Fighter jets
-
గర్వించేలా గణతంత్రం
న్యూఢిల్లీ: భారత సైనిక శక్తిని, ఆయుధ పాటవాన్ని, సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాల ప్రదర్శన, జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. ‘సశక్త్ ఔర్ సురక్షిత్’ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఆదివారం జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖుల పాల్గొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో కలిసి రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్కు చేరుకున్నారు. త్రివిధ దళాల సైనికులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రారంభమైంది. మొదట లెఫ్టినెంట్ అహన్కుమార్ నేతృత్వంలో 61 కావల్రీ సైనిక బృందం ముందుకు సాగింది. జాట్ రెజిమెంట్, గర్వాల్ రైఫిల్స్, మహర్ రెజిమెంట్, జమ్మూకశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ వంటి దళాల కవాతు ఆకట్టుకుంది. దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమం, సాధికారతను కళ్లకు కడుతూ పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ థీమ్తో 31 శకటాలను ప్రదర్శించారు. వైమానిక దళానికి చెందిన 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను అలరించాయి. 10 వేల మంది ప్రత్యేక అతిథులు రిపబ్లిక్ డే పరేడ్కు ప్రముఖులు సహా 10 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో వివిధ గ్రామాల సర్పంచ్లు, విపత్తు సహాయక చర్యల సిబ్బంది, ఆశా వర్కర్లు, పారా ఒలింపిక్ అథ్లెట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కృషి సఖీలు, ఉద్యోగ్ సఖీలు తదితరులు ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పేటెంట్ హోల్డర్లు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరంతా జాతీయ యుద్ధ స్మారకం, పీఎం సంగ్రహాలయ్ తదితర కట్టడాలను సైతం సందర్శించారు. నాలో ఇండియన్ డీఎన్ఏ సుబియాంటో సరదా వ్యాఖ్యలు ఆహ్లాదంగా ‘ఎట్ హోమ్’గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండొనేసియా అధ్యక్షుడు సుబియాంటో గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విందు ఆసాంతం సరదా సరదాగా సాగింది. తనకు భారతీయ మూలాలున్నాయని ఈ సందర్భంగా సుబియాంటో చెప్పారు. ‘‘కొన్ని వారాల క్రితమే జెనెటిక్ సీక్వెన్సింగ్, డీఎన్ఏ పరీక్షలు చేయించుకున్నా. నాలో ఇండియన్ డీఎన్ఏ ఉన్నట్లు తేలింది. భారతీయ సంగీతం విన్నప్పుడల్లా నేను డ్యాన్స్ చేస్తానని అందరికీ తెలుసు. నాలోని ఇండియన్ జీన్స్లోనే భారతీయ సంగీతం, నృత్యం దాగున్నాయి’’ అని సుబియాంటో చెప్పడంతో అతిథులంతా హాయిగా నవ్వేశారు. తమ భాషలో చాలా భాగం సంస్కృతం నుంచే వచ్చిందిన సుబియాంటో ఈ సందర్భంగా అన్నారు. తమ దేశంలో పేర్లు చాలావరకు సంస్కృతంలోనే ఉంటాయని చెప్పారు. తమరోజువారీ జీవితాల్లో భారతీయ ప్రాచీన నాగరికత ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు. భారత్, ఇండొనేసియా మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని ఆయన గుర్తు చేశారు. మోదీ తలపాగా గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఎరుపు, పసుపు రంగు గీతలతో కూడిన తలపాగా ‘సఫా’ను ధరించారు. దాంతోపాటు తెల్లరంగు కుర్తా–పైజామా, దానిపై ఊదారంగు బంద్గలా జాకెట్ ధరించారు. మోదీ ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్లో రంగురంగుల తలపాగాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది గణతంత్ర ఉత్సవాల్లో ఆయన బహుళ రంగులతో కూడిన బాంధానీ ప్రింట్ సఫా ధరించారు. గూగుల్ డూడుల్ 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్ ఆదివారం తీసుకొచ్చిన ప్రత్యేక డూడుల్ అందరినీ ఆకట్టుకుంది. లద్దాఖీ దుస్తులు ధరించిన మంచు చిరుత, ధోతీ–కుర్తా ధరించిన పులి వంటి జంతువులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వాయిద్యాలను ఇవి వాయిస్తున్నట్లుగా ఈ డూడుల్ను రూపొందించారు. ఇది జంతువుల పరేడ్లా ఉందని చెప్పొచ్చు. అంతర్లీనంగా గూగుల్ అనే అక్షరాలు పొందుపర్చారు. విదేశాల్లోనూ ఉప్పొంగిన దేశభక్తి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశా ల్లోనూ భారత గణతంత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులతోపాటు స్థానికులు వాటి లో ఉత్సాహంగా పా ల్గొన్నారు. భారతీ యులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. భార తీయ నృత్యాలను ప్రదర్శించారు. నేపాల్, ఆ్రస్టేలియా, సింగపూర్, చైనా, శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్, ఇండొనేసియా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో రిపబ్లిక్ డే నిర్వహించారు. భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. హైలైట్స్ → రాజ్యాంగానికి 75 ఏళ్లయిన సందర్భంగా వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.→ గణతంత్ర వేడుకల్లో ఇండొనేసియా అధ్యక్షుడు పాల్గొనడం ఇది నాలుగోసారి. ఆ దేశ సైనిక బృందం కూడా పాలుపంచుకుంది.→ పరేడ్లో పరమ్వీర్ చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, అశోక చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ జస్రామ్ సింగ్ పాల్గొన్నారు.కర్తవ్య పథ్పై... మోదీ స్వచ్ఛభారత్ కర్తవ్యపథ్పై ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ చేసి చూపించారు. ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికయ్యాయి. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ను స్వాగతించేందుకు వెళ్తుండగా దారిలో చెత్త కన్పించింది. దాంతో వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది చూస్తుండగా ఆయన కిందకు వంగి దాన్ని ఏరారు. డస్ట్బిన్లో పడేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మోదీ చర్యను నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. -
భవిష్యత్తు యుద్ధాలు వాటితోనే: మస్క్ ఆసక్తికర ట్వీట్
వాషింగ్టన్: భవిష్యత్తులో యుద్ధాలు జరిగే తీరుపై ప్రముఖ బిలియనీర్, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎఫ్-35 వంటి ఆధునిక ఫైటర్ జెట్ల కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో మస్క్ ఒక పోస్ట్ చేశారు.భవిష్యత్తులో యుద్ధాలన్నీ డ్రోన్లతోనే జరుగుతాయన్నారు.యుద్ధాల్లో మానవ సహిత ఫైటర్ జెట్లు పైలట్లను చంపేస్తున్నప్పటికీ కొంతమంది ఎఫ్-35 వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారుచేస్తున్నారని విమర్శించారు. అయితే ఈ యుద్ధ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని మస్క్ తెలిపారు. కాగా,ఎఫ్-35 ఫైటర్ జెట్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధవిమానాలు. వీటిలో అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు,రాడార్ కంటపడకుండా ఉండే స్టెల్త్ వ్యవస్థలు ఉన్నాయి.అయితే వీటి ఖర్చు,నిర్వహణ భారం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్-35 ఫైటర్ జెట్లపై మస్క్ ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.The F-35 design was broken at the requirements level, because it was required to be too many things to too many people. This made it an expensive & complex jack of all trades, master of none. Success was never in the set of possible outcomes.And manned fighter jets are… https://t.co/t6EYLWNegI— Elon Musk (@elonmusk) November 25, 2024 -
ఇరాన్పై నిప్పుల వర్షం
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఊహించినట్లుగానే ఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇలామ్, ఖుజిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్ల్లోని సైనిక, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 100 ఫైటర్ జెట్లతో మూడు దశల్లో 20 లక్ష్యాలపై కచి్చతత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఇరాన్కు చెందిన క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, చమురు నిల్వలపై దాడులు జరిగాయా లేదా అనేది తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. తాజా దాడుల్లో ఇరాన్కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. ఇరాన్పై దాడుల తర్వాత తమ యుద్ధవిమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాన్పై మరో దేశం నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషకు ఇజ్రాయెల్ ‘పశ్చాత్తాప దినాల మిషన్’ అని పేరుపెట్టింది. రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళికతో ఇరాన్పై దాడికి దిగినట్లు సమాచారం. అత్యాధునిక ఫైటర్ జెట్లను సైన్యం రంగంలోకి దించింది. ఐదో తరం ఎఫ్–35 అడిర్ ఫైటర్ జెట్లు, ఎఫ్–15టీ గ్రౌండ్ అటాక్ జెట్లు, ఎఫ్–16ఐ సూఫా ఎయిర్ డిఫెన్స్ జెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదింగలవు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సైనిక, ఆయుధ స్థావరాలపైనే గురిపెట్టింది. జనావాసాల జోలికి వెళ్లలేదు. తొలుత రాడార్, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై దాడికి పాల్పడింది. అనంతరం సైనిక స్థావరాలు, మిస్సైల్, డ్రోన్ల కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు దశల్లో దాడులు జరగ్గా, ఒక్కో దశ దాడిలో దాదాపు 30 చొప్పున యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఇజ్రాయెల్, అమెరికా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఇరాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. టెహ్రాన్లో సాధారణ పరిస్థితులే.. ఇజ్రాయెల్ దాడుల్లో తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని, ఎదురుదాడిలో నలుగురు సైనికులు మృతి చెందారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. దాడుల అనంతరం టెహ్రాన్లో సాధారణ పరిస్థితులే కనిపించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్పై దాడుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇజ్రాయెల్ చర్యను పలు దేశాలు ఖండించాయి. సంయమనం పాటించాలని సూచించాయి. అమెరికా వంటి మిత్రదేశాలు మాత్రం ఇజ్రాయెల్కు మద్దతు పలికాయి. 25 రోజుల తర్వాత ప్రతిదాడి ఇరాన్పై దాడుల సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో టెల్ అవీవ్ ఉన్న కిర్యా మిలటరీ బేసులోని మిలటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సైనిక సలహాదారులతో, సైనికాధికారుతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్»ొల్లా, హమాస్ నాయకులు మరణించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ నెల 1న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 200 క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తాము తగిన జవాబు ఇవ్వక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. ఇరాన్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అప్పట్లో భావించినప్పటికీ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో తమ ఆపరేషన్ వాయిదా వేసుకుంది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో 25 రోజుల తర్వాత ఇరాన్పైకి యుద్ధ విమానాలు పంపించింది. -
Israel-Hamas war: వెస్ట్బ్యాంక్పై భీకర దాడి
వెస్ట్బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్బ్యాంక్పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్బ్యాంక్లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది. వెస్ట్బ్యాంక్లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్బ్యాంక్లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్బ్యాంక్లో అతిపెద్ద సైనిక ఆపరేషన్కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్బ్యాంక్లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. -
ఇరాన్ ముప్పు.. ఇజ్రాయెల్కు అమెరికా రక్షణ కవచం
ఇరాన్తో పాటు ఆ దేశం మద్దతు కలిగిన రెబల్ గ్రూపుల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా పశ్చిమాసియాలో అదనపు యుద్ధ విమానాలను, నౌకాదళ నౌకలను భారీగా మోహరించేందుకు సమయాత్తమవుతోంది.ఇరాన్, రెబల్ గ్రూపుల నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్కు రక్షణ అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. పశ్చిమాసియాకు మరిన్ని యుద్ధ విమానాలను పంపాలని అమెరికా డిఫెన్స్ చీఫ్ను ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొంది.ఇదేవిధంగా అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆస్టిన్ ఇజ్రాయెల్కు అదనపు సహాయాన్ని అందిస్తామని హామీనిచ్చారు. టెహ్రాన్లో ఇటీవల హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే అమెరికా ఇజ్రాయెల్కు సహకారం అందిస్తోంది.హమాస్కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హెజ్ బొల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియా నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ మూడు హత్యలలో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హెజ్ బొల్లా ఆరోపిస్తున్నాయి. ఈ మూడు ఇజ్రాయెల్ పైకి దండెత్తే అవకాశాలున్నాయని అమెరికా అంచనా వేస్తోంది. -
తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ను నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వదేశంలో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానంలో పర్యటించారు. స్వదేశీ తయారీ సామర్థ్యం పట్ల నమ్మకం కలిగిందని చెప్పారు. హాల్లో తయారీ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారు. తేజస్లో విహరించిన ఫొటోలను ప్రధాని అధికారిక ఖాతా నుంచి పంచుకున్నారు. "తేజస్పై ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం మన స్వదేశీ సామర్థ్యంపై విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. మన జాతీయ సామర్థ్యంపై కొత్త ఆశావాదాన్ని పెంపొందించింది." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential. pic.twitter.com/4aO6Wf9XYO — Narendra Modi (@narendramodi) November 25, 2023 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ తయారీపై ఎక్కువ దృష్టి పెట్టింది. స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా Mk-II-Tejas యుద్ధ విమాన ఇంజన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి అమెరికా రక్షణ దిగ్గజం జీఈ ఏరోస్పేస్.. హాల్తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరాయని ఈ ఏడాది ఏప్రిల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశానికి అపురూపమైన విజయమని ఆయన అన్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: No Non Veg Day In UP: యూపీలో నేడు 'నో నాన్ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన -
