excise policy
-
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. మద్యం పాలసీ కేసులో తాను వారంలో సోమవారం, బుధవారం పోలీస్స్టేషన్కు హాజరవ్వాల్సి వస్తుందని, ఈ అంశంలో తనకు వెసులు బాటు కల్పించాలని కోరుతూ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.సిసోడియా పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిసోడియా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం తెలిపింది. అయితే, కేసుకు సంబంధించిన విచారణకు మాత్రం తప్పని సరిగా హాజరు కావాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది. माननीय सुप्रीम कोर्ट का हृदय से आभार, जिसने ज़मानत की शर्त को हटाकर राहत प्रदान की है। यह निर्णय न केवल न्यायपालिका में मेरी आस्था को और मजबूत करता है, बल्कि हमारे संवैधानिक मूल्यों की शक्ति को भी दर्शाता है। मैं हमेशा न्यायपालिका और संविधान के प्रति अपने कर्तव्यों का सम्मान करता… https://t.co/er7qTn2QMU— Manish Sisodia (@msisodia) December 11, 2024 మద్యం పాలసీ కేసులో 17నెలల జైలు జీవితంఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్ 9న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తన పాస్పోర్ట్ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. -
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్.. విచారణ బెంచ్ నుంచి తప్పుకున్న జడ్జి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా.. ఈ కేసు విచారణ బెంచ్ నుంచి న్యాయమూర్తి సంజయ్ కుమార్ తప్పుకోవడంతో వాయిదా పడింది. దీంతో తదుపరి విచారణ జూలై 15వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ బెయిల్ పిటిషన్లను మరోబెంచ్ విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9వ తేదీన ఈడీ కస్టడీలోకి తీసుకుందిన. దీంతో ఆయన ఢిల్లీ కేబినెట్కు ఫిబ్రవరి 28న రాజీనామా చేశారు. అదేవిధంగా జూన్ 4వ తేదీన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం.. సిసోడియా తన భార్యను వారానికి ఒకసారి కస్టడీలో కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది.సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ప్రతి స్పందనలు కోరింది. విచారణను మే 8కి వాయిదా వేసింది.ఇప్పటికే మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ను ఏప్రిల్ 30న రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.ఈ కేసుకులో సీబీఐ, ఈడీలకు ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కావేరీ బవేజా.. మద్యం పాలసీ కేసు విచారణ సమయంలో బెయిల్ ఇవ్వడం సరైందని కాదని, సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయితే ఏప్రిల్ 30 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ, మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు గురువారం బెయిల్ కోరుతూ అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.మనీష్ సిసోడియా మధ్యంతర దరఖాస్తులో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాను వారానికి ఒకసారి చూసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టును కోరారు.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం సిసోడియా పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగిస్తే దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. -
ఈడీ విచారణ... కేజ్రీవాల్ హాజరుపై సస్పెన్స్
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి డుమ్మా కొట్టనున్నారా?.. అవుననే అంటున్నాయి అప్ వర్గాలు. లోక్సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు ఆయన గోవాకు వెళ్లనున్న నేపథ్యంలో ఈడీ సమన్లను మరోసారి దాటవేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కేజ్రీవాల్కి గత వారం నాల్గవసారి ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 18న ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లాల్సి ఉన్నందున ఈడీ ముందు ఆయన హాజరుకావడానికి అవకాశం లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ జనవరి 11న గోవాకు వెళ్లాల్సి ఉండగా, గణతంత్ర దినోత్సవం కోసం ఢిల్లీలో సన్నాహాలను పర్యవేక్షించేందుకు వాయిదా వేశారని వెల్లడించాయి. రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే సన్నాహాలను ఉటంకిస్తూ జనవరి 3న ఈడీ సమన్లను అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు. అంతకుముందు నవంబర్ 2, డిసెంబర్ 21న ఈడీ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. కానీ మూడుసార్లు ఈడీ సమన్లను దాటవేశారు. ఈడీ సమన్లను కేజ్రీవాల్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈడీ చర్యల వెనక రాజకీయ ప్రేరణ ఉందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. చట్టం ప్రకారమే ఈడీని ఎదుర్కొంటామని అన్నారు. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
నారా వారి లిక్కరు స్కాం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో ఏ–3గా చంద్రబాబు పేరును చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్–1988ల ప్రకారం 166, 167, 409, 120 (బి), రెడ్విత్ 34, 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్లతో సీఐడీ ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ శ్రీనరేష్, ఏ–2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. డిస్టిలరీస్, బేవరేజెస్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. అయినవారి కోసం అడ్డదారులు..: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కి, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కి చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసింది. టర్నోవర్పై 8 శాతం వ్యాట్తో పాటు అదనంగా 6 శాతం పన్నులను తీసేసింది. 6 నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులనూ బేఖాతరు చేసింది. ఈ విధంగా రెండు బేవరేజ్లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కోకి పాల్పడినట్లు సీఐడీ తన ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని కోర్టుకు వివరించింది. కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా నిర్ణయాలు.. నిజానికి.. ఎక్సైజ్ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి, లైసెన్సులకు ప్రయోజనం చేకూర్చేలా క్రిడ్ ప్రో కో జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతటితో ఆగక.. అందుకు సంబంధించిన వాస్తవాలపై లోతుగా అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ఎల్ఓఐ ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. డీటీ నోటిఫికేషన్ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు. సరఫరాదారులు కుట్రపూరితంగా, లైసెన్స్లతో కుమ్మక్కై, కొన్ని ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారు. తద్వారా కార్పొరేషన్కు తప్పుడు అంచనాలు ఇచ్చారు. అలాగే, 2015–2019 కాలానికి సంబంధించిన వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా, పరిమాణాల వెరిఫికేషన్ కోసం ఎలాంటి యంత్రాంగం లేదు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. అంతేకాక.. అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు స్పష్టమైంది. అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఉల్లంఘన ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే విషయం తేటతెల్లమైంది. దీంతో తగిన ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ వివరించింది. కేబినెట్ ఆమోదం లేకుండా నచ్చినట్లు పాలసీ..: 2015–2017 ఎక్సైజ్ సంవత్సరాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, కొనుగోళ్ల వార్షిక లైసెన్సు రుసుం కంటే పది రెట్లు మించి ఉంటే మాత్రమే ప్రివిలేజ్ రుసుం విధించే థ్రెషోల్డ్ టెండర్ పరిమితిని పెంచాలని మొదట ప్రతిపాదించారు. కానీ, అది అమల్లోకి రాలేదు. తెలంగాణలో అమలులో ఉన్న ఈ ఫీజులు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. షాపుల కోసం పాలసీని కూడా తమకు నచ్చినట్లు ఎటువంటి చర్చలు లేకుండా, ఆర్థిక చిక్కుల గురించి ఆలోచించకుండా కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఖరారు చేసేశారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు అనుకూలంగా నిర్ణయాలు.. ఇక ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధిచేకూర్చింది. వాయిదా పద్ధతిలో లైసెన్స్ ఫీజు చెల్లించడానికి అనుమతించింది. ఈ ఫీజులో బకాయిలపై వడ్డీని కేవలం 18 శాతం (రూ.15 కోట్లు) మాత్రమే వసూలుచేయడానికి అనుమతించింది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, లైసెన్స్ ఫీజు బకాయిలపై అంతకుముందు కాలానికి చెల్లించాల్సిన వడ్డీని కూడా సడలించింది. నిజానికి ఇలా వడ్డీని వదిలేయడానికి, పరోక్షంగా మాఫీ చేయడానికి, తర్వాత చెల్లించేలా అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవు. డిస్టిలరీ మంజూరుకు అనుమతి.. ఇక 2014 నవంబర్లో జీఓ నెంబర్ 993 ప్రకారం.. రెవెన్యూ (ఎక్సైజ్–2) డిపార్ట్మెంట్ ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, మరో మూడు ప్రైవేటు డిస్టిలరీస్కు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది సరఫరాదారులు..డిస్టిలరీలపై ప్రేమ.. కుట్రలో భాగంగా కొంతమంది సరఫరాదారులు, డిస్టిలరీలపై టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమితమైన ప్రేమ కనబర్చింది. వారితో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించింది. వాటికి మార్కెట్ డిమాండ్ లేకపోయినా ఉన్నట్లుగా చూపించింది. వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా ధ్రువీకరణకు ఎలాంటి యంత్రాంగం కూడా లేదు. దీనివల్ల 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు జరిగాయి. బ్రాండ్లకు అడ్డగోలు అనుమతులు.. మరోవైపు.. 2019లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా, ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకపోయినా సరే అనేక బ్రాండ్లకు ఆమోదం తెలిపి తద్వారా వాటి సరఫరాదారులకు ఎక్కడలేని ప్రయోజనం చేకూర్చింది. వ్యక్తులు, సంస్థలకు ప్రయోజనాలను అందించడంవల్ల రాష్ట్ర ఖజానాకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. లోతుగా విచారణ జరపాలి : సీఐడీ ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, లైసెన్సీలకు చట్టవిరుద్ధంగా ఆర్ధిక లాభం చేకూర్చడంపై విచారణ జరగాల్సి ఉందని సీఐడీ ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరపాలని, బాధ్యులైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. -
సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులను ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మనీష్ సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..సిసోడియాపై మోపిన అభియోగాలపై దిగువ కోర్టులో వాదనలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటూ సీబీఐ, ఈడీల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది. ‘సిసోడియాను ఈ విధంగా మీరు సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు. ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. ఇప్పటిదాకా మీరు వాదనలను ఎందుకు ప్రారంభించలేదు? ఎప్పుడు మొదలవుతాయి? మాకు ఈ విషయం రేపటి(మంగళవారం) కల్లా చెప్పండి’అని ధర్మాసనం ఎస్వీ రాజును ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా, రాజు అవునని బదులిచ్చారు. ఈ కేసులో మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. మార్చి 9వ తేదీన సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి, తీహార్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
Satyendar Jain: ఆప్ మంత్రిని విచారించిన సీబీఐ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ను ఎట్టకేలకు సీబీఐ విచారించింది. ఈ విషయమే విచారణ సంస్థ గత శుక్రవారమే ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ముందుకు దరఖాస్తును తరలించగా..దానికి అనుమతి కూడా లభించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సెంట్రల బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సోమవారం ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ను విచారించినట్లు న్యాయవాది మొహ్మద్ ఇర్షాద్ తెలిపారు. ఇదే కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కమ్యూనికేషన్ ఇన్జార్జ్ విజయ నాయర్ను కూడా సీబీఐ ప్రశ్నంచిందని న్యాయవాది తెలిపారు. అయితే ఆయనకు గతంలో ఎక్సైజ్ స్కామ్లో బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చేసిన దర్యాప్తులో ఢిల్లీ 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని పెద్ద మొత్తంలో ప్రయోజనాలను పొందేందుకే ఆప్ అగ్రనేతలు రూపొందించినట్లు వెల్లడైంది. ఈ అక్రమ నిధులు వారిమధ్య చేతులు మారినట్లు పేర్కొంది. అదీగాక మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ మంత్రి జైన్ ఫిబ్రవరి 14, 2015, నుంచి మే 31, 2017 మధ్య కాలంలో తన ఆదాయానికి పొంతన లేని విధంగా ఆస్తులు సంపాదించినట్ల సీబీఐ తెలిపింది. -
సరైన స్పందన కరువు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, విద్యుత్ సబ్సిడీ తదితర సమస్యలపై వివరణ కోరగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ నుంచి సరైన స్పందన లేదని ఢిల్లీ లెఫ్టినెంట్(ఎల్జీ) గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అసహనం వ్యక్తంచేశారు. ‘ఆప్ సర్కార్ ప్రకటనలు, ప్రసంగాలతోనే సరిపుచ్చుతోంది. ప్రజా సంక్షేమం దానికి పట్టడం లేదు. పాలన సరిగా లేదు’ అని శుక్రవారం తాజాగా సీఎం కేజ్రీవాల్కు రాసిన మరో లేఖలో ఎల్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నాను. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, స్వయంగా రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి సీఎం, మంత్రులు గైర్హాజరవడం, విద్యుత్ సబ్సిడీ, ఉపాధ్యాయ నియామకాలు తదితర సమస్యలపై ఆప్ సర్కార్ను నిలదీయడం తప్పా?. ప్రశ్నించిన ప్రతిసారీ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ నన్ను మీరు, మీ మంత్రులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులను ఆప్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంలేదు’ అని సీఎంకు రాసిన లేఖలో ఎల్జీ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘ నాకు ఎల్జీ నుంచి మరో ప్రేమలేఖ అందింది. ఎల్జీ మాటున బీజేపీ దేశ రాజధాని వాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. నేను బతికి ఉన్నంతకాలం అలా జరగనివ్వను’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన లేఖను ప్రేమలేఖ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో ఎల్జీ మరోసారి స్పందించారు. ‘నా లేఖను ఎగతాళి చేశారు. మీరు అన్నట్లు అది ప్రేమ లేఖ కాదు. పరిపాలన లేఖ’ అని అన్నారు. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్న ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఓన్లీ మచ్ కంపెనీ సీఈవో విజయ్ నాయర్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ముంబైకి చెందిన విజయ్ నాయర్ను లిక్కర్ కేసులో సీబీఐ తన ఎఫ్ఐఆర్లో ఏ-5గా చేర్చింది. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కుట్ర.. క్విడ్ ప్రోకో!
