ganesh laddu
-
లంబో‘ధర’ లడ్డూ!
సాక్షి, హైదరాబాద్/బడంగ్పేట్: భాగ్యనగరంలో గణేశ్ ప్రసాదం లడ్డూ వేలం పాట కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గణపతి ప్రసాదం సొంతం చేసుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో వేలాది మంది భక్తులు వేలం పాటలో పాల్గొన్నారు. రూ.లక్షలు దాటి రూ.కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నారు. రిచ్మండ్ విల్లాస్లో గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.1.25 కోట్లకు లడ్డూ వేలం పాట జరగగా, ఈ ఏడాది అదే విల్లాస్లో ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ ఆర్వీ దియా ట్రస్ట్ రూ.1.87 కోట్లకు లడ్డూను వేలంలో దక్కించుకుంది. బాలాపూర్ లడ్డూ ప్రధానికి బహూకరిస్తా.. ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ లడ్డూను బీజేపీ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొలన్ శంకర్రెడ్డి దక్కించుకున్నారు. మంగళవారం ఉదయం మండపం నుంచి కదిలిన విఘ్నేశ్వరుడు గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకున్న అనంతరం లడ్డూకు వేలం పాట నిర్వహించారు. లింగాల దశరథ్గౌడ్, సామ ప్రణీత్రెడ్డి, గీతాదేవి, కొలన్ శంకర్రెడ్డి మధ్య హోరాహోరీ పాట నడిచింది. చివరకు రూ.30,01,000 కొలన్ శంకర్రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. కాగా, బాలాపూర్ గణనాథుని లడ్డూను వేలంలో దక్కించుకోవడం సంతోషంగా ఉందని, ఈ లడ్డూని ప్రధాని మోదీకి బహూకరిస్తానని శంకర్రెడ్డి తెలిపారు. లక్షల్లో వేలం పాటలు.. ⇒ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చబండ వినాయకుని లడ్డూను రూ.16.03 లక్షలకు పీఏసీఎస్ స్థానిక చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, సమత దంపతులు దక్కించుకున్నారు. ⇒ బడంగ్పేట్లోని వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూను రూ.11.90 లక్షలకు స్థానిక రైతు గౌర సత్తయ్య, అతని కుమారులు వీరయ్య, చంద్ర య్య, సురేశ్ కైవసం చేసుకున్నారు. ⇒ అత్తాపూర్ పోచమ్మ ఆలయం న్యూస్టార్స్ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని లడ్డూను ఏనుగుల సుభా‹Ùరెడ్డి రూ.11.16 లక్షలకు దక్కించుకున్నారు. ⇒ రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి శ్రీ వీరాంజనేయ భక్త సమాజం హనుమాన్ టెంపుల్ లడ్డూను పోరెడ్డి శ్రీకాంత్రెడ్డి రూ.10 లక్షలకు కైవసం చేసుకున్నారు. ⇒ ఉప్పరపల్లి రెడ్డిబస్తీలో బొక్క ప్రశాంత్రెడ్డి రూ. 7.01 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ⇒ విజయపురి కాలనీ ఫేజ్–2లో త్రినేత్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర లడ్డూను రూ.6.5 లక్షలకు ఒర్సు రాజు సొంతం చేసుకున్నారు. ⇒ కూకట్పల్లి వినాయక భక్త బృందం బీజేపీ ఆఫీస్ దగ్గర లడ్డువేలం వేయగా రూ.5.65 లక్షలకు రంభప్పగారి సందీప్రావు దక్కించుకున్నాడు.సమాజ సేవలో రిచ్మండ్⇒ ఏటా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట⇒ ఈ ఏడాది 1.87 కోట్లతో రికార్డు⇒ సామాజిక సేవలకు 48 ఎన్జీవోలతో ఒప్పందం..⇒ క్రికెటర్ కపిల్దేవ్ సైతం ప్రశంసలుసాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత రెండు, మూడేళ్లుగా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట పాడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది రిచ్మండ్ విల్లాస్కు చెందిన ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్టు. ఈ ఏడాది 1.87 కోట్లకు వేలం పాట పాడి రికార్డు నెలకొల్పింది. అసలు ఇంత మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. ఈ నిధులను ఏం చేస్తారనే ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం.. దాతల