Israel-Hamas war: హమాస్ స్థావరాలే లక్ష్యం
గాజాస్ట్రిప్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ పదాతి దళం మన్ముందుకు చొచ్చుకెళ్తోంది. మరోవైపు వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 450 హమాస్ స్థావరాలపై దాడుల చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. మిలిటెంట్ల కమాండ్ సెంటర్లు, అబ్జర్వేషన్ పోస్టులు, యాంటీ–ట్యాంక్ మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలియజేసింది. గాజాలోకి మరిన్ని పదాతి దళాలు అడుగుపెట్టబోతున్నాయని పేర్కొంది. ఖాన్ యూనిస్ సిటీలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. వీరిలో 10 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. హమాస్ కమాండ్ పోస్టు ఉందని భావిస్తున్న షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. గాజా సిటీలో ఇదే అతిపెద్ద ఆసుపత్రి. ఇక్కడ వందలాది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఎంతమంది బలయ్యారన్నది తెలియరాలేదు. హమాస్పై రెండో దశ యుద్ధం కొనసాగుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో శత్రువులపై భీకర పోరు తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లు సైతం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్పైకి అప్పుడప్పుడు రాకెట్లు ప్రయోగిస్తున్నారు. దక్షిణ ఇజ్రాయెల్లో తరచుగా సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. మూడు వారాలు దాటిన ఘర్షణ ఇజ్రాయెల్ దాడుల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 8,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 3,300 మంది మైనర్లు, 2,000 మందికిపైగా మహిళలు ఉన్నారని ప్రకటించింది. శిథిలాల కింద మరో 1,700 మంది చిక్కుకుపోయినట్లు అంచనా. వారు ఎంతమంది బతికి ఉన్నారో చెప్పలేని పరిస్థితి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్దాడులు తీవ్రతరం కావడం పాలస్తీనియన్లలో గుబు లు పుట్టిస్తోంది. ఇలాంటి భీకర దాడులను తామెప్పుడూ చూడలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీకి నెతన్యాహూ క్షమాపణ ఇజ్రాయెల్ భద్రతా దళాలకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ క్షమాపణ చెప్పారు. ఈ నెల 7న జరిగిన హమాస్ దాడిని ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైందంటూ ఆయ న తొలుత ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాడికి సంబంధించి భద్రతా దళాల అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని తప్పుపట్టారు. నెతన్యాహు పోస్టుపై ఆయన సహచర మంత్రులు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భద్రతా సిబ్బంది ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెట్టడం ఏమిటని పలువురు మండిపడ్డారు. దీంతో బెంజమిన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. భద్రతా బలగా లకు క్షమాపణ చెప్పారు. వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. పశి్చమాసియాలో శాంతి నెలకొనాలి: మోదీ ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పశి్చమాసియాలో ఉద్రిక్తత పెరిగిపోతుండడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీతో ఫోన్లో మాట్లాడారు. పశి్చమాసియా పరిణామాలపై చర్చించారు. గాజాలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సాధారణ ప్రజలు మరణిస్తుండడం తీవ్ర విచాకరమని మోదీ పేర్కొన్నారు. పశి్చమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని, ఇందుకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు మోదీ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గాజాకు మానవతా సాయం అందిస్తామన్నారు. గోదాములు లూటీ మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల 23 లక్షల మంది గాజా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చల్లారని ఆకలి మంటలు వారిని లూటీలకు పురికొల్పుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యూఎన్ఆర్డబ్ల్యూఏ సంస్థ గోదాముల్లో భద్రపరుస్తోంది. ప్రజలకు పంపిణీ చేస్తోంది. అయితే, ఆకలికి తాళలేని జనం గోదాములను లూటీ చేస్తున్నారని, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాలు, పరిశుభ్రతకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్నారని వెల్లడించింది. గాజాలో ‘సివిల్ ఆర్డర్’ గతి తప్పుతోందని పేర్కొంది. పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారతోందని, ఆవేశంలో ఉన్న ప్రజలను నియంత్రించలేకపోతున్నామని తెలియజేసింది. రణభూమిగా మారిన గాజాలో ఉండలేక, ఇతర దేశాలకు వలస వెళ్లే మార్గం కనిపించక జనం నిరాశలో మునిగిపోతున్నారని, అంతిమంగా వారిలో హింసాత్మక ధోరణి పెరిగిపోతోందని స్పష్టం చేసింది. ‘ద్విదేశ’ విధానమే పరిష్కారం: బైడెన్ ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి తెరపడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, అరబ్ దేశాల నాయకత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సూచించారు. ద్విదేశ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ఒప్పందానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్తీనా అనే రెండు దేశాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు తెలియజేశానని అన్నారు. వెస్ట్బ్యాంక్లో మరో దారుణం ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్ దాడులు మొదలైన తర్వాత వెస్ట్బ్యాంక్లో పాలస్తీనియన్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆదివారం వెస్ట్బ్యాంక్లోని నబ్లూస్లో ఓ యూదు సెటిలర్ జరిపిన కాల్పుల్లో బిలాల్ సాలెహ్ అనే పాలస్తీనియన్ రైతు మరణించాడు. ఈ రైతు ఆలివ్ తోటలు సాగుచేస్తుంటాడు. వెస్ట్బ్యాంక్లో గత 23 రోజుల్లో యూదు సెటిలర్ల దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇక ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇక్కడ 110 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. -
యుద్ధ విమానాల ప్లాంట్ను సందర్శించిన కిమ్
సియోల్: రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జొంగ్ ఉన్ శుక్రవారం యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్స్క్ ఆన్ అముర్లోని ఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్ ఎస్యూ–57ను ఆయన ఆసక్తికరంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను రష్యా కేబినెట్ విడుదల చేసింది. ఒక ఎస్యూ–35 ఫైటర్ జెట్ ల్యాండ్ అయినప్పుడు కిమ్ చప్పట్లు కొడుతున్నట్లుగా ఉంది. కిమ్ సుఖోయ్ ఎస్జే–100 ప్యాసింజర్ విమానాల ప్లాంట్ను కూడా సందర్శించారని తెలిపింది. కిమ్ వెంట రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఉన్నారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. -
తైవాన్ దిశగా చైనా నౌకలు, యుద్ధ విమానాలు
తైపీ: తైవాన్పై కన్నేసిన డ్రాగన్ దేశం చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం, బుధవారం పెద్ద సంఖ్యలో నావికాదళం నౌకలను, ఫైటర్ జెట్లు, బాంబర్లతో కూడిన యుద్ధ విమానాలను తైవాన్ దిశగా పంపించింది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శత్రువుల దండయాత్ర నుంచి తనను తాను కాపాడుకోవడమే లక్ష్యంగా తైవాన్ ప్రతిఏటా నిర్వహించే సైనిక విన్యాసాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తన నౌకలను, యుద్ధ విమానాలను తైవాన్ దిశగా నడిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ 38 యుద్ధ విమానాలను, 9 నౌకలను తైవాన్ వైపు మళ్లించింది. అంతేకాకుండా మరో 30 విమానాలు దూసుకొచ్చాయి. ఇందులో జె–10, జె–16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విమానాలు చైనా–తైవాన్ మధ్య జలసంధిలో అనధికారిక సరిహద్దు అయిన మిడ్లైన్ను దాటి ముందుకెళ్లినట్లు సమాచారం. చైనాకు చెందిన హెచ్–6 బాంబర్లు కూడా దక్షిణ తైవాన్ సమీపంలో సంచరించినట్లు తెలుస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని డ్రాగన్ చెబుతోంది. ఎప్పటికైనా కలిపేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. -
దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం !
వాషింగ్టన్: గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్414 జెట్ ఇంజన్లను భారత్లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. భారత్లోనే ఫైటర్జెట్ ఇంజన్లను తయారుచేసేందుకు సంబంధించిన చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (హాల్) మధ్య అమెరికాలో కుదిరింది. ‘భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం తేజస్లో శక్తివంత ఎఫ్414 ఇంజన్లను బిగిస్తారు. ఈ ఇంజన్లను భారత్లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది. ఒప్పందాలు ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్–అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. ఇరుదేశాల నడుమ కుదిరిన మారీటైమ్ ఒప్పందం ప్రకారం.. ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలు ఒకవేళ మరమ్మతులకు గురైతే భారత్లోని షిప్యార్డుల్లో ఆగవచ్చు. మరమ్మతులు చేసుకోవచ్చు. 2. సముద్రాలపై నిఘా కోసం ఆర్మ్డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. దీనిపై ఒప్పందం కుదిరింది. 3. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ ‘మైక్రాన్’ గుజరాత్లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఇంజన్ అసమానం ‘ఎఫ్414 ఇంజన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. మా కస్టమర్ దేశాల సైనిక అవసరాలు తీర్చడంలో, అత్యుత్తమ ఇంజన్లను అందించేందుకు సదా సిద్దం. ఇరుదేశాల ధృడ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ, బైడెన్ దార్శనికతలో మేం కూడా భాగస్వాములు కావడం గర్వంగా ఉంది’ అని లారెన్స్ జూనియర్ అన్నారు. తొలి దఫాలో 99 ఇంజన్లను తయారుచేస్తారు. ఇన్నాళ్లూ రష్యా, ఐరోపా దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత ఆయుధ పరిశ్రమలో నూతన శకం ఆరంభం కానుంది. ఎఫ్414–ఐఎన్ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్డ్ మీడియా కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(ఏఎంసీఏ)ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్తో జీఈ కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి బిగిస్తోంది. ఇకపై శక్తివంత ఎఫ్414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. ఇటీవల ఫ్రాన్స్కు చెందిన యుద్దవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్దవిమానాలను భారత్ కొనుగోలుచేయడం తెల్సిందే. -
విశాఖ సిగలో మరో మణిహారం
సాక్షి, విశాఖపట్నం: భారతదేశ కీలక రక్షణ కేంద్రంగా ఇప్పటికే వెలుగొందుతున్న విశాఖపట్నం సిగలో మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. యుద్ధ విమానాలు, ఆయుధాల్లో వినియోగించే అరుదైన అయస్కాంతాల తయారీ కేంద్రమైన రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్ ప్లాంట్ (ఆర్ఈపీఎం) సేవలకు శ్రీకారం చుట్టారు. రూ.197 కోట్లతో ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) ఈ ప్లాంట్ని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ప్రాంగణంలో పూర్తిచేసింది. ఏడాదికి 3 వేల కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మితమైన ఈ ప్లాంట్ను నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని మోదీ గురువారం జాతికి అంకితం చేశారు. అచ్యుతాపురంలోని ‘బార్క్’ కేంద్రం సమీపంలో 2.92 ఎకరాల విస్తీర్ణంలో ఆర్ఈపీఎం నిర్మాణ పనులు 2021లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది మార్చిలో పూర్తయ్యాయి. ఈ ప్లాంట్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈఎల్ దీనిని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నిర్మించింది. ఏడాదికి 3 వేల కిలోల అరుదైన అయస్కాంతాల ఉత్పత్తి సామర్థ్యంలో ప్లాంట్ సేవలు మొదలయ్యాయి. యుద్ధ విమానాల్లో వినియోగించేలా.. ఈ ప్లాంట్లో సమారియం, కోబాల్ట్, నియోడైమియం, ఐరన్, బోరాన్ వంటి అరుదైన అయస్కాంతాలను ఉత్పత్తి చేయనున్నారు. వీటిని టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, మైక్రో ఎలక్ట్రానిక్స్, విండ్ టర్బైన్ల నిర్మాణంలో వినియోగిస్తారు. ముఖ్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ వంటి అత్యాధునిక ఆయుధాల తయారీలోనూ ఈ తరహా అరుదైన మాగ్నెట్స్ని ఉపయోగిస్తుంటారు. అంతేకాక.. ఇటీవల తయారవుతున్న హైటెక్నాలజీ ఉత్పత్తుల్లో రేర్ మాగ్నెట్స్ కీలకంగా మారనున్నాయి. ఇన్నాళ్లూ వీటిని వివిధ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేవాళ్లు. దీనివల్ల అణుశక్తి, క్షిపణులు, రక్షణ విభాగంలో పరికరాల తయారీ.. అంతరిక్షం, ఇతర వ్యూహాత్మక రక్షణ వ్యవస్థల్లో అభివృద్ధికి కొంచెం అవరోధంగా ఉండేది. దీంతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటి తయారీకి శ్రీకారం చుట్టారు. ఇక ఈ రేర్ మాగ్నెట్స్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఎగుమతుల విషయంలోనూ భారత్ తనదైన ముద్ర వేసుకోనుంది. -
తైవాన్ సమీపంలో భారీగా చైనా విమానాలు, నౌకలు
తైపీ: చైనా మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం అమెరికా నేవీకి చెందిన పి–8ఏ పొసెడాన్ యాంటీ సబ్మెరీన్ గస్తీ విమానం చైనా– తైవాన్లను విడదీసే తైవాన్ జలసంధి మీదుగా చక్కర్లు కొట్టడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. దీంతో, శుక్రవారం యుద్ధ విమానాలను, నేవీ షిప్లను పెద్ద సంఖ్యలో తైవాన్ సమీపంలోకి పంపించి, బెదిరింపు చర్యలకు దిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి చెందిన 38 ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధ విమానాలు తమ భూభాగానికి అత్యంత సమీపంలోకి వచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రి శుక్రవారం తెలిపారు. ఈ నెలారంభంలో భారీగా సైనిక విన్యాసాలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో విమానాలు, నౌకలను తైవాన్ సమీపంలోకి తరలించడం ఇదే మొదటిసారి. -
ఏ చర్యలకైనా సిద్ధం!
