free current
-
TG: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక.. ఇవాల్టీ నుంచే విద్యాసంస్థలో ఉచిక విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందనుంది.గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. గత పది సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించింది మా ప్రభుత్వమే. 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించాం, మరో 6వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీల మౌలిక వసతులకై రూ.300 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు రూ.667 కోట్లు వెచ్చించాం. శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు రూ. 136 కోట్లు విడుదల చేశాం. ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. -
ఉచిత కరెంట్ కోసం అప్లయ్ చేశారా?, లేదంటే ఇలా చేయండి..
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. సోలార్ పవర్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అదే సమయంలో, ఈ పథకం మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని చెప్పారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకుందాం ♦ ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ♦ అప్లయ్ ఫర్ రూఫ్టాప్ సోలార్ ఆప్షన్పై క్లిక్ చేయండి ♦ మీరు ఈ వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి - రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాల్ని నమోదు చేయాలి. ♦ పూర్తి చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ♦ మీరు ఇప్పుడు సోలార్ ప్యానల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో బ్యాంక్ వివరాలను సమర్పించాలి. ♦ మీరు ఆమోదం పొందిన తర్వాత, మీ డిస్కమ్లోని రిజిస్టర్డ్ విక్రేతలలో ఎవరైనా ప్లాంట్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ♦ ఇనెట్ మీటర్ను ఇన్స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ♦ ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ను పోర్టల్లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. -
వైఎస్ జగన్ హయంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు
-
కాంగ్రెసోళ్లది ఉత్త కరెంటు
సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కేసీఆర్ను కరెంట్ గురించి అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని ఆర్ధిక, వైద్యారోగ్యాశాఖ మంత్రి టి.హరీశ్రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్గా మార్చిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు సిగ్గు లేకుండా కరెంట్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లా కేంద్రంలో సఖి, భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ సంకల్పానికి దైవబలం ఉంది.. ఆయన పనిమంతుడే కాదు దేవున్ని బాగా కొలుస్తారు, నమ్ముతారు. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువే లేదు’ అని వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు, కిరణ్ కుమార్రెడ్డి హయాంలో కరువుతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారని గుర్తుచేశారు. చాలా రాష్ట్రాల్లో కరువు వచ్చినా తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఆ ఛాయలు లేవన్నారు. ఒక్కప్పుడు ఐటీ అని కలవరించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ భూముల విలువ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. కాగా, ఈ వయసులో ఆయనను అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో డీజీపీ అంజన్కుమార్, అదనపు డీజీ (ఉమెన్ సేఫ్టీ) షికాగోయల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్, ఉద్యానవన శాఖ కమిషనర్ హన్మంత రావు, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ పాటిల్ పాల్గొన్నారు. శతమానం భవతి.. శ్రీజ సిద్దిపేటలో రూ 30 లక్షలతో ఏర్పాటు చేసిన శిశుగృహ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది చేతిలో ఓ మూడు నెలల పసికందు చిరునవ్వులు చిందించడంతో ఆయన అబ్బురపడ్డారు. వెంటనే పసికందును ఎత్తుకొని సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు. మూడు నెలల క్రితం పసికందును విక్రయించే క్రమంలో అడ్డుకొని సంరక్షణ బాధ్యతలు స్వీకరించినట్టు వారు మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా ఇప్పటివరకు పేరులే కుండా ఉన్న ఆ పసికందుకు శ్రీజ అని నామకరణం చేశారు. నిండు నూరేళ్లు శ్రీజ ముఖంలో చిరునవ్వులు వెల్లివిరియాలని దీవించారు. -
బీజేపీ శాపం.. కాంగ్రెస్ పాపం..కేసీఆర్ దీపం: హరీశ్
గజ్వేల్: ’’తెలంగాణకు రూపాయి ఇయ్య.. ఏం చేసుకుంటావో చేసుకో అన్న కిరణ్కుమార్రెడ్డి ఇయ్యాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి గురువు, ఉచిత కరెంట్ వద్దన్న చంద్రబాబు రేవంత్రెడ్డికి గురువు. దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. తెలంగాణ ద్రోహుల చుట్టూ తిరుగుతున్న శాపం లాంటి బీజేపీ, పాపం లాంటి కాంగ్రెస్ మనకెందుకు..?’’ అని మంత్రి టి.హరీశ్రావు వ్యాఖ్యానించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో హోంమంత్రి మహ మూద్ అలీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగం ఉసురుపోసుకున్న బీజేపీ, మూడు గంటలే కరెంటు చాలంటున్న కాంగ్రెస్ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అసెంబ్లీలో తెలంగాణకు నిధులివ్వరా? అని అప్పట్లో తాను ప్రశ్నిస్తే ఒక్క రూపాయి ఇయ్య...ఏం చేస్తారో చేసుకోండి అన్న కిరణ్కుమార్రెడ్డిని కిషన్రెడ్డి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోయి మరిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించారని మండిపడ్డారు. కిరణ్, బాబు కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారా? తెలంగాణను రాచి రంపాన పెట్టి, ఈ ప్రాంతానికి కరెంట్, నీళ్లు ఇయ్యకపోగా.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు రేవంత్రెడ్డికి గురువు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన కిరణ్, చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా..? ఇది సిగ్గుచేటు అంటూ వ్యా ఖ్యానించారు. చంద్రబాటు ఇటీవల తెలంగాణపై ప్రేమ చూపినట్లు మాట్లాడు తున్నారని, అదీ ఏపీ సీఎం జగన్పై కోపంతో మాత్రమేనని, నిజంగా ఆయనకు తెలంగాణపై ప్రేమ లేదని, ముమ్మాటికీ ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి అని పునరుద్ఘాటించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్లో టీడీపీ వాసనలు పోలేదా?.. టీ కాంగ్రెస్ కొంపముంచేశాడా?
రాజకీయాలలో ఒక్క పదం చాలు మొత్తం వాతావరణాన్ని మార్చడానికి. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఆసరాగా చేసుకుని అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు, నేతలు తీవ్ర అలజడి సృష్టించడానికి యత్నించారు. వారికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కూడా కొన్ని ఆందోళనలకు దిగినా, మొత్తం మీద బీఆర్ఎస్దే పై చేయి అయినట్లు అనిపిస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్కు పోటాపోటీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనన్న భావన ఏర్పడిన తరుణంలో రేవంత్ ఉచిత విద్యుత్కు సంబంధించి చేసిన వ్యాఖ్య ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. అదే టైమ్లో కాంగ్రెస్లోని ఇతర వర్గాలు ఆ పాయింట్ ఆధారంగా ఆయనను ఇరుకున పెట్టడానికి సహజంగానే యత్నిస్తాయి. తెలంగాణ మంత్రి కేటిఆర్ అయితే పవర్ పుల్ పంచ్ డైలాగు వాడారు. రేవంత్ వీటన్నిటికి సమాధానం ఇస్తూ ట్వీట్ చేసినా జరగవలసిన నష్టం కొంతమేర జరిగిపోయింది. అమెరికాలో జరిగిన తానా సభలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో ఇరవై నాలుగు గంటలపాటు వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వనవసరం లేదని, ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ల వ్యవహారం ఉందని ఆరోపించారు. తెలంగాణలో 95 శాతం మంది మూడు ఎకరాలలోపు వారేనని, ఎకరానికి నీరు ఇవ్వడానికి గంట సమయం పడుతుందని, ఆ లెక్కన మూడు గంటల సమయం కరెంటు ఇస్తే చాలని, మొత్తం మీద ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు నాలుగునెలల ముందు ఇలాంటి వ్యాఖ్య చేయడంతో బీఆర్ఎస్ వెంటనే రంగంలో దూకి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని, మూడు గంటలే విద్యుత్ సరఫరా అన్న రేవంత్ను ఉరికించాలని అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కేటిఆర్ స్పందిస్తూ మూడు పంటలు పండించే బీఆర్ఎస్ కావాలా? మూడు గంటలే కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా ? అని సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్లో కూడా అలజడి ఏర్పడింది. పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాకూర్ మొదలు సీఎల్పి నేత భట్టి విక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు రకరకాలుగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్య ఒకరకంగా రేవంత్ను ఇబ్బంది పెట్టేదే. రేవంత్కు అండగా ఉన్నట్లు కనిపిస్తూనే, వ్యంగ్యంగా మాట్లాడారు. ఇండియాలో ఉన్నంతవరకు బాగానే ఉన్నారని, అమెరికాలో తానా సభలో నటుడు బాలకృష్ణ, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులను కలిసిన తర్వాత రేవంత్ ఇలా మాట్లాడారేమోనని అన్నారు. చదవండి: పవన్ ఇంతకీ ఏం సాధించినట్లు?.. పిచ్చి పీక్స్కు వెళ్లడం అంటే ఇదేనేమో! ప్రత్యేకించి బాలకృష్ణ తిక్క ఈయనకు అంటిందేమో అన్నట్లు వెంకటరెడ్డి చమత్కరించారు. రేవంత్లో తెలుగుదేశం వాసనలు పోలేదని పరోక్షంగా ఆయన చెప్పారన్నమాట. అదే టైమ్లో అసలు తెలంగాణలో రైతులకు ఎక్కడ 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని ప్రశ్నించారు. అలా ఇస్తున్నట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఉచిత విద్యుత్ అన్నది కాంగ్రెస్ పేటెంట్ అని, 24 గంటల కరెంటు ఇస్తామని భట్టి పేర్కొన్నారు. వరంగల్ వచ్చి ప్రత్యేకంగా సభ పెట్టి రైతుల డిక్లరేషన్ను ప్రకటించిన కాంగ్రెస్కు ఇది ఊహించని పరిణామమే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీతో ప్రకటింప చేశారు. కాని అప్పుడు అది ఎలా సాధ్యమో కాంగ్రెస్ నేతలెవరూ వివరించలేదు. రేవంత్ ఆర్ధికవేత్త మాదిరి మాట్లాడి బోర్ల పడ్డారనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని రేవంత్ చెప్పడం వల్ల పార్టీ ఇరుకున పడినట్లయింది. ఆయన చెప్పినదానిలో హేతుబద్దత ఉందా? లేదా? అన్నది వేరే చర్చ. కాని ఆయన డిఫెన్స్లో పడడం వల్లే, తన ప్రకటనను వక్రీకరించారని, బీఆర్ఎస్ మూడు చెరువుల నీళ్లు తాగడం ఖాయమని, మూడోసారి అధికారంలో రాలేదని ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను అమలు చేస్తామని, రైతు బంధు కింద ఎకరాకు పదిహేనువేలు ఇస్తామని, తదితర అంశాలన్నిటిని ప్రస్తావించినా కీలకమైన ఉచిత విద్యుత్ విషయంలో అనవసర వివాదం సృష్టించుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, రేవంత్ దిష్టి బొమ్మలు దహనం చేయడం వంటి వాటిలో రాజకీయం వేడెక్కింది. దీనికి పోటీగా కాంగ్రెస్ కూడా నిరసనలు చేపట్టినా, వాటికి అంత ప్రాధాన్యత లేకుండా పోయినట్లయింది. రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష కట్టిందని నిరసిస్తూ తాము గాందీ భవన్లో నిరశన చేయబోతుండగా, దానిని చెడగొట్టడానికి బీఆర్ఎస్ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేసినా, అందులో పస కనిపించలేదు. ఇటీవలే రేవంత్ మరో సందర్భంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సీఎం కావచ్చని అనడం కూడా విమర్శలకు దారి తీసింది. కాంగ్రెస్లో టీడీపీ నేతల ఆధిపత్యం పెరిగిపోయిందన్న భావనను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్పై రాజకీయంగా దాడి పెంచవలసిన తరుణంలో రేవంత్ స్వయంకృతాపరాధంతో ఆత్మరక్షణలో పడ్డారు. వెంటనే కొందరు నేతలు అధిష్టానానికి దీనిపై ఫిర్యాదులు కూడా చేశారు. ఈ సందర్భంగా రేవంత్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు శిష్యుడుగానే ఉన్నారన్న అభిప్రాయాన్ని ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ యత్నించింది. చంద్రబాబు వ్యవసాయం దండగ అని అంటే, రేవంత్ ఉచిత విద్యుత్ దండగ అని అంటున్నారని ఆరోపించింది. 2004 ఎన్నికల ముందు ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నేతగా ప్రకటించారు. దానిపై అప్పట్లో కూడా పార్టీలో బిన్నాబిప్రాయాలు వచ్చాయి. సాధ్యాసాధ్యాలపై కూడా చర్చలు జరిగాయి.అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని టీడీపీ నేతలతో అన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కూడా తదనుగుణంగా కార్టూన్లు కూడా వేశాయి. చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం టీడీపీ 2004లో ఓడిపోవడానికి ఇది కూడా కారణం అయింది. చంద్రబాబు చేసిన ఒకటి, రెండు వ్యాఖ్యలు టీడీపీ కొంప ముంచాయి. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యల వల్ల అంత నష్టం జరుగుతుందా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. అయితే అసలే ప్రతిపక్షంలో ఉండి నానా తంటాలు పడుతున్న తరుణంలో రేవంత్ ఇలా మాట్లాడడం రాజకీయంగా తెలివైన పనికాదు. గతంలో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముల్కి నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు ముల్కికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఇదే ఫైనల్ అన్న వ్యాఖ్య చేశారు. దానిపై ఆయనను వ్యతిరేకించే ఆంధ్ర కాంగ్రెస్ నేతలు కొందరు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి ఆజ్యం పోశారు. చివరికి పివి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టవలసి వచ్చింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వలంటీర్లను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయనను తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. వాటిని వెనక్కి తీసుకోలేక, సమర్దించుకోలేక సతమతమవుతున్నారు. ఇలా ఆయా నేతలు చేసిన పలుప్రకటనలను ఉదాహరణగా తీసుకోవచ్చు. మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి బీసీలా? వంకాయలా అని యాథాలాపంగా అన్నారు. అది ఆరోజుల్లో పెద్ద వివాదం అయింది. చంద్రబాబు నాయుడు ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన వైనం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. అలాగే మగపిల్లాడిని కంటానని కోడలు అంటే అత్త వద్దంటుందా అని మరో అభిప్రాయం చెప్పి మహిళల ఆగ్రహానికి ఆయన గురి అయ్యారు. అసెంబ్లీలో ఒకసారి చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ఒక కామెంట్పై టీడీపీ నానా రచ్చ చేసింది. తదుపరి వైఎస్ దానిని వెనక్కి తీసుకున్నారు. ఇవన్ని ఎందుకంటే రాజకీయాలలో అందులోను ఎన్నికల సమయంలో నేతలు చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. ఒక్కోసారి ఒక్క నినాదమే పార్టీకి ఎంతో ఉపయోగపడవచ్చు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హటావో నినాదం మొత్తం దేశాన్ని కదల్చివేసింది. 1999లో ఈసారి వాజ్ పేయికే అన్న నినాదం బీజేపీకి కలిసి వచ్చింది. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం పెద్ద ఉద్యమానికి అండగా నిలిచింది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క చాన్స్ అన్న ప్రచారం బాగా కలిసి వచ్చింది. ఇలా ఆయా వ్యాఖ్యలు కొన్నిసార్లు నెగిటివ్గా, మరికొన్నిసార్లు పాజిటివ్గా మారతాయి. ఎన్నికల సమయంలో నెగిటివ్ వ్యాఖ్యలు చేశారో,ప్రత్యర్ది పార్టీ దానిని అందిపుచ్చుకుని ప్రజలలో ఆ పార్టీ నేత పరపతిని దెబ్బతీస్తుంది. సరిగ్గా ఇప్పుడు రేవంత్ను బీఆర్ఎస్ అలాగే ఇరుకునపెట్టింది. దానికి కాంగ్రెస్లో అంతర్గతంగా ఉండే వర్గాలు కూడా ఆయనను చికాకుపెట్టాయి. అందుకే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు.. నోరు జారితే వెనక్కి తీసుకోలేం అని అంటారు. దానిని నేతలు గుర్తుంచుకోకపోతే వారికే నష్టం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
క్షమాపణ చెప్పాల్సిందే, లేకుంటే రాష్ట్రంలో తిరగనివ్వం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న ఉచిత కరెంట్పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా అటు రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు. రైతుకు వ్యవసాయం పండగ కావాలంటే నీళ్ళు, రైతు బంధు ఇస్తున్నామని.. వ్యాపార వేత్తలకు కరెంట్ ఇవ్వొదని రేవంత్ రెడ్డి చెప్పడం సమజసం కాదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఉచిత కరెంట్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పాన లో వ్యవసాయం పండగ అయ్యిందని.. 24 గంటల కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బేశరుతుగా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. కాగా తెలంగాణ రైతాంగానికి మొత్తానికి ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా వేడిని రాజేశాయి. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! -
కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి!
