Golconda
-
మానవ సేవే.. మాధవ సేవగా... మహ్మద్ నజీబ్ సేవలు!
మానవ సేవే మాధవ సేవ.. అనే నానుడిని ఒంటబట్టించుకున్నారు.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీబ్. సరిగ్గా అదే తలంపుతో గత 18 ఏళ్లుగా పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ.. నిరుపేదలకు, వలస కూలీలకు సేవలందిస్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ద్వారా పేదల కుటుంబాల్లో తలెత్తే తగాదాలను పరిష్కరిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు వలస కూలీలు, నిరుపేదలకు వైద్య సహాయం, నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మహ్మద్ నజీబ్ షేక్పేట ఫ్రెండ్స్ కాలనీలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం వంద కిలోల బియ్యంతో వంట చేస్తూ లేబర్ అడ్డాలు, ఆస్పత్రుల వద్ద భోజన ప్యాకెట్లు అందించారు. – గోల్కొండ నజీబ్ చిన్ననాటి స్నేహితులతో కలిసి గోల్కొండలోని షేక్ పేటలో నిరంతరాయంగా నిరుపేదలకు సేవలందిస్తున్నాడు మహ్మద్ నజీబ్. స్థానిక ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను గుర్తిస్తూ.. తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. స్థానికులకు, పేదలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా లేబర్ అడ్డాల వద్ద ఒక్కపూట భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాడు. కాలనీలో ప్రత్యేకంగా ఓ వంట శాలను సైతం ఏర్పాటు చేశాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం భోజన ప్యాకెట్లను అందించాడు. పలువురు బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించాడు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సహాయంతో స్థానికులకు వైద్య సేవలను అందించాడు. కుటుంబ కలహాలు చక్కబెడుతూ.. టోలిచౌకీలోని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రధాన కార్యాలయంలో స్థానికుల కుటుంబ తగాదాలు, భార్యా భర్తల కలహాలకు పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 15 యేళ్లగా చిన్న చిన్న తగాదాలతో విడాకులు తీసుకోడానికి తనవద్దకు వచి్చన వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వారి కలహాలకు పరిష్కారం చూపుతున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 350 మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించి, వారిని ఏకం చేస్తున్నాడు. మరోవైపు నిరుపేద విద్యార్థులకు ఆర్గనైజేషన్ ద్వారా తామున్నామంటూ అండగా ఉంటూ ఫీజులకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. చదువు మధ్యలో వదిలేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి యేటా తాము 8 మంది నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని, పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునేలా వారికి అండగా నిలబడుతున్నాడు. ప్రస్తుతం ఆర్గనైజేషన్ కార్యకలాపాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తృతం చేస్తున్నట్లు నజీబ్ తెలిపారు. -
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు. -
గోల్కొండ కోటపై ఘనంగా పంద్రాగష్టు పండుగ (ఫొటోలు)
-
ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం
-
హైదరాబాద్ గోల్కొండలో కారు బీభత్సం
-
గోల్కొండలో దారుణం.. డ్రంక్ & డ్రైవింగ్తో చిన్నారి బలిగొన్న యువకులు
హైదరాబాద్: గోల్కొండలో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో కారు బీభత్సం సృష్టించడంతో..చిన్నారి మృతి చెందింది. రాంగ్ రూట్లో ర్యాష్గా దూసుకొచ్చన కారు బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న చిన్నారి మృతి చెందింది, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి.కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెపుతున్నారు. స్పాట్కు చేరుకున్న గోల్కొండ పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో మద్యం బాటిళ్ళు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గోల్కొండ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
భాగ్యనగరంలో బోనాల సందడి
-
స్విచ్బోర్డ్లో రూ. 15 కోట్ల గోల్కొండ వజ్రం
కోల్కతా: సత్యజిత్ రే దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘జోయ్ బాబా ఫెలూనాథ్’ అనే బెంగాలీ సినిమాలో అత్యంత ఖరీదైన వజ్రం దుర్గామాత అధిష్టించిన సింహం బొమ్మ నోటిలో చాలాకాలం తర్వాత దొరుకుతుంది. మిస్టరీ వీడిపోతుంది. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగింది. ఇక్కడ కరెంటు స్విచ్బోర్డులో రూ.15 కోట్ల విలువైన 32 క్యారెట్ల బరువైన గోల్కొండ వజ్రం దొరికింది. అసలు విషయమేమి టంటే.. ప్రణబ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి వద్ద ఈ వజ్రం ఉండేది. 2002లో దాని నాణ్యత, ధర తెల్సుకునేందుకు ఇంద్రజిత్ తపాదార్ అనే వజ్రాల మధ్యవర్తిని సంప్రదించాడు. 2002 జూన్లో ఇంద్రజిత్ మరొకడిని తీసుకొని ప్రణబ్ ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి ప్రణబ్ను పిస్తోల్తో బెదిరించి వజ్రంతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంద్రజిత్ ఇంట్లో గాలింపు చేపట్టారు. వజ్రం ఆచూకీ దొరకలేదు. మరోవైపు తనకేమీ తెలియదని ఇంద్రజిత్ బుకాయించాడు. వజ్రం కచి్చతంగా అతడి ఇంట్లోనే ఉంటుందున్న నమ్మకంతో పోలీసులు అన్వేషణ కొనసాగించారు. అయినాదొరకలేదు. చిట్టచివరకు చాలా రోజుల తర్వాత అదే ఇంట్లో మెట్ల కింద కరెంటు స్విచ్బోర్డు లోపలున్న చిన్న సొరంగంలో వజ్రం లభ్యమైంది. నిందితుడు ఇంద్రజిత్కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇంకోవైపు వజ్రం యజమాని ప్రణబ్ కుమారేనా కాదా అనే దానిపై న్యాయ వివాదం కొనసాగింది. ఆ వజ్రం అసలు సొంతదారు అతడేనని సిటీ సెషన్స్ కోర్టు గతవారం తీర్పునిచి్చంది. వజ్రం రూపురేఖలు మార్చొద్దని, ఇందుకోసం రూ.2 కోట్ల విలువైన బాండ్ సమర్పించాలని ప్రణబ్ను ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, షాజహాన్ వజ్రాలు సైతం గోల్కొండ ప్రాంతానికి చెందినవే. -
Golconda Bonalu 2023 : గోల్కొండ బోనాలు షురూ (ఫొటోలు)
-
గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునెస్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా–పసిఫిక్ విభాగానికి మన దేశం నుంచి మూడు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. సాంస్కృతిక వారసత్వ కట్టడాల పున రుద్ధరణ (ఏసియా–పసిఫిక్) కింద కుతుబ్షాహీ టూంబ్స్ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’కు ఎంపికయ్యాయి. దోమకొండ కోటను నాటి సంస్థానాధీశుల వారసులు పునరుద్ధరించుకుంటూ వస్తుండగా, మెట్ల బావిని ఆగాఖాన్ ట్రస్ట్ సొంత నిధుల తో పునరుద్ధరించింది. కుతుబ్షాహీల కాలంలో అద్భుత నిర్మాణ కౌశలంతో ఈ బావి రూపుదిద్దుకుంది. ఈ తరహా మెట్లబావులు కాకతీయుల కాలంలో నిర్మించిన దాఖలాలున్నాయి. గోల్కొండ కోటను కూడా తొలుత కాకతీయులే నిర్మించినందున, ఈ బావి కూడా వారి హయాంలోనే రూపుదిద్దు కుని ఉంటుందన్న వాదనా ఉంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలి పూడుకుపోయింది. ఆగాఖాన్ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది. వారెవ్వా.. ముంబై మ్యూజియం.. ఏసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 6 దేశాలకు చెందిన 13 కట్టడాలు పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్, చైనా, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇందులో మన దేశం నుంచి నాలుగు కట్టడాలున్నాయి. పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం ‘అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్’. ఈ కేటగిరీలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఒక్కటే చోటు దక్కించుకోవటం విశేషం. దీని నిర్మాణాన్ని పునరుద్ధరించిన తీరు అత్యద్భుతమని యునెస్కో పురస్కారాల జ్యూరీ అభిప్రాయపడింది. రెండో కేటగిరీ అయిన డిస్టింక్షన్లో మెట్లబావి చోటు దక్కించుకుంది. అలాగే ముంబైలోని బైకులా స్టేషన్ మెరిట్ విభాగంలో చోటు దక్కించుకుంది. ఎంగ్ టెంగ్ ఫాంగ్ చారిటబుల్ ట్రస్టుతో సంయుక్తంగా యునెస్కో ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. 40 ఎకరాల విస్తీర్ణంలో... 40 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో ప్రహరీ, దాని చుట్టూ కందకం.. ఇప్పటికీ దోమకొండ కోట చెక్కు చెదరలేదు. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కోటలో రాతితో మహదేవుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోటలో అద్దాల మేడ ప్రత్యేకం. ప్రముఖ సినీ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగింది. ఆర్కిటెక్ట్ అనురాధ నాయక్ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. గుర్తింపు రావడంపై దోమకొండ సంస్థానం వారసుడు అనిల్ కామినేని, అతని సతీమణి శోభన కామినేని మాట్లాడుతూ.. కోటకు వచ్చిన గుర్తింపు దోమకొండ ప్రజలకేకాక తెలంగాణ ప్రజలందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. -
నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం
గోల్కొండ: నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో కలిసి బోనాల బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇంచార్జ్ టి.జీవన్ సింగ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వివిధ వర్గాల పండుగలు ఒకే రోజు రావడంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లిందని ఆయన అన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఒకరినొకరు అభినందించుకుంటూ స్నేహపూరితమైన వాతావరణంలో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కోట బోనాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, నగర అదనపు కమిషనర్ ఎ.ఆర్. శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గోవింద్ రాజ్, మైత్రి కమిటీ సభ్యులు ఆబెద్, ఇలియాస్ అక్బర్, జంగయ్య తదితరులున్నారు. -
గోల్కొండ కోటలో బోనాల సందడి (ఫొటోలు)
-
‘గోల్కొండ’ నోట్బుక్స్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లేపాక్షి నంది నోట్బుక్స్ అంటే ఒకప్పుడు విద్యార్థుల్లో యమ క్రేజ్. హాస్టళ్లలోని విద్యార్థులకు ఈ నోట్ బుక్స్నే సరఫరా చేసేవారు. బయటివారు కొనుక్కోవాలంటే మాత్రం సూపర్బజార్లకు వెళ్లాల్సిందే. సాధారణ నోట్ బుక్లకంటే పెద్దసైజ్, నాణ్యత ఈ నోట్బుక్స్ సొంతం. వాటి మీద ఆసక్తితో విద్యార్థులు పట్టణాల్లోని సూపర్ బజార్లకు వెళ్లి మరీ కొనుక్కునేవారు. ఇప్పుడు ఆ నోట్బుక్స్ మళ్లీ రాబోతున్నాయి. కాకపోతే లేపాక్షి నంది బ్రాండ్ స్థానంలో ‘గోల్కొండ’ నోట్బుక్స్ పేరుతో వాటిని పరిశ్రమల శాఖ తీసుకొస్తోంది. అన్ని శాఖలకు అందుబాటులోకి... తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్లో భాగంగా ఈ నోట్బుక్స్ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. విద్యాశాఖ పరిధిలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. గోల్కొండ నోట్బుక్లను తీసుకునేలా జిల్లాల్లోని డీఈఓలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖను కోరింది. విద్యార్థులకే కాక... అన్ని శాఖల విభాగాధిపతి కార్యాలయాలు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, కార్పొరేషన్లు, బోర్డు కార్యాలయాల్లోనూ గోల్కొండ స్క్రిబ్లింగ్ ప్యాడ్లు, పేపరు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆయా శాఖల అధికారులకు పరిశ్రమల శాఖ లేఖలు కూడా రాసింది. సైజును బట్టి ధరలు.. సైజులను బట్టి ఈ నోట్బుక్ల ధరలను నిర్ణయించింది. ఏ4 సైజ్, ఏ3 సైజు తదితర తెల్ల కాగితం నాణ్యతను (70 జీఎస్ఎం, 75 జీఎస్ఎం) బట్టి ధరలను ఖరారు చేసింది. 200 పేజీల సింగిల్ రూల్డ్ (వైట్) నోటుబుక్కు సైజును బట్టి రూ.31.30గా, 100 పేజీల నోట్ బుక్ ధరను సైజును బట్టి రూ.10.29గా, రూ.17.77గా నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను గురుకుల విద్యాసంస్థల అధికారులకు పంపించింది. వాటిని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరింది. -
స్వధర్మం, స్వాభిమానం పెంపొందించేందుకే..
హిమాయత్నగర్: దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) భాగంగా హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ కాలేజీలో గోల్కొండ సాహితీ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రజల్లో స్వధర్మ, స్వాభిమాన, స్వరాజ్య భావాలను పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో సమాచార భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్కొండ సాహితీ మహోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ తరహా ఉత్సవాలు ప్రజల్లో ఉత్సాహం నింపుతాయని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. విస్మరణకు గురైన వీరుల యాదిలో.. భారత స్వతంత్ర పోరాటంలో విస్మరణకు గురైన వీరులను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నామని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటిషర్లను ధైర్యంగా ఎదుర్కొన్న వనవాసీ వీరుడు బిర్సా ముండా జయంతిని జాతీయ గిరిజన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్లో కూడా కుమురంభీం, రాంజీ గోండు, అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన వీరుల గాథలను పరిచయం చేసేందుకు గిరిజన మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం రూ.15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాగా, డాక్టర్ రతన్ శార్దా రచించిన స్వరాజ్య సాధనలో ఆర్ఎస్ఎస్, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రచించిన నిజాం రూల్ అన్మాస్క్డ్, డాక్టర్ బి.సారంగపాణి రచించిన ఆంగ్లేయుల ఏలుబడి.. పుస్తకాలను వారు ఆవిష్కరించారు. ఆకట్టుకున్న స్వాగత తోరణం కేశవ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో రెండ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన స్వాగత తోరణం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో భారత స్వంతంత్య్ర సమరయోధుల చిత్రాలు, నిజాం సంకెళ్ల నుంచి తెలంగాణను కాపాడటానికి పాటుపడ్డ కవులు, కళాకారులు, యోధుల చిత్రాలు, వారి సంక్షిప్త జీవిత చరిత్ర ఉన్నాయి. -
బ్యాంక్ ఉద్యోగి: భార్య వేధిస్తోంది.. చనిపోతున్నా..
గోల్కొండ: ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్పేట్కు చెందిన సంతోష్(36) నగరంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 2013లో పాత నగరానికి చెందిన కళ్యాణితో పెళ్లి అయింది. వీరికి అభిరామ్(6) కొడుకు ఉన్నాడు. అభిరామ్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో సంతోష్ను భార్య కళ్యాణి వేధిస్తోంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకున్నాడు. శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్లో ఆ మందును కలిపి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు. సెల్ఫీ వీడియో.. సంతోష్ ఆత్మహత్య చేసుకునే ముందే ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి భార్య కళ్యాణి కారణమని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు మూడుసార్లు తనపై కళ్యాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని, కేసులు, పంచాయితీలతో తనను ఇబ్బంది పెట్టారని రికార్డ్ చేశాడు. కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరినాథ్, కళ్యాణి సోదరుడు గణేష్, బాబాయి భీమ్ హత్యాయత్నం చేశారని ఆరోపించాడు. -
గోల్కొండ నకిలీ నోట్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్
-
ఆంధ్ర గోల్కొండగా పిలిచే ప్రాంతమేదో తెలుసా?