నుంచి సేకరించి.. సాధారణంగా వేలం పాట అంటే ఎవరో ఒక వ్యక్తి పాడి ఆ లడ్డూని దక్కించుకుంటారు. కాకపోతే రిచ్మండ్ అపార్ట్మెంట్కు చెందిన వారంతా నాలుగు గ్రూపులుగా విడిపోయి వేలం పాట పాడుతుంటారు. ఎక్కువ మొత్తం పాడిన ఒక గ్రూపు వాళ్లు వేలంలో గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మిగిలిన గ్రూపుల వాళ్లు పాడిన మొత్తం కూడా వేలంలో కలిపేస్తారు. దీంతో భారీ మొత్తం సమకూరుతోంది. ఇక అపార్ట్మెంట్కు చెందిన వారితో పాటు విదేశాల్లో ఉన్న ట్రస్టు సభ్యుల స్నేహితులు, కుటుంబసభ్యులు కూడా ఈ వేలం పాటకు డబ్బులు ఇస్తారు. 2016 నుంచి.. 2016లో రిచ్మండ్ విల్లాస్లో లడ్డూ వేలం ప్రారంభమైంది. అపార్ట్మెంట్లో పనిచేసే వారి పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించి లడ్డూ వేలం ప్రారంభించారు. తొలిసారి రూ.25 వేలు పలికిన లడ్డూ.. ప్రతియేడూ పెరుగుతూ ఈ ఏడాది 1.87 కోట్లకు చేరింది. గతేడాది 1.2 కోట్లు సమకూరాయి. వేలం ద్వారా వచి్చన మొత్తం డబ్బును ట్రస్టు సభ్యులు సామాజిక సేవకే వినియోగిస్తున్నారు. ఈ ఏడాది 48 ఎన్జీవోలతో ఒప్పందం కుదుర్చుకుని, వారి ద్వారా అవసరాల్లో ఉన్న వారికి విద్య, వైద్యం అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.చాలా గొప్ప పని: కపిల్దేవ్ ఆర్వీ దియా ట్రస్ట్ అద్భుతమైన పని చేస్తోందని ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కితాబిచ్చారు. తాను నేరుగా వచ్చి కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొంటూ ఆయన ఓ వీడియో సందేశం పంపారు. ఒకరోజు కచి్చతంగా వచ్చి నేరుగా ట్రస్ట్ సభ్యులను కలుస్తానంటూ ఆయన చెప్పారు.ఒక్క రూపాయి తీసుకోం.. లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోం. ప్రతి రూపాయి సామాజిక సేవ చేసేందుకే వినియోగిస్తాం. పేద వారికి చదువు, వైద్యం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గత ఎనిమిదేళ్లుగా నిరి్వరామంగా కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. – జీవన్రెడ్డి, ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్టు -
సోనీ.. సో లక్కీ.. శునకానికి గణేశ్ లడ్డూ
నయీంనగర్: గణపతి లడ్డూను ఓ పెంపుడు శునకం దక్కించుకుంది. హనుమకొండ 54వ డివిజన్ కేయూ రోడ్ డబ్బాల్ జంక్షన్ వద్ద హనుమాన్ గజానన మండలి సభ్యులు గణపతి నవరాత్రుల లడ్డూకు లక్కీడ్రా నిర్వహించారు. ఇందులో స్థానికుడు పొలాల వాణి, రాజేశ్ కుటుంబ సభ్యులందరి పేర్లను రాసి డ్రాలో వేశారు. వారి పెంపుడు శునకం సోని పేరుతోనూ చీటీ వేశారు. సోమవారం నిర్వహించిన లక్కీ డ్రాలో శునకానికి లడ్డూ దక్కడం విశేషం. -
గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు
హైదరాబాద్, సాక్షి: నగర పరిధిలోని బండ్లగూడ జాగీర్లో గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్లో జరిగిన వేలంపాటలో రూ.1.87కోట్లకు ఓ భక్తుడు లడ్డూను దక్కించుకున్నాడు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి రూ.1.26కోట్లకు గణపయ్య లడ్డూను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు.. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని మాదాపూర్ మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ వేలంపాటలో ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఎంత దక్కించుకుంటుందో అనే చర్చ నడుస్తోంది. -
Ganesh laddu: గణేష్ లడ్డూ చోరీ
