9. పెద్దపల్లి : గుజ్జుల రామ కృష్ణా రెడ్డి 10. ఆదిలాబాద్ : పాయల్ శంకర్ 11. ముధోల్ : డాక్టర్ రమాదేవి 12. నిజామాబాద్ రూరల్ : ఆనంద్ రెడ్డి 13. కామారెడ్డి : వెంకటరమణారెడ్డి 14. ఆర్మూర్ : వినయ్ రెడ్డి 15. దుబ్బాక : రఘునందన్ రావు 16. పినపాక : లింగయ్య దొర కొడుకు 17. భద్రాచలం : కుంజా సత్యవతి 18. పాలేరు : శ్రీధర్ రెడ్డి 19. తాండూరు : రవి శంకర్ పటేల్ 20. షాద్ నగర్ : శ్రీవర్ధన్ రెడ్డి 21. నారాయణ పేట : రతంగ్ పాండు రెడ్డి 22. కల్వకుర్తి : తల్లోజు ఆచారి 23. అచ్చంపేట : మల్లేశ్వర్ 24. దేవరకద్ర : ఎగ్గెని నర్సింహులు 25. గద్వాల్ : వెంకటాద్రి రెడ్డి 26. భూపాలపల్లి : కీర్తి రెడ్డి 27. పరకాల : విజయ్ చందర్ రెడ్డి 28 మక్తల్ : కొండయ్య 29. మేడ్చల్ : కొంపల్లి : మోహన్ రెడ్డి 30. వైరా : రేష్మ రాథోడ్( నటి) 31. ఆందోల్ : బాబుమోహన్( నటుడు) -
జాబితా వడబోత..!
సాక్షి, యాదాద్రి : శాసనసభకు జరగనున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల జాబితాను వడబోసే పనిలో పడింది. ప్రతి జిల్లానుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెళ్లడంతో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. రాహుల్ దూతలు చేపట్టిన సర్వేలతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి చేయించిన సర్వేల ఆధారంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సామాజిక అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంటూ జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్దాస్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కె.జానారెడ్డితోపాటు పలువురు పార్టీ పెద్దలు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేపట్టారు.అంతా సవ్యంగా జరిగితే జాబితా ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 6 నియోజకవర్గాల్లోఒకే నామినేషన్, ఒకే అభ్యర్థి ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలకు ఒకే నామినేషన్, ఒకే అభ్యర్థి పేరు ఖరారు చేసి అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నుంచి డీసీసీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పేర్లు, తుంగతుర్తి నియోజకవర్గానికి మూడు పేర్లు, మునుగోడు నియోజకవర్గానికి మూడు పేర్లు ప్రతిపాదించి పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. మూడు పేర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఒకరి పేరు మాత్ర మే ఖరారు చేయనున్నారు. ఈ విషయమై శుక్రవారం హైకమాండ్, కమిటీలు మరోమారు సమావేశమై పేరు నిర్ణయించి అధిష్టానానికి పంపనున్నట్లు తెలుస్తోంది. భువనగిరినుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు.. భువనగిరి నియోజకవర్గం కోసం పెద్దఎత్తున ఆ శావహులు అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్న వి షయం తెలిసిందే. అయితే తాజాగా స్క్రీనింగ్ క మిటీ మూడు పేర్లు ఖరారు చేసి వాటిలో ఒకరి పేరు కోసం తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలు స్తోంది. ఒకరి కంటే ఎక్కువ మంది ఆశావహులు టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటైన భువనగిరి అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయ సా ధన ప్రారంభమైంది. ముందుగా మహాకూటమికి భువనగిరి స్థానం కేటాయిస్తారని ప్రచారం జరిగి నా తాజా పరిణామాలతో ఆలోచన లేనట్లేనని తెలుస్తోంది. భువనగిరి సీటు మహాకూటమి అ భ్యర్థి కోసం ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున చేసిన ప్ర యత్నాలు ఫలించలేదు. అయితే అభ్యర్థుల ఎంపి క ఇంకా ఖరారు కాకపోవడంతో పొత్తులో భాగంగా మహాకూటమి భాగస్వాములు భువనగిరిని కోరే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నా రు. అయితే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కుంభం అనిల్కుమార్రెడ్డితోపాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకుల పేర్లను రా ష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకుని పరిశీలి స్తోంది. అయితే ముగ్గురిలో ఒక్క పేరు మాత్రమే అధిష్టానానికి పంపించడానికి నేతల మధ్యన ఏకా భిప్రాయంకోసం కమిటీ ప్రయత్నిస్తోంది. రాహుల్గాంధీ టెలీ కాన్ఫరెన్స్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పనితీరుపై రాహుల్గాంధీ, డీసీసీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎన్ని గెలుస్తాయి, కార్యకర్తల పనితీరు, నాయకుల పనితీరు, సామాజిక సమీకరణలపై సమాచారాన్ని సేకరించారు. ఉమ్మడి జిల్లాల డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ డీసీసీ అధ్యక్షుడి హోదాలో టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పార్టీ పరిస్థితులపై ఆయన తన నివేదికను రాహుల్కు సమర్పించారు. కొనసాగుతున్న సర్వేలు కాంగ్రెస్ పార్టీ సర్వేలు కొనసాగుతున్నాయి. ఏఐ సీసీ, టీపీసీసీ నుంచి రెండు వేర్వేరుగా ఆశావహులపై ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏరోజుకారోజు సర్వేలు నిర్వహిస్తున్నారు. వీటి ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహాకూటమి ఏర్పాటుతో టీఆర్ఎస్ను ఓడించాలంటే ప్రజల్లో పలుకుబడి కలిగిన నాయకులనే పోటీలో ఉంచాలని తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. -
బీజేపీ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే సిట్టింగ్ స్థానాలతో పాటు పార్టీ ప్రభావిత స్థానాల్లో ఎవరెవరిని పోటీలో దించాలన్న దానిపై ఓ స్పష్టతతో ఉన్న బీజేపీ నేతలు మిగతా స్థానాలపైనా దృష్టి సారించారు. ఆశావహుల బలాబలాలను అంచనా వేసి, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న వారినే పోటీలో నిలపాలని యోచిస్తున్నారు. అయితే అభ్యర్థులను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేయకుండా పార్టీ జాతీయ నాయకత్వానికి అభ్యర్థుల పేర్లను పంపి ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా అదే సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే నెలలో బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేసి, ప్రకటించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ నిర్వహించి, ప్రజాబలం ఉన్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టనుంది. త్వరలో నియోజక వర్గ ఇన్చార్జులతో భేటీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల ముందుంచి తమ పార్టీ తరఫున పోటీలో ఉండే అభ్యర్థుల గెలుపునకు కృషి చేసే ప్రణాళికపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే నియోజకవర్గాల ఇన్చార్జులతో సమావేశం నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పాటు పోలింగ్ ఏజెంట్లకు వర్క్షాప్ల నిర్వహణ ఎలా ఉండాలన్న కోణంలో పరిశీలన జరుపుతోంది. అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా ఎస్సీ, బీసీల సమ్మేళనాలను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమ్మేళనాలను నిర్వహించాలన్న దానిపై దృష్టి పెట్టింది. మొదటి వారం కరీంనగర్లో సభ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహాసభలను నిర్వహించేందుకు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ సభలకు ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 50 మందిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయా సభల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా బహిరంగ సభను వికారాబాద్లో పెట్టే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు. అక్టోబర్ మొదటి వారంలో కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం వరంగల్, హైదరాబాద్లోనూ బహిరంగ సభలను నిర్వహించే అవకాశముంది. ఇందులో ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ, మరో సభలో అమిత్ షా పాల్గొనేలా చూడాలని భావిస్తోంది. 27న చేగుంటలో మహిళా సమ్మేళనం.. మహిళల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు దుబ్బాక చేగుంటలో ఈ నెల 27న మహిళా సమ్మేళనం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలపై నియోజకవర్గాల వారీగా చార్జిషీట్ రూపొందించి, వాటిపై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగుల సమస్యలపై మండలాల వారీగా సభలు నిర్వహించడంతోపాటు హైదరాబాద్లో సత్యాగ్రహం నిర్వహించేందుకు బీజేపీ నేతలు చర్యలు చేపడుతున్నారు. -