యడ్లపాడు(గుంటూరు): కొండవీడు అంటే రెడ్డిరాజుల సుదీర్ఘ పాలన గుర్తొస్తుంది. కాని శత్రుదుర్భద్యమైన ఈ రాజ్యాన్ని మరెందరో రాజులు, రారాజులు పరిపాలించారు. అందుకే ఇక్కడ గుట్టను తాకినా, ఏ కొండరాయిని కదిలించిన గత చరిత్ర వైభవాలను ఆనావాళ్లుగా చూపించి ఆకట్టుకుంటాయి. గుంటూరు జిల్లా కేంద్రానికి అత్యంత సమీపాన ఉన్న ఈ కొండవీడును పర్యాటక ప్రేమికులు ఆంధ్ర గోల్కొండగా పిలుచుకుంటారు. బాగ్దాద్ నుంచి భారతదేశానికి ఆధ్యాత్మిక పరిమళాలను పంచేందుకు వచ్చిన ఓ మహనీయుని చరిత్ర ఇది. కొండవీడులోని దాదాపీర్ దర్గా దాదాపీర్ అసలు పేరు... ఫిరంగిపురం నుంచి వస్తుండగా గ్రామ ప్రారంభంలో కొండవీడు కొండల పక్కనే కనిపించే దర్గా ఇది. ‘హజ్రత్ సయ్యద్ ఖుదాదే ఫకీర్షా ఔలియా’ అన్నది దర్గా అసలు పేరు. స్థానికులు వాడుకలో పిలుచుకునే పదం ‘దాదాపీర్’ దర్గా. సృష్టికర్త అల్లాహ్ గొప్పతనాన్ని, ఆయన్నూ ఆరాధించే విధానాన్ని చైతన్యం చేయాలని ఆధ్యాత్మిక గురువులకు గురువైన మహబూబ్ సుభాని సంకల్పించారట. దీంతో బాగ్దాద్కు చెందిన బీబీహాజీర దంపతులు సుమారు నాలుగు శతాబ్ధాల క్రితం భారతదేశానికి వచ్చారట. (చదవండి: పోణంగిలో అశ్లీల నృత్యాలు ) చివరి మజీలి కొండవీడు.. తొలుత ఉత్తరభారత్లో ప్రారంభమైన బాబావారి ఆధ్యాత్మిక బోధనలు.. క్రమేణ దక్షిణప్రాంతాలకు విస్తరించాయి. దాదాపీర్ వారి చివరి మజీలిగా కొండవీడును ఎంచుకున్నట్లు ఇక్కడి పెద్దలు చెబుతారు. అనంత కరుణామయుడు అల్లాహ్ ఆజ్ఞలను అందరికీ తెలపడం కోసమే దాదాపీర్ జీవితాన్ని గడిపారు. ఖురాన్లో సందేశాలను పాటిస్తూ అందరిని అదేమార్గంలో నడిపించడంతో ఆయన్నూ దైవదూతగా భావించారు. కొండవీడులోని దాదాపీర్ దర్గా అత్తరు విక్రయాలతో జీవనం.. కొండవీడు పరిపర ప్రాంతాల్లో లభించే పుష్పాలు, మూలికలతో వివిధ రకాల అత్తరు పరిమళాలను దాదాపీర్ దంపతులు తయారు చేసేవారు. దాదాపీర్ వద్ద నిత్యం అత్తరు సువాసనలు గుభాళిస్తాయట. తాము తయారు చేసిన పరిమళాలను సమీప గ్రామాల్లో విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగించారట. కేవలం ఒక్కరూపాయికే అత్తరును ఇచ్చేవారట? ప్రకృతి అంటే బాబావారికి ఎంతో ప్రీతి. ఆయన చివరి మజీలిగా పచ్చగా పరిఢవిల్లే కొండవీడును ఎంచుకున్నరని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. కొండవీడులోని దాదాపీర్ దర్గా దాపరికంతో జరిగే అనర్థాలు.. పవిత్ర ఖురాన్, నమాజ్, దువా, బయాన్ తదితర అంశాల గురించి నిత్యం వివరించడంలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారట. రేపటికి (మరణం తర్వాత) మనిషికి అవసరమైంది పుణ్యమేగాని, సంపాదన కాదని చెప్పెవారట. దాచుకోవడం వల్ల దోచుకోవడం అలవరుతుందని, తద్వార స్వార్ధం, సోమరితనం ఏర్పడతాయని బోధించేవారు. మనిషి ఎక్కువగా సంపాదించుకోవాల్సింది దైవంపై విశ్వాసం మాత్రమే అంటూ వివరించేవారు. శతాబ్ధాల కిందటి మసీదులో నేటికీ నమాజులు... ఈ ప్రాంతంలో ముస్లిం రాజుల కాలం నాటి అతి పురాతన రెండు మసీదులు ఉన్నాయి. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ మసీదుల్లో ఒకటి కొండవీడు కొండలపై ఉండగా, రెండోది కొండ దిగువన కొండవీడు గ్రామంలో ఉంది. అయితే కొండపై ఉన్న మసీదును ముస్లింరాజు నిర్మించారు. అందులో గుప్తనిధుల కోసం దుండగుల మసీదును కొంతభాగం ధ్వంసం చేయగా, కొండకింద దర్గా ప్రాంగణంలో ఉన్న మసీదు నేటికీ చెక్కుచెదరలేదు. ఇప్పటికి దర్గాకు వచ్చిన వారంతా ఆ మసీదులోనే నమాజ్, ఖురాన్ పఠనం చేయడం విశేషం. (చదవండి: ‘అమూల్’ ఒప్పందంతో మీకేంటి నష్టం?) దర్గా ప్రాంగణంలో దాదాపీర్ నిర్మించిన చెక్కుచెదరని మసీదు ముస్లిం రాజు నిర్మించిన దాదాపీర్ దర్గా దాదాపీర్ నిర్మించిన ఆ మసీదును అంతా భారీ కొండబండరాళ్లతో నిర్మితమైంది. ఏనుగులు సైతం మోయలేని ఆ బండరాళ్లను సునాయాసంగా తెచ్చి మసీదు నిర్మాణం చేస్తున్న దాదాపీర్ మహిమను కొండవీడును పాలించే అప్పటి రాజు పఠాన్మథాన్ఖాన్ కళ్లారా చూశాడట. ఎవరి సాయం లేకుండా స్వయంగా ఆయనే మసీదు నిర్మించడాన్ని చూసి ఆనందపరవశుడై నాటి నుంచి ఆయన భక్తునిగా మారిపోయాడు. అంతేకాదు కొన్నాళ్లకు స్వర్గస్తులైన ఆ దంపతుల సమాధులకు 4.5 ఎకరాల విస్తీర్ణంలో దర్గా నిర్మించారు. దర్గా ఉత్సవాలకు నిర్వహణకు మరో 91 ఎకరాల భూమిని వంశీయులకు ఈనాంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది. బక్రీద్ పండుగ నాడు ఉరుసు ఉత్సవాలు.. ప్రతియేటా బక్రీద్ పండుగనాడు ఈ దర్గా ఉరుసు మహోత్సవ వేడుకలను వస్తాయి. నాలుగు శతాబ్ధాల కాలం నుంచి బాబావారి వంశీయులు, గ్రామ ముజావర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి దాదాపీర్ దర్గాను సందర్శిస్తారు. ప్రస్తుతం దాదాపీర్ వంశీయులైన నౌషద్ నేతృత్వంలో ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. (చదవండి: కర్నూల్లో సింగర్ సునీత సందడి) -
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
పంద్రాగస్టు వేడుకులకు సిద్దమైన గోల్కొండ కోట
-
గోల్కొండ కోటలో బోనాల సందడి
-
ముగ్గురు కూతుళ్లను చైన్తో చితకబాదిన తండ్రి
సాక్షి, గోల్కొండ: తన ముగ్గురు కూతుళ్లను ఇనుప చైన్తో రాక్షసంగా కొట్టి గాయపర్చిన ఓ తండ్రి ఉదంతం గోల్కొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి ఆటో డ్రైవర్ ఎజాస్ భార్య గౌసియాతో కలిసి గోల్కొండ ధాన్ కోటలోని సాలె నగర్ కంచెలో ఉంటున్నాడు. వీరికి జైనా (12), ఉస్నా (9), జువేరియా సంతానం. తాగుడుకు బానిసైన ఎజాజ్ నిత్య భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లను హింసించేవాడు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీ రాత్రి ఎజాజ్ఖాన్ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. వెంటనే ఇనుప చైన్ తీసుకుని భార్య గౌసియాను కొట్టడం ప్రారంభించాడు. దెబ్బలు భరించలేని గౌసియా భర్త నుంచి తప్పించుకుని ఇంటి బయటకు వెళ్లింది. దీంతో ఎజాజ్ వెంటనే తన ముగ్గురు కూతుళ్లను విచక్షణారహితంగా కొట్టాడు. కాగా ఉదయం ఇంటికి వచ్చిన గౌసియా పిల్లలు గాయాలతో ఉండటం చూసింది. భర్త ఎజాస్ ఖాన్ ఇంటి నుంచి పారిపోయాడు. గాయపడిన తన పిల్లలతో గౌసియా బేగం గోల్కొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. -
బోనం ఎత్తుదాం.. నేటి నుంచి మహా సంబురం
-
గెస్ట్ హౌస్లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు
సాక్షి, గోల్కొండ: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్ హౌస్పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్హౌస్ వాచ్మెన్తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ అలియాస్ మున్నాభాయ్ షేక్పేట్ ఓయూ కాలనీలో ‘ఎంఎస్పీ గెస్ట్ ఇన్’గెస్ట్ హౌజ్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గెస్ట్హౌజ్ను బాగా ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే బుధవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు గెస్ట్హౌజ్ వాచ్మెన్ జనైనాజెమ్ ఉద్దీన్ మలిక్ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్ పరారీలో ఉన్నాడు. వాచ్మెన్తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్లను రిమాండ్కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. వ్యభిచార ముఠా సభ్యులపై పీడీయాక్ట్ చైతన్యపురి: సులువుగా డబ్బు సంపాదన కోసం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులపై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటిపై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న పోకల లింగయ్యను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం -
హస్త కళాకృతులకు ఇక ప్రపంచ స్థాయి మార్కెటింగ్ ..
హైదరాబాద్: రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ‘ఈ–గోల్కొండ’ వెబ్ పోర్టల్ను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొ న్నారు. తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్లాట్ఫాం ద్వారా సంప్రదాయ హస్త కళా కృతులను కొనుగోలు చేసే వీలుంటుందన్నారు. గురువారం ప్రగతిభవన్లో జరిగిన కార్య క్రమంలో ‘ఈ– గోల్కొండ’ఆన్లైన్ ప్లాట్ఫాంను కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు ఈ–కామర్స్ వెబ్సైట్లతో పోలిస్తే ‘ఈ–గోల్కొండ’పోర్టల్ను మెరుగైన ఫీచర్స్తో రూపొందించినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళా కృతులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘ఈ– గోల్కొండ’ద్వారా అమ్మకానికి పెట్టిన కళాకృతులను పరిశీలించేందుకు త్రీడీ చిత్రాలు అందు బాటులో ఉంటాయని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగదారులకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా వెబ్సైట్ రూపొందించామన్నారు. https://golkondashop.telangana.gov.in లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేయొచ్చని సూచించారు. రాష్ట్రంలో శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న చేనేత కళాకృతుల తయారీని ప్రోత్సహించేందుకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు ద్వారా హస్త కళాకృతులు తయారుచేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్కుమార్, చేనేత శాఖ కార్యదర్శి శైలజ రామయ్య పాల్గొన్నారు. -
మరో కోహీనూర్: మన గోల్కొండ వజ్రం వేలానికి
నిజాం కాలంలో వజ్రాలు రాశులుగా పోసి మార్కెట్లో కూరగాయల మాదిరి అమ్ముకున్నారని చదువుకున్నాం. ఇప్పుడు అలాంటి వజ్రాలు ఎక్కడా కనిపించడం లేదు. ఉన్న కొన్నింటిలో కోహీనూర్ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో ఉండగా.. మరికొన్ని వజ్రాలు విదేశాల్లో ఉన్నాయి. నిజాం వంశస్తులకు సంబంధించిన అరుదైన ఆభరణాలు, వజ్రాలు తదితర విలువైన వస్తువులు భారతదేశం నుంచి చేజారాయి. అలా చేజారిన వాటిలో ఉన్న ఒక వజ్రం ప్రస్తుతం వేలానికి పెట్టారు. గోల్కొండలో లభించిన అపురూపమైన, అరుదైన వజ్రం న్యూయార్క్లోని ఫార్చునా ఆక్షన్ హౌస్లో వేలం వేస్తున్నారు. 3.05 క్యారెట్ల వజ్రం రూ.కోటిన్నరకు విలువ చేస్తుందని అంచనా. వీటితో పాటు కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ నుంచి తవ్విన వజ్రాలు, అనేక విలువైన కళాఖండాలు ఇక్కడ వేలం వేయనున్నారు. గోల్కొండ డైమండ్స్ అని పిలువబడే వజ్రాలు మచ్చలేని విలువైన రాళ్లుగా పేరు పొందాయి. ళ్లను వేలంపాటదారుల కోసం ప్రదర్శిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. అయితే ఆ వజ్రంతో పాటు మిగతా వస్తువులను భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిజాం వారసులు కోరుతున్నారు. ఇప్పటికే విలువైన వస్తువులను కోల్పోయినట్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం వేలానికి వచ్చిన వజ్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంట. నైట్రోజన్ ఉనికి ఉండని వజ్రం అని తెలుస్తోంది. దీంతోపాటు పసుపు రంగులో మెరుస్తుందంట. మన దక్కన్ సాంప్రదాయానికి గర్వంగా చెప్పుకునే వజ్రాలు చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ దాటింది. అనంతరం విదేశాలకు చేరింది. దేశానికి చెందిన అపరూపమైన సంపద విదేశాలకు తరలిపోతోందని రాయల్టీ ఆఫ్ హైదరాబాద్ ఎస్టేట్స్ ప్రతినిధి నవాబ్ షఫాత్ అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండ వైభవాన్ని భావితరాలకు వివరించేందుకే భారతదేశం వేలంలొ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని మనం సొంత చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
2021.. ఓ మువ్వన్నెల పండుగ!
భాగ్యనగరం ఒకప్పుడు.. 30 వేల జనాభాతో కిటకిటలాడింది.. భవిష్యత్తు మీద బెంగతో గోల్కొండను వదిలింది.. అడిగింది లేదనకుండా ఇచ్చే అక్షయపాత్రగా అలరారింది.. చార్మినార్, హుస్సేన్సాగర్ వంటి నిర్మాణాలతో అబ్బురపరిచింది.. ఇప్పుడు.. కోటి జనాభాతో కిక్కిరిసిపోతోంది.. ఆధునిక పరిజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్గా మారుతోంది.. శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పాటుకు ప్రణాళికలు వేసుకుంటోంది.. సరికొత్త హైదరాబాద్గా మారేందుకు అడుగులేస్తోంది.. అలాంటి మన హైదరాబాద్ మహానగరం త్వరలోనే ఓ అద్భుతమైన మైలు రాయిని దాటనుంది. అదేంటంటే.. 2021 నాటికి.. గోల్కొండ రాజధానిగా అవతరించి 525 ఏళ్లు కానుంది. భాగ్యనగరం రూపుదిద్దుకుని 430 ఏళ్లు పూర్తవుతుంది. సికింద్రాబాద్ ఏర్పడి 215 ఏళ్లు అవుతుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఘన చరిత్రను గుర్తు చేసుకునేందుకు, ఈ నగరాన్ని భావితరాలకు చెక్కు చెదరకుండా అందించేందుకు ‘హైదరాబాద్ హెరిటేజ్ ఫెస్ట్’పేరిట హైదరాబాద్ ట్రేల్స్, వసామహ ఆర్కిటెక్ట్, హెరిటేజ్ ఫ్యూచర్స్ వంటి పలు సంస్థలు ముందుకొచ్చాయి. హైదరాబాద్ గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు, ప్రజలకు నగరంపై అవగాహన కలిగించేందుకు ఏడాది పొడవునా పలుకార్యక్రమాలు నిర్వహించనున్నాయి. తొలి అడుగు పడిందక్కడ.. 1496: గోల్కొండ రాజధాని నగరంగా ఏర్పాటుకు తొలి అడుగు.. కాకతీయుల హయాంలో సైనిక పోస్టు, చిన్న గ్రామాల సముదాయంగా ఉన్న గోల్కొండ.. రాజధానిగా ఎదిగేందుకు 1496లో బీజం పడింది. ఈ ప్రాంతంపై దండెత్తి విధ్వంసం సృష్టించిన బహమనీ సామ్రాజ్యం.. సుల్తాన్ కులీని సుబేదారు (గవర్నర్)గా నియమించింది. పర్షియా నుంచి వచ్చిన ఆయన కుతుబ్షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. చూస్తుండగానే గోల్కొండ పట్టణంగా పురోగమించింది. అలా 95 ఏళ్లు కొనసాగింది. సరికొత్త పరిజ్ఞానం గోల్కొండ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు.. నాటి ఆధునికతను వాడుకుంటూ ముందుకు సాగారు. నీటి వనరుల కోసం గురుత్వాకర్షణ శక్తితో అందేలా ఎత్తయిన ప్రాంతంలో దుర్గం చెరువును తవ్వించారు. అక్కడి నుంచి ప్రత్యేక చానెళ్ల ద్వారా నీటిని తరలించి కోటలో నిల్వచేసేందుకు కటోరా హౌస్ను నిర్మించారు. ఆ నీళ్లు కోట భాగానికి చేరేందుకు ఈజిప్షియన్ వాటర్ వీల్ పరిజ్ఞానాన్ని వినియోగించారు. అంటే మనం చూసే జెయింట్ వీల్ తరహాలో ఉండే ఏర్పాటన్న మాట. అది తిరిగే కొద్దీ కింది నీళ్లు పైకి చేరతాయి. అలా రెండు, మూడు యంత్రాలతో పూర్తి పైకి చేరుకుంటాయి. అక్కడ నిల్వ చేసి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా దిగువకు పంపుతారు. అలాగే కింద అలికిడి అయితే పై వరకు వినిపించేలా ధ్వని శాస్త్రం ఆధారంగా ఏర్పాట్లు చేయించారు. ఇక గానా బజానాలు, కుస్తీ పోటీలు, వేడుకలతో నిత్యం కోట కళకళలాడుతుండేది. 