జీడిమెట్ల: గణేష్ లడ్డూతో పాటు రూ.24 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు చోరీకి గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుభాష్ నగర్ డివిజన్ డీపీ కాలనీలో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి మండపంలోకి ప్రవేశించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు గణపతి వద్ద ఉన్న 8,2 కిలోల లడ్డూతో పాటు అక్కడే నిద్రిస్తున్న వారి జేబుల్లో రూ.24 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. యూత్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరీష్ తెలిపారు. కాగా లడ్డూను ఎత్తుకెళ్తున్న వ్యక్తి ఫొటో సీసీ కెమెరాకు చిక్కింది. -
లంబో‘ధర’ లడ్డూ!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఎత్తయిన గణేష్ విగ్రహం (63 అడుగులు) కూడా ఇదే. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తొలిసారిగా 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభించింది. తొలి వేలం పాటలో రూ.450కి దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో ఆ తర్వాత ప్రసాదానికి మరింత డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్నకు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలం పాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది. పోటాపోటీగా వేలం పాటలు.. ♦ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలు పోటాపోటీగా కొనసాగాయి. వినాయకుడి చేతిలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రముఖ మండపాల్లో నిర్వహించిన వేలం పాటల్లో రూ.15 కోట్లకుపై గా ఉత్సవ కమిటీలకు సమకూరినట్లు తెలిసింది. ♦ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రూ.5 కోట్లు, ఖైరతాబాద్లో రూ. 33.75 లక్షలు, సికింద్రాబాద్లో రూ.19 లక్షలు, శేరిలింగంపల్లిలో రూ.1.25 కోట్లు, అంబర్పేటలో రూ.25 లక్షలు, మల్కాజిగిరిలో రూ.48లక్షలు, కుత్బుల్లాపూర్లో రూ.2.13 కోట్లు, చార్మి నార్ ఏరి యాలో రూ.56.88 లక్షలు, ఉప్ప ల్లో 1.50 కోట్లు, సనత్నగర్లో రూ.12 లక్షలు, గోషామహల్లో రూ.45 లక్షలు, మలక్పేటలో రూ.20 లక్షలు, మేడ్చల్లో రూ.1.50 కోట్లు, ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ.20 లక్షల వరకు వేలం పాటలు కొనసాగాయి. ♦ కాగా.. బడంగ్పేట వీరాంజ నేయ భక్త సమాజం గణనాథుడి లడ్డూ కూడా రూ.17 లక్షలు.. చేవెళ్ల రచ్చబడం గణేషుడి చేతిలోని లడ్డూ ప్రసాదం రూ.22.11 లక్షలు, ఆదిబట్లలోని చైతన్య యూత్ అసోసియేషన్ వినాయకుడి లడ్డు రూ.12.50 లక్షలు, ఫరూక్నగర్ మండల పరిధిలోని మధురాపూర్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని లడ్డు రూ.11.11 లక్షలు, కొంపల్లి అపర్ణ మెడల్స్లోని లడ్డూ ధర రూ.13 లక్షలు పలికింది. ♦వేలం పాటలో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని తినడం, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిణీ చేయడం, పంట పొలాల్లో చల్లడం ద్వారా మంచి జరుగుతుందనే నమ్మ కం ఉంది. అంతే కాదు స్థానికంగా గుర్తింపుతో పాటు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కూడా లభిస్తుండటంతో లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. రూ.1.25 కోట్లు పలికి.. ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతటా విస్తరించింది. ఈ ఏడాది గ్రేటర్లో చిన్నా పెద్దా కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. రెండు మూడేళ్ల క్రితం వరకు బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. తాజాగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డూ ప్రసాదం ఆ రికార్డును బద్దలు కొట్టింది. రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. -
రూ.1.25 కోట్లు పలికిన గణేశ్ లడ్డు
