customs duty
-
చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లు
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2025లో భాగంగా హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్, సుజుకీ వంటి బ్రాండ్ల ప్రీమియం మోటార్ సైకిళ్లపై సుంకాలను 5-20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు.దిగుమతి సుంకాల తగ్గింపు అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై డిమాండ్ స్థిరంగా కొనసాగించేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ టారిఫ్ విధానాలను, హార్లే డేవిడ్సన్ దిగుమతులకు సంబంధించి విమర్శించారు. భారత్ను ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణించిన ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని పదేపదే పిలుపునిచ్చారు.కొత్త విధానం ప్రకారం 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై గతంలో ఉన్న 50 శాతం నుంచి 40 శాతానికి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై సుంకాన్ని 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దీంతోపాటు సెమీ నాక్ డౌన్ (ఎస్కేడీ-తయారీదారు ప్లాంట్లో పాక్షికంగా అసెంబుల్ చేసిన వాహనం(లైట్ మోటార్ సైకిళ్లు లేదా కార్లు)), పూర్తిగా నాక్ డౌన్ (సీకేడీ-తయారీదారు ప్లాంట్ వద్దే పూర్తిగా విడి భాగాలుగా చేయడం) యూనిట్లపై సుంకాలను కూడా తగ్గించారు.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..ఈ చర్య భారతీయ వినియోగదారులకు ప్రీమియం మోటార్ సైకిళ్లను మరింత చౌకగా మారుస్తుందని, ఈ హై-ఎండ్ బ్రాండ్ల అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు. అమెరికా లేవనెత్తిన వాణిజ్య ఫిర్యాదులను పరిష్కరించడానికి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి భారతదేశం సుముఖంగా ఉందని ఈ నిర్ణయం సూచిస్తుంది. కస్టమ్స్ సుంకాల తగ్గింపు దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, విదేశీ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాన్ని పెంచే విస్తృత వ్యూహంలో భాగం. -
కస్టమ్స్ టారిఫ్లు ఇక ‘ఎనిమిదే’
బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను కేవలం ‘ఎనిమిదింటికి’ పరిమితం చేస్తున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. అయినప్పటికీ సెస్సును సర్దుబాటు చేయడం ద్వారా చాలా వస్తువులపై నికర సుంకాలను ప్రస్తుతం మాదిరే కొనసాగించే విధంగా ఈ మార్పులు చేయడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో మొత్తం మీద ఏడు టారిఫ్లను తొలగించారు. 2023–24లోనూ ఇదే మాదిరిగా ఏడు టారిఫ్లను ఎత్తివేశారు. దీంతో ఇప్పుడు ‘సున్నా’ రేటు సహా మొత్తం ఎనిమిది రేట్లే మిగిలాయి. ఇది సులభతర వ్యాపార నిర్వహణకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న టారిఫ్ల గందరగోళానికి తెరదించినట్టయింది. డెలాయిట్ ఇండియా పార్ట్నర్ హర్ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. బడ్జెట్లో 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం టారిఫ్లను విలీనం చేసి 20 శాతానికి మార్చినట్టు.. సబ్బులు, ప్లాస్టిక్, కెమికల్స్, పాదరక్షలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 100 శాతం, 125 శాతం, 150 శాతం టారిఫ్లను 70 శాతం టారిఫ్లో విలీనం చేసినట్టు తెలిపారు. లేబరేటరీ కెమికల్స్, ఆటోమొబైల్స్కు ఇది అమలవుతుందన్నారు. -
సామాన్యులకు షాక్.. వంటనూనెలు ప్రియం
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వంట నూనెలు ప్రియం కానున్నాయి. ముడి పామాయిల్, సోయా బీన్, సన్ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన (రిఫైన్డ్) పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అదనం. విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో వంట నూనెల ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ‘సోయా, నూనెగింజల రైతులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఈ నూనె గింజలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు భారీగా ప్రయోజనం పొందుతారు’ అని ఒక అధికారి తెలిపారు. ప్రపంచంలో వంట నూనెలను అత్య ధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70 శాతం ఉంటోంది. పామాయిల్ వాటా 50 శాతంపైనే. ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్ఫ్లవర్ భారత్కు సరఫరా అవుతున్నాయి. కాగా, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. అలాగే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఉన్న సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది. రిటైల్ మార్కెట్లో పెంచేసి విక్రయం విదేశాల నుంచి నూనెలు దిగుమతి అయిన తర్వాత రిఫైనరీలకు చేరుకుని అక్కడ శుద్ధి లేదా ప్యాకింగ్ పూర్తి అయి మార్కెట్లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. పెరిగిన పన్నుల ప్రకారం కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాల్సి ఉన్నా.. మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపై వర్తకులు అప్పుడే ధరలను పెంచి అమ్మడం ప్రారంభించారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. రిటైల్లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ల ధరలు 10 శాతం నుంచి 15 శాతం దాకా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో లీటర్ సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లను రూ.108 వరకు విక్రయించగా, శనివారం ఒక్కసారిగా రూ.124 కి చేరింది. అంటే ఒక్క ప్యాకెట్పై రూ.16 పెరిగింది. సూపర్మార్కెట్లు, దుకాణాల్లో పెరిగిన ధరలను చూసి వినియోగదారులు షాకయ్యారు. పామాయిల్ ధర మొన్నటి వరకు లీటర్కు రూ.95 ఉండగా, శనివారం మార్కెట్లో రూ.105కు అమ్మారు. అలాగే పల్లీ నూనె లీటర్కు రూ.155 ఉండగా, రూ.10 పెరిగి రూ.165కి చేరింది. స్థానికంగా తయారయ్యే సాధారణ పల్లీ నూనెలు లీటర్కు రూ.106 ఉండగా, శనివారం రూ.116కు అమ్మారు. -
మూడోరోజూ తగ్గిన బంగారం
న్యూఢిల్లీ/న్యూయార్క్: భారత్లో 15 శాతం నుంచి 6 శాతానికి కస్టమ్స్ సుంకాల కోతకు తోడు, అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– కామెక్స్లో ధరల భారీ పతనం నేపథ్యంలో వరుసగా మూడవరోజూ దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.1,000 చొప్పున తగ్గి వరుసగా రూ.70,650, రూ.70,300కు దిగివచ్చాయి. ఇక్కడ పసిడి వరుసగా మూడు రోజుల్లో దాదాపు రూ.5,000 తగ్గింది. వెండి ధరలు సైతం ఇక్కడ గురువారం భారీగా తగ్గాయి. కేజీ ధర రూ.3,500 తగ్గి రూ.84,000కు దిగివచ్చింది. అంతర్జాయంగా ఫ్యూచర్స్లో ధర ఔన్స్కు (31.1గ్రా) 2 శాతం (55 డాలర్లు) పతనమై 2,360 వద్ద ట్రేడవుతోంది. జపాన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం వచ్చేవారం వడ్డీరేట్ల పెంచవచ్చని వచి్చన వార్తలు, దీనితో డాలర్ ఇండెక్స్ దేశాల కరెన్సీల్లో భాగంగా ఉన్న జపాన్యన్ భారీ పెరుగుదల అంతర్జాతీయంగా బంగారం తాజా భారీ పతనానికి కారణం. ఇక దేశీ కమోడిటీ ఫ్యూచర్స్–ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి ధర క్రితం ముగింపులో పోలి్చతే రూ.1,392 (2%పైగా) తగ్గి రూ.67,560 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి..వెండి.. ఊరట!