గెలుపు గుర్రాల వేట!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో టీఆర్ఎస్ వేగంగా దూసుకెళ్తోంది. ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో, ప్రచార నిర్వహణలో అన్ని విషయాల్లో ముందుంటోంది. టీఆర్ఎస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానం మిగిలిన 14 సెగ్మెంట్లకు సైతం అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తిచేసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్కు హైదరాబాద్లోని గోషామహల్ స్థానం ఖరారైంది. రెండు మూడు రోజుల్లో దానం టికెట్పై పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గోషామహల్ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రేమ్సింగ్రాథోడ్కు మంత్రి కేటీఆర్ సర్దిచెప్పారు. పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఖరారు విషయంలో మంత్రి కేటీఆర్ కసరత్తు పూర్తి చేశారు. వీటిలో సగానికిపైగా బీసీ అభ్యర్థులకు కేటాయించేలా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. అలాగే ఉప్పల్కు చెందిన కాంగ్రెస్ నేత బండారి లక్ష్మారెడ్డి సోమవారం కేటీఆర్ను కలిశారు. బుధవారం ఆయన అధికారికంగా పార్టీలో చేరుతారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీని వీడటం ఖాయమవడంతో ఇక్కడ సరైన అభ్యర్థి కోసం పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి బస్వ రాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, గుడిమల్ల రవికుమార్ పేర్లను కేటీఆర్ పరిశీలిస్తున్నారు. అంబర్పేట స్థానానికి కాలేరు వెంకటేశ్ పేరు దాదాపు ఖరారైంది. మేడ్చల్ స్థానాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి ఆశిస్తున్నారు. మల్కాజ్గిరి స్థానాన్ని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావుకు గానీ, ఆయన సూచించే మరో నేతకు గానీ ఇవ్వనున్నారు. ముషీరాబాద్ స్థానం కోసం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్రెడ్డి, మరో నేత ముఠా గోపాల్ ప్రయత్నాలు తీవ్రం చేశారు. ముఠా గోపాల్వైపే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలిసింది. ఖైరతాబాద్ టికెట్ను టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. వచ్చేవారం కేసీఆర్ సభ! ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన టీఆర్ఎస్ వచ్చే వారంలో మరో బహిరంగ సభ నిర్వహించనుంది. వినాయక చవితి నేపథ్యంలో ఈ వారం విరామం ఇచ్చి వచ్చే వారం సభ నిర్వహించి వరుస గా కొనసాగించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే వారం బహిరంగ సభ కోసం మహ బూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడ సభ నిర్వహించాలనే విషయంపై తుది నిర్ణయం జరగాల్సి ఉంది. అసంతృప్తులకు కేటీఆర్ బుజ్జగింపులు.. పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియతో పాటు టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతలకు సర్దిచెప్పే బాధ్యతలను కేటీఆర్ చూసుకుంటున్నారు. టికెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన నేతల వద్దకు తన తరపున పార్టీ ముఖ్యులను పంపిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నేతలతో చర్చించే బాధ్యతను మేయర్ బొంతు రామ్మోహన్కు అప్పగించారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బొంతు మూడు రోజులుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలలో అసంతృప్తులను సోమవారం మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. అభ్యర్థులపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ♦ శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. జగదీశ్వర్గౌడ్తో పాటు ఆయన భార్య పూజిత హఫీజ్పేట కార్పొరేటర్గా ఉన్నారు. బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సోమవారం ఉదయమే జగదీశ్వర్గౌడ్ ఇంటికి వెళ్లారు. జగదీశ్వర్గౌడ్ సతీమణి పూజిత ఆధ్వరంలోని అక్కడి స్థానిక నేతలతో కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. తాజా మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై మంత్రి కేటీఆర్కు వారు ఫిర్యాదు చేశారు. ♦ జూబ్లీహిల్స్ టికెట్ను మాగంటి గోపీనాథ్కు కేటాయించడంతో నియోజకవర్గంలోని దాదాపు అందరు కార్పొరేటర్లు అసంతృప్తిగానే ఉన్నారు. వారందరినీ బొంతు