సాక్షి, బెంగళూరు: ‘‘మే కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’’ అని కర్ణాటకలో ఓ గ్రామస్థులు తెగేసి చెప్పారు. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బకాయిలతో సహా కరెంటు బిల్లులన్నీ కట్టాలన్న బిల్లు కలెక్టర్ గోపిని గ్రామస్థులు ఎదురు తిరిగారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది గనక గ్రామస్తులు తమ కరెంటు బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. ఎన్నికల బిల్లులను ఆ పార్టీ నుంచే వసూలు చేసుకోవాలని స్పష్టం చేశారు. దాంతో చేసేది లేక ఆయన వెనుదిరిగాడు. కాగా అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. Villagers in Chitradurga refuse to pay electricity bill. Exhort others also not to pay! They tell the bill collector that Congress had promised them free electricity, as soon as they came to power… Go take it from them (Congress), they say… If Congress doesn’t give a CM soon,… pic.twitter.com/FNgGtwdPHM — Amit Malviya (@amitmalviya) May 15, 2023 -
మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్ పక్కా ప్లాన్! ఉచిత కరెంటు హామీ
సూరత్: ఈసారి గుజరాత్లో ఎలాగైనా పాగావేయాలని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది. గురువారం సూరత్లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తమను గెలిపిస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై గుజరాత్లోని ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం నిర్వహిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాము ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా మళ్లీ ఆప్కు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. గుజరాత్లో అవినీతిని అంతం చేస్తే తాను సీఎంగా ఉన్న ఢిల్లీ మోడల్ తరహాలోనే ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందని వివరించారు. అంతేకాదు ఆప్ను గెలిపిస్తే 2021 డిసెంబర్ ముందు వరకు ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామన్నారు. మార్పు కోరుకుంటున్నారు గుజరాత్ ప్రజలు 27ఏళ్ల బీజేపీ పాలనతో విసిగిపోయారని కేజ్రీవాల్ అన్నారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. జులైలో ఆయన రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి. చదవండి: బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ -
ఉచిత విద్యుత్పై టీడీపీ అసత్య ప్రచారం: మంత్రి బుగ్గన
సాక్షి,డోన్: వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా డోన్లో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ఏటా రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తుంటే.. రూ.2 వేల కోట్లకు లెక్కలు తేలడం లేదన్నారు. ఈ నేపథ్యంలో మోటార్లకు మీటర్లు బిగించబోతున్నట్లు చెప్పారు. రైతులకు యథాతథంగా ఉచిత విద్యుత్ అందుతోందని తెలిపారు. -
గెలిస్తే ఉచితంగా 300 యూనిట్ల కరెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గురువారం లక్నోలో ఆప్ యూపీ ఇన్ఛార్జి సంజయ్ సింగ్తో కలిసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. బీజేపీ హయాంలో గృహ అవసరాల నిమిత్తం 300 యూనిట్ల విద్యుత్తుకు రూ.1,900 చెల్లిస్తున్నారని అదే ఆప్ ప్రభుత్వం వస్తే ఏమీ చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. యూపీలో గెలిస్తే అధిక కరెంట్ బిల్లులతో సతమతమవుతోన్న 48 లక్షల కుటుంబాల విద్యుత్ బిల్లులను రద్దుచేస్తామన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామని, పాత బకాయిలు మాఫీ చేస్తామని సిసోడియా పేర్కొన్నారు. ఇదే తరహా హామీని ఇప్పటికే ఆప్ పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లోనూ ఇచ్చింది. యూపీలోని మొత్తం 403 స్థానాల్లో పోటీకి దిగుతామని ఆప్ గతంలోనే స్పష్టంచేసింది. ఢిల్లీలో విజయవంతం అయిన విద్యుత్తు ఫార్మూలాను 2017లో పంజాబ్ ఎన్నికల్లో ప్రయోగించి అత్యధిక స్థానాలు పొందిన రెండో పార్టీగా ఆప్ నిలిచింది. ఈ సారి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ల్లోనూ తమదైన ముద్ర వేయాలని ఏడాది నుంచే పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల మొదటి వారంలో వివిధ సర్వేలు పంజాబ్లో ఆప్ గణనీయమైన పురోగతి సాధిస్తుందని పేర్కొనడంతో పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరించడానికి సరైన తరుణమని కేజ్రీవాల్ భావించారు. ఉత్తరప్రదేశ్లాంటి పెద్ద రాష్ట్రంలో పార్టీని ప్రజల్లోకి తీసుకురావాలంటే ఛరిష్మా ఉన్న అగ్రనేత తప్పనిసరి. ఇటు అధికార బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పునాదులు బలంగా ఉండడంతో ఢిల్లీ విద్యుత్ ఫార్మూలానే యూపీలోనే ప్రయోగించాలని ఆప్ విశ్వసిస్తోంది. కరోనా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం మంది ఆదాయం పడిపోయిందని ఓ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా తరలివెళ్లిన వలస కార్మికులు కరోనా వల్ల తిరిగి రావడమూ ఓ కారణమని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఫార్మూలా యూపీలో ప్రభావం చూపుతుందని ఆప్ భావిస్తోంది. -
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత ‘వెలుగు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేవే. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా లాంటి అనేక ప్రజారంజక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కుటుబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వారి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపింది. లబ్దిదారుల కళ్లలో ఆనందం జిల్లాలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు నిరుపేదలే. నెలకు రూ.200 లోపు విద్యుత్ వినియోగించే ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆయా కుటుంబాలు ఎంతగానో ఆనందిస్తున్నాయి. గతంలో ఆయా కుటుంబాల్లో చాలామందికి విద్యుత్ సౌకర్యం ఉండేదికాదు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్ పెట్టుకునేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 జిల్లాలో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 ఉన్నాయి. వాటిలో ఎస్సీ విద్యుత్ కనెక్షన్లు 48,635, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 36,455 ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి జూలై నెల వరకు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్కు సంబంధించి విద్యుత్శాఖకు ప్రభుత్వం రూ.6.11 కోట్లు సబ్సిడీ కింద చెల్లించింది. చదవండి :మహిళల జీవితాల్లో ‘వైఎస్సార్ చేయూత’ వెలుగులు -
TS: ‘ఉచిత విద్యుత్’ లబ్ధిదారుల నమోదుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: సెలూన్లు, ధోబీఘాట్లకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. లబ్ధిదారులు తమ దరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటీ శాఖ అధికారులను కోరా రు. పథకం అమలుపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు నివేదించారు. -
Arvind Kejriwal: అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్
పణజి: గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించారు. రెండో రోజుల పర్యటనలో భాగంగా ఆయన గోవా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు హామీలను ప్రజలకు ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే పాత విద్యుత్ బిల్లులన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మారుస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు ఉచిత విద్యుత్ పొందుతారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రజలు ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రజలు ఉచిత విద్యుత్ పొందితే గోవా ప్రజలు ఎందుకు పొందలేరని ప్రశ్నించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు ముఖ్యనేతలను కలిశారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేసేవారికోసం తమ పార్టీ వెదుకుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలను ఆయన టార్గెట్ చేశారు. ఎన్నికల ఫలితాల్లో 17 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా, 13 సీట్లను బీజేపీ గెలుచుకుందని గుర్తు చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ తరఫున 5 మంది మిగలగా, మిగిలిన వారు వెళ్లి బీజేపీలో చేరారు. తాము ఓటేసిన నేతలు ఇతర పార్టీలకు మారపోవడంపై ప్రజలు మోసానికి గురైనట్లు భావిస్తున్నారని అన్నారు. వారంతా డబ్బుల కోసమే పార్టీ మారినట్లు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. -
సాగు భళా.. 30 ఏళ్లు వర్ధిల్లేలా!
సాక్షి, తిరుపతి : ఉచిత విద్యుత్ పథకానికి మెరుగులద్ది రైతులు సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రానున్న 30 ఏళ్ల పాటు రైతన్నలకు నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ను హక్కుగా అందించేందుకు వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ సర్వీసులకు మీటర్లు బిగించడం ద్వారా పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం పాత లైన్ల స్థానంలో కొత్త లైన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రూ.782 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తోంది. కొత్త లైన్లు.. నయా సబ్ స్టేషన్లు డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల్లో 2.80 లక్షల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ఉన్నాయి. కొత్తగా 3,043 కిలోమీటర్ల మేర లైన్లు నిర్మిస్తున్నారు. 1,532 ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి లోడ్ సామర్థ్యాన్ని పెంచారు. ఈ ఏడాది నూతనంగా మరో 675 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.174.4 కోట్లతో కొత్తగా 72 చోట్ల 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మించనున్నారు. ఇందుకోసం డిస్కం పరిధిలో మొత్తంగా రూ.782 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిస్కం పరిధిలో 10,90,743 విద్యుత్ సర్వీసులు ఉండగా.. అనధికారికంగా మరో 12 వేలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత విద్యుత్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లో-ఓల్టేజీతో మీటర్లు కాలిపోయి నష్టపోయారు. ప్రభుత్వం ఇలాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉచిత విద్యుత్ పథకంపై రైతుల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎస్పీడీసీఎల్ ఈ నెల 1 నుంచి గ్రామ స్థాయిలో రైతు సదస్సులు నిర్వహిస్తోంది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు రైతులకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. నవంబర్ 1నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు, ఇన్ఫ్రారెడ్ సమాచారం గల ప్రామాణిక మీటర్లను బిగిస్తారు. ప్రయోజనాలివీ.. కొత్త మీటర్ల ఏర్పాటకు ముందు అనధికార విద్యుత్ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, చేర్పుల ఆధారంగా విద్యుత్ శాఖ బిల్లుల్లో పేర్లు మార్చుకోవడం, సాగు విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ప్రభుత్వమే రైతులకు నగదు బదిలీ చేయనుంది. ఆ మొత్తాల్ని రైతులు విద్యుత్ శాఖకు బిల్లు రూపంలో చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్ కోసం డిమాండ్ చేసే హక్కు వారికి ఉంటుంది. ఒక్క పైసా కూడా కట్టక్కర్లేదు వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తాం. మీటర్ పొందడం నుంచి కనెక్షన్ తీసుకునే వరకు రైతులు ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. - హెచ్.హరనాథరావు, సీఎండీ, ఎస్పీడీసీఎల్ -
చంద్రబాబుకు బాలినేని సవాల్!