న్యూఢిల్లీ: ఇటు బులియన్ పరిశ్రమకు అటు ఆభరణాల ప్రియులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు ప్రస్తుతం 15 శాతంకాగా, ఈ రేటును 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్ సుంకం (బీసీడీ) 10 నుంచి 5 శాతానికి తగ్గగా, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) 5 శాతం నుంచి 1 శాతానికి చేరింది.ఇక విలువైన లోహాల నాణేలు, హుక్, క్లాస్ప్, క్లాంప్, పిన్, క్యాచ్, స్క్రూ బ్యాక్ వంటి చిన్న భాగాలకు సంబంధించిన బంగారం–వెండి ఫైండింగ్స్, బంగారం, వెండి కడ్డీలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కూడా 15 శాతం నుంచి 6 శాతానికి బడ్జెట్ తగ్గించింది. మరింత మెరుగుదల అవసరమైన బంగారం, వెండి డోర్లపై కస్టమ్స్ సుంకం 14.35 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గించారు. ‘‘దేశంలో బంగారం, విలువైన లోహ ఆభరణాల పరిశ్రమకు ఊతం ఇవ్వడానికి బంగారం– వెండిపై కస్టమ్స్ సుంకాలను 6 శాతానికి తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను’’ అని ఆర్థికమంత్రి తెలిపారు. ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరిడియంలపై లెవీని కూడా 15.4 శాతం నుంచి 6.4 శాతానికి బడ్జెట్లో తగ్గించారు.రాజధానిలో రూ.3,350 తగ్గుదల ఇక ఆర్థిక మంత్రి కీలక ప్రకటన నేపథ్యంలో స్పాట్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా పడ్డాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత (99.9 శాతం ప్యూరిటీ) పసిడి ధర క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,350 తగ్గి, రూ.72,300కు దిగివచి్చంది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో దిగివచ్చి రూ.71,950 స్థాయికి చేరింది.వెండి కేజీ ధర సైతం రూ.3,500 (4 శాతం) తగ్గి రూ.87,500కు దిగివచ్చింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికి వస్తే, 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,614 రూ.3,602 చొప్పున తగ్గి వరుసగా రూ.69,602, రూ.69,323కు దిగివచ్చాయి. ఇక వెండి కేజీ ధర రూ.3,275 తగ్గి రూ.84,919కి దిగింది. ఫ్యూచర్స్లో రూ.4,000 డౌన్ ఆర్థికమంత్రి ప్రకటన వెంటనే ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న బంగారం ఆగస్టు కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోలి్చతే దాదాపు రూ.4,000 పడిపోయి (5 శాతంపైగా) రూ.68,500కు చేరింది. కేజీ వెండి ధర సైతం రూ.88,995 నుంచి రూ.84,275కు దిగివచి్చంది. అంతర్జాతీయంగా ధర ఇలా... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజ్లో ఈ నెల 16వ తేదీన ఔన్స్కు (31.1గ్రా) ఆల్టైమ్ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ధర మంగళవారం 2,400 డాలర్లపైన ట్రేడవుతోంది. తీపికబురే కానీ... కస్టమ్స్ సుంకాలు తగ్గించడం తక్షణ డిమాండ్కు సంబంధించి బులియన్ పరిశ్రమ, వినియోగదారుకు తీపి కబురే అయినప్పటికీ ఈ నిర్ణయంపై రానున్న కాలంలో భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువల కదలికలు ప్రభావం చూపుతాయి.డిజిటల్ పెట్టుబడికి అవకాశంకస్టమ్స్ సుంకం తగ్గింపు బులియన్ మార్కెట్ను తక్షణం ప్రభావితం చేసే అంశమే. ఇది పెట్టుబడిదారులకు సానుకూల చర్య అయినప్పటికీ, చైనాసహా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చు. 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయం. – మహేంద్ర లూనియా, విఘ్నహర్తా గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ -
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు
న్యూఢిల్లీ: భారత్ బంగారం దిగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 30 శాతం పడిపోయాయి. దిగుమతులుమొత్తం విలువ 31.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది యల్లో మెటల్ దిగుమతుల విలువ 2021-22 ఇదే కాలంలో 45.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 ఆగస్టు నుంచి దిగుమతుల్లో పెరుగుదల లేకపోగా, క్షీణత నమోదుకావడం దీనికి నేపథ్యం. బంగారంపై అధిక దిగుమతి సుంకం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు విలువైన లోహం దిగుమతులు తగ్గడానికి కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కేంద్రం పసిడిపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. పసిడి దిగుమతులను నిరుత్సాహ పరచడం, తద్వారా ఈ బిల్లును తగ్గించడం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరక్కుండా కట్టడి చేయడం ఈ నిర్ణయం లక్ష్యం. వెండి వెలుగులు.. కాగా, వెండి దిగుమతులు మాత్రం 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 66 శాతం పెరిగి 5.3 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. -
ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు
అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని మినహాయించింది. అలాగే వివిధ క్యాన్సర్ల చికిత్సలో వాడే పెంబ్రోలిజుమాబ్ (కీట్రుడా) ఔషధంపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. వ్యక్తిగత దిగుమతిదారులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఔషధాలు, ఆహార పదార్థాలపై దిగుమతి సుంకం మినహాయింపులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణంగా బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులు, ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేర ఉంటుంది. ప్రాణాలను రక్షించే అత్యవసర మందులు, వ్యాక్సిన్లపై మాత్రం 5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది. కొన్ని మందులపై అయితే కస్టమ్స్ డ్యూటీ అస్సలు ఉండదు. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద జాబితాలో చేర్చిన అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని రకాల మందులు, ఆహార పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ మినహాయింపును పొందేందుకు వ్యక్తిగత దిగుమతిదారు కేంద్ర లేదా రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ లేదా జిల్లా మెడికల్ ఆఫీసర్, సివిల్ సర్జన్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. -
Budget 2023: ఆభరణాల ఎగుమతులుకు ఊతం ఇవ్వాలి
న్యూఢిల్లీ: రత్నాలు– ఆభరణాల తయారీ, ఎగుమతుల రంగం పురోగతికి రాబోయే బడ్జెట్లో కీలక చర్యలు ఉండాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రధానంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆర్థిక శాఖను కోరుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఆ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ► దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక నిధుల మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా బంగారం దిగుమతులపై సుంకాన్ని కేంద్రం జూలైలో 10.75 శాతం నుండి 15 శాతానికి పెంచింది. ఇందులో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (ఏఐడీసీ) 2.5 శాతంగా ఉన్నాయి. ► ప్రతి సంవత్సరం, రత్నాలు– ఆభరణాల ఎగుమతి పరిశ్రమ దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతుంది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) మాజీ చైర్మన్ కోలిన్ షా ఈ అంశంపై మాట్లాడుతూ, ఈ రంగంలో ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్పై పరిశ్రమ ఆశలు పెట్టుకుందని అన్నారు. ఇందులో ప్రధానంగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నట్లు వివరించారు. ► మండలి అంచనా ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఆభరణాలకు రిపేర్ హబ్గా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విధానం 400 మిలియన్ డాలర్ల వరకు ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 ఏప్రిల్–నవంబర్ మధ్య రత్నాలు –ఆభరణాల ఎగుమతులు 2 శాతం పెరిగి 26.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే బంగారం దిగుమతులు 18.13 శాతం తగ్గి 27.21 బిలియన్ డాలర్లకు దిగాయి. ► భారతదేశం బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్ను తీర్చడంలో భాగంగా అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిమాణం వార్షికంగా 800 నుంచి 900 టన్నుల వరకూ ఉంటుంది. -
Pre-Budget Meet: ప్రోత్సాహకాలు.. తక్కువ వడ్డీ రేటు కావాలి!
న్యూఢిల్లీ: దేశం నుంచి ఎగుమతుల పురోగతికి అలాగే ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్లో ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని ఎగుమతిదారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని, తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 5వ ప్రీ–బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె గురువారం ఎగుమతి సంఘాలు, సేవా రంగాల ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరిసహా ఆ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగుమతి రంగం ప్రతినిధులు చేసిన పలు విజ్ఞప్తుల్లో ముఖ్యాంశాలు... ► డాలర్ మారకంలో రూపాయి బలహీనత వల్ల ఎగుమతుల పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఎగుమతి సంఘాల భారత సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ ఎగుమతుల విలువ 460–470 బిలియన్ డాలర్ల వరకూ పురోగమించేందుకు (2021–22లో 400 బిలియన్ డాలర్లు) మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) కింద ప్రకటించిన రూ.200 కోట్లు సముద్రంలో నీటి బొట్టని కూడా సమాఖ్య పేర్కొంది. ‘కాబట్టి, పటిష్ట ఎగుమతుల మార్కెటింగ్ కోసం, గత సంవత్సరం ఎగుమతుల విలువలో కనీసం 0.5 శాతం కార్పస్తో ఎగుమతి అభివృద్ధి నిధిని సృష్టించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించింది. అలాగే సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ద్వారా ఎగుమతి చేసే వస్తువుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని సూచించింది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ), టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేయబడిన పన్ను) రద్దు ద్వారా విధానపరమైన సరళీకరణలు జరగాలని విజ్ఞప్తి చేసింది. దేశీ మార్కెటింగ్ కోసం ఎగుమతిదారులు చేసే వ్యయాలపై 200 శాతం పన్ను మినహాయింపు కోరింది. గ్లోబల్ ఇండియన్ షిప్పింగ్ లైన్ను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలను పొడిగించాలని సూచించింది. ఎంఎస్ఎంఈకి పన్ను రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కీలక సూచనలు చేస్తూ, విమానాశ్రయంలో విదేశీ పర్యాటకులకు పన్ను రిఫండ్ చేయాలని కోరింది. దీనివల్ల పర్యాటకం రంగం పురోగతితోపాటు హస్తకళలు, తివాచీలు, ఖాదీ, తోలు వస్తువుల ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది. ► వెట్ బ్లూ క్రస్ట్, ఫినిష్డ్ లెదర్పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పునరుద్ధరించాలని సమావేశంలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ (సీఎల్ఈ) డిమాండ్ చేసింది. హ్యాండ్బ్యాగ్లు, వస్త్రాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఎగుమతిదారులు ప్రధానంగా ఇటువంటి తోలులను దిగుమతి చేసుకుంటారు. ఫినిష్డ్ లెదర్ డ్యూటీ–ఫ్రీ దిగుమతి తయారీదారుల పోటీ తత్వం మరింత మెరుగుపడ్డానికి ఈ చర్య దోహపదడుతుందని తెలిపింది. ► ముడి సిల్క్, సిల్క్ నూలు (15 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకం), ముడి పత్తి (సుంకం రహితం), రాగి ఖనిజాలు వంటి అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకాలను సవరించాలని ఎగుమతిదారులు సూచించారు, భారతదేశ ఎగుమతులు ప్రతికూల భూభాగంలోకి ప్రవేశించాయి. ► విస్తృత పన్ను రాయితీ ప్రయోజనాలతో డిమాండ్ను ప్రోత్సహించడం ద్వారా వినియోగాన్ని పెంచాలని పరిశ్రమల సంస్థ– పీహెచ్డీసీసీఐ కోరింది. ► ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎ శక్తివేల్సహా విప్రో లిమిటెడ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేఈపీసీ), తమిళనాడు, కలకత్తా, ఉత్తర అస్సోంకు చెందిన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్తో సహా పలు కంపెనీలు, వాణిజ్య, పరిశ్రమల సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
బడ్జెట్ అంచనాలను మించి పన్ను వసూళ్లు!
న్యూఢిల్లీ: భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి నమోదుకానున్నట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. లక్ష్యంకన్నా రూ.4 లక్షల కోట్ల అధిక వసూళ్లు జరగవచ్చని ఆయన తెలిపారు. భారీగా జరుగుతున్న ఆదాయపు పన్ను, కస్టమ్స్ సుంకాలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు దీనికి కారణమని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు... ► పన్ను రాబడిలో వృద్ధి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కంటే ఎక్కువగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి దీనికి కారణం. ► 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. ► అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. ► ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చు. ► పన్ను వసూళ్ల మదింపునకు మేము విస్తృత స్థాయిలో డేటాను ఉపయోగిస్తున్నాము. ఆదాయపు పన్ను, జీఎస్టీ విభాగాలు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) నుండి డేటాను ఎప్పుటికప్పుడు పొందుతున్నాము. సాంకేతికత అధికారికీకరణ అనుకూలతను మెరుగుపరచడంతో డేటాను సమగ్ర స్థాయిలో పొందగలుగుతున్నాము. ► 2020–21తో పోల్చితే 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 50 శాతం పెరిగి, రూ.14.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ► ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యానికి అతి చేరువలో ఉండడం హర్షణీయం. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా వరుసగా రూ.2.13 లక్షల కోట్లు, రూ.3.35 లక్షల కోట్ల చొప్పున వసూళ్లు జరగాలన్నది బడ్జెట్ లక్ష్యం. ► ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 10 వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో) రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్స్ పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. ► దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం హర్షణీయ పరిణామం. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
యూకే నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్..కాస్ట్లీ గిఫ్ట్..కట్ చేస్తే!