1591 భాగ్యనగరానికి పునాది.. ‘చెరువులో చేపల్లాగా ఈ కొత్త నగరం జనంతో నిండిపోవాలి’.. మహ్మద్ కులీ కుతుబ్షా దైవ ప్రార్థన ఇదీ. అప్పటికే గోల్కొండ నగరం దాదాపు 30 వేల జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో నగరాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఆయన పట్టాభిషిక్తుడైన 11 ఏళ్ల తర్వాత.. మూసీకి ఆవల కొత్త నగరానికి శంకుస్థాపన చేశాడు. శత్రువుల భయంతో కోట గోడల మధ్య గోల్కొండ ఉండగా, శత్రువులు లేరన్న ధీమాతో గోడల అవసరం లేకుండా హైదరాబాద్ను నిర్మించాడు. ఇరాన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మొమీన్ ప్రణాళికతో నగరం రూపుదిద్దుకుంది. చూస్తుండగానే నగరం నలుచెరగులా విస్తరించింది. నిజాం(గవర్నర్)గా నియమితుడైన మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్.. అసఫ్జాహీ పాలనకు శ్రీకారం చుట్టాడు. తొలుత ఆయన ఔరంగాబాద్ నుంచే పాలన సాగించారు. కానీ తర్వాత హైదరాబాద్కు మకాం మార్చారు. దీంతో మళ్లీ నగర విస్తరణ పెరిగింది. మలుపు తిప్పిన ఆరో నిజాం ముస్లిమేతరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, పరమత సహనానికి ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ.. హైదరాబాద్ నిర్మాణం విషయంలో అసఫ్జాహీలు ప్రత్యేకత చాటుకున్నారు. హిందూ సంస్కృతిపై దౌర్జన్యాల అప ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ఆధునిక హైదరాబాద్కు బీజం పడింది. అప్పటికే రైల్వే లాంటి అరుదైన ప్రయాణ వసతి భాగ్యనగరాన్ని చేరింది. నూతన హైదరాబాద్ శిల్పిగా ఖ్యాతికెక్కిన ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్కు పిలిపించింది ఆరో నిజామే. అప్పుడే విరుచుకుపడ్డ వరదలు హైదరాబాద్ను అల్లకల్లోలం చేయటంతో మోక్షగుండం వచ్చి అద్భుత డ్రైనేజీ వ్యవస్థ, వరదకు అడ్డుకట్ట పడేలా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నిర్మాణం జరిపిన విషయం తెలిసిందే. ఆరో నిజాం హయాంలో అందుకు ప్రణాళికలు రచించగా.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో అమలైంది. ఇక ప్రపంచ కుబేరుడిగా చరిత్రలో నిలిచిన ఏడో నిజాం.. హైదరాబాద్కు పూర్తి ఆధునిక రూపునిచ్చాడు. భారతదేశంలో భాగంగా ఉండాలన్న కోరిక లేక పాకిస్తాన్కు అనుకూల వైఖరి ప్రదర్శించిన అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ప్రస్తుత హైదరాబాద్లో ఈ మాత్రం వసతులు ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం మాత్రం ఆయనే. 1806 జంట నగరం వెలసిందప్పుడే ప్రపంచ జంటనగరాల జాబితాలో హైదరాబాద్–సికింద్రాబాద్లు ప్రముఖంగా నిలుస్తాయి. దానికి బీజం పడి 215 ఏళ్లు అవుతోంది. మూడో నిజాం హయాంలో సైనిక స్థావరం పేరుతో సికింద్రాబాద్లో ఈస్టిండియా కంపెనీ కాలు మోపింది. అది నిజాంకు మద్దతుగా ఉంటుందనీ నమ్మబలికింది. 5 వేల బ్రిటిష్ సైన్యంతో హుస్సేన్సాగర్కు ఉత్తరాన కంటోన్మెంట్ ఏర్పడింది. క్రమంగా బ్రిటిష్ అధికారులు, సైనిక పటాలాలు, స్థానికుల నివాసాలు పెరగటంతో అక్కడ తమకు ప్రత్యేకంగా నగరం ఏర్పాటుకు స్థలం చూపాలని నాటి బ్రిటిష్ రెసిడెన్సీ థామస్ సైడన్హామ్.. మూడో నిజాం మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్ జాకు లేఖ రాశాడు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఉన్న స్థలాన్ని కేటాయిస్తూ దానికి తన పేర సికింద్రాబాద్ అని నామకరణం చేశాడు. ఈ ప్రాంతానికి దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఉండటంతో శరవేగంగా ఆ ప్రాంతం వ్యాపారపరంగా అభివృద్ధి చెంది జనరల్ బజార్ లాంటివి విస్తరించాయి. విద్యాసంస్థలు, స్పోర్ట్స్ క్లబ్లు, సాధారణ క్లబ్లు, చర్చిలు, తమిళ, కన్నడ, మరాఠీ, పార్సీ వారి విస్తరణ.. కొత్త దేవాలయాలు.. ఒకటేమిటి సికింద్రాబాద్ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ కన్నా ప్రణాళికా బద్ధంగా, విశాలమైన రోడ్లు, ఎక్కడ చూసినా పరిశుభ్రత.. విదేశీ ప్రాంతం తరహాలో పురోగమించింది. కుతుబ్షాహీల హయాంలో నగరానికి పునాది పడినా.. అభివృద్ధి మాత్రం అసఫ్జాహీల కాలంలోనే ఊపందుకుంది. ఇక సికింద్రాబాద్ అభివృద్ధి బ్రిటిష్ వారి పాలనలో జరిగిందని చెప్పుకోవచ్చు. -
స్వాతంత్య్ర దినోత్సవానికి గోల్కొండ కోట ముస్తాబు
-
బోనమెత్తిన భాగ్యనగరి
-
రాతికోటకు బీటలు
సాక్షి, జనగామ: మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపనకు నడుం కట్టిన సర్దార్ సర్వాయి పాపన్న రాతి కోటకు బీటలు పడుతున్నాయి. నాటి గోల్కొండ రాజ్యాన్ని జయించి విజయ కేతనం ఎగురేసిన కోటను ఇప్పుడు పట్టించుకునే నాథుడు లేక కూలిపోయే దశకు చేరుకుంది. టూరిజం స్పాట్గా గుర్తించి నిధులు కేటాయించినా కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న క్రీ.శ 17వ శతాబ్దంలో రాతి కోటను నిర్మించారు. రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై కన్నేసి దండయాత్రకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే క్రీ.శ.1687 లో గోల్కొండను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. ఈ కాలంలో మొఘల్ పాలకులు నియమించిన సుబేదార్ల ఆగడాలతో రాజ్యంలో ఆరాచకం నెలకొంది. ప్రజలు అణచివేతకు గురవుతున్న సమయంలో క్రీ.శ. 1650లో పాపన్న జన్మించారు. గౌడ కులంలో జన్మించిన పాపన్న పశువుల కాపరిగా, తర్వాత కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు. పాలకులు విధానాల కారణంగా పాపన్నలో రాజ్యకాంక్ష పెరిగింది. బలహీన వర్గాలు ఏకమైతేనే రాజ్యా ధికారానికి రావచ్చని సొంతం సైన్యం ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టారు. మొగల్ పాలకులపై తిరుగుబాటును ప్రకటించిన పాపన్న తొలి కోటను ఖిలాషాపూర్లోనే నిర్మించి నట్లుగా చరిత్రకారుల అభిప్రాయం. ఔరంగజేబు మర ణించాక మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను పాపన్న స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, గోల్కొండను వశపర్చుకున్నారు. రాతి కోట నిర్మాణం ఇలా.. ఖిలాషాపూర్లో పాపన్న క్రీ.శ 1675లో రాతి కోటను నిర్మించారు. 20 అడుగుల ఎత్తులో రాతి కోటను నిర్మించారు. ఆ కోటపై నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజును నిర్మించారు. దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించే విధంగా కోటను నిర్మాణం చేశారు. అంతేకాకుండా కోట సొరంగ మార్గాలను సైతం తవ్వించినట్లుగా చరిత్రకారులు, స్థానికులు చెబుతున్నారు. శత్రు దుర్భేధ్యంగా పూర్తిగా రాతితో కోట నిర్మాణం చేశారు. చెదిరిపోతున్న కోట ఆనవాళ్లు.. బహుజన రాజ్య స్థాపకుడిగా గుర్తింపు పొందిన పాపన్న నిర్మించిన రాతి కోట ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. కోట లోపలి భాగం ధ్వంసం అవుతోంది. గోడలు కూలిపోతున్నాయి. 2017 జనవరిలో కోట మరమ్మతు కోసం టూరిజం శాఖ రూ. 3 కోట్లు కేటాయించింది. అయినా పనులు చేపట్టకపోవడంతో కోట అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు టూరిజం శాఖ చైర్మన్ పేర్వారం రాములు సొంత గ్రామంలోనే ఈ కోట ఉండటం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కోట అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హమారా.. హైదరాబాద్
ఐటీలో మేటి.. ఫార్మాలో ప్రపంచ ఖ్యాతి.. వీటన్నింటికీ తోడు ఇప్పుడు మెట్రో సొబగులు.. వెరసి వడివడిగా విశ్వనగరం దిశగా అడుగులు.. ఇది నేటి హైదరాబాద్! మరి వందల ఏళ్ల కిందట నగరం ఎలా ఉండేది? ఈ మహానగర నిర్మాణానికి ప్లానింగ్ ఎలా చేశారు? సిటీలో మొట్టమొదట దేన్ని నిర్మించారు? భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు ఆనాడే ఎలా రూపకల్పన చేశారు? ఈనాడు కాదు.. వీటన్నింటికీ ఐదు వందల ఏళ్ల కిందటే బీజం పడింది. అదే ఇప్పుడు మహా వృక్షమై, మహానగరమై వెలుగుతోంది. శతాబ్దాల నగర నిర్మాణ ప్రస్థానంపై ఈ వారం ఫోకస్.. – ముహ్మద్ మంజూర్ కుతుబ్ షాహీల పాలనలో.. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ సంస్థాన స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా తుర్క్మనిస్తాన్ నుంచి కుటుంబ సమేతంగా భారత్ వచ్చారు. తొలుత ఢిల్లీ వెళ్లిన కులీ కుతుబ్ షా ఆ తర్వాత బీదర్ వచ్చి బహమనీ సంస్థానంలోని సైన్యంలో చేరాడు. ఈ క్రమంలో గోల్కొండ పాలకుడిగా ఉన్న మహమూద్ బహమనీ నమ్మకాన్ని పొందాడు. దీంతో మహమూద్ బహమనీ కులీ కుతుబ్ షాకు గోల్కొండ కోట సుబేదారుగా బాధ్యతలు అప్పగించి గోల్కొండకు పంపాడు. అనంతరం బహమనీల పతనం ప్రారంభం కావడంతో 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ కోటను తన అధీనంలోకి తీసుకుని పరిపాలన ప్రారంభించాడు. 1543లో జంషీద్ చేతిలోనే కులీ కుతుబ్ షా హత్యకు గురయ్యాడు. జంషీద్ కులీ కుతుబ్ షా ఏడేళ్లు.. అతడి కుమారుడు సుభాన్ కులీ కొన్ని నెలలు సంస్థానాన్ని పాలించారు. అయితే సుభాన్ చిన్న వయసు వాడు కావడంతో ప్రజలు, సంస్థాన పాలకుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో విజయనగరంలో ఉన్న సుల్తాన్ కులీ కుతుబ్ షా కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను సంస్థాన బాధ్యతలు స్వీకరించాలని కోరారు. దీంతో 1550లో ఇబ్రహీం కులీ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాడు. కొత్త నగరానికి శ్రీకారం.. ఇబ్రహీం తండ్రి హయాంలో దేవరకొండ సుబేదార్గా విధులు నిర్వహించాడు. అనంతరం విజయనగరం వెళ్లి పరిపాలనా నైపుణ్యంతో పాటు వివిధ సంస్థానాల పాలనను అధ్యయనం చేశాడు. గోల్కొండకు రాజయ్యాక.. కోటతోపాటు సంస్థానంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టాడు. గోల్కొండ కోటలో అప్పటికే జనాభా విపరీతంగా పెరిగింది. కోట లోపల ప్రజల కోసం ఇళ్లు నిర్మించాలన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు. వెయ్యేళ్ల క్రితం అప్పటి అవసరాలకు, జనాభాకు సరిపడేలా మట్టితో గోల్కొండ కోటను కట్టారు. దీంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కోట బయట ఓ కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించాడు. నూతన నగరం ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని సంస్థానం అధికారులకు సూచించాడు. మూసీ దక్షిణ భాగంలోని విశాలమైన ప్రాంతంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఆయనకు నివేదిక ఇచ్చారు. తొలుత మూసీ నదిపై వంతెన నిర్మించాలని అధికారులు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను కోరారు. దీంతో 1578లో మూసీ నదిపై పురానాపూల్ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. నగర మాస్టర్ప్లాన్ రూపకర్త మీర్ మొమిన్ చార్మినార్తో పాటు నూతన నగర నిర్మాణానికి ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ కోసం పలు సంస్థానాలు, దేశాల్లో ఆరా తీశారు. ఇరాన్లోని ఇస్తారాబాద్లో ఉండే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యావేత్త, ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్ను సంప్రదించారు. చార్మినార్తోపాటు నగర నిర్మాణానికి తన సేవలు అందిస్తానని ఆయన ఒప్పుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా గోల్కొండకు వచ్చి మహ్మద్ కులీని కలిశారు. ఆయనలోని ప్రతిభను గుర్తించిన మహ్మద్ కులీ ప్రధానమంత్రిగా నియమించారు. చార్మినార్, నగర నిర్మాణ బా«ధ్యతలు సైతం అప్పగించారు. దీంతో మీర్ మొమిన్ మూడేళ్లు శ్రమించి చార్మినార్ నిర్మాణానికి పలు డిజైన్లు రూపొందించి రాజుకు చూపించాడు. వాటిని పరిశీలించిన రాజు ఎన్నో మార్పులు సూచించారు. అంతే కాదు అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఉండేలా నగరాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో ఇరాక్లో ఉన్న ఇమామ్ అలీ రాజా సమాధి మాదిరిగా నాలుగు మీనార్లు ఉండేలా చార్మినార్, ఇరాన్లోని ఇస్వాహాన్ మాదిరిగా నగరం నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. చార్మినార్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే సుస్థిరంగా ఉంటుందో తెలుసుకునేందుకు పలు భూగర్భ పరీక్షలు చేశారు. మూసీకి దక్షిణాన ఉన్న ప్రాంతాలను తవ్వి అక్కడి నేలనూ పరీక్షించారు. గోల్కొండ నుంచి ముసొలి పట్నం(మచిలీపట్నం) వెళ్లే మార్గంలో తూర్పు నుంచి పడమరకు 90 డిగ్రీల యాంగిల్లో ఉత్తరం దక్షిణాన్ని కలిపేలా చార్మినార్ నిర్మించాలని నిర్ణయించారు. చార్మినార్కు నాలుగు వైపులా వెడల్పైన రోడ్డు ఉండేలా ప్రణాళికలు చేశారు. చార్మినార్కు పడమర వైపు బజార్ ఏర్పాటు చేయాలని, ఉత్తర దిశలో 100 మీటర్ల ముందు చార్సూహౌస్(నేడు గుల్జార్హౌస్) నిర్మించాలని నిర్ణయించారు. దానికి నాలుగు వైపులా కమాన్లు నిర్మించాలని ప్లాన్ వేశారు. ఈ నాలుగు కమాన్ల నుంచి నాలుగు రోడ్లు నాలుగు దిక్కులా నగరంలోకి వెళ్లేలా మార్గాలు వేయాలని, కమాన్ల పడమర వైపు రాజమహల్ నిర్మించాలని, తూర్పు వైపు ప్రజల కోసం ఇళ్లు నిర్మించాలని ప్రణాళిక రచించారు. చార్మినార్ను కేంద్రంగా చేస్తూ నగరం అంతా ఐదు మైళ్లు ఉండేలా నాలుగు వైపులా రోడ్డు ఏర్పాటు చేయాలని, నగర ప్రధాన రోడ్లు 100–120 అడుగులు, అంతర్గత రోడ్లు 50–60 అడుగులు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతి ఇంటి ముందు, వెనుక ఖాళీ ప్రదేశం ఉండేలా ఇళ్ల నిర్మాణం.. నీటి అవసరాలకు బావి ఉండాలని ప్రణాళిక వేశారు. తొలి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ గోల్కొండ కోటకు దుర్గం చెరువు నుంచి నీటి సరఫరా వ్యవస్థ ఉంది. చార్మినార్పై ఓ పెద్ద హౌస్ ఉండేది. జల్పల్లి చెరువు నుంచి భూగర్భ పైప్లైన్ ద్వారా టొపోగ్రఫీ పద్ధతిలో చార్మినార్పై ఉన్న హౌస్లో నీళ్లు వచ్చేవి. చార్మినార్ పైకి వెళ్లే వారికి అక్కడ నీటి అవసరాల కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నేటికీ చార్మినార్ పైన చూస్తే నాటి పైప్లైన్ల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇక ప్రతి ఇంట్లో బావులు ఉండేవి. నగర ప్రజలందరు బావి నీరే తాగే వారు. ఆ రోజుల్లో ధనవంతులు పుణ్యకార్యంగా భావించి ప్రజల సౌకర్యార్థం బావులు తవ్వించే వారు. బావులు లేని ప్రజలు వీటిని ఉపయోగించే వారు. నీటి సమస్య ఉంటే ఆ ప్రదేశాల్లో ప్రభుత్వమే బావులు తవ్వించింది. నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాటసారుల సౌకర్యార్థం కార్వన్ సరాయితో పాటు మసీదులు, దేవాలయాల్లో విశ్రాంతి గదులు నిర్మించారు. మూసీ పక్కనే ఎందుకు.. మూసీ నది పక్కనే నగరం నిర్మించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. నది ఓడ్డున ఎత్తైన, గట్టి భూమి ఉండటం ఒక కారణమైతే.. నగరంలో భూగర్భ నీటి మట్టం ఎక్కువగా ఉండాలని భావించడం మరో కారణం. నగర ప్రజలు ఇళ్లలో బావులు తవ్వితే తక్కువ లోతులోనే నీళ్లు అందుబాటులోకి రావాలని, మట్టం తక్కువగా ఉండాలని మూసీ పక్కనే నగర నిర్మాణానికి ప్రణాళిక వేశారు. అలాగే నది పక్కన ఉంటే కాలుష్య రహితంగా నగర వాతావరణం ఉంటుందని ఈ దిశగా నగర నిర్మాణం చేపట్టారు. నాటి గొల్లకొండే..