సాక్షి, హైదరాబాద్: కుట్ర, క్విడ్ ప్రోకో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ రెండు అంశాలపైనే సీబీఐ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎక్సైజ్ పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించి వ్యాపారులకు మేలు చేశారని ఆరోపిస్తున్న సీబీఐ, ఇందులో కుట్ర కోణంతో పాటు క్విడ్ ప్రో కో ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మరోవైపు నిందితులుగా ఆరోపణలెదుర్కొంటున్న వారితో పాటు బినామీ కంపెనీలు సృష్టించి లిక్కర్ టెండర్లు దక్కేలా సిండికేట్ వ్యవహారం సాగించిన చీకటి వ్యక్తులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బయటపెట్టే దిశగా సీబీఐ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చిన ఢిల్లీ సీబీఐ, ఆ జాబితాలో ఉన్న హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంలో గత నెలలో సోదాలు నిర్వహించింది. సీబీఐ దాడుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు సార్లు సోదాలు నిర్వహించారు. పిళ్లైతో పాటు ఆయన సంస్థ రాబిన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్ బోయినిపల్లి, గండ్ర ప్రేమ్సాగర్, ఆడిటర్ బుచ్చిబాబు, మరో 25 మంది నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాల్లో లభించిన కీలక ఆధారాలతో ప్రముఖులకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. వెలుగులోకి సంచలనాత్మక విషయాలు... రెండు దర్యాప్తు సంస్థల విచారణలో బినామీ కంపెనీల గుర్తింపు, ఆ కంపెనీల టెండర్లు, లంచాలకు ఇచ్చిన నగదు.. ఇలా అనేక సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుట్ర పూరితంగానే ఈ విధంగా వ్యవహరించి కంపెనీలకు లాభం చేర్చేలా చేశారని, అదేవిధంగా భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్టు సీబీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బినామీ కంపెనీలను సృష్టించడంతో పాటు సిండికేట్ రూపంలో తమ వారికి దక్కేలా చేసిన చీకటి నేతలు, ప్రముఖ వ్యక్తులపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రెండు దఫాలుగా నోటీసులు.. అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు ఆయన కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్సాగర్, ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన ఆడిటర్ బుచ్చిబాబును మొదటి దఫాలో విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు విశ్వసీనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు రెండు రోజుల్లో హైదరాబాద్కు వచ్చి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే విచారణ ఇక్కడ చేస్తారా లేకా ఢిల్లీలో చేస్తారా అన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. వీరితో పాటు రెండో దఫాలో ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీతో పాటు ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన 16 కంపెనీలు, వాటిలోని డైరెక్టర్లు 8మందికి నోటీసులిస్తారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఎక్సైజ్ స్కామ్లో ఆరోపణలెదుర్కొంటున్న సిండికేట్లోని ఇద్దరు వ్యాపారులు తాము ఈ టెండర్ల వ్యవహారంలో రూ.250 కోట్లకు పైగా నష్టపోయినట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. భారీ నష్టంతో పాటు సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడం ఇబ్బందికరంగా మారిందని ఓ ప్రముఖ నేత వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
వేధింపులాపి.. మంచి పనులు చేయండి
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం ఏమిటో తనకు ఇప్పటివరకు అర్థం కాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ, ఈడీలతో అందరినీ వేధించడం మానేసి, ఇకనైనా దేశం హితం కోసం మంచి పనులు చేయాలని కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో అవకతవకల కేసులో భాగంగా ఈడీ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ‘మద్యం పాలసీలో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఒకరన్నారు. ఢిల్లీ బడ్జెట్ అంతా కలిపి రూ.70 వేల కోట్లు. మరిక రూ.1.5 లక్షల కోట్ల స్కాం ఎలా సాధ్యం? మరో బీజేపీ నేత రూ.8 వేల కోట్ల కుంభకోణమని, ఇంకొకరు రూ. 1,100 కోట్లని అంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నరేమో రూ.144 కోట్లని ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం విలువ రూ.1 కోటి మాత్రమేనని సీబీఐ అంటోంది’’ అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘మా మంత్రి మనీశ్ సిసోడియా సొంతూరులోని నివాసం, బ్యాంకు ఖాతాల సోదాల్లోనూ సీబీఐకి ఏమీ దొరకలేదు. మరి స్కాం ఎక్కడ జరిగినట్టు?’’ అని ప్రశ్నించారు. అనవసర అంశాలపై దృష్టి పెడితే దేశం వెనుకబడిపోతుందని కేంద్రానికి హితవు పలికారు. తెలంగాణ, ఏపీల్లోనూ దాడులు సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు క్రైం: ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 40 చోట్ల ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. సోదా బృందాలకు పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరు, ఢిల్లీ నివాసాల్లో తనిఖీలు జరిగాాయి. నెల్లూరు రాయాజీవీధిలోని మాగుంట శ్రీనివాసులరెడ్డి పాత నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. బీరువాలను తెరిపించి, అందులోని ఫైళ్లను పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో నివాసముంటున్న ఎంపీ బంధువు (భార్య చెల్లెలి భర్త) శివరామకృష్ణారెడ్డి ఇంటిలోను ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే కేసులో ఈ నెల 6న కూడా ఇలాగే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. -
లిక్కర్ స్కాంలో ‘హైదరాబాద్’ లింకులను కోర్టులో అందిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనానికి తెరలేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో హైదరాబాద్కు ఉన్న లింకులను కోర్టులో సమర్పిస్తామని బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. గతంలో తాము చేసిన ఆరోప ణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ అక్కడే చెబుతామన్నారు. ఎంపీ సుధాంశు త్రివేది, బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్గుప్తాలతో కలిసి గురువారం ఇక్కడి బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంజిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు. ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులను పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందని సుధాంశు త్రివేది, ఆదేశ్గుప్తా ఆరోపించారు. అవినీతిని అంతం చేస్తా అని అధికారంలోకి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అవసరానికి మించి లిక్కర్ సరఫరా చేశారని, బ్లాక్ దందా అంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఢిల్లీ నుంచే సప్లయ్ అయిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆయన మిత్రులకు లాభం చేకూర్చారని, నిందితుడు అమిత్ అరోరాపై జరిగిన స్టింగ్ ఆపరేషన్లో అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లి.. మద్యం పాలసీపై నిర్ణయాలా?: భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మద్యం పాలసీపై ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ‘మద్యాన్ని విచ్చలవిడిగా, అవినీతిపరులతో విక్రయాలు జరుపుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు మద్యం పాలసీని రూపొందించటం విచిత్రం. ప్రభుత్వ పాలసీలపై సచివాలయంలో లేదా కేబినెట్లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వ పాలసీలపై హోటల్లో నిర్ణయాలేంటి? ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వచ్చి.. మద్యం పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఇదీ చదవండి: లిక్కర్ స్కాం కేసు: బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత -
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ: కుంభకోణంలో కేసీఆర్ కుటుంబీకుల పాత్ర: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. ‘‘పాలసీ రూపకల్పన కోసం ఢిల్లీలోని ఒబెరాయ్, చండీగఢ్లోని హయత్ హోటళ్లలో జరిగిన భేటీల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఆ శాఖ అధికారులు, లిక్కర్ మాఫియా∙వ్యక్తులు పాల్గొన్నారు. ఒబెరాయ్ హోటల్లో సూట్ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెల్ల కోసం బుక్ చేశాడు. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిన ప్రైవేట్ విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేవారు. లిక్కర్ మాఫియా కమిషన్ను 10 శాతానికి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా తొలి విడతగా రూ.150 కోట్లు సిసోడియాకు లంచంగా ముట్టింది. దీన్ని తెలంగాణ లిక్కర్ మాఫియానే ఇచ్చింది. గోవా, పంజాబ్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆప్కు లిక్కర్ మాఫియా అడ్వాన్స్ చెల్లింపులు జరిపింది. ఆ తర్వాతే పంజాబ్లోనూ, ఢిల్లీలోనూ కొత్త మద్యం విధానాల అమలు మొదలైంది. పంజాబ్లో ఆప్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తరహా ఎక్సైజ్ విధానాన్నే అక్కడ కేసీఆర్ కుటుంబీకులు అమలు చేయించారు’’ అని ఆరోపించారు. లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ అయ్యారో లేదో సిసోడియా చెప్పాలని డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్కు సంకెళ్లే
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే కీలక సూత్రధారి అని బీజేపీ ఆరోపించింది. అతి త్వరలో ఆయనకు సంకెళ్లు తప్పవని జోస్యం చెప్పింది. కరోనా ఉధృతి సమయంలో ప్రజలంతా సాయం కోసం అల్లాడిపోతుంటే కేజ్రీవాల్ మాత్రం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆదివారం ఆరోపించారు. ఆయన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ‘‘ఎక్సైజ్ విధానం కుంభకోణంలో మూలాలు కేజ్రీవాల్ ఇంటికే దారి తీస్తున్నాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. అక్రమార్కులు శిక్ష అనుభవించాల్సిందే’’ అన్నారు. మరోవైపు తనపై సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసిందని ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీశ్ సిసోడియా ఆదివారం ట్వీట్ చేశారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నా సీబీఐ ఇలా డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘‘మోదీజీ! నేనెక్కడున్నానో తెలియడం లేదా? ఎక్కడికి రమ్మన్నా వస్తా’’ అటూ ట్వీట్ చేశారు. తన ఇంట్లో సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తి ఒక్క రూపాయి కూడా సీబీఐకి దొరకలేదన్నారు. సిసోడియా ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఇప్పటిదాకా నిందితులెవరికీ లుకౌట్ నోటీసులివ్వలేదని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు అనుమతి లేకుండా దేశం దాటలేరు. కాబట్టి వారికి ఆ నోటీసులు అవసరం లేదు’’ అని పేర్కొంది. ఈ కేసులో 8 మంది ప్రైవేటు వ్యక్తులకు లుకౌట్ నోటీసులిచ్చినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మాత్రం, కుంభకోణాలకు పాల్పడితే లుకౌట్ నోటీసులొస్తాయి తప్ప గ్రీటింగ్ కార్డులు కాదనడం విశేషం. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ కరడుగట్టిన అవినీతిపరులని ఆరోపించారు. సిసోడియా తక్షణం రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక మోదీ వర్సెస్ కేజ్రీ: సిసోడియా కేజ్రీవాల్ ప్రధాని అవుతారని సిసోడియా జోస్యం చెప్పారు. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. కేజ్రీవాల్కు అవకాశమిచ్చి చూడాలన్న ఆలోచనలో ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలు మోదీ వర్సెస్ కేజ్రీవాల్గా జరగడం ఖాయం’’ అన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం రోజూ ఉదయమే సీబీఐ–ఈడీ అంటూ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన కేంద్రం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. మరిన్ని హైదరాబాద్ లింకులు? ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్కు చెందిన పలు హోల్సేల్, రిటైల్ మద్యం వర్తకుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మద్యం లైసెన్సులను దక్కించుకున్న పలువురు వ్యక్తులు, కంపెనీలకు హైదరాబాద్ మూలాలున్నాయి. ఇక్కడి అడ్రస్లతోనే వారు టెండర్లు దాఖలు చేశారు. ఈ పాలసీకి పాపులారిటీ పెంచేందుకు 50 మంది దాకా స్టాండప్ కమేడియన్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లెయెన్సర్లు తదితరులను పనిముట్లుగా వాడుకున్నట్టు తేలింది. వీరి విదేశీ యాత్రలు, విదేశాల నుంచి అందిన నిధులపై విచారణ సాగుతోంది’’ అని వివరించారు. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ అమలుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం ముగ్గురు నిందితులను తమ ప్రధాన కార్యాలయానికి రప్పించి, ప్రశ్నించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయడం లేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి తెలిసిందే. సీబీఐ శనివారం కొందరు నిందితులకు సమన్లు జారీ చేసింది. శుక్రవారం మనీశ్ సిసోడియా నివాసం సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నన్లు అధికారులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొందరు నిందితులకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వారందరినీ పిలిపించి, లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారిస్తామని అన్నారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం దృష్టి పెట్టింది. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోని సమాచారాన్ని సీబీఐ.. ఈడీకి అందజేసింది. -
కేంద్రం, ఆప్ కుస్తీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఉదంతం కేంద్రానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ఆప్ నేత, ఢిల్లీ విద్యా, ఎక్సైజ్ శాఖల మంత్రి మనీశ్ సిసోడియా నివాసంపై సీబీఐ శుక్రవారం దాడులు చేసింది. గురుగ్రాం, చండీగఢ్, ముంబై, హైదరాబాద్, లఖ్నవూ, బెంగళూరు... ఇలా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 చోట్ల ఉదయం 8 గంటల నుంచి రాత్రి దాకా ఏకకాలంలో దాడులు చేసింది. మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో సోదాలు చేసింది. రాత్రి 11 గంటల దాకా సిసోడియా నివాసంలో సోదాలు కొనసాగాయి. తన లాప్టాప్, ఫోన్ తీసుకెళ్లారని ఆయన మీడియాకు తెలిపారు. పలు పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది. ఈ ఉదంతంపై బుధవారమే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సిసోడియా, నలుగురు ప్రభుత్వాధికారులతో పాటు మొత్తం 15 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీబీఐ అభియోగాలు మోపింది. ‘‘సిసోడియా తదితరులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ పాలసీలో పలు మార్పులు చేశారు. తద్వారా లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చారు. ఖజానాకు రూ.144.36 కోట్ల మేరకు నష్టం చేకూర్చారు. బదులుగా భారీగా ముడుపులు అందుకున్నారు’’ అని ఆరోపించిది. ఈ ఉదంతంపై ఆప్ మండిపడింది. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దాడులు జరిగాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీ సర్కారుకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తుండటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో కథనం ప్రచురించిన రోజే సీబీఐని ఉసిగొల్పారన్నారు. ‘‘స్వతంత్ర భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా శాఖ మంత్రిపై కక్షపూరిత చర్యలకు దిగారు. సీబీఐకి మేం పూర్తిగా సహకరిస్తాం. మా మంత్రులపై గతంలో చేసిన దాడుల్లో తేలిందేమీ లేదు. ఇప్పుడూ తేలేదేమీ లేదు’’ అంటూ ట్వీట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని జత చేశారు. ‘‘మంచి చేయబోయిన వారందరినీ 75 ఏళ్లుగా ఇలాగే వెనక్కు లాగుతున్నారు. ఇందుకే దేశం వెనకబడింది. ఎవరేం చేసినా ఢిల్లీలో మాత్రం అభివృద్ధి ఆగదు’’ అన్నారు. ఇలాంటి దాడులకు బెదిరేది లేదని సిసోడియా అన్నారు. ‘‘సీబీఐకి స్వాగతం. ఈ కుట్రలు నన్నేమీ చేయలేవు. నిజం నిలకడ మీద తేలుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు. మోదీ సర్కారుకు దడ కేజ్రీవాల్కు, ఆయన ఢిల్లీ మోడల్ పాలనకు సర్వత్రా పెరుగుతున్న పాపులారిటీని చూసి మోదీ ప్రభుత్వం బెదిరిపోతోందని ఆప్ ఆరోపించింది. సిసోడియా ఇంట్లో సీబీఐకి జామెట్రీ బాక్సులు, పెన్సిళ్లు తప్ప మరేమీ దొరకవంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చెణుకులు విసిరారు. సిసోడియాను ఎలాగైనా కటకటాల్లోకి నెట్టాలని సీబీఐకి ఆదేశాలున్నాయని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. వీటిని బీజేపీ తిప్పికొట్టింది. ఎక్సైజ్ మంత్రి కాస్తా ఎక్స్క్యూజ్ మంత్రిగా మారారంటూ కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ను మే 30న ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు. ఏమిటీ కేసు? 2021 నవంబర్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగేలా గోల్మాల్ చేశారంటూ ఆరోపణలొచ్చాయి. వీటికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదించారు. దాంతో సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో ఆదేశించారు. పలువురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీని గత నెలలో ఢిల్లీ సర్కారు పక్కన పెట్టింది. ఎఫ్ఐఆర్లో ఏముందంటే... ► లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండానే లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగే పలు నిర్ణయాలను ఎక్సైజ్ మంత్రి సిసోడియా తీసుకున్నారు. ► కరోనాతో అమ్మకాలు తగ్గాయనే సాకుతో లైసెన్సు ఫీజులో ఏకంగా రూ.144.36 కోట్ల మేరకు రాయితీ ఇచ్చారు. ► లైసెన్స్ ఫీజు రాయితీ/తగ్గింపు, అనుమతి లేకుండానే ఎల్–1 లైసన్సు పొడిగింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ► ఈ గోల్మాల్లో విజయ్నాయర్, మనోజ్ రాయ్, పెర్నాడ్రిచర్డ్, అమన్దీప్ ధాల్, సమీర్ మహేంద్రు తదితర మద్యం లైసెన్సుదారులు, వ్యాపారుల పాత్ర ఉంది. ► వారి నుంచి సిసోడియా సన్నిహితులకు నుంచి కోట్లలో ముడుపులందాయి. మహేంద్రు వారికి రెండు విడతల్లో కోట్లు చెల్లించారు. ► సిసోడియాకు అతి సన్నిహితులైన అమిత్ అరోరా, దినేశ్ అరోరా, అర్జున్ పాండే వసూళ్లకు పాల్పడ్డారు. ► దినేశ్ అరోరాకు చెందిన రాధా అసోసియేట్స్ కు మహేంద్రు నుంచి రూ.కోటి అందింది. ► విజయ్ నాయర్ తరఫున మహేంద్రు నుంచి పాండే కూడా రూ.2 నుంచి 4 కోట్ల దాకా వసూలు చేశారు. ► మహేంద్రు నుంచి అరుణ్ రామచంద్ర పిళ్లై లంచాలు వసూలు చేసి నిబంధనల తారుమారుకు సాయపడ్డ ప్రభుత్వాధికారులకు ఇచ్చారు. హైదరాబాద్ వ్యాపారిపైనా.. సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసాలు, కార్యాలయాల్లోనూ సీబీఐ దాడులు చేసింది. హైదరాబాద్ కోకాపేటతో పాటు బెంగళూరులో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. అరుణ్ రామచంద్ర పిళ్లై బెంగళూరు కేంద్రంగా స్పిరిట్, డిస్టిలరీస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఆయనపైనా ఆరోపణలున్నాయి. కాకరేపిన కథనం ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక గురువారం తన అంతర్జాతీయ ఎడిషన్లో మొదటి పేజీలో ప్రముఖంగా కథనం ప్రచురించింది. ‘‘ఆప్ పాలనలో ఢిల్లీ విద్యా విధానంలో సమూలమైన మౌలిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. వాటిలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు’’ అంటూ ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలు కూడా ఢిల్లీ మోడల్ విద్యా విధానంపై దృష్టి పెట్టాయని పేర్కొంది. విద్యార్థినులతో సిసోడియా ఉన్న ఫొటోను కూడా ప్రచురించింది. ఆకస్మిక పర్యటనలు తదితరాల ద్వారా విద్యా మంత్రిగా ఆయన బాగా పని చేస్తున్నారని రాసింది. బీజేపీ, ఆప్ మాటల యుద్ధానికి ఈ కథనమే ప్రధాన ఆయుధంగా మారింది. అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కడాన్ని ఓర్వలేకే సిసోడియాపైకి మోదీ ఇలా సీబీఐని ఉసిగొల్పారని ఆప్ నేతలంతా ఆరోపించారు. ‘‘సిసోడియా ఫొటోను న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీలో వేసి మెచ్చుకుంది. కేంద్రం వెంటనే ఆయన ఇంటికి సీబీఐని పంపింది’’ అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. మోదీ తీరు సిగ్గుచేటని ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు. బీజీపీ మాత్రం ఇది కచ్చితంగా ఆప్ డబ్బులిచ్చి రాయించుకున్న కథనమేనంటూ ఎదురుదాడికి దిగింది. ప్రచారం కోసం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని ఆరోపించింది. ‘‘ఆప్ సర్కారు కీర్తి కండూతికి న్యూయార్క్ టైమ్స్ కథనమే తాజా ఉదాహరణ. ఈ కథనం అదే రోజు ఖలీజ్ టైమ్స్ అనే పత్రికలోనూ యథాతథంగా వచ్చింది’’ అంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. పెయిడ్ ఆర్టికల్ కాదు: న్యూయార్క్ టైమ్స్ పెయిడ్ ఆర్టికల్ ఆరోపణలను న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. అది తాము క్షేత్రస్థాయిలో పరిశోధించి పూర్తి నిష్పాక్షికంగా రాసిన కథనమని స్పష్టం చేసింది. ఇదే కథనాన్ని ఖలీజ్ టైమ్స్ వార్తా పత్రిక కూడా అదే రోజు యథాతథంగా ప్రచురించడంపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను కొట్టిపారేసింది. ‘‘మా లైసెన్సున్న పలు వార్తా సంస్థలు మా కథనాలను ప్రచురించుకోవడం మామూలే’’ అని పేర్కొంది. -
Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్!
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దెబ్బకు ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కొత్త మద్యం పాలసీని పక్కన పెట్టి పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. 2022-23 కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇంకా చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022-23 ముసాయిదా ఎక్సైజ్ పాలసీని ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదానికి పంపించలేదు. అయితే.. ఇప్పటికే 2021-22 ఎక్సైజ్ పాలసీని మార్చి 31 తర్వాత రెండు సార్లు పొడిగించింది ఢిల్లీ ప్రభుత్వం. అది జులై 31తో ముగియనుంది. తాజాగా తీసుకొచ్చే కొత్త పాలసీలో లిక్కర్ హోమ్ డెలివరీ వంటీ కీలక మార్పులను ప్రతిపాదించింది ఆబ్కారీ శాఖ. ఈ విషయంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు.. కొత్త పాలసీ అమలులోకి వచ్చే వరకు మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలులో ఉంచాలని గత గురువారమే సిసోడియా ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు.. 2021, నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీకి ముందు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు కార్పొరేషన్లు నిర్వహించిన లిక్కర్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నాలుగు కార్పొరేషన్లు నగరంలో మొత్తం 475 లిక్కర్ దుకాణాలను నడుపుతున్నాయి. ఇదీ చదవండి: కొత్త మద్యం పాలసీలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేం -
సావర్కర్ కాదు భగత్ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్ నేతలకు భయం లేదని, బీజేపీనే భయపడుతుందని ధ్వజమెత్తారు. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే దీనిలో నిబంధనలు అతిక్రమించారని, దీని వల్ల లిక్కర్ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆ కాసేపటికే కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఫైనాన్షియల్ క్విడ్ ప్రోకో జరిగిందని, ఎక్సైజ్ శాఖ ఇంఛార్జ్గా ఉన్న సిసోడియానే దీన్ని అమలు చేశారని చీఫ్ సెక్రెటరీ నివేదిక తెలిపింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా పంపారు. అయితే ఇదంతా ఫేక్ అని కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ అంటున్నారు. 'ఈరోజుల్లో కొత్త రూల్ వచ్చింది. ఎవర్ని జైలుకు పంపాలో ముందు కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వారిపై కేసు నమోదవుతుంది. సిసోడియాపై చేస్తున్న ఆరోపణలను పరిశీలించాను. అందులో ఒక్కటి కూడా నిజం లేదు. అది ఫేక్ కేసు' అని మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా తనకు 22 ఏళ్లుగా తెలుసునని, ఆయన ఎంతో నిజాయితీ పరుడని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వేవ్ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని బీజేపీ కుట్ర చేస్తోందని, కానీ అది వాళ్లకు సాధ్యం కాదన్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో సిసోడియా సమూల మార్పులు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. చదవండి: 94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం -
మద్యం పాలసీలో పెను మార్పులు చేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం పాలసీలో పెను మార్పులు తీసుకువచ్చింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి మనిష్ శిశోడియా కొత్త మద్యం పాలసీపై మాట్లాడుతూ.. మందు తాగే చట్టబద్ధమైన వయసును 25 నుంచి 21 మార్చటానికి ప్రభుత్వం నిశ్చయించిందని అన్నారు. కొత్త నియమాల ప్రకారం రాజధానిలోని పేర్లులేని మద్యం షాపులు ఇకపై పనిచేయటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పాత మద్యం షాపులకు కూడా ఈ నియమం వర్తిస్తుందని అన్నారు. రాజధానిలోకి అక్రమ మద్యం రాకుండా అడ్డుకోవటం ద్వారా రాష్ట్ర రెవెన్యూను 20 శాతం పెంచుతామని పేర్కొన్నారు. మంత్రుల సంఘం సూచనల మేరకు రాష్ట్ర కేబినేట్ ఈ కొత్త పాలసీలను ఆమోదించిందని తెలిపారు. రాజధానిలో కొత్తగా ఏ మద్యం షాపు తెరవటానికి వీల్లేదని, ప్రభుత్వం ఏ మద్యం షాపును నడపబోదని వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలోని 60 శాతం మద్యం షాపులను ప్రభుత్వం నడుపుతోందని చెప్పారు. నకిలీ మద్యాన్ని గుర్తించటానికి నగరంలో ఓ ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చదవండి : ఆ ప్రాజెక్ట్తో బుందేల్ఖండ్ రూపురేఖలు మారతాయి -
నెలరోజుల్లో కొత్త పాలసీ!