సాక్షి, ముంబై: సోషల్మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపడం, ఆనక మెల్లిగా మాటకలిపి, ఖరీదైన బహుమతులంటూ ఎరవేసి, అమాయకులకు కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెడుతున్న సంఘటన గతంలో చాలా చోటు చేసుకున్నాయి. ఇలాంటి నేరాలపై ఎన్ని సార్లు హెచ్చరించినా మళ్లీ మళ్లీ ఇలాంటి ఉదంతాలు రిపీట్ అవుతూనేఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్కు చెందిన ఓ మహిళ రూ.1.12 కోట్ల రూపాయలను పొగొట్టకుంది. రిటైర్డ్ మహిళా కోర్టు సూపరింటెండెంట్కు ఏడాది జూన్లో యునైటెడ్ కింగ్డమ్లోని మాంచెస్టర్ నివాసిని అంటూ ఒక వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దాన్ని ఈమె అంగీకరించారు. ఆ తరువాత అతనితో కలిపి మరో ఇద్దరు మాట కలిపి తమ ప్లాన్ను పక్కాగా అమలు చేశారు. ఫోన్లలో తరచూ మాట్లాడుతూ బంగారం , ఇతర కాస్ట్లీ గిఫ్ట్లు పంపిస్తున్నామంటూ మభ్య పెట్టారు. అయితే దానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించవలసి ఉంటుందని నమ్మబలికారు. దీంతో ఆమె వారికి ఏకంగా 1.12 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఆ తరువాతనుంచి వారి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా, ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు.మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, కుట్ర కేసు నమోదు చేశామనీ, cనిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అలీబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
మొబైల్ డిస్ప్లే దిగుమతులపై 15 శాతం సుంకాలు
న్యూఢిల్లీ: స్పీకర్లు, సిమ్ ట్రే వంటివి అమర్చిన మొబైల్ ఫోన్ డిస్ప్లే యూనిట్ల దిగుమతులపై 15 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) వర్తిస్తుందని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. డిస్ప్లే అసెంబ్లీని దిగుమతి చేసుకునేటప్పుడు, సుంకాల ఎగవేత కోసం తప్పుడు డిక్లరేషన్లను ఇవ్వకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణంగా మొబైల్ ఫోన్ డిస్ప్లే అసెంబ్లీలో టచ్ పానెల్, కవర్ గ్లాస్, ఎల్ఈడీ బ్యాక్లైట్ వంటివి ఉంటాయి. వీటి దిగుమతులపై ప్రస్తుతం 10% సుంకం ఉంది. -
రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత
న్యూఢిల్లీ: దాదాపు రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత ఆరోపణలపై చైనాకు చెందిన హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఒప్పో ఇండియాకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) షోకాజ్ నోటీసులు (ఎస్సీఎన్) జారీ చేసింది. జూలై 8న ఈ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఒప్పో ఇండియా కార్యాలయాలు, సంస్థలోని కీలక ఉద్యోగుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో.. మొబైల్ ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకున్న కొన్ని ఉత్పత్తుల వివరాలను తప్పుగా చూపినట్లు కచ్చితమైన ఆధారాలు లభించాయి. దీంతో రూ. 4,389 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేతపై ఒప్పో ఇండియాకు షోకాజ్ నోటీ జారీ అయ్యింది’ అని పేర్కొంది. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఒప్పో ఇండియా కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో, కంపెనీ కొన్ని దిగుమతుల వివరాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించినట్లు, నిబంధనలకు విరుద్ధంగా పలు బహుళ జాతి సంస్థలకు రాయల్టీలు, లైసెన్సు ఫీజుల కింద నిధులు చెల్లించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. దిగుమతి సుంకాలపరంగా కంపెనీ సుమారు రూ. 2,981 కోట్ల మేర మినహాయింపు ప్రయోజనాలు పొందింది. అంతే గాకుండా టెక్నాలజీ, బ్రాండ్, మేథోహక్కుల లైసెన్సులు వినియోగించుకున్నట్లు చూపడం ద్వారా పలు సంస్థలకు రాయల్టీ, లైసెన్సు ఫీజులు చెల్లించినట్లు/చెల్లించాల్సి ఉన్నట్లు ప్రొవిజనింగ్ చేసింది. వీటిని దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువకు జోడించకపోవడం ద్వారా రూ. 1,408 కోట్ల మేర సుంకాలు ఎగవేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. కా గా, ఎస్సీఎన్లో పేర్కొన్న ఆరోపణలపై తమ అభి ప్రాయం వేరుగా ఉందని ఒప్పో ఇండియా తెలిపింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
కరూర్ వైశ్యా బ్యాంకు ద్వారా కస్టమ్స్ సుంకాల చెల్లింపు
ముంబై: కస్టమ్స్ సుంకాలను తమ ఖాతాదారులు ఇకపై ఐస్గేట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చని కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) వెల్లడించింది. ఇందుకోసం కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు చెందిన ఐస్గేట్లో (ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే) లింకు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ పోర్టల్లో తమ బ్యాంకును ఎంచుకోవడం ద్వారా ఖాతాదారులు నేరుగా కస్టమ్స్ సుంకాలను చెల్లించవచ్చని కేవీబీ ఎండీ బి. రమేష్ బాబు తెలిపారు. కొత్తగా కరెంటు అకౌంటు కస్టమర్లను పెంచుకునేందుకు కూడా తమకు ఈ సదుపాయం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పన్నుల వసూళ్లకు అధీకృత బ్యాంకుల జాబితాలో సీబీఐసీ గతంలో కేవీబీని కూడా చేర్చింది. -
సోలార్ మాడ్యూళ్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూళ్లపై చెప్పినట్టుగానే ఏప్రిల్ 1 నుంచి బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. దీంతో దిగుమతుల రూపంలో ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకుని దేశీ పరిశ్రమ నిలదొక్కుకోగలదని పరిశ్రమ సంఘం ఎన్ఐఎంఎంఏ పేర్కొంది. ఎన్ఐఎంఎంఏ, ఇండియా సోలార్ తయారీదారుల సంఘం, అఖిలభారత సోలార్ కంపెనీ సంఘం ప్రతినిధులు గురువారం ఢిల్లీలో మంత్రి సీతారామన్ను కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే సోలార్ ప్యానెళ్లు, సోలార్ సెల్స్పై ఎటువంటి సుంకాల్లేకపోవడంతో దేశీయ యూనిట్లు మూతపడే ప్రమాదంలో ఉన్నట్టు తెలిపారు. దీంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అదే సమయంలో మాడ్యూల్, సెల్ లైన్ ప్లాంట్, మెషినరీ దిగుమతులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించాలని సంఘాలు కోరాయి. సమావేశం ఆశావహంగా నడిచిందని, పరిశ్రమ తన పూర్తి సామర్థ్యాల మేరకు ఎదగడానికి విధానపరమైన మద్దతు అవసరమని మంత్రి గుర్తించినట్టు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. -
టీవీ రేట్లకు మళ్లీ రెక్కలు!
