Chicken prices
-
చికెన్..చాలా రేటు గురూ!
శ్రీకాకుళం/(పీఎన్ కాలనీ): సిండికేట్ల చేతిలో పడి చికెన్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. కూరగాయలు, ఆయిల్, నిత్యావసర సరుకుల ధరలు నిర్ణయించే అధికారం కలెక్టర్, మార్కెటింగ్శాఖ అధికారుల చేతుల్లో ఉంటుంది. చికెన్ ధరలు మాత్రం హోల్సేల్ చికెన్ వ్యాపారులు, వారి సిండికేట్ వారే రేట్లు ‘ఫిక్స్’ చేస్తారు. విశాఖపట్నం, విజయనగరంలో ఒక రేటు ఉంటే శ్రీకాకుళంలో మాత్రమే ఈ రెండు జిల్లాలకంటే రూ.20 ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఫారాలకు జిల్లాలోనే ఫీడ్ దొరుకుతుంది, కోళ్ల ఫారాలు సైతం జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాకు సరిపడా సరుకు లేకుంటే విశాఖ, అనకాపల్లి నుంచి తీసుకువస్తారు. కానీ ధరలు మాత్రం విశాఖ, విజయనగరం కంటే ఎక్కువే ఉంటున్నాయి. ఈ సిండికేట్లో త్రిమూర్తుల్లా ముగ్గురు వ్యక్తులు ఈ వ్యవహారమంతా నడిపిస్తోన్నట్లు చికెన్ షాపుల యజమానులు గుసగుసలాడుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా స్కిన్లెస్ సుమారు రూ.260కి పైగా ధర పలుకుతోంది. విశాఖపట్నం, విజయనగరంలో రూ.240కి అమ్ముతున్నారు. ఇవి పత్రికల్లో వచ్చే ధరలు. చికెన్షాపుల యజమానుల వారి వ్యాపారాన్ని బట్టి ధర తగ్గించి అమ్మేవారు కొందరు, మరికొంతమంది దానికంటే ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ/ప్రవేటు హాస్టల్స్, హోటల్స్, దాబాల నిర్వాహకులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా తర్వాత ఆదివారం ఇంకెంత ధర పెంచేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఒడిశా నుంచి కొని.. జిల్లాలోని పలువురు వ్యాపారులు ఒడిశా నుంచి కోళ్లను తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. జిల్లాలో కంటే ఒడిశాలో ధర కిలోకు రూ.40వరకు తక్కువగానే ఉంటుంది. తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో వ్యాపారులు, సిండికేటుగాళ్లు ఎక్కువ ధరకు అమ్ముతు న్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల కంటే తక్కు వ ధరకు ఇవ్వాల్సింది పోయి తిరిగి దూర ప్రాంతాల నుంచి తెస్తున్నామనే నెపంతో ధరలు అధికంగా పెంచేసి రెట్టింపు లాభాల్ని ఆర్జిస్తున్నారు. ధరల నియంత్రణపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ధరలు నియంత్రించాల్సిందే చికెన్ ధరల నియంత్ర ణ అధికారుల చేతుల్లో ఉంటే బాగుంటుంది. హోల్సేల్ వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. – ప్రకాష్, చికెన్షాపు, రైతుబజారు రోడ్డు, శ్రీకాకుళం. వ్యాపారాలు చేయలేకపోతున్నాం చికెన్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు. చికెన్, గుడ్లు ధరలు పెంచడంతో దాబాకి వచ్చేవారికి అధిక ధరలకు ఆహారాన్ని అమ్మలేకపోతున్నాం నష్టాన్ని భరించలేకపోతున్నాం. – ఎం.నాగభూషణ్, శ్రీలక్షి్మదుర్గా దాబా, బలగరోడ్ ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు చికెన్, గుడ్ల ధరల నియంత్రణ మా చేతుల్లో ఉండదు. వాటి సంరక్షణ, పోషణకు సంబంధించిన ప్రోత్సాహమంతా పశు సంవర్ధక శాఖ నుంచి ఉంటుంది. ధరల నియంత్రణకు జిల్లాలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో కూడిన కమిటీ వేస్తే నియంత్రణ సాధ్యమ య్యే అవకాశం ఉంటుంది. – రావిపల్లి మురళీధర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు -
కొండెక్కిన చికెన్! మంట పుట్టిస్తున్న మటన్..
ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు. నిన్నా మొన్నటి వరకు రూ.200 పలికిన చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 300 రూపాయలకు చేరుకోవటంతో సామాన్యులు హడలిపోతున్నారు. కోళ్ల దాణా ధరలు పెరగడంతోపాటు, వేసవి తీవ్రత నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్ అధికమైందని, దీని వల్లే చికెన్ ధరలు భారీగా పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దాణా ధర కేజీ 70 రూపాయలు పలుకుతుండటంతో కోళ్ల ఉత్పత్తిపై అనాసక్తి చూపుతున్నారు. పెరిగిన చికెన్ ధరతో తమకు నష్టమే జరిగిందని, విక్రయాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని కొందరు మాంసాహార ప్రియులు మాత్రం కేజీ చికెన్కు బదులు అర కేజీతో సర్దుకుంటున్నారు.మటనా.. వొద్దుద్దులే..!మాంసాహార ప్రియులకు మటన్ ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 700 రూపాయలు పలికిన మటన్ ధర ఇప్పుడు రూ.800 నుంచి రూ.900 పలుకుతుండటంతో కొనుగోలుదారులకే కాదు వ్యాపారులకు సైతం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మండీ మార్కెట్ ఏజెంట్లు జీవాల రేట్లను విపరీతంగా పెంచేయటంతో మేకపోతులు, పొట్టేళ్లను అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని, అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పెరిగిన ధరలు త్వరలోనే తగ్గుముఖం పట్టాలని మాంసాహార ప్రియులు కోరుకుంటున్నారు. -
భారీగా తగ్గిన చికెన్ ధర కేజీ రూ.72
ఆలమూరు: కార్తిక మాసం, అయ్యప్ప స్వాముల దీక్షల ప్రభావంతో నెల రోజులుగా చికెన్ విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ చికెన్ ధర గణనీయంగా పడిపోయింది. లైవ్ కోడి ధర రికార్డు స్థాయిలో మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది. ఈ పరిణామం కోళ్ల ఉత్పత్తి కంపెనీలు, కోళ్ల రైతులు, వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేస్తూండగా.. మాంసాహార ప్రియులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఉత్పత్తిలో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన వివిధ కంపెనీల నుంచి సాధారణంగా ప్రతి రోజూ సుమారు 350 టన్నుల బ్రాయిలర్, లేయర్ కోళ్ల ఎగుమతులు జరుగుతున్నాయి. వాతావరణం సానుకూలంగా ఉండటంతో ఇటీవల కోళ్ల ఉత్పత్తి పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో కార్తిక మాసం ప్రభావంతో చికెన్కు ఒక్కసారిగా డిమాండు పడిపోయింది. దీంతో ప్రస్తుతం రోజుకు 200 టన్నుల వరకూ మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి. సరఫరా తగ్గినా విక్రయాలు లేకపోవడం ధరలు మరింతగా పడిపోవడానికి కారణమైంది. ఫలితంగా చికెన్ దుకాణాలపై ఆధారపడిన చిరు వ్యాపారులు ఆదాయం పడిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ధర తగ్గినా.. బహిరంగ మార్కెట్లో చికెన్ ధరలు భారీగా తగ్గినా ఆ మేరకు విక్రయాలు మాత్రం పెరగడం లేదు. దీనివల్ల హోల్సేల్ వ్యాపారులు నెల రోజుల క్రితం కిలో కోడి లైవ్ రూ.132కు విక్రయించగా.. ప్రస్తుతం అది కాస్తా ఏకంగా రూ.62కు పడిపోయింది. రెండు కేజీల బరువు వచ్చే వరకూ కోడిని పెంచితే సరాసరి రూ.210 వరకూ ఖర్చవుతుందని, ప్రస్తుతం ఆ బరువు కలిగిన కోడిని అమ్మితే రూ.84 వరకూ నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ కోడి కేజీ హోల్సేల్ ధర రూ.72గా ఉండగా.. చికెన్ కేజీ స్కిన్తో రూ.150, స్కిన్లెస్ రూ.175 వరకూ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి మరో నెల రోజులు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో దాణా ఖర్చు భరించలేక కంపెనీదారులు, రైతులు ఉత్పత్తి అయిన కోళ్లను నష్టమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్కు తరలిస్తున్నారు. డిమాండ్ తగ్గిపోయింది బహిరంగ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా చికెన్కు డిమాండ్ తగ్గిపోయింది. దీనివల్ల మూడేళ్ల కనిష్ట స్థాయికి చికెన్ ధర పడిపోయింది. దీంతో దిగుమతులు తగ్గించుకోవడంతో వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరగడం లేదు. కోళ్ల ధర తగ్గడంతో రైతులు, సరఫరాదారులతో పాటు గ్రామీణ చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోళ్ల రైతులు ఏడాది పాటు పడిన కష్టమంతా ఒక్క ఈ నెలలోనే నీరుగారిపోతోంది. – బొబ్బా వెంకన్న, హోల్సేల్ కోళ్ల వ్యాపారి, పెదపళ్ల -
చికెన్ ధరకు రెక్కలు
తణుకు: చికెన్ ధరలు మాంసంప్రియులకు చుక్కలను చూపుతున్నాయి. ఎండల ధాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గగా, డిమాండ్ పెరిగి ధరపై ప్రభావం చూపుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ రూ.230, స్కిన్ చికెన్ రూ.200 ధర పలకగా ప్రస్తుతం మార్కెట్లో కిలో బ్రాయిలర్ చికెన్ ధర రూ.330కు, స్కిన్తో రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మండుటెండలకు బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దాణా తీసుకోకపోవడం వంటి కారణాలతో చికెన్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. మరోవైపు ఎండల ప్రభావంతో గుడ్ల ఉత్పత్తి కూడా 20 శాతానికి తగ్గింది. ఇంకా పెరిగే అవకాశం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో చికెన్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎండల తీవ్రతకు మాంసం ఉత్పత్తి పడిపోవడంతో కిలో రూ.330 వరకు చేరిన చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కోళ్లు తట్టుకోలేవు. ప్రస్తుతం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కోళ్లను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. నెల రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్న కోళ్లు వడగాలులకు తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. పౌల్ట్రీ రైతులు సైతం ఏప్రిల్, మే నెలల్లో వీటి ఉత్పత్తికి వెనుకంజ వేస్తూ వచ్చారు.. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడం తద్వారా ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా వేసవిలో కోళ్లు 6 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. ఈ సారి వడగాలుల తీవ్రత తారాస్థాయికి చేరడంతో 16 శాతానికి పైగా మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. వేసవిలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. ఈ పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు నష్టాలబాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. గతంలో లైవ్ చికెన్ ధర కిలో రూ.110 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. కోళ్ల ఉత్పత్తి పడిపోయింది సాధారణంగా ఎండాకాలంలో చికెన్ ధర తగ్గుముఖం పడుతుంది. ఈ సారి ఎండల తీవ్రత కారణంగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం దిగుబడి తగ్గింది. మరోవైపు కోళ్ల ఫారాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు పెరిగాయి. దీంతో గత కొద్ది రోజులుగా కోళ్ల ఉత్పత్తి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధర పలుకుతోంది. దీంతో గతంతో పోల్చితే 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. – గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు -
రికార్డు స్థాయిలో చికెన్ ధర@ 550
వికారాబాద్: చికెన్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు సరైన రేట్లు లేకపోవడంతో మార్కెట్ కుదేలైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలువురు రైతులు ఫారాలు మూసేశారు. ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటాయి. స్కిన్ లెస్ చికెన్ కిలోకు రూ.320 వరకు పలుకుతోంది. బోన్ లెస్ కావాలంటే రూ.550 చెల్లించాల్సిందే. లైవ్ బర్డ్ కిలోకు రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఇవే అత్యధిక ధరలని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలికాలంలో శుభకార్యాలతో పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో చికెన్కు డిమాండ్ పెరిగింది. పౌల్ట్రీ వైపు అడుగులు జిల్లా రైతులు ఇప్పుడిప్పుడే పౌల్ట్రీ రంగం వైపు దృష్టిసారిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకం ద్వారా ఏటా 6 బ్యాచ్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో కోళ్ల పెంపకం లాభదాయకంగా కొనసాగుతూ వచ్చింది. జిల్లాలోని బొంరాస్పేట్లో– 4, దోమ 16, యాలాల 18, వికారాబాద్ 7, పూడూరు 12, పరిగి 12, మోమిన్పేట్ 6, మర్పల్లి 9, కుల్కచర్ల 5, కొడంగల్, ధారూరులో ఒక్కోటి చొప్పున పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. ఎండల ప్రభావంతోనే.. కరోనా తర్వాత ప్రజలు మాంసాహార వాడకాన్ని పెంచారు. ఇందులోనూ చికెన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అవసరం మేర ఉత్పత్తి లేకపోవడం ప్రస్తుతం కోడిమాసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎండాకాలం కావడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఎదుగుదలకు ఎక్కువ సమయం పడుతోంది. ఎలాగైనా వీటిని బతికించుకునేందుకు రైతులు, వ్యాపారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఫారాల వద్ద కూలర్లు, రెయిన్ డ్రిప్, స్ప్రీంక్లర్లు ఏర్పాటు చేసి చల్లదనం అందిస్తున్నారు. దాణా, మందుల ధరలు రెట్టింపు కోళ్లకు దాణాగా ఉపయోగించే మొక్కజొన్న, సోయా, తవుడు ధరలు పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్లు, మందుల ధరలు కూడా రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండల వేడిమికి నిత్యం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు. తినడం తగ్గించాం గతంలో వారంలో రెండు రోజులు చికెన్ను తినే వాళ్లం. ప్రస్తుతం పెరిగిన ధరలతో రెండు వారాలకు ఒకసారి మాత్రమే తీసుకెళ్తున్నాం. మార్కెట్లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చికెన్ బదులు చేపలు తెచ్చుకుంటున్నాం. – గుడిసె బాబు, బొంపల్లి ఆశించిన లాభాలు లేవు గతంలో చికెన్ ధరలు పడిపోవడంతో ఆశించిన స్థా యిలో లాభాలు రాలే దు. దీంతో కొంతమంది ఫారా ల నిర్వహణ నుంచి తప్పుకొన్నారు. పదిహేను రోజు లుగా మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి బయట పడుతున్నాం. – యాదగిరిరెడ్డి, చికెన్ సెంటర్ నిర్వాహకుడు -
భారీగా తగ్గిన చికెన్ ధరలు కిలో ఎంతంటే?