సాక్షి, వికారాబాద్: వచ్చేనెల 30తో మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం పాత మద్యం పాలసీని కొనసాగిస్తుందా.. లేదా కొత్త విధానాన్ని తీసుకొస్తుందా.. అని మద్యం వ్యాపారులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సర్కారుకు ఎక్సైజ్శాఖ నుంచి భారీగా ఆదాయం సమకూరుతోంది. త్వరలో మద్యం లైసెన్సుల గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఈసారి టెండర్లు దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడనున్నారు. కొత్తవారు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల టెండర్లు దక్కించుకునేందుకు జిల్లాలోని వ్యాపారులతోపాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు సైతం మక్కువ చూపిస్తున్నారు. ఇక్కడ వ్యాపారం చేసేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు మహబూబ్నగర్, మెదక్ జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయా జిల్లాల వ్యాపారులు మద్యం టెండర్లలో పాల్గొనడంతోపాటు దుకాణాలు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. 2017 కంటే ఈ దఫా మరింత పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మద్యం వ్యాపారం మంచి లాభాలను తెచ్చిపెడుతుండడంతో రాజకీయ నాయకులతోపాటు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యాపారులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు చెందిన మద్యం వ్యాపారులు, సిండికేట్లు సైతం మన జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మద్యం దుకాణాల టెండర్లు దక్కించుకునేందుకు ఈసారి పోటీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. 446 దరఖాస్తులు, రూ.43.70 కోట్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లను రెండేళ్లకు ఖరారు చేసింది. 2017–2019 పాలసీ ప్రకారం సెప్టెంబర్ 30 వరకు మద్యం లైసెన్సుల గడువు పూర్తి కానుంది. అంతకు ముందు టెండర్లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన ధరావత్తు తక్కువ మేర ఉండేది. 2017లో దానిని లక్ష రూపాయలకు పెంచారు. ఆలాగే ఆయా ప్రాంతాలను బట్టి దుకాణాలను నాలుగు స్లాబ్లుగా విభిజించి లైసెన్స్లు కేటాయించారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 45 మద్యం దుకాణాలు ఉండగా గ్రామీణ ప్రాంతంలోని 29 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజు రూ.90 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని 16 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజును రూ.1.10 కోట్లుగా నిర్ణయించారు. గతంలో 45 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించిన ఎక్సైజ్ శాఖకు మొత్తం 446 దరఖాస్తులు అందాయి. 2017 సెప్టెంబర్లో జిల్లాలోని 45 మద్యం దుకాణాల టెండర్లను లాటరీ పద్ధతిలో నిర్వహించి లైసెన్స్లు జారీ చేశారు. టెండర్ ప్రక్రియ ద్వారా జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.43.77 కోట్ల ఆదాయం లభించింది. మొత్తం దుకాణాల్లో ఏడు మద్యం షాపులు లైసెన్స్లు అప్పట్లో మహిళలకు దక్కడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్ వచ్చేనెల 30తో ముగియనుంది. దీంతో మద్యం వ్యాపారులంతా నిరీక్షిస్తున్నారు. దుకాణాలు పెరుగుతాయా..? వచ్చేనెల మొదటి వారంలో ఎక్సైజ్ శాఖ నుంచి విధివిధానాలు వెలుబడే అవకాశం ఉంది. గత రెండేళ్లలో జిల్లాలోని 45 మద్యం దుకాణాల్లో జరిగిన మద్యం అమ్మకాల వివరాలను ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయితే, మద్యం విక్రయాలు జిల్లాలో లక్ష్యానికి మించి జరిగాయి. ఈ నేపథ్యంలో ఎక్జైజ్ శాఖ మద్యం దుకాణాల సంఖ్యను పెంచే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న 45 మద్యం దుకాణాలకు అదనంగా మరో ఏడు నుంచి పది షాపులను పెంచవచ్చని విశ్వసనీయ సమాచారం. అలాగే కొత్త మున్సిపాలిటీల్లోనూ బార్ల కోసం లైసెన్స్లు జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలైన పరిగి, కొడంగల్లో బార్లు ఏర్పాటు కానున్నాయి. కాగా, పట్టణాల్లో ప్రస్తుతం కొనసాగిస్తున్న పర్మిట్ రూమ్ లైసెన్స్లను ఎత్తివేయొచ్చని తెలుస్తోంది. -
బెల్టు షాపులపై ఉక్కుపాదం: సీఎం జగన్
-
బెల్టు షాపులపై ఉక్కుపాదం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు మద్య నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్ననే నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చారు. తాజాగా అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తామని తెలిపారు. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘బెల్టుషాపులపై ఉక్కుపాదం. ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోంది. అక్టోబర్ నుంచి 20శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తాం. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. (చదవండి: ఉద్వేగానికి లోనవుతున్నా) -
‘ఇకపై ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లే’
సాక్షి, అమరావతి : వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద 500 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్ వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పారు. గురువారం ఆయన తొలివిడత షాపుల నిర్వహణ కోసం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సమూలంగా నిర్మూలించిందని చెప్పారు. జూన్ 1నుంచి ఆగస్ట్ చివరినాటికి 2,500 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులను 3,500కు కుదించామన్నారు. మరికొద్ది గంటల్లోనే నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రాబోతుందని, అది పూర్తిగా అమల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్లు ఉండవని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన ఉండబోవన్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించామని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: దశలవారిగా మద్యపాన నిషేధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఏపీ సర్కార్ బుధవారం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలు చేపట్టనుంది. కొత్త మద్యం పాలసీ విధానంలో 800 షాపులు తగ్గించింది. బెల్ట్ షాపులు ఎక్కడా కనిపించకుండా చర్యలు చేపట్టింది. ఇక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం భక్తుల మనోభావాలు దృష్ట్యా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గమధ్యలో మద్యం షాపులను నిషేధించింది. అక్టోబర్ 1 నుంచి బేవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే 3500 మద్యం షాపులను నిర్వహించనున్నారు. కాగా మద్యం మహమ్మారిపై గత టీడీపీ ప్రభుత్వానికి భిన్నంగా సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని విడతల వారీగా నిషేధించేందుకు పూనుకున్నారు. ప్రజారోగ్యానికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. అయితే మద్యం మాఫియాకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ఏకంగా ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దు చేసేందుకు సంకల్పించారు. -
ఎక్సైజ్ పాలసీపై ఆశావహుల్లో చర్చ
సాక్షి, వరంగల్: ‘ఎక్సైజ్ పాలసీ 2019–21 కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రానున్నాయా.. లేదంటే పాత పద్ధతిలోనే టెండర్లు నిర్వహిస్తారా.. అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త ఎక్సైజ్ పాలసీలో ఏ మేరకు మార్పులు ఉంటాయి?’ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే చర్చ. సెప్టెంబర్ 30తో మద్యం దుకాణాల గడువు ముగియనుండడంతో కొత్తగా ఈ రంగాన్ని ఎంచుకునే వారు.. యధాతథంగా కొనసాగాలనుకునే వ్యాపారులు, ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. 2017లో జరిగిన టెండర్ల సందర్భంగా ఆగస్టు మొదటి వారంలోనే ప్రభుత్వం కొత్త పాలసీ, టెండర్లపై విధి విధానాలను ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో మద్యం దుకాణాల కోసం పోటీ పడ్డారు. ఒక్కో దుకాణానికి మూడు నుంచి 85 వరకు దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 265 మద్యం దుకాణాలపై కేవలం దరఖాస్తుల రూపేణా మద్యనిషేధం, అబ్కారీశాఖకు రూ.75.27 కోట్ల ఆదాయం లభించింది. 2015–17 కోసం ఆరు స్లాబ్లు, ఒక్కో దరఖాస్తుకు రూ.50 వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించిన ప్రభుత్వం.. 2017–19కి వచ్చే సరికి నాలుగు స్లాబ్లు, దరఖాస్తు ధర రూ.లక్షకు పెంచింది. దీంతో ఎక్సైజ్శాఖకు ఆదాయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రభుత్వం పాలసీలో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తుందా.. లేక పాత పద్ధతినే అమలు చేస్తుందా అనే చర్చ సాగుతోంది. అయితే ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారమే టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గత శ్లాబ్లు ఇలా.. ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా రెండు పర్యాయాలు వేర్వేరు విధానాలను పాటించింది. 2015–17 ఎక్సైజ్ పాలసీలో ఆరు స్లాబులు విధించింది. మేజర్ గ్రామపంచాయతీలకు సంబంధించి మొదటి స్లాబ్గా రూ.39.50 లక్షలు, మండల కేంద్రాలోరెండో స్లాబ్గా రూ.40.8 లక్షలు ఎక్సైజ్ టాక్స్ విధించారు. అదే విధంగా లక్ష నుంచి 2 లక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 3 లక్షల జనాభా పైబడి ఉంటే రూ.81.6 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1.08 కోట్లుగా నిర్ణయించారు. 2017–19 పాలసీకి వచ్చే సరికి ఆరు శ్లాబ్లను నాలుగుకు తగ్గించారు. 50 వేల జనాభా ఉండే ప్రాంతాల్లో రూ.45 లక్షలు కాగా, 50,001 నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.55 లక్షలు, 5,00,001 నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.85 లక్షలు, 20 లక్షలపై జనాభా ఉండే చోట రూ.1.10 కోట్లుగా మార్పు చేశారు. ప్రస్తుతం ఈ పాలసీ వచ్చే నెల 30తో ముగియనుండగా.. కొత్త విదివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో 2019–21 ఎక్సైజ్ పాలసీ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ, ఆసక్తి ఆశావహుల్లో మొదలైంది. బార్ లైసెన్సుల రెన్యూవల్ యధాతథం వైన్స్షాపుల టెండర్ల విషయంలో కొంత సస్పెన్స్ నెలకొనగా... బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులను మాత్రం యధాతథంగా రెన్యూవల్ చేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 265 వైన్స్ (ఏ–4) ఉండగా 100 బార్ అండ్ రెస్టారెంట్లు, 17 ఎలైట్ బార్లు ఉన్నాయి. ఇందులో వరంగల్ అర్బన్ జిల్లాలో 59 వైన్స్, 88 బార్లు, 11 ఎలైట్ బార్లు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 58 వైన్స్, 3 బార్లు, 4 ఎలైట్ బార్లు, జనగామలో 42 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్, మహబూబాబాద్లో 51 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్ బార్లు ఉన్నా యి. ఇక జయశంకర్ భూ పాలపల్లి, ములుగు జిల్లాల్లో 55 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. ఇందులో 100 బా ర్లు, 17 ఎలైట్ బార్లకు సె ప్టెంబర్ నెలా ఖరులోగా రెన్యూవల్ చేయనున్నారు. వైన్స్కు మాత్రం ఇంకా మా ర్గదర్శకాలు రావాల్సి ఉండగా ఈ సా రి వైన్స్షాపు ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా దరఖాస్తులు కూడా పోటెత్తుతాయని భావిస్తున్నారు. గత టెండర్లలో 265 దుకాణాలకు గాను 7,527 దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే మార్గదర్శకాలు వచ్చే అవకాశం 2019–21 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. త్వరలోనే కొత్త ఎక్సైజ్ పాలసీ వెలువడే అవకాశముంది. వచ్చే నెల 30వ తేదీతో వైన్స్ గడువు ముగుస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తాము. – సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్, మద్యనిషేధం, అబ్కారీ శాఖ, వరంగల్ -
ఎక్సైజ్ పాలసీ ఖరారు
-
ఎక్సైజ్ పాలసీ ఖరారు
మద్యం దుకాణాలకు ఈనెల 13న నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు మద్యం కొత్త పాలసీ ఖరారైంది. రాష్ట్రంలో గతంలో ఉన్న ఆరు శ్లాబులను నాలుగు శ్లాబులకు కుదించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. గతంలో రూ. 50 వేలు ఉన్న దరఖాస్తు ఫీజును అర్బన్ ప్రాంతంలో రూ. లక్షకు పెంచారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆమోదముద్ర వేశారు. దీంతో అధికారులు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు ఈనెల 19గా నిర్ణయించారు. 22వ తేదీన మద్యం దుకాణాల లైసెన్సులకు డ్రా నిర్వహిస్తారు. డ్రా నిర్వహణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. పాత పాలసీలో ఆరు స్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును నాలుగు స్లాబులకు కుదించారు. మేజర్ గ్రామ పంచాయతీ, మండల కేంద్రంలో గతంలో రూ. 39.5 లక్షలు, రూ. 40.8 లక్షలుగా ఉన్న రెండు శ్లాబులను కలిపేసి రూ. 45 లక్షలతో ఒక శ్లాబు చేశారు. గతంలో 2 లక్షల నుంచి 3 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం షాపులకు రూ. 50 లక్షలు, రూ. 60 లక్షల శ్లాబులు ఉండగా, ఆ రెండింటిని కలిపి రూ. 55 లక్షలతో ఒకే శ్లాబు చేశారు. 3 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు గతంలో రూ. 81.6 లక్షల స్లాబు ఉండేది. తాజాగా పర్మిట్ రూమ్తో కలిపి ఈ శ్లాబును రూ. 85 లక్షలకు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో రూ. 1.08 కోట్లు ఉండగా, ఈసారి దానిని పర్మిట్ రూమ్తో కలిపి రూ. 1.10 కోట్లుగా నిర్ధారించారు. రెండేళ్ల లీజు కాలాన్ని ఎప్పటిలాగే కొనసాగించనున్నారు. -
మద్యం షాపుల లీజు ఏడాదే
-
మద్యం షాపుల లీజు ఏడాదే
‘లైసెన్సు’ కాలాన్ని కుదించాలని ప్రభుత్వ నిర్ణయం ఆరు శ్లాబుల బదులు మూడు శ్లాబుల్లో లైసెన్సు ఫీజు తొలి రెండు శ్లాబుల్లోకి గ్రామీణ, పట్టణప్రాంత దుకాణాలు అందుకు అనుగుణంగా ఫీజు పెంచే యోచన ముఖ్యమంత్రి వద్దకు చేరిన నూతన ఎక్సైజ్ పాలసీ ఫైలు సాక్షి, హైదరాబాద్ మద్యం దుకాణాల లైసెన్సు లీజు కాలాన్ని ఏడాదికే కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత పాలసీలో రెండేళ్లుగా ఉన్న లీజు కాలాన్ని కొత్త ఎక్సైజ్ పాలసీలో ఏడాదికే పరిమితం చేయనుంది. అలాగే ఆరు శ్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును ఈసారి మూడు శ్లాబులకు కుదించాలని, మొదటి రెండు శ్లాబుల పరిధిలోకి గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణాలను తీసుకొచ్చి లైసెన్సు ఫీజు పెంచాలని యోచిస్తోంది. దుకాణం లైసెన్సుతోపాటే పర్మిట్ రూం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నూతన మద్యం పాలసీకి ఒక రూపాన్ని ఇచ్చి సంబంధిత ఫైల్ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు అధికారులు పంపారు. దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. డీనోటిఫై అవసరం లేకుండానే..: జాతీయ, రాష్ట్రీయ రహదారులకు 500 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు నిర్వహించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ప్రభావం నుంచి హైవేలపై ఉన్న మద్యం దుకాణాలను బయటపడేసేందుకు రాష్ట్రీయ రహదారులను డీనోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని రహదారులకు తమ తీర్పు వర్తించదంటూ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టతనిచ్చింది. ఈ తీర్పు వల్ల రాష్ట్ర హైవేలపై ఉన్న 561 మద్యం దుకాణాలకు ఇబ్బంది లేకుండా అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు, 852 బార్లు నడుస్తుండగా అందులో 1,184 మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఉన్నాయి. ఆన్లైన్లోనే దరఖాస్తులు.. మద్యం దుకాణాల కోసం ఈసారీ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి లాటరీ ద్వారా లైసెన్సు కేటాయించనున్నారు. అయితే గతంలో ముందుగా దుకాణం లైసెన్సు కేటాయించి తరువాత రూ. 2 లక్షల ఫీజుతో పర్మిట్ రూమ్ను అనుమతించే వాళ్లు. ఈసారి లైసెన్సుతోపాటే పర్మిట్ రూమ్కు అనుమతి ఇవ్వాలనుకుంటున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మద్యం దుకాణాలు 2,216 గతేడాది వేలంలో పోయినవి 2,144 జాతీయ రహదారులపై ఉన్నవి 623 రాష్ట్రీయ రహదారులపై ఉన్నవి 561 సుప్రీంకోర్టు స్పష్టతతో వెసులుబాటు పొందినవి 479 మొత్తం బార్లు 852 జాతీయ రహదారులపై ఉన్నవి 265 రాష్ట్రీయ రహదారులపై ఉన్నవి 155 సుప్రింకోర్టు స్పష్టతతో వెసులుబాటు పోందినవి 107 -