బండ్లగూడ(హైదరాబాద్): వేలం పాటలో గణేశ్ లడ్డుకు అత్యధికంగా రూ.1.25 కోట్లు పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరు కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డుకు గురువారం వేలంపాట నిర్వహించగా, ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ. 1.25 కోట్లకు దక్కించుకున్నారు. ఆర్వీ దియా ట్రస్ట్ ఆధ్వర్యంలో 150కిపైగా వ్యక్తిగతదాతలు కలిసి ఈ లడ్డును కొనుగోలు చేశారు. గతేడాది ఇక్కడి లడ్డు కు వేలంపాటలో పలికిన ధర రూ.6.28 లక్షలే. బాలాపూర్ లడ్డు రూ. 27 లక్షలు బాలాపూర్ గణనాథుని లడ్డును ఈసారి తుర్క యాంజాల్ పరిధిలోని పాటిగూడ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రైతు దాసరి దయానంద్రెడ్డి కైవసం చేసుకున్నారు. వేలంపాటలో రూ.27 లక్షలకు ఆయన సొంతమైంది. ► రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చ బండ వినాయక లడ్డును వేలం పాటలో రూ.22. 11 లక్షలకు కేటీఆర్ గ్రూప్ సభ్యులు దక్కించుకున్నారు. గతేడాది రూ.20.20 లక్షలు పలికింది. ► బడంగ్పేట వీరాంజనేయ భక్త సమాజం లడ్డును మాజీ ఉప సర్పంచ్ పెద్దబావి వెంకట్రెడ్డి రూ.17 లక్షలకు సొంతం చేసుకున్నారు. ► షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని మధురపురం రెడ్డిసేవా సమితి వినాయక లడ్డును అదే గ్రామానికి చెందిన శేరి పర్వతరెడ్డి రూ. 11,11,116లకు దక్కించుకున్నాడు బాలాపూర్ గణేశుడి లడ్డును దక్కించుకున్న దాసరి దయానంద్ లడ్లు దక్కించుకున్న ముస్లింలు ► ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్జనతా గణేశ్మండలి వద్ద లడ్డుకు వేలం పాట నిర్వహించగా, స్థానిక ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్ రూ.1.02లక్షలకు దక్కించుకున్నాడు. ► రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని సాయినగర్ కాలనీలో లడ్డు వేలం పాట నిర్వహించగా, మండలంలోని మహాలింగపురం గ్రామానికి చెందిన మహారాజ్పేట్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తాహేర్ అలీ రూ. 23,100కు దక్కించుకున్నాడు. -
Balapur Ganesh Laddu Auction 2023: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట (ఫొటోలు)
-
HYD: రూ. కోటి 26 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది. వినాయకుడి లడ్డూ వేలంలో రూ. కోటి 26 లక్షలు పలికింది. మాదాపూర్లోని మైహోమ్ భుజాలో కూడా గణపతి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ. 25.50 లక్షలు పలికింది. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వేలంలో గణపతి ప్రసాదాన్ని దక్కించుకున్నారు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. -
HYD: 21 కిలోల గణేషుడి లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఈనెల 18న వినాయక చవితితో మొదలైన నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం గణేషుడిని 28న నిమజ్జనం చేయనున్నారు. తాజాగా హైదరాబాద్లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఝాన్సీ బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నుంచి కొంతమంది విద్యార్థులు లడ్డూను దొంగలించారు. గణనాథుడి చేతిలో పెట్టిన 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లారు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లారు. అనంతరం ఆ లడ్డూని పంచుకొని తినేశారు. విషయం తెలుసుకున్న నిర్వాహకుడు శ్యామ్ అగ్రర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సీసీ ఫుటేజీ దృశ్యాలు పరీక్షించగా.. మైనర్ విద్యార్థులు చోరికి పాల్పడినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ విద్యార్థులు చార్మినార్ పీఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసిన స్టూడెంట్స్ pic.twitter.com/0Q4jYIQ6Q1 — Telugu Scribe (@TeluguScribe) September 24, 2023 -
భక్తులారా జాగ్రత్త..గణేష్ లడ్డు మాయం..
-
రికార్డులు బద్దలు.. రూ. 60 లక్షలు పలికిన లడ్డూ! ఎక్కడంటే..