రామ్మోహన్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మంత్రితో మాట్లాడించారు. గోపీనాథ్పై అందరూ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోసం కలసి పని చేయాలని అందరికీ సూచించారు. ♦ ఎల్బీనగర్ స్థానానికి టీఆర్ఎస్ ప్రకటించిన రామ్మోహన్గౌడ్పై అక్కడి మెజారిటీ కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు. ముగ్గురు మినహా నియోజకవర్గంలోని అందరు కార్పొరేటర్లూ మంత్రి కేటీఆర్కు వద్దకు వచ్చారు. రామ్మోహన్గౌడ్ వ్యవహారశైలితో పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పారు. బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కార్పొరేటర్లతో చర్చల సమావేశంలో ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఎంత సర్ది చెప్నినా ఎల్బీనగర్ కార్పొరేటర్లు అసంతృప్తితోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ♦ ఖమ్మం జిల్లా మధిర టికెట్ ఆశించిన బొమ్మెర రామ్మూర్తి మంత్రి కేటీఆర్ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి రామ్మూర్తి వచ్చారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని, పార్టీలో సముచిత స్థానం ఉంటుందని రామ్మూర్తికి కేటీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని రామ్మూర్తి చెప్పారు. -
అది నకిలీ జాబితా..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై సమాలోచనలు సాగుతుండగానే సోషల్ మీడియాలో తొలి జాబితా విడుదల కావడం పార్టీలో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వచ్చిన జాబితా నకిలీదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రాథమిక జాబితాతో హైకమాండ్తో స్క్రీనింగ్ కమిటీ మంగళవారం తుదివిడత చర్చలు జరిపినా కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్సిగ్నల్ లభించక ముందే తొలి జాబితా వెల్లడి కావడం పట్ల పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. తొలి జాబితా విడుదలైందన్న వార్తలతో అయోమయానికి గురైన పార్టీ శ్రేణులకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత జాబితాను ఏఐసీసీ ప్రకటించిందని అభ్యర్ధుల పేర్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితా నకిలీదని చెప్పారు. ఈ జాబితాను ఏఐసీసీ విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమైన అనంతరమే జాబితా విడుదలవుతుందని, ఇప్పటి వరకూ సీఈసీ భేటీ కాలేదని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధుల ఖరారుకు సంబంధించి డీసీసీలు, పరిశీలకులు, రాష్ట్ర కమిటీ సిఫార్సులను వడపోసి గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు కోరడం వివాదాస్పదమైంది. -
బీజేపీ ఐదో జాబితాలో పటేళ్లకు ప్రాధాన్యం
సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శుక్రవారం 13 మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో ప్రముఖ పటేల్ నేతలకు, పలు కొత్త ముఖాలకు చోటు కల్పించింది. ప్రముఖ పటేల్ నేతలు పంకజ్భాయ్ దేశాయ్ను నడియాద్ నుంచి, వల్లభ్భాయ్ కకాడియాను తక్కర్బపనగర్ నుంచి మరోసారి బరిలో దింపింది. ఇక ధనేరా, వద్గాంల నుంచి పటేల్ వర్గానికి చెందిన మావ్జీబాయ్ దేశాయ్, విజయ్భాయ చక్రవర్తిలను తొలిసారిగా నామినేట్ చేసింది. ఇదార్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ స్పీకర్ రామ్లాల్ ఓహ్రా స్థానంలో ప్రముఖ గుజరాతీ నటుడు హితేష్భాయ్ కనోడియాను బరిలో దింపింది. ఇక పంచ్మహల్ జిల్లాలోని కలోల్ నుంచి రెండుసార్లు ఎంఎల్ఏగా ప్రాతినిథ్యం వహించిన అరవింద్ సింహ్ రాథోడ్ స్ధానంలో గోద్రా ఎంపీ ప్రభాత్ సింహ్ చౌహాన్ కోడలు సుమన్బెన్ చౌహాన్ను రంగంలోకి దింపింది. తాజా జాబితాతో గుజరాత్ అసెంబ్లీలోని 182 సీట్లకు గాను 147 స్ధానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.రాష్ట్రంలో డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
మారిన అభ్యర్థులు