మద్యంపై పోరు ఆగదు
► మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదిక స్పష్టం ► నూతన ఎక్సైజ్పాలసీ రద్దుకు డిమాండ్ ► వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ద్వారకానగర్(విశాఖ దక్షిణ): మద్యం మహమ్మారిని సంపూర్ణంగా రూపుమాపే వరకూ తమ పోరు ఆగదని మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ పార్కు వద్ద మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. దీనికి ఉపకరించే విధంగా ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టిందన్నారు. తక్షణం ఈ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలకు, హత్యలు పెరగడానికి కారణం ఈ మద్యమేనన్నారు. దీనిని నియంత్రించాల్సిన ప్రభుత్వం దానిని ప్రోత్సహిస్తుండడం దారుణమన్నారు. ప్రభుత్వం ‘మత్తు’ వదలాలి.. బీర్ను హెల్త్ డ్రింక్ మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మున్ముందు మెడిసిన్గా ప్రకటిస్తారేమోనని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి ఎద్దేవా చేశారు. మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి, ‘మత్తు’ రాజకీయలకు వ్యతిరేకంగా.. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగానికి, చట్టానికి బద్దులై నడుచుకుంటానని ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర సహయ కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మద్యం బాబులకు అండగా ఉంటున్నారని, గుడి, బడి తేడా లేకుండా బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేయడం బాధకరమన్నారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు దేవీశ్రీ ప్రభుత్వం చేస్తున్న మద్యం విధానాలకు వ్యతిరేకంగా పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. వైఎస్సార్సీపీ నగర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవివర్మ, నగర అధికార ప్రతినిధి ధనలత, 19వ వార్డు అధ్యక్షురాలు బొట్టా స్వర్ణ, కొల్లి రమణమ్మ, శిరిషా, శ్రీదేవి, నగర కార్యదర్శి అలివేణి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య బేగం, ప్రగతిశీల మహిళా సంఘం ఎస్. వెంకటలక్ష్మి, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ
– అన్ని షాపుల్లో హెచ్పీఎఫ్ఎస్ – అధిక ధరలకు విక్రయిస్తే రూ.లక్ష నుంచి రూ. 5లక్షలు జరిమానా – ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు డైరెక్టర్ మహానంది: ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ చట్టం అమలు చేస్తామని, అందుకు అనుగుణంగా వినూత్న మార్పులు తెస్తామని ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు డైరెక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వైన్¯Œ షాపుల్లో హెచ్పీఎఫ్ఎస్(హలోగ్రాఫిక్ పాత్ ఫైండర్ సిస్టమ్) ఏర్పాటు చేస్తామన్నారు. ట్రేస్ అండ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా అన్నింటిని ఆన్లైన్ చేస్తామన్నారు. ప్రతి షాపులో సీసీ కెమెరాలు, సీసీ టీవీలు, ఆటోమిషన్ స్కాన్ విధానం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో మద్యంను అధిక ధరలకు విక్రయిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించేవారమని, కొత్త చట్టం ద్వారా ఫిర్యాదు అందితే రూ. 5లక్షలు జరిమానా విధిస్తామన్నారు. మహానందిలోని వైన్షాపును తొలగిస్తామని చెపా్పరు. ఆయన వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. -
ఏప్రిల్ లో కొత్త మద్యం విధానం
మహానంది: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కుటుంబసభ్యులతో కలసి మహానంది క్షేత్రానికి చేరుకున్నారు. దర్శనానంతరం విలేకరులతో మాట్లాడారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయించినందుకు ప్రస్తుతం ఉన్న రూ. లక్ష జరిమానాను రూ. 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. హోలోగ్రాఫిక్ లేబుళ్లతో పాటు ట్రాక్ అండ్ ట్రేస్, బిల్లింగ్ స్కానింగ్ వంటి ఆధునాతన విధానాలను బార్లు, రెస్టారెంట్లు, వైన్స్లో అమల్లోకి తేనున్నట్లు వెల్లడించారు. -
ఎక్సైజ్ విధానాన్ని పునస్సమీక్షించాలి
► కేంద్రమంత్రి దత్తాత్రేయ ► మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు ► శేషగిరిరావు దీక్ష ప్రభుత్వానికి కనువిప్పు కావాలని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, అందువల్ల ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని పునస్సమీక్షించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కన్నా బార్షాపులపైనే మక్కువ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కాస్తా బార్ల తెలంగాణగా మారకుండా చూడాలన్నారు. పట్టణాల్లో 11 వేల జనాభా, గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల జనాభా ఉంటే బార్షాప్ తెరవాలని ఎక్సైజ్ పాలసీలో పెట్టడం బాధాకరమన్నారు. దీన్ని కేవలం ఆదాయ వనరుగా చూడడం సరైంది కాదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్గా ఉన్న తెలంగాణ, మద్యంపై ప్రజలను చైతన్యవంతులను చేయడంలో మాత్రం వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంలో కూడా నంబర్ వన్ స్థానానికి రావాలన్నారు. త్వరలోనే ఈ అంశంపై సీఎం కేసీఆర్ను కలిసి చర్చించడంతో పాటు, ఆయా అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాస్తామన్నారు. కార్మికశాఖ ద్వారా మద్యం మహమ్మారి, దుష్పరిణా మాలపై సింగరేణి, ఇతర పరిశ్రమల్లో అవగాహన కార్యక్రమాలను చేపడతామ న్నారు. బడుగు, బలహీనవర్గాలు, పేదల్లో దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చేపడతామన్నారు. శేషగరిరావు దీక్ష విరమణ.. నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సీనియర్ నేత ప్రొ.ఎస్వీ శేషగిరిరావు మద్యం సమస్యపై చేపట్టిన ఒకరోజు దీక్షను దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు శనివారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. మద్యం సమస్యపై 81 ఏళ్ల వయసులో శేషగిరి రావు చేసిన దీక్ష టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ దీక్షను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం విధానంలో సమూల మార్పుల కోసం బీజేపీ ఉద్యమం చేస్తుందని, శేషగిరిరావు దీక్ష అందుకు అంకురార్పణ అని మురళీధర్రావు పేర్కొన్నారు. పెద్దనోట్లు రద్దు చేయడంతో కొందరి గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. డబ్బుతో నడుస్తున్న కుటుంపార్టీల జేబులకు ఇప్పుడు ప్రమాదం రావడంతో పుట్టల్లోంచి పాముల్లాగా నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయన్నారు. అంతకు ముందు టీజేఎసీ చైర్మన్ ప్రొ.కోదండరాం, తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు, ఎన్.రామచంద్రరావు, సోము వీర్రాజు, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్రెడ్డి, పేరాల శేఖర్రావు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఎం.ధర్మారావు, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న పొట్లాల్లో చీప్ లిక్కర్
♦ 90 మిల్లీలీటర్ల టెట్రాప్యాక్లలో విక్రయాలకు సర్కారు కసరత్తు ♦ రూ.25 నుంచి రూ.30లోపే అందించాలని యోచన ♦ టెట్రా ప్యాక్ల తయారీకి ఇప్పటికే అనుమతి పొందిన మెక్డొవెల్ కంపెనీ సాక్షి, హైదరాబాద్: గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చౌక మద్యాన్ని అందుబాటులోకి తెచ్చే యత్నం చేసి వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం... ఈసారి చిన్న పొట్లాల్లో చీప్లిక్కర్ను విక్రయించే ఆలోచనను తెరపైకి తెచ్చింది. సాధారణంగా సాఫ్ట్ డ్రింకులను విక్రయిస్తున్న మాదిరిగా టెట్రా ప్యాక్లలో 90 ఎంఎల్ (మిల్లీలీటర్ల) పరిమాణంలో చీప్లిక్కర్ను తక్కువ ధరకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. గత సంవత్సరం ఎక్సైజ్ పాలసీలోనే 90 ఎంఎల్ చీప్లిక్కర్ ప్యాకెట్లను రూ.20 ధరకు అందించేలా ప్రణాళికలు సిద్ధమైనా.. వివిధ వర్గాల ప్రజలు, సామాజిక వేత్తల వ్యతిరేకతతో ప్రభుత్వం వెనకడుగు వే సింది. అతి ప్రచారం అప్పట్లో దెబ్బతీసిందని భావిస్తున్న సర్కారు ఈసారి చడీచప్పుడు కాకుండా టెట్రా ప్యాక్ మద్యాన్ని మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. తక్కువ ధరకు అందుబాటులోకి.. ప్రస్తుతమున్న చీప్లిక్కర్ 180 ఎంఎల్ ధర రూ.60 కాగా, 90 ఎంఎల్ ధర రూ.40. దీనిలో కొంచెం ఎక్కువ నాణ్యత ఉన్న చీప్ లిక్కర్ ధర 180 ఎంఎల్కు రూ.80గా ఉంది. అయితే గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ఉండేలా... రూ.25 నుంచి రూ.30కే 90 ఎంఎల్ చీప్లిక్కర్ టెట్రాప్యాక్ను అందించే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టెట్రాప్యాక్లపై వ్యాట్ తగ్గించడం ద్వారా రూ.25కే 90 ఎంఎల్ చీప్లిక్కర్ను అందించే అవకాశముంది. ప్రస్తుతం చీప్ లిక్కర్ను ప్లాస్టిక్ సీసాల్లో విక్రయిస్తున్నారు. ఈ ఖర్చు తగ్గించడంతో పాటు ఆకర్షణీయమైన ప్యాక్లో తక్కువ ధరకు చీప్ లిక్కర్ సరఫరా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టెట్రా ప్యాక్లలో మద్యం తయారీకి గతంలోనే మెక్డొవెల్స్ కంపెనీకి అనుమతిచ్చారు. ఈ కంపెనీకి చెందిన డిస్టిలరీలోని ఒక లైన్ను టెట్రాప్యాక్ల తయారీకి అనుగుణంగా రూపొందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా కొద్దిరోజులు టెట్రాప్యాక్ల్లో ఓ రకం మద్యాన్ని కూడా సరఫరా చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే తొలుత ‘టెట్రాప్యాక్’ చీప్లిక్కర్ను అందించే అవకాశముంది. ప్రభుత్వం అనుమతిస్తే టెట్రాప్యాక్లలో చీప్లిక్కర్ను సరఫరా చేసేందుకు మరో ఐదు డిస్టిలరీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏపీ నుంచి అక్రమ రవాణా అడ్డుకునేందుకే ... తెలంగాణ కన్నా ఏపీలో తక్కువ ధరకు చీప్ లిక్కర్ లభిస్తోంది. అక్కడి ప్రభుత్వం చీప్లిక్కర్పై వ్యాట్ను గణనీయంగా తగ్గించడంతో తెలంగాణ కన్నా రూ.5 నుంచి రూ.10 తక్కువకు 180 ఎంఎల్ చీప్లిక్కర్ లభిస్తోంది. దీంతో నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల ద్వారా ఏపీ చీప్ లిక్కర్ తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతోందని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. టెట్రాప్యాక్లలో చీప్లిక్కర్ను తీసుకువస్తే అక్రమ రవాణాను నియంత్రించవచ్చని అభిప్రాయపడుతోంది. అక్టోబర్ నుంచే టెట్రాప్యాక్లలో చీప్లిక్కర్ సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. -
ఎక్సైజ్ పాలసీ ఖరారు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ ఖరారైంది. ఈమేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేశారు. రిటైల్ మద్యం దుకాణాలకు సంబంధించిన విధివిధానాలను ఇందులో పేర్కొన్నారు. కొత్త మద్యం విధానంలో తెలంగాణలోని మొత్తం 2216 మద్యం దుకాణాలకు ఆరు శ్లాబులను అమలు చేయనున్నారు. రెండేళ్ల పాటు ఆయా దుకాణాలకు ఈ లైసెన్సులు అమల్లో ఉంటాయి. కొత్త మద్యం పాలసీలో లైసెన్స్ ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి ⇒ 10వేల జనాభా వరకు రూ.39లక్షలు ⇒ 10వేల నుంచి 50వేల జనాభా వరకు రూ.40.80లక్షలు ⇒ 50వేల నుంచి 3లక్షల జనాభా వరకు రూ.50.40 లక్షలు ⇒ 3లక్షల నుంచి 5లక్షల జనాభా వరకు రూ.60లక్షలు ⇒ 5లక్షల నుంచి 20లక్షల జనాభా వరకు రూ.81.60లక్షలు ⇒ 20లక్షలు పైబడిన ప్రాంతాలకు రూ.1.8కోట్లు వచ్చే నెల 1 నుంచి ఈ కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. 2017 సెప్టెంబరు 30 వరకు ఈ విధానాలు అమల్లో ఉంటాయి. -
మద్యం పాలసీ విధానాలు యథాతథం
హైదరాబాద్: తెలంగాణలో ఎక్సైజ్ పాలసీ విధానాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఖరారు చేశారు. ఈ మేరకు పాలసీ విధానాలను మీడియా ముందు కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే అక్టోబర్ నెల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీలు అమల్లోకి వస్తాయన్నారు. రెండేళ్ల కాలపరిమితి కోసం వైన్ షాపుల లైసెన్సులు ఇస్తామని.. రిటైల్ షాపుల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో లైసెన్సులు ఇస్తామని సీఎం కేసీఆర్ మీడియాతో వెల్లడించారు. -
మద్యాన్ని ఆపకపోతే మధ్యలోనే దించుతాం
ఐద్వా బస్సుయాత్ర ముగింపు సభలో కేసీఆర్కు నేతల హెచ్చరిక హైదరాబాద్: పల్లెల్లో చీప్లిక్కర్ సరఫరా చేయాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును మధ్యలోనే దించేస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. మద్యాన్ని నియంత్రించాలని, మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో 12 రోజులపాటు జరి గిన బస్సు యాత్ర ముగింపు సభ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద జరి గింది. సభ ప్రారంభానికి ముందు విద్యుత్ ఉద్యమ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిం చారు. ఈ సందర్భంగా ఐద్వా జాతీయ కార్యదర్శి జగ్మమతి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్ది ఇబ్బందుల పాలు చేస్తున్నాయని విమర్శించారు. మహిళలు మద్యపాన నిషేధం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్రావు మాట్లాడుతూ మద్యాన్ని అరికట్టడానికి బదులు ప్రజలకు మ రింత చేరువ చేయడం వల్ల సమాజంపై విపరీతమైన ప్రభావం చూపుతుందన్నారు. చౌకమద్యం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాం డ్ చేశారు. మద్యనిషేధ ఉద్యమ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ ఎవరైనా బాగా చదవాలని, బాగా పని చేయాలని ప్రోత్సహిస్తారని, కానీ, కేసీఆర్ అందరు బాగా తాగండంటూ ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ సారా వ్యతిరేక ఉద్యమం తో కాంగ్రెస్, మద్యనిషేధానికి తూట్లు పొడవడంతో టీడీపీలు ఓడిపోయాయని, చౌక మద్యా న్ని ఆపకపోతే ఈ ప్రభుత్వం కూడా మధ్యలోనే కూలిపోతుందన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా మద్యానికి వ్యతిరేకంగా సోదరులతో ప్రతిజ్ఞ చేయించుకొని రాఖీలు కట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజికవేత్త వసంత కన్నాబీరన్, చెరుకూరి గ్రూప్స్ చైర్మన్ రామారావు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, హైమావతి, జ్యోతి, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, ప్రముఖ రచయిత్రిలు ఓల్గా, కొండవీటి సత్యవతి, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, ఆప్ నేత నమ్రత, తెలుగు మహిళా నేత శోభారాణి పాల్గొన్నారు. -
తెలంగాణలో కొత్త మద్యం విధానం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది. జీహెచ్ ఎంసీ, మున్సిపాలిటీల్లో కొత్త మద్యం విధానం ఖరారు చూస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ పరిధిలో13 వేల జనాభా ఒక బార్ ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ పెట్టనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో బార్ లు కేటాయించారు. 30 వేల నుంచి 60 వేల జనాభా ఉంటే 2 బార్లు పెట్టనున్నారు. ప్రతి త్రిస్టార్ హోటల్ కు ఒక బార్ కేటాయించనున్నారు. డ్రా ద్వారా బార్లు కేటాయిస్తారు. -
'చీప్ లిక్కర్ తాగినా హాని ఉండదా..!