లండన్: తమ దేశాన్ని భద్రంగా ఉంచేందుకు ఎటువంటి చర్యకైనా వెనుకాడబోమని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. అట్లాంటిక్ మిత్ర దేశాలతో నిత్యం టచ్లో ఉంటూ, రక్షణపరంగా సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఉత్తర ఇంగ్లండ్లోని ఓ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రజలు గ్రహించాలని కోరారు. తమ దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచామన్నారు. అనుమానిత చైనా నిఘా బెలూన్లను అమెరికా సైన్యం కూల్చివేయడం, యూకేకు కూడా బెలూన్ల బెడద ఉందన్న వార్తలపై రిషి పై విధంగా స్పందించారు. -
సుఖోయ్, మిరాజ్ ఢీ.. పైలట్ మృతి
న్యూఢిల్లీ/భరత్పూర్/మొరెనా: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)నకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ, మిరాజ్–2000 యుద్ధ విమానాలు ఢీకొన్న అరుదైన ఘటనలో ఒక పైలెట్ మృతి చెందారు. మరో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్కు సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎఫ్ బేస్గా ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం నుంచి ఈ రెండు విమానాలు రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరాయి. మొరెనా జిల్లా పహర్గఢ్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అవి ప్రమాదవశాత్తు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఘటనలో సింగిల్ సీటర్ మిరాజ్–2000 పైలెట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి చనిపోగా ట్విన్ సీటర్ సుఖోయ్ ఫ్లయిట్లోని ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వింగ్ కమాండర్ శరీర భాగాలు పహార్గఢ్ ప్రాంతంలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. విమాన శకలాలు కొన్ని పొరుగునే ఉన్న రాజస్తాన్లోని భరత్పూర్ జిల్లాలోనూ పడిపోయాయి. దీనిపై ఐఏఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. ఫ్లయిట్ డేటా రికార్డుల విశ్లేషణ అనంతరమే ఘటనకు దారి తీసిన కారణాలు తెలుస్తాయన్నారు. ఐఏఎఫ్ చరిత్రలో మిరాజ్, సుఖోయ్ ఢీకొనడం ఇదే తొలిసారి. దేశంలో గత 70 ఏళ్లలో ఇలాంటి 64 ప్రమాదాల్లో 39 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వైమానిక నిపుణుడు అంచిత్ గుప్తా తెలిపారు. -
IAF Combined Graduation Parade: ఈ పైలట్లు ఫైటర్లు
పోరాటాలంటే మక్కువ ఉన్నవారు ఏ సవాల్నైనా ఇట్టే అధిగమిస్తారు. ఫైటర్ జెట్ పైలెట్గా ఎంపికైన మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్లను చూస్తే ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం అంటారు. 22 మంది మహిళల్లో ఫైటర్లుగా ఎంపికైన వీరి ప్రతిభ, కృషి నవతరానికి స్ఫూర్తి. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడెమీలో (ఏఎఫ్ఏ) జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ అది. వాయుసేనలో ఉన్న ఖాళీలు, శిక్షణ సమయంలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారిని ఫైటర్లుగా ఎంపిక చేస్తారు. మొత్తం 164 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లు పట్టాలు పొందారు. వీరిలో 22 మంది మహిళలు ఉండగా మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్లు ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచారు. మైత్రేయ నిగమ్ ఆమె కుటుంబంలో మూడో తరం ఫైటర్. వదలని కృషి గ్రూప్ కెప్టెన్గా పదవీ విరమణ పొందిన పీకే నిగమ్ ప్రస్తుతం ఏవియేషన్ డొమైన్ సంస్థలో పని చేస్తుండగా, ఆయన కుమారుడు అమిత్ నిగమ్ వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయి ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ కెప్టెన్గా పని చేస్తున్నారు. మైత్రేయ నిగమ్ ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో విద్యనభ్యసించారు. అహ్మదాబాద్లోని ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో (మికా) ఎంబీఏ కోర్సులో చేరారు. అదే సమయంలో తనకు ఆసక్తి ఉన్న వైమానిక దళంలోకి ఎంపికయ్యారు. ‘మా తాత, తండ్రిని చూసి స్ఫూర్తి పొందాను. ఫైటర్ జెట్ పైలట్ కావాలనే ఆశయంతో కృషి చేశా. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరైనా అనునిత్యం శ్రమించాల్సిందే. వెంట వెంటనే విజయాలు లభించవు. కల నెరవేరాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ, ఆగిపోవద్దు. కృషిని మధ్యలోనే వదిలేయకుండా కష్టపడితే విజయం తథ్యం’ అని చెబుతోంది మైత్రేయ. పోరాటాలంటే ఇష్టం ఢిల్లీకి చెందిన మెహర్ జీత్ కౌర్ బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేశారు. ఆది నుంచీ మెహర్కి మిలటరీ బలగాలు చేసే పోరాటాలంటే మక్కువ. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్... ఏదో ఒకదాంట్లో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏఎఫ్ఏలో శిక్షణలో ప్రతిభ చూపించి ఫైటర్ జెట్ పైలట్గా ఎంపికయ్యారు. ‘జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కు రాకూడదు. మహిళలు ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉండాలి. ఏ సాయుధ బలగంలో అయినా అతివలు దూసుకుపోగలరని గుర్తుంచుకోండి. బీదర్ లో అదనపు శిక్షణ అనంతరం విధుల్లో చేరుతా’ అని పేర్కొన్నారు. నావిగేటర్.. మా నాన్న గుర్దీప్ సింగ్ గుర్దాస్పూర్ సిటీ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. తాత గురుబచన్ సింగ్ ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చింది. పంజాబ్లోని గుర్దాస్పూర్ నుంచే పన్నెండో తరగతి పూర్తి చేశాను. 2016లో భారత వాయుసేనలోకి ముగ్గురు మహిళా ఫైటర్లు తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వార్త చూసి వారి బాటలోనే నడవాలనుకున్నాను. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లి ఏఎఫ్ఏలో శిక్షణ పూర్తి చేసుకుని, నావిగేటర్గా ఎంపికయ్యాను. – కోమల్ ప్రీత్ కౌర్, పంజాబ్ కఠినమైన శిక్షణ ఎయిర్ఫోర్స్ అకాడెమీలో శిక్షణ ఎంతో కఠినంగా ఉంటుంది. ఇక్కడ శిక్షణ పొందే ప్రతి ఒక్కరూ నెవర్ గివిట్ అప్ ధోరణిలోనే ఉంటారు. స్త్రీ, పురుష తేడాలు ఉండవు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నట్టుగానే శిక్షణలో పాల్గొనాలి. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగాల కారణంగానే ఈ స్థాయికి చేరా. 12వ తరగతి వరకు సైన్స్ చదివినా డిగ్రీ మాత్రం ఆర్ట్స్లో పూర్తి చేశాను. నా తండ్రి రణ్బీర్ సింగ్ ఢిల్లీ కేంద్రంగా టెరిటోరియర్ ఆర్మీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత హోదా అయిన సుబేదార్ మేజర్గా పని చేస్తున్నారు. ఆర్మీ జీవితాన్ని వారి ద్వారా ఇప్పటికే చూశాను. అందుకే వైమానిక దళాన్ని ఎంపిక చేసుకున్నా. ఎదగాలి, ఎగరాలనే కోరిక బలంగా ఉంది. – సహజ్ప్రీత్ కౌర్, అమృత్సర్ ఈ శిక్షణలో పాల్గొన్న కోమల్ప్రీత్కౌర్, సహజ్ప్రీత్కౌర్లు కూడా తమ శిక్షణ అనుభవాలను పంచుకున్నారు. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ -
తవాంగ్ ఘర్షణ: ‘ఫైటర్ జెట్స్’ను రంగంలోకి దింపిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష -
ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్ జెట్స్ సాయంతో ఖతార్కు
విశ్వవ్యాప్తంగా యమ క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్కప్ సమరానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే సాకర్ సమరంలో పాల్గొననున్న 32 జట్లు ఖతార్కు చేరుకున్నాయి. ఇక నవంబర్ 20 నుంచి గోల్స్ వర్షం మొదలుకానుంది. ఇదిలా ఉంటే ఖతార్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్కప్లో పాల్గొనేందుకు పోలాండ్ జట్టు ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్తో రావడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బహుశా ఫిఫా వరల్డ్కప్ చరిత్రలోనే ఒక జట్టు ఎస్కార్ట్తో రావడం ఇదే తొలిసారి అనుకుంటా. పోలాండ్ ఇలా ఎస్కార్ట్తో రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై తొమ్మిది నెలలు కావొస్తున్నప్పటికి ఇప్పటికి మిస్సైల్ దాడులు జరగుతూనే ఉన్నాయి. అయితే పోలాండ్ రష్యా-ఉక్రెయిన్లకు బార్డర్ దేశంగా ఉంది. పోలండ్ జట్టు ఫిఫా వరల్డ్కప్ జరగనున్న ఖతార్కు వెళ్లాలంటే ఈ రెండు దేశాల ఎయిర్బేస్ను దాటుకొని వెళ్లాల్సిందే. ఈ మధ్యనే ఉక్రెయిన్-పోలాండ్ బార్డర్లో రష్యా జరిపిన దాడిలో ఇద్దరు పోలాండ్ వ్యక్తులు కూడా మృతి చెందారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న పోలాండ్ దేశం తమ ఫుట్బాల్ టీం ఖతార్కు వెళ్లాలంటే ఎస్కార్ట్ తప్పనిసరన్న విషయాన్ని గుర్తించింది. అందుకే ఖతార్కు బయలుదేరిన పోలాండ్ జట్టు విమానానికి ఫైటర్ జెట్-16ను ఎస్కార్ట్గా పంపింది. మధ్యలో విమానం వెళ్లగా.. ఇరువైపులా ఫైటర్ జెట్స్-16 ఎస్కార్ట్గా వెళ్లాయి. ఇది చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. ఇక విమానం ఖతార్లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫైటర్ జెట్స్ మళ్లీ పోలాండ్కు చేరుకున్నాయి. ఇదే విషయాన్ని పోలాండ్ ఫుట్బాల్ టీమ్ తమ ట్విటర్లో వీడియో రూపంలో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం కారణంగా భయపడిన పోలాండ్ జట్టు ఎలాగోలా ఎస్కార్ట్ సాయంతో ఖతార్లో అడుగుపెట్టింది. ''ఫిఫా చరిత్రలోనే ఒక జట్టు ఇలా ఎస్కార్ట్తో వెళ్లడం ఇదే తొలిసారి'' అంటూ అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఫిఫా వరల్డ్కప్లో పోలాండ్ జట్టు గ్రూప్-సిలో ఉంది. ఇదే గ్రూప్లో మెక్సికో, అర్జెంటీనా, సౌదీ అరేబియాలు కూడా ఉన్నాయి. కాగా పోలాండ్ వచ్చే మంగళవారం మెక్సికోతో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టాప్ స్టార్స్లో ఒకడిగా ఉన్న రాబర్ట్ లెవాండోస్కీ పోలాండ్ జట్టు కెప్టెన్గా ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న రాబర్ట్ లెవాండోస్కీనే జట్టుకు పెద్ద బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత నవంబర్ 26న సౌదీ అరేబియాతో తలపడనుంది. ఇక చివరగా నవంబర్ 30న మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనాతో మ్యాచ్ ఆడనుంది. 1986 ఫిఫా వరల్డ్కప్లో నాకౌట్ దశకు చేరిన పోలాండ్ మళ్లీ ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేకపోయింది. Do południowej granicy Polski eskortowały nas samoloty F16! ✈️ Dziękujemy i pozdrawiamy panów pilotów! 🇵🇱 pic.twitter.com/7WLuM1QrhZ — Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022 ✈️ #KierunekKatar 🇵🇱 pic.twitter.com/1dFSxFt5ka — Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022 చదవండి: 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది' FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు' -
తైవాన్ తెగువ.. చైనా ఏం చేస్తదో?