న్యూఢిల్లీ: టీవీల రేట్లకు మరోసారి రెక్కలు రానున్నాయి. టెలివిజన్ స్క్రీన్ల తయారీలో కీలకమైన ఓపెన్–సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని కేంద్రం భావిస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది. దీన్ని వచ్చే మూడేళ్లలో క్రమంగా 10–12 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో దీన్ని అమల్లోకి తేవచ్చని.. ఫలితంగా అక్టోబర్ నాటికి టీవీల రేట్లు 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొన్నాయి. ఓపెన్ సెల్ ప్యానెళ్లు ఎక్కువగా చైనా నుంచి దిగుమతవుతున్నాయి. దేశీయంగా భారీ బ్రాండ్లలో శాంసంగ్, ఎల్జీ, సోనీ, థామ్సన్, కొడక్, వ్యూ, మి, వన్ప్లస్ వంటివి ఉన్నాయి. ఇలాంటి బ్రాండ్లన్నీ కూడా చైనా వంటి మార్కెట్ల నుంచి ఓపెన్–సెల్ ప్యానెళ్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ‘గత రెండేళ్లుగా (2020, 2021) భారత టీవీ పరిశ్రమకు గడ్డుకాలంగానే ఉంది. కోవిడ్–19 పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి వచ్చే దాకానైనా కాస్తంత ఊరట ఉండాలి‘ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జీఎస్టీ రేటును తక్షణం తగ్గించడం లేదా వచ్చే రెండేళ్ల పాటు ఓపెన్–సెల్ ప్యానెళ్లపై సుంకాలను రద్దు చేయడం.. ఈ రెండింటిలో ఏదో ఒక చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ఏడాది ఇది మూడోసారి.. టీవీ రేట్లు పెరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కానుంది. ప్యానెళ్ల రేట్లు పెరుగుతాయనే కారణంతో జనవరి, ఏప్రిల్లో టీవీల ధరలను కంపెనీలు పెంచాయి. చైనాకు చెందిన ప్యానెళ్ల తయారీ సంస్థలు ధరలను పెంచడం కూడా ఇందుకు కొంత కారణం. కస్టమ్స్ డ్యూటీతో పాటు టీవీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా వర్తిస్తోంది. 32 అంగుళాల దాకా టీవీలపై 18%, అంతకు మించిన వాటిపై గరిష్టంగా 28% మేర జీఎస్టీ ఉంటోంది. 2019 నుంచి మల్లగుల్లాలు.. వాస్తవానికి మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా ఓపెన్ సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ గణనీయంగా పెంచాలని కేంద్రం గతంలోనే ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో టీవీల తయారీ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. దీంతో ఏడాది వ్యవధిలో దేశీయంగా వాటి తయారీ సామర్థ్యాలను పెంచుకుంటే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ విధించబోమంటూ 2019 సెప్టెంబర్లో పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు (సీబీఐసీ) ప్రకటించింది. కానీ టీవీల తయారీ సంస్థలు ఇప్పటిదాకా దేశీయంగా ప్యానెళ్ల తయారీకి ఏర్పాట్లు చేసుకోలేకపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి, తదుపరి లాక్డౌన్ తదితర పరిణామాలతో వాటి ప్రణాళికలకు అంతరాయం ఏర్పడింది. ప్రతీ మూణ్నెల్లకోసారి పెరుగుదల కరోనా వైరస్ మహమ్మారి తెరపైకి వచ్చినప్పట్నుంచీ టీవీల ధరలు దాదాపు ప్రతీ త్రైమాసికానికోసారి పెరుగుతూనే ఉన్నాయి. తొలుత చైనాలో తయారీ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల రేట్లు పెరిగాయి. కానీ ఆ తర్వాత డిమాండ్–సరఫరా పరిస్థితి స్థిరపడిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. 2019 డిసెంబర్ ఆఖరు వారంలో చైనాలో కోవిడ్ కేసులు బైటపడినప్పుడు టీవీ తయారీ సంస్థల్లో ఆందోళన నెలకొంది. టీవీల తయారీకి కీలకమైన ప్యానెళ్లను ఎక్కువగా చైనానే సరఫరా చేస్తున్నందున .. అక్కడ కార్యకలాపాలు కుంటుపడితే ముడి వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనని కంపెనీలు భయపడ్డాయి. ఆ భయాలన్నీ తర్వాత నెలలోనే నిజమయ్యాయి. 2020 జనవరిలో .. చైనాలోని తయారీ హబ్లలో ఉత్పత్తి నిల్చిపోయింది. దీంతో ప్యానెళ్లు సహా ఇతరత్రా కీలక విడిభాగాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా 2020 ఫిబ్రవరి నుంచే రేట్లు 10% పెరిగాయి. అటుపైన మార్చి వచ్చేసరికి భారత్లో దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఒకవైపు విడిభాగాలు, మరోవైపు టీవీ సెట్లకు కూడా కొరత ఏర్పడింది. జూన్ నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో .. అన్ని సైజుల్లోని కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) జూలై ఆఖరున నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా 80 అంగుళాలు ఆ పైన పరిమాణమున్న హై–ఎండ్ టీవీ సెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. ఇక ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో వివాదం రాజుకోవడంతో భారత్లో చైనా వ్యతిరేక సెంటిమెంటు ఎగిసింది. అప్పట్నుంచి చైనా నుంచి వచ్చే విడిభాగాలు, ఫినిష్డ్ గూడ్స్పై నిఘా కొనసాగుతుండటం.. భారత్లో ఉత్పత్తి జాప్యానికి దారితీస్తోంది. ఇదిలా ఉండగా సరిగ్గా దీపావళి పండుగ సీజన్కు ముందు సెప్టెంబర్లో ప్యానెళ్ల రేట్లు పెరగడంతో టీవీల ధరలు దాదాపు 25 శాతం దాకా ఎగిశాయి. ఆ వెంటనే అక్టోబర్ 1 నుంచి ఓపెన్–సెల్స్పై 5% కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తిరిగి విధించింది. -
కోవిడ్ విజృంభణ: కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాలను ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఉత్పత్తి సంస్థల నుంచి ఒక్కో డోస్ను 150 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేస్తున్నట్టు ఈ మేరకు ఆరోగ్య శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ టీకాలకు రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది. దేశంలో కరోనా విశ్వరూపం దాల్చడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా రాష్ట్రాలు వ్యాక్సిన్లు కొనుగోలుకు అవకాశం కల్పించింది. #Unite2FightCorona It is clarified that Govt of India’s procurement price for both #COVID19 vaccines remains Rs 150 per dose. GOI procured doses will continue to be provided TOTALLY FREE to States.@PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @DDNewslive @PIB_India @mygovindia https://t.co/W6SKPAnAXw — Ministry of Health (@MoHFW_INDIA) April 24, 2021 వ్యాక్సిన్ తయారీ సంస్థలు సగం డోసులను కేంద్రానికి, మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్కో డోస్ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రయివేట్ ఆస్పత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఒకే దేశం, ఒకే పార్టీ నినాదం ఎత్తుకున్న బీజేపీ.. టీకా ధరల్లో ఎందుకంత వివక్ష చూపుతోందని ఎదురుదాడి చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. వ్యాక్సిన్, ఆక్సిజన్ దాని సంబంధిత పరికరాలపై పన్ను మాఫీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సారి ఆక్సిజన్ వినియోగం భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులపై ఢిల్లీ హైకోర్లు, దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న మూడు నెలల పాటు కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలానే ఆక్సిజన్ తయారు చేసే పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటం.. ఆక్సిజన్ కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆక్సిజన్ సరఫరాను మెరుగు పర్చడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆక్సిజన్, దాని సంబంధిత పరికరాలు, కోవిడ్ వ్యాక్సిన్లపై కస్టమ్స్ పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. At the high-level meeting, key decisions of waiving customs duty on oxygen and oxygen related equipment & COVID-19 vaccines were taken. https://t.co/TgorIafqw6 — Narendra Modi (@narendramodi) April 24, 2021 చదవండి: కరోనా సెకండ్వేవ్: ప్రజలకు కేంద్రం తీపికబురు! -
దేశీ విడిభాగాలకే ప్రాధాన్యమివ్వాలి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ సంస్థలు దేశీయంగా తయారైన విడిభాగాల తయారీ, కొనుగోళ్లకు మరింతగా ప్రాధాన్యమివ్వాలని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఆటో విడిభాగాల దిగుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం 70 శాతంగా ఉన్న విడిభాగాల లోకలైజేషన్ను .. 100 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లేని పక్షంలో దిగుమతి చేసుకునే విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని వ్యాఖ్యానించారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలు, ఆటో విడిభాగాల తయారీదారులు స్థానిక పరికరాల కొనుగోళ్లను గరిష్ట స్థాయిలో.. 100 శాతం దాకా పెంచుకోవాలని కోరుతున్నా. ఇలాంటివన్నీ తయారు చేసేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదానికి దేశీ ఆటో పరిశ్రమ మద్దతుగా నిలిచేందుకు ఇదే సరైన తరుణం‘ అని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీకి తోడ్పాటు కావాలి.. ఎలక్ట్రానిక్ విడిభాగాలు .. ముఖ్యంగా సెమీకండక్టర్లను స్థానికంగా తయారు చేసేందుకు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధించగలని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. -
బంగారం స్మగ్లింగ్కు ఇలా చెక్ పెట్టొచ్చు!
ముంబై: బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతానికి పరిమితం చేయడంతో అనధికార దిగుమతులు(గ్రే మార్కెట్) తగ్గే వీలున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కస్టమ్స్ తగ్గింపునకు తోడు డిమాండ్ బలపడుతుండటంతో స్మగ్లింగ్కు కొంతమేర చెక్ పడవచ్చని అభిప్రాయపడింది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పసిడిపై కస్టమ్స్ డ్యూటీని నికరంగా 2.2 శాతం స్థాయిలో తగ్గించిన విషయం విదితమే. బడ్జెట్లో చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం గోల్డ్ బార్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీతోపాటు, వ్యవసాయ, ఇన్ఫ్రా సెస్, సామాజిక సంక్షేమ సర్చార్జీ కలగలిసి 10.75 శాతానికి చేరాయి. ఇవి బడ్జెట్కు ముందు 12.87 శాతంగా అమలయ్యేవి. వీటికి 3 శాతం జీఎస్టీ జత కలవనుంది. దీంతో 14.07 శాతానికి చేరే వీలుంది. అంతక్రితం 16.26 శాతంగా అమలయ్యేది. దేశీ గోల్డ్ మార్కెట్పై బడ్జెట్ ప్రభావం పేరుతో డబ్ల్యూజీసీ ప్రకటించిన నివేదిక ఇంకా ఇలా పేర్కొంది.. 80 శాతం డౌన్ 2020లో పసిడి అనధికార దిగుమతులు 80 శాతం పడిపోయి 20–25 టన్నులకు పరిమితమయ్యాయి. ఇందుకు కోవిడ్–19 కారణంగా లాజిస్టిక్స్ తదితర అవాంతరాలు ఎదురుకావడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021)లోనూ విమానయానంపై ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు, కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు దీనికి జత కలవనున్నాయి. వెరసి పసిడిలో అధికారిక దిగుమతులు పుంజుకునే వీలుంది. కాగా.. పసిడిపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో చర్యలు తీసుకున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్: ధర ఎంతంటే.. -
చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్గ్రీడియంట్స్ (ఏపీఐ) దిగుమతులపై భారత ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా పెంచాలని ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది. ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్స్ (డీఐ), ఏపీఐల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఔషధ పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్ఐ)పథకాన్ని ఇటీవల డీఓపీ ప్రకటించింది. ప్రస్తుతం చైనాపై ఎక్కువగా ఆధారపడిన 53 కీలకమైన ఏపీఐలతో సహా 41 ఇతర ఉత్పత్తులకు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి భారతీయ కంపెనీలకు 10 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కరోనా: ఐటీ శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి చెల్లింపుదారులకు రావాల్సిన మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయనుంది. రూ. 5 లక్షల లోపు రిఫండ్లను తక్షణమే చెల్లించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. దీని వల్ల 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజం కలుగుతుందని వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, చెల్లింపుదారులకు వెంటనే ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ విభాగం తెలిపింది. పెండింగ్లో ఉన జీఎస్టీ, కస్టమ్స్ రిఫండ్లు రూ.18,000 కోట్లను కూడా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు సహ లక్ష సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ‘కరోనా’ ఉపకరణాలపై పన్నుల ఎత్తివేత వెంటిలేటర్లు, ఫేస్ మాస్క్లు, సర్జికల్ మాస్క్లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్(పీపీఈ), కోవిడ్-19 కిట్స్ మొదలైన వాటి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్లను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉపకరణాల తయారీలో వినియోగించే వస్తువుల దిగుమతి కూడా కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ సెప్టెంబర్ వరకు ఉందడబోవని తెలిపింది. కాగా, న్యూస్ప్రింట్పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్ను 100 శాతం పెంచాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం! -
పెరిగిన ఐఫోన్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో ఐఫోన్ ధరలు స్వల్పంగా పెంచినట్లు ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ వెల్లడించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్డెట్లో దిగుమతి సుంకాలను పెంచినందు వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా యాపిల్ కంపెనీ ధరల పెంపు నిర్ణయం వల్ల పలు మోడళ్ల ధరలు రూ.1300 వరకు పెరగనున్నాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం ఐఫోన్ 11 ప్రోమాక్స్ 64 జీబీ వేరియంట్ ధర రూ.1,11,200గా, 256 జీబీ వేరియంట్ ధర రూ.1,25,200గా ఉండనుంది. (ఉచితంగా 2 వేల ఐఫోన్ల పంపిణీ!) ఐఫోన్ 11 ఫ్రో, ఐఫోన్ 8 తదితర మోడళ్ల ధరలు పెరిగాయి. ఐఫోన్ 11, ఐఫోన్ 7, యాపిల్ వాచ్ ధరలలో ఎలాంటి మార్పు లేదని కంపెనీ తెలిపింది. దేశంలో యాపిల్ కంపెనీ అనేక నూతన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. పన్ను మార్పుల వల్ల విదేశాల నుంచి దిగుమతవుతున్న ఉత్పత్తులు ధరలపై ప్రభావం చూపుతున్నాయని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా దేశంలో మొదటి ఆన్లైన్ స్టోర్ను ఆపిల్ కంపెనీ నిర్మించనున్నట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. (‘హీరో’లు మాత్రమే ఐఫోన్లు వాడాలి!) -
ఒక వ్యక్తి ఎంత బంగారం తేవొచ్చంటే..