అల్లిపురం (విశాఖ దక్షిణ): చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు రూ.220 నుంచి రూ.160కు చేరాయి. కిలోకు దాదాపు దాదాపు రూ.60 తగ్గింది. అయినప్పటికీ కొంతమంది రిటైల్ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్రాయిలర్ కోడి లైవ్ ధర రూ.90కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్డుదీ అదే దారి.. కోడిగుడ్డు ధరలు పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వంద కోడిగుడ్లు జనవరిలో రూ.555 ఉండగా, ప్రస్తుతం రూ.440 ఉంది. రిటైల్లో మాత్రం వ్యాపారులు ఒకటి రూ.6 నుంచి రూ.6.50 వరకు అమ్ముతున్నారు. గిట్టుబాటు కావడం లేదు కోళ్ల రైతులకు ప్రస్తుత ధరలు గిట్టుబాటు కావటం లేదు. పిల్ల రేటు, ఫీడ్ రేటు పెరిగిపోయింది. మరో పక్క ట్రాన్స్పోర్టు చార్జీలు, లేబర్ చార్జీలు పెరిగిపోయాయి. చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వం చికెన్ వ్యాపారులను ఆదుకోవాలి. – టి.అప్పారావు, బ్యాగ్ అధ్యక్షుడు -
చికెన్.. ధర మండెన్.. షేర్ మార్కెట్ను తలపిస్తున్న ధరలు
సాక్షి, నంద్యాల: చికెన్ ధర అమాంతం పెరుగుతూ, పడిపోతూ షేర్ మార్కెట్ను తలపిస్తోంది. వ్యాపారులు రోజుకొక ధర నిర్ణయిస్తూ తమ వ్యాపారాన్ని మూడు కోళ్లు.. ఆరు కిలోలుగా సాగిస్తున్నారు. ఆదివారం వస్తే ధర కొండెక్కుతుంది. గత ఆదివారం రూ. 200 ప్రకారం విక్రయించగా ఈ ఆదివారం మాత్రం రూ. 220గా నిర్ణయించారు. ఇక మిగిలిన రోజుల్లో రూ.180 పైనే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఆదివారం విక్రయాలు అధికంగా ఉంటాయని, దీంతో కోళ్లు దొరకకపోతుండటంతో అధిక ధరలు వెచ్చించి తెస్తుండటం వల్లే ధర పెంచుతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండంగా నాటు కోడి మాసం కేజీ రూ.500 పైనే పలుకుతుంది. చదవండి: (సార్ ఇటువైపు చూడండి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కొలగట్ల) -
కొండ దిగొస్తున్న కోడి..! తగ్గిన చికెన్ ధరలు.. హైదరాబాద్లో మాత్రం..!
కడప అగ్రికల్చర్: మొన్నామొన్నటి దాకా కొండ దిగని కోడి మాంసం ధరలు వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. మరో వారం రోజుల్లో శ్రావణమాసం కూడా ప్రారంభంకానుండటంతో చికెన్ ధర మరింత తగ్గవచ్చని వ్యాపారులు అంటున్నారు. 20 రోజుల క్రితం రూ.250 పైన ఉన్న ధర వారం రోజుల నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం స్కిన్ లెస్ రూ. 170, విత్ స్కిన్ కిలో రూ. 150 వచ్చింది. చదవండి👉🏻గ్లూకోజ్ పౌడర్ అనుకొని.. ప్రస్తుతం ఎండల తగ్గి వాతావరణం చల్లబడటంతోపాటు పాటు వర్షాలు కూడా వస్తుండటంతో చికెన్ ఉత్పత్తి కొంచం పెరిగిందని వ్యాపారులు తెలిపారు. వేసవిలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 300 పైగా పలికింది. దీంతో సామాన్యులు చికెన్ తినాలంటే జంకే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కొండ దిగి వస్తుండడంతో పేద, మద్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బోనాల జాతర నేపథ్యంలో హైదరాబాద్లో చికెన్ ధరలు పెద్దగా దిగిరాలేదు. అక్కడ స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.240 ఉండగా.. లైవ్ బర్డ్ 180 గా ఉంది. బోన్లెస్ చికెన్ 280 గా ఉంది. చదవండి👉🏻అమ్మో.. అరటిపండు.. డజన్ రూ.80 పైమాటే.. ఎందుకంటే? -
Chicken Price: చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్టైం రికార్డు
చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు విక్రయిస్తున్నారు. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. – ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు) చికెన్ ధర ఆల్టైమ్ రికార్డు నమోదు చేసింది. పౌల్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధింగా హోల్సేల్ మార్కెట్లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు చేరింది. రోజు రోజుకూ ఎగబాకుతూ మాంసం ప్రియులు చేతి చమురు వదిలిస్తోంది. పెరుగుతున్న ధరలతో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగర మార్కెట్లో మటన్ ధర నిలకడగా కొనసాగుతోంది. లైవ్ ధర సైతం రికార్డు స్థాయిలో కేజీ రూ.166 చేరింది. పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్టైం రికార్డు : కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం చికెన్ రికార్డు స్థాయి ధరలను నమోదు చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చికెన్ వైపు వినియోగదారుల అంతగా మొగ్గు చూపలేదు. ఓ దశలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.80 దిగివచ్చింది. అయితే సెకండ్ వేవ్ తగ్గిన అనంతరం చికెన్ ధర పెరుగుతూ వచ్చింది. ఓ దశలో కిలో రూ.280కి చేరి ఆల్టైం రికార్డును నెలకొల్పింది. తరువాత ఆ రికార్డులను అధిగమించే ఏకంగా రూ.312కు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చికెన్ ధర కిలో రూ.200 మార్కును దిగకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న రూ.214 వద్ద నిలకడగా ఉన్న ధర మార్చి 1 నాటికి రూ.280కి ఎగబాకింది. అనంతరం కొద్దిపాటి తగ్గుదల నమోదవుతూ వచ్చిన మే 1వ తేదీ నుంచి ధరల పెరుగుదల రికార్డు స్థాయికి చేరింది. మే 1వ తేదీ రూ.228గా ఉన్న కిలో స్కిన్లెస్ ధర మే 12వ తేదీ నాటికి రూ.312కు ఎగబాకి ఆల్టైం రికార్డు సృష్టించింది. రూ.320 మార్కు దాటే అవకాశముంది కోవిడ్ రెండో దశ అనంతరం నుంచి చికెన్ ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. గతేడాది రూ.280 చేరి ఆల్టైం రికార్డు సృష్టించిన ధర ఈ ఏడాది ఏకంగా రూ.300 మార్కును దాటేసింది. ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతోనే రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఎండాకాలం కావడంతో పౌల్ట్రీల్లో కోళ్లు పెరుగుదల సమయం ఎక్కువగా ఉంటుంది. వాటిని మార్కెట్కు తరలించేందుకు కావాల్సిన బరువు పెరిగేందుకు ఇతర సీజన్స్తో పోలిస్తే ఎక్కువ రోజులు పడుతుంది. దీంతో దాని ప్రభావం ఉత్పత్తిపై పడటంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ఈ ఏడాది కోళ్లకు మేతగా ఉపయోగించే మొక్కజొన్న, ఆయిల్ తీసిన సోయ, తవుడు ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటి ప్రభావం కారణంగా కూడా చికెన్ ధర ఆకాశాన్ని అంటుతున్నాయి. – సుబ్బారావు, పౌల్ట్రీ, హోల్సేల్ చికెన్ వ్యాపారి -
Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఏపీలో కొన్ని ఏరియాల్లో త్రిబుల్ సెంచరీ దాటింది స్కిన్లెస్ చికెన్ కేజీ ధర. ఎండాకాలం, పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ డిమాండ్ పెరిగి.. ధరలూ పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. పది రోజుల గ్యాప్లో 70 నుంచి 80 రూపాయల దాకా పెరిగింది. కూరగాయల దిగుబడి తగ్గిపోవడం, హోటల్స్.. రెస్టారెంట్లలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వ్యాపారాలు జోరందుకోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఎండకు కోళ్లు చనిపోతాయనే భయంతో.. కొందరు కోళ్ల ఫారం వ్యాపారులు బరువు పెరగకుండానే వెంటనే అమ్మేస్తున్నారు. -
రెండు నెలలుగా దిగిరాని చికెన్ ధర
మండపేట: రెండు నెలలుగా చికెన్ ధర దిగిరానంటోంది. స్కిన్లెస్ కిలో రూ.300ల నుంచి రూ.320లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ నెల మొదలుకావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి. వేసవి ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, కోనసీమలోని అమలాపురం, రావులపాలెం, కాకినాడలోని తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీలు వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్ది కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోడిమేత ధరలు గణనీయంగా పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. మొక్కజొన్న కిలో రూ. 14లు నుంచి రూ. 25లకు పెరుగ్గా, సోయా రూ. 40లు నుంచి రూ. 90లకు పెరిగిపోయింది. అన్ని మేతలు మిక్స్చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ. 35లకు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుండగా, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ. 110లు వరకు వ్యయమవుతోందని వారంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది బ్రాయిలర్ కోళ్ల రైతులు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్పై కేవలం కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫామ్లు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా అదే ధర స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధికశాతం పామ్లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.200లు వరకు ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300లకు, లైవ్ కిలో రూ. 100ల నుంచి 150లకు చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350లు వరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షలు నేపథ్యంలో ముస్లింలు చికెన్ వినియోగానికి ప్రాధాన్యమిస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాల అంచనా. నిర్వహణ పెరిగిపోయింది ఎప్పుడు లేనంతగా కోడి మేత ధరలు, కోడిపిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడం వలన ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
కొండెక్కిన కోడి ధర.. నెల రోజుల్లో స్కిన్లెస్ చికెన్ రేట్ అంత పెరిగిందా!
కరీంనగర్ అర్బన్: కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతుండగా.. కోళ్ల ధరలు కొండెక్కాయి. సుట్టమొస్తే చికెన్తో మర్యాద చేయడం పరిపాటి. కానీ పెరుగుతున్న ధర రోజురోజుకూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే నిత్యవసర సరకులు, నూనెల ధరలు అందనంత దూరంలో ఉండగా కోళ్లు, గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. జిల్లాలో నెల వ్యవధిలో చికెన్ ధర కిలోకు రూ.111పెరిగింది. వరుస నష్టాల క్రమంలో స్థానికంగా కోళ్ల ఫారాల్లో తక్కువగా కోళ్లు పెంచుతుండగా సిద్దిపేట, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాకేంద్రంలో 500లకు పైగా హోల్సేల్ దుకాణాలుండగా హుజూ రాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, తి మ్మాపూర్ ప్రాంతాల్లో మరో 500 వరకు ఉన్నాయి. రిటైల్ షాపుల్లో మరో 500లకు పైగా ఉంటాయి. ధరలు పైపైకి జిల్లాలో నెలరోజులుగా చికెన్, గుడ్ల ధరలు కాలక్రమేణ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా ఫౌల్ట్రీ, బాయిలర్ చికెన్ వినియోగిస్తారు. బ్రాయిలర్ చికెన్ ధర స్కిన్లెస్తో కిలో రూ.281కి చేరగా స్కిన్ ధర రూ.247కు చేరింది. సరిగ్గా నెలరోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.170 ఉండగా స్కిన్ ధర 135 ఉండేది. అంతలోనే స్కిన్లెస్ రూ.111, స్కిన్ ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. జిల్లాలో సగటున వెయ్యి క్వింటాళ్ల నుంచి 1,500 క్వింటాళ్ల వరకు చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. గుడ్ల ధరలు నెలన్నర రోజుల్లో రూపాయి పెరిగింది. నెల క్రితం గుడ్డు ధర రూ.4 ఉండగా ప్రస్తుతం రూ.5 ధర పలుకుతోంది. నష్టాలే కారణం రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోళ్లఫారాలుండగా కోళ్లు పెంచేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. గత రెండు బ్యాచులు నష్టాలే రావడంతో సమ్మక్క సారక్క జాతరకు ముందు నుంచి కోళ్ల కొరత వెంటాడుతోంది. ఒక్కో బ్యాచ్ 45–50 రోజులు కాగా 5వేల కోళ్లు పెంచే ఫారంరైతు సుమారు రూ.1లక్షనుంచి రూ.2లక్షల వరకు నష్టపోయారు. ఈ లెక్కన జిల్లాలో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ట్రేడర్ల దోపిడీ రోజురోజుకు పెచ్చుమీరుతుండగా 50రోజులుగా కోళ్లను పెంచిన వారికి లాభాలు లేకపోగా ట్రేడర్లు మాత్రం గంటల్లోనే లాభాలు గడిస్తున్నారు. దీంతో కోళ్ల ఫారాలు ఖాళీగా ఉంచారు. పావు వంతు ఫారాల్లో మాత్రమే కోళ్లను పెంచుతుండగా డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో ధర అమాంతం పెరుగుతోంది. వాతావరణంలో మార్పులతో కోళ్ల ఎదుగుదల ఉండటం లేదు. దీనికితోడు ఈకోలా, గురక రోగంతో చనిపోతుండటంతో ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
కోడి ధరకు రెక్కలు
తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేత ధరల మోత పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. డిమాండ్కు తగ్గ సరఫరా లేదు మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్లు వస్తేనే ధరలు తగ్గుతాయి. – బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. -
కోడి ధరకు రెక్కలు.. అమాంతం పెరిగిన ధర.. అమ్మో అంత రేటా?
తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేత ధరల మోత జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: లైఫ్ ఈజ్ రయ్రయ్) డిమాండ్కు తగ్గ సరఫరా లేదు మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్లు వస్తేనే ధరలు తగ్గుతాయి. -బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు -
Sakshi Cartoon: చుక్కల్లో చికెన్ ధరలు
చుక్కల్లో చికెన్ ధరలు -
కోళ్లకు కొరత!
సాక్షి, అమరావతి బ్యూరో: వైరస్ భయంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని ఫౌల్ట్రీ రైతులు తగ్గించడంతో.. మార్కెట్లో కొరత ఏర్పడుతోంది. దీంతో చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న చికెన్(స్కిన్లెస్) కిలో ధర రూ.200 ఉండగా.. ఇప్పుడది రూ.300 దగ్గరకు చేరుకుంది. స్థానిక పౌల్ట్రీల నుంచి రోజూ మూడు లక్షల బ్రాయిలర్ కోళ్ల విక్రయాలు జరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి కోళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. డిమాండ్కు తగినన్ని బ్రాయిలర్ కోళ్లు లభ్యం కాక ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాజా వెంకటేశ్వరరావు(నాని) ‘సాక్షి’కి చెప్పారు. -
దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): చాలాకాలం తరువాత చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు లొట్టలేసుకుంటున్నారు. ఒక సమయంలో దాదాపు మూడొందల వరకు వెళ్లిన కిలో చికెన్ రేటు ఇప్పుడు సగానికి పడిపోయింది. నాన్వెజ్ ఐటమ్స్లో మటన్, ఫిష్తో పోలిస్తే చికెన్ రేటు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఎక్కువ శాతం చికెన్కు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు, కార్తీక మాసం కావడంతో ఇటీవల చికెన్ రేటు 170 (స్కిన్), 180 (స్కిన్లెస్)కి పడిపోయింది. తాటిచెట్లపాలెంలో మాత్రం ఈ ధర 160/ 170గా ఉంది. కార్తీకమాసం కారణంగా సుమారు 40 శాతం అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా బ్రాయిలర్ కోడి పెరగగానే చికెన్ సెంటర్లకు తరలించి అమ్మకాలు చేపడుతుంటారు. అంతకుమించి పెరిగిన కోడిని ఉంచడం వల్ల వాటికి అదనపు మేత అవసరమై, కోళ్ల రైతులకు నష్టాలు వస్తాయి. ప్రస్తుతం ఇలా అందుబాటులోకి వచ్చిన కోళ్లు కూడా అధికంగా ఉండడంతో చికెన్ రేటు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. చదవండి: (థ్యాంక్యూ టీటీడీ.. మహిళా భక్తురాలు ఈ–మెయిల్) -
కొండెక్కిన కోడి..శ్రావణంలోనూ తగ్గని చికెన్ ధర
మండపేట: శ్రావణంలోనూ చికెన్ ధర దిగిరావడం లేదు. రూ.300లకు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. రెండు నెలల వ్యవధిలో రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన మేత ధరలు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ, చత్తీస్గడ్ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు విశ్లేషిన్నారు. కోడిగుడ్డు ధర మాత్రం కొంతమేర వినియోగదారులకు ఊరటనిస్తోంది. పండగరోజుల్లో.. తూర్పు గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2.5 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తున్నారు. ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 ఫామ్లలో ఏడు లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతుంది. 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి సిద్దమవుతుంటాయి. ఈ మేరకు రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ఆన్సీజన్గా భావించి కొత్త బ్యాచ్లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. కారణమేంటంటే.. - కోవిడ్ ఆంక్షలు సడలించినా మేత ధరలు అదుపులోకి రావడం లేదు. - ఆంక్షలు కారణంగా జూలైలో మేత రవాణా నిలిచిపోయింది. ధరలు పెరగడం మొదలైంది. - బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబిన్ కిలో రూ.35 నుంచి రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.106కు పెరిగిపోయింది. - మొక్కజొన్న రూ.12నుంచి రూ. 23కు పెరిగినట్టు కోళ్ల రైతులు చెబుతున్నారు. - కోవిడ్ను ఎదుర్కొనేందుకు పౌష్టికాహారంగా చికెన్ వినియోగం అధికం కావడంతో గత నెలలో కిలో చికెన్ రూ. 320వరకూ చేరింది. తర్వాత రూ.230ల నుంచి రూ.250లకు తగ్గింది. - వారం రోజులగా మళ్లీ ధరకు రెక్కలొస్తున్నాయి. ఆన్ సీజన్, మేత ధరలకు జడిసి కొత్త బ్యాచ్లు వేయకపోవడంతో యిలర్ పెంపకం సగానికి పైగా తగ్గిపోయింది. దిగుమతిపై ఆధారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, తెలంగాణలోని ఆశ్వారావుపేట, సత్తుపల్లి, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో చికెన్ ధరలకు మరలా రెక్కలొస్తున్నాయి. బుధవారం కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.135లు వరకు పెరిగింది. వినియోగం సాధారణంగానే ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారవర్గాల అంచనా. అయితేగుడ్డు ధర క్రమంగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. రైతు ధర తగ్గిపోవడంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.5కి చేరుకుంది. మేత తగ్గితేనే కొత్త బ్యాచ్లు - బొబ్బా వెంకన్న బ్రాయిలర్ కోళ్ల రైతు శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. అయితే ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆన్సీజన్ మొదలు కావడం, మేత ధరలకు జడిసి ఎవరూ కొత్త బ్యాచ్లను వేయడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. కీ పాయింట్స్ - తూర్పు గోదావరి జిల్లాలో చికెన్ వినియోగం రోజుకి 2.50 లక్షల కిలోలు - బ్రాయిలర్ కోళ్ల ఫామ్స్ సంఖ్య 400 - రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ రూ. 300 - కోళ్ల మేత సోయబిన్ ధరల్లో పెరుగుదల రూ. 35 నుంచి రూ.100 చదవండి: సాగుకు ‘టెక్’ సాయం..! -
Chicken Prices: సగానికి తగ్గిన చికెన్ ధర!
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ ప్రభావం చికెన్ ధరపై పడింది. కొద్దిరోజులుగా దీని ధర పతనమవుతూ వస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం కిలో బ్రాయిలర్ కోడిమాంసం రూ.312కి చేరి రికార్డు సృష్టించింది. పౌల్ట్రీ చరిత్రలోనే చికెన్ అత్యధిక ధర పలకడం అదే తొలిసారి. అప్పట్లో మండుటెండలు, వడగాడ్పులతో పాటు ఫారాల్లో కోళ్ల కొరత ఏర్పడింది. దీంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి చికెన్ ధర క్రమంగా క్షీణించడం మొదలైంది. రోజుకు రూ.5 నుంచి 10 చొప్పున తగ్గుతూ వచ్చి ఇప్పుడు కిలో రూ.160కి చేరింది. ప్రస్తుతం కొన్నిచోట్ల రూ.150కి కూడా చికెన్ను విక్రయిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో.. రెండు వారాల నుంచి కోవిడ్ విజృంభణ తీవ్రతరమవుతోంది. రోజూ కోవిడ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. దీంతో జనం చికెన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకున్నారు. మరోవైపు కొన్నాళ్ల క్రితం వరకు చికెన్కు అధిక ధర లభిస్తుండడంతో రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని పెంచారు. అలా వేసిన బ్యాచ్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ ఫారాల్లో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకున్నాయి. ఈ బరువుకు మించి పెంపకాన్ని కొనసాగిస్తే రైతుకు నష్టం వాటిల్లుతుంది. రోజూ మేత ఖర్చు పెనుభారంగా మారుతుంది. అందువల్ల నిర్ణీత బరువుకు పెరిగిన కోళ్లను తెగనమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వినియోగానికి మించి కోళ్ల లభ్యత పెరగడంతో చికెన్ ధర క్షీణిస్తోంది. హైదరాబాద్ నుంచి ఆగిన కోళ్లు.. మరోవైపు హైదరాబాద్లో ధర ఒకింత తక్కువగా ఉండడం అక్కడ నుంచి కృష్ణా జిల్లాకు బ్రాయిలర్ కోళ్లను తీసుకొస్తుంటారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న కోళ్లే ధర లేక అమ్ముడవకపోవడంతో అక్కడ నుంచి కొనుగోలు చేయడం లేదని బ్రాయిలర్ కోళ్ల వ్యాపారులు చెబుతున్నారు. ఏడాదిగా పడుతూ.. లేస్తూ.. ► దాదాపు ఏడాది నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదొడుకులకు లోనవుతోంది. కోడి ధర కొన్నాళ్లు పెరుగుతూ, మరికొన్నాళ్లు పతనమవుతూ వస్తోంది. ► వాస్తవానికి గత ఏడాది కోవిడ్ ఆరంభానికి ముందు వరకు చికెన్ రేటు కిలో రూ.270 వరకు ఉండేది. ► కోవిడ్ ఉద్ధృత రూపం దాల్చాక చికెన్ తింటే కరోనా సోకుతుందన్న దుష్ప్రచారంతో అప్పట్లో వినియోగం తగ్గింది. నాలుగైదు నెలల పాటు దీని ధర భారీగా పతనమై ఒకానొక దశలో మూడు కిలోలు రూ.100కి దిగజారింది. ► ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ గట్టెక్కడంతో మళ్లీ చికెన్ ధర పెరగడం మొదలైంది. ► ఇలా విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. అయితే బర్డ్ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో మళ్లీ చికెన్ రేటు జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి పడిపోయింది. ఆ భయం నుంచి బయట పడి మళ్లీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ► ఇలా ఫిబ్రవరి 23న రూ.200 ఉన్న ధర మార్చి 31కి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 6 రూ.312కి పెరిగింది. ► కాగా ప్రస్తుత చికెన్ ధరలు కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాజా వెంకటేశ్వరరావు (నాని) ‘సాక్షి’కి చెప్పారు. ఇక్కడ చదవండి: Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు ‘చాక్లెట్’ పంట.. ఏపీ వెంట.. -
నాటు కోడి.. భలే క్రేజీ
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లతో ఆదరణ తగ్గిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వం సైతం చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేయడంతో క్రమక్రమంగా చికెన్కు డిమాండ్ పెరిగింది. పట్టణాలకే పరిమితమైన కరోనా నేడు అటవీ గ్రామాలకుసైతం విస్తరించింది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలంతా మాంసాహారం వినియోగంపై దృష్టి సారించారు. సాధారణంగా చికెన్ సెంటర్లో లభించే బాయిలర్ను మాత్రమే ఎక్కువ సంఖ్యలో వినియోగించేవారు. కొవ్వుకు చెక్.. రుచికి బెటర్ బాయిలర్ చికెన్ కంటే నాటు కోడి తింటే మరింత మంచిదన్న ప్రచారంతో ఇటీవల కాలంలో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. బాయిలర్ కోడి మాంసం రుచి ఉండదు. ఇక మేక మాంసం తింటే కొవ్వు పెరుగుతుంది. ప్రస్తుతం చేపలు దొరకడం కష్టమే. మరి ఏమి తింటే మంచిదనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో తింటే నాటుకోడి కూరనే తినాలని ఆసక్తి పెరుగుతోంది. మిగతా మాంసాలతో పోలిస్తే నాటుకోడి కూర రుచిగా ఉండడం ఓ కారణం. ఒకప్పుడు ఇంటింటికీ కోళ్లు ఉండేవి. చుట్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా నాటుకోడి కూర వండేవారు. రానురాను పల్లెల్లో కోళ్ల పెంపకం తగ్గిపోయింది. కోళ్ల వల్ల పెంట, వాసన తదితర ఇబ్బందులను గమనించిన పల్లె జనం సైతం కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఇదే క్రమంలో బాయిలర్ కోళ్లు రావడం ప్రతీ ఊరిలో చికెన్ సెంటర్లు వెలియడంతో జనం ఆ చికెన్ వైపే మొగ్గు చూపారు. పైగా బాయిలర్ చికెన్ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరకడంతో జనం నాటుకోడి ఊసెత్తడం మానేశారు. మళ్లీ ఇప్పుడు.. ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై జాగ్రత్త పెరుగుతోంది. అతిగా మందులు వాడి పెంచే ఆహారం జోలికి పోవద్దన్న ఆలోచన ఎక్కువైంది. ఈ క్రమంలోనే బాయిలర్ చికెన్ తినద్దన్న ప్రచారం మొదలైంది. తింటే మటన్ తినండి తేదంటే నాటుకోడి కూర తినండి అని పలువురు ఆహార నిపుణులు సూచించడం, చేపలు మంచివే కాని అవి టైంకు దొరకకపోవడం కొందరికి నచ్చకపోవడంతో నాటు కోడి కూరవైపు మొగ్గు చూపడం ఆరంభమైంది. అయితే, బాయిలర్ కోడి సాధారణంగా కిలో రూ.100 నుంచి రూ.150 ఉంటుంది. నాటుకోడి రూ.350 నుంచి రూ.550 వరకు ఉంటుంది. పండుగల సమయంలో ఈ ధర మరింత ఎక్కువవుతుంది. అయినా నాటుకోళ్లపై క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు. ప్రత్యేక విందులు జరిగే ప్రాంతాల్లో నాటుకోళ్లను తీసుకెళ్తున్నారు. చికెన్ సెంటర్లలోనూ అమ్మకం.. ఒకప్పుడు నాటుకోడి మాంసం దొరకడం గగనంగా ఉండేది. ఆ కోళ్లను తెలిసిన వారి ఇళ్ల నుంచి కొనుగోలు చేసేవారు., దీనిని డ్రెసింగ్ చేయడం కష్టంగా భావించే వారు. పైగా దానిని కాల్చితేనే బాగుంటుందన్న అభిప్రాయం. ఇంత కష్టం ఎందుకని జనం దాని జోలికి పోవడం మానేశారు. కానీ ఇప్పుడు చికెన్ సెంటర్లలోనే దానిని కోసి డ్రెసింగ్ చేసి కాల్చి ఇస్తున్నారు. మటన్తో పోలిస్తే ధర తక్కువ పైగా రుచి, పోషకాలు కూడా ఎక్కువే. అందుకని ఈజీగా దొరుకుతున్న నాటుకోడి మాంసంపై జనం మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా నాటుకోడి ఎలాంటి మందులు అవసరం లేకుండా పెరుగుతోంది. పైగా మాంసం గట్టిగా రుచిగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. తొందరగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మేలు తప్ప కీడు చేయదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు నాటుకోళ్లను దళారులు పల్లెల నుంచి పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రతీ రోజు దళారులు అటవీ గ్రామాల్లో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ నాటుకోళ్లు కొంటాం అంటూ.. కేజీ రూ.180కి కొనుగోలు చేసి వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ తదితర పట్టణప్రాంతాలకు తరలించి రూ.350 నుంచి రూ.500 వరకు చికెన్ సెంటర్ యజమానులకు విక్రయిస్తున్నారు. దీంతో పండుగల సమయంలో గ్రామాల్లో నాటుకోళ్లకు కొరత ఏర్పడుతోంది. తింటే నాటుకోడే తినాలి.. సాధారణ చికెన్తో పోలిస్తే నాటుకోడి కూరే రుచిగా ఉంటుంది. ఇప్పటికి మా ఇంటికి బంధువులు వస్తే నాటుకోడి కూర వండాల్సిందే. ఇది మన తెలంగాణ సంప్రదాయం కూడా. వచ్చిన బంధువులకు నాటుకోడి కూర వండి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.– ఓలపు శంకర్పటేల్, కిష్టాపూర్ -