సాక్షి, విజయవాడ: ఉచిత విద్యుత్పై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, రైతులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిందే వైఎస్సార్ అని అన్నారు. పగటిపూట 9 గంటల పాటు సీఎం జగన్ ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని తెలిపారు. రైతుల ఉచిత విద్యుత్ కోసం రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతుకి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ వ్యతిరేకి అని మండిపడ్డారు. తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలన్న విషయాన్ని రైతులు మర్చిపోలేదని చెప్పారు. విద్యుత్ బకాయిలు పెంచి రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. కేంద్రం సూచించిన నిబంధనలను రైతులకు మేలు చేసేలా మార్చామని తెలిపారు. సీఎంగా జగన్ ఉన్నంతవరకు ఉచిత విద్యుత్ అందిస్తామని బాలినేని చెప్పారు. చదవండి: అంబులెన్స్కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్ -
పేదింటి వెలుగులకు సమయం ఆసన్నం
సాక్షి ,కడప : అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని..లేదా సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విద్యుత్ ఉచితంగా అందించడంతోపాటు ఎస్సీ.ఎస్టీల అభివృద్ధి,సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీని వల్ల మన జిల్లాలోనే 81,845 ఎస్సీ,11,769 ఎస్టీలకు అంటే మొత్తం 93,614 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. కడప డివిజన్లో ఎస్సీలకు 8454 గృహ సర్వీసులు ఉండగా మైదుకూరు డివిజన్లో 21681 సర్వీసులున్నాయి. ప్రొద్దుటూరు డివిజన్లో 15,912, పులివెందుల డివిజన్ లో 8484 ,రాజంపేటలో 18,778, రాయచోటి డివిజన్లో 8536 సర్వీసులున్నాయి. ఎస్టీలకు సంబంధించి కడప డివిజన్లో 1277 సర్వీసులుండగా.. మైదుకూరు డివిజన్లో 1178, ప్రొద్దుటూరు 1026, పులివెందులలో 1610, రాజంపేటలో 4032, రాయచోటిలో 2646 గృహ సర్వీసులు ఉన్నాయి. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడంవల్ల ఎస్సీ,ఎస్టీలలో పేదలకు మేలు జరుగుతుందన్నది. ఎస్సీ,ఎస్టీల అభివృద్దికి మరింత కృషి.. ప్రధానంగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు వేరు వేరుగా కారొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల పథకాల ద్వారా ఆర్దిక లబ్ధి చేకూర్చడంతో పాటు ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. భూపంపిణీతోపాటు ఉచిత బోరు బావుల పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద ఎస్సీ,ఎస్టీ చెల్లెమ్మల వివాహాలకోసం లక్ష రూపాయలు ఇవ్వడంతోపాటు గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ప్రత్యేక యూనివర్సిటీ, మెడికల్,ఇంజనీరింగ్ కళాశాలలను సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండా, గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పషాలటీ ఆసుపత్రినినిర్మిస్తామన్నారు. పోడు భూములను సాగుచేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ (ఫారెస్ట్ రైట్స్ యాక్టు 2006 ప్రకారం) గిరిజనులకు వైఎస్సార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. జగన్ సీఎం కాగానే ఈ హామీల అమలుకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
వైఎస్ అలా.. బాబు ఇలా..
సాక్షి, అమరావతి: చేనేత కుటుంబాలకు 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రకటించారు. కానీ అమలుకు నోచుకోలేదు. - వర్షాకాలంలో ఆరుబయట నేతకు వీలుగా షెడ్లు వేస్తామని 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. - వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేనేతలకు హెల్త్ కార్డులిచ్చారు. రూ.500 నుంచి రూ.1,500 వరకు వైద్యానికయ్యే ఖర్చును చెల్లించేవారు. చంద్రబాబు దానికి మంగళం పాడేశారు. - చేనేత కుటుంబాలకు పూర్తిగా పని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగులు విధిగా వారానికి రెండు రోజులు ఖద్దరు వస్త్రాలు ధరించేలా వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేసే లోగా మరణించారు. - వైఎస్ హయాంలో చేనేత వికలాంగులకు నెలకు 25 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేవారు. చంద్రబాబు వచ్చాక దానిని ఎగ్గొట్టారు. - వైఎస్ పాలనలో తక్కువ వడ్డీకి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలిచ్చారు. బాబు వచ్చాక ఇవ్వడం లేదు. రూ.15 వేల విలువచేసే కుంచె, పైపులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. చేనేత కార్మికులకు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. -
ఉచిత విద్యుత్... ఉత్తిదే...
సాక్షి, గిద్దలూరు: హామీలు ఇవ్వడంలో చంద్రబాబుబును మించిన వారు లేరని ప్రజల్లో ప్రచారం ఉంది. నోటికి అంది వచ్చిన హామీలన్నీ గుప్పించి చివరకు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటోకో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇలా హామీల మీద హామీలు గుప్పించి ప్రజలను ఆశకు గరిచేసి తీరా గద్దెనెక్కాక చేయిచ్చిన చంద్రబాబు తాజాగా మరో హామీని తుంగలో తొక్కారు. నాయీ బ్రాహ్మణులు, రజకుల దుకాణాలకు సంబంధించి 150 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ఐదు నెలలు కావస్తున్నా ఇంతవరకు హామీ అమలు కాలేదు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇక అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. నెలనెలా విద్యుత్ బిల్లులు వస్తుండటంతో రజకులు, నాయీ బ్రాహ్మణులు చంద్రబాబుపై మండిపడుతున్నారు. అమలు కాని హామీలు ఎందుకివ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఐదేళ్లయినా వెనుకబడిన కులాల కోసం ఏమీ చేయలేదని బీసీలు టీడీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉచిత విద్యుత్ అందిస్తారంటే ఆశపడ్డారు. పొదుపు మహిళల నుంచి, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే దొంగ హామీలు.. బార్బర్ సెలూన్ ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారం చేపట్టేందుకే చంద్రబాబు ఇలాంటి దొంగ హామీలు ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఐదేళ్లయినా మాఫీ చేయలేదు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి పసుపు కుంకుమ పేరుతో చెక్కులిచ్చారు. ఇదే కాకుండా ప్రతి పొదుపు మహిళకు సెల్ఫోన్ స్తిమని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు హామీలు నీటిమీద బుడగలు తప్ప అమలు చేయరని మరోసారి తేలిపోయింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 550మంది నాయీబ్రాహ్మణులు, 150మంది రజకులు ఉచిత విద్యుత్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా బిల్లు కడుతున్నా.. మంగళి షాపుకు విద్యుత్ బిల్లులో 150 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నెలకు రూ.400 బిల్లు చెల్లించే అవసరం లేదని ఆనందం వేసింది. హామీ ఇచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకు అమలు కాలేదు. బిల్లు రావడం ఆగుతుందని ఆశపడుతున్నా కానీ, ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిందేనని కరెంటోళ్లు వెంటబడి కట్టించుకెళుతున్నారు. లేదంటే కరెంట్ సరఫరా నిలిపేస్తామంటున్నారు. – పి.శివప్రసాద్, నాయీ బ్రాహ్మణుడు, గిద్దలూరు జాబితా ఇచ్చాం.. ఉత్తర్వులు అందలేదు ఉచిత విద్యుత్ కోసం జాబితా సిద్ధం చేసి పంపించాం. నాయీ బ్రాహ్మణులు, రజకులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు అందలేదు. బిల్లులు యాథావిధిగా ప్రతినెలా వసూలు చేస్తున్నాం. –చంద్రశేఖరరెడ్డి, ఏఈ, విద్యుత్ శాఖ, గిద్దలూరు -
జోరుగా ఇంటింటి ప్రచారం
సాక్షి, చిన్నచింతకుంట: మండలంలోని అల్లీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లి ప్రతిఒక్కరికి తెలియపర్చి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే తమ లక్ష్యమన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగ ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశామని ప్రగల్భాలు పలకడం పరిపాటిగా మారిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేణుగోపాల్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ధనంజయ్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వెంకటేష్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి అక్బర్, నాయకులు రహ్మత్, సురేష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శులు మహిపాల్రెడ్డి, సురేష్, ఖాజామైనొద్దీన్, గ్రామ అధ్యక్షుడు కృష్ణయ్య, మహేందర్రెడ్డి, నర్సింహ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి భూత్పూర్: కాంగ్రె‹స్ పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని హస్నాపూర్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరిగి మేనిఫెస్టోపై వివరించారు. చేయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, పేదలకు ఉచిత కరెంట్, ఏడు కిలోల సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫసియొద్దీన్, హర్యానాయక్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్ర్రీకాంత్రెడ్డి, దేవరకద్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాధిక్, నాయకులు సంజీవ్రెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అడ్డాకుల: మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఓటర్లకు వివరించి హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్లను రూ.2 వేలకు, వికలాంగుల పింఛన్లను రూ.3 వేలకు పెంచనున్నట్లు ఓటర్లకు వివరించి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, మండల కోఆప్షన్ సయ్యద్షఫి, రిటైర్డ్ ఏఈ లక్ష్మీనారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు దశరత్రెడ్డి, సురేందర్రెడ్డి, శేఖర్రెడ్డి, సాయిరెడ్డి, వెంకట్రెడ్డి, బుచ్చన్న, రవిసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
మరుపురాని మహానేత
-
కరెంట్ సరే.. నీరెక్కడ..?
వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాతో రైతుల ఇక్కట్లు తీరుతాయనుకుంటే మరింత పెరిగాయి. నిరంతర విద్యుత్తో రైతులందరూ విచ్చలవిడిగా విద్యుత్ మోటార్లను ఉపయోగిస్తుండడంతో బావుల్లోని నీరు అడుగంటింది. నీటి కోసం రైతులు గంటల తరబడి బావుల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ ఉన్నా.. బావుల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. కరీంనగర్ (రూరల్) : కరీంనగర్ మండలంలో ఈ రబీ సీజన్లో 6500 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఎస్సారెస్పీ కాలువ నీటి విడుదలతో పలువురు రైతులు ఆరుతడి పంటలకు బదులుగా వరి పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ఒకవైపు కాలువ నీరు, మరోవైపు నిరంతర విద్యుత్ సరఫరాతో ఈ రబీ సీజన్లో పంటలు పండుతాయని ఆశించిన రైతాంగానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. గత నెల 25నుంచి మొదటి విడత కాలువ నీరు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 4విడతలుగా ఆయకట్టు చివరి రైతులకు నీరందని దుస్థితి. గతేడాది వర్షభావ పరిస్థితులతో బావుల్లో భూగర్భజలాలు అడుగంటాయి. ఉపయోగపడని నిరంతర విద్యుత్ గత నెల 1నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల విద్యుత్ను సరఫరా చేస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరాను చేసేందుకు వీలుగా 10సబ్స్టేషన్లలో ప్రత్యేకంగా పీటీఆర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ మండలంలో మొత్తం 8వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటాయి. విద్యుత్ ఉన్నా.. పలువురు రైతుల వ్యవసాయ బావుల్లోని నీరు రెండు,మూడు గంటలకే సరిపోతున్నాయి. మళ్లీ నీటి కోసం ఐదారు గంటలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి. బావుల్లో సరిపడే నీరు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కొందరు రైతులు పొలమంతా పారే పరిస్థితి లేక ఉన్న నీటితో సగం పొలానికి మాత్రమే ఉపయోగిస్తూ పంటను కాపాడుకుంటున్నారు. కొందరు రైతులు చివరి ప్రయత్నంగా పంటలను కాపాడుకునేందుకు బావుల్లో పూడిక తీయిస్తుండగా.. మరికొందరు సైడ్బోర్లు వేయిస్తున్నారు. గొర్రెలు మేపుతున్నా ఎకరం పొలంలో వరి నాటు వేశా. బావిలో నీరు లేక పొలాలన్నీ ఎండుతున్నాయి. వంతులవారీగా సరిపడే నీరందకపోవడంతో 30గుంటలు విడిచిపెట్టి మిగిలిన 10గుంటలకు నీరు పెడుతున్నా. గొర్రెలకు మేత లేక ఎండిన పొలంలో వారం రోజుల నుంచి గొర్రెలను మేపుతున్నా. – కూకట్ల ఎల్లయ్యయాదవ్, రైతు, మొగ్ధుంపూర్ బావిలో నీరు లేక.. ఎకరం 20గుంటల్లో వరి నాటేశా. నీరు సరిపోవడం లేదు. కరెంట్ ఉన్నా బావిలో నీరు లేదు. మోటార్ పెట్టిన రెండు గంటలకే అయిపోతున్నాయి. పొలమంతా పారక 20గుంటలు విడిచిపెట్టా. చివరి వరకు మిగిలిన ఎకరం పొలం కూడా పారుతదో లేదో తెలుస్తలేదు. – మైలారం నాగరాజు, రైతు, మొగ్ధుంపూర్ -
యథేచ్ఛగా ఇటుక బట్టీలు