సీటు వచ్చిందన్న ఆనందం గంటల వ్యవధిలో ఆవిరి అవుతుండడం అన్నాడీఎంకే అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణాన ఏ అభ్యర్థిని అమ్మ మారుస్తారో అన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఇందుకు కారణం మంగళ వారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రంలోపు పదమూడు మంది అభ్యర్థుల్ని మార్చడమే పల్లావరం సీటు, సినీ నటి సీఆర్ సరస్వతిని వరించింది. టీనగర్ బరిలో సత్యనారాయణ అలియాస్ టీ నగర్ సత్యను దించారు. సాక్షి, చెన్నై : మళ్లీ అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అందరికన్నా ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 227 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులకు, ఏడు స్థానాలు మిత్రులకు కేటాయించి, అందరూ రెండాకుల చిహ్నం మీద బరిలోకి దిగే విధంగా కార్యాచర ణ సిద్ధం చేశారు. అభ్యర్థుల జాబితా ప్రకటిం చి రెండు రోజులైనా కాక ముందే, పలువురిపై విమర్శలు ఆరోపణలు బయలు దేరి ఉన్నా యి. ఓ అభ్యర్థి అయితే, సీటు దక్కిందన్న ఆనందంతో పార్టీ జెండా తలకిందులుగా ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది. ఇ లా, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న వారితో పాటుగా జెండాను తలకిందులుగా ఎగుర వేసినందుకుగాను ఆ అభ్యర్థి సీటు గం టల్లో గల్లంతు కాక తప్పలేదు. అలాగే, పార్టీలో సీనియర్లుగా, బలమైన నాయకులుగా ఉన్న వాళ్లకు చోటు దక్కక పోవడం చర్చకు దారి తీయడంతో, వారికి అవకాశం కల్పించే దిశగా జాబితాలో మార్పుల దిశగా జయలలిత ముందుకు సాగుతున్నారు. అభ్యర్థులను మార్చడం జయలలితకు కొత్తేమి కాదన్న విషయం తెలిసిందే. అయితే, సీటు దక్కించుకున్న వాళ్లు ఆనందంలో కేరింత లు కొట్టేందుకు కూడా సాహసించ లేని పరిస్థితి. ఒక వేళ కొట్టిన గంట వ్యవధిలో ఆవిరి అవుతున్నాయి. ఇందుకు కారణం ఎవరి అభ్యర్థిత్వం ఎప్పుడు ఊడుతుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉండడమే. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రంలోపు పన్నెండు మంది అభ్యర్థులను జయలలిత మార్చడం గమనార్హం. మారిన అభ్యర్థులు : ఇది వరకు ప్రకటించిన జాబితాలో మార్పులు చేర్పులతో కొన్ని స్థానాలకు అభ్యర్థులను మారుస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు ప్రకటించిన అభ్యర్థుల్ని తొలగించి కొత్త పేర్లను ప్రకటించారు. ఆ మేరకు పల్లావరం బరిలో సినీ నటి సీఆర్ సరస్వతిని రంగంలోకి దించారు. టీ నగర్ నుంచి సత్యనారాయణ పోటీ చేస్తారని ప్రకటించారు. మెట్టూరు నియోజకవర్గంలో పార్టీ నిర్వాహక కార్యదర్శి సెమ్మలై, కాట్టుమన్నార్ కోవిల్ కడలూరు వెస్ట్ జిల్లా కార్యదర్శి మురుగమారన్, పూంబుహార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎస్ పొన్రాజ్, వేదారణ్యం నుంచి ఓఎస్ మణియన్, మన్నార్ కుడి నుంచి నీడామంగళం పదమూడో వార్డు సభ్యుడు ఎస్ కామరాజ్, నాగుర్ కోవిల్ నుంచి ఎమ్మెల్యే నాంజిల్ మురుగన్, మదురై ఉత్తరం నియోజకవర్గం నుంచి రాజన్ చెల్లప్ప పోటీ చేస్తారని, అరుప్పుకోటై నుంచి వైగై సెల్వన్ బుధవారం జయలలిత ప్రకటించారు. అలాగే, పుదుచ్చేరిలోని తిరుబువనం నుంచి శంకర్, తిరునల్లారు నుంచి జి మురుగయ్యన్, కారైక్కాల్ నుంచి కేఏ హసన్ పోటీ చేస్తారని ప్రకటించడం గమనార్హం. అభ్యర్థుల మార్పు పర్వానికి అమ్మ శ్రీకారం చుట్టడంతో, ఏ క్షణాన ఏ నియోజకవర్గానికి అభ్యర్థులు మారుతారో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉన్నది. అలాగే, వాసన్ నేతృత్వంలోని తామాకాతో చర్చలు సాగుతుండటంతో వారికి సీట్ల కేటాయింపు నిమిత్తం, ఎవరి అభ్యర్థితత్వం గల్లంతు కాబోతున్నదో అన్న ఎదురు చూపులు అన్నాడీఎంకేలో బయలుదేరాయి. అమ్మ దర్శనం కరువు : సీటు వచ్చిందన్న ఆనందంతో పలువురు అభ్యర్థులు చెన్నై పోయెస్ గార్డెన్ బాట పట్టారు. అమ్మను కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే, వారికి పోయేస్ గార్డెన్ తలుపులు తెరచుకోలేదటా. దీంతో అక్కడి గేట్ నుంచే అమ్మకు అందజేసే విధంగా పుష్పగుచ్చాలను అప్పగించి వెను దిరుగుతుండడం గమనార్హం. ఇక, అన్నాడీఎంకేలోని యాభై జిల్లాల కార్యదర్శుల్ని ఆగమేఘాలపై చెన్నైకు పిలిపించారు. అమ్మ ప్రచార పర్యటన ఏర్పాట్లు, ఎన్నికల కసరత్తులపై పార్టీ సిద్ధాంతల ప్రచార కార్యదర్శి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై వారికి ఉపదేశాలు ఇవ్వడం విశేషం. అదే సమయంలో నాగపట్నం జిల్లా కార్యదర్శిగా వ్యవహరించిన జయపాల్ను తొలగించి ఆయన స్థానంలో వేదారణ్యం అభ్యర్థి ఓఎస్ మణియన్ను నియమించారు.