తైపీ: తైవాన్లో అగ్రరాజ్యపు కీలక నేతల పర్యటన.. ‘తైవాన్ ఏకాకి కాదంటూ..’ వరుస మద్దతు ప్రకటనల నేపథ్యంలో చైనా ఉడికిపోతోంది. తమదిగా చెప్తున్న భూభాగంలో అడుగుమోపడమే కాకుండా.. తమను కవ్విస్తే ఎలాంటి చర్యలకైనా ఉపేక్షించబోమంటూ ప్రకటనలు ఇస్తూ.. తైవాన్ సరిహద్దులో సైనిక డ్రిల్స్ నిర్వహిస్తూ వస్తోంది. అయితే.. ఎప్పుడూ లేనిది తైవాన్ కొండంత బలం ప్రదర్శించింది. చైనాకు పోటీగా ఆయుధ సంపత్తి ప్రదర్శనకు దిగింది. తమ వద్ద ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్ ఎఫ్-16వీ తో సైనిక విన్యాసాలు చేయించింది. ఈ యుద్ధవిమానాలు కూడా అమెరికా సహకారంతోనే రూపొందించినవి కావడం విశేషం. మొత్తం ఆరు F-16v యుద్ధవిమానాలు, అందులో రెండు మిస్సైల్స్ను ప్రదర్శిస్తూ తైవాన్ తూర్పు తీర ప్రాంతమైన హువాలెయిన్ కైంటీ నుంచి గగనతలంలో చక్కర్లు కొట్టాయి. చైనా కమ్యూనిస్ట్ దళాల సైనిక విన్యాసాల నుంచి ముప్పు నేపథ్యంలో.. జాతీయ భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రదర్శన అంటూ తైవాన్ బహిరంగంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే గతంలోనూ ఇలా ప్రదర్శనలకు దిగినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ధైర్యంగా నిర్వహించడాన్ని సాహసమనే చెప్పాలి. తైవాన్.. చైనా ఆక్రమణ ముప్పుతో నిత్యం భయం భయంగా గడుపుతోంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా పాలించబడుతున్న ఈ ద్వీపం తమలో భాగమని, ఏదో ఒకరోజు.. అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని చైనా గతంలోనే ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు చైనా వ్యతిరేక దేశాలు తైవాన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇక 90వ దశకం నాటి ఎఫ్-16వీ యుద్ధవిమానాల స్థానంలో.. అత్యాధునిక వెర్షన్లను తైవాన్కు కిందటి ఏడాది నవంబర్లో అందించింది అగ్రరాజ్యం. చైనా మీద తీవ్ర వ్యతిరేకతతో ట్రంప్ హయాంలో తైవాన్కు అన్నివిధాల మద్దతు అందిస్తున్న అమెరికా. ఇప్పుడు బైడెన్ హయాంలోనూ ఆ నైతిక మద్దతును కొనసాగిస్తోంది. ఇదీ చదవండి: కొడుకుతో రెస్టారెంట్కు వెళ్లిన కేంద్ర మంత్రి, ఆపై.. -
మన ‘తేజస్’పై 6 దేశాల ఆసక్తి..రక్షణ శాఖ సహాయ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెప్పారు. తేజస్ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్ మలేషియన్ ఎయిర్ఫోర్స్ నుంచి ప్రాథమిక టెండర్ను హెచ్ఏఎల్ స్వీకరించిందని అన్నారు. ట్విన్–సీటర్ వేరియంట్ తేజస్ ఎయిర్క్రాఫ్ట్లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్ మిగ్–29 ఫైటర్ విమానాల స్థానంలో తేజస్ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్సభలో ఓ ప్రశ్నకు అజయ్ భట్ సమాధానమిచ్చారు. స్టీల్త్ ఫైటర్ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్’ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
తైవాన్లోకి 27 చైనా ఫైటర్ జెట్స్.. ఇక బాంబుల వర్షమేనా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యాటనపై మొదటి నుంచే హెచ్చరికలు చేస్తోంది చైనా. జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. అయినప్పటికీ.. తైవాన్లో పర్యటించి తిరిగి స్వదేశానికి వెళ్లారు పెలోసీ. తైవాన్ నుంచి పెలోసీ వెళ్లిపోయిన వెంటనే ఆ ద్వీప దేశంపై చర్యలకు ఉపక్రమించింది చైనా. ఇప్పటికే ఆ దేశ దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తైవాన్ గగనతలంలోకి చైనాకు చెందిన 27 ఫైటర్ జెట్స్ ప్రవేశించినట్లు తైపీ ప్రకటించింది. ‘27 పీఎల్ఏ విమానాలు ఆగస్టు 3న తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఆరు జే11 ఫైటర్ జెట్స్, 5 జే16 జేట్స్ 16 ఎస్యూ-30 జేట్స్ ప్రవేశించాయి. వాటికి ప్రతిస్పందనగా తైవాన్ సైతం తమ ఫైటర్ జెట్స్ను రంగంలోకి దించింది. ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని మోహరించింది. ’ అంటూ ట్వీట్ చేసింది రక్షణ శాఖ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తైవాన్ లెక్కచేయలేదు. దీంతో అతి సమీపంలో ప్రమాదకర మిలిటరీ ప్రదర్శన చేపట్టి భయపెట్టే ప్రయత్నం చేసింది డ్రాగన్. స్పీకర్ విజిట్పై అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అలాగే.. హైఅలర్ట్ ప్రకటించింది చైనా మిలిటరీ. సైనిక డ్రిల్స్లో భాగంగా లాంగ్ రేంజ్ షూటింగ్ వంటివి ప్రదర్శించింది. దీంతో తైవాన్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. తైవాన్కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు పెలోసీ. 27 PLA aircraft (J-11*6, J-16*5 and SU-30*16) entered the surrounding area of R.O.C. on August 3, 2022. Please check our official website for more information: https://t.co/m1gW2N4ZL7 pic.twitter.com/Aw71EgmRjj — 國防部 Ministry of National Defense, R.O.C. 🇹🇼 (@MoNDefense) August 3, 2022 ఇదీ చదవండి: భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు -
ఉక్రెయిన్ సాయాన్ని అడ్డుకున్న అమెరికా!!
ఉక్రెయిన్కు ప్రత్యక్ష సాయం చేయని అమెరికా.. పరోక్షంగా బయటి నుంచి అందే సాయాన్ని అడ్డుకోవడం విశేషం. అమెరికా ఎయిర్ బేస్ ద్వారా ఉక్రెయిన్కు MiG-29 ఫైటర్ జెట్లను పంపాలనుకున్న పోల్యాండ్ ప్రతిపాదనను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అసలు ఆ ప్రతిపాదనను అమెరికా తప్పు పట్టింది. ఉక్రెయిన్కు సాయం చేయాలన్న పోల్యాండ్ ప్రతిపాదన.. మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమైని పేర్కొంది. జర్మనీలోని రామ్స్టెయిన్లో ఉన్న యూఎస్ ఎయిర్బేస్కు చెందిన సోవియట్ కాలం నాటి విమానాలను ఉక్రెయిన్కు తరలించే ప్రతిపాదనను అమెరికా అధికారులు వ్యతిరేకించారు. ఒప్పందం ప్రకారం MiG-29 ఫైటర్ జెట్లను ఉక్రెయిన్ పంపడం సాధ్యపడదని తెలిపారు. అయితే వాటి స్థానంలో F-16 ఫైటర్లను తరలించవచ్చని చెప్పారు. కానీ, ఇది పోల్యాండ్కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయంపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్పై రష్యా వైమానికదాడులు చేస్తున్న క్రమంలో యూఎస్-నాటో ఎయిర్ బేస్ నుంచి MiG-29 ఫైటర్ జెట్లను పోల్యాండ్ పంపాలన్న ప్రతిపాదన సరైంది కాదని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రతిపాదన మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తాము పోల్యాండ్, ఇతర NATO మిత్రదేశాలతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. లాజిస్టికల్ సవాళ్లతో కూడిన పోల్యాండ్ ప్రతిపాదన సమర్థనీయం కాదని తెలిపారు. మరోవైపు రష్యా బలగాలు.. ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. రష్యా మిలటరీ బలగాలు విధ్వంసం 14వ రోజు కూడా కొనసాగుతోంది. ఇక, ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంతా. చదవండి: భారత్కు రుణపడి ఉంటా: పాక్ విద్యార్థిని భావోద్వేగం -
ఉక్రెయిన్కు నాటో సాయం.. ఉత్తదేనా?
వాషింగ్టన్: ఉక్రెయిన్లో వైమానిక దాడులను ఉధృతం చేయాలని రష్యా ఒకవైపు యోచిస్తుండగా, మరోవైపు అమెరికా సైతం వ్యూహాలకు పదును పెడుతోంది. రష్యాను ఢీకొట్టడానికి గాను ఉక్రెయిన్ దళాలకు ఫైటర్ జెట్లు అందజేయడానికి నాటో దేశాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, నాటో దేశాల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. ఉక్రెయిన్కు Fighter Jets అందజేసి, సహకరించడానికి ఇప్పటిదాకా నాటో దేశాలేవీ ముందుకు రాలేదు. కేవలం ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విన్నపాలు సైతం పనిచేయడం లేదు. ఫైటర్ జెట్లు పంపించాలని ఆయన పదేపదే కోరుతున్నా మిత్ర దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గగనతల శక్తిలో ఉక్రెయిన్ కంటే రష్యా ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. ఉక్రెయిన్ వద్ద కేవలం 67 ఫైటర్ జెట్లు, 34 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. రష్యా అమ్ముల పొదిలో ఏకంగా 1,500 ఫైటర్ జెట్లు, 538 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఉక్రెయిన్కు ఏ దేశమైనా సహకరిస్తే ఆ దేశం నేరుగా తమపై యుద్ధం సాగిస్తున్నట్లుగానే పరిగణిస్తామని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు ఆర్మీని గానీ, వైమానిక దళాన్ని గానీ పంపించబోమని అమెరికా ఇప్పటికే తేల్చిచెప్పింది. చదవండి: యుద్ధ గందరగోళంలో పాపం ఆయన్ని కాల్చి చంపేశారు! -
చైనా జెట్ విమానాలు కొన్న పాక్
ఇస్లామాబాద్: చైనా తయారీ జే–10సీ జెట్ విమానాల ఫుల్ స్క్వాడ్రన్ (25 విమానాలు)ను పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఇండియా ఇటీవల జరిపిన రఫేల్ విమానాల కొనుగోలుకు బదులుగా చైనా జెట్లను కొన్నామని పాక్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చెప్పారు. అన్ని రకాల వాతావరణాల్లో ప్రయాణం చేయగల ఈ జెట్ విమానాలు వచ్చే ఏడాది మార్చి 23న పాకిస్తాన్ డే రోజున కవాతులో పాల్గొంటాయని చెప్పారు. గతేడాది పాక్, చైనా సంయుక్త విన్యాసాల్లో ఈ జెట్లు పాల్గొన్నాయి. ప్రస్తుతం పాక్ వద్ద యూఎస్ తయారీ ఎఫ్–16 విమానాలున్నాయి. ఇవి రఫేల్కు దీటు రాగలవని నిపుణుల అంచనా. అయితే వీటికన్నా మరింత మెరుగైన జెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో పాక్ తాజాగా చైనా జెట్లను కొనుగోలు చేసింది. వీటి ఖరీదు ఒక్కోటి సుమారు 3.5 కోట్ల డాలర్లు. అయితే రఫేల్ను ఎదుర్కొనేందుకు ఎఫ్ 16 విమానాలుండగా ఇప్పుడీ జెట్లను ఎందుకు కొన్నారో తెలియదని, రఫేల్తో పోలిస్తే ఇవేమంత గొప్పవి కావని పాక్ రక్షణ నిపుణుడు, సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ వ్యాఖ్యానించారు. -
మయన్మార్లో బాంబుల వర్షం
-
Myanmar: గ్రామంపై బాంబుల వర్షం
మయన్మార్: మయన్మార్లో మిలటరీ, ప్రజల మధ్య జరుగుతున్న పోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతూ ఉండటంతో అది అంతర్యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిలటరీ అరాచకాలకు నిరసనగా వేలాదిమంది రోడ్లపైకి వస్తున్నారు. కాగా, కేఎన్యూ సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినట్లు స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. గ్రామంపై మయన్మార్ ఆర్మీ బాంబుల వర్షం యాంగాన్: మయన్మార్లో మిలటరీ కరేన్ నేషనల్ యూనియన్ (కేఎన్యూ) సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆదివారం రోడ్లపైకి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిం చాలని నినదించారు. మరోవైపు థాయ్ సరిహద్దుల్లోని గ్రామంపై మయన్మార్ మిలటరీ ప్రతీకార దాడులకు దిగింది. పపూన్ జిల్లాలో ఓ గ్రామంపై వైమానిక దాడులు చేసి బాంబుల వర్షం కురిపించింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలరచేతుల్లో పట్టుకొని పరుగులు తీశారు. ఈ దాడిలో పిల్లలు సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఓ సంస్థ వెల్లడించింది. కేఎన్యూకి చెందిన కొంతమంది శనివారం ఒక ఆర్మీ బేస్పై దాడి చేసి లెఫ్ట్నెంట్ కల్నల్ సహా 10 మంది సైనికుల్ని చంపేశారు. ప్రతీకారంగా సైన్యం ఈ దాడి చేసింది. యాంగాన్లో రోడ్లపై ప్రజాస్వామ్యవాదులు ఏర్పాటు చేసిన అడ్డంకులు -
దుస్సాహసానికి దిగితే డ్రాగన్కు బుద్ధి చెబుతాం!