మేడ్చల్ : రైతుల బలహీనతలు, ఆర్థిక సంపాదనలు అంతంత మాత్రంగా ఉండటంతో వాటిని ఆసరా చేసుకున్న ఇటుక బట్టీల వ్యాపారులు మేడ్చల్ డివిజన్లోని మేడ్చల్, కీసర, శామీర్పేట్, మేడ్చల్ శివారు మండలం కుత్బుల్లాపూర్ మండలాల్లో వివిధ గ్రామాల్లో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లోనే ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల పంట సాగుకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తుండగా వ్యాపారులు ఇటుకల తయారీకి ఉచిత విద్యుత్ను అక్రమంగా వాడుతున్నారు. డివిజన్ మండలాల్లో ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్చగా కొనసాగుతున్నా రెవెన్యూ, ట్రాన్స్కో శాఖ అధికారులు మామూళ్ల మాయలో కళ్లకు గంతలు కట్టుకున్నారు. ప్రభుత్వం పేదల బతుకుదెరువు కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. వంద ఎకరాల అసైన్డ్ భూముల్లో.... మేడ్చల్ మండలంలోని గౌడవెళ్లి, శ్రీరంగవరం, బండమాదారం, రాయిలాపూర్, గుండ్లపోచంపల్లి, నియోజకవర్గంలోని కీసరతో పాటు యాద్గార్పల్లి, తిమ్మాయిపల్లి, కరీంగూడ,భోగారం, శామీర్పేట మండలం ఉద్దెమర్రి, అలియాబాద్, జవహర్నగర్, కుత్బుల్లాపూర్ మండలం నాగులూర్, దుండిగల్ గ్రామాల పరిధిలో దాదాపు 300 ఎకరాల భూములను ఇటుక బట్టీల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 100 ఎకరాల వరకు అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణ రంగం పెరగడంతో పాటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, కీసర, శామీర్పేట్ మండలాల్లో ఇటుకల వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ప్రైవేట్, ప్రభుత్వ అసైన్డ్ పొలాల్లో బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. దుర్వినియోగం అవుతున్న ఉచిత విద్యుత్ ఇటుక బట్టీల నిర్వాహకులు వ్యవసాయ బోర్ల నీటినే వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ దుర్వినియోగమవుతుంది. డివిజన్లో సుమారు 300 వరకు ఇలా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు అక్రమంగా విద్యుత్ను వాడుతున్నారు. ఇటుకల తయారీకి పొలాల్లో ఉండే బోర్ల నుంచి బట్టీల వరకు పైప్లైన్ల వేసుకుంటున్నారు. కొందరైతే బట్టీల వద్ద ఎకంగా కాలువలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండీ కొడుతున్నా అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్లు వ్యవహరించడం గమనార్హం. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఇటుక బట్టీల వ్యాపారంలో అక్రమార్కులకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న కొంతమంది అధికారులు అక్రమ వ్యాపారాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులకు ఏవి అసైన్డ్ భూములో ఏవి పట్టా భూములో ఖచ్చితంగా తెలుసు. కానీ అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు నడుస్తున్నా పట్టించుకోరు. గ్రామాల రెవెన్యూ అధికారులు బట్టీల వ్యాపారులతో నెలకు కొంత అమౌంట్ ఇవ్వాలని వ్యాపారం ప్రారంభంకాక ముందే మాట్లాడుకుంటున్నారని పలువురు బహీరంగంగానే అంటున్నారు. ట్రాన్స్కో వారికి కాసుల పంట ఇటుక బట్టీల వ్యాపారం ట్రాన్స్కో అధికారులకు కాసుల పంటగా మారింది. గ్రామాల్లో ఉచిత కరెంట్ బోరు నుంచి నీరు అందెలా చూసేది కరెంటోళ్లే. పేరుకు ఒక చోట కమర్షియల్ మీటర్ పెట్టి మిగతాదంతా ఉచిత కరెంటును వాడుకుంటున్నారు. విద్యుత్ సిబ్బందికి అన్ని తెలిసినా వారికి ముట్టాల్సింది ముట్టడంతో అక్రమ వ్యాపారులకు అండగా నిలబడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారు. తాము ఉన్నామని చెప్పుకునేందుకు అప్పుడప్పుడు విజిలెన్స్ అధికారులతో కలిసి దాడులు చేసి నామమాత్రపు అపరాధ రుసుములు విధిస్తున్నారు. -
ఉచిత విద్యుత్.. ఒకింత ఊరట
డేట్లైన్ హైదరాబాద్ నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల లబ్ధి జరుగుతుంది. కానీ పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! కరెంట్ బిల్లులు కట్టనందుకు బావి దగ్గర నుంచి ఫ్యూజులు పీక్కొచ్చి ఎంఆర్ఓ కార్యాలయంలోనో, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లోనో పెట్టేసుకోవడం చూశాం. నీరందక కళ్ల ముందే ఎండిపోతున్న చేనును చూసి దిక్కుతోచకుండా మిగిలిన రైతు పరిస్థితి చూశాం. అలాంటి రైతు ‘ఊరన్నా ఇడిచిపెట్టి పోవాలె, ఉసురన్నా తీసుకోవాలె.’ బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన తెలంగాణ రైతుల దైన్యం ఎలా ఉండేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో చూశాం. అప్పుడే, ‘నేను అధికారంలోకి వచ్చాక ఉచిత కరెంట్ ఇస్తాను, కరెంట్ బిల్లుల బకాయిలు రద్దు చేస్తాను’ అని అప్పటి ప్రతిపక్షనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. దీనికి చంద్రబాబు స్పందన ఏమిటో కూడా మన విన్నాం.‘ఆ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే!’ అని ఎద్దేవా చేసిన చంద్రబాబునాయుడు తరువాత డాక్టర్ వైఎస్ తను ఇచ్చిన హామీని నెరవేర్చడం స్వయంగా చూశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సర్కార్ కార్యాలయాల్లో బందీలుగా ఉన్న ఫ్యూజులను పైసా అపరాధ రుసుం కట్టించుకోకుండానే రైతులకు ఎట్లా తిరిగి ఇచ్చిందీ కూడా చంద్రబాబు వీక్షించారు. హామీ మేరకు ఉచిత కరెంట్ ఎట్లా ఇచ్చిందీ, కరెంట్ బిల్లుల బకాయిలు ఎట్లా మాఫీ చేసిందీ కూడా ఆయన గమనించారు. అప్పటికి దేశంలో ఇంకా విద్యుత్ సంస్కరణలు ఊపందుకోలేదు. ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధికభారం మోయవలసి వచ్చింది. అయినా రాజశేఖరరెడ్డి వెనక్కు తగ్గలేదు. ఫతేమైదాన్లో ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మొదటి సంతకం ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ మీదనే చేశారు. ఆయన జీవించినంత కాలం అదే విధానం అమలు పరిచారు. రాజశేఖరరెడ్డి నిర్ణయం తెలుగు ప్రాంత రైతులకు గొప్ప ఊరట. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలంగాణ రైతులకు మరీ పెద్ద ఊరట. తెలంగాణలో అత్యధికంగా, ఇరవై అయిదు లక్షల బోరు బావులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. కరెంట్ అవసరం ఆనాడు తెలంగాణ రైతులకే ఎక్కువ. ఇప్పటికీ తెలంగాణలో బోరు బావుల మీద ఆధారపడి చేస్తున్న వ్యవసాయం శాతం అధికమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట తలపెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే పరిస్థితి మారుతుంది. బోరు బావుల అవసరం పూర్తిగా తగ్గిపోతుంది. కాలువలు పారుతున్నప్పుడు బోర్ల అవసరం ఉండదు. పైగా భూగర్భ జలాల పరిస్థితి కూడా చాలా మెరుగు పడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఏర్పడిన నూతన ప్రభుత్వం నిరంతరాయంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే ఉంది. రైతులకు మంచిరోజలు 2017 డిసెంబర్ 31 రాత్రి 12 గంటల ఒక్క నిమిషం, అంటే నూతన సంవత్సరం లోకిఅడుగుపెట్టిన క్షణం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 24 గంటల విద్యుత్ సరఫరా మీద అనుకూలంగా, ప్రతికూలంగా జరుగుతున్న చర్చలూ, విమర్శలూ, విశ్లేషణల గురించి తరువాత మాట్లాడుదాం. ఇందులో 40 శాతం విద్యుత్ సరఫరా, వ్యవసాయం కోసం ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది. దానికి ప్రభుత్వం భరించాల్సిన మొత్తం సంవత్సరానికి రూ. 600 కోట్లు. ప్రాజెక్టులు పూర్తయి కాలవల్లోకి నీళ్లొస్తే ఈ వ్యయం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కోసం వాడే విద్యుత్ భారం ప్రభుత్వానికి తప్పదు. ఏది ఏమైనా తెలంగాణ రైతు వ్యవసాయం మీద ఆశలు పెంచుకునే మంచిరోజులు వచ్చాయని చెప్పాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఉచితంగా విద్యుత్ వస్తున్నది, అందునా 24 గంటల సరఫరా జరుగుతున్నది కాబట్టి వృథా అయ్యే అవకాశాలను కూడా ప్రభుత్వం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ స్టార్టర్ల విషయంలో ప్రభుత్వం ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. వాటిని తొలగింప చెయ్యడానికి పై స్థాయి నుంచి కింది దాకా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయవలసి ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మీద వస్తున్న విమర్శల గురించి ఆలోచిస్తే– 2003 ప్రాంతాల్లో ప్రారంభమైన విద్యుత్ సంస్కరణలు తరువాత కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాల హయాంలలో (పదేళ్లలో) ఊపందుకుని విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు పూర్తయి అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ లభ్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని జేఏసీ అంచనా. ఇందుకు ఆధారంగా జేఏసీ నాయకులు 2017 –2018 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వార్షిక నివేదికలో రూపొందించిన వివరాలను చూపుతున్నారు. అయితే దేశమంతటా ఇబ్బడి ముబ్బడిగా కరెంట్ ఉత్పత్తి అయి మిగులు పరిస్థితిలోకి వెళితే ఆ వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చెయ్యడానికి వాడుకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జేఏసీ చెబుతున్నది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం కూడా సరికాదు. 24 గంటల విద్యుత్ సరఫరా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల పడనున్న భారం ఏటా రూ.600 కోట్లని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా అందుకోసం విద్యుత్ సంస్థల మీద పది వేల కోట్ల రూపాయల మేర భారం పడనుందనీ, అందులో రూ. 5,500 కోట్ల భారాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తానని అంటున్నదని జేఏసీ చెబుతున్నది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దానికీ, జేఏసీ చూపుతున్న లెక్కలకూ చాలా వ్యత్యాసం ఉంది. ఎంతైనా ప్రజల డబ్బే కాబట్టి ప్రభుత్వం దీనికి సరైన వివరణ ఇస్తే బాగుంటుంది. అంతిమంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోకుండా చూడాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 24 గంటల విద్యుత్ సరఫరా ఫలితాలు రెండు రోజుల్లోనే తెలియవు. కొంతకాలం పరిశీలించాల్సిందే. ఎకరాకు ఎనిమిదివేలు రైతులకు లాభం చేకూర్చే మరో కార్యక్రమం– ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలు.రెండు విడతలుగా రైతులకు చెల్లించే ఈ మొత్తం ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మొత్తం అవసరాలు తీర్చలేకపోయినా కూడా రైతుకు ఊరటే. కానీ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు– కౌలు రైతులకు ఈ పథకం వర్తింపచేసే ప్రసక్తే లేదని. తెలంగాణలో ఎంతమంది రైతులు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత భూమి కౌలుదారుల చేతుల్లో ఉంది అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఆ లెక్కలు తేల్చి ఈ పథకం అమలు చేస్తే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. పైగా పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తామనడం సరయినది కాదు. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల తప్పక కొంత లబ్ధి జరుగుతుంది. కానీ ఇంకా తక్కువ సంఖ్యలోనే అయినా పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి ఏటా 8 వేల రూపాయల ఆర్థికసాయం మంచి ఆలోచనే అయినా రైతులను వేధిస్తున్న ఇతర సమస్యల మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు సమాఖ్యల మీద పెద్ద పెట్టున విమర్శలు రావడంతో మళ్లీ వాటి ఊసే ఎత్తడంలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న జన్మభూమి కమిటీల లాగా కాకుండా రైతు సంక్షేమానికి పాటు పడే, న్యాయం జరిగేటట్టు చూసే ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఉంది. పంటకు గిట్టుబాటు ధర రాక, నాణ్యమైన విత్తనాలు లభిం చక, పంటల బీమా లేక ఊపిరి సలపక రైతుల ఉసురు తీస్తున్న ఉదంతాలు అనేకం. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగలేదన్న సంగతి వాస్తవం. ముప్పిరిగొంటున్న ఈ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపకుండా కేవలం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి, ఏడాదికి ఎనిమిది వేలు ఇచ్చినంత మాత్రాన రైతు పరిస్థితి బాగుపడదు. మిగిలిన రైతు సమస్యల పరిష్కారమూ ముఖ్యమేనని చెప్పడం అందుకే. గడువు కంటే ముందుగానే వస్తాయంటున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్ర శేఖరరావు ఈ సమస్యలతో పాటు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తేనే సాధ్యం. అంతేతప్ప చంద్రబాబునాయుడి మార్గంలో రాజకీయ పేకాటలో జోకర్ వంటి పవన్కల్యాణ్ లాంటి వాళ్లు సాయపడతారనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్లను మూయించి ఎన్నో కుటుంబాలను కాపాడిన ముఖ్యమంత్రికి బహుశా ఆ ఆట రాదేమో. పేకాటలో జోకర్లు ఎన్ని ఉన్నా ఒరిజినల్ సీక్వెన్స్ ఒకటి తప్పనిసరి. లేకపోతే ఆటలో ఓటమే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
దళితుల లోగిళ్లలో వెలుగులు