సాక్షి, హైదరాబాద్ : గోల్డ్ స్మగ్లింగ్లో హైదరాబాద్ టాప్ 5లో ఉందని కస్టమ్స్ కమిషనర్ ఎమ్ఆర్ఆర్ రెడ్డి పేర్కొన్నారు. రెండురోజుల క్రితమే 3.3 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఓ వ్యక్తి బెల్ట్ రూపంలో బంగారాన్ని తరలిస్తుండగా గ్రీన్ ఛానల్ వద్ద పట్టుకున్నామని.. దీని విలువ దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుందన్నారు. ఈ మధ్యకాలంలో ఇదే అతిపెద్ద కేసుగా చెప్పవచ్చని పేర్కొన్నారు. గతేడాది రూ. 12 కోట్ల విలువైన బంగరాన్ని పట్టుకోగా...ఈ ఏడాది రూ. 4 కోట్ల విలువ గల బంగారాన్ని సీజ్ చేశామన్నారు. ‘నిందితులు రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బంగారాన్ని పొడి చేసి..ఇన్నర్ పార్ట్స్ లో తరలిస్తున్న కేసులు కూడా ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులకు ఆశ చూపి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు టాక్స్ ఎగ్గొట్టేందుకు బంగారం తరలిస్తూ పట్టుబడుతున్నారు. బంగారం తరలిస్తున్న దాని వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠా ఉందా అనే దానిపై విచారణ జరుగుతోంది’ అని వెల్లడించారు. రూల్స్ పాటించాలి.. ‘విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం విషయంలో తప్పక రూల్స్ పాటించాలి. కస్టమ్స్ బ్యాగేజ్ రూల్స్ ప్రకారం మగవారు 20 గ్రాములు, ఆడవారు 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. ఎక్కువ మోతాదులో బంగారం తెస్తుంటే రెడ్ ఛానల్లో డిక్లేర్ చేసి.. 38 శాతం టాక్స్ కట్టి తీసుకువెళ్లొచ్చు. ఎయిర్ పోర్ట్లో స్మగ్లింగ్ చేస్తూ దొరికిన బంగారాన్ని సీజ్ చేస్తాము. రూ. 20 లక్షలకు మించి విలువైన బంగారంతో పట్టుబడితే అరెస్ట్ చేస్తాము’ అని ఎమ్ఆర్ఆర్ రెడ్డి పేర్కొన్నారు. -
అత్యంత హానికారక సిగరెట్లు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న అత్యంత హానికారక సిగరెట్లను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.6.50 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పేర్కొన్నారు. వివరాలు... దుబాయ్లో తయారైన మోండ్ బ్రాండ్, ఇంగ్లాండ్లో తయారైన బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్లు సిటీకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్ఐ అధికారులు కన్నేశారు. ఈ గ్యాంగ్ సిగరెట్లను సముద్రమార్గంలో కంటైనర్ల ద్వారా ముంబైకి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఆ కంటెయినర్లలో టేపులు ఉన్నట్లు, దుబాయ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు రికార్డు ల్లో పొందుపరిచినట్లు అనుమానించారు. తాజాగా తిమ్మాపూర్లోని ఇన్ల్యాండ్ కంటెయినర్ డిపో(ఐసీడీ)కి వచ్చిన ఈ కంటెయినర్లను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. 15 లక్షల బెన్సన్ అండ్ హెడ్జెస్, 30.3 లక్షల మోండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వీటిలో కొన్ని నకిలీ సిగరెట్లు కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచన మేరకు రాంకీ సంస్థకు చెందిన దుండిగల్ యూనిట్లో కస్టమ్స్ అధికారులు మంగళవారం ఆ సిగరెట్లను ధ్వంసం చేశారు. పన్ను ఎగ్గొట్టడానికే... ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించే ఈ సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం(కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుండే ఈ సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన పన్ను ఉంటుంది. రూ.10 ఖరీదైన సిగరెట్ను దిగుమతి చేసుకుంటే దానిపై పన్ను రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ పన్నును ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్సేల్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని వీటిని మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఇతర దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి ధ్రువీకరిస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకుండానే విపణిలోకి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. -
పాక్ వస్తువులపై 200% పన్ను పెంపు
న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై మరిన్ని కఠిన చర్యలను కేంద్రం ప్రకటించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లు. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు తదితరాలున్నాయి. తాజా చర్యతో భారత్లో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ‘పుల్వామా దాడికి ఆ దేశమే కారణమని భావిస్తూ అత్యంత ప్రాధాన్యం గల దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించుకున్నాం. దీంతోపాటు పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని ఆర్థిక మంత్రి జైట్లీ ట్విట్టర్లో ప్రకటించారు. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానమైన తాజా పండ్లపై ప్రస్తుతం 50% వరకు, సిమెంట్పై 7.5% కస్టమ్స్ డ్యూటీ ఉంది. -
ఇక విదేశీ స్మార్ట్ఫోన్లు కొనాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ: అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల వస్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. దీంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్ఫోన్ ధరలు మరింత భారం కావడం ఖాయం. గత పదిహేనురోజుల్లోనే కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేయడం ఇది రెండవ సారి. ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 17రకాల వస్తులపై దిగుమతి పన్నును పెంచింది. వీటిల్లో స్మార్ట్వాచీలు,స్మార్ట్ఫోన్ ఎక్విప్మెంట్స్/ కంపోనెంట్స్ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (PCBA) వంటి కమ్యూనికేషన్ పరిశ్రమలో ఉపయోగించే కొన్ని ఇన్పుట్స్పై కూడా దిగుమతి సుంకం పెంచింది. దీంతో వీటిపై ప్రస్తుతం 10శాతంగా ఉన్న పన్ను 20 శాతానికి చేరింది. స్థానికంగా స్మార్ట్ఫోన్ తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఇంటర్మీడియట్ వస్తువులను నిషేధిస్తూ మరో నోటిఫికేషన్ను ఆర్థిక మంత్రిత్వ జారీచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరుసార్లు దిగుమతి సుంకాన్ని పెంచినట్టయింది. ఇటీవల 19 రకాల (ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, లెదర్ వస్తువులు, విమాన ఇంధనం తదితర)వస్తువులపై సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని వెలువరించింది. కాగా కరెంట్ అకౌంట్ లోటును తగ్గించే చర్యల్లో కొన్ని వస్తువులపై అధిక దిగుమతి సుంకాలను విధిస్తామని సెప్టెంబరులో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.4 శాతానికి చేరగా అక్టోబర్ నాటికి డాలరు మారకంలో భారత కరెన్సీ 7 శాతం క్షీణించి రికార్డు కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
దిగుమతి సుంకాల పెంపు
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును నియంత్రించడం, రూపాయి విలువ క్షీణతకు చెక్పెట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 19 రకాల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో విమాన ఇంధనం, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ దిగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్ల మేర ఉంటుందని తెలిపింది. సుంకాల పెంపుతో వీటి ధరలు మరింత పెరిగిపోతాయి. తద్వారా వాటి దిగుమతులకు ఆదరణ తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘కొన్ని రకాల దిగుమతులను నిరోధించేందుకుగాను ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం టారిఫ్ చర్యలు తీసుకుంది. కరెంటు ఖాతా లోటును కుదించడమే ఈ చర్యల ఉద్దేశం’’ అని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు, రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు అనవసర దిగుమతులను నిరోధించనున్నట్టు కేంద్రం ఈ నెల 14నే ప్రకటించింది. -
యాపిల్స్ నుంచి మొబైల్స్ వరకూ అన్నీ ప్రియం..