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో చైనా దళాల కదలికలకు కొద్ది రోజుల ముందే సరిహద్దు సమీపంలో చైనా వాయుసేన అత్యాధునిక జే-20 యుద్ధవిమానాలను తిరిగి మోహరించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇప్పటికీ చైనా యుద్ధవిమానాలు విస్తృతంగా కదులుతున్నాయని అధికారులు తెలిపినట్టు ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ హాటన్ ఎయిర్బేస్ నుంచి డ్రాగన్ జే-20ల కదలికలు సాగుతున్నాయని, ఇక్కడే వ్యూహాత్మక బాంబర్, ఇతర యుద్ధవిమానాలను చైనా మోహరించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత రక్షణ రంగ అమ్ములపొదిలో ఇటీవల రఫేల్ యుద్ధవిమానాలు చేరిన నేపథ్యంలో లడఖ్ సమీపంలోని ఎయిర్బేస్ల వద్ద చైనా వాయుసేన అత్యాధునిక జే-20 యుద్ధ విమానాలను తిరిగి మోహరించడం గమనార్హం. దుస్సాహసానికి దిగితే భంగపాటు తప్పదు చైనా వాయుసేన కార్యకలాపాలను భారత వైమానిక దళం, ఇతర నిఘా సంస్థలు పసిగడుతున్నాయని, డ్రాగన్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా తిప్పికొట్టేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్ఏసీ వెంబడి ఏడు చైనా ఎయిర్ బేస్లపై భారత్ ఓ కన్నేసి ఉంచింది. చైనా తన వ్యూహాత్మక ఎయిర్బేస్లను ఇటీవల అప్గ్రేడ్ చేసిందని, ఆయా ఎయిర్బేస్ల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ షెల్టర్లు నిర్మించడంతో పాటు రన్వే పొడవును విస్తరించిందని, సైనిక, మానవవనరులను మోహరించిందని అధికారులు తెలిపారు. జిన్జియాంగ్, టిబెట్ అటానమస్ సైనిక ప్రాంతంలోని ఏడు చైనా సైనిక స్ధావరాలపై శాటిలైట్లు, ఇతర పరికరాలతో విస్తృత నిఘాను ముమ్మరం చేశామని చెప్పారు. చదవండి : మా దళాలు ఎల్ఏసీని దాటలేదు: చైనా కాగా, సరిహద్దుల్లో తాజాగా కవ్వింపు చర్యలకు దిగిన చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. తూర్పు లదాఖ్, ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. బలగాల ఉపసంహరణ చర్చల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొరుగు దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది -
హర్యానా: నేడు రఫెల్ యుద్ధ విమానాల రాక
-
అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా రూ.38,900 కోట్లతో 33 యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం అనుమతి ఇచ్చింది. రష్యా నుంచి 21 మిగ్–29 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయనున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి 12 సుఖోయ్–30 ఎంకేఐ ఎయిర్క్రాఫ్ట్లు సమకూర్చుకోనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 59 మిగ్–29 ఎయిర్క్రాఫ్ట్లను అప్గ్రేడ్ చేసేందుకు రక్షణ శాఖ అంగీకరించింది. 248 అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ సైతం కొనుగోలు చేయనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 21 మిగ్–29 ఫైటర్ జెట్ల కొనుగోలుకు, 59 మిగ్–29 ఎయిర్క్రాఫ్ట్ల అప్గ్రెడేషన్కు రూ.7,418 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. హెచ్ఏఎల్ నుంచి 12 సూ–30 ఎంకేఐ ఎయిర్క్రాఫ్ట్లు సమకూర్చుకోవడానికి రూ.10,730 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. అంతేకాకుండా నావికా దళం, వైమానిక దళానికి అవసరమైన లాంగ్రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ సిస్టమ్స్, అస్త్రా క్షిపణుల కొనుగోలుకు రూ.20,400 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. మిగ్–29 ప్రత్యేకతలు గాల్లో నుంచి శత్రువులపై నిప్పుల వర్షం కురిపించే మిగ్–29 జెట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లను 1970వ దశకంలో అప్పటి సోవియట్ యూనియన్లో మికోయాన్ డిజైన్ బ్యూరో అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇవి 1982లో తొలిసారిగా సోవియట్ ఎయిర్ఫోర్సులో చేరాయి. అమెరికాకు చెందిన ఈగల్, ఫాల్కన్ ఫైటర్ జెట్లకు పోటీగా వీటిని తీసుకొచ్చారు. ప్రపంచంలో 30కిపైగా దేశాలు మిగ్–29 జెట్లను కలిగి ఉన్నాయి. ఇవి వివిధ విధులు నిర్వర్తించే మల్టీరోల్ ఫైటర్లుగా పేరుగాంచాయి. ప్రధానంగా నింగి నుంచి నేలపై ఉన్న శత్రువులను దెబ్బతీయడానికి ఈ జెట్లను ఉపయోగిస్తారు. సుఖోయ్.. లాంగ్ రేంజ్ రష్యాకు చెందిన సుఖోయ్ కార్పొరేషన్ సూ–30 ఎంకేఐ ఎయిర్క్రాఫ్ట్లను అభివృద్ధి చేసింది. ఇవి మల్టీరోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 2002లో భారత వైమానిక దళం ఇలాంటి కొన్ని ఎయిర్క్రాఫ్ట్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. భారత వైమానిక దళం వద్ద 2020 జనవరి నాటికి దాదాపు 260 సూ–30 ఎంకేఐ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. లాంగ్ రేంజ్.. అంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఇవి సులువుగా ఛేదించగలవు. యాప్లపై నిషేధం.. డిజిటల్ స్ట్రైక్ చైనాకు చెందిన 59 యాప్లను భారత్లో నిషేధించడాన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘డిజిటల్ స్ట్రైక్’గా అభివర్ణించారు. దేశ ప్రజల డేటాను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. భారత్ శాంతినే కోరుకుంటుందని, అయితే, ఎవరైనా దుర్బుద్ధితో భారత భూభాగంపై కన్నువేస్తే తగిన గుణపాఠం చెబుతుందని వ్యాఖ్యానించారు. గల్వాన్ లోయ ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది చనిపోతే.. అంతకు రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులను అంతమొందించామని చెప్పారు. పశ్చిమబెంగాల్ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి గురువారం వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి మోదీ దేశ రక్షణ విషయంలో రాజీ పడబోరన్నారు. -
సరిహద్దు వివాదం : కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 21 మిగ్-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు 12 ఎస్యూ-30 ఎంకేఐల కొనుగోలుకూ పచ్చజెండా ఊపింది. రష్యా నుంచి ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలు, ఆధునీకరణకు 7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా,10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది. యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని చాలాకాలంగా భారత వాయుసేన (ఐఏఎఫ్) కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో 38,900 కోట్ల విలువైన ఆయుధసామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. వీటిలో 31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు. చదవండి : చైనా మైండ్ గేమ్ -
లద్దాఖ్కు క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ముందుకు చొచ్చుకువచ్చిన చైనా ఆర్మీ వెనక్కి తగ్గేది లేదంటూ మొండికేసింది. పైపెచ్చు వివాదాస్పద ప్రాంతాల్లోకి భారీగా సైనిక బలగాలను దించుతోంది. దీంతో భారత్ అదే స్థాయిలో చర్యలు చేపడుతోంది. లద్దాఖ్కు ఆర్మీతోపాటు వైమానిక బలగాలను తరలించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు కీలకమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను తరలించింది. గల్వాన్ ఘటన జరిగిన పెట్రోల్ పాయింట్–14 వద్దకు రెండు దేశాలు బలగాలను, సైనిక సంపత్తిని భారీగా తరలించాయి. ఈ ఘటన జరిగిన అనంతరం అదే రోజు రెండు దేశాల కార్ప్స్ కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక వైపు సాగుతుండగానే చైనా అబ్జర్వేషన్ పోస్టులు, టెంట్లతోపాటు గోడను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. అక్కడి నుంచి వెనక్కి తగ్గేందుకు చైనా నిరాకరించడంతో ఆ రోజు జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా గల్వాన్ లోయను తమ మ్యాప్లో చైనా చూపించుకోలేదు. అయినప్పటికీ, అది తమ భూభాగం కాబట్టే అక్కడికి వచ్చామనీ, తిరిగి ఎందుకు వెనక్కి వెళ్లాలని చైనా ప్రతినిధులు వాదించినట్లు సమాచారం. ఆ తర్వాత జరగాల్సిన చర్చల తేదీలు కూడా ఖరారు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రెండు దేశాలు ఎల్ఏసీ వెంట ఆయుధ సంపత్తిని, బలగాలను మోహరించడం కొనసాగిస్తున్నాయి. మరో మూడు నెలల తర్వాత లద్దాఖ్లో మళ్లీ మంచు కురియడం మొదలవుతుంది. ఆ సమయంలో లద్దాఖ్కు మిగతా భారత దేశంతో దాదాపు 6 నెలలపాటు సంబంధాలు తెగిపోతాయి. భారత సైన్యం కూడా అటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లకు సిద్ధమైంది. చైనా మోహరింపులిలా.. ► ఎల్ఏసీ వెంట చైనా భారీగా బలగాలు, ట్యాంకులు, క్షిపణులు, యుద్ధ విమానాలను మోహరించింది. పాంగాంగ్ త్సోలోని ఫింగర్4 వద్ద హెలిప్యాడ్ను ఏర్పాటుచేసింది. ► సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలు, వ్యూహాత్మక బాంబర్లను అక్కడ మోహరించింది. ఇవి భారత్తో సరిహద్దులకు 10 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి పహారా కాస్తున్నట్లు సమాచారం. ► దౌలత్ బేగ్ ఓల్డీ, పెట్రోలింగ్ పాయింట్–14 సమీపంలోని గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్–15,17, 17ఏ, ఫింగర్ పాయింట్, పాంగోంగ్ త్సోలకు సమీపంలోని చైనా సైనిక హెలికాప్టర్లు గస్తీ చేపట్టాయి. భారత్ ఏం చేస్తోందంటే.. ► ఉత్తర భారతదేశంలోని ఎయిర్ బేస్లు, కంటోన్మెంట్లలో ఉన్న బలగాలు, ఫిరంగులు, శతఘ్ని దళాలు, నిఘా రాడార్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు గత నెల నుంచి లద్దాఖ్కు తరలుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లో ప్రస్తుతం 45వేల సైన్యం మోహరించి ఉంది. ► చైనా బలగాలు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తక్షణమే తప్పికొట్టేందుకు వైమానిక, నావికా దళాలకు చెందిన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను తూర్పు లద్దాఖ్కు తరలించింది. వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలతోపాటు డ్రోన్లను సైతం రెప్పపాటులోనే నేలకూల్చే సామర్ధ్యం ఉన్న ఆకాశ్ క్షిపణులు ఇందులో ఉన్నాయి. ► చండీగఢ్లోని వైమానిక స్థావరం నుంచి 46 టన్నుల భారీ టి90 యుద్ధట్యాంక్ను సి17 గ్లోబ్మాస్టర్ విమానం లద్దాఖ్కు మోసుకెళ్లింది. ► దౌలత్ బేగ్ ఓల్డీ, ఫుక్చే, నియోమాల్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ను ఎయిర్ ఫోర్స్ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎస్యు30 ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరించింది. శ్రీనగర్, లేహ్లో జాగ్వార్, మిరాజ్–200 యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ► సముద్రంలో చైనా కదలికలపై కన్ను వేసి ఉంచేందుకు నేవీ తన పి–81 నిఘా విమానాన్ని గస్తీకి పంపింది. ► లద్దాఖ్లోని 1,597 కిలోమీటర్ల పొడవైన చైనా సరిహద్దుల్లో ఉన్న 65 పాయింట్లలో పహారాను మరింత పెంచింది. ► సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గల్వాన్ లోయ, లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్, డెప్సంగ్ మైదానాలు, ప్యాంగాంగ్ త్సోతోపాటు ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతాల్లో భారత్, చైనా బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉండటంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నిపుణులు ఏమన్నారంటే.. ► ‘అతిక్రమణలను, భారత భూభాగం వైపు నిర్మాణాలు చేపట్టడం చైనా నిలిపివేయాలి. సైనిక ప్రతిష్టంభన తొలగిపోవడానికి ఏకైక పరిష్కారం ఇదే’ అని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ అన్నారు. ► వెనక్కి తగ్గేందుకు రెండు పక్షాలు ఏమేరకు సానుకూలంగా ఉన్నాయనే దానిపైనే వివాద పరిష్కారం ఆధారపడి ఉంది’ అని మాజీ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు. ► ‘సరిహద్దుల్లో మోహరింపులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయి. బలగాల ఉపసంహరణ టి–20 మ్యాచ్లాగా వెంటనే ఫలితం తేలేది కాదు, టెస్ట్ మ్యాచ్ వంటిది. ఇందుకు 2, 3 నెలల వరకు పట్టవచ్చు. అంతకంటే, ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు’ అని సైనిక ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి అంచనా వేశారు. ► భారత్తో సరిహద్దుల వెంట చైనా అనుసరిస్తున్న వైఖరితో ఆ దేశం భవిష్యత్తులో సుదీర్ఘ కాలం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాఫ్(రిటైర్డు) లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి తీరుతో ఆ దేశం అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతుందన్నారు. ప్రపంచమంతా కోవిడ్–19 మహమ్మారితో పోరాడుతుంటే చైనా మాత్రం లద్దాఖ్లో దుశ్చర్యకు పాల్పడటం ఆ దేశం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందని అమెరికాతో టారిఫ్ యుద్ధం, ఆస్ట్రేలియాతో విభేదాలు, హాంకాంగ్లో దిగజారుతున్న పరిస్థితులతో చైనాకు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. గల్వాన్ ఘటనతో చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒక రాజకీయ బలగమే తప్ప దానికి ఎలాంటి సైనిక ప్రమాణాలు లేనట్లు అర్థమవుతోందని చెప్పారు. -
డ్రాగన్ దూకుడు ఇందుకే..