రాయికల్ (కరీంనగర్ జిల్లా): రాష్ట్రంలో చీప్లిక్కర్ ను ప్రోత్సహించడంపై సీఎల్పీ ఉపనేత తాటిపత్రి జీవన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని అన్ని పార్టీలు, ప్రజలు డిమాండ్ చేస్తుంటే తెలంగాణలో చీప్లిక్కర్ను ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. 'మద్యం బాటిళ్లపై మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిక ఉంటుంది. దీన్ని గ్రహించని కేసీఆర్ మాత్రం చీప్లిక్కర్ తాగితే ప్రాణానికి ఎలాంటి హాని ఉండదని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. గుడుంబాను నియంత్రించాలంటే చీప్లిక్కర్ను తాగాలని చెప్పడం సరికాదు. గీతకార్మికుల పొట్టకొట్టడం కోసమే సీఎం పన్నాగం చేస్తున్నారు. ఎక్సైజ్, పోలీసు శాఖల సహకారంతో గుడుంబాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చీప్లిక్కర్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మహిళా సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం' అని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి హెచ్చరించారు. -
'గ్రామజ్యోతి పథకాన్ని స్వాగతిస్తున్నాం'
కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్పై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గ్రామజ్యోతి' పథకాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మించాలన్నదే బీజేపీ డిమాండ్ అని అన్నారు. మహిళా సంఘాలతో చర్చించిన తర్వతనే ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. -
రోడ్ల పక్కన వైన్ కేఫ్లు.. మాల్స్లో బార్లు!
రాష్ట్రంలో ఏపీ తరహా మద్యం పాలసీ? •నూతన ఎక్సైజ్ విధానంపై విస్తృత చర్చ •60 దుకాణాల నిర్వహణకు సర్కారు నిర్ణయం •పాలసీపై 3 రకాల ఆప్షన్లు సిద్ధం చేస్తున్న అధికారులు •జిల్లాలవారీగా డీసీలు, ఈఎస్లతో •ఎక్సైజ్ కమిషనర్ భేటీ •నేడు టీఎస్బీసీఎల్ అధికారులతో సమావేశం హైదరాబాద్: రోడ్ల పక్కన వైన్ కేఫ్లు... షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్లలో బార్లు, మద్యం షాపులు! అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కనిపించనున్న దృశ్యాలివే!! మహారాష్ట్రను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ అందుబాటులో మద్యం’ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్తోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్ల పరిధిలో వైన్ కేఫ్లు, మల్టీప్లెక్స్లు, మాల్స్లలో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసే దిశగా కొత్త మద్యం విధానానికి మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాల్లో జనాభా, స్థానిక ఆర్థిక వనరులు, సామాజిక స్థితిగతులను బేరీజు వేసుకొని వైన్షాపులు పెంచాలని, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు హైవేలపై బార్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానాన్ని రూపకల్పనపై ఎక్సైజ్ యంత్రాంగం గురువారం నుంచి కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారులు అక్కడి విధానాలపై మేలోనే ఎక్సైజ్ కమిషనర్కు నివేదికలు అందజేశారు. మహారాష్ట్రలో అమలవుతున్న మద్యం విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే జూన్లో సీఎం సూచనల మేరకు సమగ్ర విధానం రూపకల్పన కోసం మూడు నెలలు గడువు కోరిన అధికారులు ప్రస్తుతం అదే పనిలోపడ్డారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలు, కొత్త వాటికిగల అవకాశాలు, వైన్ కేఫ్లు, మాల్స్లో బార్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్, బార్ల వివరాలను పరిశీలించారు. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, మండలాలవారీగా కొత్తగా వైన్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ కేఫ్లు, మాల్స్లలో బార్లు ఏర్పాటు చేయించే బాధ్యతలను అధికారులకు అప్పగించినట్లు సమాచారం. శుక్రవారం టీఎస్బీసీఎల్ అధికారులతో చంద్రవదన్ సమావేశం కానున్నారు. గ్రామీణ స్థాయికి మద్యం మహారాష్ట్రలో మూడు రకాల మద్యం లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఐఎంఎఫ్ఎల్, ఐఎంఎల్ మద్యంతోపాటు బీర్లు, వైన్, కంట్రీ లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఉంది. తాలూకా స్థాయిల్లో ఐఎంఎల్తోపాటు బీర్లు, వైన్, కంట్రీలిక్కర్ అందుబాటులో ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయితీలు, ప్రధాన రోడ్ల పక్కన వైన్, బీర్లనే విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వైన్ కేఫ్లను ఏర్పాటు చేయాలని, ఇందులో వైన్, బీర్లనే విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం తమ ప్రతిపాదనల్లో పేర్కొంది. గ్రామాల్లో కంట్రీ లిక్కర్(చీప్ లిక్కర్)తోపాటు బీర్లు అందుబాటులో ఉండేలా పాలసీలో మార్పులు చేయాలని, రాష్ట్రంలోని అన్ని వైన్షాపులు, బార్లలో చీప్ లిక్కర్ను 90 ఎంఎల్,180 ఎంఎల్ సీసాల ద్వారా విక్రయించాలని సూచించింది. సర్కారీ షాపులు 60కిపైగానే.. కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కుమ్ముక్కయిన మద్యం వ్యాపారులు కొన్ని చోట్ల వైన్షాపులు ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారని కమిషనర్ చంద్రవదన్ భావిస్తున్నారు. ఇటీవల వైన్షాపుల లెసైన్స్లను మూడు నెలలు పొడిగించగా 60 షాపుల వాళ్లు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోలేదు. దానికితోడు గ్రేటర్ హైదరాబాద్, దాని సరిహద్దుకు 5 కి.మీ. పరిధిలోని పెరిఫెరల్ ఏరియాల్లో వైన్షాపుల లెసైన్స్ ఫీజు రూ. 90 లక్షలు ఉండగా 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. ఇది కూడా వైన్షాపుల యజమానులు, ఎక్సైజ్ స్థానిక అధికారుల కుమ్ముక్కు ఫలితమేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో కనీసం 60 దుకాణాలను బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. -
ఇక మద్యంధరల నిర్ణయం కంపెనీలకే
-
మద్యం మత్తులో ముంచి సంక్షేమం సాధిస్తారా?
ఆంధ్రప్రదేశ్లో జూలై 1 నుండి నూతన ఎక్సైజ్ పాలసీని అనుసరించి మ ద్యం షాపులు ప్రారంభ మవుతున్నాయి. ప్రతియే టా ప్రభుత్వాలు మద్యం తయారీ డిస్టలరీ కంపెనీ లు, మద్యం షాపులు, బా ర్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, పబ్లు, రిసార్టులను పెంచుతూ అనుమతులు ఇస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 నిబంధన ప్రకారం మద్యాన్ని నిషేధించాలి. ఈ నిబంధన అమలులో భాగంగానే ఎక్సైజ్శాఖను స్థాపించారు. కానీ ప్రస్తుతం ఎక్సైజ్శాఖ మద్యం అమ్మకాలను పెంచి ఆదాయాన్ని సమకూర్చే శాఖగా మారిపో యింది. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, ప్రభుత్వం నడవాలన్నా మ ద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానం అంటున్నారు. పేద ప్రజలారా! మీరు తాగితేనే మీ కుటుంబానికి బియ్యం, మీ ఊరికి రోడ్లు, మీ పిల్ల లకు స్కాలర్షిప్లు, మీరు తాగి చస్తేనే దేశానికి, రాష్ట్రానికి ఆదాయం అంటున్నారు పాలకులు. వాస్తవానికి మద్య నిషేధాన్ని అమలు చేస్తేనే ప్రజల దగ్గర కొంత డబ్బు మిగులుతుంది. అది పొ దుపు మొత్తాల ద్వారా, మార్కెట్ ద్వారా ప్రభుత్వం దగ్గరికే వస్తుంది. బడా పారిశ్రామికవేత్తలు, వర్తకు లు, సినీ తారలు ఎగ్గొట్టే పన్నులు వసూళ్లు చేస్తే, మంత్రులు చేసే స్కాములను నియంత్రిస్తే, మల్టీ నేషనల్ కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వడం మానేస్తే, విలువైన అటవీ సంపదను అతి తక్కువ ధరకు లీజు కు ఇవ్వటం నిలిపివేస్తే, స్విస్ బ్యాంకుల్లోని నల్లధ నాన్ని రప్పిస్తే... లక్షల కోట్ల ఆదాయం ఉంటుంది. ఇంకా చాలా రకాలుగా దేశ సంపద తరలిపోవడాన్ని అరికడితే మనమే ప్రపంచ బ్యాంకుకు అప్పు ఇవ్వ వచ్చు. ఇలాంటి చర్యలు మన పాలకులు చేయరు. ఎందుకంటే వీటన్నిటిలో వీరికి భాగం ఉంటుంది. బ్రిటిష్ వలసవాదులు మద్యపానాన్ని ఆదాయ వనరుగా మలిచారు. 1872లో మొదటిసారిగా దుకా ణాల వేలంపాటల పద్ధతిని ప్రవేశపెట్టారు. స్వాతం త్య్రోద్యమంలో మద్యనిషేధం కూడా ఒక నినాద మైంది. కానీ 1970 కల్లా దేశంలో అక్కడక్కడా ఉన్న మద్యనిషేధాన్ని కూడా ఎత్తివేశారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 1980 ప్రాంతంలో ఎన్.టి.ఆర్. వారుణి వాహిని పేరుతో సారాను విస్తృతంగా పారించాడు. అదే కాలంలో నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న కరీంనగర్, ఆది లాబాద్, నార్త్ తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మ కాలను నియంత్రించారు. చాలా మంది మద్యం వ్యాపారాన్ని మానుకున్నారు. దీంతో పోలీసు స్టేషన్లే సారా దుకాణాలయ్యాయి. 1991-94 మధ్య కాలం లో నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రభంజనంలా ముందుకొచ్చింది. చీపురు, కారం పొడి, నిప్పు మూడు ప్రధాన ఆయుధాలతో ఉద్య మాన్ని మహిళలు ముందుండి నడిపారు. ప్రతిప క్షంలో ఉన్న ఎన్టీఆర్ తనకు ఓటేస్తే సారా నిషేధిస్తా నని హామీ ఇచ్చాడు. మహిళల ఓట్లతో గెలిచిన ఎన్టీఆర్ సంవత్సర కాలం మద్యనిషేధాన్ని అమ లు చేశాడు. 1995లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే సి గద్దెనెక్కిన చంద్రబాబు మద్యనిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడిందని, సంక్షేమ పథకాలు అమలుకు మద్యం అమ్మకాలు తప్పనిసరి అని విస్తృ తంగా ప్రచారం చేసి మద్యనిషేధాన్ని ఎత్తేశాడు. 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు బెల్టు షాపు లను రద్దు చేస్తానని హామీనిచ్చాడు. ప్రమాణ స్వీకా రం రోజు ఫైల్పై సంతకం కూడా చేశాడు. కానీ అదే నెలలో ప్రకటించిన ఎక్సైజ్ పాలసీలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని రూ.12,000 కోట్లకు పెంచాలని టార్గెట్ నిర్ణయించాడు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నేటివరకు తెలుగు సమాజం మద్యనిషేధా నికి అనుకూలంగా పోరాడుతూనే వచ్చింది. ప్రస్తు తం భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడుతున్న ప్రజలు.. జనతన సర్కార్లను ఏర్పాటు చేసుకున్న ప్రాంతాల్లో అక్కడి విప్లవ ప్రజాకమిటీలు సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బలమైన ఉద్యమాల ద్వారానే సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేసుకోగలుగుతాము. ఆ విధంగా ముందు తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందిద్దాం. -
మద్యం దుకాణాలకు 65,174 దరఖాస్తులు
ఒక్క దరఖాస్తూ రానివి 354 షాపులు దరఖాస్తుల రూపంలో రూ.224 కోట్లు ఆదాయం రాజధాని ప్రాంతమైన గుంటూరులో అత్యధికంగా దరఖాస్తులు లక్కీ వైన్స్కు నేడే కలెక్టర్ల సమక్షంలో లాటరీ ఒక్క దరఖాస్తూ రాని షాపులకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో లక్కీ వైన్స్కు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,478 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 3,124 మద్యం దుకాణాలకు 65,174 దరఖాస్తులు అందాయి. ఒక్క దరఖాస్తు కూడా రాని దుకాణాలు 354 ఉన్నాయి. ఆదివారం తెల్లవారు జాము వరకు కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల ఫీజు కింద రూ.224 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరింది. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఉన్న 515 దుకాణాల్లో 49 దుకాణాల్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇక్కడ దరఖాస్తులు స్వీకరించలేదు. ఎక్సైజ్ కమిషనర్ రాసిన లేఖపై సోమవారం ఎన్నికల సంఘం నుంచి వివరణ రానుంది. ఈ రెండు జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ జారీ చేస్తే దరఖాస్తుల రూపంలో ఆదాయం రూ.250 కోట్లు దాటుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదట ముగిసిన తర్వాత 743 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. ఈ దఫా లెసైన్సు కాలపరిమితి రెండేళ్లు కావడంతో పోటీ ఎక్కువగానే ఉంది. నడికుడి దుకాణానికి అత్యధికంగా 354 దరఖాస్తులు రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే రాజధాని ప్రాంతమైన గుంటూరులో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. 11,548 దరఖాస్తులు అధికారికంగా ప్రకటిస్తున్నా.. పెదకూరపాడు, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఇంకా దరఖాస్తుల క్రోడీకరణ ప్రక్రియ పూర్తి కానట్లు సమాచారం. దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కేవలం నాలుగు షాపులకు మాత్రమే దరఖాస్తులు రాలేదు. ఈ ఒక్క జిల్లా నుంచే రూ.35 కోట్ల దరఖాస్తు ఫీజు వచ్చింది. నడికుడి దుకాణానికి గతంలో 223 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 354 దరఖాస్తులు అందాయి. అడిగొప్పులకు 248 దరఖాస్తులు అందాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమగోదావరి జిల్లాల్లో 11,162 దరఖాస్తులు అందాయి. కడప జిల్లాలో అత్యల్పంగా 190 దుకాణాలకు 2,161 దరఖాస్తులు అందాయి. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క దరఖాస్తూ రాని షాపులు అధికం ఒక్క దరఖాస్తు రాని షాపులు రాష్ట్రం మొత్తం 354 ఉంటే, అధికంగా చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్నాయి. చిత్తూరులో 90 షాపులకు, పశ్చిమగోదావరిలో 32 షాపులకు ఒక్క దరఖాస్తు రాలేదు. ఈ రెండు జిల్లాల్లో జనాభా కంటే తక్కువగా గతం నుంచి షాపులను నోటిఫై చేస్తున్నారు. ప్రతి 12 వేల జనాభాకు ఒక మద్యం షాపు నోటిఫై చేయాల్సి ఉండగా, చిత్తూరు జిల్లాలో ప్రతి ఏడు వేల మంది జనాభాకు ఓ షాపు, పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి 9 వేల మంది జనాభాకు ఓ షాపు కేటాయించడం వల్ల ఇక్కడ ఎక్కువగా షాపులకు అసలు దరఖాస్తులు అందలేని అబ్కారీ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగిల్ దరఖాస్తులు వచ్చిన షాపులు కృష్ణా జిల్లాలో 29 వరకు ఉన్నాయి. ఒక్క దరఖాస్తు రాని దుకాణాలకు మళ్లీ నోటిఫికేషన్: కమిషనర్ శ్రీనివాస శ్రీ నరేష్ రాష్ట్రంలో ఒక్క దరఖాస్తు రాని దుకాణాలకు సోమవారం మరో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీ నరేష్ తెలిపారు. సింగిల్ దరఖాస్తులు వచ్చిన షాపులను దరఖాస్తు చేసిన వారికే కేటాయిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆయా జిల్లాల్లో కలెక్టర్ల సమక్షంలో లాట్ల విధానంలో లాటరీ తీసి షాపులకు ప్రొవిజనల్ లెసైన్సు కేటాయించనున్నట్లు వివరించారు. జిల్లాల వారీగా అందిన దరఖాస్తులు శ్రీకాకుళం 202 4,516 విజయనగరం 179 3,512 విశాఖపట్టణం 329 5,846 తూర్పుగోదావరి 410 6,800 పశ్చిమగోదావరి 400 11,162 కృష్ణా 294 6,995 గుంటూరు 303 11,548 నెల్లూరు 291 5,800 చిత్తూరు 320 3,048 అనంతపురం 206 3,786 వైఎస్సార్ జిల్లా 190 2,161 మొత్తం 3,124 65,174 నోటిఫై చేసిన మద్యం షాపులు - 3,478 ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలు - 387 ఒక్క దరఖాస్తు రాని దుకాణాల సంఖ్య - 354 (కర్నూలు, ప్రకాశం జిల్లాలను మినహాయించి). -