వండకుండానే చికెన్ ‘ఫ్రై’
పశ్చిమగోదావరి, తణుకు: ఒకవైపు కరోనా ప్రభావంతో పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పడింది. దీనికితోడు మండుతున్న ఎండలు కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చిరుప్రాణులైన కోళ్లు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోపౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే వేసవి కారణంగా గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. ఎండల తీవ్రత కారణంగా సాధారణంగానే కోడి పెట్టే గుడ్ల సంఖ్య 30 శాతం వరకు పడిపోతోంది. ఒకపక్క నిలకడ లేని గుడ్డు ధరతోపాటు ఏటా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో కోళ్ల పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డు ధర సైతం రూ. 2.80కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సంక్షోభం... సాధారణంగా జిల్లాలో 1.20 కోట్ల కోళ్లు పెరుగుతుంటాయి. వీటి ద్వారా రోజుకు సుమారు కోటి గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 20 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మిగిలిన 80 శాతం గుడ్లు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. ప్రస్తుతం పెంచే కోళ్ల సంఖ్య సగానికిపైగా పడిపోగా ఎగుమతులు సైతం నిలిచిపోయాయి. మార్చినెలలో చికెన్, కోడిగుడ్డు అమ్మకాలపై చూపిన ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటివరకూ సుమారు 2,00,000 కోళ్లు చనిపోయినట్టు అంచనా. సుమారు రూ.50 కోట్ల నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. మరోవైపు పౌల్ట్రీ పరిశ్రమను పెరిగిన దాణా ఖర్చులు దెబ్బ తీస్తున్నాయి. కోళ్లకు దాణాగా అందజేసే మొక్క జొన్న, సోయాబీన్, నూకల ధరలు గతేడాదితో పోలిస్తే కాస్త అందుబాటులోకి వచ్చినప్పటికీ గుడ్డు ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో.. పశ్చిమ బెంగాల్లో తుపాను ప్రభావంతో గుడ్డు ఎగుమతులకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇప్పటికే కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక ఇబ్బందులు పడుతుండగా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఒక పక్క ఉత్పత్తి లేకపోయినా గుడ్డు ధర మాత్రం రూ. 2.80కు దిగజారింది. ప్రస్తుతం గుడ్డు ధర తగ్గినప్పటికీ బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.4 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే గుడ్డు ఉత్పత్తికి సంబంధించి రూ.3.50 ఉంటేనే గానీ గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లా నుంచి పశ్చిమబెంగాల్, అసోం, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు రోజుకు సగటున 120 లారీల గుడ్లు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం ఈ సంఖ్య యాభైలోపు పడిపోయింది. చికెన్ ధరలపైనా ఈ ప్రభావం పడింది. రిటైల్ మార్కెట్లో కోడిమాంసం ధర భారీగా పెరిగింది. వేసవిలో గుడ్ల ఉత్పత్తి పడిపోవడం, కోళ్లు మృత్యువాత పడటం, కరోనా ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. గడ్డు పరిస్థితుల్లో పౌల్ట్రీ గత ఐదేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది కరోనా ప్రభావంతో పాటు వేసవి ప్రభావం పౌల్ట్రీపరిశ్రమపై పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గుడ్డు ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– పెన్మత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, కావలిపురం, ఇరగవరం మండలం -
చికెన్ ధర ఆల్టైం హై!
సాక్షి, అమరావతి బ్యూరో: చికెన్ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. రెండు నెలల కిందట చికెన్ తింటే కరోనా సోకుతుందన్న ప్రచారంతో కొనేవాడే లేక అత్యల్పంగా కిలో రూ. 50కే పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రజల్లో అపోహలు తొలగడంతో మాంసం వినియోగం పెరిగింది. అలా పక్షం రోజుల కిందట రూ. 200కు, వారం కిందట రూ. 250కి చేరింది. అదిప్పుడు ఏకంగా రూ. 310కి పెరిగింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇప్పటివరకు రాష్ట్రంలో కిలో చికెన్ అత్యధిక «(రెండేళ్ల కిందట) ధర రూ. 260 పలికింది. ఇదే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. కిలో రూ. 310 అనేది దేశంలోకెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. కోళ్ల పెంపకాన్ని 60 % తగ్గించిన పౌల్ట్రీ రైతులు గతంలో కరోనా కారణంగా చికెన్ ధరలు దారుణంగా క్షీణించడంతో పౌల్ట్రీ రైతులు కుదేలైపోయారు. ఆర్థికంగా నష్టపోయిన వీరు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి పైగా తగ్గించారు. ఆ తర్వాత క్రమంగా చికెన్ కొనుగోళ్లు పెరిగాయి. డిమాండ్కు సరిపడినంతగా కోళ్ల లభ్యత లేకుండా పోయింది. ఫలితంగా చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల పెద్ద, చిన్న హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన దుకాణాలూ మూతపడ్డాయి. అవి కూడా తెరచి ఉంటే చికెన్ ధర మరింత పెరిగేదని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో సాధారణ పరిస్థితుల్లో రోజుకు లక్ష కోళ్లు (దాదాపు 2 లక్షల కిలోల చికెన్), ఆదివారాల్లో రెండు లక్షల కోళ్లు అమ్ముడయ్యేవి. ప్రస్తుతం ఫారాల్లో రోజుకు 40 వేల కోళ్లకు మించి లభ్యత ఉండడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్ ధర మరో రూ. 15–20 వరకు పెరగవచ్చని వీరు చెబుతున్నారు. ఫారాల్లో కోళ్ల లభ్యత పెరిగే వరకు క్రమంగా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని అమరావతి బ్రాయిలర్ కోళ్ల పెంపకందార్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేస్తే పొరుగు రాష్ట్రాల నుంచైనా కోళ్లను తీసుకొచ్చే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
చికెన్ @ రూ.250
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో చికెన్ ధర పైపైకి వెళ్తోంది. గత మూడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్ ధర రూ.250కు చేరుకుంది. కోవిడ్ వైరస్ ప్రభావంతో గత మూడు నెలల నుంచి చికెన్ వినియోగం దాదాపు 70–80 శాతం వరకు పడిపోవడంతో ధరలు బాగా తగ్గాయి. మార్చిలోపరిస్థితి మరీ దిగజారింది. ఒక దశలో కిలో కోడి వందలోపే ఉంది. మే రెండవ వారం నుంచి కాస్త చికెన్ వినియోగం పెరగడం..రంజాన్ నెల కొనసాగుతున్న దృష్ట్యా కూడా చికెన్ ధరలు పెరిగాయని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. పండుగ రోజు దాదాపు 1.5 కోట్ల కిలోల వరకు విక్రయాలు జరిగాయని మార్కెట్ వర్గాల అంచనా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోళ్ల డిమాండ్ పూర్తి కాకపోవడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కానీ గత మూడు నెలల నుంచి కోవిడ్ వైరస్ ప్రభావంతో చికెన్ వినియోగం భారీగా తగ్గింది. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ రూ.వంద కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడిప్పుడు చికెన్ వినియోగం కాస్త కూస్తో పెరిగింది. దీంతో ధరలు కాస్త పెరిగాయి. ఇక నగరంలోని పలు పెద్ద హోల్సేల్ షాపుల్లో కిలో కోడి ధర రూ. 115 నుంచి రూ.120 పలుకుతుంది. ఇక బహిరంగ మార్కెట్లో కిలో కోడి ధర రూ.150 వరకు అమ్ముతున్నారు. డ్రెస్డ్ చికెన్ ధర పెద్ద హోల్సేల్ మార్కెట్లో రూ.200 వరకు ఉండాగా అదే స్కిన్లెస్ కిలో చికెన్ ధర రూ.250 దాటుతుంది. ఇక బహిరంగ మార్కెట్లో కిలో చికె¯Œన్ రూ.250 నుంచి రూ.260 వరకు ఉంది. కోడిగుడ్డు ధర హోల్సేల్లో రూ.3.50 పైసలు ఉంది. హోల్సేల్లో రూ.4 వరకు ఉంది. -
కొండెక్కిన కోడి
తూర్పుగోదావరి, అమలాపురం: కోళ్ల పరిశ్రమ పుంజుకుంటోంది.. మార్చి నెలలో వరుస సంక్షోభాలతో ఈ పరిశ్రమ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఈ మాంసం తింటే వ్యాధులు వస్తాయనే అపోహలు.. తరువాత కరోనా లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వ్య వసాయ, ఆ అనుబంధ రంగాల విషయంలో రైతులకు మేలు చేసే లా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడంతో కోళ్ల పరిశ్రమ కోలుకుంటోంది. మార్చి రెండో వారంలో కనిష్ట స్థాయికి పడిపోయిన బ్రాయిలర్, లేయర్ కోళ్ల ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. ఆదివారం మార్కెట్లో బ్రాయిలర్ లైవ్ కేజీ రూ.130, లేయర్ కేజీ రూ.85 పలికింది. కేజీ బ్రాయిలర్ మాంసం రిటైల్ ధర రూ.220 నుంచి రూ.240 వరకు ఉంది. లేయర్ మాంసం కేజీ రూ.200 వరకు చేరడం విశేషం. గత మార్చిలో బ్రాయిలర్ లైవ్ ధర రైతు వారీ కేజీ రూ.16 వరకు ఉండగా, రిటైల్ ధర కేజీ రూ.38 మాత్రమే. లేయర్ ధర కేజీ రూ.పదికి పడిపోయింది. రైతులు చాలాచోట్ల కోళ్లను ఉచితంగా పంపిణీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఎగుమతులు లేకపోవడం, కోళ్లకు మేత అందని పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని రైతు అనుబంధ పరిశ్రమలను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంది. ఎగుమతులకు అనుమతులు ఇవ్వడంతో పాటు మేత అమ్మకాలకు పచ్చజెండా ఊపడంతో పరిశ్రమలు కోలుకున్నాయి. పెరిగిన కోడి మాంసం ధరలు వినియోగదారులకు భారంగా మారినా, వరుస సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు మాత్రం ఊరటనిచ్చే అంశమని పలువురు అంటున్నారు. -
చికెన్ ధరలకు రెక్కలు
బెంగళూరు : మొన్నటి వరకూ చికెన్ ఉచితంగా ఇచ్చినా ముట్టుకోని జనం ఇప్పుడు చికెన్ కోసం ఎగబడుతున్నారు. దీంతో కేజీ చికెన్ ప్రస్తుతం రూ.200 ధర పలుకుతోంది. రామనగర జిల్లాలో లాక్డౌన్ ఉన్నప్పటికీ చికెన్, మటన్ విక్రయాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. శనివారం కేజీ రూ.180 ఉండగా ఆదివారం నాటికి రూ.200 దాటింది. అనేక చోట్ల కోళ్లు సరఫరా లేకపోవడం, కరోనా దెబ్బకు కోళ్లఫారాలు మూతబడడం వల్ల చికెన్కు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు నెల రోజులుగా సముద్రం చేపల సరఫరా ఆగిపోయింది. మంగళూరు, కారవార ప్రాంతాల నుండి బెంగళూరుకు వచ్చే సరుకు అక్కడి నుండి రామనగరకు వచ్చేది. ఇప్పుడు అడపాదడపా వస్తున్నా ఏంజెల్, పాంప్రెట్ తదితర చేపల ధర కేజీ రూ.1000 పలుకుతోంది. -
చికెన్ @ రూ.180
యాచారం: చికెన్ ధరలు పెరిగాయి. పౌల్ట్రీ రైతుకు కాస్త ఉపశమనం కలిగింది. ఆదివారం కిలో ధర రూ.180 పలికింది. కరోనా భయంతో నెల రోజుల పాటు చికెన్, గుడ్లు తినడానికి ప్రజలు దూరంగా ఉన్నారు. చికెన్తో కోవిడ్–19 వ్యాపించదని పలుమార్లు మంత్రులు, వైద్యులు సూచించినా ప్రజలు ఆసక్తి చూపించలేదు. దీంతో వ్యాపారం పూర్తిగా కుదేలైపోవడంతో పౌల్ట్రీరైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఇటీవల సీఎం కేసీఆర్.. చికెన్ మంచి పౌష్టికాహారం అని, చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కరోనాతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మీడియాలో కూడా చికెన్ వినియోగంతో మేలు జరుగుతుందని విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం జిల్లాలో కిలో స్కిన్లెస్ చికెన్ రూ. 180, డ్రెస్డ్ రూ.160 చొప్పున విక్రయించారు. నెల కింద పరిస్థితి దారుణం కరోనా వైరస్ నేపథ్యంలో సుమారు నెలరోజులుగా పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నష్టాలబాట పట్టింది. చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లు షికార్లు చేయడంతో వినియోగానికి జనం ముందుకు రాలేదు. దీంతో కోళ్లను ఫాంల నుంచి తరలించలేని దుస్థితి ఏర్పడింది. చాలాచోట్ల రూ. 100 మూడు కిలోలో కూడా విక్రయించారు. కొన్నిప్రాంతాల్లో రెండుమూడు కిలోలు తూగే కోళ్లను అతితక్కువ ధరలకు విక్రయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమకు సుమారు రూ.750 కోట్ల నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులకు కిస్తులెలా చెల్లించాలని మదనపడ్డారు. ప్రస్తుతం ధరలు కొంతమేర పెరగడంతో పౌల్ట్రీ రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆదివారం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 70 వేల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల, కందుకూర్, యాచారం తదితర ప్రాంతాల్లో జనం చికెన్ షాపులకు క్యూ కట్టారు. నిర్వాహకులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. -
చికెన్ రూ.100కే.. అగ్గువ రండన్నో!