శ్రీనగర్ : నియంత్రణ రేఖ వెంబడి పాక్ యుద్ధ విమానాల పెట్రోలింగ్ నేపథ్యంలో భారత్ విషయంలో చైనా సైతం కవ్వింపు చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. లడఖ్లో నియంత్రణ రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చర్యతో భారత సైన్యం అప్రమత్తమైంది. చైనా యుద్ధ విమానాల పెట్రోలింగ్తో భారత వాయుసేన పెద్దసంఖ్యలో యుద్ధ విమానాలను లడఖ్లో మోహరించింది. కాగా కోవిడ్-19 మూలాలపై ప్రపంచ దేశాలు చైనా వైపు సందేహంగా చూడటంతో పాటు పలు బహుళజాతి కంపెనీలు బీజింగ్ నుంచి భారత్కు తమ కార్యకలాపాలను తరలించాలని యోచిస్తుండటంతో అధ్యక్షుడు జిన్పింగ్పై ఒత్తిడి పెరిగింది. చైనాను చుట్టుముడుతున్న ఒత్తిళ్లతోనే డ్రాగన్ ఆర్మీ అసహనంతో దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లోకి ప్రవేశించాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి. చదవండి : వూహాన్ జనాభా మొత్తానికి కరోనా టెస్టులు -
కరోనా యోధులకు సైన్యం సలాం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యుద్ధ విమానాలను గాల్లోకి పంపడంతోపాటు (ఫ్లై– పాస్ట్స్) ఆసుపత్రులపై పూల జల్లు కురిపిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్(సీడీఎస్) బిపిన్ రావత్ చెప్పారు. ఆయన శుక్రవారం త్రివిధ దళాల అధిపతులు ఎం.ఎం.నరవణే, కరంబీర్సింగ్, ఆర్.కె.ఎస్.బదౌరియాతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ తొలి సీడీఎస్గా బాధ్యతలు చేపట్టాక ఇదే ఆయన తొలి మీడియా సమావేశం. కరోనాపై పోరాటం విషయంలో దేశమంతా ఒక్కటై నిలిచిందని జనరల్ రావత్ అన్నారు. మహమ్మారి బారినుంచి మనల్ని కాపాడేందుకు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు త్రివిధ దళాలు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలపనున్నాయని చెప్పారు. అవి...మే 3వ తేదీన సాయంత్రం భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఫిక్స్డ్ వింగ్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ విమానాలు ఫ్లై–పాస్ట్స్లో పాల్గొంటాయి. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు.. దిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు ఇవి గాల్లో ఎగురుతాయి. నావికా దళం హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూలు చల్లుతాయి. యుద్ధనౌకలు ప్రత్యేక డ్రిల్లు నిర్వహిస్తాయి. సముద్ర తీరంలో యుద్ధ నౌకలను విద్యుత్ వెలుగులతో నింపేస్తారు. ప్రతి జిల్లాలో కొన్ని హాస్పిటళ్లలో సైన్యం ఆధ్వర్యంలో మౌంటెయిన్ బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది. (చదవండి: మేడే రోజు శ్రామిక్ రైళ్లు) -
వాయుసేనకు 200 జెట్ విమానాలు
కోల్కతా: భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసే 83 ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు. -
మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5–7 ఏళ్లలో ఏకంగా రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయమై కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఐఏఎఫ్కు 110 ఫైటర్ జెట్లు.. అలాగే వాయుసేన(ఐఏఎఫ్) కోసం 110 మల్టీరోల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ముఖ్యమైన నగరాలపై శత్రుదేశాల క్షిపణి దాడులు జరగకుండా గగనతలాన్ని సురక్షితంగా ఉంచేందుకు మరో మెగా ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే 5,000 కి.మీ దూరం లోని శత్రు లక్ష్యాలను ఛేదించే అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని–5’ భారత అమ్ములపొదిలో చేరనుందన్నారు. -
యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం
ఇస్లామాబాద్: సరిహద్దుల్లోని యుద్ధ విమానాలను భారత్ తరలిస్తే తప్ప తమ దేశం గుండా వాణిజ్య విమానాలకు గగనతలం తెరవబోమని పాకిస్తాన్ విమానయాన కార్యదర్శి షారుక్ నుస్రత్ స్పష్టంచేశారు. పుల్వామా తీవ్రవాద దాడి అనంతరం పాక్లోని బాలాకోట్లో జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26 తర్వాత నుంచి పాక్ తన గగనతలంపైనుంచి భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. నుస్రత్ ఆదేశాలతో పాక్ విమానయాన శాఖకు చెందిన సెనేట్ స్టాండింగ్ కమిటీ భారత అధికారులకు సమాచారమిచ్చింది. ‘పాక్ గగనతలం తెరవాలని భారత ప్రభుత్వం సంప్రదించింది. మేం అందుకు సిద్ధం. అయితే ముందుగా సరిహద్దుల్లోని వైమానిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలను భారత్ ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని నుస్రత్ పేర్కొన్నారు. గగనతలం తెరవడంపై ఓ పాక్ సీనియర్ అధికారి స్పందించడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలం మూసివేతపై ఆంక్షలు జూలై 12 వరకు పొడిగించారు. ఏదిఏమైనా పాక్ గగనతల మూసివేతతో భారత విమానయాన పరిశ్రమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. పాక్ గగనతల మూసివేత కారణంగా దూరపు మార్గాల్లో విమానాలు ప్రయాణించడం ద్వారా ఎయిరిండియా రూ.430 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. -
‘సెప్టెంబర్లో భారత్కు తొలి రఫేల్ విమానం’
-
‘సెప్టెంబర్లో భారత్కు తొలి రఫేల్ విమానం’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై శుక్రవారం కూడా లోక్సభలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రఫేల్ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. భారత్ కొనుగోలు చేసిన తొలి రఫేల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని వెల్లడించారు. మిగిలిన విమానాలు 2022 నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని మన ప్రాధాన్యతలకు అనుగుణంగా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. అనిల్ అంబానీ కోసమే తాము యుద్ధ విమానాలు కొనుగోలు చేశామని కాంగ్రెస్ భావిస్తే యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందాల వెనుక ఖత్రోచీ, రాబర్ట్ వాద్రాలు ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ దుయ్యబట్టారు. హెచ్ఏఏల్కు ఎందుకు ఇవ్వలేదంటే.. ప్రభుత్వ రంగ హెచ్ఏఎల్కు రఫేల్ తయారీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీ ప్రభుత్వాన్ని నిలదీయడంపై నిర్మలా సీతారామన్ స్పందించారు. హెచ్ఏఎల్కు ఆర్డర్ను ఎందుకు ఇవ్వలేదో రాహుల్ తెలుసుకోవాలన్నారు. హెచ్ఏఎల్ గొప్పలే కాదు, లోపాలనూ గుర్తించాలన్నారు. తేజస్ విషయంలో హెచ్ఏఎల్ మందకొడిగా వ్యవఃహరించిందన్నారు. తాము 43 తేజాస్ విమానాలకు ఆర్డర్ ఇస్తే హెచ్ఏఎల్ కేవలం 8 విమానాలనే సమకూర్చిందని చెప్పారు. తమ హయాంలో హెచ్ఏఎల్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేశామని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ రఫేల్పై సభకు తప్పుడు సమాచారం అందించారని అన్నారు. మంత్రి తన పేరును ప్రస్తావించడం పట్ల రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
భారత్కు ఫైటర్లు : ముందంజలో బోయింగ్
న్యూయార్క్ : పెద్ద మొత్తంలో యుద్ద విమానాల కొనుగోలుకై భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీల్ కావడంతో.. దీనిని దక్కించుకోవడానికి అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా ఈ ప్రాజెక్టును తామే సొంతం చేసుకుంటామని ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ సీనియర్ అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండేళ్లలోనే తాము భారత్కు కావాల్సిన యుద్ద విమానాలను అందిస్తామని పేర్కొన్నారు. బోయింగ్ డిఫెన్స్ సెల్స్ ఉపాధ్యక్షుడు జీన్ కన్నింగ్హమ్ కూడా భారత వైమానిక దళానికి 110 ఫైటర్ జెట్స్ అందించేందుకు జరుగుతున్న టెండర్ ప్రక్రియలో తాము ముందు వరుసలో ఉన్నట్టు పేర్కొన్నారు. సింగపూర్లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ఆయన.. తమకు భారత మార్కెట్పై పూర్తి అవగాహన ఉందన్నారు. ఇప్పటికే భారత నావికా దళానికి 57 ఫైటర్ జెట్స్ను సరఫరా చేసేందుకు నిర్వహించిన ప్రక్రియలో తమ సంస్థ తుది జాబితాలో చోటు దక్కించుకుందని తెలిపారు. భారత్ ప్రతిపాదించిన 110 యుద్ధ విమానాల తయారీ అంచనా వ్యయం 15 బిలియన్ డాలర్లు. ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ ఫైటర్ల తయారీకి దేశీయ సంస్థలైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మహీంద్ర డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్తో కలసి పనిచేస్తామని గత ఏప్రిల్లోనే బోయింగ్ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు బోయింగ్, స్వీడన్కు చెందిన సాబ్తోపాటు ఇతర సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. -
మా పనితీరుకు అది నిదర్శనం
సాక్షి, లక్నో: లక్నో-ఆగ్రా హైవేపై మంగళవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ట్విటర్లో స్పందించారు. హైవేపై భారతీయ వాయు సేన చేసిన విన్యాసాలను ఆయన ప్రశంసించారు. రాజకీయాలకతీతంగా అదంరూ ఇండియన్ ఎయిర్ఫోర్స్ను అభింనందించాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో లక్నో-ఆగ్రా నేషనల్ హైవే.. జాతీయ ఆస్తిగా ఆయన పేర్కొన్నారు. నేడు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్న ఆగ్రా-లక్నో జాతీయ రహదారిని తన హయాంలో అత్యంత పటిష్టంగా నిర్మాణం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ జాతీయ రహదారే నా పనితనానికి నిదర్శనం అని అన్నారు. ఉత్తర్ప్రదేశ్ మౌలిక వసతులు నేడు దేశానికి శ్రేయస్సులు, రక్షణను కలిగించే స్థాయికి చేరినందుకు గర్వంగా ఉందని అఖిలేష్ చెప్పారు. Infrastructure is vital to UP’s prosperity and India’s security. Proud that Agra-Lucknow Expressway is now a National strategic asset. pic.twitter.com/yE2oTz6rm0 — Akhilesh Yadav (@yadavakhilesh) 24 October 2017 तरक़्क़ी के रास्ते, देश की हिफ़ाज़त के वास्ते. वायुसेना को सलाम, जिनसे सुरक्षित है, अपना आसमान. जय हिंद. जय भारत. pic.twitter.com/e66VMMxpH0 — Akhilesh Yadav (@yadavakhilesh) 24 October 2017 -