బాబు జమానాలో ఇలా... దళితుల గృహాలకు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగం జరిగితే అందులో 75 యూనిట్లకు రాయితీ ఇస్తున్నారు. మిగతా 25 యూనిట్లకు బిల్లు వేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్కు రూ.2.60 చార్జి వసూలు చేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 10 యూనిట్లు వాడుకుంటే రూ. 26, ఒక్క యూనిట్ వాడుకుంటే రూ.2.60 లెక్కన చెల్లించాలి. నెలలో 100 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్ ఎక్కువ ఉపయోగించుకున్నా రాయితీ హుష్కాకే... వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే... ఎలాంటి షరతులూ లేకుండా ప్రతి దళితునికి ఇంటి అవసరాలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ... అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని వైఎస్ జగన్ స్పష్టీకరణ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు మొత్తం 1,65,450 మంది ఇందులో అధిక శాతం మంది పరిమితులకు లోబడే రాయితీ పొందుతున్నారు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీలందరికీ ఉచితంగా విద్యుత్తు అందనుంది. సాక్షి, రాజమహేంద్రవరం: దళితుల లోగిళ్లలో త్వరలో వెలుగులు విరజిమ్మనున్నాయి. ప్రతి దళితుడి ఇంటికీ ఉచితంగా విద్యుత్తు సరఫరా కానుంది. రాష్ట్రంలోని దళితవాడలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దళితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు దళితుల గృహాలకు వినియోగించే విద్యుత్తుపై పరిమితులతో కూడిన రాయితీలున్నాయి. దళితుల గృహాలకు నెలకు 100 యూనిట్లులోపు విద్యుత్తు వినియోగం జరిగితే అందులో 75 యూనిట్లు రాయితీ ఇస్తున్నారు. మిగతా 25 యూనిట్లకు బిల్లు వేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్కు రూ.2.60 చార్జి వసూలు చేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 10 యూనిట్లు వాడుకుంటే రూ. 26, ఒక్క యూనిట్ వాడుకుంటే రూ.2.60 లెక్కన చెల్లించాలి. నెలలో 100 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్ ఎక్కువ ఉపయోగించుకున్నా వారికి ఎలాంటి రాయితీ ఉండదు. ఈ నేపథ్యంలో ఎలాంటి షరతులూ లేకుండా ప్రతి దళితునికి ఇంటి అవసరాలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని జగన్ ప్రకటించారు. 1.65 లక్షల లబ్ధిదారులకు ప్రయోజనం... జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు మొత్తం 1,65,450 మంది ఉన్నారు. వీరిలో 1,03,599 మంది ఎస్సీ వినియోగదారులు, 61,851 ఎస్టీ వినియోగదారులున్నారు. 100 యూనిట్లులోపు విద్యుత్తు ఉపయోగిస్తున్న ఎస్సీలు 84,797 మంది ఉన్నారు. వీరికి 75 యూనిట్లు రాయితీ లభిస్తోంది. ఫలితంగా నెలకు రూ.99.14 లక్షలు లబ్ధి కలుగుతోంది. ఎస్టీ వినియోగదారుల్లో 100 యూనిట్లులోపు విద్యుత్ను ఉపయోగిస్తున్న వారు 50,900 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.39.73 లక్షలు లబ్ధి జరుగనుంది. ప్రస్తుతం 1,65,450 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల్లో 1,35,697 మందికే రాయితీ లభిస్తోంది. వైఎస్ జగన్ ఇచ్చిన హామీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీలందరికీ తమ గృహాలకు ఉచితంగా విద్యుత్తు అందనుంది. ఉచిత విద్యుత్తుతో మాకు కలుగుతుంది.. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తానని ప్రకటించడం చాలా సంతోషించదగిన విషయం. కూలీనాలీ చేసుకుని, తిండి గింజల కోసం కష్టపడే మాలాంటి ఎందరో గిరిజన ప్రజలకు ఇది చాలా ఊరటనిచ్చే విషయం. నెలనెలా వచ్చే విద్యుత్తు బిల్లులు చెల్లించే స్థోమత లేక విద్యుత్తు కనెక్షన్ తొలగించుకునే పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది ఎస్టీలకు దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది. – కొట్టి కన్నంరాజులు, నాయకపోడు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉచిత విద్యుత్తుతో దళిత వాడలకు ఊతం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటన రాష్ట్రంలో వేలాది దళితవాడలకు ఊతంగా నిలుస్తుంది. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలు తెలిసిన నేతగా జగన్ మెహన్రెడ్డి ఈ హామీ ఇవ్వడం ఉపయుక్తమైన ఆలోచన. నేటికీ అనేక దళిత వాడల్లో అనేక మంది దళితులు విద్యుత్ బిల్లుల చెల్లింపు భారంగా ఉంది. నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆయన తనయుడిగా జగన్ మోహన్రెడ్డి దళిత వాడలకు ఉచిత విద్యుత్ ఇస్తానడడం అభినందనీయం. – కందికట్ల రమణ, దళిత యువకుడు, అమలాపురం -
దేశ చరిత్రలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోమవారం రాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతోందన్నారు. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఐదారు రోజులు అధ్యయనం చేసి, వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ తుది ఏర్పాట్లు చేస్తోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై బుధవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రంలో 25 శాతం విద్యుత్ వ్యవసాయ పంపుసెట్ల ద్వారానే వినియోగమవుతోంది. రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజుల నుంచే అన్ని పంపుసెట్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. గత జూలై నుంచి పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. వచ్చే రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అందుకు కావాల్సిన విద్యుత్ కూడా సమకూర్చుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో 9,500 ఎంవీ గరిష్ట డిమాండ్ ఏర్పడినా ఎక్క డా రెప్పపాటు కోత విధించకుండా 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. వచ్చే రబీ సీజన్లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల ఏర్పడే 11,000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా ఉన్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా’’అని పేర్కొన్నా రు. ఆటో స్టార్టర్లను తొలగించి విద్యుత్ ఆదాకు సహకరించాలని రైతులకు పిలుపునిచ్చారు. నాడు చిమ్మచీకట్లు రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో.. భూగర్భ జలాలున్నా కరెంటు లేక చేతి కొచ్చిన పంట కళ్లెదుట ఎండిపోయే పరిస్థితి ఉండేదని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పట్లో 2,700 మెగావాట్ల విద్యుత్లోటును రాష్ట్రం ఎదుర్కొందని, గత పాలకుల నిర్లక్ష్య వైఖరి, ప్రణాళికా లోపంతో అనేక రంగాల్లో చిమ్మచీకట్లు అలముకున్నాయన్నారు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడి నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. చిమ్మచీకట్ల నుంచి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి చేశామన్నారు. దాదాపు రూ.94 వేల కోట్ల వ్యయంతో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నత్తనడకన నడుస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టించిందని, కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే.. గడిచిన మూడున్నరేళ్లలో మరో 7,981 మెగావాట్ల విద్యుత్ను సమకూర్చుకోగలిగామని చెప్పారు. సింగరేణి పవర్ప్లాంట్తో 1200ఎంవీ, కేటీపీపీతో 600 ఎంవీ, జూరాలతో 240 మెగావాట్లు, పులిచింతలతో 90 మెగావాట్లు, ఛత్తీస్గఢ్తో వెయ్యి మెగావాట్లు, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2 వేల మెగావాట్లు అదనంగా సమకూర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. నేడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు కాగా.. మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. విద్యు త్ స్థాపిత సామర్థ్యాన్ని 28 వేల మెగావాట్లకు పెంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నా రు. రూ.12,136 కోట్లతో పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగా 574 సబ్స్టేషన్లు రాష్ట్రం ఏర్పడే నాటికి అన్ని రకాల సబ్స్టేషన్లు కలిపి 2,414 ఉండగా.. 574 సబ్ స్టేషన్లను కొత్తగా నిర్మించి, మొత్తం 2,988 సబ్స్టేషన్లను అందుబాటులోకి తెచ్చామని సీఎం చెప్పారు. రాబోయే మూడు నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు రూ.42 వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా 400 కేవీ సబ్ స్టేషన్లు 18, 220 కేవీ సబ్ స్టేషన్లు 34, 132 కేవీ సబ్ స్టేషన్లు 90, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 937 నిర్మించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 16,378 కిలోమీటర్ల హైటెన్షన్ లైన్లు ఉండగా ఇప్పుడు 19,916 కిలోమీటర్లకు పెంచామన్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లను 4,32,968 కిలోమీటర్ల నుంచి 4,84,001 కిలోమీటర్లకు పెంచామన్నారు. హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచామన్నారు. వార్ధా–మహేశ్వరం 765 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ నుంచి రాష్ట్రానికి 2 వేల మెగావాట్ల కారిడార్ కోసం పీజీసీఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. హైదరాబాద్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం జీహెచ్ఎంసీ చుట్టూ 142 కిలోమీటర్ల మేర 400 కేవీ రింగ్సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1,200 యూనిట్లుగా ఉంటే.. ఇప్పుడు 1,505 యూనిట్లకు పెరిగిందన్నారు. 2016–17లో జాతీయ సగటు 1,122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైందన్నారు. మూడున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగిందని తెలిపారు. కొత్తగా 13,357 ఉద్యోగాలు విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి 22,550 మంది విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థ నుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. -
ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్
-
ఉచిత కరెంటుకు కళ్లెం
ప్రజలందరి ఆకలిని తీర్చే తిండిగింజలను సృష్టించేందుకు అన్నదాత ఆరుగాలం శ్రమిస్తాడు. అతడి శ్రమకు వరుణుడి కరుణ తోడైతేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. కానీ, వరుసగా మూడేళ్ల నుంచి.. రైతుకు అవసరమైన ప్రతిసారీ వరుణుడు ముఖం చాటేస్తూనే ఉన్నాడు. దీంతో ‘ఆకాశగంగ’ను నమ్ముకుని లాభం లేదనుకున్న రైతులు.. నేలతల్లి గర్భంలోని పాతాళగంగను ఒడిసిపట్టి.. పంటచేలల్లో ప్రవహింపజేసి.. సిరులు పండిస్తున్నారు. అయితే ఇందుకు ఉచిత విద్యుత్ను అదుపు లేకుండా వాడేస్తున్నారని, దీనివల్ల సరఫరాకు, వినియోగానికి మధ్య అంతరం పెరిగిపోతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, రాజమండ్రి :జిల్లాలో మూడేళ్లుగా సాగు ఆరంభంలో వర్షాభావం ఏర్పడడం, వ్యవసాయ అవసరాలు తీరిన తర్వాత వానలు పడుతూండడంతో రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతిపై ఆధారపడడం తగ్గించి, అందుబాటులో ఉన్న కరెంటు మోటారును నమ్ముకోవడం ప్రారంభించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగంలో 80 శాతం ఉచితంగా ఇస్తారు. దీంతో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వ్యవసాయ రంగంలో విద్యుత్తు వాడకం పెరిగిపోతోంది. ఈ పరిస్థితి విద్యుత్ సరఫరాకు, వినియోగానికి మధ్య అంతరాన్ని సృష్టిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఉచిత విద్యుత్ వాడకాన్ని అదుపు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ విద్యుత్ వినియోగంపై నిఘా ఉంచాలని అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వ్యవసాయ విద్యుత్ వినియోగ వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ‘ఉచిత’ వినియోగం జరుగుతోందిలా.. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం ఉంటుంది. జిల్లాలో మొత్తం 42 వేల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. వీటికింద ఏటా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తారు. కానీ, దీనిని మించి ఉచిత విద్యుత్ వినియోగం జరుగుతోందని అధికారులు గుర్తించారు. 2013లో నవంబర్ నాటికి 257 మిలియన్ యూనిట్ల వినియోగం జరగగా, అది 2014లో నవంబర్ నాటికి 357 మిలియన్ యూనిట్లకు పెరిగింది. వచ్చే మార్చి నాటికి ఈ వినియోగం 408 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగాన్ని కట్టడి చేసే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇప్పటికే విద్యుత్తు శాఖ ఎనర్జీ ఆడిట్ విభాగం జిల్లాలోని వ్యవసాయ విద్యుత్తు వినియోగం, ఉన్న కనెక్షన్లు, పెరుగుదల శాతాల గణాంకాలను సేకరించినట్టు తెలిసింది. అలాగే వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగంపై నిఘా పెట్టాలని అధికారులకు కూడా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే వినియోగం పెరుగుతున్న తీరును గమనించి అందుకు అనుగుణంగా అదుపు చేసేందుకు చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
రైతులంటే పగ ఎందుకు?: వాసిరెడ్డి పద్మ