న్యూఢిల్లీ : యాపిల్స్ నుంచి మొబైల్స్ వరకూ ఇక చాలా ఐటెమ్స్ ధరలు భారం కానున్నాయి. గత కొన్నేళ్లుగా వరుసగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కస్టమ్స్ సుంకం తగ్గింపు విధానానికి ప్రస్తుత సర్కార్ చెల్లుచీటీ ఇచ్చింది. గత రెండేళ్లలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని పెంచిన ఉదంతాలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. సర్కార్ తాజా వైఖరితో బాదంపప్పులు, యాపిల్స్ నుంచి సెల్ఫోన్ విడిభాగాలు, సోలార్ ప్యానెల్స్ సహా దాదాపు 400 వస్తువులపై కస్టమ్స్ సుంకం పెరగనుంది. ఆసియాన్ దేశాలకు సమానంగా టారిఫ్లను తీసుకువచ్చే క్రమంలో నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు వ్యవసాయ, తయారీ ఉత్పత్తులపై సుంకాల పెంపునకు కేంద్రం పూనుకుంటోంది. గతంలో వ్యవసాయేతర ఉత్పత్తులపై అత్యధికంగా 1991-92లో 150 శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని 40 శాతానికి, 1997-98లో 20 శాతానికి, 2007-08లో పది శాతానికి తగ్గించారు. అయితే ఈ విధానానికి స్వస్తిపలికి కస్టమ్స్ సుంకాల పెంపునకు మోదీ సర్కార్ పూనుకుంది. అయితే ఇవి ఎంతమాత్రం రక్షణాత్మక చర్యలు కాదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. అయితే యపిల్స్, బాదం నుంచి 29 అమెరికన్ ఉత్పత్తులపై పెంచిన కస్టమ్స్ సుంకాలు ఈనెల 4 నుంచి అమల్లోకి వచ్చిన క్రమంలో ఇవి డబ్ల్యూటీవో నిర్ధేశించిన రేట్ల కంటే అధికంగా ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరించారు. పన్ను టారిఫ్ పెంపుపై అటు పరిశ్రమ నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం కస్టమ్స్ సుంకాల పెంపుకే మొగ్గుచూపింది. -
దెబ్బకు దెబ్బ : ట్రంప్ సర్కార్కు భారత్ ఝలక్
న్యూఢిల్లీ : ట్రంప్ సర్కార్కు దెబ్బకు దెబ్బ తగిలింది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా డ్యూటీలు పెంచడంతో, భారత్కు కూడా అదే స్థాయిలో టారిఫ్లను విధించి, ట్రంప్ సర్కార్కు ఝలకిచ్చింది. మోటార్ సైకిల్, ఇనుము, ఉక్కు, బోరిక్ ఆమ్లం, కాయధాన్యాలు వంటి 30 రకాల ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని 50 శాతం పెంచే ప్రతిపాదనను భారత్ ప్రభుత్వం డబ్ల్యూటీఓకు సమర్పించింది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్లను విధించడంతో ట్రంప్ సర్కార్ 241 మిలియన్ డాలర్ల వరకు ఆర్జిస్తోంది. ట్రంప్ టారిఫ్లపై ఆగ్రహించిన భారత్, అంతేమొత్తంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే 30 రకాల ఉత్పత్తులపై రాయితీలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది మే నెలలో కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదం, ఆపిల్, మోటార్సైకిల్స్ వంటి 20 రకాల ఉత్పత్తులపై కూడా డ్యూటీలను 100 శాతం పెంచాలని భారత్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్పత్తులపై భారత్ ప్రతిపాదించిన అదనపు డ్యూటీలు 10 శాతం నుంచి 100 శాతం రేంజ్లో ఉన్నాయి. 800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న మోటార్ సైకిళ్లపై 50 శాతం డ్యూటీ, బాదంపై 20 శాతం, వాల్నట్స్పై 20 శాతం, ఆపిల్స్పై 25 శాతం డ్యూటీని భారత్ ప్రతిపాదించింది. భారత్ ప్రతీకార టారిఫ్లను విధించడం ఇదే మొదటిసారి. ట్రంప్ సర్కార్ వెళ్తున్న నియంతృత్వ పోకడకు ప్రతీకారంగా భారత్ ఈ టారిఫ్లను విధించింది. సమీక్షించిన ఈ డ్యూటీలు జూన్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాకు ఇస్తున్న మినహాయింపులను నిషేధించే నిర్ణయం తీసుకున్నామని, దీంతో 238.09 మిలియన్ డాలర్ల డ్యూటీని సేకరించనున్నామని డబ్ల్యూటీఓకు భారత్ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగ, గత మార్చిలో అమెరికా తమ దేశానికి దిగుమతి అయ్యే స్టీల్ ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం డ్యూటీలను విధిస్తున్నట్టు ప్రకటించింది. -
స్మార్ట్ఫోన్ పరికరాలపై మరింత బాదుడు
న్యూఢిల్లీ : ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా ఉన్న భారత్, స్థానికతను మరింత పెంచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకుంటున్న కీలక స్మార్ట్ఫోన్ పరికరాలపై 10 శాతం పన్ను విధించింది. పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు వంటి దిగుమతి చేసుకునే కీలక పరికరాలపై ఈ పన్ను విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పీసీబీలపై 10 శాతం కస్టమ్స్ డ్యూటీని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ నోటిఫికేషన్ను జారీచేసింది. పాపులేటెడ్ పీఎస్బీలు ఖర్చు స్మార్ట్ఫోన్ తయారీ ఖర్చులో సగం భాగముంటున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ డివైజ్ల తయారీలో స్థానికతను పెంచి, ఖర్చులను తగ్గించడానికి కీలక స్మార్ట్ఫోన్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని విధించింది. ఫోన్ల కెమెరా మాడ్యుల్స్, కనెక్టర్స్ వంటి పరికరాలపై కూడా 10 శాతం కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం విధించింది. కాగ, ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ప్రధానమంత్రి దశల వారీ తయారీ ప్రొగ్రామ్లో భాగంగా విధిస్తున్నారు. ఈ ప్లాన్ను 2016లో ప్రభుత్వం ఆవిష్కరించింది. భారత్ను కూడా చైనా మాదిరి తయారీ రంగానికి పవర్హౌజ్గా మార్చాలని ప్రధాని భావిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటరీలు, ఛార్జర్లు, ఇయర్ఫోన్లు తక్కువ విలువున్న పరికరాలపై కూడా మెల్లమెల్లగా దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచుతోంది. అయితే భారత్ విధిస్తున్న ఈ దిగుమతి సుంకాలపై చైనా, కెనడా, అమెరికా దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వద్ద తమ ఆందోళనను వెల్లబుచ్చుకుంటున్నాయి. -
ఎల్ఈడీ/ఓఎల్ఈడీ టీవీల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: ఎల్ఈడీ/ఓఎల్ఈడీ టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. మోడల్నుబట్టి ధర 2 నుంచి 7 శాతం వరకు అధికమయ్యే చాన్స్ ఉంది. పెరిగిన కస్టమ్స్ డ్యూటీకి అనుగుణంగా తయారీ కంపెనీలు సైతం ధరల సవరణకు దిగడమే ఇందుకు కారణం. 7.5 శాతం ఉన్న దిగుమతి పన్నును తాజా బడ్జెట్లో 15 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీల విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. డ్యూటీని 10 శాతానికి కుదించాల్సిందిగా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ధరల సవరణకు దిగింది. ఎల్ఈడీ, ఓఎల్ఈడీ రంగంలో రెండేళ్లుగా పెద్దగా వృద్ధి లేదని, ధరలు పెరిగితే స్వల్పకాలంలో డిమాండ్ తగ్గుతుందని సియామా చెబుతోంది. ఇదే జరిగితే తయారీ కంపెనీల విస్తరణ పరిమితమవుతుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ మనీష్ శర్మ పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గుతుందన్నారు. ఒకదాని వెంట ఒకటి.. ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై ఉంటుందని ప్యానాసోనిక్ చెబుతోంది. మోడళ్ల ధర 2–7 శాతం అధికం కానుందని కంపెనీ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం బిజినెస్ హెడ్ నీరజ్ బహల్ తెలిపారు. ధరల సవరణ విషయంలో సామ్సంగ్ సైతం ఇదే బాటలో నడవనుంది. ధరల పెంపు తప్పదని, ఏ మేరకు పెంచాలో అన్న అంశంపై కసరత్తు చేస్తున్నామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ కి వాన్ కిమ్ వ్యాఖ్యానించారు. విక్రయ ధర అధికమైతే మధ్య, దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు సోనీ ఇండియా బ్రేవియా బిజినెస్ హెడ్ సచిన్ రాయ్ పేర్కొన్నారు. టీవీల విక్రయాలు గత కొన్నేళ్లుగా వృద్ధిబాటలో ఉన్నాయని, మొత్తం పరిశ్రమను చూస్తే పెంపు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. కాగా, దేశీయంగా తయారీని పెంచడానికే దిగుమతి పన్ను పెంపు అని ప్రభుత్వం చెబుతోంది. -
రెస్టారెంట్ అంటే జేబుగుల్లే..