నేటి గోల్కొండ.. గోల్కొండ కోట చరిత్ర వెయ్యేళ్ల కంటే ఎక్కువే. ఈ కోట నుంచే కాకతీయుల పాలన సాగింది. అనంతరం తుగ్లక్ వంశం ఢిల్లీ నుంచి పాలించింది. ఆ తర్వాత బహమనీ సుల్తాన్ పరిపాలనలోకి వచ్చింది. కాకతీయుల కాలం నుంచి ఈ కోట మట్టి కోటగానే ఉంది. మొదట్లో ఈ కోటను గొల్లకొండ అనే వారు. ఎందుకంటే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా.. సారవంతమైన నేలతో ఎటుచూసినా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండేది. ఈ ప్రదేశంలో ఎక్కువగా గొల్లవారు నివసించేవారు. కోట చుట్టూ ఉన్న ప్రాంతంలో కాపరులు పశువులను మేత కోసం ఇక్కడికే తీసుకొచ్చేవారు. దీంతో గొల్లకొండగా పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్తా గోల్కొండగా మారింది. నగర ఏర్పాటు నుంచే మురికి నీటికి భూగర్భ వ్యవస్థ ఇరాన్లోని ఇస్వాహాన్ నమూనాలో నగర ఏర్పాటుకు ప్రణాళికలు వేశారు. అక్కడి మాదిరే నగరంలో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటి కోసం అంతర్గత మోరీలు నిర్మించారు. నగరంలోని మట్టి రోడ్లపై దుమ్మూధూళీ రేగకుండా రోజుకు ఒకసారి నీళ్లు చల్లాలని.. రాజమహల్ నుంచి వచ్చే నీరు భూఅంతర్భాగం నుంచి వెళ్లేలా మట్టి పైపులు అమర్చాలని ప్లాన్ చేశారు. పాలకులు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులకు మాత్రమే రెండు, మూడు అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులు ఉండేవి. నగర ప్రజల అవసరాల కోసం మూసీ నది ఓడ్డున విశాలమైన ప్రదేశంలో దారుషిఫా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేశారు. మసీదులు, దేవాలయాల్లో విద్యాబోధన, ప్రతి వీధిలో మలుపు వద్ద ఎత్తయిన స్తంభాలు ఏర్పాటు చేసి వాటిపై రాత్రి పూట కాగడాలు అమర్చాలని నిర్ణయించారు. నగర ఐదు మైళ్ల సరిహద్దులో దాదాపు 1,200 మహళ్లు, 14,000 ఇళ్లు, దుకాణాలు నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆ రోజుల్లో వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇప్పటికీ నగర రోడ్లు, వీధులు ఉండటం గమనార్హం. నగర నిర్మాణానికి ముందే 5 వేల మొక్కలు మీర్ మొమిన్ నగర ప్లాన్లో భాగంగా ఏ ప్రదేశాల్లోనైతే రోడ్లు, విశాలమైన ప్రదేశాలు ఉంచాలని నిర్ణయించారో ఆ ప్రదేశాలతో పాటు చార్మినార్, గుల్జార్ హౌస్ నుంచి నాలుగు వైపులా వెళ్లే అన్ని మార్గాల ఇరు పక్కలా చెట్లు నాటారు. మహల్, భవనాల ముందు వెనుక, ఇళ్ల ముందు వెనుక, ప్రతి మసీదు, దేవాలయం, సరాయి లోపలా బయటా చెట్లు నాటారు. నగరంలో సారవంతమైన(మొక్కలు ఎదగడానికి దోహదపడే) భూమిని ఎంపిక చేసి అందులో ప్రజల అవసరాల కోసం ఐదు వేల ఔషధ మొక్కలను పెంచారు. మూసీ ఒడ్డున పచ్చదనం కోసం పెద్ద పెద్ద చెట్ల మొక్కలను నాటారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరు పక్కలా నిడనిచ్చే పెద్ద చెట్ల మొక్కలను నాటారు. దీంతో నగరం ఏర్పాటుతోనే గ్రీన్ సిటీగా పిలిచేవారు. నగరంలో ఆ రోజుల్లో దాదాపు 10 వరకు పార్కులు ఉండేవి. తొలి మాస్టర్ ప్లాన్.. పురానాపూల్ పురానాపూల్ వంతెన పురానాపూల్ వంతెన నిర్మాణాన్ని హైదరాబాద్ ఏర్పాటులో తొలి మాస్టర్ ప్లాన్గా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే పురానాపూల్ నిర్మాణంతోనే గోల్కొండ కోట నుంచి మూసీ నది దాటి వేరే ప్రదేశానికి వచ్చే మార్గం ఏర్పాటైంది. పారిస్లోని సైనీ నది మీద నిర్మించిన పాంట్ మేరీ వంతెన మాదిరిగా పరిజ్ఞానాన్ని ఉపయోగించి పురానాపూల్ వంతెనను ఆర్చ్లతో నిర్మించారు. పురానాపూల్ నిర్మాణం అనంతరం కోట నుంచి పలువురు సంస్థాన ఉన్నతాధికారులు తమ నివాసాలను మూసీ దక్షిణ భాగంలో కొత్త నగర నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతానికి మార్చారు. రాజు అనుమతి తీసుకుని మూడు, నాలుగు భవంతులను ఆ ప్రాంతంలో నిర్మించారు. 1580లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరణించాడు. అనంతరం ఆయన కుమారుడు మహ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సంస్థాన పాలకుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే అప్పటికి గోల్కొండ కోట జనంతో ఇరుకైపోయింది. జనాభా విపరీతంగా పెరగడంతో రోగాలు విజృంభించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తండ్రి కోరిక మేరకు మూసీ దక్షిణాన నగరం నిర్మించాలని మహ్మద్ కులీ అధికారులను ఆదేశించాడు. చార్మినార్కు పడమర వైపు రాజమహళ్లు నగరాభివృద్ధికి ముందు చార్మినార్ ప్రాంతం చార్మినార్ ముందు గుల్జార్హౌస్కు పడమర వైపు రాజుతో పాటు సంస్థాన ఉన్నతాధికారుల కోసం దాద్ మహల్, కుదాదాద్ మహల్, సాజన్ మహల్, లాఖా మహల్, నాది మహల్ ఇలా రాజమహళ్లు నిర్మించారు. కుదాదాద్ మహల్ ఏడు అంతస్తులతో నిర్మించారు. ఆ రోజుల్లో అదే అతి ఎౖతయిన మహల్. మీర్ మొమిన్ ఇరాన్ దేశస్తుడు. ఆ రోజుల్లో ఇరాన్ ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా చలామణి అయింది. అక్కడి భవన నిర్మాణ శైలి ఆ రోజుల్లోనే అధునాతన శైలి. అందువల్ల హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని మహళ్లు, భవనాలు, మసీదులు ఇరాన్ స్టైల్లో నిర్మించారు. తొలి పర్యాటక ప్రదేశం చార్మినార్ నుంచి దక్షిణం వైపు వెళ్లే మార్గంలో 4 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన కొండ కొహెతూర్ ఉంది. ప్రకృతి సిద్ధంగా ఈ కొండపై రెండు విశాలమైన సారవంతమైన చబుత్రా మాదిరి ప్రదేశాలు ఉండేవి. ఇక్కడ మొక్కలు, చెట్లను నాటడంతో ఈ కొండ మొత్తం ఒక ఉద్యాన వనంగా మారింది. ఆ కొండే ఇప్పటి ఫలక్నుమా ప్యాలెస్. ఈ కొండపైకి రాజుతోపాటు ఉన్నతాధికారులు వెళ్లేవారు. గోల్కొండ కోట నుంచి ఈ కొండ నుంచి నగరం అంతా ఏరియల్ వ్యూ మాదిరిగా కనిపించేది. ఇప్పటికీ అదే మాస్టర్ ప్లాన్.. 1887లో హైదరాబాద్ విస్తీర్ణం, 1959లో హైదరాబాద్ విస్తీర్ణం నగర ఏర్పాటు సమయంలో చేసిన మాస్టర్ప్లాన్ ప్రకారమే ప్రధాన రోడ్లు, వీధులతో పాటు భవన నిర్మాణ శైలి ఉండేది. కుతుబ్ షాహీల పాలనతో పాటు ఆసిఫ్ జాహీ పాలనా కాలం రెండో నిజాం పాలనా కాలం వరకు అదే కొనసాగింది. కుతుబ్ షాహీలు ఏర్పాటు చేసిన నగర పరిధిని 5 మైళ్ల నుంచి 10 మైళ్ల వరకు రెండో నిజాం అలీఖాన్ హయాంలో పెంచారు. నగరం చుట్టూ 12 దర్వాజాలు(తలుపులు), 12 కిటికీలు ఏర్పాటు చేశారు. మళ్లీ నగర మాస్టర్ ప్లాన్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో ప్రారంభమైంది. కానీ ఆయన కొద్ది రోజుల్లోనే మరణించారు. అనంతరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్అలీఖాన్ హయాంలో హైదరాబాద్ నగర పునర్ నిర్మాణం జరిగింది. ఇలా నగర ఏర్పాటు సమయంలో సిద్ధం చేసిన మాస్టర్ప్లాన్ ఏడో నిజాం హయాం వరకు కొనసాగింది. -
గోల్కొండ ఖిల్లా దగ్గర గోల్ఫ్ సందడి
-
బోనమెత్తిన గోల్కొండ
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తొట్టెల - వేలాదిగా తరలివచ్చిన భక్తులు సాక్షి, హైదరాబాద్: పోతురాజు విన్యాసాలు, సంప్రదాయ నృత్యాలు, శివసత్తుల ప్రదర్శన.. డప్పు వాయిద్యాలు.. కోలాటాలు.. భక్తజనం సమర్పించిన బోనాలతో గోల్కొండ బోనమెత్తింది. హైదరాబాద్ నగరా నికి తలమానికమైన గోల్కొండలో ఆషాఢ జాతరగా పిలిచే తొలి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. లంగర్హౌజ్ నుంచి గోల్కొండ వరకు ఆధ్యా త్మిక వాతావరణం వెల్లి విరిసింది. భక్తజనం వెంట రాగా జగదంబిక మహంకాళి అమ్మవారి రథం లంగర్హౌజ్ నుంచి ముందుకు కదిలి, సాయంత్రానికి గోల్కొండ కోటపైన ఉన్న జగదంబికా అమ్మ వారి ఆల యం వద్దకు చేరింది. వేలాది భక్తులు అమ్మవారి కి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. బోనాలు ప్రారంభమయ్యాయిలా... ఈ బోనాల సందర్భంగా తొలిపూజను చోటా బజార్లోని ప్రధాన అర్చకుడు అనంతాచారి ఇంట్లో నిర్వహించారు. అనంతరం వేదపండి తులు రామాకాంత్ వైద్యుల ఇంట్లో వేదశాస్త్రం ప్రకారం పీఠపూజ చేశారు. ఉదయం 11 గంట లకు లంగర్హౌస్ గాంధీ విగ్రహం నుంచి ప్రా రంభమైన ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుంది. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, సాకపోసి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తొట్టెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీ చార్మినార్ నుంచి ప్యారసాని శ్రీనివాస్ ప్రత్యేకంగా 25 అడుగుల ఎత్తున తయారు చేసిన తొట్టెల భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఊరేగింపులో ప్రత్యేక అలంకరణతో తయారు చేసిన హంసవాహనం వేలాదిమంది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. -
గోల్కొండలో ‘షో’ చూపిస్తున్నారు!
‘సౌండ్ అండ్ లైట్ షో’లో చుక్కలు చూపిస్తున్న సిబ్బంది - నష్టాల పేరుతో ఎగ్జిక్యూటివ్ టికెట్లను అంటగడుతున్న వైనం - రూ.80 టికెట్ ఇచ్చేందుకు నిరాకరణ.. రూ.140 టికెట్ కొనాలని ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బెంగళూరు వరుణ్ కుటుంబం సోమ వారం రాత్రి గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షోకు వెళ్లింది. సాధారణ కేటగిరీ రూ.80 టికెట్ కావాలని కౌంటర్లో అడగ్గా, ఎగ్జిక్యూ టివ్ కేటగిరీ రూ.140 టికెట్ కొంటేనే అనుమ తిస్తామని సిబ్బంది తెలిపారు. రూ.60 చిన్న పిల్లల టికెట్నూ రూ.140కి కొనాల్సిందే నని తేల్చి చెప్పారు. అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేక షో చూడకుండానే వారు వెనుదిరిగారు. కొన్ని రోజులుగా సౌండ్ అండ్ లైట్ షోలో జరుగుతున్న తంతు ఇది. దేశంలోనే టాప్ షోగా పేరున్న గోల్కొండ సౌండ్ అండ్ లైట్ షో కీర్తి మసకబారే వ్యవహారమిది. పర్యాటక శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోల్కొండకు వచ్చే పర్యాటకులు విస్తుపోయేలా చేస్తున్నారు. గోల్కోండలో రెండు సౌండ్ అండ్ లైట్ షోలు నిర్వహిస్తుండగా నిర్వహణ సరిగా లేక ప్రదర్శనకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. రెండో ప్రదర్శనకు ప్రేక్షకులు మరీ తక్కువగా ఉంటుండటంతో నిర్వహణ ఖర్చులకు సరిపోవటం లేదంటూ రెండో తరగతి టికెట్లు అమ్మకుండా, ఎగ్జిక్యూటివ్ టికెట్లే కొనాలంటూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. సోమవారం బెంగళూరు నుంచి వచ్చిన సందర్శకులు సిబ్బందిని నిలదీస్తే ‘ఫిర్యాదు చేసుకోండి’ అంటూ దురుసుగా వ్యవహరించారు. సమస్య ఇది.. దేశంలో ప్రస్తుతం 7 చోట్ల సౌండ్ అండ్ లైట్ షోలున్నాయి. వీటిలో తొలుత ఎర్రకోట షో మొదలైనా, రెండో విడతలో అండమాన్ జైలు, మదురై ప్యాలెస్, కోల్కతా విక్టోరియా మెమోరియల్తో కలిపి 1993లో మొదలైన గోల్కొండ షో టాప్గా నిలిచింది. 450 అడుగుల ఎత్తున్న కోటను రంగురంగుల 720 లైట్లతో అద్భుతంగా చూపటంతోపాటు గంటపాటు కొనసాగడం దీని ప్రత్యేకత. నగర సందర్శనకు వచ్చే పర్యాటకులు ప్రత్యేకంగా ఈ షో కోసం క్యూ కడుతుంటారు. కానీ ప్రస్తుతం ఆ లైట్లు, సౌండ్ సిస్టం పాతపడిపోవటంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కొత్త సిబ్బందిని నియమించటంతో వారికి సరైన నైపుణ్యం, అవగాహన లేక సమస్యలు పెరిగాయన్న ఫిర్యాదులున్నాయి. ఇక నిత్యం రాత్రి 7 గంటలకు ఆంగ్లంలో వివరిస్తూ సాగే తొలి షో ఉంటుంది. 8 గంటలకు మొదలయ్యే రెండో ప్రదర్శనలో... వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో తెలుగులో, మిగతా రోజుల్లో హిందీలో షో ఉంటుంది. మొదటి ప్రదర్శనకు సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉన్నా రెండో ప్రదర్శన(ముఖ్యంగా తెలుగు) కు జనం తగ్గిపోయారు. సాధారణంగా ఒక ప్రదర్శనకు రూ.2,800 విద్యుత్ ఖర్చవుతుండగా అందులో సగం వసూళ్లు ఉంటేనే షో నిర్వహించే పద్ధతి ఉంది. ఇటీవల సందర్శకుల సంఖ్య తగ్గటంతో అంతమొత్తం వసూలు కాక షో నిర్వహణ డోలాయమానంలో పడింది. దీంతో వచ్చే అరకొర సందర్శకులను కచ్చితంగా రూ.140 ఉండే ఎగ్జిక్యూటివ్ టికెట్లే కొనాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. చిన్నపిల్లకు రూ.110 వసూలు చేయాల్సి ఉండగా వారికీ ఫుల్ టికెట్ విక్రయిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పర్యాటకులు వస్తే షో లేదని పంపేస్తున్నారు. ఒకేసారి 15 మంది వస్తేనే షో ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. కొసమెరుపు: కనీస నిర్వహణ ఖర్చులకు సరిపడా డబ్బులు రాకుంటే ఎగ్జిక్యూటివ్ టికెట్ కొనాల్సిందేనని పర్యాటక శాఖ వెబ్సైట్లో ఎక్కడా కనిపించదు. అప్పటికప్పుడు సిబ్బంది చెప్పి హడలగొడుతున్నారు. రూ.18 లక్షల నష్టం..? సౌండ్ అండ్ లైట్ షోకు సంవత్సరానికి రూ.కోటి పైనే ఆదాయం ఉంటుంది. ఏటా రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య పెరుగుతూ ఉంటుం ది. అయితే 2015–16లో రూ.1.32 కోట్లు వసూలవగా 2016–17లో రూ.1.26 కోట్లే వసూలైంది. పెరగాల్సిన రూ.12 లక్షల ఆదాయం సమకూరకపోగా రూ.6 లక్షల నికర నష్టం వచ్చింది. వెరసి రూ.18 లక్షల మేర నష్టం వాటిల్లింది. దీంతో నష్టం నుంచి బయటపడేందుకు రూ.140 టికెట్లను అంటగట్టి సందర్శ కుల జేబుకు చిల్లు పెడుతున్నారు. -