* టీడీపీ అధినేత చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం * ఉచిత విద్యుత్కు ఆధార్తో లింకు పెట్టడం దారుణం * ఎన్నికల ముందు ఆధార్ కార్డంటే ఖబడ్దార్ అన్నారు.. * ఇప్పుడేమో ఆధార్ సాకు చూపి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెట్ట ప్రాంత రైతులను ఆదుకునేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ సౌకర్యం పొందాలంటే ఆధార్ కార్డు ఉండి తీరాలని చంద్రబాబు ప్రభుత్వం షరతు విధించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 20వ తేదీలోపుగా ఆధార్ వివరాలు ఇవ్వకపోతే ఆ మరుసటి రోజు నుంచే ఉచిత విద్యుత్ ఉండదని చెప్పడం, గడువు కూడా పొడిగించకపోవడం సరికాదన్నారు. గురువారం ఆ మె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల మొత్తం 13.50 లక్షల విద్యుత్ కనెక్షన్లలో 40 శాతం మంది రైతులకు ఉచిత విద్యుత్ పథకం దక్కకుండా పోతోందని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పాదయాత్ర చేసినపుడు ‘ఆధార్తో గ్యాస్ కనెక్షన్ లింకా... సబ్సిడీ బియ్యం కోసం ఆధార్ కావాలా..?’ అంటూ విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక అదే ఆధార్ను ఆయుధంగా చేసుకుని పథకాల్లో కోత విధిస్తున్నారని పద్మ దుయ్యబట్టారు. ఆధార్ పేరు చెప్పి రాష్ట్రంలో 10 లక్షల సామాజిక పింఛన్లు, 23 లక్షల రేషన్ కార్డులను కత్తిరించారని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ఆధార్ ను ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా టీడీపీ ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం శోచనీయమన్నారు. వృద్ధులు, పేదలపై చంద్రబాబుకు పగ ఎందుకు? రైతులంటే కోపమెందుకు అని ఆమె ప్రశ్నించారు. అంతా మిథ్య అనుకుంటున్నారా? ‘‘నాడు ఆధార్ అంటే ఖబడ్దార్ అని చెప్పిన చంద్రబాబు ఇపుడు ప్రతిదానికీ ఆధార్ జపం చేస్తున్నారు.. ఉచిత విద్యుత్కు కూడా ఆధార్తో లింకు అంటున్నారంటే దాని ఉద్దేశం ఏమిటి? పంట భూమి ఉండటం అబద్ధమా? రైతు అబద్ధమా? అంతా మిథ్య అనుకుంటున్నారా?’’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వాస్తవానికి బాబు మనసున్న సీఎం కానే కాదని, పదిమందికీ సాధ్యమైనంత ఎక్కువగా మేలు చేద్దామనే ఆలోచన కన్నా రూపాయి, రూపాయి ఎలా మిగుల్చుకుందామనే ఆలోచిస్తూ ఉంటారని ఆమె విమర్శించారు. ఉచిత విద్యుత్ పథకానికి ఆధార్ తప్పనిసరి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆమె హెచ్చరించారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఒక చోటి నుంచి మరో చోటుకు మార్చుతున్న క్రమంలో వైఎస్ విగ్రహానికి అపచారం చేశామని ఒక చానెల్, ఒక పత్రిక విషప్రచారానికి పూనుకున్నాయని, వైఎస్ జీవించి ఉండగా ఈ మీడియా యాజమాన్యం వైఎస్ పట్ల ఎంత బాగా వ్యవహరించిందో అందరికీ తెలుసునని ఆమె అన్నారు. -
'భరోసా యాత్రతో కేసీఆర్ ఢిల్లీ పరిగెత్తిండు'
హైదరాబాద్: విద్యుత్ సమస్యపై తాను బహిరంగ చర్చకు సిద్ధమేనంటూ తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఉపనేత షబ్బీర్ అలీ... ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ప్రతి సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... విద్యుత్ సమస్యపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన కేటీఆర్కు తాను సద్దమే అంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు. విద్యుత్ అందుబాటులో లేదని తెలిసినప్పటికీ రైతులకు 8 గంటలు కరెంట్ ఇస్తామని పార్టీ మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చారని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఇది రైతులను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. 8 గంటలు కరెంట్ ఇవ్వలేనందు వల్ల ముందుగా రైతులకు క్షమాపణలు చెప్పాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. కరెంట్ కోతల వల్ల జరిగిన పంట నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర మొదలు పెట్టేసరికి... సీఎం కేసీఆర్ ఉన్న పళంగా కరెంట్ కావాలంటూ కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీ పరిగెత్తిండు అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్ర హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం వల్లే... రాష్ట్రంలో ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్న వాస్తవాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తించుకోవాలని షబ్బీర్ అలీ హితవు పలికారు. -
వైఎస్సార్ సీపీకే ప్రజాదరణ
పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి దినేష్రెడ్డి మేడ్చల్, న్యూస్లైన్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీని ప్రజలు విశేషంగాఆదరిస్తున్నారని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి వి.దినేష్రెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ మండల వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్రెడ్డి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తాను నియోజకవర్గ పరిధిలో ఎక్కడకు వెళ్లినా అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తోందన్నారు. తనను ఆదరించి ఎంపీగా గెలిపిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో మురికి వాడలు లేకుండా చేస్తానన్నారు. తాగునీటి వసతి, మెరుగైన రోడ్లు తదితర వసతులు కలిపిస్తానని పేర్కొన్నారు. కాగా.. మండలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీ జోరుగా సాగింది. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు, మార్కెట్ రోడ్డు, హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డు, బస్డిపో, ముకుంద్ థియేటర్, కిష్టాపూర్, పూడూర్ గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి దినేష్రెడ్డి బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బి.వి. ప్రకాష్ వంజరి, నాయకులు శ్రీధర్గౌడ్, మహబూబ్అలీ, అనిల్, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్గౌడ్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాల ఘనత వైఎస్దే కీసర: మహానేత వైస్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయారని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి దినేష్రెడ్డి అన్నారు. కీసరలో శనివారం నిర్వహించిన బైక్ర్యాలీలో ఆయన మాట్లాడారు. 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత వైఎస్కే దక్కుతుందన్నారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. వైఎస్ పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ ఆశయ సాధనకోసమే జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని, అందుకోసమే వైఎస్సార్ సీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయిందని, తనను గెలిపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ దర్గాసుఖేందర్రెడ్డి, కీసర ఇన్చార్జి ముజిబ్, నేతలు డా.నరహరి, ప్రవీణ్, నారాయణ, రమేష్ , కుంటోళ్ల సత్యనారాయణ, రత్నం, మంగమ్మ, ప్రకాష్రెడ్డి, కోటేశ్వర్రావు, ముఖేష్రాజ్, అంజి, రాజు, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. రాజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం ఘట్కేసర్ టౌన్: రైజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి దినేష్రెడ్డి పేర్కొన్నారు. ఘట్కేసర్ పట్టణంలో శనివారం రాత్రి రోడ్షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్శాఖను ప్రక్షాళన చేశానని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించానన్నారు. పేదల పక్షపాతి వైఎస్సార్ను బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. సూర్య, చంద్రాదులు ఉన్నంత వరకు ఆయన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సుస్థిర పాలన, రామ రాజ్యం తిరిగి రావాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తూకుంట కృష్ణారెడ్డి, సామల యాదిరెడ్డి, పెరమాండ్ల అశోక్, శ్యామ్రావ్, రాజు, గణేష్, ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఇదేనా ‘వెలుగు’
అర్హులైనా వర్తించని ఉచిత విద్యుత్ రాయితీ వెలుగు పథకం ద్వారా అందని లబ్ధి బిల్లులు చెల్లించాల్సిందేన ంటూ ట్రాన్స్కో హుకుం లబోదిబోమంటున్న 165 మంది లబ్ధిదారులు పూళ్ల (భీమడోలు), న్యూస్లైన్ : దళితులకు ఉచిత విద్యుత్ అందని ద్రాక్షలా మారింది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద 50 యూనిట్లు లోపు వినియోగించిన దళితులకు రాయితీ వర్తింపు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా మొత్తం బిల్లు చెల్లించాల్సిందేనంటూ విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరి స్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, రెవెన్యూ శాఖల నిర్లక్ష్యం వల్ల పేదల గృహాల్లో వెలుగులు నింపాల్సిన ఈ పథకం చీకట్లు కమ్ముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పూళ్లలోని తూర్పు, పడమర దళిత కాలనీల్లో 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు వెలుగు పథకంలో భాగంగా ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందని ట్రాన్స్కో అధికారులు రెండు నెలల క్రితం భరోసా ఇచ్చారు. అయితే మూడో నెలలో బిల్లులను చెల్లించాలంటూ లబ్దిదారులకు వాటిని అందజేశారు. బిల్లులను చెల్లించకపోతే ఫ్యూజులు తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పూళ్ల పంచాయతీ పరిధిలోని పూళ్లలోని తూర్పు, పడమర, నాగేశ్వరపురం తదితర గ్రామాల్లోని 165 మందికి పైగా లబ్ధిదారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల వద్ద లబ్ధిదారుల జాబితాలో ఇంటి పేర్లు సక్రమంగా లేపోవడంవల్లే ఎస్సీ లబ్ధిదారులను గుర్తించలేకపోయామని వీఆర్వో బి.అనిత చెప్పడం గమనార్హం. ఇంతసొమ్ము కట్టేదెలా? కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాం. రెండు నెలల క్రితం 50 యూని ట్లలోపు విద్యుత్ వాడితే ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందని చెప్పారు. ప్రస్తుతం పాత బిల్లులతో పాటు మూడో నెల బిల్లు కూడా కలిపి మొత్తం రూ.391.96 చెల్లించాల్సిందేనంటున్నారు. ఇంత సొమ్ము ఒకేసారి కట్టాలంటే ఏలా. - లంకపల్లి నల్లయ్య, పడమర దళితపేట, పూళ్ల అయోమయంగా ఉంది రెక్కాడితే గాని డెక్కాడని పరిస్థితి మాది. జనవరిలో 8 యూనిట్లు మాత్రమే వాడా. విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేదనుకున్నా. ఇపుడు మూడు నెలలకు రూ.184 చెల్లించాలంటున్నారు. అంతా అయోమయంగా ఉంది. నా సమస్యను ఎవరికి చెప్పుకోవాలే అర్థం కావడం లేదు. - కొమ్ము కుమారి, పూళ్ల -
రైతు బాంధవుడు వైఎస్సార్
పర్చూరు, న్యూస్లైన్: రైతులకు ఉచిత విద్యుత్ అందించి, రుణాలు మాఫీ చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతుబాంధవునిగా నిలిచారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సినీనటి రోజా పేర్కొన్నారు. మండలంలోని నూతలపాడులో గొట్టిపాటి నరశింహారావు ప్రాంగణంలో నిర్వహిస్తున్న వైఎస్సార్ మెమోరియల్ రాష్ర్ట స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలకు సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోజాకు నిర్వాహకులు, ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారు. పశుపోషకులను గొట్టిపాటి భరత్తో కలిసి ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు, పిండివంటలతో పాటు ఎడ్ల పందేలు గ్రామాల్లో సంక్రాంతి పండుగకు అద్దం పడతాయన్నారు. రాజసం, పోటీలకు ఒంగోలు గిత్తలు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రపంచ ఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఎడ్ల యజమానులను, ప్రేక్షకులను అభినందించారు. వైఎస్ జగన్మోహ న్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తన తండ్రిలాగే చల్లని పరిపాలన అందిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, గొట్టిపాటి భరత్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ట్రాక్టర్ నడిపి ప్రేక్షకులను ఉత్సాహపరచిన రోజా పోటీల్లో ప్రదర్శనగా ఉంచిన ట్రాక్టరును రోజా నడిపి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ట్రాక్టర్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్, పార్టీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి కూర్చున్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రేక్షకులు ఈలలు, కేకలతో సందడి చేశారు. ఎడ్ల పోటీలను చూసేందుకు పోటెత్తిన జనం నూతలపాడులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు జనం పోటెత్తారు. రెండో రోజైన సోమవారం నూతన సేద్యపు ఎడ్ల విభాగంలో పోటీలు నిర్వహించారు. పోటీలకు వైఎస్సార్ సీపీ రాష్ర్ట రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సజ్జా హేమలత, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ నాయకుడు దగ్గుమాటి కోటిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పశుపోషకులకు అనేక రాయితీ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ఏ పశుజాతికీ లేని ప్రత్యేక లక్షణాలు ఒంగోలు జాతికి మాత్రమే ఉన్నాయన్నారు. ఒంగోలు జాతి పశువులను ఇతర దేశస్తులు మాంసం కోసం వినియోగించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో పర్చూరు, నూతలపాడు గ్రామ సర్పంచ్లు యద్దనపూడి సరోజని, కే సుమలత, సంతమాగులూరు సొసైటీ అధ్యక్షుడు అట్లా చినవెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఉచిత’ వంచన