సాక్షి, న్యూఢిల్లీ : వీకెండ్స్లో రెస్టారెంట్కు వెళ్లడం ఖరీదైన వ్యవహారంగా మారింది. పలు వంటదినుసులపై 5 శాతం కస్టమ్స్ డ్యూటీతో పాటు, దిగుమతి చేసుకునే ఆహారంపైనా ఈ వడ్డింపుతో ధరలు భారమవుతాయని రెస్టారెంట్ చైన్స్ పేర్కొన్నాయి.వంటల్లో ఉపయోగించే ఆలివ్ ఆయిల్, ఆముదం, సీసేమ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 35 శాత పెరగ్గా, ఇతర ఆహార తయారీకి ఉపయోగించే పదార్ధాలపై గతం 30 శాతంగా ఉన్న లెవీని బడ్జెట్లో 50 శాతానికి పెంచారని రెస్టారెంట్ యజమానులు వాపోతున్నారు. వంట దినుసులను దిగుమతి చేసుకునే హోటల్స్, రెస్టారెంట్లు ఈ పన్ను దెబ్బకు బెంబేలెత్తుతున్నాయి. పెరిగిన సుంకాలతో తాము కస్టమర్లపై భారం మోపక తప్పదని కైలిన్ రెస్టారెంట్ చైన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరవ్ ఖనిజో చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు జీఎస్టీ కింద ఇచ్చే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను తొలగించడం తమ లాభాలపై పెనుప్రభావం చూపుతుందని రెస్టారెంట్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఓ మాదిరి రెస్టారెంట్లు సైతం వంట దినుసులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రమంలో వీటిపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో చివరికి వినియోగదారులపై భారం పడుతుందని రెస్టారెంట్ ఓనర్లు ధరల బాంబు పేల్చుతున్నారు. -
పెరుగనున్న టీవీలు, మైక్రోవేవ్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : టీవీలు, మైక్రోవేవ్, ఎల్ఈడీ ల్యాంప్స్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిందే. స్థానిక తయారీకి ఊతమివ్వడానికి ఇటీవల ప్రభుత్వం కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని పెంచిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిపై ఇక కస్టమర్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత నోటిఫికేషన్ ప్రకారం టెలివిజన్ సెట్లపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతానికి పెంచినట్టు తెలిసింది. అదేవిధంగా స్మార్ట్ఫోన్లపై ఈ డ్యూటీని 15 శాతానికి పెంచారు. ఎల్ఈడీ పంప్స్పై కూడా ప్రస్తుతం 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించనున్నారు. మైక్రోవేవ్లపై కూడా ఈ డ్యూటీని రెండింతలు చేసి, 20 శాతంగా నిర్ణయించారు. దీంతో ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలన్నీ పెరిగిపోనున్నాయి. పూర్తిగా దిగుమతి చేసుకున్న టీవీలపై 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని భరించాల్సి ఉంటుందని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ మనీష్ శర్మ చెప్పారు. స్క్రీన్ సైజు బట్టి సగటున ఎల్ఈడీ టీవీల ధరలు రూ.2000 నుంచి రూ.10వేల మేరకు పెరగబోతున్నట్టు సంబంధిత ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం స్థానిక తయారీదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని శర్మ చెప్పారు. శర్మ, పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియాకు సీఈవో, ప్రెసిడెంట్. ఈ నిర్ణయం కేవలం స్థానిక తయారీదారులను ప్రోత్సహించడమే కాకుండా.. మేకిన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ను ఏర్పరుస్తుందని కూడా శర్మ పేర్కొన్నారు. అదేవిధంగా దిగుమతి సుంకాలను పెంచడం విదేశీ తయారీదారులు భారత్లో ఉత్పత్తులు తయారు చేసేలా ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యంగా టెలివిజన్ సెట్లపైనే ధరలు ఎక్కువగా పెరుగనున్నట్టు అంచనావేస్తున్నారు. మైక్రోవేవ్లపై విధించిన 20 శాతం దిగుమతి సుంకంతో, మొత్తంగా మైక్రోవేవ్ కేటగిరీలో ధరల పెరుగుదల రూ.400 నుంచి రూ.500 వరకు ఉండొచ్చని గోద్రెజ్ అప్లియెన్స్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నండి తెలిపారు. ఇప్పటికే ఆపిల్, తన ఐఫోన్ మోడల్స్ అన్నింటిపై భారత్లో రూ.3,720 వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. -
ఈ స్మార్ట్ఫోన్ కంపెనీలకు గట్టి షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ స్మార్ట్ఫోన్ తయారీదారులకు షాకిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికే బేసిక్ ఎక్సైజ్ సుంకంతో విదేశీ మొబైల్స్కు చెక్ చెప్పిన ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్స్పై బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న మొబైల్ ఫోన్ల ధరలు మోత మోగనున్నాయి. మేక్ ఇన్ ఇండియాకు మరింత ప్రోత్సాహమిచ్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లపై గతంలో విధించిన 10శాతం బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని తాజాగా 15శాతానికి పెంచింది. దీనికి సంబంధించి గురువారం రాత్రి రెవెన్యూ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కలర్ టీవీలు, మైక్రోవేవ్ అవెన్లపై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 20శాతంగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ ఫిల్మెంట్, వాటర్ హీటర్లు, హెయిర్ డ్రెస్సింగ్ సాధనాలు, డిశ్చార్చ్ లాంప్స్ లాంటి కొన్ని ఇతర అంశాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని సవరించింది. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సహహంతోపాటు, ఇప్పటికే తయారీలో ఉన్న కంపెనీలకు గట్టి పోటీ ఉండేలా ఈ చర్య చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా గత జూలైలో మొదటిసారి బేసిక్ కస్టమ్ సుంకాన్ని విధించిన ప్రభుత్వం దేశీయ మొబైల్ కంపెనీలకు ఊతమిచ్చేలా విదేశీ మొబైల్స్పై దీన్ని10శాతంగా పేర్కొన్న సంగతి విదితమే. -
జీఎస్టీ ఎఫెక్ట్: విదేశీ మొబైల్ మేకర్లకు షాక్!
న్యూఢిల్లీ. స్వదేశీ మొబైల్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. విదేశీ స్మార్ట్ఫోన్ల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని విధించనుంది. త్వరలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) అమల్లోకి రానున్న సందర్భంగా దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం విధించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారు 5-10శాతం టాక్స్ విధించేందుకు యోచిస్తోంది. ఫలితంగా విదేశీ మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరగనుండగా, స్వదేశీ డివైస్లు వినియోగదారులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా చైనా స్మార్ట్ఫోన్లకు చెక్ పెట్టి, ఇండియాలో ఆపిల్ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా సర్కార్ ఆలోచిస్తోంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అటార్నీ జనరల్ నుండి చట్టపరమైన అభిప్రాయం పొందింది. అంతేకాదు ఈ విధమైన కస్టమ్స్ సుంకం విధింపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒప్పందం (ఐటీఏ) అంతర్జాతీయ ఒప్పందం ఉల్లంఘన కాదని అటార్నీ జనరల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు ఫైనాన్స్, వాణిజ్యం, టెలికాం, ఐటి మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు దేశీయ హ్యాండ్ సెట్ తయారీదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని మినహాయింపులకు అదనంగా మరో ప్రయోజనాన్ని కూడా అందించనుంది. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ భాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేయనుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఈ నిర్ణయం అమలుకానుంది. -
‘బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి’
న్యూయార్క్:ఆపరేషన్ లో బ్లాక్ మనీలో భాగంగా బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనాగారియా సూచించారు. బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు తద్వారా నల్లధనాన్ని నిరోధించేందుకు బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని అభిప్రాయపడ్డారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ పై దీపక్ నీరా రాజ్ సెంటర్ లో భారత ఆర్థిక విధానాలపై సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఎకానమీ పాలసీ, పెర్ఫామెన్స్పై ఉపన్యాసం సందర్భంగా విద్యార్థులు ప్రశ్నలకు పనాగరియా సమాధానం చెప్పారు. బంగారంపై ప్రస్తుత కస్టమ్స్ సుంకం అక్రమ రవాణాకు దారితీస్తుందని చెప్పారు. ఈ రవాణా "భారీ మొత్తంలో" ఉందని ఆయన పేర్కొన్నారు. సుంకాన్ని రద్దుచేయడం, లేదా తగ్గించడం ద్వారా పసిడి అక్రమరవాణాను అడ్డుకోవచ్చన్నారు. దేశంలోని అక్రమంగా బంగారం ప్రవేశిస్తే...కొనుగోళ్లుకూడా అక్రమంగా చోటుచేసుకుంటాయన్నారు. నల్లధనాన్ని బంగారం కొనుగోళ్లకు వినియోగిస్తారని చెప్పారు. ప్రజలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో, బంగారం రూపంలో నల్లధనాన్ని దాచిపెడుతున్నారనీ, అందుకే రియల్ ఎస్టేటే్ లో నల్ల ధనాన్ని ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే భూముల లావాదేవీలపై స్టాంప్ డ్యూటీని భారీగా తగ్గించాలన్నారు. అయితే డీమానిటైజేషన తరువాత 6 శాతం మాత్రమే బ్లాక్ మనీ మార్పిడి జరిగిందన్నవాదనలను ఆయన కొట్టి పారేశారు. అంతా వైట్ మనీ అయినపుడు డీమానిటైజేషన్ కాలంలో ఇంత భారీ మొత్తంలో మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. -
ప్రాణాధార ఔషధాలు మరింత ప్రియం!
దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపును తొలగించిన కేంద్రం న్యూఢిల్లీ: కేన్సర్, హెచ్ఐవీసహా ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వాడే దాదాపు 74రకాలైన అత్యవసర ఔషధాలను కేంద్రం దిగుమతి సుంకం మినహాయింపు జాబితా నుంచి తొలగించడంతో దేశీయంగా వీటి ధరలు పెరగనున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు కష్టాలు మొదలుకానున్నాయి. ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా తయారైన ఔషధాల ఉత్పిత్తితోపాటు గిరాకీ పెంచడం, చైనా నుంచి ఔషధాల దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం గత వారం ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతలు తగ్గడంతో ఏర్పడే ఔషధాల కొరతను అధిగమించాలంటే దేశీయంగా ఔషధాల ఉత్పత్తిని పెంచాలని, ఇందుకు కనీసం ఏడాది పడుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ సెక్రటరీ డీజీ షా తెలిపారు. ఈలోపు కేన్సర్, హెచ్ఐవీ, గుండె సంబంధిత, మూత్ర పిండాల్లో రాళ్లు, మధుమేహం, మూర్ఛ, ఎముకలు, ఇన్ఫెక్షన్లలో వాడే యాంటీబయోటిక్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, లుకేమియా, హెపటైటిస్, అలర్జీలు తదితర వ్యాధుల నివారణలో వాడే అతి ముఖ్యమైన 74 రకాల ఔషధాల ధరలు మరింత పెరగొచ్చు. కస్టమ్స్ సుంకం మినహాయింపు తొలగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ నిర్ణయం తీసుకోవడం వల్ల ధరలు దాదాపు 35% పెరిగేవీలుందని ఫార్మా వర్గాలు అంచనావేశాయి. -
ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!