కర్నూలు, కోడుమూరు: ‘ఏమన్నా..కోడికూర కావాలా? మా దగ్గర చాలా ఛీపు. రండి రండి ఎనభై రూపాయలకే కేజీ ఇత్తాం’ అంటూ వ్యాపారుల పిలుపు.,‘మరీ అంత అగ్గువా? ఐతే కేజీ కొట్టు. మంచి ఛాన్స్ ఇదే. ఫుల్లుగా లాగించేయాలి!’ అంటూ వినియోగదారుల సంతోషం.ఇదీ మంగళవారం కోడుమూరులో పరిస్థితి. వ్యాపారుల మధ్య పోటీ కారణంగా చికెన్ ధర అమాంతం తగ్గించేశారు. పట్టణంలో ఇటీవల రవికుమార్రెడ్డి అనే వ్యక్తి హోల్సేల్ చికెన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కిలో రూ.130 చొప్పున చికెన్ తీసుకుంటే ఆరు గుడ్లు ఉచితంగా ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు. ఈ లెక్కన కిలో చికెన్ రూ.100కే దొరుకుతుండడంతో వినియోగదారులు భారీగా ఎగబడ్డారు. దీంతో మిగిలిన వ్యాపారులూ ‘చౌక బేరం’ మొదలుపెట్టారు. మంగళవారం స్థానిక కోట్ల సర్కిల్లో మాసుం అనే వ్యాపారి రూ.100కే కిలో చికెన్ విక్రయించాడు. దీంతో సురేష్ అనే వ్యాపారి మరీ తక్కువగా రూ.80తో అమ్మడం మొదలుపెట్టాడు. జనం ఎగబడ్డారు. ఒక్క రోజులోనే 200 కిలోలకు పైగా చికెన్అమ్ముడుబోయినట్లు సురేష్ తెలిపాడు. వ్యాపారులు ధర భారీగా తగ్గించడంతో మామూలుగా అరకిలో తీసుకునే వారు కిలో నుంచి రెండు కేజీల చికెన్ తీసుకెళ్లారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం బహిరంగ మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.180, స్కిన్తో కలిపి రూ.150 ధర పలుకుతోంది. -
కోడి కొనలేం.. గుడ్డు తినలేం
సాక్షి, అమరావతి బ్యూరో: గత కొన్ని రోజులుగా కొండెక్కిన కోడి ధర కిందికి దిగిరానంటోంది. ఆదివారం అలవాటుగా నాన్ వెజ్ తిందామనుకునే మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. కిలో చికెన్ రేటు రూ. 200లు దాటిపోవడంతో కొనేందుకు దుకాణాలకు వెళ్లిన మాంసాహార ప్రియులు అమ్మో! అంత రేటా.. అని నోరెళ్లబెడుతున్నారు. చికెన్కు పోటీగా గుడ్డు కూడా కొనుగోలుదారుల జేబుకు చిల్లుపెడుతోంది. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ. 6లుగా ఉంది. కూరగాయల రేట్లు దిగివస్తున్నా.. వీటి ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం వల్లే.. సాధారణంగా శీతాకాలంలో మాంసం, కోడిగుడ్లను ఎక్కువగా తింటారు. ఆ డిమాండ్కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతూ ఉంది. నెలన్నర రోజులుగా స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.190 నుంచి కిందికి దిగిరాలేదు. ఇప్పుడది రూ.200కి చేరింది. వారం రోజుల క్రితం బ్రాయిలర్ చికెన్ ధర కిలో రూ.214కి చేరి కంగారెత్తించింది. ఈ సీజనులో ఇదే అత్యధిక ధర. గత ఏడాది కూడా చికెన్ కిలో ధర రూ.200 చేరి తర్వాత దిగొచ్చింది. ఇప్పుడు మాత్రం రేటు పైపైకే తప్ప సామాన్యుడికి అందుబాటులోకి రావడం లేదు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో రోజుకు సగటున 2 లక్షల కిలోల చికెన్ను వినియోగిస్తారు. ఆదివారం 3 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. అయితే ఆ స్థాయిలో కోళ్ల లభ్యత లేకపోవడం వల్ల ధరలు స్వల్పంగా పెరిగాయని కోళ్ల ఫారాల రైతులు చెబుతున్నారు. ‘గుడ్లు’ తేలేసేలా ధర మరోవైపు కోడిగుడ్డు ధర వింటే గుడ్లు తేలేసేలా ఉంది. గుడ్డు ధర మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం వంద గుడ్లకు రైతుకు చెల్లించే ధర రూ.473గా ఉండగా.. రిటైల్ మార్కెట్లో డజన్ గుడ్ల ధర రూ.66 వరకు ఉంది. రైతు బజార్లో విడిగా ఒక్కొక్కటి రూ.6కు అమ్ముతున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ (నెక్) విజయవాడ జోన్ పరిధిలో కృష్ణా, విజయవాడ, గుంటూరు జిల్లాలుండగా.. ఒక్క కృష్ణా జిల్లాలోనే రోజుకు 80 లక్షల గుడ్ల వరకు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 50 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మిగతా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చలికాలం కావడం వల్ల స్థానికంగా, ఈశాన్య రాష్ట్రాల్లో కోడిగుడ్ల వినియోగం పెరిగింది. మరోవైపు గిట్టుబాటు కాక కొంతమంది కోళ్ల ఫారాల రైతులు బ్యాచ్లు తగ్గించారు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గి కోడిగుడ్ల ధరలు పెరిగాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దిగొస్తున్న కూరగాయలు కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు కిలో రూ.30 నుంచి రూ.50 వరకూ పలికిన కూరగాయల ధరలు తగ్గాయి. రైతు» బజార్లలో కిలో టమోటా రూ.13, వంగ రూ.14, బెండ రూ.20, కాకర, గోరుచిక్కుడు రూ.18, కాలీఫ్లవర్ రూ.15, చిక్కుడుకాయలు రూ.24, బంగాళాదుంపలు రూ.25కు దొరుకుతున్నాయి. బయట మార్కెట్లో రూ.5 నుంచి 10లు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతుబజార్లు, మార్కెట్ యార్డుల్లో కిలో రూ.15కే ఉల్లిపాయలను అందుబాటులో ఉంచింది. బయట కిలో రూ.100–150 వరకు పలికిన ఉల్లిపాయలు ఇప్పడు రూ.60కు లభ్యమవుతున్నాయి. గుడ్ల రేటు పెరగడంతో రైతుకు ఉపశమనం కోళ్ల మేత ధరలు బాగా పెరిగాయి. కిలో రూ.14 ఉండే మొక్కజొన్న రూ.26 వరకు పెరిగింది. సోయా కూడా పెరగడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ తరుణంలో గుడ్ల ధరల పెరుగుదల రైతుకు కాస్త ఊరటనిస్తోంది. అయితే ఈ గిట్టుబాటు ధరలు మరో రెండు నెలల వరకే కొనసాగుతాయి. ఆ తర్వాత ఎండలు మొదలైతే తగ్గుముఖం పడతాయి. –కుటుంబరావు, నెక్ విజయవాడ జోన్ చైర్మన్ ఈ ధరలు కొన్నాళ్లే.. కోళ్ల దాణా ధరలు, నిర్వహణ వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చికెన్ ధర పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటుగానే ఉంది. ఇవి కొన్నాళ్ల పాటే కొనసాగుతాయి. – వెంకటేశ్వరరావు, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు -
శ్రావణ మాసం ఎఫెక్ట్ .. కొక్కో‘రూకో’!
శ్రావణ మాసం ఎఫెక్ట్ గుడ్డు ధరలపైనా పడింది. సాధారణ రోజుల్లోగుడ్డు ధర రూ.5 ఉండగా..ప్రస్తుతం రూ.4.25కి తగ్గింది.హోల్సేల్లో డజన్గుడ్ల ధర రూ.45 ఉండగారిటైల్లో రూ.52గా ఉంది. సాక్షి,సిటీబ్యూరో: గత నెలలో పరుగులు పెట్టిన చికెన్ ధరలు వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో కిలో చికెన్ రూ.280 వరకు వెళ్లిన ధర ఇప్పుడు రూ.160కి(స్కిన్లెస్) దిగివచ్చింది. గతంలో భారీగా ధరలు పెరిగాన సరే మాంసాహార ప్రియులు దుకాణాల ముందు క్యూ కడితే.. ప్రస్తుతం ధరలు సగానికి తగ్గినా కొనేవారు పెద్దగా కనిపించడం లేదు. శ్రావణ మాసం కావడంతో మాంసాహారానికి అత్యధిక మంది నగరవాసులు దూరంగా ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ ప్రియులకు కోడి కూర లేకుంటే ముద్ద దిగనివారు సైతం ఈ ఏడాది శ్రావణ మాసంలో మాత్రం అందుకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క గ్రేటర్లో కోడిమాంసం డిమాండ్ కంటే సప్లయ్ అధికం కావడం వల్ల కూడా చికెన్ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. అదివారం మాత్రం అది 70 లక్షల కిలోకు పెరుగుతుంది. కానీ శ్రావణ మాసంలో విక్రయాలు గత నెలలో జరిగి వ్యాపారంలో సగం కూడా ఉండడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా తగ్గే అవకాశం శ్రావణ మాసం నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్ వినియోగం గణనీయంగా తగ్గింది. నగరంలో లక్ష కిలోలకు అటు, ఇటుగా విక్రయాలు జరుగుతాయి. ఇతర రోజులతో పోల్చితే శ్రావణంలో వినియోగం సగానికి సగం తగ్గింది. సాధారణ రోజుల్లో 80 కిలోల వ్యాపారం జరిగితే ఈ నెలలో మాత్రం 30 కిలోలు కూడా విక్రయించడం కష్టంగా ఉందని ఓ రిటైల్ వ్యాపారి పేర్కొన్నాడు. ఆదివారం రోజు కనీసం 150 కిలోలకు తగ్గకుండా విక్రయిస్తానని, గత ఆదివారం మాత్రం వ్యాపారం 60 కిలోలే జరినిట్టు నాంపల్లికి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నాడు. -
మాంసం ‘మస్తు’గా..! ధరలు పెరిగే అవకాశం..