సాక్షి, బండ్లగూడ: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం రికార్డు స్థాయిలో రూ. 60.83 లక్షలు పలికింది. సన్సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్లోని ఆర్మీ దివ్యా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. | గతేడాది ఈ లడ్డూ రూ.41 లక్షలు పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ రూ.24.60 లక్షలు , అల్వాల్ కానాజీగూడ లడ్డూ రూ. 46 లక్షలు పలికాయి. వీటి రికార్డును బ్రేక్ చేస్తూ బండ్లగూడ జాగీర్ లడ్డూ రూ.60.83 లక్షలు పలకడం గమనార్హం. ఆర్వీ దివ్యా ట్రస్ట్కు డాక్టర్ అర్చనాసిన్హా, పూర్ణిమా దేశ్పాండే మేనేజింగ్ ట్రస్టీలుగా ఉన్నారు. ఇదీ చదవండి: నష్టాల సాకు.. బస్సులకు బ్రేక్! -
‘బాలాపూర్’.. బలాదూర్!
అల్వాల్: నగరశివారులో ఉన్న బాలాపూర్ గణపతి మండపంలోని లడ్డూ వేలంపాటలో ఈసారి రూ.24.60 లక్షలు పలుకగా, అల్వాల్ కానాజీగూడ లడ్డూ దానిని బ్రేక్ చేసింది. కానాజీగూడకు చెందిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ మండపంలో లడ్డూను నగరానికి చెందిన డాక్టర్ తాళ్లూరు వెంకట్రావు, గీతప్రియ దంపతులు రూ.45,99,999కి దక్కించుకున్నారు. వెంకట్రావు విదేశాలలో లార్డ్ ఇన్స్టిట్యూషన్స్, లోక్ప్రదీప్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ దంపతులు ఆ ఆలయానికి గత కొంతకాలంగా భక్తులుగా ఉన్నారు. గతేడాది కూడా వీరే రూ.17,81,999కు ఇక్కడి లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి కూడా పలువురు వేలంపాటలో పాల్గొనగా, చివరికి వెంకట్రావు దంపతులే రికార్డు స్థాయిలో పాటపాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. మరకత గణపతిపై అచంచల విశ్వాసం ఉందని, ఈ లడ్డూను దక్కించుకోవడం వల్ల తమకు మరింత మేలు జరుగుతుందన్న విశ్వాసం ఉందని వారు అన్నారు. వేలం ద్వారా వచ్చిన లడ్డూ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, నిత్యాన్నదానానికి ఉపయోగిస్తామని ఆలయ నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణశాస్త్రి తెలిపారు. -
Ganesh Laddu: రాత్రికి రాత్రే గణేష్ లడ్డూను మాయం చేసిన పిల్లలు
బంజారాహిల్స్: గణేశ్ మండపంలో లడ్డూ చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.70 జర్నలిస్టు కాలనీ సమీపంలోని అశ్విని లే అవుట్ పావనీ హోమ్స్లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం చేతిలో నిర్వాహకులు పది కిలోల లడ్డూ ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఫిలింనగర్లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన పిల్లలు లడ్డూను దొంగిలించి పరారయ్యారు. ఆదివారం ఉదయం లడ్డూ కనిపించకపోవడంతో మండపం నిర్వాహకులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో అదే అపార్ట్మెంట్లో పని చేస్తున్న ఎమ్మార్సీ కాలనీకి చెందిన ఓ మహిళ కుమారుడు మరో ఇద్దరు పిల్లలతో కలిసి లడ్డూ తీసుకుని పరారైన దృశ్యాలు కనిపించాయి. ఎనిమిదేళ్ల వయసున్న ఆ బాలుడిని విచారించగా తన తల్లి చెప్పడంతోనే ఈ దొంగతనం చేసినట్లు తెలిపాడు. లడ్డూను స్వాధీనం చేసుకున్న నిర్వాహకులు చోరీకి పాల్పడిన ముగ్గురు పిల్లలను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. గణేశుడి చేతిలో ఉన్న లడ్డూని పది మందికి పంచితే దోషాలు తొలగిపోతాయని, డబ్బు కలిసి వస్తుందనే నమ్మకంతోనే మహిళ ఈ పని చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తుండగానే అదే ప్రాంతంలో మరో గణనాథుడి మండపంలో లడ్డూ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా లడ్డూ దొంగతనాలపై ఫిర్యాదులు అందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: నిమజ్జనంలో అపశ్రుతి -
26 వినాయక మండపాల్లో లడ్డూల చోరీ