కస్టమ్స్ సుంకం మినహాయింపుల ఉపసంహరణ న్యూఢిల్లీ: లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ (ప్రాణాధార ఔషధాలు) దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాల మినహాయింపుల్ని ఉపసంహరించుకుంది. ఈ ఔషధాలపై 16 నుంచి 20 శాతం వరకూ కస్టమ్స్ సుంకాలను విధించనున్నట్లు కూడా సమాచారం. ‘మేక్ ఇన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా దేశంలోనే కీలక ఔషధాల ఉత్పత్తి వృద్ధి లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య మంత్రిత్వశాఖలోని ఫార్మా శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇంతక్రితం ప్రభుత్వం వైద్య పరికరాలపై సుంకాలను 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. -
సగానికి తగ్గిన పసిడి ప్రీమియం
ముంబై/ సింగపూర్: బంగారం దిగుమతులపై ఆంక్షలను మోడీ ప్రభుత్వం సడలిస్తుందన్న అంచనాలతో పసిడిపై ప్రీమియం ఈ వారంలో సగానికి తగ్గిపోయింది. ఔన్సు (31.1 గ్రాములు) పుత్తడిపై ప్రీమియం గత వారంలో 80-90 డాలర్లుండగా ఇపుడది 30-40 డాలర్లకు క్షీణించిందని డీలర్లు తెలిపారు. ధరలు తగ్గినప్పటికీ ఇతర ఆసియా దేశాల్లో బంగారానికి డిమాండు పెరగలేదు. భారీగా పెరిగిన కరెంటు అకౌంటు లోటును అదుపు చేసేందుకు కేంద్రం గతేడాది జూలై నుంచి బంగారం దిగుమతులపై తీవ్ర ఆంక్షలు విధించింది. దిగుమతి చేసుకున్న పసిడిలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలనే నిబంధన (80:20 ఫార్ములా) కూడా పెట్టింది. కరెంటు అకౌంటు లోటు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో దిగుమతులపై ఆంక్షలను కొత్త ప్రభుత్వం సడలించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆంక్షలను సడలించడానికి ముందు విధాన, ఆర్థికాంశాలనే కాకుండా ప్రజలు, వ్యాపారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మోడీ చెప్పారు. పసిడి దిగుమతులకు స్టార్ ట్రేడింగ్ హౌస్లను అనుమతిస్తూ రిజర్వు బ్యాంకు ఇటీవలే ఆంక్షలు సడలించింది. త్వరలోనే మరిన్ని సడలింపులు ఉంటాయనే అంచనాతో ప్రీమియంలు భారీగా తగ్గిపోయాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపారుల సమాఖ్య డెరైక్టర్ బచ్రాజ్ బామాల్వా తెలిపారు. 80:20 ఫార్ములాను పూర్తిగా తొలగించే వరకు ప్రీమియంలు ఇక తగ్గబోవని భావిస్తున్నట్లు చెప్పారు. ఏమిటీ ప్రీమియం..: బంగారం దిగుమతి ధరతో పోలిస్తే ఏడాదికాలంగా భారత్లో ఎక్కువ రే టు పలుకుతోంది. ఈ అధిక ధరనే ప్రీమియంగా పరిగణిస్తాం. మన దేశంలోకి దిగుమతి చేసుకునే సంస్థలే ఈ ప్రీమియంను వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1245 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధరకు 11.5 శాతం దిగుమతి సుంకాలు కలిపితే 1388 డాలర్ల చొప్పున ఇక్కడి మార్కెట్లో విక్రయించాలి. కానీ దీనికి మరో 30 డాలర్లను ప్రీమియంగా కలుపుకొని 1418 డాలర్ల వరకూ దిగుమతి సంస్థలు ఇక్కడి బులియన్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దాంతో ఇక్కడ 10 గ్రాముల ధరపై అదనంగా రూ. 600 భారం వినియోగదారులపై పడుతోంది. గతేడాది ఈ ప్రీమియం రూ. 3,000 వరకూ కూడా చేరింది. తదుపరి క్రమేపీ తగ్గుతూ వచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం బంగారం, వెండి దిగుమతులపై టారిఫ్ విలువను తగ్గించింది. పసిడి 10 గ్రాముల టారిఫ్ విలువను 424 డాలర్ల నుంచి 408 డాలర్లకు తగ్గించింది. వెండి కేజీ విషయంలో ఈ విలువను 650 డాలర్ల నుంచి 617 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయంగా ధరల బలహీన ధోరణి దీనికి కారణం. టారిఫ్లను తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సహజంగా 5 శాతం మేర మార్పు ఉంటే స్పాట్ మార్కెట్లో ఈ విలువ ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. -
బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గింపు?
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలను సడలించే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచనప్రాయంగా వెల్లడించారు. బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలపై మార్చి నెలాఖరులో సమీక్షించే అవకాశముందని ఆయన తెలిపారు. 'బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణల్లో కొన్నింటిపై ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో సమీక్షించే అవకాశముందని గట్టిగా చెప్పగలను. అయితే కరెంట్ ఎకౌంట్ లోటు పూర్తిగా అదుపులోకి వచ్చాకే సమీక్షిస్తాం' అని చిదంబరం తెలిపారు. కస్టమ్స్ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్యాక్స్ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బంగారం దిగుమతులు పెరగడంతో ప్రభుత్వం గతేడాది కస్టమ్స్ సుంకం మూడింతలు పెంచిన సంగతి తెలిసిందే. -
ఇక టీవీలు ఇక్కడ కొనాల్సిందే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల్లో ఉన్న మీ కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు మీ కోసం టీవీ తీసుకొస్తున్నారా? తక్కువ ధరలో ఎంచక్కా టీవీ వచ్చేస్తోందని ఆనందపడుతున్నారా? అయితే మీ ఆనందానికి బ్రేక్ పడనుంది. దీనికి కారణం టీవీలపై రూ.35 వేల వరకు ఉన్న ఉచిత బ్యాగేజీని ఆగస్టు 26 నుంచి ప్రభుత్వం ఉపసంహరిస్తోంది. దీని ప్రభావంతో విదేశాల నుంచి వచ్చే టీవీలపై పూర్తి కస్టమ్స్ సుంకం పడడంతో అవి మరింత ఖరీదవుతాయి. రూపాయి పతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు వ్యతిరేకిస్తుండగా, దేశీయ ఎలక్ట్రానిక్ కంపెనీలు సంబరపడుతున్నాయి. బ్యాంకాక్ ధర ఆధారంగా.. భారత్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఖరీదు ఎక్కువ. అందుకే దుబాయి, బ్యాంకాక్, థాయ్లాండ్, మలేషియా తదితర దేశాల నుంచి ఇక్కడికి వచ్చే భారతీయులు, ఎన్నారైలు టీవీ, కెమెరా, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ పీసీ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకురావడం పరిపాటి. అత్యధిక ంగా టీవీలను తీసుకొస్తున్నారు. టీవీలపై (ప్లాస్మా, ఎల్ఈడీ, ఎల్సీడీ) బ్యాగేజీ కింద రూ.35 వేల విలువ వరకు ప్రస్తుతం ఎటువంటి పన్ను లేదు. బ్యాగేజీ విలువ రూ.35 వే లు దాటితే కస్టమ్స్, విద్యా సెస్సు కింద 36.05 శాతం పన్ను చెల్లించాలి. ఒక కంపెనీకి చెందిన ఒక మోడల్ ధర ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. అందుకే ఇక్కడి కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్లో ఉన్న ధరను ప్రాతిపదికగా చేసుకుని పన్ను విధిస్తున్నారు. 40 అంగుళాల బేసిక్ టీవీ భారత్లో రూ.35 వేలపైనే ఉంది. అదే థాయ్లాండ్లో రూ.29 వేలు, బ్యాంకాక్లో రూ.27 వేలకు లభిస్తోందని కస్టమ్స్ వర్గాల సమాచారం. ఉదాహరణకు బ్యాంకాక్లో రూ.27 వేలకు టీవీ కొంటే కొత్త నిబంధనల ప్రకారం కస్టమ్స్ డ్యూటీ రూ.9,733 అవుతుంది. దీంతో టీవీ ధర కాస్తా రూ.36,733కు చేరుతుంది. అమ్ముకోవడానికే ఎక్కువ.. టీవీని సొంతానికి తీసుకొచ్చే వారు తక్కువగా ఉంటారని, అమ్మడానికే తీసుకొచ్చే వారే ఎక్కువని కస్టమ్స్ అధికారులు అంటున్నారు. ల్యాప్టాప్ల విషయంలో ఒకటి ఆఫీసుదని, మరొకటి వ్యక్తిగతమని బుకాయిస్తారని కస్టమ్స్కు చెందిన ఒక ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఒరిజినల్ బిల్లులను పరిశీలించాకే సుంకం నిర్ణయిస్తామని చెప్పారు. ఎవరు సొంతానికి, ఎవరు విక్రయించడానికి తీసుకొస్తున్నారో వెంటనే పసిగడతామని ఆయన పేర్కొన్నారు. ఉపకరణాలను స్వాధీనం చేసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. అయితే బ్యాంకాక్లో కొన్న ఉపకరణాలు త్వరగా పాడవుతున్నాయని పలువురు ప్రయాణికులు చెబుతున్నారని ఆయన వివరించారు. బ్యాంకాక్ నుంచి టీవీలు తీసుకురావడం చాలా తగ్గిందని తెలిపారు. అడ్డుకట్ట పడ్డట్టే.. టీవీలు రూ.30 వేల ధర లోపు లభించడంతో 32, 40 అంగుళాల సైజున్న మోడళ్ళు ఎక్కువగా భారత్కు వస్తున్నాయి. ఏటా సుమారు 12 లక్షల టీవీలు భారతీయులు, ఎన్నారైల ద్వారా భారత్కు వస్తున్నాయని గృహోపకరణాల విక్రయ సంస్థ పాయ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఎండీ రాజ్కుమార్ పాయ్ తెలిపారు. ఒక్క సౌదీ అరేబియా నుంచే నెలకు 20 వేల టీవీలు ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. ఆగస్టు 26 నుంచి ఎటువంటి మినహాయింపు ఉండకపోవడంతో ప్రయాణికులు పూర్తిగా సుంకం చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన అటూఇటూగా భారత్లో లభిస్తున్న టీవీ ధరకు సమానం అవుతుంది. జీరో డ్యూటీ ఎత్తేయడంతో టీవీల రాక దాదాపుగా నిలిచిపోతుందని ఒనిడా బ్రాండ్తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ జి.ఎల్.మిర్చందానీ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దేశీయంగా పెట్టుబడులను, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలంటే జీరో డ్యూటీని ఎత్తేయాలని ఆయన అన్నారు. దేశీయంగా వివిధ కంపెనీలు బహిరంగ మార్కెట్లో ఏటా 65 లక్షల టీవీలు విక్రయిస్తున్నాయి.