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్రేటర్లో మాంసానికి డిమాండ్ పెరిగింది. చికెన్, మటన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి పండగకు వారాంతం కూడా కలిసి రావడంతో వ్యాపారం బాగా జరుగుతోంది. గత దసరాకు కోళ్ల కొరత ఏర్పడడంతో పండగ దృష్ట్యా వ్యాపారులు మేకలు, కోళ్లను స్టాక్ పెట్టుకున్నారు. దసరా సమయంలో చికెన్ కిలోకు రూ.250 పలకగా, మటన్ రూ.550–రూ.600 ఉంది. ప్రస్తుతం చలికాలం కావడంతో ఇప్పటికే కిలో చికెన్ ధర రూ.200 దాటింది. పండగ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. డిమాండ్కు సరిపడా చికెన్ లేకపోవడంతో ధరలు పెరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. పైపైకి... గత వారం కిలో కోడి ధర రూ.వంద లోపే ఉండగా... మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఆదివారం కిలో కోడి ధర రూ.105 పలికింది. ఇక మంగళవారం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో చికెన్ ధరలు పైపైకి వెళ్తాయి. ఫామ్ రేట్లు పెరగడంతో హోల్సెల్ రెట్లు కూడా పెరగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మటన్ ధరలు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో తెలంగాణ పొట్టేళ్లు అందుబాటులో లేవు. మేకపోతులు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా నగర మార్కెట్కు దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ సరిపడా లేకపోవడంతో మటన్ ధర కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో మటన్ రూ.550 ఉండగా, పండగ రోజు మరో రూ.50 పెరగవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. వీకెండ్ సేల్... ఈసారి సంక్రాంతికి నాలుగు రోజులు కలిసొచ్చింది. శని, ఆది, సోమ, మంగళవారాలు సెలవులు. దీంతో శని, ఆదివారాల్లోనూ విపరీతంగా మంసం విక్రయాలు జరిగాయి. ఆదివారం ఒక్క రోజే గ్రేటర్లో 2లక్షల కిలోల చికెన్ అమ్ముడైనట్లు అంచనా. ఇక సంక్రాంతి రోజు దాదాపు 4–5 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా చలికాలంలో ఉత్పత్తి తక్కువ ఉంటుంది. దీంతో ఈసారి కోళ్ల ఉత్పత్తి కూడా అనుకున్న స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి డిమాండ్ మరింత ఉండడంతో కొరత లేకుండా చూస్తున్నామని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్రెడ్డి తెలిపారు. -
రికార్డు స్థాయికి చేరిన చికెన్ ధర
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ మార్కెట్లో చికెన్ ధర అనూహ్యంగా పెరిగింది. కార్తీకమాసం ముగియడం, పెథాయ్ తుఫానుతో పెరిగిన చలి, క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో చికెన్ రేటు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రెండు వారాల క్రితం కిలో రూ.170 ఉన్న ధర ఇప్పుడు రూ.250కి చేరింది. చలికాలంలో సాధారణంగా చికెన్ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి గతంలో ఎన్నుడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. ఆదివారం మాత్రం 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయని అంచనా. ఈ క్రిస్మస్కు మాత్రం 1.5 కోట్ల కిలోల విక్రయాలు దాటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగర హోల్సేల్ మార్కెట్లో కోడి కిలో రూ.135 నుంచి రూ.140 మధ్య ఉంది. రిటైల్ మార్కెట్లో రూ.150 వరకు ఉంది. డ్రెస్డ్ ధర రూ.200 వరకు ఉండగా, స్కిన్లెస్ రూ.240 దాటుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ తగ్గ సరఫరా లేదు రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కోళ్ల సరఫారా లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగుతున్నాయి. న్యూయర్ దాకా ధరలు ఇలాగా ఉంటాయి. ఫారంరేట్ కోడి ధర కిలో రూ.110 దాటింది. ఇందులో 33 శాతం ధరలు కలుపుకొని హోల్సెల్ వ్యాపారులు కిలో రూ.135 వరకు విక్రయిస్తారు. స్కిన్లెస్ కిలో హోల్సేల్ రూ.220 దాటింది. వినియోగదారులు ఎప్పటికప్పుడు పేపర్ రేటును గమనిస్తూ దాని ప్రకారమే చికెన్ కొనాలి. అంతకు మించి అధికంగా చెల్లించవద్దు. – డా.రంజీత్ రెడ్డి, తెలంగాణ బ్రీడర్స్ అసోసియోషన్ అధ్యక్షుడు -
కొండెక్కిన కోడి
నిజామాబాద్ అర్బన్: కోడి ధర కొండెక్కింది. చికెన్ ధర ఒక్కసారిగా రూ. 270కి చేరింది. వారం వ్యవధిలో రూ.50 పెరగడం గమనార్హం. నిజామాబాద్లో గత వారం స్కిన్లెస్ చికెన్ ధర రూ.220. అయితే, ఆదివారం ఒక్కసారిగా రూ.50 పెంచేసి రూ.270కి కిలో చొప్పున విక్రయించారు. ఎండలు మండిపోతున్న తరుణంలో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని, అందుకే ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. వడగాలుల తీవ్రతకు పౌల్ట్రీ ఫామ్లలో కోళ్లు చనిపోతున్నాయంటున్నారు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. చికెన్ ధర పెరుగుతుండడంతో మాంస ప్రియులు ఆందోళన చెందుతున్నారు. -
బావ..ఏంటి పైకి చూస్తున్నావు..
సుత్తి వీరభద్రరావు: బావ..ఏంటి పైకి చూస్తున్నావు. వింతగా ప్రవర్తిస్తున్నావు! కోటా శ్రీనివాస రావు: ఏ ముంది బావ..చికెన్ తింటున్నా..రా నువ్వు కూడా తిందువుగానీ.. సుత్తి వీరభద్రరావు: చికెనా..ఎక్కడుంది బావా! కోటా శ్రీనివాస రావు: ఇదిగో పైన కోడి వేలాడుతోంది. కోడిని చూస్తూ నేను కంచంలో అన్నం తింటున్నా..కనిపిస్తుంది కదా బావ..రేయ్.అర గుండు వెధవ..నువ్వయినా చెప్పురా! బ్రహ్మానందం: అయ్యా..ధర్మ ప్రభువులు..మీరు చికెన్ ఆరగిస్తున్న సంగతి తమరి బావగారికి అర్థకం కాలేదయ్యా..తినండి. అది ఎ..ఎ ఎంత రుచిగా ఉందో! అహనా పెళ్లంట సినిమాలో ఉన్న సరదా సంభాషణలు జిల్లాలో కోళ్ల ధర పెరగడంతో నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో మాంసం ప్రియులు చికెన్ కొని తినలేకపోతున్నారు. కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్) : జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు అమాంతంగా పెరిగాయి. పక్షం రోజుల క్రితం రూ.160 ఉన్న కేజీ చికెన్ నేడు రూ.200కు చేరింది. స్కిన్లెస్ చికెన్ ధర రూ. 220 పలుకుతోంది. జిల్లాలో వెంకాయపల్లె, ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో చిన్న స్థాయి కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటితో తప్ప మరెక్కడా కోళ్ల ఉత్పత్తి జరగడం లేదు. గతంలో ప్రతి రోజూ 10 వేల కేజీల చికెన్ వినియోగం ఉండేది. ప్రస్తుతం 15వేల కేజీలకు పైగా పెరిగింది. ధరలు ఎందుకు పెరిగాయంటే.. వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు మించి నమోదవుతుండటంతో కోళ్ల పెంపకం భారంగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎండ వేడిమి తాళలేక అనేక కోళ్లు మృత్యువాత చెందుతున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గడం..డిమాండ్ పెరగడంతో కోడి మాంసం ధరలు పెరిగాయని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. అదీగాక..రంజాన్ మాసం వచ్చిదంటే ప్రతి ప్రాంతంలో మాంసార ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఇదే అదునుగా చూసుకున్న వ్యాపారులు వేడుకను ఆసరగా చేసుకొని చికెన్ ధరలు అమాంతంగా పెంచేశారని పలువురు హోటల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా..కర్నూలు జిల్లాకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఫారం కోళ్లు సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అధికంగా డిమాండ్ ఉండడంతో ఉన్న కోళ్లనే వాహనాల్లో తరలిస్తున్నారు. రవాణాలో పలు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో డీలర్లు చనిపోయిన కోళ్ల నష్టం వెల కూడా వినియోగదారుల మోపుతుండటంతో చికెన్ ధరలు పెరిగాయని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన గుడ్ల ధరలు గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. 100 గుడ్లు ధర గతంలో రూ.280 ఉండగా.. ప్రస్తుతం రూ.320కి పెరిగింది. గుడ్లు కొనుగోలు చేసే వినియోగదారులు కూడా గుడ్లు తేలేస్తున్నారు. ప్రభుత్వం చేయూతనందించాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు ఉత్పత్తి కావడం లేదు. ఉత్పత్తి అయిన కోళ్లు రవాణాలో మృతి చెందుతుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో కోళ్ల పరిశ్రమల స్థాపనకు ప్రభ్తుత్వం చేయూతనందించాలి. – రాజారెడ్డి, వ్యాపారి , డోన్ -
తగ్గుతున్న చికెన్ ధరలు
సాక్షి, సిటీబ్యూరో: కోడి ధర కొండ దిగింది. వారం రోజుల్లోనే చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు పరేషాన్ అవుతున్నారు. వారం క్రితం రూ.160 ఉన్న లైవ్ బర్డ్ 100 రూపాయలకు తగ్గింది. అలాగే రూ.180 ఉన్న విత్స్కిన్ చికెన్ 120కు, రూ.210 ఉన్న స్కిన్లెస్ చికెన్ 140కి తగ్గింది. మొత్తంమీద వారంలో చికెన్ ధరలు దాదాపు రూ.60 వరకు పడిపోయాయి. వాస్తవంగా ఇది హోల్సేల్, ఫారంగేట్ ధరల్లో వ్యత్యాసం. రిటైల్ మార్కెట్లో మాత్రం ధరలు కాస్త ఫర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. సాధారణంగా వేసవిలో చికెన్ ధరలు తగ్గుతాయి. కాని ప్రారంభంలోనే భారీస్థాయిలో ధరలు పతనమవడంతో పౌల్ట్రీ రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు తగ్గడానికి కారణాలివే.. మన దగ్గర కోళ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి పెరగడంతో ధరలు తగ్గినట్లు పౌల్ట్రీ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎండ కాలంలో చికెన్ ధరలు కాస్త తగ్గు ముఖం పట్టడం సహజం. కానీ వేసవి ప్రారంభంలోనే భారీగా తగ్గడంతో పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తంమీద 9 కోట్ల కోళ్లు ఉంటే ఇందులో సగానికి సగం గ్రేటర్ శివారు, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో లేయర్ కోళ్లు నాలుగున్నర కోట్లు , బ్రాయిలర్ నాలుగున్నర కోట్లు ఉన్నాయని అంచనా. హోల్సేల్ మార్కెట్లో రైతుకు కోడి గుడ్డు ధర రూ.3.80 పైస ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం రూపాయి నష్టానికి రూ.2.80కే అమ్ముకోవాల్సి వస్తుంది. దిగుమతులు పెరిగాయి తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర నుంచి కోళ్ల దిగుమతి పెరిగింది. ఎండా కాలం అవడంతో చికెన్ డిమాండ్ కూడా తగ్గింది. కోడి పారం ధర రూ.65 ఉంది. హోల్సెల్ ధర రూ.75 వరకు ఉంది. గత వారం రోజుల్లో కిలోకు దాదాపు రూ.50 నుంచి 60 వరకు తగ్గింది. కానీ రిటైల్ మార్కెట్లో చికెన్ ధరలు తగ్గడం లేదు. – డాక్టర్ రంజిత్ రెడ్డి, తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేసవిలో ధరలు తగ్గుతాయి ప్రతి ఏటా మార్చి నెల నుంచి గుడ్ల ధరలు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఉగాది, శ్రీరామ నవమి నుంచి ధరలు తగ్గుముఖం పడతాయి. వేసవిలో గుడ్ల వినియోగం కాస్త తగ్గుతుంది. అందుకే ధరలు తగ్గుతాయి. – సంజీవ్ చింతావర్, బిజినెస్ మేనేజర్ నెక్ -
కొండెక్కిన చికెన్ ధరలు
సదాశివపేట రూరల్ : పండగలు పబ్బాలు వస్తే చాలామంది చికెన్ వండుకుంటారు. వాతావరణం చల్లబడితే చాలు చికెన్ తినాలనిపిస్తుంది. కాని ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. కేజీ రూ. 200 కావడంతో కారం పొడితోనే కాలం వెల్లదీస్తున్నారు. స్కిన్లెస్ అయితే రూ. 220కి పెరిగింది. పోనీ గుడ్డతోనైనా సరిపెట్టుకుందామంటే అదికూడా రూ. 5లకు పెరిగింది. మాంసకృత్తులతో పాటు పప్పు దినుసుల ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. మొన్నటి వరకు కేజీ రూ. 150 ఉన్న చికెన్ ఇప్పుడు రూ. 200లకు చేరింది. ఆషాఢ మాసంలో బోనాల పండుగ రావడంతో ఆనవాయితీగా చాలమంది సంబురాలు చేసుకుంటారు. ఈ సందర్భంగా మాంసం తినడం సాధారణం. గతంలో దేశీ కోళ్లను ఎక్కువగా పెంచుకొనేవారు. ప్రస్తుతం వాటి ఊసే లేదు. కుటుంబాలు పెరగడం పెరటితో తగినంత స్థలం లేకపోవడంతో ఈ కోళ్లను పెంచడానికి అనువుగా లేకుండాపోయింది. దీంతో అత్యధికులు బాయిలర్ చికెన్ మీద ఆధారపడి ఉన్నారు. పౌల్ట్రీ యజమానులు చికెన్ ధరలను పెంచడంతో చికెన్తో పాటు గుడ్ల ధరలు కూడా పెరిగాయి. మార్కెట్లో వంద గుడ్లు హోల్సేల్గా రూ. 480 ఉండగా, రిటైల్గా వంద గుడ్లకు రూ. 500లకు అమ్ముతున్నారు.పండుగలకు కరువే... మండలంలో, పట్టణంలో ఆషాఢ మాసం బోనాల పండుగను జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసంలో పోచమ్మ, ఈదమ్మ, పోలేరమ్మ, మాచమ్మ వంటి ఇడుపు దేవతలకు అత్యధికంగా కోళ్లు బలిస్తుంటారు. ఈ పండుగల్లో ఇంటికో కోడిని కోస్తుంటారు. కోళ్ల ధరలు పెరగడంతో ఈ ఏడాది మాంసం జోలికి పోవడం లేదు. చికెన్ తినడం మానేశాం లేబర్ పని చేసుకుని బతికే మాకు రోజంతా పనిచేస్తే రూ. 200 ఇస్తారు చికెన్ కేజీ రూ. 200లకు చేరింది. రోజు కష్టం చికెన్కే పోతే మిగతా ఖర్చులు ఎలా భరించాలి. రెండు నెలలుగా చికెన్గా మానేశాం. నీళ్ల చారు, కారం పొడితోనే కాలం వెళ్లదీస్తున్నాం. - రాజమణి, గృహిణి కనీసం గుడ్లు తినలేకపోతున్నాం కూలీ పనిచేసుకొని బతికే మారు రోజంతా కష్టపడి పనిచేస్తే రూ. 200 వస్తాయి. పిల్లల చదువులకు ఫీజులు, ఇంటి అద్దె కట్టాలి. గుడ్ల రేట్లు పెరగడంతో వాటిని కూడా తినలేకపోతున్నాం.. - సక్కుబాయి, గృహిణి -
కోడి.. కొనలేం..!