=ఫ్రీ కరెంట్ పేరిట సర్కారు కపటనాటకం =ఎస్సీ, ఎస్టీలకు ఉత్తి‘చేయి’ =భారం తప్పించుకునేందుకు కొర్రీలు =నెలనెలా తగ్గుతున్న లబ్ధిదారులు వరంగల్, న్యూస్లైన్ : ఉచిత విద్యుత్ పేరిట నిరుపేద దళితులు, గిరిజనులను ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోంది... కపట నాటకాలతో వంచనకు గురిచేస్తోంది. గిమ్మిక్కులతో సర్కారుపై పడుతున్న భారాన్ని తగ్గించుకుంటూ... 50 యూనిట్ల పరిధిలోపు విద్యుత్ను వినియోగించుకునే వారే అర్హులంటూ మెలికపెట్టి ఉత్తి‘చేరుు’ చూపిస్తోంది. జిల్లాలో ఎస్సీ వర్గాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు 92 వేలు, ఎస్టీలకు సంబంధించి 76 వేల కనెక్షన్లున్నాయి. ఇందులో ఒక్కో కుటుంబం వినియోగిస్తున్న విద్యుత్ నెలకు 60 నుంచి 90 యూనిట్ల మధ్యలో ఉంటోంది. 90 శాతం మేర కుటుంబాలు ఇదే స్థాయిలో విద్యుత్ను వాడుకుంటున్నట్లు అధికారిక రికార్డులే చెబుతున్నారుు. ఈ లెక్కన సర్కారు నిబంధనల ప్రకారం వారు ఉచిత విద్యుత్కు అనర్హులు కాగా... మిగిలిన పది శాతం కుటుంబాలు మాత్రమే ఉచిత విద్యుత్కు అర్హులన్న మాట. ఇక్కడే తెలుస్తుంది.. కూలీ చేసుకునే దళిత కుటుంబం రెండు బుగ్గలు, ఒక ఫ్యాన్ వినియోగించడం తప్పనిసరి. ఈ లెక్కన ఇంటిలో ఒక బల్బు, ఇంటి బయట మరొక బల్బు, ఒక ఫ్యాన్ ఉన్న ఓ కుటుంబం నెలకు వినియోగించే విద్యుత్ను లెక్కిస్తే... సర్కారు అసలు నైజం ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరెవరూ ఉచితం పరిధిలోకి రారు. 100 వాట్స్ బుగ్గ గంట వెలిగితే వినియోగమయ్యే విద్యుత్ 0.1 యూనిట్. రోజుకు సగటున ఆరు గంటలకు లెక్కగడితే 0.6 యూనిట్లు. ఇలా రెండు బుగ్గలకు రోజుకు 1.2 యూనిట్లు.. నెలకు 37.2 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుంది. అదేవిధంగా 60 వాట్స్ ఉండే ఒక ఫ్యాన్ గంటపాటు తిరిగితే వినియోగమయ్యే విద్యుత్ 0.06 యూనిట్లు. రోజుకు సగటున 12 గంటలకు లెక్కగడితే 0.72 యూనిట్లు. ఇలా నెలకు 22.32 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుంది. అంటే 31 రోజులకు సదరు దళిత కుటుంబానికి 59.52 యూనిట్ల విద్యుత్ వాడకమవుతోంది. ఇది.. స్వయంగా కరెంట్ అధికారులు చెబుతున్న వాస్తవ లెక్కలు. దీన్నిబట్టి సర్కారు ఎస్సీ, ఎస్టీలకు ప్రకటించిన ఉచిత విద్యుత్ నయవంచనే అని గ్రహించవచ్చు. అంతేకాకుండా 50 యూనిట్లలోపు వినియోగించుకునే వారికే ఉచితం అంటూ మెలికపెట్టడం భారాన్ని తప్పించుకునేందుకేననే నగ్న సత్యాన్ని బహిర్గతం చేస్తోంది. ఇంటింటికీ స్కానింగ్... ఇప్పటివరకు మీటర్ పనిచేయట్లేదనో.. పాడైపోరుుందనో... సగటున రీడింగ్ తీసే విధానానికి స్వస్తి పలుకుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ సిబ్బంది ఉచిత విద్యుత్ అర్హులైన వారి ఇంటింటికీ తిరుగుతూ మీటర్లను నిశితంగా పరిశీలన చేయనున్నారు. జనవరి నుంచి ఎంత విద్యుత్ వాడకమైందో స్కానింగ్ తీయనున్నారు. ఆ తర్వాత 50 యూనిట్లలోపు వినియోగించుకున్న వారికే బిల్లులు మాఫీ చేయనున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఒక్కరు కూడా ఉచిత విద్యుత్ పరిధిలోకి వచ్చే అవకాశాలు లేవని తేటతెల్లమవుతోంది. నెలానెలా తగ్గిపోతున్నారు... 50 యూనిట్ల వినియోగం పరిధిలోకి వచ్చే వినియోగదారుల సంఖ్య నెలనెలకూ గణనీయంగా పడిపోతోంది. ఇందుకు ఈ కింది పట్టికే నిదర్శనం. -
నీరున్నా.. కరెంటు లేదు
మోర్తాడ్, న్యూస్లైన్: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అమలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వ్యవసాయానికి అవసరమైన కొత్త విద్యుత్ కనెక్షన్లను జారీ చేయడంలో వాల్టా చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసి భూగర్భ జలమట్టం పెరిగినా గతంలోని నివేదికలను ఆధారం చేసుకుని కొత్త కనెక్షన్ల జారీకి అడ్డంకులను ప్రభుత్వమే సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీకి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త విద్యుత్ కనెక్షన్లను జారీ చేయడాన్ని నిషేధించగా, ఈ నిషేధాన్ని ఏడాది కాలం నుంచి అమలు చేస్తున్నారు. అయితే నిషేధం అమలులో ఉన్న గ్రామంలో తహశీల్దార్ అనుమతితో వేసిన వ్యవసాయ బోరుకు మాత్రం ఎన్పీడీసీఎల్ అధికారులు కొత్త కనెక్షన్లను ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం తహశీల్దార్ అనుమతి ఉన్నా వాల్టా చట్టం అమలు అవుతున్న గ్రామాలలోని వ్యవసాయానికి కొత్త కనెక్షన్లను ఇవ్వకూడదని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్ జిల్లాలో తక్కువగా భూగర్భ జలాల శాతం నమోదు అయిన 167 గ్రామాలలో కొత్త విద్యుత్ కనెక్షన్లను జారీ చేయడం పూర్తిగా నిలిపివేశారు. ఈ సంవత్సరం భారీగా వర్షపాతం న మోదు కాగా భూగర్భ జలమట్టం అభివృద్ధి చెందిం ది. జిల్లాలో సాధారణ వర్షపాతం 168 మిల్లీమీటర్లు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 260 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యింది. గత సంవత్సరం 12.27 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జల మట్టం ఇప్పుడు 7.60 మీటర్లపైకి వచ్చింది. జిల్లా అంతటా భూగర్బ జల మట్టం భారీగానే వృద్ధి చెం దింది. భూగర్భ జల మట్టం అభివృద్ధి చెం దినా దీనిని పరిగణలోకి తీసుకోని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం వాల్టాచట్టాన్ని అమలు చేస్తున్న గ్రామాలలో కొత్త కనెక్షన్ల జారీకి నిషేధాన్ని వర్తింప చేస్తోంది. ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురియడంతో రైతులు బీడు భూములను అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసి న బీడు భూముల్లో పంటలను సాగు చేయడానికి బోరుబావులు వేస్తున్నారు. బోరుబావులు వేసిన తరువాత పంపుసెట్లను అమర్చాలంటే విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి. కొత్త విద్యుత్ కనెక్షన్లను పొందడం కోసం రైతులు విద్యుత్ అధికారుల వద్దకు వెళితే అక్కడ తిరస్కరణ ఎదురవుతోంది. వాల్టా చట్టం అమలు అవుతున్న గ్రామాలలో కొత్త విద్యుత్ కనెక్షన్లు జారీ చేసేది లేద ని అధికారులు మొండిగా చెబుతున్నారు. గ్రామాలలో భూగర్భ జలాల మట్టం భారీగా వృద్ధి చెందినా కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీకి నిషేధాన్ని అమలు చేయడంలో అర్థం లేదని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ భారాన్ని తప్పించుకునేందుకు ఈ నిషేధాన్ని అమలు చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే వాల్టా చట్టాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు కేంద్ర జల సంఘం భూగర్భ జలమట్టంపై ఇంకా నివేదిక ఇవ్వలేదని తెలిసింది. అందువల్లనే కొత్త కనెక్షన్లు జారీ చేయడంపై నిషేధం అమలు అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని పలువురు కోరుతున్నారు. -
‘ఉచితం’లో కోత
కర్నూలు(రాజ్విహార్), న్యూస్లైన్: రైతుకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం, విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల అలసత్వంతో వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. రైతులకు ఇచ్చే 7గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. రోజుకు ఏడు గంటల్లో రైతులకు ఐదు రోజుల నుంచి కేవలం ఐదారు గంటలు మాత్రమే అందుతోంది. ఏదైన సమస్య తలెత్తితే ఏడు గంటల పాటు విద్యుత్ ఇవ్వలేని పక్షంలో తిరిగి ఇతర సమయాల్లో పునరుద్ధరించి సర్దుబాటు (కాంపెన్జేషన్) చేయాల్సి ఉంది. కాని ఈ నిబంధనను ఉన్నతాధికారులు విస్మరిస్తున్నారు. స్థానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వకపోగా రైతుల అడుగుతున్నారని విన్నవించినప్పటికీ విద్యుత్ కొతర ఉందని, కోతలు విధించినప్పకిటీ సర్దుబాటు (కాంపెన్జేషన్) ఇవ్వాల్సిన అవసరంలేదని ఉన్నతాధికారులు (హైదరాబాదు) తేల్చిచెబుతున్నట్లు సమాచారం. దీంతో కిందిస్థాయి అధికారులు చేసేదేమిలేక చేతులెత్తేస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం, ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రం నష్టపోతున్నారు. ఉచిత విద్యుత్ అందుతుందని బావులు, బోర్ల కింద పొలం సాగు చేస్తున్న రైతులు కోతల కారణంగా పంటకు నీరు కట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా పంట పోలాల్లోనే ఎండిపోవాల్సిన పరిస్థితి. థర్మల్ పవర్ పాంట్లకు బొగ్గు కొరత, హైడల్ (జల) విద్యుత్ కేంద్రాల్లో ఏర్పడిన సమస్య కారణంగా రాష్ట్రంలో లోటుకు దారితీసింది. ఫలితంగా జిల్లాలో కొద్ది రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జిల్లాను ప్రాంతాలుగా విభజించి, లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్) పేరుతో విడతల వారిగా సరఫరా నిలిపివేస్తున్నారు. అయినా లోటు తీరడం లేదు. దీంతో వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్లో కోతలు విధించేందుకు సిద్ధమయ్యారు. సర్కిల్ను రెండు గ్రూపులుగా విభజంచి రోజుకు 7గంటల పాటు సరఫరా చేయాలి. పగలు నాలుగు గంటలు, రాత్రి మూడు గంటలు వారానికి ఒక గ్రూపుగా ఇవ్వాలి. లోటు పేరుతో ట్రాన్స్కో సంస్థ అధికారులు నేరుగా హైదరాబాదులోని లోడ్ మానిటరింగ్ అండ్ డిస్పాచ్ సెంటర్ నుంచే ఈ కోతలు విధిస్తున్నారు. కోత విధించిన విద్యుత్ను ఇతర సమయాల్లో ఇచ్చి సర్దుబాటు చేయాలని ఏపీసీపీడీసీఎల్ స్థానిక అధికారులు చేస్తున్న విన్నపాలను పట్టించుకోవడం లేదు. రోజుకు ఎంత విద్యుత్ అవసరం: సర్కిల్ (జిల్లా)లో ప్రస్తుతం ఎనిమిది కేటగిరిల కింద మొత్తం 10.52లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా 375 హెచ్టీ కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 1కోటి యూనిట్లు అవసరం కాగా లోటు కారణంగా కేవలం 85లక్షల యుూనిట్లలోపే ఇస్తున్నారు. మొత్తం 1.03లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 5 హార్స్ పవర్ (హెచ్పీ) మోటరు 7గంటల పాటు ఆడితే 28 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. మొత్తం కనెక్షన్లకు రోజుకు దాదాపు 32.51లక్షల యూనిట్ల అవసరం అవుతుంది. లోటు కారణంగా ఇవ్వలేకపోతున్నాం - టి. బసయ్య, ఎస్ఈ నాలుగు రోజులుగా విద్యుత్ సమస్య ఉంది. డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడంతో ట్రాన్స్కో అధికారులు లోడ్ రిలీఫ్ పేరుతో మెయిన్ సప్లై ద్వారా సరఫరా నిలిపివేస్తున్నారు. తిరిగి సరఫరా ఇచ్చి సర్దుబాటు (కాంపెన్జేషన్) ఇచ్చేందుకు ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వడం లేదు. అందుకే సరఫరా సర్దుబాటు చేయలేకపోతున్నాం. -
ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు ‘చార్జీల పుస్తకం’
తాండూరు, న్యూస్లైన్: వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పొందుతున్న రైతుల నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేసేందుకు త్వరలో ‘విద్యుత్ చార్జీల పుస్తకం’(స్లాబ్ పాస్బుక్) అందజేయనున్నట్టు వికారాబాద్ డివిజన్ విద్యుత్ డీఈ సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం తాండూరు విద్యుత్ ఏడీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్న రైతులను గుర్తించడంతో పాటు, సర్వీసు చార్జీల బకాయిల వసూలు, విద్యుత్ చౌర్యాన్ని నిరోధించేందుకు స్లాబ్ పాస్బుక్లు అందించనున్నట్టు వివరించారు. 2004 సంవత్సరానికి ముందు ఈ తరహా పుస్తకాలు ఉండేవన్నారు. ఈ పుస్తకాలతో బకాయిల వసూలుతో పాటు అక్రమ సర్వీసుసు గుర్తించి క్రమబద్ధీకరణకు ఆస్కారం ఉంటుందన్నారు. వికారాబాద్ డివిజన్ పరిధిలోని 17 మండలాల్లో 45వేల ఉచిత విద్యుత్ సర్వీసులు ఉన్నాయని, ఇందులో సుమారు 6-7 వేల వరకు అక్రమ సర్వీసులున్నాయని ఆయన తెలిపారు. 2004వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉచిత విద్యుత్ వినియోగదారుల నుంచి సుమారు రూ.9కోట్ల సర్వీసు చార్జీలు, అలాగే ఉచిత విద్యుత్ వర్తించని వ్యవసాయదారుల నుంచి మరో రూ.3కోట్లు వసూలు కావాల్సి ఉందని వివరించారు. స్లాబ్ పాస్బుక్ పొందిన రైతులకు ఉచిత విద్యుత్కు సంబంధించి ఒక సర్వీసు నంబర్ను కేటాయిస్తామన్నారు. ఈ సర్వీసు నంబర్ లేని రైతులు అక్రమ సర్వీసులు కలిగి ఉన్నట్టు పరిగణిస్తామన్నారు. అయితే బకాయి ఉన్న సర్వీసు చార్జీలు మొత్తం చెల్లించిన రైతులకే ఈ పుస్తకం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. జనవరి 31వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి బకాయిలు చెల్లించిన రైతులకు పుస్తకాలు ఉచితంగా అందిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి పుస్తకాలు లేని రైతుల సర్వీసులను తొలగిస్తామన్నారు. ఇటీవలనే బండెనకచర్లలో రైతులకు ఈ పుస్తకాలు అందించామని చెప్పారు. శుక్రవారం బంట్వారం మండలం తోర్మామిడి, శనివారం నుంచి తాండూరు సబ్డివిజన్ పరిధిలోని చెంగోల్, బెల్కటూర్, మైల్వార్, ఎల్మకన్నె, రాస్నం తదితర గ్రామాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. బకాయిలు కచ్చితంగా చెల్లించాల్సిందే.. గతంలో విద్యుత్ వినియోగించుకొని, బోర్లు ఎండిపోయిన రైతులు రూ.5,400 చెల్లిస్తే మళ్లీ కనెక్షన్ రెగ్యులర్ చేస్తామని డీఈ తెలిపారు. నెలకు రూ.30 చొప్పున 9ఏళ్లుగా బకాయిపడ్డ సర్వీసు చార్జీలను రైతులు కచ్చితంగా చెల్లించాల్సిందేనని, లేకపోతే స్టార్టర్లు తీసుకువెళతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోటా 5వేలు ఉండగా, ఇప్పటివరకు సుమారు 2500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని వివరించారు. వికారాబాద్ డివిజన్లో 61 విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో పెద్ద పరిశ్రమలను మినహాయించి 2.40లక్షల ఎల్టీ సర్వీసులు ఉన్నాయని, వీటిపై నెలకు సుమారు 90 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందన్నారు. ఇందులో వ్యవసాయరంగానికే నెలకు సుమారు 30లక్షల యూనిట్ల డిమాండ్ ఉందని వివరించారు. జిల్లా సౌత్ సర్కిల్లో చాలామంది రైతులు సర్వీసు చార్జీలు చెల్లించడం లేదన్నారు. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నందున వాటి వసూలుకు స్లాబ్ పాస్బుక్కులను అందిస్తున్నట్టు చెప్పారు. చార్జీలు చెల్లించిన తేదీ, రసీదు నంబరు తదితర వివరాలన్నీ పుస్తకంలో ఉంటాయని, రైతు ఫోటో జత చేస్తే మండల ఏఈ సంతకం చేస్తారని వివరించారు. అంతకుముందు విద్యుత్ సిబ్బందితో సమావేశమైన డీఈ, విద్యుత్ బకాయిల వసూలు వేగవంతం చేసి లక్షా ్యలను సాధించాలని ఆదేశించారు. సమావేశంలో మండల ఏఈ తుల్జారామ్సింగ్ పాల్గొన్నారు. -
అన్నదాతకు కొత్త షాక్
సాక్షి, రాజమండ్రి : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం కోసం అమలుచేసిన ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించి, వాడకంపై పరిమితులు విధిం చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల వినియోగాన్ని ముందే అంచనా వేయనున్న ప్రభుత్వం ఆంక్షలు విధించడం ద్వారా అధిక విని యోగానికి చార్జీలు వసూలు చేసే ఆలో చనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నానా ఇబ్బందులతో సతమతం అవుతున్న రైతాం గానికి ఇది పిడుగుపాటు కానుంది. ఉచిత విద్యుత్ పథకానికి పూర్తిస్థాయిలో తూట్లు పొడిచి, రైతు నడ్డి విరిచేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే నష్టాల పేరిట ఏడాదికి ఒకసారి కరెంటు చార్జీలు వసూలు చేస్తున్న విద్యుత్తు సంస్థలు రైతుకు ఇచ్చే ఉచిత విద్యుత్తును కూడా భారంగా భావిస్తున్నాయి. దీంతో మీటర్లతో ఈ ప్రక్రియను ప్రారంభించి నొప్పి లేకుండా చార్జీల వాత పెట్టాలని కిరణ్ సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని అధికారులు కూడా కొట్టిపారేయడంలేదు. మీటర్ల బిగింపు అంటే మెట్ట రైతు మెడకు కత్తి కట్టడమేనని రైతాంగం భావిస్తోంది. జిల్లాలోని చాలాప్రాంతాల్లో రోజులో కనీసం మూడు గంటలు నిరాటంకంగా కరెంట్ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. ఉచితవిద్యుత్ అనే ఆసరా ఉన్నప్పటికీ అది పంటల కాలంలో రైతుకు పూర్తిగా కలసిరావడంలేదు. అర్ధరాత్రి వేళల్లో పొలాల్లో జాగారం చేస్తూ, కరెంట్ వచ్చినపుడు పొలం తడుపుకోవలసిన దుస్థితిలో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ దశలో వాడిన కరెంటుకు కొలమానాలు బిగించాలన్న నిర్ణయం రైతుకు కొత్త సమస్యలు తేనుంది. జిల్లాలో సుమారు 3.25 లక్షల ఎకరాల మెట్ట ప్రాంతంలో రైతాంగం సాగు చేస్తోంది. ఇందులో 90 వేల ఎకరాల్లో నీటి కుంటలు, చెరువుల ఆధారంగా వ్యవసాయం సాగుతుంటే, మరో 60 వేల ఎకరాల్లో వర్షాధార వ్యవసాయం సాగుతోంది. ఇక మిగిలిన 1.75 లక్షల ఎకరాల్లో రైతులు విద్యుత్తు మోటార్లపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారు. కరెంటుపై ఆధారపడుతున్న ఈ రైతులనే ప్రస్తుతం విద్యుత్తు శాఖ లక్ష్యంగా చేసుకుంది. నగదు బదిలీ కోసమేనా? అన్ని సబ్సిడీ పథకాలను ప్రభుత్వం ఆధార్కు అనుసంధానం చేసి సబ్సిడీని బ్యాంకు అక్కౌంట్లో జమ చేస్తున్న విషయం విదితమే. ఇపుడు రైతుకు విద్యుత్పై ఇస్తున్న రాయితీని కూడా అలాగే నగదు బదిలీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అనుమానం వ్యక్తం అవుతోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు తొలుత మీటర్లు బిగించి, వాటి మేరకు బిల్లు జారీ చేసి అణాపైసలతో సహా ముందుగానే వసూలు చేయాలని, ఆతర్వాత ఆ సొమ్మును బ్యాంకు అకౌంట్కు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇదే అమలులోకి తమకు తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగం కనెక్షన్లకు మీటర్లు బిగించేశారు... జిల్లాలో మొత్తం 41,000 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇవి నెలకు నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నాయి. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగంలో ఇది ఐదు శాతం కన్నా తక్కువే. కానీ ఈ వర్గాలను కూడా వదలకుండా కరెంటు ఛార్జీలు వసులు చేయాలన్న వ్యూహాన్ని ప్రభుత్వం అంచెల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే సుమారు 21,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించారు. దీనిపై ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ సూపరెంటెండెంట్ ఇంజనీరు వైఎస్ఎన్ ప్రసాద్ను న్యూస్లైన్ వివరణ కోరగా ఇది కేవలం వినియోగాన్ని మదింపు చేసేందుకు మాత్రమేనని చెప్పారు. వ్యవసాయ విద్యుత్కు సంబంధించి చార్జీలు వసూలు చేయాలని ఇంతవరకూ తమకు ఎటువంటి ఆదేశాలూ లేవని ఆయన తెలిపారు. -
ఫ్రీ కరెంట్ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర
ఖమ్మం, న్యూస్లైన్ వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్ను రద్దు చేసేందుకు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యుత్ సరఫరాతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతోందని భావించిన ప్రభుత్వం.. దీన్ని ఎలా రద్దు చేయాలని కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ముందుగా విద్యుత్ వినియోగం లెక్కల పేరుతో ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించి లెక్కతేల్చేందుకు ట్రాన్స్కో అధికారులు రంగంలోకి దిగారు. రైతును రాజుగా చూడాలనే తపనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైల్పైనే తొలి సంతకం చేశారు. మహానేత పాలనలో రైతులకు ఏడుగంటల విద్యుత్ సరఫరా చేయడంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. అయితే ఆయన మరణానంతరం అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని రైతులను చులకనగా చూశారు. ఏడు గంటలు కాదుకదా మూడు గంటలు కూడా సక్రమంగా సరఫరా చేసిన పాపాన పోలేదు. ఉచిత విద్యుత్కు అత్యధికంగా సబ్సిడీ ఇవ్వాల్సి వస్తోందని భావించిన ప్రభుత్వం దీనిని ఎత్తివేసేందుకు నాలుగు నెలల క్రితమే నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. కాగా, ఉచిత విద్యుత్పై ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ కోసం డిస్కం ఒత్తిడి పెంచింది. దీంతో రైతులకు షాక్ ఇచ్చేలా ఉచితంగా సరఫరా చేసే విద్యుత్కు లెక్కలు వేసి బిల్లులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంపుసెట్ల వద్ద మీటర్లు బిగిస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతోంది. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా అయ్యేట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు అమర్చి ప్రతి కనెక్షన్కు లింక్ చేస్తుంది. అనంతరం నెలనెలా విద్యుత్ వినియోగం రీడింగ్ తీస్తుంది. ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో ఉన్న కనెక్షన్లలో 5 హెచ్పీ, 3 హెచ్పీల లెక్క ప్రకారం సగటున ఒక్కో పంప్సెట్కు అయిన విద్యుత్ వినియోగాన్ని లెక్కవేస్తుంది. ఈ విధంగా బిల్లులు వసూలు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 350 మీటర్లు అమర్చిన అధికారులు.. జిల్లాలోని వ్యవసాయ పంప్సెట్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వాటికి మీటర్లు అమర్చే పనిలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు 8లక్షలకు పైగా ఉండగా, అందులో వ్యవసాయ కనెక్షన్లు 90 వేలు ఉన్నాయి. మీటర్లు బిగించేందుకు 100 కేవీ, 63 కేవీ, 25 కేవీ, 16 కేవీ.. ఇలా మొత్తం 350 ట్రాన్స్ఫార్మర్లను ఎంపిక చేశారు. ఇందులో ఖమ్మం డివిజన్లో 57, సత్తుపల్లిలో 102, కొత్తగూడెంలో 97, భద్రాచలం డివిజన్లో 94 ఉన్నాయి. ఇందులో 100 కేవీ ట్రానుఫార్మర్లకు 95 మీటర్లు, 63 కేవీకి 68, 25 కేవీకి 145, 16 కేవీకి 45 మీటర్లు అమర్చాలని ఉన్నతాధికారులు అదేశించడంతో జిల్లా అధికారులు ఆ మేరకు పనులు ప్రారంభించారు. ఈ మీటర్ల ద్వారా రీడింగ్ అంచనా వేసి షరతులతో కూడిన ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నెలకు 75 నుంచి 100యూనిట్ల విద్యుత్ వినియోగించిన వారికి మాత్రమే ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే మామూలు వ్యవసాయానికే 200 యూనిట్లకు మించిన విద్యుత్ అవసరమని, ఇలా షరతులు పెట్టి క్రమంగా ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని, ఇప్పుడు విద్యుత్ భారం కూడా పడితే ఇక సాగు కష్టమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రైతులకు సర్కారీ ఉచిత షాక్ !
వరంగల్, న్యూస్లైన్ : ఉచిత విద్యుత్ను రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే అతి భారంగా పరిగణిస్తోంది. వ్యవసాయానికి ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నామని, విద్యుత్ సరఫరా కోసం అత్యధిక సబ్సిడీ ఇస్తున్నట్లు పలుమార్లు వాటికి ఆంక్షలు వేసే ప్రయత్నం చేసింది. ఒక దశలో నాలుగు నెలల క్రితం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తి వేసే నిర్ణయం కూడా తీసుకుంది. కానీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత విద్యుత్కు కళ్లెం వేస్తే... రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేక వస్తుందనే నివేదికలతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. కానీ... మళ్లీ ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం డిస్కంలు సర్కారుపై ఒత్తిడి తీసుకువస్తుండడంతో ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అత్యధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్ సర్కిల్లో ఈ దొంగచాటు ప్రయోగాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయ పంపు సెట్ల వద్ద రీడింగ్ మీటర్లను బిగిస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల వద్దే కొత్త మీటర్లను అమర్చి... వ్యవసాయానికి వినియోగించే ప్రతి కనెక్షన్నూ వాటికి లింక్ చేస్తోంది. ఈ మేరకు విద్యుత్ సిబ్బంది రీడింగ్ తీస్తున్నారు. ఈ మేరకు వినియోగమవుతున్న విద్యుత్ను అంచనా వేసి... బిల్లులు వసూలు చేసేందుకు మాయత్తమవుతున్నట్లు సమాచారం. ట్రాన్స్ఫార్మర్కో మీటర్ జిల్లాలోని ఆయా సబ్ డివిజన్లలో ప్రతి ఐదు ట్రాన్స్ఫార్మర్లకు వ్యూహాత్మకంగా రీడింగ్ మీటర్లను ఏర్పాటు చేశారు. 100 కేవీ, 63 కేవీ, 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లకు ఈ మీటర్లను బిగించారు. ప్రస్తుతం 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 40 నుంచి 50, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 20 నుంచి 30, 25 కేవీ కింద 5 నుంచి 7, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 3 నుంచి 5 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన రీడింగ్ మీటర్లకు సంబంధిత ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇచ్చిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను లింక్ చేశారు. ప్రతి కనెక్షన్కూ రీడింగ్ మీటర్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా అనుసంధానం చేశారు. దీంతో ఒక్కో రైతు వ్యవసాయానికి రోజుకు ఎంత విద్యుత్ను వినియోగిస్తున్నాడు... ఎంత ఖర్చు పడుతోంది... కస్టమర్ చార్జీతో కలిపి ఎంత మేరకు బిల్లు వేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లకు ఈ మీటర్లను ఏర్పాటు చేశారు. వాటి నుంచే రైతులకు ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో వ్యవసాయ కనెక్షన్కు సుమారు 200 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో 75 నుంచి 100 యూనిట్లకు ఉచిత విద్యుత్ను పరిమితం చేసే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. కాగా, పూర్తిస్థాయిలో విద్యుత్ను వినియోగించుకోని రైతులకు సగం మేర బిల్లు వేసే అవకాశాలున్నట్లు సమాచారం.