చిట్యాల/మీర్పేట: వినాయకుడి చేతిలో పూజలందుకున్న లడ్డూలను గణేశ్ నిమజ్జనం రోజున వేలంలో వేలు, లక్షల రూపాయలు పెట్టి దక్కించుకుంటారు. అయితే నల్లగొండ జిల్లా చిట్యాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు లడ్డూలను ఎత్తుకెళ్లిపోయారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో్ల మండపాలను ఏర్పాటు చేసి గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే, కొందరు దుండగులు పట్టణంలోని 26 మండపాల్లో ఉన్న లడ్డూలను అపహరించుకుపోయారు. శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం నుంచి లడ్డూను అపహరిస్తున్న క్రమంలో విగ్రహం చేయి విరిగిపోయింది. ఓ వార్డులో లడ్డూ చోరీకి వచ్చిన ఇద్దరు అనుమానితులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో లడ్డూల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని మండపాల నిర్వాహకులు లడ్డూల చోరీపై ఫిర్యాదు చేయలేదు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలోని డీఎల్ఆర్ కాలనీవాసులు స్థానిక కమ్యూనిటీహాల్లో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించే యత్నం చేశారు. అదికాస్తా విఫలమవడంతో చేసేది లేక విగ్రహాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. -
ఆల్ టైం రికార్డ్,వేలంలో రూ.41లక్షలు పలికిన లడ్డూ..ఎక్కడంటే?
ప్రపంచ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలకగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో లడ్డు ధర రికార్డ్ స్థాయిలో రూ.41లక్షలు పలికింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన కీర్తి రిచ్మాండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో 179విల్లాస్లో 82 మంది నివసిస్తున్నారు. అయితే స్థానికులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా వినాయక చవితి ఉత్సవాల్ని నిర్వహించారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని జరిపిన లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర ఆల్ టైమ్ రికార్డ్ను క్రియేట్ చేసింది. లడ్డూ వేలం పాటలో 5 కేజీల లడ్డూ రూ.41లక్షలు పలికినట్లు నిర్వాహకలు తెలిపారు. ఇక్కడ 2019లో జరిగిన వినాయక చవితి లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర 27లక్షలు పలికింది. కానీ ఈ సారి ఏకంగా రూ.41 లక్షలు పలకడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏదాడి బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ ఈసారి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం వినాయకుడి చేతిలోని లడ్డూ చోరీ -
రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు
-
రూ. 17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
-
రూ.8.1 లక్షలు పలికిన బంగారు లడ్డూ
కవాడిగూడ: ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్ హౌస్ శ్రీసిద్ధి వినాయక భగత్సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 తులాల బంగారంతో తయారైన గణపతి లడ్డూ వేలంలో రూ.8.1 లక్షలు పలికింది. భోలక్పూర్కు చెందిన చేపల వ్యాపారి కాడబోయిన భాస్కర్ 11 కేజీల సాధారణ లడ్డూతో పాటు బంగారు లడ్డూను దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా గణపతి వద్ద బంగారు లడ్డూను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు జి.అనిల్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్రావు, భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్కుమార్, బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గ కో–కన్వీనర్ ఎం.నవీన్గౌడ్, నాయకులు శ్రీధర్చారి, రవిచారి, ముప్పిడి నర్సింగ్రావు, బబ్లూ, భాను, కిశోర్యాదవ్, పరమేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.5.21 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకుంటున్న గణనాథుల లడ్డూలు వేలంలో అధిక రేటు పలుకుతున్నాయి. గురువారం నగరంలోని బడంగ్పేటలో గణేషుని లడ్డూ రూ. 5.21 లక్షలు పలికింది. పూజలందుకున్న గణనాథుడి లడ్డూను తమ సొంతం చేసుకునేందుకు భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. చివరికి వినాయక లడ్డూను వేలంలో బాదం నర్సింహయాదవ్ అనే వ్యక్తి రూ. 5.21 లక్షలకు దక్కించుకున్నారు. -