చికెన్ ధరలకు రెక్కలు ♦ స్కిన్లెస్ కేజీ రూ.222.. బోన్లెస్ రూ.400 ♦ బర్డ్ఫ్లూ కారణంగా భారీగా తగ్గిన కోళ్ల ఉత్పత్తి సాక్షి, హైదరాబాద్: వారంలో రెండు రోజులైనా చికెన్ముక్క లేకుంటే అన్నం ముద్ద గొంతుదిగదు చాలామందికి. వీరందరికీ ఎంతో ఇష్టంగా చికెన్ తినాలని ఉన్నా.. కష్టంగానైనా కొనలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా చికెన్ ధరలు కొండెక్కడమే దీనికి కారణం. బర్డ్ఫ్లూ భయంతో ఇటీవల కాస్త దిగివచ్చిన చికెన్ ధర మళ్లీ ఆకాశానికి ఎగబాకింది. ఆదివారం నగర మార్కెట్లో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.222కు, స్కిన్తో రూ.188కి, బోన్లెస్ అయితే రూ.400కు విక్రయించారు. ఏప్రిల్/మే నెలల్లో బర్డ్ఫ్లూ కారణంగా పౌల్ట్రీ యజమానులు స్వచ్ఛందంగా కోళ్లను చంపేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త బ్యాచ్లు వే సేందుకు తటపటాయించడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు చికెన్ ధరలపై పడింది. దీనికితోడు పెళ్లిళ్లు, ఫంక్షన్లు రావడంతో చికెన్కు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా చికెన్ వ్యాపారులు ధర పెంచేశారు. నిజానికి ఫారం రైతు కిలో కోడిని రూ.111లకే అమ్ముతున్నా.. రిటైల్ మార్కెట్లో చికెన్ రెట్టింపు ధర పలుకుతోంది. వారానికి ఒక్కసారైనా కోడి కూర రుచి చూద్దామనుకునే మాంసప్రియులకు పెరిగిన ధర నిరాశ కల్గిస్తోంది. మరోవైపు బడా చికెన్ సెంటర్లు రేట్లు పెంచేయడం వల్ల తమకు గిరాకీ తగ్గిందంటూ చిల్లర వ్యాపారులు వాపోతున్నారు. గత వారం 5 క్వింటాళ్ల(300 కోళ్లకుపైగా) చికెన్ విక్రయించిన తాను ఈ ఆదివారం 2 క్వింటాళ్లే (100 కోళ్లనే) అమ్ముడుపోయిందని ఉప్పల్లోని జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకుడు కొండల్రావు ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్కు తగ్గట్టు కోళ్ల ఉత్పత్తి లేదని, సరఫరా తగ్గడంతో డిమాండ్ పెరిగి వ్యాపారులు ఇష్టారీతిన ధర పెంచేస్తున్నారని, కొత్త బ్యాచ్ కోళ్లు వచ్చే వరకూ చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చేపలకు భలే గిరాకీ...! ప్రతి ఏటా మృగ శిరకార్తె రోజు చేపలు తినడం చాలామందికి ఆనవాయితీ. సోమవారం మృగశిరకార్తె ఉండడంతో ఆదివారం చేపల దుకాణాలు కళకళలాడాయి. బేగం బజార్లోని చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. హోల్సేల్ మార్కెట్లోనూ, రోడ్లపై విక్రయించేవారు రేట్లు పెంచి అమ్మారు. గతంలో కిలో రూ.300 ఉన్న కొర్రమీను(కొర్రమట్ట) చేపలు ఆదివారం రూ.400-450కు విక్రయించారు. నాంపల్లి మార్కెట్, ఎంజే మార్కెట్, అఫ్జల్గంజ్, కోఠి, సుల్తాన్బజార్ ప్రాంతాల్లో కొర్రమీను చేపలను కిలో రూ.400 నుంచి 600 వరకూ అమ్మడం గమనార్హం. -
దిగొచ్చిన కోడి
మిర్యాలగూడ, న్యూస్లైన్: నెల రోజుల క్రితం చుక్కలనంటిన చికెన్ ధరలు ప్రస్తుతం సగానికి పడిపోయాయి. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుండగా చికెన్ మాత్రం చీప్గా మారింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ 180 ఉండగా ప్రస్తుతం రూ 88కు పడిపోయింది. చికెన్ ప్రియులను తగ్గిన ధరలు ఆనందంలో ముంచినా బ్రాయిలర్ వ్యాపారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన దాణా ఖర్చులకు.. పడిపోతున్న చికెన్ ధరలకు కనీసం పొంతన లేకుండా పోతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో చికెన్ ఉత్పత్తికి దాణాతో పాటు మొత్తం రూ 70 ఖర్చవుతుండగా ప్రస్తుతం కోడిని కిలో 55రూపాయలకే విక్రయిస్తున్నారు. కార్తీకమాసపు పూజల ప్రభావం చికెన్ ధరలపై పడింది. ప్రతి యేటా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చికెన్ ధరలు తగ్గుదల సాధారణమే అయినా ఈసారి మాత్రం భారీగా తగ్గాయి. ఆకాశన్నంటుతున్న కూరగాయలు చికెన్ ధరలు ఓ వైపున తగ్గుతుండగా కూరగాయల ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. దొండకాయల ధర చికెన్కు పోటీగా ఉంది. కిలో దొండకాయలు రూ 80కు విక్రయిస్తున్నారు. అలుగడ్డ కిలో రూ 40, బెండకాయలు కిలో రూ 40, బీరకాయలు కిలో రూ 40, పచ్చిమిర్చి కిలో రూ 50, గోకరకాయ కిలో రూ 50కు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. దీంతో హైదరాబాద్, విజయవాడ నుంచి దిగుమతి అయ్యే కూరగాయలకు ధరలు పెరిగాయి. దానికి తోడు కార్తీకమాసంలో కూరగాయల వాడకం ఎక్కువగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిలిచింది. -
చికెన్.. ధర ‘చిక్కెన్’!
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్లైన్: మొన్నటి దాకా చుక్కలు చూపించిన చికెన్ ధర ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. మార్కెట్లో ఒకవైపు కూరగాయల ధరలు అంతకంతకూ పెరిగిపోతుంటే చికెన్ ధర మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. ఇరవై రోజుల క్రితం రూ. 200 పలికిన కిలో చికెన్.. ఇప్పుడు రూ.70కి పడిపోయింది. చికెన్ ప్రియులు ఈ ధరల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నా బ్రాయిలర్ వ్యాపారులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. కోళ్ల దాణా ధరలు విపరీతంగా పెరగడం, చికెన్ ధరలు పడిపోవడమే వీరి ఆందోళనకు కారణం. కిలో చికెన్ ఉత్పత్తికి దాణాఇతరత్రా ఖర్చులతో కలుపుకొంటే రూ.90 ఖర్చవుతుంది. అయితే మార్కెట్లో రైతు కిలో కోడి ధర రూ.38లే పలుకుతుండంతో గిట్టుబాటు కావడంలేదు. ప్రధానంగా దసరా పండుగ నుంచి మార్కెట్ తగ్గుముఖం పడుతూ వస్తోంది. బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఎక్కువగా మేక మాంసాన్నే ఇష్టపడటంతో గిరాకీ లేక చికెన్ స్టాక్ మిగిలిపోయింది. దీనికి తోడు రోజువారీ ఉత్పత్తి ఉండనే వుంది. ఇదంతా కలుపుకొని చికెన్ మార్కెట్లోకి అధికోత్పత్తి కావడంతో ధరలు అమాంతం తగ్గుతూ వస్తున్నాయి. మామూలుగా అయితే 10-15 శాతం చికెన్ ఉత్పత్తి వుంటే సరిపోతుంది. కానీ దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా ఉత్పత్తి వుండటం, ప్రణాళికలను పాటించని ఉత్పత్తి కేంద్రాలు వుండటమే ఈ స్థితికి కారణమని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం మొహర్రం, కార్తీక మాసాలు వుండటం.. మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సరుకు రావడంతో చికెన్ ధరలు తగ్గుతున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో చికెన్ ధరలు తగ్గుముఖం పడుతుండటం పరిపాటి. కానీ ఈ సారి ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇప్పుడు వున్న వాటికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇదిలావుంటే రాబోయే రోజుల్లో బ్రాయిలర్ రంగం భరోసా లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. భగ్గుమంటున్న కూరగాయలు ఒకవైపు చికెన్ ధరలు తగ్గుముఖం పడుతుంటే కూరగాయలు మాత్రం భగ్గుమంటున్నాయి. కిలో వంకాయలు ఇరవై రోజుల క్రితం రూ. 20 వుండగా ప్రస్తుతం రూ.50 పలుకుతోంది. బెండ రూ.30, బీర రూ.50, పచ్చిమిర్చి రూ.40, టమాటా రూ.30, ఆలుగడ్డ రూ.40, చిక్కుడు రూ.60, దొండ రూ.50, గోకరకాయ రూ.50కు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇటీవలి వర్షాలకు జిల్లా వ్యాప్తంగా భారీగా కూరగాయల పంటలు నష్టపోయాయి. వారం పాటు నీటిలోనేవుండటంతో ఆకుకూరలు, కూరగాయలు కుళ్లిపోయాయి. ఈ క్రమంలో భారీగా కొరత ఏర్పడింది. బయటి ప్రాంతల నుంచి కూడా కూరగాయలు తక్కువ స్థాయిలో వస్తున్నాయి. పెద్దమొత్తం వెచ్చించి వాటిని కొనుగోలు చేసేకంటే మాంసం కొనుక్కోవడమే మేలనే అభిప్రాయం మాంసాహారుల్లో వ్యక్తమవుతోంది. కార్తీకమాసం ప్రా రంభమవడం, అయ్యప్ప మాలధారులు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం వుందని వ్యాపారులు అంటున్నారు. కాగా గుడ్డు ధర మాత్రం పుంజుకుంటోంది. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు దాదాపు రూ.4కు లభిస్తోంది. దీంతో గుడ్డు తినేవారికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. అధికోత్పత్తే ప్రధాన కారణం.. మార్కెట్లో పరిమితికి మించి చికెన్ ఉత్పత్తి కావడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. పౌల్ట్రీ ఆశాజనకంగా లేని సమయాల్లో రూ.లక్షలు పెట్టి రైతులు ఈ రంగంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనిని సాకుగా చూపిస్తూ ధరల్ని అమాంతం తగ్గిస్తున్నారు. పౌల్ట్రీ లాభాల్లో వుండాలంటే ముందుగా ఈ రంగం పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. ఇదిలేకనే చాలామంది నష్టాల పాలవుతున్నారు. బ్రాయిలర్ పరిశ్రమ అయితే భరోసా లేకుండాపోతోంది. ఇరవై రోజుల్లోనే చికెన్ ధరలు సగానికిపైగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. - జక్కా రాంరెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ హైదరాబాద్ రీజియన్ ప్రెసిడెంట్ నిరాశలో వ్యాపారులు.. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా చికెన్ మనకు ఎక్కువగా వస్తోంది. దీనికి తోడు కార్తీక మాసం కారణంగా చికెన్ ధరలు పడిపోయాయి. రేటు తగ్గడంతో గిరాకీ బాగుంది. గతంలో కంటే దాదాపు ఒక రిటైల్ షాపు వారు కనిష్టంగా 150కిలోల చికెన్ను అమ్ముతున్నారు. చికెన్ ఎక్కువగా అమ్ముడవుతోంది కానీ సంపాదన గతంలో కంటే మించడం లేదని చికెన్ షాపుల వారు నిరాశ చెందుతున్నారు. - లక్ష్మణ్రెడ్డి, చికెన్ రిటైల్ ట్రేడర్ -
పౌల్ట్రీ.. పల్టీ!