ఎక్సైజ్ పాలసీపై చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. వేలం ధర, షాపుల కేటాయింపులు, లీజు ధరలు పాత విధానం ప్రకారమే ఉండాలని నిర్ణయించారు. ఏపీలో మొత్తం ఏడు వేలకు పైగా షాపులకు వేలం నిర్వహించనున్నారు. గత ఏడాది ఆదాయం కంటే ఈ ఏడాది అదనంగా 10 శాతం సమకూర్చుకోవాలని ఎక్సైజ్ శాఖ ఈ సమీక్షలో నిర్ణయం తీసుకుంది. -
జూలై 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ
* ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు మంత్రి పద్మారావు ఆమోదం * ముఖ్యమంత్రి వద్ద ఫైలు, ఆమోదమే తరువాయి * వైన్షాపుల పెంపు, చౌక మద్యం విక్రయాలకు మొగ్గు * రెవెన్యూ లక్ష్యం రూ. 12,227 కోట్లు * కల్తీ మద్యం, బెల్టుషాపులను నిర్మూలిస్తామన్న ఎక్సైజ్ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో నాటుసారా (గుడుంబా)ను అరికట్టడం, బెల్టుషాపులను ఎత్తివేయడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 12,227 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని సాధించే దిశగా విధివిధానాలను రూపొందించింది. ప్రస్తుత విధానంలోని లోటుపాట్లను వివరిస్తూ.. మహారాష్ట్రలో అమల్లో ఉన్న దేశీదారూ తరహాలో చౌక మద్యాన్ని వైన్షాపుల ద్వారా విక్రయించడం, జనాభాను బట్టి మద్యం దుకాణాలను పెంచడం వంటి ప్రతిపాదనలను తయారుచేసింది. మద్యంతో సంబంధం లేకుండా సారాను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదననూ రూపొందించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను ఆర్నెల్లుగా అధ్యయనం చేసిన అనంతరం వాటి లోటుపాట్లనూ పరిశీలించి అధికారులు ఈ నివేదికలను రూపొందించారు. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు ఆ శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ ఆమోదం తెలిపారు. దీంతో వాటిని సీఎం పరి శీలనకు పంపారు. ఈ నెల తొలివారంలో సీఎం ఆమోదం లభించిన వెంటనే జూలై 1 నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలు కానుంది. చౌక మద్యానికి సర్కారు మొగ్గు కొద్ది నెలల క్రితం సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో విచ్చలవిడి గుడుంబా అమ్మకాలపై ఫిర్యాదులందాయి. గుడుంబాకు బదులుగా మహారాష్ట్రలో విక్రయిస్తున్న దేశీదారూ తరహాలో తక్కువ ధర మద్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ఆయన భావిం చారు. ఈ మేరకు మంత్రి పద్మారావు, అధికారులతో పలుమార్లు సమావేశమై చర్చించారు. ఎక్సైజ్ అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదికలు అందించారు. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ మహారాష్ట్రలో పర్యటించి దేశీదారూ అమ్మకాల వివరాలను తెలుసుకున్నారు. అక్కడ రెగ్యులర్ మద్యం అమ్మకాల కన్నా దేశీదారూ వల్లే ఎక్కువ రెవెన్యూ వస్తోందని తేలింది. ఈ నేపథ్యంలో చౌక మద్యం, 10 వేల జనాభాకు ఓ మద్యం దుకాణం ఏర్పాటు, లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ఫీజులను రెగ్యులరైజ్ చేయడం తదితర అంశాలతో కొత్త మద్యం విధానం ఉండాలని ఎక్సైజ్ శాఖ తేల్చినట్లు సమాచారం. ఈ విధానంతో వచ్చే రెవెన్యూ వివరాలనూ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. సీఎం కూడా ఇందుకు సానుకూలంగా ఉండటంతో కొత్త విధానాన్ని ఈ వారంలోనే ఆమోదించే అవకాశముంది. రాష్ట్రంలో నాటుసారా తయారీ, బెల్టు షాపులు ఉండకూడదన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే నూతన విధానాన్ని రూపొందించినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. -
కొత్త పాలసీ.. పాత పద్ధతి!
జూలై నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానం స్వల్ప మార్పులతో పాత పద్ధతిలోనే మద్యం అమ్మకాలు ఇతర రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీపై అధికారులతో అధ్యయనం అధికారులతో సమాలోచనలు జరిపిన కమిషనర్ చంద్రవదన్ హైదరాబాద్: రాష్ర్టంలో మద్యం అమ్మకాలు స్వల్ప మార్పులతో పాత పద్ధతిలోనే సాగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీలో ఉన్న కొన్ని లోటుపాట్లను సవరించి, ఆదాయాన్ని మరింతగా పెంచుకునేలా కొత్తపాలసీని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్సైజ్ శాఖ 2013-14 ఆర్థిక సంవత్సరం కన్నా 2014-15లో పదిశాతం మేర అదనపు రెవెన్యూ సాధించి రూ. 10,230 కోట్లు ఖజానాకు జమ చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని 20 శాతం మేర పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సంవత్సరం జూన్30తో ముగుస్తుండగా, జూలై 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు చేయాల్సి ఉంది. తమిళనాడు తరహాలో రిటైల్(వైన్స్) వ్యాపారాన్ని ఎక్సైజ్శాఖ ద్వారా నిర్వహించాలని ఏపీ నిర్ణయించి న నేపథ్యంలో తెలంగాణలో మద్యం విధానం ఎలా ఉండాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచనలు చేసింది. ఈ నేపథ్యంలో చండీగఢ్, హరియాణా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలకు వెళ్లిన అధికారులు అక్కడ అమలవుతున్న మద్యం విధానంపై అధ్యయనం చేసి నివేదికను అందజేశారు. ఆయా రాష్ట్రాల్లో రిటైల్ వైన్షాపుల నిర్వహణ, లెసైన్స్ ఫీజు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ బై ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంటు తీరు, సారా, చీప్ లిక్కర్ పరిస్థితితో పాటు వస్తున్న రెవెన్యూ, ఆదాయపు పన్ను చెల్లింపు తదితర అంశాలను నివేదికలో పొందుపరిచారు. ఇటీవలే రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన అధికారులు, టీఎస్బీసీఎల్ అధికారులతో సమావేశమైన కమిషనర్ చంద్రవదన్ కొత్త మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సొంతంగా రిటైల్ వ్యాపారం... తక్కువ ధర మద్యంతో నష్టం: తమిళనాడులో ప్రభుత్వమే మద్యం రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్నా, మూడు విభాగాల ద్వారా అది సాగుతుంది. ఏపీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబించాలని భావించినా... అక్కడ కూడా జూలై నుంచి అమ్మకాలు సాధ్యం కాదని భావిస్తున్నారు. అలాగే తెలంగాణలోనూ సాధ్యం కాదని, ప్రభుత్వానికి నష్టమని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక తక్కువ ధరలో మద్యం (చీపెస్ట్ లిక్కర్) అమ్మకాల వల్ల రిటైల్ మద్యం దుకాణాల్లో రెవెన్యూ పడిపోతుందని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు తేల్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లెసైన్స్ ఫీజుల్లో మార్పులు, ప్రివిలేజ్ ఫీజు తొలగింపు వంటి అందరికీ ఆమోదమైన స్వల్ప మార్పులతో ఇప్పుడున్న మద్యం విధానాన్నే కొనసాగించాలని అధికారులు సూచించినట్లు సమాచారం. -
'బార్'లు ఇక బార్లా తెరుచుకోనున్నాయ్!
-
కొందరికి చెక్.. మరికొందరికి లక్
ప్రశాంతంగా ముగిసిన డ్రా 202 లిక్కర్షాపులకు లాటరీ ప్రభుత్వ ప్రతినిధులుగా ఏజేసీ, డీఆర్వో వరంగల్ క్రైం : జిల్లాలో మద్యం వ్యాపారులకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కొందరు కొత్త వ్యాపారులకు ఈ దఫా మద్యం షాపులు దక్కగా.. మెజారిటీ షాపులు మాత్రం పాతవారినే వరించినట్లు తెలుస్తోంది. హన్మకొండ ఎన్జీవోఎస్ కాలనీలోని రెడ్డి ఫంక్ష న్ హాల్లో వరంగల్, మహబూబాబాద్ ఎక్సైజ్ యూనిట్లకు సంబంధించి షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించారు. జిల్లాలో మొత్తం 234 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో వరంగల్ ఎక్సైజ్ యూనిట్లో 113 దుకాణాలు ఉండగా, మహబూబాబాద్ యూనిట్లో 121 దుకాణాలు ఉన్నాయి. షాపులను దక్కించుకునేందుకు 3030 దరఖాస్తులు వ్యాపారుల నుంచి వచ్చాయి. ఎక్సైజ్ అధికారుల భారీ బందోబస్తు మధ్య ఆయా దుకాణాల కేటాయింపు ప్రకియను పూర్తి చేశారు. అడిషనల్ జేసీ, డీఆర్వో సమక్షంలో డ్రా... మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ అడిషనల్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేంద్రకరణ్ సమక్షంలో జరిగింది. రెడ్డి ఫంక్షన్ హాల్లోని స్టేజీపైన రెండు షాపులకు సంబంధించి కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను కొనసాగించారు. వరంగల్ యూనిట్లో ఏజేసీ కృష్ణారెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, ఏఈఎస్ విజ యశంకర్ లాటరీ ప్రక్రియను కొనసాగించగా, మరోవైపు మహబూబాబాద్ యూనిట్కు సంబంధించి డీఆర్వో సురేంద్రకరణ్, మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయశేఖర్, ఏ ఈఎస్ శ్రీనివాసరావు లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. అయితే ఒకే స్టేజీపైన రెండు యూనిట్లకు సంబంధించి లాటరీ లు నిర్వహించడంతో మైకుల మోతతో కొంత ఇబ్బంది ఏర్పడింది. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఎక్సైజ్ స్టేషన్లకు సంబంధించిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. వారితోపాటు రెండు స్క్వాడ్లకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొదటగా సింగిల్ దరఖాస్తులు.. తొలుత జిల్లావ్యాప్తంగా ఒకేఒక్క దరఖాస్తు వచ్చిన దుకాణాల ను ఎంచుకున్నారు. ఇలా వరంగల్ యూనిట్ పరిధిలో 8 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది. మహబూబాబాద్ యూనిట్ పరిధిలో 17 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు దాఖలైం ది. రెండు యూనిట్ల పరిధిలో 7 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మిగతా 202 షాపులకు సంబంధించి ఒక్కో దు కాణానికి 8 నుంచి 19 వరకు దరఖాస్తులు వచ్చాయి. లాటరీ పద్ధతి ద్వారా ఎంపికైన మద్యం వ్యాపారిని కన్ఫర్మేషన్ ఫామ్లో సంతకం చేయించి బ్యాంకులో డబ్బులు చెల్లించేందుకు అనుమతించారు.రెడ్డి ఫంక్షన్ హాల్లోనే మరో పక్క బ్యాంకు కౌంటర్ ను ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలు పొందిన వారు 10 శాతం ఈఎండీ పోను మిగతా 1/3వ వంతు మొత్తాన్ని చెల్లించారు. దీంతోపాటు పర్మిట్ గదులకు కూడా రూ.2 లక్షలు వెంటనే చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. త్వరలోనే రీ-షెడ్యూల్... దరఖాస్తులు రాని దుకాణాలకు త్వరలోనే రీ-షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి తెలిపారు. జిల్లాలో 7 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. వరంగల్ ఎంజీఎం సెంటర్లోని ఒక మద్యం దుకాణం, జన గామ మండలం పెంబర్తిలోని మరో దుకాణానికి వరంగల్ యూనిట్లో దరఖాస్తులు రాలేదు. అలాగే మానుకోట పరిధిలోని చల్వాయి, కమలాపూర్, భూపాల్పల్లిలో రెండు, పరకాలలో ఒక దుకాణానికి దరఖాస్తులు రాలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మళ్లీ స్వల్ప మార్పులతో మద్యం వ్యాపారుల వద్ద నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. నేడు ఈఎండీ చెల్లింపులు.. మద్యం దుకాణాలు పొందని వ్యాపారులు తాము చెల్లించి న 10 శాతం ఈఎండీలను మంగళవారం మధ్యాహ్నం నుం చి చెల్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఆయా షాపులకు కేటాయించిన లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా డీడీ తీయడంతోపాటు దరఖాస్తు కోసం రూ.25 వేలు చెల్లించారు. రూ.25 వేలు నాన్రిఫండబుల్గా ఉండగా 10 శాతం ఈఎండీని మంగళవారం ఉదయం 11 నుంచి హన్మకొండ హౌసింగ్ బోర్డులోని ఎక్సైజ్ కార్యాలయంలో చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
కొత్త సీసాలో.. పాత మద్యమే!