రూ.35వేలు పలికిన గణేష్ లడ్డూ
పెద్దవూర: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకుంటున్న గణనాథుల లడ్డూలు వేలంలో అధిక రేటు పలుకుతున్నాయి. మండలంలోని తుంగతూర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతపల్లి తండాలో పూజలందుకున్న వినాయక లడ్డూను వేలంలో తండాకు చెందిన జటావత్ సోమాలీరమణి రూ.35వేలకు దక్కించుకుంది. అనంతరం తండాలో ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో లడ్డూను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలోని న్యూకిడ్స్ పబ్లిక్ స్కూల్లో గణేష్ విగ్రహ నిమజ్జనంగా సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేస్తు, బాణ సంచా కాల్చుతూ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జటావత్ రవినాయక్, ఎంపీటీసీ శాంతి, బాలాజీనాయక్, హేమానాయక్, శ్రీను, భగవాన్, రాజు, మాన్యా పాల్గొన్నారు. -
వేదగణపతి మహాలడ్డు రూ. 2.51 లక్షలు
నెల్లూరు రూరల్ : నెల్లూరులోని వేదాయపాళెంలో శ్రీవేదగణపతి లడ్డు వేలంలో రూ.2.51 లక్షలు పలికింది. వినాయకచవితిని పురష్కరించుకుని వేదాయపాళెం, చంద్రమౌళీనగర్ శ్రీవేదగణపతి ఆలయం ఆవరణలో ప్రతిష్టించిన వినాయకుడి ప్రతిమ వద్ద స్వామివారి ప్రసాదంగా 500 కేజీల లడ్డును ఏర్పాటుచేశారు. సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ గురువారం రాత్రి నిర్వహించిన వేలం పాటలో వేదాయపాళెంకు చెందిన శాంతి ఎర్త్ మూవర్స్ అధినేత మద్దినేని శాంతినాయుడు రూ.2.51 లక్షలకు దక్కించుకున్నారు. ఏటా లడ్డు వేలంతో వచ్చే మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మేకల రజిని, దొడ్డపనేని రాజానాయుడు, మేకల రాజేంద్ర, గొట్టిపాటి ప్రభాకర్ పాల్గొన్నారు. -
కూకట్ పల్లి లడ్డూకు రికార్డు ధర
-
కూకట్ పల్లి లడ్డూకు రికార్డు ధర
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి అడ్డుగట్ట సొసైటీలోని గణేశుని లడ్డూకు రికార్డు ధర పలికింది. గణేశుని నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన వేలంలో లడ్డూ ధర రూ.15 లక్షలు పలికింది. ఈ లడ్డూను నెల్లూరుకు చెందిన చంటిరెడ్డి దక్కించుకున్నారు. జంటనగరాల్లో ఇప్పటివరకూ నిర్వహించిన గణేశుని లడ్డూల వేలంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. దీని తర్వాత బాలాపూర్ లడ్డూను రూ.10.32 లక్షలకు కళ్లెం మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా బడంగ్ పేట్ గణేశుని లడ్డూ రూ. 6.50 ధర పలికింది. -
అత్యధిక ధర పలికే బాలాపూర్ లడ్డూ
-
‘ఖైరతాబాద్’ లడ్డూ తయారీ ప్రారంభం
తాపేశ్వరం (మండపేట) : ఖైరతాబాద్ గణనాథునికి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ సంస్థ సమర్పించనున్న మహాలడ్డూ తయారీ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. గణనాథుడి కోసం సురుచి సంస్థ 5,600 కిలోల లడ్డూ తయారు చేయనున్న విషయం విదితమే. ఇందుకోసం సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతో పాటు 15 మంది కార్మికులు గణపతి మాలలు ధరించారు. శనివారం లడ్డూ కోసం బూందీ తీయడం ప్రారంభించారు. ఇందుకోసం పొయ్యి లేని అత్యాధునిక వంటశాలను ప్రారంభించారు. థర్మల్ హీటింగ్ విధానంలోనిఈ వంటశాలలో కళాయిలు మాత్రమే ఉంటాయి. వంట చెరకు ఆధారిత ద్రవరూప గ్యాస్ ఇంధనంగా ఒకే వేడితో ఈ కళాయిల్లో నెయ్యి వేసి లడ్డూలు తీయడం ప్రారంభించారు. ఈ రకమైన వంటశాల రాష్ట్రంలో ఇదే మొదటిదని మల్లిబాబు తెలిపారు. మహాలడ్డూ తయారీకి మరికొన్ని కొత్త యంత్రాలను కూడా వినియోగిస్తున్నట్టు తెలిపారు. -