గజ్వేల్, న్యూస్లైన్: ఫౌల్ట్రీ రంగానికి కేంద్ర బిందువుగా వర్ధిల్లుతున్న జిల్లాలో నేడు దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఇందులో 50 శాతం ఉత్పత్తులు అందిస్తున్న మన జిల్లాలో పౌల్ట్రీ రైతులు కష్టాలు దయనీయంగా మారాయి. ఇంటిగ్రేటెడ్ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను ఉత్పత్తి చేస్తున్న రైతులకూ కలిసిరావడం లేదు. సొంతంగా పరిశ్రమను నిర్వహిస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మార్కెట్ మాయాజాలంలో ధర రాక లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో అప్పుల బాధ తాళలేక పిల్లాపాపలతో సహా గ్రామాలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో వ్యవసాయరంగం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా ఫౌల్ట్రీ వెలుగొందుతోంది. దశాబ్దాలుగా ఈ పరిశ్రమతో రైతులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. కాలం కలిసొస్తే స్వల్ప వ్యవధిలోనే స్థితిమంతులను చేయడం.. కాలం కలిసి రాకపోతే నష్టాల పాలు చేయడం ఈ పరిశ్రమ ప్రత్యేకత. ప్రస్తుతం రెండో రకమైన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఎగుమతులు నిలిచిపోవడం, కార్తీక మాసం కావడంతో కొంతకాలంగా చికెన్ ధరలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్లో ధర స్థిరీకరణ లేకపోవడం, సరాసరి కిలో లైవ్ ధర రూ. 34 నుంచి రూ. 36 మాత్రమే పలకడం నష్టాల తీవ్రతను పెంచుతోంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది మంది రైతులు సుగుణ, వెంకటేశ్వర, డైమండ్, జాహ్నవి, జానకీ, ఎస్ఆర్, స్నేహ తదితర ఇంటిగ్రేటెడ్ సంస్థల భాగస్వామ్యంతో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సంస్థలతో పరిశ్రమను నడుపుకోవాలనుకుంటే రైతులు షెడ్, లేబర్, కరెంట్, నీరువంటి మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుంది. ఆ సంస్థల నుంచి చిక్స్ అందించి వాటికి 45 రోజుల వ్యవధి కోసం మందులు, దాణా అందుతుంది. ఒక్కో బర్డ్ సగటున రెండు కిలోలకు పైగా తూకం వస్తుంది. ఈ స్థాయికి వచ్చేవరకు సంస్థలు ఒక్కో కోడికి రూ.80 వరకు ఉత్పత్తి వ్యయం కింద ఖర్చుచేస్తున్నాయి. మార్కెట్లో చికెన్ ధరతో సంబంధం లేకుండా రైతులకు ఒక్కో కోడిపై కిలోకు రూ.4.85 చెల్లిస్తాయి. నిర్వహణ బాగుంటే మరో 25 పైసలు అదనంగా చెల్లిస్తారు. 5 శాతం కోళ్లకంటే ఎక్కువగా మృత్యువాత పడితే నష్టాలను రైతులే భరించాలి. విద్యుత్ చార్జీల రూపేణా 5 వేల కోడిపిల్లల సామర్థ్యం కలిగిన షెడ్కు 45 రోజులకు రూ.5 వేలపైనే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ మినహాయిస్తే ఈ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను పెంచుతున్న రైతులకు మిగులుతోంది అంతంతమాత్రమే. నష్టాలకు కారణాలెన్నో.. కొంతకాలంగా పౌల్ట్రీ పరిశ్రమను ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టాయి. ఒక్కో కోడి ఉత్పత్తి చేయడానికి అన్నీ కలుపుకుని రూ.95 వరకు ఖర్చవుతోంది. సుమారు రెండు కిలోలకుపైగా బరువుండే బర్డ్స్ చికెన్ ధర రూ.60 నుంచి 65 వరకు పలికితే నష్టాలు ఉండేవి కావు. కానీ కొంతకాలంగా చికెన్ ధర రూ.34 నుంచి 36 వరకే పలుకుతోంది. ఈ పరిస్థితి వల్ల ఇంటిగ్రేటెడ్ సంస్థలతో పరిశ్రమలను నిర్వహిస్తున్న రైతులను పక్కనబెడితే సొంతంగా కోళ్లను ఉత్పత్తి చేస్తున్న రైతులు అధోగతి పాలవుతున్నారు. ఏడాదిన్నర క్రితం ఇక్కడి నుంచి మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఆయా రాష్ట్రాల్లో రైతులకు చిక్స్, దాణా, విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రభుత్వం 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీని ఇవ్వడం వల్ల ఉత్పత్తులు పెరిగిపోయి రాష్ట్రం నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. ఇదిలావుంటే ఇంటిగ్రేటెడ్ సంస్థలు ఉత్పత్తులు విపరీతంగా పెరిగిపోవడం మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ ధరలను విపరీతంగా తగ్గిస్తున్నాయి. లక్షల్లో నష్టాలను చవిచూసి అప్పులపాలైన రైతులు పిల్లాపాపలతో గ్రామాలను వదిలి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు 1986లో నేను పౌల్ట్రీ రంగంలోకి వచ్చాను. ఇంటిగ్రేటెడ్ సంస్థలతో ప్రమేయం లేకుండా కోళ్లను ఉత్పత్తి చేస్తున్నాను. ప్రస్తుతం 10 వేల చిక్స్ సామర్ధ్యం గల ఫారం నిర్వహిస్తున్నాను. 2004-04లో కోళ్లకు బర్డ్ఫ్లూ వచ్చిన సమయ ంలో తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వ చ్చింది. ప్రస్తుతం కూడా అదే రకమైన పరిస్థితి ని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రంగాన్ని ఆదుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో మా దిరిగా సబ్సిడీలను అందించి చేయూతని వ్వాలి. - దశరథరెడ్డి, ఫౌల్ట్రీ ఫారం నిర్వాహకుడు, తిర్మలాపూర్, దౌల్తాబాద్ మండలం -
చికెన్ ముక్కలుడకవ్!
=శనివారం నరకచతుర్ధశి, ఆదివారం దీపావళి =ఆ రెండు రోజుల్లో రూ.10 కోట్ల చికెన్ వ్యాపారానికి బ్రేక్ =వరుస పండుగలతో రెండు నెలలుగా పడిపోయిన అమ్మకాలు =నష్టాల్లో పౌల్ట్రీ రైతులు సాక్షి, చిత్తూరు: వరుస పండుగలతో రెండు నెలలుగా జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడింది. సాధారణంగా నెలకు 30 లక్షల కోళ్ల ఉత్పత్తితో రూ.45 కోట్ల టర్నోవర్ జరిగేది. వినాయక చవితి, దసరా, తిరుమల శనివారాల(పెరటాసి నెల)తో రెండు నెలలుగా మాంసాహార వినియోగం తగ్గింది. దీంతో లైవ్ చికెన్ ధరలు పడిపోవడంతో అటు పౌల్ట్రీరైతులు ఇ టు ఇంటిగ్రేటెడ్ హేచరీస్ కంపెనీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఉత్పత్తి ఎక్కువ, వ్యాపారం తక్కువ కావడంతో పౌల్ట్రీల నుంచి కోళ్లను కొనేవారు లేరు. సాధారణంగా దీపావళి సందర్భంగా తొలిరోజు నరకచతుర్ధశి రోజున ప్రజలు మాంసాహారంతో పండుగ జరుపుకుం టారు. ఈ ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 3 లక్షల కోళ్లను(చికెన్) విక్రయం జరుగుతుంది. దా దాపు ఒక్కరోజే రూ.4.5 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ సారి నరకచతుర్ధశి శనివారం రావడంతో ఎక్కువమంది ప్రజలు సెంటిమెం ట్గా భావించి మాంసాహారం తినే పరిస్థితి లేదు. ఆదివారం కూడా నోముల పండుగ కావడంతో మరో 3 లక్షల కోళ్ల కటింగ్ అగినట్లే. ఈ రెండు రోజుల్లోనే రూ.10 కోట్ల వరకు చికెన్ వ్యాపారం నిలిచిపోనుందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పౌల్ట్రీల్లో పడిపోయిన ధరలు పౌల్ట్రీల్లో 45 రోజుల పాటు రైతులు బ్రాయిలర్ కోళ్లను పెంచి ఇంటిగ్రేటెడ్ కంపెనీలకు తిరిగి అ ప్పగిస్తారు. ఇందుకు గాను ఒక కోడి (బ్రాయిలర్)పై రెండు నెలల క్రితం కిలోకు రూ.70 చె ల్లించేవారు. ప్రస్తుతం కిలోకు రూ.40 మాత్ర మే చెల్లిస్తున్నారు. దీంతో ఒక కోడిపై రెండు కి లోలకు రూ.60 వరకు నష్టపోతున్నారు. నెలకు 30 లక్షల బ్రాయలర్ కోళ్లు ఉత్పత్తి అయ్యే జి ల్లాలో నెల రోజులుగా కొనుగోలుదారులు లేక లక్షల కోళ్లు ఇంటిగ్రేటెడ్ కంపెనీల్లోనూ, పౌల్ట్రీ ఫారాల్లోనే ఉంటున్నాయి. దీంతో పౌల్ట్రీ రై తు లు దాణా, ఇతర ఖర్చులకు కూడా గిట్టుబాటు కాక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఎక్కువ రోజులు షెడ్లలోని కోళ్లకు దాణావేయలేక పోవడంతో సీఆర్డీ, డయేరి యా సమస్యలతో వం దల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. పిల్లల పెంపకం ఆపినా పెరగని డిమాండ్ పౌల్ట్రీల్లో పెంచేందుకు బ్రాయలర్ కోడిపిల్లలను విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, కో యంబత్తూరు, ఈరోడ్డు నుంచి చిత్తూరు హేచరీస్ కంపెనీలు తెప్పించి రైతులకు అందజేస్తుం టాయి. కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రై తులు 45 రోజుల పాటు వీటిని పెంచి బరువు వచ్చిన తరువాత కోతకు కంపెనీలకే తిరిగి అప్పగిస్తారు. పెంచినందుకు గాను కేజీ పైన ఆ రోజు మార్కెట్ రేటు అధారంగా చెల్లిస్తారు. రెం డు నెలల నుంచి వరుసగా పండుగలు, పెరటాసి నెల ఎఫెక్ట్తో చికెన్ విక్రయాలు పడిపోయాయి. దీంతో ఇంటిగ్రేటెడ్ హేచరీస్ కంపెనీలు నెలలో ఏడు రోజుల పాటు పిల్లలను సరఫరా చేయకుండా డిమాండ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికే ఉత్పత్తి అయిన కోళ్లను కొనేవారు లేక కంపెనీల యజమానులు, రైతులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు వెయ్యి మంది రైతులు, పరోక్షంగా మరో 10వేల మంది వరకు కార్మికులు, ఉద్యోగులు కోళ్ల పరిశ్రమలో ఉన్నారు. ప్రస్తు తం పరిశ్రమలో లేయర్లు(గుడ్డుపెట్టే కోళ్లు)కు మాత్రం కొంత డిమాండ్ ఉంది. బ్రాయిలర్ ఉత్పత్తి, అమ్మకాలు మాత్రం బాగా మందగిం చాయి. దీంతో నెలకు రూ.45 కోట్ల టర్నోవర్ జరిగే కోళ్ల పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటోంది. రెండునెలలుగా అమ్మకాలు పడిపోయాయి రెండు నెలలుగా పండుగలు, పెరటాసి నెల, అమావాస్య, శుక్ర, గురు, సో మవారాలు వంటి సెంటిమెంట్తో చికెన్ కొనేవారు తగ్గారు. దీనికితోడు అవసరానికి మించి కోళ్ల ఉత్పత్తి ఉంటోంది. ఇంటిగ్రేటెడ్ హేచరీస్తో పాటు, పౌల్ట్రీరైతులు కూడా సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈసారి నరకచతుర్ధశి శనివారం రావడంతో చికెన్ కొనేవారి సంఖ్య ఆ రోజు దాదాపుగా ఉండదు. మరుసటి రోజు ఆదివారం అయినా గౌరి వ్రతం, నోముల పండుగ కాబట్టి మాంసాహారం తినరు. దీంతో అమ్మకాలు పూర్తిగా తగ్గనున్నాయి. -డాక్టర్ పెరుమాళ్, పౌల్ట్రీ టెక్నికల్ ఎక్స్పర్ట్, చిత్తూరు