శ్రీకాకుళం క్రైం: పాత సీసాలో కొత్త మద్యం.. అంటే ఏమిటో ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త ఎక్సైజ్ విధానం తేటతెల్లం చేయనుంది. సోమవారం ఈ కొత్త విధానాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాత, కొత్త విధానాల మధ్య పెద్ద తేడా లేదని తెలిసింది. రెండు శ్లాబుల లెసైన్స్ ఫీజు మాత్రమే మార్చారు. దీంతో కొత్త ఎక్సైజ్ విధానం ఎలా ఉంటుందోనని గత కొద్దిరోజులుగా టెన్షన్కు గురవుతున్న మద్యం వ్యాపారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వల్ప మార్పులతో సరి జిల్లా వ్యాప్తంగా 232 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి వీటిని మూడు శ్లాబులుగా విడదీసి లెసైన్స్ ఫీజు నిర్ణయించేవారు. 2011 వరకు టెండర్ల ద్వారా షాపులను కేటాయించేవారు. 2012లో లాటరీ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. అప్పట్లో రూ.32.50 లక్షలు, రూ.34 లక్షలు, రూ.42 లక్షలుగా మూడు శ్లాబులు నిర్ణయించారు. వాటి పరిధిలో ఉన్న మద్యం దుకాణాలకు అసక్తిగల వారు రూ.25వేలు డీడీ తీసి లాటరీలో పాల్గొనేవారు. బినామీ పేర్లతో నచ్చినన్ని దరఖాస్తులు దాఖలు చేసేవారు. కాగా ఈ ఏడాదికి ప్రకటించనున్న కొత్త విధానంలో స్వల్ప మార్పులు మాత్రమే చేశారు. మూడు శ్లాబుల్లో రెండింటి లెసైన్సు ఫీజులనే పెంచారు. రూ.32.50 లక్షల శ్లాబ్ను అలాగే ఉంచారు. రూ.34 లక్షల శ్లాబ్ను రూ.36 లక్షలకు, రూ.42 లక్షల శ్లాబ్ను రూ.45 లక్షలకు పెంచారు. బెల్ట్ దుకాణాల మూసి వేస్తామని సర్కారు ఇచ్చిన హామీ కారణంగా లెసైన్సు ఫీజును పెద్దగా పెంచలేదని చెప్పుకొనేందుకే ఈ ప్రయత్నమని తెలుస్తొంది. కాగా బార్లకు సంబంధించి ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. లెసైన్సు ఫీజు ఎంత పెంచాలన్నదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. బహుశా సోమవారం సాయంత్రానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. బెల్ట్ తీయటం కష్టమే! అధికారంలోకి వస్తే బెల్ట్ దుకాణాలను పూర్తిగా మూసివేయిస్తామని ఎన్నికల సందర్భంగా టీడీపీ హామీ ఇచ్చింది. కొత్త ఎక్సైజ్ పాలసీని పరిశీలిస్తే అది అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. గత పాలసీకి ఈ పాలసీకి పెద్దగా మార్పులు లేవు. పైగా రెండు శ్లాబ్ల లెసైన్స్ ఫీజులను కొద్దిగా పెంచారు. ప్రస్తుతం బెల్ట్ దుకాణాల ఉండటంతో మద్యంవ్యాపారులు తమ వ్యాపారాలను లాభసాటిగా మలచుకున్నారు. బెల్ట్ దుకాణాలను మూసివేస్తే అన్ని లక్షలు ఖర్చుపెట్టి వ్యాపారం చేయటం కష్టమని వ్యాపారులు అంటున్నారు. బెల్ట్ దుకాణాలు తీసేస్తేమంటున్నారు కనుక గత లెసై న్సు ఫీజుల కంటే ఈ కొత్త పాలసీలో ఫీజు తగ్గుతుందన్న భావనలో మద్యం వ్యాపారులు ఉన్నారు. కాని రెండు శ్లాబుల్లో లెసైన్సు ఫీజును పెంచుతూ కొత్త పాలసీ ప్రకటిస్తున్నందున బెల్ట్ దుకాణాలను యాథావిధిగా నడిపే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. -
త్వరలో కొత్త ఎక్సైజ్ పాలసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. బెల్టుషాపులను తొలగించేందుకు గ్రామ, మండల కమిటీలను నియమిస్తామని చెప్పారు. చేనేత రుణాలు 100 కోట్ల రూపాయల వరకు మాఫీ చేయవలస ఉందన్నారు. త్వరలోనే ఈ రుణాల మాఫిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. -
లక్కెవరిదో..?
- లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు - 315 దుకాణాల లెసైన్స్లకు నోటిఫికేషన్ - కరీంనగర్లో అత్యధిక ఫీజు రూ.42 లక్షలు - దరఖాస్తు గడువు 21.. డ్రా 23.. లెసైన్స్ జారీ 30 - జూలై నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలు కరీంనగర్ క్రైం: 2014-15 సంవత్సరానికి జిల్లాలోని 315 మద్యం దుకాణాల కేటాయింపునకు ఆదివారం నోటిఫికేషన్ వెలువడింది. జనాభా లెక్కన దుకాణాలను మూడు స్లాబులుగా విభజించి నోటిఫికేషన్ జారీ చేశారు. లాటరీ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు ఏడాది కాలంపాటు షాపులు నిర్వహించుకునేందుకు లెసెన్స్లు ఇస్తారు. సోమవారం నుంచి జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉం టాయని అధికారులు తెలిపారు. ఒక్కో ఫారం ధర రూ.25 వేలు. దరఖా స్తు చేసుకోవడానికి ఈనెల 21న సాయంత్రం 5 గంటల వరకు గడువుం ది. వచ్చిన దరఖాస్తులను 23న ఉదయం 11 గంటల నుంచి కలెక్టర్ అ ధ్వర్యంలో లాటరీ తీసి దుకాణాలు కేటాయిస్తారు. ఈ నెల 24 వరకు ప్రొవిజన్ లెసైన్స్లు జారీ చేసి, 30న లెసైన్స్లు జారీ చేస్తారు. దుకాణా లు పొందిన వ్యాపారులు జూలై ఒకటో తేదీ నుంచి మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు. శాశ్వత లెసైన్స్ ఫీజు 10వేల లోపు జనాభా ఉంటే రూ.32.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ.42 లక్షలు, 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.50 లక్షలుగా ధర నిర్ణయించారు. ఇతర జిల్లాల కంటే కరీంనగర్ జిల్లాలో 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉన్న మద్యం దుకాణాలకు రూ.4 లక్షలు అదనంగా ధర నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల జనాభాలోపే ఉండటంతో అత్యధిక లెసైన్స్ ఫీజు రూ.42 లక్షలుగా ఉండనుంది. గతంలో వసూలు చేసిన 14.01 శాతం ప్రివిలేజ్ టాక్స్ను ఈసారి 13.6 శాతానికి తగ్గించారు. అధిక ధరలకు అమ్మకాలు చేసే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.లక్ష, రెండోసారికి రూ.రెండు లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే దుకాణం లెసైన్స్ను రద్దు చేస్తారు. అమ్ముడు పోయేనా..? 2013-14 సంవత్సరానికి 315 దుకాణాలకు గాను 267 దుకాణాలకే దరఖాస్తులు వచ్చాయి. 48 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. చివరకు ఎక్సైజ్ శాఖ ఏడాది కాలంలో పదిసార్లు నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా వాటిలో సగం దుకాణాలను కూడా తీసుకోవడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. ఈసారైనా అన్ని దుకాణాలు దరఖాస్తులు వస్తాయా లేదా అని అధికారులు మదనపడుతున్నారు. -
ఇకపై మద్యం అమ్మకాలకు కంప్యూటర్ బిల్లింగ్
-
అదృష్టం ఎవరిదో...!
- లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు - మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం - ఫిక్స్డ్ లెసైన్స్డ్ పద్ధతిపై మద్యం షాపులు - 142 దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్ - ఎక్సైజ్ అధికారులకు మార్గదర్శకాలు జారీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 2014-15 ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇప్పటి వరకు నడుస్తున్న విధానానికే సర్కారు పచ్చజెండా ఊపింది. ఫిక్స్డ్ లెసైన్స్డ్ ఫీజు పద్ధతిన దుకాణాలను కేటాయించేందుకు సిద్ధమైంది. మద్యం ుకాణాలను పొందేందుకు ఆసక్తి చూపేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అందులో ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ తదితర ప్రాంతాల్లో 142 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా అప్పగించేందుకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు అబ్కారీ శాఖ జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందినట్లు తెలిసింది. నేడో రేపో 2014-15 సంవత్సరానికి గాను టెండర్లు నిర్వహించే నోటిఫికేషన్ కూడా విడుదల కానుండటంతో మద్యం వ్యాపారుల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. జనాభా ప్రాతిపదికన లెసైన్స్ ఫీజు లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనుండటంతో ఎక్సైజ్ కొత్త పాలసీలో అదృష్టం ఎవరిని వరిస్తుందనే చర్చ జరుగుతోంది. 2013 జూన్ 27న 2013-14 సంవత్సరానికి గాను మద్యం టెండర్లు జరగ్గా.. ఈ ఏడాది జూలైలో కొత్త దుకాణాల ద్వారా ఆదాయం పొందాలని సర్కారు భావిస్తోం ది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో దుకాణాల కేటాయింపు ప్రక్రియ ముగించాలని ఎక్సైజ్ అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిసింది. గతేడాది 142 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 125 దుకాణాలకే 1,538 దరఖాస్తులు వచ్చాయి. మరో 24 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రాగా.. మొత్తం 101 షాపులను లాటరీ ద్వారా కేటాయించారు. ఈ సారీ 142 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన ఆరు శ్లాబుల్లో ఫిక్స్డ్ లెసైన్స్డ్ పద్ధతిని అమలు చేయనున్నారు. 10 వేల వరకు జనాభా ఉంటే రూ.32.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేలలోపు రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా వరకు రూ.42లక్షలు ఒక్కో దుకాణానికి లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుం ది. 3 లక్షల జనాభా నుంచి 5 లక్షల లోపు ఉంటే రూ.50 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల లోపుంటే రూ.68 లక్షలు, 20 లక్షల పైన జనాభా ఉంటే రూ.90 లక్షల లెసైన్స్ ఫీజు చెల్లించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ధర్పల్లి దుకాణంపై మళ్లీ గురి! 2014-15 ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మద్యం వ్యాపారులు మళ్లీ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సిండికేట్గా అధిక శాతం దుకాణాలను కైవసం చేసుకునేందుకు అత్యధికంగా మద్యం విక్రయా లు జరిగే దుకాణాలను ఎంచుకుంటున్నారు. ఆయా దుకాణాలపై అత్యధికంగా దరఖాస్తులను వేసి సిండికేట్కే ఆ దుకాణాలు దక్కేలా ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు. గతేడాది మొత్తం 142 దుకాణాలకు 125 షాపులకే వ్యాపారులు ముందుకు వచ్చారు. అయితే అత్యధికంగా ధర్పల్లి మద్యం దుకాణానికి 131 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్లోని సుభాష్నగర్ షాపునకు 51 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో 101 దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించిన అధికారులు.. మిగిలిన 17 షాపుల కోసం ఐదారుసార్లు నోటిఫికేషన్ వేసినా ఎవరూ ముందుకు రాలే దు. అయితే ఈసారి కూడ అధిక మొత్తంలో మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉన్న దుకాణాలు మిన హా.. తక్కిన షాపులకు పోటీ ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా త్వ రలో మద్యం దుకాణాలకు నో టిఫికేషన్ విడుదల కానుండ గా.. అదృష్టం ఉంటేనే ఆశించి న షాపులు దక్కనున్నాయి. -
తెలంగాణ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