కొరియన్ పెనిన్సులాపై అమెరికా విమానాల చక్కర్లు
సియోల్: ఖండాంతర క్షిపణి ప్రయోగంతో అమెరికాను చేరగలిగే క్షిపణిని తయారు చేసిన ఉత్తరకొరియాకు ధీటుగా బదులిచ్చేందుకు అమెరికా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దక్షిణ కొరియాలో అమెరికా యుద్ధవిమానాలు ప్రత్యక్ష ఫైర్ డ్రిల్ చేపట్టాయి. ఇందులో భాగంగా ఉత్తర కొరియాకు అతి సమీపంగా వెళ్లిన యుద్ధవిమానాలు కొరియన్ పెనిన్సులాపై కాసేపు చక్కర్లు కొట్టాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలకు కఠిన సమాధానం చెప్పేందుకే ఈ డ్రిల్ చేపట్టినట్లు దక్షిణకొరియా మిలటరీ పేర్కొంది. దక్షిణ కొరియాలోని గువామ్లో గల అండర్సన్ ఎయిర్బేస్లో నాలుగు అమెరికా యుద్ధవిమానాలు, ఒక దక్షిణకొరియా జెట్ ఫైటర్ శనివారం ప్రత్యక్ష ఫైర్ డ్రిల్ చేపట్టాయి. ఇందులో భాగంగా ఉత్తర కొరియా సరిహద్దుకు అతి సమీపానికి వెళ్లిన విమానాలు కొరియన్ పెనిన్సులాపై చక్కర్లు కొట్టి తిరిగి ఎయిర్బేస్ను చేరుకున్నాయి. గత మంగళవారం ఉత్తరకొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. అత్యంత సామర్థ్యం గల ఈ క్షిపణి తూర్పు సముద్రంలో జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలో పడింది. ఈ క్షిపణికి అమెరికాలోని అలస్కాను చేరే సామర్థ్యం ఉందని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. కాగా.. దీనిపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
యుద్ధ నౌకలో విజ్ఞాన యాత్ర
నడిసంద్రంలో విన్యాసాల హోరు నావికాదళ సత్తా చాటేలా ప్రదర్శనలు విద్యార్థులకు విజ్ఞానం.. వినోదం ఘనంగా సముద్రంలో ఒక రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. శత్రుభీకరమైన ఆరు యుద్ధనౌకలు.. వాటికి తోడుగా ఓ సబ్మెరైన్.. హెలికాప్టర్లు.. యుద్ధ విమానాలు.. అవి చేసిన విన్యాసాలు.. సమర సన్నద్ధత ప్రదర్శనలు.. రెస్క్యూ ఆపరేషన్లు.. వెరసి నడిసంద్రంలో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించారుు. వేలాది విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు విజ్ఞానం.. వినోదం అందించారుు. నేవీడే ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన డే ఎట్ సీ(సముద్రంలో ఒక రోజు) కార్యక్రమం గగుర్పాటు కలిగించింది. ప్రతినిధి, విశాఖపట్నం: యుద్ధ నౌకల బారులు.. ఆరుుల్ ట్యాంకర్ కమ్ వార్షిప్ ఐఎన్ఎస్ శక్తి నౌక, సబ్మెరైన్ సింధువీర్.. అదనంగా హైస్పీడ్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లు టి 36, టి 37, టి38, టి39.. నడిసంద్రంలో వేగంగా వెళ్తుండగా.. గగనతలంలో రెండు యుద్ధ విమానాలు. మూడు సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్లు. మరో రెండు రెండు హాక్ ఫైటర్ ఎరుుర్క్రాఫ్ట్లు... ప్రదర్శించిన అద్భుతమైన విన్యాసాలకు నడిసంద్రమే వేదికై ంది. నగరంలోని వివిధ పాఠశాలలతోపాటు, కోరుకొండ సైనిక్ స్కూల్, భువనేశ్వర్లోని సైనిక్ స్కూళ్లకు చెందిన సుమారు రెండున్నర వేలమంది విద్యార్థులు, నగరంలోని సీనియర్ సిటిజన్లు, మీడియా ప్రతినిధులను నేవీ అధికారులు నౌకల్లో విశాఖ తీరం నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలోకి తీసుకువెళ్లారు. ఉదయం 9 గంటలకు మొదలైన ప్రయాణం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యలో సుమారు ఐదుగంటల పాటు ఏకబిగిన సాగిన విన్యాసాలు విద్యార్ధులు, చూపరులను సంద్రమాశ్చర్యాల్లో ముంచెత్తారుు. ►యుద్ధనౌకలు వరుసగా ఒకదాని వెంట ఒకటి.. కొంత దూరం తర్వాత ఐదు యుద్ధ నౌకలు పక్క పక్కనే ఒకే వేగంతో ప్రయాణించడం, ఎడమ వైపు సత్పుర.. కుడి వైపు శివాలిక్ .. మధ్యలో శక్తి యుద్ధనౌక స్థిరవేగంతో ప్రయాణిస్తూ ఒకదాని నుంచి మరొకటి డీజిల్ నింపుకోవడం, సత్పుర, శివాలిక్ల నుంచి కేవలం తాడు సాయంతో నావికులు శక్తి నౌకలోకి ప్రవేశించడం, పై నుంచి వేగంగా వచ్చిన హెలికాప్టర్ నుంచి ఓ వ్యక్తి సముద్రంలో ఉన్న హైస్పీడ్ బోటులోకి దిగడం.. వంటి అరుదైన విన్యాసాలు విద్యార్థులు, చూపరులను అబ్బురుపరిచారుు. నేవీ సత్తా, విపత్కర, యుద్ధ సమయాల్లో అది స్పందించే తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ►విపత్తులు, యుద్ధాల సమయంలో నావికాదళం ఏవిధంగా స్పందిస్తుంది.. వేగవంతమైన మోటారు పడవలు(ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్లు ) సముద్రంలో ఎలా వెళ్తారుు, యుద్ధ నౌకలు ప్రయాణిస్తుండగానే వాటిలో ఇంధనాన్ని ఎలా నింపుకుంటారు, శత్రు సైనికులు, ఉగ్రవాదులపై యుద్ధనౌకల్లో నుంచి అత్యాధునిక మెషిన్గన్లతో దాడి జరిపే తీరు.. నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో జలాంతర్గాముల్ని ఏ విధంగా గుర్తిస్తారుు, యుద్ధ నౌకల్లో నావికులు ఒకదాని నుంచి మరో నౌకలోకి తాడు సాయంతో ఎలా వెళ్తారు. సముద్రంలో చిక్కుకుపోరుున వారిని హెలికాప్టర్ల ద్వారా ఏవిధంగా రక్షిస్తారు.. జలాంతర్గాముల రాకపోకలు ఎలా ఉంటాయన్న అంశాలు ప్రదర్శించారు. యుద్ధ నౌకలివే.. సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు, యుద్ధ విన్యాసాలు చూపించేందుకు ఐఎన్ఎస్ శక్తి, శివాలిక్, సత్పుర, రణ్విజయ్, సుకన్య, కోరా, కాట్మా, కుంజర్ యుద్ధ నౌకలను వినియోగించారు. వీటితో పాటు సింధువీర్ జలాంతర్గామి పాల్గొంది. చేతక్, కమావ్-28, సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ విధానాన్ని ప్రదర్శించారు. అనంతరం రెండు హాక్ ఫైటర్ (అడ్వాన్స జెట్ ట్రైనర్) ఎరుుర్క్రాఫ్ట్లు, రెండు యుద్ధ విమానాలు డార్నియర్, పి8ఐ విన్యాసాలను ప్రదర్శించారు. పి8ఐ విమానాన్ని ఇటీవలే అమెరికా నుంచి కొనుగోలు చేసి బహుళార్ధ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్టు ఫ్లీట్ కమాండర్ బి.దాస్ గుప్తా వెల్లడించారు . -
‘మేకిన్ ఇండియా’ విమానాలు కావలెను
- 200 వరకు కొనుగోలుకు భారత్ యత్నాలు - స్పందించిన అమెరికా, స్వీడన్ కంపెనీలు న్యూఢిల్లీ: స్థానిక భాగస్వామితో తమ దేశంలో తయారుచేస్తే 200 విదేశీ యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. వీటి విలువ 15 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. ఇది దేశ అతిపెద్ద రక్షణ ఒప్పందం కాగలదు. సోవియట్ కాలం నాటి విమానాలను పూర్తిగా అటకెక్కిస్తే భారత్కు 300 సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాలు అవసరమవుతాయి. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ విమానాలను కొననున్న భారత్ ఇతర మార్గాల నుంచి మరిన్ని సమాకూర్చుకోవాలని సంకల్పించింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలను దీటుగా ఎదుర్కోవాలంటే ఇకపై సేకరించే యుద్ధ విమానాలను స్వదేశంలో ఉత్పత్తి చేసి దిగుమతులకు కళ్లెం వేయడమే మార్గమని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో విదేశీ కంపెనీల నుంచి సాంకేతికత బదిలీ కీలకం. ఈ మేరకు ఇప్పటికే పలు విదేశీ కంపెనీలతో చర్చలు ప్రారంభించారు. సిద్ధమంటున్న విదేశీ కంపెనీలు: భారత్లో ఎఫ్-16 విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని, భారత సైన్యం అవసరాలు తీర్చడమే కాకుండా వాటిని విదేశాలకూ ఎగుమతి చేస్తామని అమెరికా కంపెనీ లాక్హీడ్ మార్టిన్ తెలిపింది. ప్రత్యేకంగా ఇలాంటి విమానాలనే తయారుచేస్తే భవిష్యత్తులో భారత్ వీటికి కేంద్రంగా మారగలదని భారత్కు తెలిపింది. స్వీడన్ కంపెనీ సాబ్ కూడా తన గ్రైపెన్ విమానాల తయారీకి భారత్లో యూనిట్ నిర్మిస్తామని ప్రకటించింది. నాలుగో తరం యుద్ధ విమానాలు కావాలని భారత్ కోరిందని సంస్థ చైర్మన్ వైడర్స్ట్రామ్ చెప్పారు. ముందస్తు షరతులు లేనందు వల్ల తమ యూనిట్లో కనీసం 100 విమానాలను తయారుచేయగలమన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బోయింగ్ కూడా ఎఫ్ ఏ-18 హార్నెట్లను ఇవ్వడానికి అంగీకరించినా సాంకేతికత బదిలీపై ఎలాంటి హామీ లభించలేదు. సాంకేతికత లేమే లోపం: ‘రక్షణ రంగ సాంకేతికతపై భారత్కు పట్టులేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అగ్ర దేశాల నుంచి పూర్తిగా లేదా గణనీయంగా సాంకేతికత బదిలీ జరిగితే భవిష్యత్తు అభివృద్ధికి పునాది పడుతుంది’ అని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఎం మాతేస్వరణ్ అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా జరిగిన ఆలస్యాన్ని భర్తీ చేయడానికి భారత్ 200కు పైగానే విమానాలను తయారుచేసుకోవాలని సూచించారు. -
కూలిన మిగ్ విమానం ఇంధన ట్యాంక్
- పేలుడు కారణంగా భారీ మంటలు - విశాఖ విమానాశ్రయంలో కలకలం గోపాలపట్నం, మల్కాపురం(విశాఖ): విశాఖ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాం తంలో ఐఎన్ఎస్ డేగా నుంచి రోజూ మాదిరిగానే నాలుగైదు యుద్ధ విమానాలు విన్యాసాల కోసం బయల్దేరాయి. వాటిలో మిగ్-57 విమానం రన్వే నుంచి గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలోని ఇంధన ట్యాంకు రన్వేపైకి జారిపడింది. పెలైట్ అప్రమత్తమై విమానాన్ని ఆపకుండా గాల్లోకి దూసుకుపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంధన ట్యాంకు పడిన చోట గడ్డి కూడా తగలబడడంతో మంటలు చెలరేగాయి. వెంటనే ఐఎన్ఎస్ డేగాతోపాటు, విమానాశ్రయం నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు ఆర్పాయి. కాగా ఇంధన ట్యాంకుకు చెందిన ఒక శకలం మల్కాపురం హెచ్పీసీఎల్ సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్లో పడటంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ సంఘటనతో విమానాల రాకపోకలు గంటకుపైగా నిలిచిపోయాయి. ఫలితంగా పలు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. అయితే విమానం నుంచి ఇంధన ట్యాంకు నగరంలో పడి ఉంటే పరిస్థితేంటని జనం భయంతో చర్చించుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం విశాఖలో ఇది రెండోసారి. -
'డబ్బంతా చెల్లిస్తేనే పాక్ ఫైటర్ జెట్స్ ఇస్తాం'