9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
-
రూ. 9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాద్ : ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రూ.9.50 లక్షలు పలికింది. ఆది నుంచి పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ లంబోదరుడి లడ్డూను సింగిరెడ్డి జయేందర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రూ.116 నుంచి ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24మంది భక్తులు పోటీ పడ్డారు. చివరకు గణేష్ లడ్డూ సింగిరెడ్డి జయేందర్ రెడ్డిని వరించింది. గత ఏడాది రూ.9.26 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి మరో 24వేల అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది. కాగా బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరటం విశేషం. -
అందరి దృష్టి బాలాపూర్ వైపే
*బాలాపూర్ లడ్డూ కోసం ఏటా పెరుగుతోన్న ఆదరణ * నేటి వేలంపై ఆసక్తి బడంగ్పేట లడ్డూ కూడా.. హైదరాబాద్ : సామూహిక గణేశ్ నిమజ్జనం వేళ అందరి దృష్టి బాలాపూర్ వైపు మళ్లింది. ఇక్కడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడుతుంటారు. లడ్డూను దక్కించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. లక్షలు వెచ్చించి లడ్డూను సొంతం చేసుకునేందుకు ఆసక్తిచూపుతారు. సోమవారం నిమజ్జన ఊరేగింపు ప్రారంభానికి ముందు ఇక్కడ లడ్డూను వేలం వేస్తారు. ఈసారి అది ఎవరి సొంతం అవుతుందోనని నగరవాసులంతా ఎదురుచూస్తున్నారు. లడ్డూ ప్రస్థానం ఇలా.. ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరింది. బాలాపూర్లో పదేళ్ల కాలంలో లడ్డూను సొంతం చేసుకున్న వారు.. సం. దక్కించుకున్న వారు మొత్తం రూ. లక్షల్లో 2004 కొలను మోహన్రెడ్డి రూ.2.01 2005 ఇబ్రాం శేఖర్ రూ.2.08 2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ.3.00 2007 జి.రఘునందనాచారి రూ.4.15 2008 కొలను మోహన్రెడ్డి రూ.5.07 2009 సరిత రూ.5.10 2010 శ్రీధర్బాబు రూ.5.30 2011 కొలను ఫ్యామిలీ రూ.5.45 2012 పన్నాల గోవర్ధన్రెడ్డి రూ.7.50 2013 టీకేఆర్ విద్యాసంస్థలు మీర్పేట రూ.9.26 బడంగ్పేట లడ్డూకూ ఆదరణ.. బాలాపూర్ తరువాత బడంగ్పేట గణనాథుడి లడ్డూకు అంతటి డిమాండ్ ఉంది. ఇక్కడి లడ్డూను వేలంలో లక్షల రూపాయలకు సొంతం చేసుకుంటున్నారు భక్తులు. ఇక్కడ 1966 నుంచి మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకున్ని ప్రతిష్ఠిస్తున్నారు. 1995 నుంచి లడ్డూను వేలం వేస్తున్నారు. మొదటిసారి వేలం పాటలో అప్పటి గ్రామ సర్పంచ్ ఆశంగారి నిర్మలానర్సింహారెడ్డి రూ.7,200లకు అడ్డూను సొంతం చేసుకున్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ యేడు వేలం పాట నిర్వహించలేదు. రూ.7,200తో మొదలైన లడ్డూ వేలం ఏటా పెరుగుతూ లక్షల్లోకి చేరింది. ఈసారి ఆ లడ్డూ ఎవరి సొంతం అవుతుందనే ఆసక్తి నెలకొంది. మీరాలం మండిలో 108 ఏళ్లుగా.. నిజాం కాలంలో కూరగాయల విక్రయానికి ప్రధాన కేంద్రంగా కొనసాగిన మీరాలం మండిలో 108 ఏళ్ల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజుల్లో ఇక్కడ గాజుల వెంకయ్య, బోగం మల్లయ్య, ఆవులు దుర్గయ్య, కాట నర్సయ్య తదితరులు వినాయక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు పూజించి గులాబ్చంద్ బాడలోని బావిలో నిమజ్జనం చేసేవారు. 1986 నుంచి గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. -
రూ.9.26 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
-
మరికాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం
-
లడ్డూ వేలం పైనే అందరి దృష్టి