గోల్కొండ పోస్టాఫీసులో సిబిఐ సోదాలు
-
జయహో గోల్కొండ
గోల్కొండ: అపురూప కూచిపూడి నృత్యంతో గోల్కొండ కోట పులకించింది. తన నృత్యాభినయంతో కోట చరిత్ర, తెలంగాణలోని చారిత్ర ప్రదేశాలను దీపికారెడ్డి బృందం అద్భుతంగా ఆవిష్కరించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో దీపికారెడ్డి తన 25 మంది శిష్యులతో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలుత జయహో గోల్కొండ నృత్య రూపకంలో కోట చరిత్ర, కుతుబ్షాహీల వైభవాన్ని కళ్లకు కట్టారు. తెలంగాణ వైభవంలో ఇక్కడి చారిత్రక కట్టడాల కథనాన్ని నృత్యంలో చూపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారని ఫిక్కి హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు పద్మరాజగోపాల్ అన్నారు. -
కోటలో వేడుక
-
కుతుబ్షాహీలు
గోల్కొండ కేంద్రంగా క్రీ.శ.1518 నుంచి క్రీ.శ.1687 వరకు పాలించిన కుతుబ్షాహీలు విశిష్ట సాంస్కృతిక సేవలు అందించారు. పారశీకులైనాతెలుగు వారి సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, వాస్తు నిర్మాణాల్లో వీరి కాలం నాటి సాంస్కృతిక వికాసం ప్రతిబింబిస్తుంది. కుతుబ్షాహీ (గోల్కొండ) రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్షా క్రీ.శ.1518 నుంచి క్రీ.శ. 1543 వరకు పాలించాడు. తెలుగు సర్దార్ల సాయంతో ఆంధ్ర దేశాన్ని సమైక్యం చేశాడు. వీరి రాజభాష పారశీకం అయినా గోల్కొండలో ఉర్దూ భాష ఆదరణకు నోచుకుంది. అరబ్బీ, టర్కీ, పారశీక, హిందీ భాషా పదాల సమ్మేళనమే ఉర్దూగా ప్రసిద్ధి పొందింది. ఉత్తర భారతదేశంలోని సైనిక శిబిరాల్లో ఉర్దూను అధికార భాషగా ఉపయోగించారు. తర్వాత గోల్కొండలో దక్కనీ భాషగా ప్రసిద్ధి చెందింది. ఉర్దూ సాహిత్యానికి పితామహుడిగా ఇబ్రహీం కుతుబ్షా కీర్తి పొందాడు. అతడిని ‘ఛాజర్ ఆఫ్ ఉర్దూ’గా పేర్కొంటారు. సుల్తానులు తాము రాయించిన ‘సనడులు’ పారశీక భాషలో ఉన్నా, వాటిని తెలుగులోకి అనువదింపజేశారు. తెలుగు మండలాల్లో తెలుగులోనే రాజ్య వ్యవహారాలు నిర్వహించేవారని ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచయిత సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. సుల్తాన్ కులీ కుతుబ్షా కాలంలో కవులు, పండితులకు మాన్యాలు దానం చేసే సంప్రదాయం ప్రారంభమైంది. ఇతడి కాలంలో శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానం తెలుగులో రచించి కోర్కొల జాగీర్దార్ ఈడూరు ఎల్లయ్యకు అంకితమిచ్చాడు. కుతుబ్షాహీల ఆస్థానానికి పర్షియా, మధ్యాసియా ప్రాంతాల నుంచి కవి పండితులు వచ్చేవారు. కుతుబ్షాహీ వంశంలో మూడో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్షా గోల్కొండను క్రీ.శ.1550 నుంచి క్రీ.శ.1580 వరకు పాలించాడు. ఇతడి కాలంలో తెలుగు ఒక వెలుగు వెలిగింది. ఇతడు తెలుగు కవులు, పండితులను పోషించి, వారు అంకితమిచ్చిన తెలుగు కృతులను స్వీకరించాడు. తెలుగు కవుల సాహిత్యంలో ఇబ్రహీం కుతుబ్షా ‘ఇభరాముడు’ అయ్యాడు. ప్రభువు ముస్లిం అయినా అతడిని హైందవ దేవతలు రక్షింతురు గాక అని కవులు దీవించినట్లు ప్రముఖ రచయిత ఆరుద్ర పేర్కొన్నాడు. ఇబ్రహీం కుతుబ్షా కాలంలో అద్దంకి గంగాధరుడు ఆస్థాన కవిగా నియమితుడయ్యాడు. ఇతడు తపతీ సంవరణోపాఖ్యానం అనే కావ్యం రచించి ఇబ్రహీంకు అంకితమిచ్చాడు. మహ్మదీయ సుల్తానులకు కావ్యాలను అంకితమిచ్చిన మొదటివాడు గంగాధరుడని ప్రతీతి. కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అనే శృంగార కావ్యాన్ని తెలుగులో రాశాడు. ఇతనిది నెల్లూరు జిల్లాలోని కందుకూరు గ్రామ మని తెలుస్తోంది. కందుకూరి సోమేశ్వర స్వామి కి ఈ కావ్యాన్ని అంకితమిచ్చాడు. రుద్రకవి రచించిన ‘సుగ్రీవ విజయం’ తెలుగులో మొట్టమొదటి యక్షగాన నాటకమని సాహిత్యకారులు భావిస్తారు. దీన్ని కరుణభాసుర యక్షగాన ప్రబంధం అని కవి పేర్కొన్నాడు. ఈ గ్రంథాన్ని ‘కందుకూరి జనార్దన స్వామికి’ అంకితమిచ్చాడు. రుద్రకవి మరో రచన ‘జనార్దనాష్టకం’. జనార్దనుడిపై దేశవాళీ భాషలో అష్టకం రచించిన మొదటి కవిగా రుద్రకవిని సాహిత్యకారులు గుర్తించారు. ఇతడి భాషా సేవలకు మెచ్చి ఇబ్రహీం కుతుబ్షా ఇతనికి చింతపాలెం అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఇబ్రహీం కుతుబ్షా కాలంలో మరింగంటి సింగనాచార్యుడు ‘దశరథరాజ నందన చరిత్ర’, ‘శుద్ధాంధ్ర నిరోష్ట్య సీతా కల్యాణం’ అనే రెండు కావ్యాలు తెలుగులో రచించాడు.‘రాజనీతి రత్నాకరం’ పేరుతో వైష్ణవ ప్రబంధంగా ‘పంచతంత్రాన్ని’ రచించిన కృష్ణయామాత్యుడు ఈ కాలం నాటి వాడే. ఇబ్రహీం కుతుబ్షా కాలం నాటి మరో ప్రముఖ కవి పొన్నెగంటి తెలగనార్యుడు. తెలుగులో తొలి వ్యాకరణం ‘ఆంధ్ర భాషా భూషణం’ గ్రంథాన్ని మూలఘటక కేతన రచించాడు. అదే ఒరవడితో తెలగనార్యుడు అచ్చ తెలుగు కావ్యంగా ‘యయాతి చరిత్ర’ రాశాడు. ఈ కావ్యాన్ని గోల్కొండ ప్రాంత తరఫ్దారు (గవర్నర్) అమీన్ఖాన్కు అంకితమిచ్చాడు. అమీన్ఖాన్ పఠాన్చెరు ప్రాంతానికి చెందినవాడు. ఇతడు సాహిత్య పోషకుడు. కుతుబ్షాహీ వంశంలో ఐదో సుల్తాన్గా పేరుగాంచిన మహ్మద్ కులీకుతుబ్షా క్రీ.శ 1580 నుంచి క్రీ.శ.1612 వరకు గోల్కొండను పాలించాడు. ఇతడే హైదరాబాద్ నిర్మాత. హైదరాబాద్లో క్రీ.శ.1591లో చార్మినార్ను, తన ప్రేయసి భాగమతి పేరుతో భాగ్యనగరం నిర్మించాడు. ఇతడి కాలంలో గోల్కొండ కరణంగా పనిచేసిన సారంగు తమ్మయ వైజయంతీ విలాసం అనే శృంగార రస కావ్యాన్ని రచించాడు. దీన్ని తన కులదైవం శ్రీరాముడికి అంకితమిచ్చాడు. ‘హరిభక్త శుభోదయం’ అనే 20 అధ్యాయాల గ్రంథానికి సంస్కృత భాషలో సారంగు తమ్మయ వ్యాఖ్యానం రాశాడు. దానికి ‘భక్తి సంజీవని’ అని పేరు పెట్టాడు. తాను భాగ్యనగర పట్టణానికి మంత్రినని చెప్పుకొన్నాడు. ఇబ్రహీం కులీ కుతుబ్షా పర్షియన్ భాషలో మొదటిసారిగా ‘గజల్స్’ ప్రవేశపెడితే, మహ్మద్ కులీ కుతుబ్షా ఉర్దూలో ‘కులియత్’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో హిందువుల పండగలన్నింటినీ వర్ణించాడు. ఇతని కలం పేరు ‘మానిని’. పారశీక గజల్స్తోపాటు, ఆశు కవిత్వం అయిన ‘ప్రాయిరీలు’ వీరి కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. కుతుబ్షాహీ వంశంలో ఆరో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా. ఇతడి కాలంలో ప్రసిద్ధ శృంగార పదకర్త క్షేత్రయ్య గోల్కొండను సందర్శించాడు. సుల్తాన్పై ‘వేయి పదాలు’ కవిత్వం చెప్పాడు. క్షేత్రయ్య పదాలనే మొవ్వ గోపాల శృంగార పదాలంటారు. క్షేత్రయ్యది కృష్ణాజిల్లా మొవ్వ గ్రామం. మొవ్వలోని గోపాలకృష్ణుడిపై చెప్పిన కవితలు మొవ్వ గోపాల పదాలుగా ప్రసిద్ధి చెందాయి. తిరుపతి, కంచి, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను దర్శించడంతో అతడికి క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇతడి అసలు పేరు వరదయ్య. కుతుబ్షాహీ వంశంలో ఏడోవాడైన అబుల్ హసన్ తానీషా క్రీ.శ.1672-క్రీ.శ.1687 వరకు పాలించాడు. క్రీ.శ.1687లో గోల్కొండను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జయించి, తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. తానీషా కాలంలో భద్రాచలం తహశీల్దార్ కంచర్ల గోపన్న (రామదాసు) భద్రాద్రి రాముడిపై భక్తి కీర్తనలు రచించి భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. భక్త రామదాసు) ‘దాశరథీ శతకం’ రచించాడు. ప్రజాకవిగా పేరుగాంచిన ‘యోగి వేమన’ వీరి కాలానికే చెందినవాడే. అబుల్ హసన్ తానీషా కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి నాట్య కళాకారులకు(భామాకలాపం) అగ్రహారంగా దానం చేశాడు. దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి లఘుచిత్రాలు.. దక్కనీ లఘు చిత్రాలుగా చిత్రించారు. షాషాద్ షాహీ దక్కన్ అనే గ్రంథం 15 లఘు చిత్రాలతో కూడుకొని ఉంది. వాస్తుపరంగా విశిష్టమైన ‘కుతుబ్ షాహీ శైలి’ వెలుగులోకి వచ్చింది. ఈ శైలి బహమనీ సుల్తానుల నుంచి ఆవిర్భవించింది. పెద్ద పెద్ద గుమ్మటాలు, విశాల ప్రవేశ ద్వారాలు, ఎత్తయిన మీనార్లు, కోణాకృతి నిర్మాణాలు కట్టడాల్లో కనిపిస్తాయి. మహ్మద్ కులీ కుతుబ్షా భాగ్యనగరం, చార్మినార్ కట్టించాడు. ఇబ్రహీం కుతుబ్షా హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంబాగ్లు నిర్మించాడు. భాగ్యనగరంలో చార్మినార్, మక్కామసీదు, కుతుబ్షాహీ సమాధులు కుతుబ్షాహీల ప్రసిద్ధ స్మారక నిర్మాణాలు. గోల్కొండ కోటలో రామదాసు బందీఖానా, రాణీమహల్, స్నానవాటికలు నేటికీ నిలిచి ఉన్నాయి. కుతుబ్షాహీల నిర్మాణాల్లోకెల్లా అత్యంత విశాలమైన ఏడు సమాధులు ‘కుతుబ్షాహీ టూంబ్స్’గా ప్రసిద్ధి పొందాయి. ఒక్క అబుల్ హసన్ తానీషా తప్ప, మిగిలిన సుల్తానులను ఇక్కడే సమాధి చేశారు. అబుల్ హసన్ తానీషా సమాధి దౌలతాబాద్ వద్ద ఉంది. కుతుబ్షాహీలు పారశీకులైనా ఆంధ్రుల సంస్కృతి, సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. సుమారు 171 ఏళ్లు ఈ సుల్తానులు తూర్పు తీరాంధ్ర వరకు పరిపాలించారు. మాదిరి ప్రశ్నలు 1. మహ్మద్ కులీ కుతుబ్షా ఏ సంవత్సరంలో చార్మినార్ను నిర్మించాడు? 1) 1591 2) 1592 3) 1593 4) 1594 2. మహ్మద్ కులీ కుతుబ్షా ఎవరి పేరు మీద హైదరాబాద్ నగరం నిర్మించాడు? 1) భాగీరథి 2) తారామతి 3) ప్రేమావతి 4) భాగమతి 3. ఉర్దూలో ‘కులియత్’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? 1. ఇబ్రహీం కుతుబ్షా 2. మహ్మద్ కులీ కుతుబ్షా 3. అబ్దుల్లా కుతుబ్షా 4. ఇబ్రహీం కుతుబ్షా 4. ‘ఖైరతాబాద్ మసీదు’ను నిర్మించిన కుతుబ్షాహీ పాలకుడు? 1) మహ్మద్ కులీ కుతుబ్షా 2) తానీషా 3) ఇబ్రహీం కుతుబ్షా 4) మహ్మద్ కుతుబ్షా 5. ఎవరి పాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో మొఘల్ అధికారుల ఆధిపత్యం విపరీతంగా పెరిగింది? 1) మహ్మద్ కులీ కుతుబ్షా 2) అబ్దుల్లా కుతుబ్షా 3) మహ్మద్ కుతుబ్షా 4) ఇబ్రహీం కుతుబ్షా 6. గోల్కొండ రాజ్యం ఏ సంవత్సరంలో మొగల్ సామ్రాజ్య వశమైంది? 1) 1685 2) 1683 3) 1687 4) 1689 సమాధానాలు 1) 1; 2) 4; 3) 2; 4) 4; 5) 2; 6) 3. డా॥పి. జోగినాయుడు డిప్యూటీ డెరైక్టర్ (రిటైర్డ్) ఆర్కియాలజీ - మ్యూజియమ్ -
మువ్వన్నెల రెపరెపలకు ముస్తాబైన గోల్కొండ
► నేడు జాతీయ జెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్ ► పది గంటలకు పతాకావిష్కరణ.. ఘనంగా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా మూడో ఏడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గోల్కొండపై జెండా ఎగరవేయనున్నారు. ఘనంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం సీఎం అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి గోల్కొండ కోటకు చేరుకుంటారు. 9.50 గంటలకు పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. పది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. గవర్నర్ శుభాకాంక్షలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న ఎందరో నిస్వార్థ దేశభక్తుల త్యాగ నిరతికి ఈ వేడుకలు నిదర్శనమని తన సందేశంలో పేర్కొన్నారు. మనకు స్వేచ్ఛా ఫలాలను అందించిన దేశభక్తులను స్మరించుకోవాలని.. ప్రజలందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు
ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్లోని వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం కె.చంద్రశేఖర్రావు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం గోల్కొండ కోటలో ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా తగు బందోబస్తు, పార్కింగ్ ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలని, బారికేడ్లు, మంచినీటి సరఫరా, గోల్కొండకు వెళ్లే మార్గంలో సైన్ బోర్డులు, పరిసరాల శుభ్రత, మొబైల్ టాయిలెట్స్, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక మినీ బస్సులు, వేదిక వద్ద పుష్పాలతో అలంకరించాలని ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గోల్కొండ కోటలో సాంస్కృతిక కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ముఖ్యకార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అధర్ సిన్హా, రాజీవ్ త్రివేది, సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి తెలంగాణ బోనాలు..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే బోనాల ఉత్సవాలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు లంగర్హౌస్, గోల్కొండ వేదిక కానున్నాయి. నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే అమ్మవారి బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై, ఇక్కడే ముగియనున్నాయి. ఆషాఢ మాసం అమావాస్య తరువాత వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారాల్లో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. గోల్కొండ కోటపై వెలసిన జగదాంబికా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి నెల రోజుల పాటు ప్రతి గురు, ఆది వారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు. నజర్ బోనం, భారీ తొట్టెలు.. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే మొదటి పూజలో అమ్మవారికి లంగర్హౌస్ వాసులు నజర్ బోనం సమర్పిస్తారు. గురువారం లంగర్హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, 32 అడుగుల ఎత్తై భారీ తొట్టెలను తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తర ఫున పట్టు వస్త్రాలు.. బోనాల ప్రారంభ ఊరేగింపులో మంత్రులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు సమర్పించి ఊరేగింపును ప్రారంభిస్తారు. చోటా బజార్లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు నిర్వహించి అక్కడి నుండి బోనాలతో అమ్మవారికి పల్లకిలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించడంతో మొదటి పూజ ముగియనుంది. -
సక్కుబాయినగర్లో మహిళ మృతదేహం లభ్యం
హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ సక్కుబాయినగర్ ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళను దుండగులు అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. -
హైదరాబాద్ మూడు ముక్కలు
హైదరాబాద్తో పాటు కొత్త జిల్లాలుగా గోల్కొండ, సికింద్రాబాద్ వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా భూపరిపాలన విభాగం కసరత్తు పూర్తి 14-15 కొత్త జిల్లాలపై నమూనా మ్యాప్లు సిద్ధం నేటి నుంచి రెండు రోజులు కలెక్టర్లతో వర్క్షాప్ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటులో కీలకంగా మారిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విభజన కొలిక్కి వచ్చింది. వీటి విభజనపై ముందునుంచీ గందరగోళం నెలకొనడం తెలిసిందే. రాజధానికి కేంద్రంగా విస్తరించిన గ్రేటర్ సిటీ కావటంతో దీన్ని ఎన్ని జిల్లాలుగా విభజిస్తారు, ఏ ప్రాంతాలను ఎందులో కలుపుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పలుమార్లు జరిగిన ఉన్నతాధికారుల సమావేశాల్లోనూ ఈ రెండు జిల్లాలపైనే సుదీర్ఘంగా తర్జనభర్జనలు జరిగాయి. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వాటి పునర్ వ్యవస్థీకరణ కసరత్తును సీసీఎల్ఏ ఎట్టకేలకు పూర్తి చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు నాలుగు జిల్లాలుగా ఆవిర్భవిస్తాయి. హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జిల్లాలుగా విభజిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను వీటిలో విలీనం చేస్తారు. వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు రంగారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. ఏ ప్రాంతాలను ఏ జిల్లా పరిధిలో ఉంచాలనే విషయంలోనూ సీసీఎల్ఏ నమూనా మ్యాపులు సిద్ధం చేసింది. మొత్తం 14 లేదా 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెదక్ జిల్లాలో సిద్ధిపేట, సంగారెడ్డి; ఆదిలాబాద్లో మంచిర్యాల (కొమురం భీం జిల్లా); నిజామాబాద్లో కామారెడ్డి; ఖమ్మంలో కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా); కరీంనగర్లో జగిత్యాల, వరంగల్లో భూపాలపల్లి (ఆచార్య జయశంకర్ జిల్లా); మహబూబాబాద్; నల్లగొండ జిల్లాలో సూర్యాపేట; మహబూబ్నగర్లో నాగర్కర్నూల్, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటు తుది పరిశీలనలో ఉంది. కరీంనగర్ జిల్లాకు ‘పీవీ నరసింహరావు జిల్లా’ అని పేరు పెట్టాలనే అభ్యర్థనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నేడు, రేపు కలెక్టర్ల వర్క్షాప్: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇదే ప్రధాన ఎజెండాగా మంగళ, బుధవారాల్లో కలెక్టర్లతో వర్క్షాప్ నిర్వహించనుంది. తొలి రోజు సదస్సును రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, సీసీఎల్ఏ రేమండ్ పీటర్ నిర్వహిస్తారు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవిన్యూ డివిజన్ల పునర్ వ్వవస్థీకరణ, ఏయే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి, వాటిలో ఏ మండలాలను విలీనం చేయాలనే అంశాలను ప్రధానంగా చర్చిస్తారు. భేటీకి ముసాయిదా ప్రతిపాదనలతో రావాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సోమవారమే సమాచారమిచ్చింది. నమూనా మ్యాప్లు: ముఖ్యమంత్రి సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది ముసాయిదాను భూ పరిపాలన విభాగం సిద్ధం చేసింది. మూడు వేర్వేరు ప్రతిపాదనలతో జాబితాలు రూపొందించింది. వీటికి అనుగుణంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లో భౌగోళిక సరిహద్దులను సూచించే నమూనా మ్యాపులను తయారు చేయించింది. జోన్ల హద్దులు మీరి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే రాజ్యాంగపరమైన చిక్కులొస్తాయనే ముందుజాగ్రత్తతో ఒక జాబితాను, జోన్లను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున అందుకనుగుణంగా మరో జాబితాను తయారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ముసాయిదాలతో పాటు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలు, డిమాండ్లైపై సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దాంతో కొత్త జిల్లాలకు మరింత రూట్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలంటున్నాయి. -
ఇద్దరు ఆన్లైన్ మోసగాళ్లు అరెస్ట్
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్షల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఇద్దరు యువకులు ఈజీ మనీకి అలవాటు పడి వినియోగదారులను బురిడీ కొట్టించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ల్యాప్టాప్, 3 ట్యాబ్లు, ఓ కెమెరా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డివైడర్ను ఢీకొన్న యాక్టివా: విద్యార్థి మృతి
గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీప్కాన్ వంతెన సమీపంలో వేగంగా వెళ్తున్న యాక్టివా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటన యాక్టివా నడుపుతున్న బిలాల్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
గోల్ఫ్ కోర్స్లో 'మిల్కీ బ్యూటీ'
-
గోల్కొండలో కాల్పుల కలకలం
గోల్కొండ: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. భూ వివాదానికి సంబంధించిన విషయంలో జరిగిన వాగ్వాదం చివరకు బుల్లెట్ల వర్షం వరకు వెళ్లింది. టోలిచౌకికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జాబేర్పటేల్ కొన్ని రోజుల కిందట గోల్కొండలో ఒక ఫ్లాట్ విషయంలో స్థానికులతో గొడవపడ్డాడు. ఈ విషయం ఆనోట ఈ నోట పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని పిలిచి సర్దుబాటు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. దీంతో గురువారం రాత్రి జాబేర్ పటేల్ గోల్కొండకు చెందిన ఫరీద్తో భేటి అయ్యాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన జాబేర్ తన తుపాకితో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఫరీద్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. జాబేర్ పటేల్ జాతీయ మైనార్టీ సెల్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. ఎర్రబుగ్గ వాహనాన్ని వాడుతున్నట్టు స్థానికలు తెలిపారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల అధీనంలోకి ‘గోల్కొండ’
* పంద్రాగస్టు నేపథ్యంలో పోలీసుల అప్రమత్తత * ఐఎస్ఐఎస్ కదలికలపై కేంద్ర హెచ్చరికలు * ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసుల డేగ కన్ను సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉన్న గోల్కొండ కోటపై ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించింది. దీంతో కోటను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కదలికలపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశాయి. అలాగే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని అమెరికా నిఘా సంస్థలు కూడా హెచ్చరించడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాల డీజీపీలతో శనివారం కేంద్ర హోం శాఖ ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న యువత ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలోనే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ కదలికలు, వారి వ్యవహారశైలికి సంబంధించి కొన్ని విషయాలను రాష్ట్ర డీజీపీకి తెలియజేసినట్లు తెలిసింది. దీంతో ఆయన నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు. సామాజిక మాధ్యమాలపై నిఘా.. రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు పలుమార్లు వెలుగు చూడటంతో సామాజిక మాధ్యమాలపై పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకుంటున్నాయని, దీన్ని అరికట్టాలని భావిస్తున్నారు. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్తూ సల్మాన్ మొహినుద్దీన్ ఈ ఏడాది జనవరి 16న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్లతో పాటు బస్స్టేషన్లపై నిఘా ఉంచారు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
పిలవని పెళ్లికి వెళ్లి... బీభత్సం సృష్టించారు
హైదరాబాద్ (గోల్కొండ) : ఆహ్వానం లేకుండా పెళ్లికి వచ్చి భోజనాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినందుకు షాదీఖానాలో యువకులు బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ దాడి గోల్కొండలో సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ లైన్స్కు చెందిన మహ్మద్ సిద్దిఖ్ కుమారుడు మహ్మద్ ఆమెర్ వివాహం గోల్కొండ జీన్సి బజార్కు చెందిన యువతితో శుక్రవారం రాత్రి గోల్కొండ బడా బజార్లోని మిర్జా గార్డెన్లో జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వధూవరుల కుటుంబాలు అప్పగింతల కార్యక్రమంలో పాల్గొనగా, డైనింగ్ హాల్లోకి వచ్చి 40 మంది యువకులు భోజనాలు చేస్తున్నారు. వీరిని చూసిన వరుడి తండ్రి మహ్మద్ సిద్దిఖ్ అక్కడకు వెళ్లి.. పిలవకుండానే వచ్చి భోజనాలు చేస్తున్నారంటూ ఆ యువకులను నిలదీశారు. దాంతో వారు తమ వెంట తెచ్చుకున్న తల్వార్లు, రాడ్లతో సిద్దిఖ్పై దాడి చేశారు. అతడి కేకలు విని బంధువులు డైనింగ్ హాల్లోకి వెళ్లారు. వారిపై కూడా యువకులు కత్తులు, రాడ్లతో దాడి చేసి అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరికేస్తామంటూ.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని దబాయించారు. గాయపడ్డవారు కింద పడిపోగా కొందరు యువకులు మహిళలపై కూడా దాడిచేశారు. సిద్దిఖ్ భార్య గౌసియా బేగాన్ని మెడపట్టి లాగి రాడ్లతో కొట్టి గాయపరిచారు. ఆమె మెడలోని ఆరు తులాల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. షాదీఖానాలోని వస్తువులను కర్రలు, రాడ్లతో కొట్టి ధ్వంసం చేశారు. మహ్మద్ సిద్దిఖ్ కారు అద్దాలు పగలకొట్టారు. గంటపాటు విధ్వంసం సృష్టించి దుండగులు పారిపోయారు. రాత్రి రెండు గంటలకు మహ్మద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారు గోల్కొండ ఖల్ఫాన్ తెగకు చెందిన వారని మహ్మద్ సిద్దిఖ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
థగ్గుకథ
narendrayan-36 గోల్కొండకు కొనసాగింపుగా హైదరాబాద్ నిర్మాణం జరిగిన కీ.శ.1591 తర్వాత ఎందరో ప్రముఖులు నగరం గురించి ఎన్నో విశేషాలను నమోదు చేశారు. విదేశీయులూ స్వదేశీయులూ! వారిలో పర్షియా చరిత్రకారుడు ఫరిస్తా, ఫ్రాన్స్ దేశానికి చెందిన వజ్రాల వ్యాపారి టావెర్నియర్, తెవెనాట్ అనే భాషాశాస్త్రజ్ఞుడు, బెర్నర్ అనే వైద్యుడు. అబ్బె క్యారీ అనే మతబోధకుడు ఉన్నారు. మనూచీ అనే ఇటాలియన్ వైద్యుడు, డచ్ ఈస్టిండియన్ కంపెనీకి చెందిన షూరర్, మెత్తోల్డ్ (డచ్ కంపెనీలో ప్రత్యర్థి దేశానికి చెందిన ఇంగ్లిష్ వ్యక్తి) కూడా నగరాన్ని సందర్శించిన ప్రముఖులే! ఫరిస్తా గోల్కొండ గురించి బీజాపూర్లో కూర్చుని రాశాడు. అతడు తప్ప మిగిలిన అందరూ 17వ శతాబ్దంలో నగరాన్ని సందర్శించారు. మొదావె అనే ఫ్రెంచ్ ఆర్మీ ఆఫీసర్ 18వ శతాబ్దంలో భాగ్యనగరాన్ని సందర్శించాడు. రక్తపాత రహితం! నగరం గురించి రాసిన ప్రముఖుల జాబితాలో ఒక ‘థగ్గు’ చేరాడు! 18-19 శతాబ్దాలలో ఇండియాలో థగ్గులు తమ ప్రభావాన్ని చూపారు. వీరిలో హిందువులు-ముస్లింలు ఉండేవారు. కాళికాదేవిని కొలిచేవారు. మణికట్టుకు పసుపురంగు రుమాల్ను కట్టుకునేవారు. ఒకవైపు నాణెం ముడివేస్తారు. తాము లక్ష్యంగా చేసుకున్న వారిని, అదను చూసి ఆ వస్త్రంతో చంపేసేవారు. చుక్క నెత్తురు చిందదు! ‘కాళికాదేవి రాక్షసులతో యుద ్ధం చేస్తున్నప్పుడు నేలపై పడ్డ ప్రతి నెత్తురు చుక్కా మరో రాక్షసునిగా మారిందిట. ఆ సందర్భంలో దేవి సృజించిన ఇద్దరు వ్యక్తులు, దస్తీలతో ఒక్క నెత్తుటి బొట్టు కిందపడకుండా చూశారు. దేవతకు విజయం చేకూర్చారు. వారి వారసులే తామ’ని థగ్గుల నమ్మకం! ఏడు ‘సెంచరీలు’ దాటాడు! బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ (1828-35) లార్డ్ విలియం బెంటింగ్.. అమానుషకాండలకు పాల్పడుతున్న థగ్గులపై వేటు వేశాడు. వారి తంతును నిషేధించాడు. స్లీమన్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారికి థగ్గుల నిర్మూలనా బాధ్యతలు అప్పగించాడు. మూర్హౌస్ జాఫ్రే నివేదిక ప్రకారం ఐదేళ్లలో 3,000 మంది థగ్గులు శిక్షకు గురయ్యారు. అమీర్ అలీ అనే థగ్గు కూడా శిక్షకుగురైన వాడే! మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో చెలరేగిన ఒకానొక థగ్గు బృందంలో అమీర్ అలీ సభ్యుడు. అతను అప్రూవర్గా మారి ఉరిశిక్షను తప్పించుకున్నాడు. అప్పటికి అతడి వయసు సుమారు నలభై ఏళ్లు. తాము పట్టుబడితే నేరం అంగీకరించడం కూడా కాళికాదేవి అభిమతమే అని భావించేవారు. 719 మందిని హత్యచేసిన అమీర్ అలీ పన్నెండు నెలలు జైలులో ఉన్నాడు. ఈ కాలాన్ని కూడా లెక్కవేసుకుంటే, ఈ హత్యల సంఖ్య వేయికి చేరేద న్నాడు. ‘అమీర్ అలీ కన్ఫెషన్స్’ 1839లో తొలిసారి ఇంగ్లండ్లో ప్రచురించారు. ఒక థగ్గు నేరాంగీకారం చేసినంత మాత్రాన ప్రముఖుల జాబితాలో చేరిపోతాడా? కానే కాదు.. ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 7680950863 -
గోల్కొండ గోల్ఫ్ చాంపియన్షిప్ ప్రారంభించిన కేసీఆర్
-
అయోధ్య రాముడు! దక్కన్ రాముడు !!
అయోధ్య రాముడు వేరు ! దక్కన్ రాముళ్లు వేరు !! సీత కాళ్లపారాణి ఆరకముందే, నూనుగు మీసాల రాముడు అంతఃపుర కారణాలతో అడవిబాట పట్టాడు. ఒక మహాయుద్ధం చేసి సీతా సమేతుడై పట్టాభిషిక్తుడు అయ్యాడో లేదో వియోగ రాముడయ్యాడు ! రామాయణంలో భద్రాద్రి ప్రత్యేకమైనది. పద్నాలుగేళ్ల వనవాసకాలంలో పదేళ్లను పది నిమిషాలుగా సీతారాములు ఇక్కడ ఆహ్లాదంగా గడిపారు. ముత్యాల బాట.. ఇతిహాస కాలానంతరం, చారిత్రక భద్రాచలం తహసీల్దార్ గోపన్న (రామదాసు)కు ఇక్కడ గుడి కట్టాలనిపించింది. కుతుబ్షాహీల చివరి రాజు తానీషాకు జమకట్టాల్సిన పన్నులతో ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత జైలుపాలైన రామదాసు రాములోరిపై భక్తిపూర్వకంగా నిందాస్తుతి రాశాడు. రామలక్ష్మణులు గోల్కొండకు రాక తప్పలేదు. తానీషాను ‘నిద్ర’లేపి తమ దాసుడు కట్టాల్సిన డబ్బులను అణాపైసలతో సహా చెల్లించి రసీదు సైతం పొందారు. తానీషా పశ్చాత్తప్తుడై రామదాసును విడుదల చేశాడని గాథ ! ఏటా సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపుతానన్న తానీషా మాట నేటికీ అమలవుతోంది. కూచిపూడి భాగవతులకు తానీషా అగ్రహారాన్నివ్వడమూ మరొక సందర్భంలో స్మరణీయమే ! మరొక దక్కనీ రాముడికి సంబంధించిన చారిత్రక డాక్యుమెంట్లను తిప్పి చూద్దాం. అసఫ్జాహీలు-కాయస్థులు ఈ అపురూపమైన దక్కనీ చిత్రాన్ని తిలకించండి. 19వ శతాబ్దపు అజ్ఞాత చిత్రకారుడు కాగితంపై వాటర్ కలర్స్తో, బంగారుపూతతో చిత్రించాడు. ఇందులో ప్రస్తుత కథానాయకుడు మూడో నిజాం నవాబ్ సికిందర్ జా ఉద్యానవనంలో సుమసౌరభాన్ని ఆస్వాదిస్తూ విరాజమానుడై ఉన్నాడు. ఆయన ఎదురుగా నాలుగు సామాజిక సమూహాలకు ప్రతీకలైన నలుగురు ప్రధానులు.. ప్రభువు ఆనతిని ఆలకిస్తున్నారు. ఇంతకీ సికిందర్ జా ఎవరు ? ఔరంగజేబ్ పతనానంతరం అరాచకం తాండవించింది. కత్తి కింద ఒకటిగా మసలిన ప్రాంతీయ అస్తిత్వాలు తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నాయి. ఆ నేపథ్యంలో మహమ్మద్ షా (1719-48) ధోరణులు నచ్చక పాలకవర్గంలోని ప్రముఖుడు నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ వచ్చేశాడు. ఏడాదిలో (1724) పాత దక్కన్ను ఏకం చేశాడు. ఆయన ప్రత్యేకతను దక్కనీయులు, ఢిల్లీ పాలకులు సైతం గుర్తించి ‘అసఫ్ జాహీ’ బిరుదునిచ్చి గుర్తించారు ! ఆయన వెంట ఢిల్లీ నుంచి కాయస్థులు దక్కన్ వచ్చారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే ఢిల్లీ ఏలికల వైపరీత్యాలు చోటు చేసుకోకుండా ప్రజలకూ ప్రభుతకు వారధిగా వ్యవహరించారు. వివిధ పదవుల్లో, బాధ్యతల్లో రాజ ప్రముఖులుగా ఎదిగారు. ఆ క్రమంలో రాజపరివాపు జీతభత్యాలను చెల్లించే అధికారి భవానీ ప్రసాద్కు మూడో నిజాం ‘రాజా’ బిరుదునిచ్చారు. ఆ సందర్భంగా రామాలయం నిర్మించాలనుకున్నారు భవానీ ప్రసాద్. ప్రస్తుత నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాజేంద్రనగర్కు వెళ్లే దారిలో అత్తాపూర్ సమీపంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన రాముడి విగ్రహం వెనుక ఒక కథ ఉంది. గద్వాల తర్వాత హైదరాబాదే.. పాత హైదరాబాద్ స్టేట్లోని రాయచూర్ జిల్లాలో నిజాంలకు అనుబంధంగా గద్వాల సంస్థానం ఉండేది. 1384 చ.కి.మీ విస్తీర్ణంలో గద్వాల పట్టణమూ, 214 గ్రామాల సంస్థానానికి రాజా సోమభూపాలుడు పాలకుడు. ప్రస్తుతం మహబూబ్నగర్లో భాగమైన ఈ సంస్థానం హైదరాబాద్ స్టేట్ కంటే ముందే అస్తిత్వంలో ఉండేది. రాజా సోమభూపాలుడు తన పరివారం కోసం ఒక రామాలయాన్ని నిర్మించాలనుకున్నాడు. రాముడి శిల్పం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు ఒక కల వచ్చింది. ‘సమీపంలోని బావిలో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయంలో ప్రతిష్ఠించవలసినది’ అని రాముడు చెప్పాడట. అదే సమయంలో ‘రాజా’ భవానీ ప్రసాద్కూ సోమభూపాలుడికి రాముడు కలలో చెప్పిన వైనం కలగా వచ్చిందట. బావిలోని విగ్రహాన్ని గద్వాలాధీశుడు ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో ముందుగా శిల్పులకు పురమాయించగా రూపొందిన రాముడి విగ్రహం తనకు బహుమతిగా ఇవ్వవలసిందిగా కోరాడట భవానీ ప్రసాద్. సోమభూపాలుడు సంతోషంగా అంగీకరించి బహూకరించాడట. ఫర్కుందా బునియాద్.. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక, సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా భవానీప్రసాద్ మూడో నిజాం సికిందర్ జాను ఆహ్వానించాడు. 1812లో ఈ అపురూప దృశ్యాన్ని ఆబాలగోపాలం వీక్షించింది ! ఆలయ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న సికిందర్ జా మడులూ-మాన్యాలు ఆలయానికి రాశాడు. అర్చకులకు, సిబ్బందికి జీతభత్యాలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వమన్నాడు. ఏటా రామనవమి రోజు ప్రభుత్వం తరఫున ‘యాత్ర’ నిర్వహించాలని ఆదేశాలిచ్చాడు. 1816వ సంవత్సరపు ‘దఫ్తర్-ఎ-ఇస్తిఫా’ రికార్డుల ప్రకారం అర్చకులకు రోజుకు రెండు రూపాయల గ్రాంట్ మంజూరైంది. మూడో నిజాం ఉత్తర్వుల్లో హైదరాబాద్ పేరును ‘ఫర్కుందా బునియాద్’ అని పేర్కొన్నారు. భాగ్యనగర్ అనే పేరుకు ఫర్షియా పదం ‘ఫర్కుందా బునియాద్’ సమానార్థకం కావడం విశేషం ! దక్కన్ ముస్లింలు విగ్రహ ప్రతిష్ఠాపకులు రామ్బాగ్ ఆలయంగా స్థానికులు వ్యవహరించే ఈ ఆలయం ప్రతిష్ఠాపనలో హిందూ-ముస్లింలు సాదరంగా పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనను స్వయంగా ముస్లిం పాలకుడు చేశాడు. ముస్లింలంటే విగ్రహ విధ్వంసుకులనే భావనలను పూర్వపక్షం చేశారు. మనవత్వాన్ని పరిమళించే ఈ మతసామరస్యానికి బీజాలు నగరానికి పునాదులు వేసిన కులీ కుతుబ్షాలో ఉన్నాయి. ఒక కవితలో అంటాడు.. కాఫిర్లు లేరు ముస్లింలు లేరు.. అన్ని మతాలు.. ప్రేమ కుదురులోనే పుష్పిస్తాయి.. హైదరాబాద్ తెహ్జీబ్ పరిమళాలను ఆస్వాదించేంతగా కాలుష్య ప్రపంచం ‘అభివృద్ధి’ చెందాలని ఆశిద్దాం! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
బాగ్నగర్- సిటీ ఆఫ్ గార్డెన్స్
ఇబ్రహీం కాలంలో (1556) విజయనగరం పతనమైంది. హంపిలో కొల్లగొట్టిన అపారమైన సంపద గోల్కొండ చేరింది. ఇబ్రహీం చివరిరోజుల నుంచి అతని వారసుడు మహమ్మద్ కులీ పరిపాలనా కాలం వరకూ గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగం అని చరిత్రకారులు భావిస్తారు. అహ్మద్నగర్ పతనం, అక్బర్ చక్రవర్తితో సంధి, బీజాపూర్ సుల్తాన్తో స్నేహ సంబంధాలు ఆనాటి తెలంగాణలో శాంతి సౌఖ్యాలు నెలకొల్పాయి. నిర్మాణాలు ఊపందుకున్నాయి. విస్తరించిన గోల్కొండ చుట్టూ మరో కోటగోడ నిర్మాణమైంది (ఖుతుబ్షాహీ సమాధుల వద్ద నయాఖిల్లా అదే). మూసీనదికి దక్షిణాన మరో మహానగరానికి పునాదులు పడ్డాయి. నేటి పురానాపూల్ నుంచి లాడ్ బజార్కి సమానాంతరంగా కారవాన్ రాస్తాకి రెండువైపులా విస్తారమైన తోటలు, మహళ్ళతో కొత్త లేఔట్ వేయబడింది. దాన్నే ‘సిటీ ఆఫ్ గార్డెన్స్- బాగ్నగర్’ అన్నారు. నాలుగు మినార్లతో ఖుతుబ్షాహి ప్రతిష్టని ఇనుమడించేలా చార్మినార్ నిర్మించబడింది. 20 వేల మంది వడ్డె, ఉప్పర కార్మికులతో మక్కామిసీద్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ కాలంలోనే మధ్య ఆసియాకి చెందిన ముస్లింలు అనేకమంది ఇండియాకి వలసవచ్చారు. వారిని ‘అఫాకీలు’ అనేవారు. సుల్తాన్లు సైన్యంలో, అధికార యంత్రాంగంలో అటువంటివారి మీదే ఎక్కువగా ఆధారపడ్డట్లు కనిపిస్తుంది. అయితే ప్రజ్ఞ ఉన్న హిందువులకి పదవులు ఇవ్వలేదనటానికి వీలులేదు. అక్కన, మాదనల వంటి అనేకులు పెద్దపెద్ద పదవులు చేపట్టారు. రాజకీయాలని నిర్దేశించారు. అలా వచ్చిన ముస్లిం బృందాలు ఎలా జనస్రవంతిలో కలిసిపోయాయో చెప్పేందుకు వేమన రాశాడని చెబుతున్న ఒక పద్యం ఉంది. షేకు సైదు మొగలలు చెలగి పఠానులు తురుకులు దొరతనము తొలుత చేసి రాగరాగ విడిచి రౌతులై కొలిచిరి విశ్వదాభిరామ వినుర వేమా! కుతుబ్ షాహీ సుల్తానులు తెలుగు భాషని కూడా ఆదరించారు. ఇబ్రహీం కులీ ఆస్థానాన్ని వేదపురాణశాస్త్ర విద్వాంసులు అలంకరించినట్లు అద్దంకి గంగాధరుడు తన ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే గ్రంథంలో చెప్పాడు. ఇబ్రహీం కులీని ‘మల్కిభరాముడ’ని ప్రస్తుతించే అనేక చాటువులు దొరికాయి. గోల్కొండలో మజ్లీస్ దివాన్దారీ అనే పరిషత్తులో తెలుగు పండితులకి కూడా చోటు ఉండేది. నాటి తెలంగాణ రాజ్యం ఇప్పటి కోస్తాంధ్రలో పూర్తిగా విస్తరించింది. తూర్పు ఆసియా దీవులు కేంద్రంగా డచ్చి, ఇంగ్లిష్ వర్తకులు పోర్చుగీసులో వాణిజ్యానికి పోటీ వచ్చారు. మచిలీపట్నం, పెద్దపల్లి (నిజాంపట్నం), నరసాపురం, భీమ్లీ తెలంగాణకి ముఖ్య రేవు పట్టణాలుగా అభివృద్ధ్ది చెందాయి. మహమ్మద్ షా ఇచ్చిన ఫర్మానాతో డచ్చివారు కోస్తాలో అనేక కలంకారీ, లేస్, తుపాకీ మందు కర్మాగారాలు స్థాపించారు. ఇండెంచర్ నమూనాతో కార్మికులని గ్రామాలలో కొనుగోలు చేసి పగలూ రాత్రీ బలవంతంగా పనిచేయించి, ఎగుమతులలో విపరీతమైన లాభాలు గడించారు. గోల్కొండ నుంచి మచిలీపట్నం, విశాఖపట్నం, అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్, పెనుగొండలకి వెళ్ళే మార్గాలు విస్తరించబడ్డాయి. ఈ దండుబాటలలో రక్షణ వ్యవస్థ పటిష్టం చేయబడింది. ఒక ముసలవ్వ బంగారం నిండిన పెట్టెతో ఒంటరిగా గోల్కొండ నుండి మచిలీపట్నం సురక్షితంగా ప్రయాణించ గలిగేదని ఫరిష్తా చెప్పాడు. చేతిలో ఈటె, కాళ్ళకు గజ్జెలతో ఒక్కొక్కరూ 400 మీటర్లు మాత్రమే వేగంగా పరుగెత్తే టపాబంట్ల రిలే వ్యవస్థ ద్వారా గోల్కొండ నుండి రాజమండ్రికి ఉత్తరాలు ఒక్కరోజులో చేరేవి. అందుకనే ప్రజలు వాడుక భాషలో ‘గోల్కొండ టపా’ అనే పదాన్ని అర్జంటు అనే అర్థం వచ్చేట్లు ఉపయోగించారు. -
లారీని ఢీకొట్టిన మరో లారి,డ్రైవర్కు గాయాలు
-
ఫిరంగుల అడ్డా
గన్ఫౌండ్రీ అంటే ఫిరంగుల తయారీ కేంద్రం. నేడు సిటీలో నిజాం కాలేజీ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాన్ని ‘గన్ఫౌండ్రీ’గా పిలుస్తున్నారు. రెండు శతాబ్దాల కిందట ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండేది. నిజాం నవాబుల కాలంలో సైనికులకు అవసరమయ్యే ఫిరంగులను ఇక్కడ తయారు చేసేవారు. తుపాకీలు ప్రాచుర్యంలో లేని ఆ రోజుల్లో నిజాం సైన్యం ఫిరంగులను రక్షణాయుధంగా ఉపయోగించేవారు. ఫిరంగి అనేది ‘ఫర్షియన్’ పదం. తెలుగు, హిందీలలో కూడా ఈ పదం ‘ఫిరంగి’గానే వాడుకలో ఉంది. ఫిరంగికి ఇంగ్లిష్లో గన్ అని అర్థం చెప్పుకునేవారు. అలా గన్స్ తయారీ కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం.. ‘గన్ఫౌండ్రీ’గా హైదరాబాద్లో నిలిచిపోయింది. ఈ ‘గన్’ల తయారీకి, వీలుగా పెద్ద సైజు కొలిములు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్కో ఫిరంగి 12 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. వీటిని ఇనుముతో పాటు, పంచ లోహాలతో కూడా తయారు చేసేవారు. నిజాం ప్రభువులకు అవసరమైనన్ని ఫిరంగుల తయారీ కేంద్రంగా గన్ఫౌండ్రీ ప్రసిద్ధి. ఇక్కడ తయారైన ఫిరంగులు గోల్కొండ కోట బురుజులలో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికిఎదురుగా గల గన్పార్క్లో, పబ్లిక్ గార్డెన్స్లో, సికింద్రాబాద్లోని మిలిటరీ క్యాంపు ఏరియాలో, ట్యాంక్బండ్, తదితర ప్రదేశాల్లో అనేక చోట్ల నేడు కనిపిస్తాయి. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పాడుబడ్డ కోట గోడలపై కనిపించే ఫిరంగులు గన్ఫౌండ్రీలో తయారైనవే. అదే అసలు బలం.. ఆ రోజుల్లో ఫిరంగుల బలం ఉంటే యుద్ధంలో సగం విజయం సాధించినట్టే అని భావించేవారు. ఫిరంగి ముందు భాగంలో మందుగుండు గోళాలు చొప్పించేవారు. ఫిరంగి పైభాగాన ఉన్న చిన్న రంధ్రం ద్వారా మందుగుండు సామగ్రిని అంటించగానే అది ఫిరంగి నుంచి దూసుకెళ్లి విధ్వంసం సృష్టిస్తుంది. కాలక్రమంలో సరికొత్త ఆయుధాలు రావడంతో ఫిరంగుల వాడకం పూర్తిగా కనుమరుగైంది. దీంతో, గన్ఫౌండ్రీలో ఫిరంగుల తయారీకి వాడిన పెద్ద పెద్ద ఫర్నెస్లు, కొలిములు నిరుపయోగంగా మారిపోయాయి. గన్ఫౌండ్రీలోని పలు ఫిరంగుల తయారీ కేంద్రాల పరిసరాలు చాలా భాగం నగరవాసులకు ఆవాసాలుగా మారాయి. కొంతభాగం అన్యాక్రాంతమైంది. అయితే, పురాతన వారసత్వ పరిరక్షణలో భాగంగా పురావస్తు శాఖ గన్ఫౌండ్రీ ప్రాంతంలో మహబూబియా గర్ల్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఫిరంగుల కొలిమికి మాత్రం గట్టి భద్రత ఏర్పాటు చేసింది. ‘ఫిరంగుల చరిత్ర’ తెలియజేస్తూ సైన్బోర్డు ఏర్పాటు చేసి, తగిన సమాచారం పొందుపరచింది. మనసుంటే.. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గన్ఫౌండ్రీ ప్రాంత అభివృద్ధికి తగిన ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. భావి యువతకు ఈ చిన్ని ఏర్పాటే గొప్ప వరమని చెప్పొచ్చు. నిజాం కాలేజి దాటి వచ్చాక, ‘లేపాక్షి’ షోరూం ప్రక్కనే గల చిన్నదారి గుండా ముందుకెళ్లి వాకబు చేస్తే అక్కడున్న ఏకైక అవశేషంగా మిగిలిన ‘గన్ఫౌండ్రీ’ని స్థానికులు ప్రస్తుతానికి చూపిస్తున్నారు. శత్రువులను దరి రానీయకుండా రక్షణ కల్పించిన, శతాబ్దాల చరిత్రగల గన్ఫౌండ్రీని, ఇక్కడ తయారై నిరాదరణకు గురైన ఫిరంగులను పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దవచ్చు. గోల్కొండ కోట ప్రాంతంలో అక్కడక్కడ పడి ఉన్న ఫిరంగులను ఒక దగ్గరకు చేర్చి పర్యాటకులకు అవగతమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటే అర్థవంతమైన పనే అవుతుంది. మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
గోల్కొండ కోట దగ్గర ఉద్రిక్త..బీజేపీ నేతలు అరెస్టు
-
అందరి దృష్టి గోల్కొండపైనే..
పంద్రాగస్టు నేపథ్యంలో... బారికేడ్లు, వేదిక,సుందరీకరణ పనులు ముమ్మరం అడుగడుగునా తనిఖీలు వేడుకల ప్రాంతాన్ని సందర్శించిన జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో అందరి దృష్టి గోల్కొండపై పడింది. ఇందుకు గాను ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అన్ని శాఖల అధికారులు గోల్కొండను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరిసరాలను చదును చేయడం, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. వాహనాల పార్కింగ్, వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండకు దారి తీసే మార్గాలను కూడా ముస్తాబు చేస్తున్నారు. గస్తీ ముమ్మరం.. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను వెస్ట్జోన్ డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. పంద్రాగస్టు రోజున మాసబ్ట్యాంక్ నుంచి గోల్కొండలోని స్వాతంత్ర వేడుకలు జరిగే ప్రదేశం వరకు మొత్తం 26 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్లో నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు. వేడుకకు హాజరయ్యే వారి కోసం నానల్నగర్ చౌరస్తా నుంచి టిప్పుసుల్తాన్ బ్రిడ్జి, గొల్కొండ ప్రధాన దర్వాజా నుంచి మకాయిదర్వాజా, బంజారా దర్వాజా నుంచి షేక్పేట్ నాలా ఇలా ఆరు రూట్లను కేటాయించారు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలో ముందుగానే పోలీసులు సూచనలతో కూడిన కరపత్రాలు, పాస్లను అందరికి అందజేయనున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. అసలే మిలటరీ ఏరియా కావడం.. ఒక రూట్లో వెళ్లాల్సిన అతిథులు మరో దారిలో వెళ్తే మిలటరీ వారితో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే విషయమై ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా రూట్లను సూచించేలా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 45 నిమిషాల పాటు సాగే స్వాతంత్య్ర వేడుకల కోసం బందోబస్తు ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వు, తెలంగాణ స్పెషల్ పోలీసులతో పాటు గ్రేహౌండ్స్ దళాలు బందోబస్తులో పాల్గొంటున్నాయన్నారు. కోటను సందర్శించిన మేయర్, కమిషనర్ గోల్కొండ : వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ కోట ప్రాంతాన్ని శనివారం నగర మేయర్ మాజిద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తదితరులు సందర్శించారు. టోలిచౌకి నుంచి ఏర్పాట్ల పనులు పరిశీలిస్తూ కోటకు వచ్చారు. బంజార దర్వాజ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పూర్తి చేసి ఆ ప్రాంతంలో పూల మొక్కలు నాటాలని వారు ఆదేశించారు. కోటలో సీఎం కేసీఆర్ స్వీకరించే గౌరవ వందనం ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన పనులను అధికారులకు సూచించారు. -
ఇక్కడ వేడుకలు నిర్వహించొద్దు!
-
గోల్కొడ ఖిల్లా.. తయారవుతోందిలా..
-
గోల్కొండ కోటను సందర్శించిన కలెక్టర్
గోల్కొండ: పంద్రాగస్టు రోజున కేసీఆర్ గోల్కొండ కోటలో జెండా ఎగరవేయనుండడంతో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ ముఖేశ్కుమార్ మీనా మంగళవారం గోల్కొండ కోటకు వచ్చారు. భారతీయ పురాతత్వ సర్వేక్షణ శాఖ అధికారులతో కలిసి ఆయన అట్టార సిడి ప్రాంతాన్ని పరిశీలించారు. గత సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టార సిడి ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించి అరగంట పాటు అక్కడున్నారు. 51 ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పరేడ్ గ్రౌండ్గా తీర్చిదిద్దేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదే శించడంతో కలెక్టర్ అట్టార సిడి కందకాల నుంచి ఆషుర్ఖానా వరకు విస్తరించి ఉన్న మైదానాన్ని పరిశీలించారు. మైదానం మధ్యలో ఉన్న పెద్ద బండరాళ్లు, చెట్లను తొలగించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా కటోరహౌస్ క్రాస్రోడ్డు నుంచి అట్టార సిడి వరకు ఉన్న రోడ్డు ఎక్కువ సంఖ్యలో వాహనాలు వస్తే తలెత్తే సమస్యలను కూడా ఆయన అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఆర్డిఓ నిఖిల, గోల్కొండ త హసిల్దార్ వంశీమోహన్, పురావస్తు శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం అధికారులు ఉన్నారు. -
భద్రతా వలయంలో కోట
గోల్కొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గోల్కొం డకు వచ్చిన సందర్భంగా పోలీసు అధికారులు సుమారు నాలుగు గంటల పాటు కోటను తమ అధీనంలోకి తీసుకున్నారు. కోటకు వచ్చే దారులన్నిం టినీ మూసివేశారు. అంతేకాకుండా కోట మీదుగా వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించారు. సమీపంలోని షాపులన్నింటినీ మూసివేయించడమే కాకుండా కోట బస్ స్టాప్, చోటాబజార్ మెయిన్ రోడ్లపై తోపుడు బండ్లనూ దూరంగా తరలించారు. మూడు గంటలకు కేసీఆర్ వస్తారని తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నం 2.30 నుంచే పర్యాటకులను కోటలోకి అనుమతించ లేదు. సాయంత్రం 5.30 గంటలకు సీఎం అక్కడికి చేరుకున్నారు. లోప ల ఉన్న పర్యాటకులను బయటకు రానివ్వకుండా పోలీసులు గేటు వేసేశారు. దీంతో సుమారు గంట పాటు పర్యాటకులు కోట లోపలే ఉండిపోయారు. -
క్యాథ్ల్యాబ్ సిటీ
* డేంజర్ జోన్లో 25 లక్షల మంది యువత.. * 80 శాతం గుండెపోట్లు 40 ఏళ్ల లోపు వారికే గోల్కొండ, చార్మినార్, హుస్సేన్సాగర్.. బిరియానీ, హలీం..అంటే చాలు హైదరాబాద్ సిటీ గుర్తుకొస్తుంది. కానీ కొత్తగా ఈ నగరం తన సంస్కృతి, సంప్రదాయాలు మార్చుకుని ‘క్యాథ్ల్యాబ్’ సిటీగా మారిపోతోంది. క్యాథ్ల్యాబ్ అంటే గుండెపోటుకు వైద్యమందించే పరికరాలు. వాటిని వినియోగిస్తున్నవారు పెరిగిపోతుండడంతో ఆ బాధితుల నగరంగా రికార్డుల్లోకి ఎక్కుతోందన్నమాట. అందుకే ఇది అలా మారిపోరుు ఉండొచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణులు డా.ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ అంటున్నారు. నగరంలో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు 50 లక్షల మంది ఉంటే ఇప్పటికే 25 లక్షల మంది డేంజర్ జోన్లో ఉన్నారు. మరో పాతిక లక్షల మంది దానికి దగ్గరగా ఉన్నారు. గుండె పోటుకు గురయ్యే వారిలో 80 శాతం మంది 40 ఏళ్ల లోపు వారేనని వుుఖర్జీ చెబుతున్నారు. కారణాలివీ.. * విదేశాల్లో ఉన్న అనారోగ్యకర ఆహార ప్రభావం ఇప్పుడు నగరంపైనా పడుతోంది. * రెండుమూడేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఎక్కువగా ఒత్తిడి అనుభవించేవారు. * ఇప్పుడు జీహెచ్ఎం లేబర్ నుంచి ఎలక్ట్రీషియన్ వరకూ ఒత్తిడిలోనే ఉంటున్నారు. దీనిక్కారణం తింటున్న తిండే. * సాధారణంగా రోజుకు మనిషికి 1500 కేలరీలతో కూడిన ఆహారం అవసరం. కానీ 2500 కేలరీలు తింటున్నారు. ఇందులో 400 కేలరీలు ఖర్చు చేయలేక పోతున్నారు. * అంతా సంపాదన, సెటిల్మెంట్మీద దృష్టి సారిస్తున్నారు. తినే ఆహారంపై చర్చ 2 శాతం కూడా సాగడం లేదు. * ఒత్తిడితో 30 ఏళ్లలోపే రక్తపోటు, మధుమేహం వస్తున్నాయి. * నికోటిన్ (పొగాకు) వాడకం హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంది. ‘గుండె’ను ఎలా రక్షించుకోవాలి * రోజూ 45 నిమిషాలు వేగంగా నడవాలి. * అన్నంలో కూర కాదు. కూరలో అన్నం వేసుకుని తినే అలవాటు రావాలి. * తక్షణమే ఉప్పు, కారం, నూనె తగ్గించాలి. నూనె నెలకు ఒక మనిషికి అరకిలో చాలు. * పండ్లు..అంటే ఆపిల్ ఒక్కటే అని కాదు అన్ని రకాలవీ తీసుకోవాలి. * గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు లేని వాళ్లు రోజూ కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. * ఆలివ్ ఆయిల్ ఖరీదైనా మిగతా వాటికంటే మంచిది. * బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)కి 25 కంటే తక్కువగా ఉండాలి. * రోజూ 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి. * ఒత్తిడి నివారణకు యోగా తప్పనిసరి. వ్యాయామం కూడా అవసరమే. * గుండెజబ్బులు రాకుండా జాగ్రత్త పడేందుకు ఎలాంటి మందులూ అక్కర్లేదు.. వచ్చాక మందుల్లేకుండా మనగలగడం కష్టం. ప్రజెంటేషన్..: జి.రామచంద్రారెడ్డి -
తల్లీ బెలైల్లినాదో..
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా బోనాలు గోల్కొండలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో, బోనాలనెత్తుకున్న మహిళలతో తెలంగాణ ప్రజల సంసృ్కతి సంప్రదాయాలకు అద్దం పట్టెలా అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన శ్రీజగదాంబిక అమ్మవారికి మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ నృత్యాలు, పోతరాజుల విన్యాసాలతో కోట పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారికి సమర్పించడానికి ఊరేగింపుగా తెచ్చిన తొట్టెలకు జనం తండోప దండాలుగా వచ్చి మొక్కారు. కోటలో శివసత్తుల పూనకాలు చూడడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువకులు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ కోటపైకి ఎక్కారు. అంతేకాకుండా 23 కుల వృత్తుల వారు అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో తమ వంతు సహాయాన్ని అందించారు. తెలంగాణలో ప్రారంభమయ్యే మొట్టమొదటి బోనాల ఉత్సవం ఇక్కడే ప్రారంభమై 9 పూజల అనంతరం ఇక్కడే ముగుస్తుంది. -
గోల్కొండ.. ఐతే ఓకే!
మణికొండ, న్యూస్లైన్: విభజన ప్రతిపాదనపట్ల వారు విముఖంగా ఉన్నారు. తప్పనిసరైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరుతున్నారు. పాలనాసౌలభ్యం పేరిట ఇక్కట్ల పాలు చేయొద్దని విన్నవిస్తున్నారు రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు. హైదరాబాద్ నగరం చుట్టూరా ఉన్న రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించనున్నట్టు ప్రచారం సాగుతోంది. వీటిల్లో వికారాబాద్, గోల్కొండ జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కేంద్రం హైదరాబాద్ నగరంలోనే ఉంది. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధి నగరానికి ఆనుకొని ఉంది. తమ అవసరాల రీత్యా నగరానికి రాకపోకలు సాగించడానికి ప్రజలకు పెద్దగా ఇబ్బందులేమీలేవు. ఈ నేపధ్యంలో కొత్తగా ఏర్పడనున్న వికారాబాద్ జిల్లా పరిధిలోకి రాజేంద్రనగర్ నియోజవర్గాన్ని కలపాలనే ప్రతిపాదన సిద్ధమైనట్టు సమాచారం. అది కార్యరూపం దాలిస్తే దూరభారం పెరుగుతుంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 60 నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిందే. పక్కనే ఉండే గోల్కొండ జిల్లాలో విలీనం చేసినా ఫర్వాలేదని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. వికారాబాద్లో విలీనానికి మాత్రం విముఖంగా ఉన్నారు. ఒక్క మార్పుతో రెండు నియోజకవర్గాలకు మేలు రంగారెడ్డి జిల్లాలో ఒక్క మార్పు చేస్తే రెండు నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదనల్లో గోల్కొండ జిల్లాలో మెదక్ జిల్లా పరిధిలోని పటాన్చెరును కలపనున్నట్లు తెలుస్తోంది. పటాన్చెరువు నియోజకవర్గానికి చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి, వికారాబాద్ నియోజకవర్గంలోని మొమిన్పేట్ మండలాలు ఆనుకుని ఉంటాయి. పైగా మెరుగైన రవాణా సౌకర్యం ఉంది. పటాన్చెరును వికారాబాద్ జిల్లాలో, రాజేంద్రనగర్ను గోల్కొండ జిల్లాలో విలీనం చేస్తే సౌకర్యంగా ఉంటుందని ఆ నియోజకవర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరుతున్నారు. -
ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టాలి
గోల్కొండ, న్యూస్లైన్: తమ దైనందిన బిజీ షెడ్యూల్లో మహిళా న్యాయవాదులు శారీరక దృఢత్వంపై కూడా శ్రద్ధ చూపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.రోహిణి అన్నారు. గురువారం మాసబ్ ట్యాంక్ స్పోర్ట్స్ కోచింగ్ గ్రౌండ్లో మహిళా న్యాయవాదుల క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాదుల సంఘం మరింత చొరవ చూపి తరచూ ఇలాంటి టోర్నీలు నిర్వహించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె మహిళా క్రికెటర్లతో పరిచయం చేసుకున్నారు. అలాగే టాస్ వేసి, బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ అనీస్, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గిరిధర్రావు, ఉపాధ్యక్షుడు వేణుమాధవ్, కార్యదర్శి డి.ఎల్. పాండులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సులభమే: సానియా
గోల్కొండ, న్యూస్లైన్: క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం కృషిచేస్తున్న ఉద్యమకారులకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మద్దతు ప్రకటించింది. ఆదివారం గోల్కొండలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ క్రుసేడర్స్ ఇన్విటేషన్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్కు సంబంధించిన కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యూర్ ఫౌండేషన్ క్యాన్సర్ క్రుసేడర్స్ నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను క్యాన్సర్ బాధితుల చికిత్సకు కేటాయించడం హర్షణీయమని తెలిపింది. క్యాన్సర్ వ్యాధిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని, నేడు ఆ వ్యాధిని సకాలంలో గుర్తించి నివారించే ఆధునిక చికిత్స విధానం అందుబాటులోకి వచ్చిందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. క్యాన్సర్ కోసం స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు,సెలబ్రిటీలు, క్రీడాకారులు ముందుకు రావడం హర్షణీయమని తెలిపింది. కేవలం గోల్ఫ్ క్రీడాకారులే కాకుండా ఇతర రంగాల క్రీడాకారులు కూడా ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించి క్యాన్సర్ ఫౌండేషన్లకు విరివిగా నిధులు సమకూర్చాలని సానియా కోరింది. గత నాలుగు సంవత్సరాలుగా క్యూర్ ఫౌండేషన్ క్యాన్సర్ క్రుసేడర్ 800 మంది పిల్లలకు క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం నిధులు అందించిందని, ఇది ఎంతో గొప్ప విషయమని అభినందించింది. కాగా ఈ గోల్ఫ్ టోర్నమెంట్ ఈ నెల 15, 16వ తేదీల్లో హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్లో జరుగనుందని హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి బి.ఎల్.కె.రెడ్డి తెలిపారు. ఇందులో దాదాపు 150 మంది గోల్ఫర్లు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. సెలబ్రిటీస్ ప్లే ఆఫ్లో 16న జరిగే పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, గుత్తా జ్వాల, క్లాసికల్ డాన్సర్ పింకీ రెడ్డి, ఆనంద్ శంకర్ జయంత్ తదితర ప్రముఖులు పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ కెప్టెన్ అసదుల్లా, క్యాన్సర్ క్రుసేడర్స్, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, సైబర్ సిటీ బిల్డర్స్-డెవలప్మెంట్, ఇన్లైన్ ఫోర్ మోటార్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యువజంటలతో గుంజీలు తీయించిన గోల్కొండ పోలీసులు
-
పదాలు లేని ప్రవాహాలు...
‘దుర్గం’ అంటే దుర్-గమనము కదా! అంబేద్కర్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న దుర్గం చెరువు దరికి ‘సీక్రెట్ లేక్ పార్క్’ అనే పేరు చక్కగా సరిపోయింది. వెతుక్కుని వెతుక్కుని మరీ వెళ్లాలి. రెండు, మూడు, నాలుగు చక్రాలపై, దాదాపు మూడు వందల మంది మ్యూజిక్ లవర్స్, మొన్న శనివారం సాయంత్రం ఎలాగైతేనేం అక్కడకు చేరుకున్నారు. గోల్కొండ కోటకు మంచినీటిని సరఫరా చేసిన చరిత్ర కలిగిన దుర్గం చెరువు, తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, తాజాగా జాజ్ సంగీతంతో మ్యూజిక్ లవర్స్ దాహార్తిని తీర్చింది! వెలుగునీడల మార్మిక వాతావరణంలో, దక్కన్ రాక్స్ అమరికల మధ్య ఏర్పాటైన వేదికపై ముగ్గురు కళాకారులు పరిసరాల సోయగానికి ముగ్ధులయ్యారు. ఇంత చక్కని వేదికను తమ పర్యటనలో చూడలేదంటూ ప్రేక్షకులకు పరిచయం చేసుకున్నారు. ఒకరు పోర్చుగల్కు చెందిన డబుల్ బాస్ వాద్యగాడు కార్లోస్ బైకా. మరొకరు రంగులీనే గిటార్ ‘తంత్ర’జ్ఞుడు, జర్మనీకి చెందిన ఫ్రాంక్ బొమస్. మరొకరు అమెరికాకు చెందిన క్లాసిక్ డ్రమ్మర్ జిమ్ బ్లాక్. ముగ్గురూ జాజ్లోని మూడు పాయలను సీక్రెట్ లేక్లోని యాంఫీథియేటర్పై సంగమింపజేశారు! పాప్-జాజ్-రాక్-పొయెట్రీల మేళవింపుతో స్వీయముద్రను వే సే ఇండిపెండెంట్ జాజ్ను ‘ఇండిజాజ్’ అంటారు కదా. ఇందులో తమదైన ప్రత్యేకతను చాటుతూ రాక్ సంగీతంలోని నిర్ణిద్ర శక్తిని, పాప్ సాహిత్యాన్ని స్ఫురింపజేసే రాగాలను, పోర్చుగీస్ జానపద సంగీతంలోని మధురిమలను ఏకీకృతం చేస్తూ ఈ ముగ్గురు 1996లో ‘జాజ్ ట్రియో’ గా ఏర్పడ్డారు. ‘అజుల్’ ఆల్బమ్తో ప్రారంభించి, ట్విస్ట్, లుక్ వాట్ దె హావ్ డన్ టు మై సాంగ్... తదితర ఆల్బమ్లతో పదిహేడు సంవత్సరాలుగా ‘ట్రియో’ ఇస్తోన్న ప్రదర్శనలు అమెరికా, యూరప్ దేశాల్లో నిత్యనూతనంగా విజయవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్ముల్లర్ భవన్-గోథె జంత్రమ్ల ఆహ్వానంపై రెండు వారాలుగా ఢాకా, కోల్కతా, ముంబై, పుణె, త్రివేండ్రం, చెన్నైలు పర్యటిస్తూ హైదరాబాద్లో ముగింపు కచేరీకి విచ్చేశారు. కార్లోస్ బైకా రచయిత, స్వరకర్త. తాను రచించిన సాంగ్బుక్ తర్వాత మరో పాటల పుస్తకం ఎందుకు తీసుకురాలేదు అనే ప్రశ్నకు ‘ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక పాటే పాడగలరు’ అంటారు. అన్నట్లు ఆయన పాటల్లో పదాలుండవు. రాగాలే. ఆ శబ్దసౌందర్యంతో శ్రోతలు తమవైన పదాలను ఊహించుకుంటారు! ‘రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు’ అన్నట్లుగా మరచిపోవడం సాధ్యం కాని పదరహిత ప్రవాహాలు! ఏడాది క్రితం తాను స్వరపరచిన ‘థింగ్స్ ఎబౌట్’ ఆల్బమ్ బెస్ట్ పోర్చుగీస్ ఆల్బమ్గా ఎంపికైంది. డబుల్ బాస్పై ‘బో’వాడకుండా చేతి వేళ్లతో కార్లోస్ పలికించిన మంద్ర స్థాయిలోని స్వరాలు చిరుగాలికి నీటిలో సద్దుమణిగిన అలల సవ్వడిని గుర్తు చేశాయి. కార్లోస్ డబుల్ బాస్కు ఫ్రాంక్ మోబస్ గిటార్తో హృద్యంగా సమన్వయపరచడం, జిమ్బ్లాక్ రిథమిక్ డ్రమ్మింగ్ ఒక ‘క్లాసిక్’ ఎక్స్పీరియన్స్! - పున్నా కృష్ణమూర్తి -
గోల్కొండ భోనాలు ప్రారంభం