న్యూయార్క్: పాకిస్థాన్కు విక్రయించనున్న ఎనిమిది ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల విషయాల్లో సబ్సిడీకి అనుమతించబోమని అమెరికా స్పష్టం చేసింది. పూర్తి స్థాయి చెల్లింపులు చేస్తేనే ఆ విమానాలు అందించగలమని చెప్పింది. సోమవారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఇప్పటికీ ఆ విమానాలను కొనుక్కోవచ్చని అయితే పూర్తి స్థాయి చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. మొత్తం 699.04 మిలియన్ల డాలర్లు ఇచ్చేసి తీసుకోవచ్చని తెలిపింది. పెంటగాన్ వెల్లడించిన ఓ నోటీసు ప్రకారం 42శాతం సబ్సిడీని పాకిస్థాన్ కోరింది. తమ దేశంలో ఉన్న ఉగ్రవాదులను ముఖ్యమంగా వాయవ్య పాకిస్థాన్ లోని ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు తమకు సహాయం చేయాల్సిందిగా అందులో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను విక్రయించాల్సిందిగా పాక్ అమెరికాను కోరగా అందుకు ఆ దేశం అనుమతించింది. అయితే, సబ్సిడీ కోరిన నేపథ్యంలో పాకిస్థాన్ అవసరం అయితే, జాతీయ స్థాయి నిధులను వెచ్చించి కొనుగోలు చేయొచ్చని సూచించినట్లు అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. -
'ఉగ్రవాదుల కంటే మేమే పటిష్టం'
ఒట్టావా: ఇస్లామిక్ గ్రూప్ ఉగ్రవాదుల స్థావరాలున్న ఇరాక్, సిరియా దేశాలపై గత కొన్ని నెలలుగా జెట్ విమానాల ద్వారా యుద్ధం కొనసాగిస్తున్న కెనడా కొద్ది రోజుల్లో వెనక్కి తగ్గనుంది. ఆ దేశాల్లో దాడులు కొనసాగిస్తోన్న తమ దేశ 6 యుద్ధ విమానాలను వెనక్కి రప్పించాలని తాజాగా నిర్ణయించింది. దేశ పౌరుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలు సిరియా, ఇరాక్ లపై దాడులు చేస్తుంది. ఫిబ్రవరి 22న ఆరు యుద్ధ విమానాలను కెనడాకు రప్పించనున్నట్లు రక్షణశాఖ మంత్రి హర్గిత్ సజ్జన్ వెల్లడించారు. ప్రధాని జస్టిన్ ట్రూడ్, రక్షణశాఖమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఈ విషయమై సమావేశమయ్యారు. వచ్చే మూడేళ్లకుగానూ మిడ్ ఈస్ట్ ప్రాంతానికి సుమారు 5 వేల కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు. ఉగ్రదాడులకు పాల్పడే మిలిటెంట్ల కంటే కెనడా చాలా పటిష్టంగా ఉందని ప్రధాని ట్రూడ్ వ్యాఖ్యానించారు. శత్రువులు అసలు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. టెర్రరిస్టులపై పోరాడుతున్న వారికి ఎప్పుడు తమ సహకారం ఉంటుందని, మూడింట రెండు వంతుల ప్రజల నిర్ణయం మేరకు దాడులకు ప్రస్తుతం ఆపివేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ అవసరమనుకుంటే ఉగ్రదేశాలపై బాంబు దాడులు చేసేందుకు సిద్ధమని ట్రూడ్ వివరించారు. -
సిరియా, ఇరాక్ల నుండి ఫైటర్ జెట్ విమానాల ఉపసంహరణ
కెనడా: సిరియా, ఇరాక్ల నుండి ఫైటర్ జెట్ విమానాలను ఉపసంహరించుకుంటున్నట్లు కెనడా ప్రధాని ట్రుడేవ్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తెలిపినట్లు మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ట్రుడేవ్ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి కెనడా ఫైటర్ జెట్ విమానాలను గత సంవత్సరం పంపింది. ఒప్పందం ప్రకారం మార్చి 2016 వరకు కెనడా ఫైటర్ జెట్ విమానాలు ఇరాక్, సిరియాలో కొనసాగాల్సి ఉంది. ఇటీవల లిబరల్ పార్టీ తరపున కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రుడేవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన ట్రుడేవ్.. ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఫైటర్ జెట్ల ఉపసంహరణ నిర్ణయం ఎప్పటి నుండి అమలులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ట్రుడేవ్ ప్రకటించలేదు. ఉత్తర ఇరాక్లో కుర్ధులకు మద్దతుగా తమ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. -
రెక్కలు ఊపితే... అది స్నేహ చిహ్నం!
రెక్కల చేతులు యుద్ధ విమానాలే కాదు, సాధారణ విమానాలు కూడా డిఫెన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే బయలుదేరాలి. ‘ఫ్రెండ్లీ’ అనే సంకేతాన్ని జారీ చేసిన తర్వాత విమానాలు టేకాఫ్ అవుతాయి. మన గగనతలంలో మనవి కాని విమానాలు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని అడ్డగించడానికి మన ఎయిర్ క్రాఫ్ట్ను పంపించాలి. అందుకోసం యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటాయి. అది అనుమానాస్పద విమానానికి ఎదురుగా వెళ్లి రెక్కలు ఊపుతుంది. ఇలా రెక్కలను కదిలించడం అంటే... నీ కదలికలను అనుమానిస్తున్నామని ఎదుటి విమానంలోని పైలట్కి సంకేతం ఇవ్వడం! శత్రు విమానం అయితే ఈ సంకేతానికి స్పందించకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంటుంది. సంకేతాలకు స్పందించడం లేదనే సమాచారాన్ని ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న పైలట్ మాకు చేరవేస్తాడు. అలాంటప్పుడు పర్యవేక్షణ బృందం తరఫున ఫైరింగ్ ఆదేశాలు జారీ చేస్తాం. (మాజీ రింగ్ కమాండర్ టి.జె.రెడ్డి ఇచ్చిన సమాచారంతో) -
తీవ్రమైన ఇజ్రాయెల్ దాడులు
పాలస్తీనాలో 82కి పెరిగిన మృతుల సంఖ్య గాజా/జెరూసలేం: హమస్ అధీనంలో ఉన్న గాజా స్ట్రిప్పై వైమానిక దాడులను ఇజ్రాయెల్ తీవ్రం చేసింది. గురువారం దాదాపు 780 హమస్ మిలిటెంట్ కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆ దాడుల్లో 31 మంది చనిపోయారు. దీంతో ఈ మూడు రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినవారి సంఖ్య 82కి చేరింది. ఫుట్బాల్వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూస్తుండగా ఒక హోటల్పై జరిగిన దాడిలో 9 మంది పాలస్తీనావాసులు మరణించారు. ఇజ్రాయెల్ చర్యలకు రాకెట్ దాడులతో పాలస్తీనా మిలిటెంట్లు సమాధానమిచ్చారు. దిమోనా అణు రియాక్టర్ లక్ష్యంగా ఇజ్రాయెల్పైకి వారు గురువారం 15 రాకెట్లను ప్రయోగించారు. ఖాన్ యూనిస్ పట్టణంలోని ఒక ఇంటిపై చేసిన దాడి దురదృష్టకరమని ఇజ్రాయెల్ సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, దాడులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆ దాడిలో ఎనిమిదిమంది చనిపోగా, పాతికమంది వరకు గాయాలపాలయ్యారు. -
‘ఆకాశ్’మంత అలక్ష్యం !
నూగూరి మహేందర్ (సాక్షి, హైదరాబాద్): భారత అమ్ముల పొదిలో ప్రముఖ అస్త్రమైన ఆకాశ్ క్షిపణుల సరఫరా సాఫీగా జరిగే అవకాశాలు కనపడటం లేదు. క్షిపణుల తయారీ బాధ్యత స్వీకరించిన హైదరాబాద్లోని ప్రభుత్వరంగ సంస్థ బీడీఎల్ క్షిపణుల తయారీకి కావాల్సిన విడిభాగాల కొనుగోలు కోసం కొత్తగా 100 చిన్న కంపెనీలను (వెండర్స) ఎంపిక చేసుకున్నా ఇప్పటివరకు వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు. కాంట్రాక్టు మేరకు క్షిపణులు తయారుచేసి అందజేయకుండా పాత వెండార్లతోనే సర్దుకుపోతోంది. గత మూడేళ్లుగా బీడీఎల్ అధికారుల్లో చలనం లేకపోవడం రక్షణశాఖకు ఆందోళన కలిగిస్తోంది. ఆకాశ్ క్షిపణిని డీఆర్డీవో, ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీ, భారత్ ఎలక్ట్రానిక్స్లు సంయుక్తంగా 20 ఏళ్లపాటు శ్రమించి సొంతగా అభివృద్ధి చేశాయి. ఉపరితలం నుంచి ఆకాశంలోకి ఈ క్షిపణిని ప్రయోగిస్తారు. 60 కేజీల వార్హెడ్ను ఇది మోసుకుపోగలదు. 30 కిలోమీటర్ల పరిధిలో మానవ రహిత విమానాలు, యుద్ధ విమానాలు, క్షిపణులను గుర్తించి కూల్చివేయగలదు. ఈ నేపథ్యంలో 2010లో సైనిక దళం 2,000 క్షిపణులకు, 2011లో వైమానిక దళం 1,000 క్షిపణుల తయారీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు ఆర్డరు ఇచ్చాయి. ఈ రెండింటి విలువ సుమారు రూ.26,500 కోట్లు. అడ్వాన్సుగా కొంత మొత్తాన్ని కూడా బీడీఎల్ తీసుకుంది. కొత్త కంపెనీలను ఆహ్వానించిన బీడీఎల్ భారీ కాంట్రాక్టు దృష్ట్యా విడిభాగాల కొనుగోలుకు ఇప్పటివరకు తమకున్న కంపెనీలు సరిపోవని బీడీఎల్ భావించింది. మరిన్ని కంపెనీల కోసం 2010లో ఆసక్తి వ్యక్తీకరణను కోరింది. 300 పైగా కంపెనీలు ముందుకొచ్చినా దరఖాస్తుల పరిశీలన అనంతరం 100 కంపెనీలను ఎంపిక చేసింది. సుమారు రూ.5 వేల కోట్ల విలువైన పనులు కొన్నేళ్లపాటు తమకు లభిస్తాయని ఆయా కంపెనీలు ఆశించాయి. ఆ మేరకు కొన్ని కంపెనీలు రుణాలు తీసుకుని మరీ ప్లాంట్ల విస్తరణ చేపట్టాయి. రాష్ట్రానికే చెందిన ప్రముఖ పెట్టుబడిదారు ఒకరు బీడీఎల్ ఆర్డరుపై ఆశతో ఏకంగా కంపెనీనే స్థాపించారు. అయితే మూడేళ్లు కావస్తున్నా బీడీఎల్ ఇంతవరకు ఎంపికచేసిన కంపెనీలకు పనులు అప్పగించలేదు. పాత కంపెనీలు బీడీఎల్పై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఆర్డర్లలో జాప్యంపై బీడీఎల్ను సంప్రదిస్తే కంపెనీల ఎంపిక బాధ్యత తమది కాదంటూ డీఆర్డీవోపై నెపం వేస్తోందని ముంబయికి చెందిన ప్రముఖ కంపెనీ ఏరోస్పేస్ విభాగం హెడ్ సాక్షి ప్రతినిధికి ఫోన్లో తెలిపారు. ప్రస్తుత పరిస్థితికి అవినీతి కారణమై ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాలను పక్కకునెట్టి పాత కంపెనీల ఒత్తిడికి తలొగ్గారని ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ ప్రతినిధి చెప్పారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ప్రజా రవాణా ప్రాజెక్టు చేపడుతున్న ఓ సంస్థే ఇదంతా నడిపిస్తోందని అన్నారు. 500 మిస్సైళ్లు కూడా అప్పగించలేదు.. కాంట్రాక్టులో భాగంగా బీడీఎల్ ఏటా 500 క్షిపణులను సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికి 500 క్షిపణులు కూడా సరఫరా చేయలేదని విశ్వసనీయ సమాచారం. ‘రెండు దశాబ్దాలు శ్రమకోర్చి భారతావని గర్వపడేలా ఆకాశ్ను డిజైన్ చేశాం. అలాంటి క్షిపణి తయారీలో బీడీఎల్ తీరు ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా హెచ్చరిస్తున్నాం. గడువులోగా క్షిపణులను సరఫరా చేయాలని పదేపదే చెబుతున్నా వారిలో మార్పు రావడం లేదు’ అని డీఆర్డీవో అధికారి ఒకరు అసహనం వ్యక్తం చేశారు. బీడీఎల్ చేతులెత్తేస్తే రక్షణశాఖ విదేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇదెంతో వ్యయంతో కూడుకున్న వ్యవహారమైనందున కరంటు ఖాతా లోటు మరింత పెరగడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కొత్త కంపెనీలను తీసుకుంటాం.. ఆకాశ్ క్షిపణులను ఎన్ని సరఫరా చేశారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ బీడీఎల్ ఈడీ మాధవరావును సంప్రదించింది. అయితే ఆ వివరాలు వెల్లడించలేమని ఆయన చెప్పారు. కొత్త కంపెనీల జాబితా ఇంకా ఖరారు కాలేదని త్వరలో వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు.