graduates
-
భారత గ్రాడ్యుయేట్ల కోసం...గోల్డ్ కార్డు కొనండి
వాషింగ్టన్: హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే ప్రతిభావంతులైన భారత పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చేందుకు గోల్డ్ కార్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమెరికా కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 50 లక్షల డాలర్లు (రూ.43.67 కోట్లు) చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే అమెరికా పౌరసత్వమిస్తామని ఆయన తాజాగా ప్రకటించడం తెలిసిందే. ‘‘అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే భారత్, చైనా, జపాన్ విద్యార్థులకు ఇక్కడి కంపెనీలు ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్లు ఇచ్చి నిలుపుకునే అవకాశం ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో లేదు. దాంతో వారు స్వదేశాలకు వెళ్లి వ్యాపారాలు ప్రారంభించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారి కోసం అమెరికా కంపెనీలే ఇకపై గోల్డ్ కార్డు కొనుగోలు చేయొచ్చు. తద్వారా వారికి ఉపాధి కల్పించి అట్టిపెట్టుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. గోల్డ్ కార్డు పథకం రెండు వారాల్లో అమల్లోకి రానుంది. -
గ్రాడ్యుయేట్లను నమ్మలేం.. టీచర్లను ‘చూడండి’
సాక్షి, అమరావతి: మరో మూడ్రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో టీడీపీ కూటమిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రెండ్రోజుల క్రితం జరిగిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష సందర్భంగా చెలరేగిన నిరుద్యోగుల ఆగ్రహజ్వాల రాష్ట్రవ్యాప్తంగా ఎగసిపడుతుండడమే ఇందుకు కారణం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ఎన్డీఏ కూటమి నేతలు టీచర్లకు వల వేస్తున్నారు. ఉద్యోగులుగా ప్రభుత్వ పక్షాన ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా టీచర్ల ఓట్లతో గెలవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. కృష్ణా–గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం టీచర్లనే టార్గెట్ చేశారు. ఒక్కో కుటుంబంలో కనీసం ముగ్గురు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారన్న అంచనాతో ముందుకెళ్తున్నారు. బాయ్కాట్ ఎలక్షన్.. బాయ్కాట్ కూటమి.. 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని, గ్రూప్–2 రోస్టర్లో తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, తమ ప్రభుత్వం ఏర్పడగానే ఈ తప్పును సరిచేసి న్యాయం చేస్తామన్నారు. ఇదే అంశంపై టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేపాడ చిరంజీవి తనకు ఓటువేసి గెలిపిస్తే ఈ సమస్యపై పోరాడతానంటూ యువతను ఆకట్టుకున్నారు. దీంతో ఉద్యోగార్థులంతా చిరంజీవిని గెలిపించారు.అయితే.. గెలిచాక అదే వ్యక్తి గ్రూప్–2 రోస్టర్లో తప్పుల్లేవని చెప్పడంతో గ్రాడ్యుయేట్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గత మూడు వారాలుగా ఆందోళన బాట పట్టారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయరాదని నిరుద్యోగులు గట్టిగా నిర్ణయించుకుని ‘బాయ్కాట్ ఎలక్షన్.. బాయ్కాట్ కూటమి అభ్యర్థి’ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ల నుంచి ఓట్లుపడే ఛాన్స్లేదని భావించిన టీడీపీ కూటమి తాజాగా టీచర్లను టార్గెట్ చేసింది. ‘మా ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుంది. తర్వాత మీ ఇష్టం’ అంటూ వారిని భయపెడుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ సంఘాలు ఈ బాధ్యత తీసుకుని టీచర్లతో ఓట్లు వేయించాలని చెబుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్ల ఫైర్.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వ వంచనపై గ్రాడ్యుయేట్స్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదాపై చివరివరకు తమను తప్పుదోవ పట్టించి తమ జీవితాలతో ఆడుకున్న సర్కారుకు ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని మండిపడుతున్నారు. నిజానికి.. రోస్టర్పై గతేడాది వేపాడ చిరంజీవితో కొన్నాళ్లు డ్రామా ఆడించి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ లాభపడింది.ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. అలాగే, గ్రాడ్యుయేట్లను పక్కదారి పట్టించేందుకు రెండుసార్లు మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. కానీ, రోస్టర్ అంశం వారికే చుట్టుకుంది. రోస్టర్లో తప్పులున్నాయని చెప్పారు కాబట్టి, ఇప్పుడా తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో మంత్రులు పరీక్షకు ఒకరోజు ముందు వాయిదాపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కానీ, పరీక్ష వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో ప్రభుత్వం తమను మోసంచేసేందుకు డ్రామా ఆడుతోందని అభ్యర్థులు నిర్ణయానికొచ్చారు. టీడీపీ కూటమికి మా సత్తా చూపిస్తాం.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా కలచివేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూటమి నాయకుల మాటలు నమ్మి గతేడాది జూలైలో జరగాల్సిన పరీక్షను వాయిదా వేయించి, దాదాపు 8 నెలల కాలాన్ని వృధా చేశారని.. ఫలితంగా దాదాపు 72 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగావకాశం కోల్పోయారని వాపోతున్నారు. తమను నిలువునా ముంచిన టీడీపీ కూటమికి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.పైగా.. ‘ప్రభుత్వం మొదటి నుంచి చాలా క్లియర్గా ఉంది. మనమే గమనించలేకపోయాం. మన టైం మొత్తం వృధా చేయించి పరీక్ష అంశాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్పైకి నెట్టేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఇక్కడ వాడారు. అంతే..’ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. ‘ఒక ఎగ్జామ్ను కంట్రోల్ చేయలేకపోయారు. వీరు మన జీవితాలను బాగుచేస్తారా? స్వర్ణాంధ్రను సృష్టిస్తారా?’ అంటూ మరొకరు పోస్టు చేశారు. ‘మా ఆశలను, కలలని, మా భవిష్యత్తును చంపుతున్నారు. మేమూ మీ ఆశలను, కలలను, భవిష్యత్తును చంపగలం. ఆట మీరు మొదలుపెట్టారు. మేము ముగిస్తాం’.. అంటూ మరొకరు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. -
దయాగుణం కలిగి ఉండండి
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి. దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
బ్యాంకుల్లో అప్రెంటిస్లుగా గ్రాడ్యుయేట్లు
ముంబై: గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగావకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా కీలక ప్రకటన చేశారు.అప్రెంటిస్లుగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా శుక్రవారం తెలిపారు. 12 నెలల అప్రెంటిస్షిప్లో భాగంగా అభ్యర్థులకు ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. వీరికి నెలకు రూ.5,000 స్టైపెండ్ను బ్యాంకులు చెల్లిస్తాయని మెహతా వెల్లడించారు.‘నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం లేని మార్కెటింగ్, రికవరీ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారికి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. 21–25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థి పన్ను చెల్లింపుదారు కాకూడదు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి డిగ్రీని కలిగి ఉండకూడదు.బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకువెళ్లే అప్రెంటిస్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా కూడా నియమించుకోవచ్చు. శిక్షణ పూర్తి అయ్యాక వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశమూ ఉంది. అన్ని బ్యాంకులు నెలరోజుల్లోగా అప్రెంటిస్లను నియమించుకోనున్నాయి. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా ఉంది’ అని చెప్పారు. అయితే ఎంత మందిని అప్రెంటిస్లుగా చేర్చుకుంటారనేది వెల్లడి కాలేదు. ఐబీఏ ఈ స్కీమ్పై కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీతో గురువారం చర్చించింది. -
గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ
భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. -
పాతికేళ్లలోపు వారికి.. ఉద్యోగాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, ఇంజనీరింగ్ వంటివి పూర్తికాగానే ఏదో ఓ ఉద్యోగం కోసం వెతుకులాట తప్పదు. కొందరు పైచదువులకు వెళ్లినా చాలా మంది ఉద్యోగం కోసం చూస్తుంటారు. కానీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. దేశంలో పాతికేళ్ల వయసులోపు పట్టభద్రుల్లో 42శాతం మంది ఇలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారే. 25 ఏళ్లు దాటినవారిలోనూ 15శాతం మంది నిరుద్యోగులే. కోవిడ్ నాటి పరిస్థితులు దాదాపు చక్కబడినా, భారత్ ఆర్థిక వృద్ధి వేగవంతమైందన్న అంచనాలున్నా.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత శాతం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. అదే 35ఏళ్లు పైబడిన గ్రాడ్యుయేట్లలో 5 శాతమే నిరుద్యోగం ఉందని అంటున్నారు. ‘‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023: సోషల్ ఐడెంటీస్ అండ్ లేబర్ మార్కెట్ ఔట్ కమ్స్’’పేరిట అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘జాతీయ గణాంక సంస్థ, జాతీయ ఆర్థిక, కుటుంబ ఆరోగ్య సర్వేలు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా, ఎంప్లాయ్మెంట్–అన్ ఎంప్లాయ్మెంట్ తదితర నివేదికల ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రేమ్జీ వర్సిటీ నివేదికలో ఏముందంటే.. ♦ అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యయన నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. దీర్ఘకాలికంగా చూస్తే భారత్లో జీడీపీ వృద్ధికి–ఉద్యోగాల వృద్ధికి సంబంధం లేకుండా పోయింది. వేగంగా జీడీపీ వృద్ధి సాధించేందుకు అనుసరించే విధానాలు వేగంగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడటం లేదు. ♦ కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో.. జీవనం గడిపేందుకు మళ్లీ వ్యవసాయం, స్వయం ఉపాధి వైపు మళ్లారు. దీనితో ఈ రెండు రంగాల్లో 2020 ఏప్రిల్–జూన్ మధ్య ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత పురుషులకు సంబంధించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోవిడ్ ముందటి కాలానికి చేరుకోగా.. మహిళలకు కొంత మేర మాత్రమే అవకాశాలు వచ్చాయి. ♦ వ్యవస్థీకృత మార్పుల ప్రభావంతో.. కరోనా అనంతర కాలంలో వ్యవసాయం నుంచి పురుషులు వైదొలిగినా, నిర్మాణ రంగంలో అవకాశాలు వచ్చాయి. కానీ మహిళలు మాత్రం వర్క్ఫోర్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే 2004 నుంచీ స్తంభించిపోయిన మహిళా ఉద్యోగిత శాతం.. 2019 తర్వాతి నుంచి కొంతమేర పెరిగింది. ♦ 2004లో క్యాజువల్ వేజ్ వర్కర్లతోపాటు వారి వారసులలో 80శాతం మంది అదే ఉపాధిలో ఉండగా.. 2019 నాటికి చాలా వరకు మార్పు వచ్చింది. కానీ ఎస్సీ, ఎస్టీవర్గాల్లో మాత్రం అలాగే కొనసాగుతోంది. అంతేకాదు 20 మందికిపైగా ఉద్యోగులున్న సంస్థల యజమానుల్లో ఎస్సీ, ఎస్టీలు చాలా తక్కువగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. చాలా రంగాల్లో ఇప్పటికే పనిచేస్తున్న అనుభవజు్ఞలైన ఉద్యోగులనే కొనసాగిస్తున్నారు. చాలా దేశాల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచుతున్నారు. సంస్థల మూసివేతలు పెరుగుతున్నాయి. యువకులకు శిక్షణనిచ్చి, వారి నుంచి ఉత్పాదక పెంచే సేవలు అందుకోవడానికి జాప్యమయ్యే పరిస్థితిలో నైపుణ్యాలున్న పాతవారినే కొనసాగిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ మహమ్మారి ప్రభావం చిన్న, మధ్యతరహా సంస్థలపై తీవ్రంగా పడింది. వాటిలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉపాధి కోల్పోవడంతో ఆ వర్గాల్లో నిరుద్యోగం పెరిగింది. – డి.పాపారావు, ఆర్థిక, సామాజిక రంగాల విశ్లేషకులు నైపుణ్యాల కొరతతోనూ సమస్య దేశంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇంగ్లిష్లో తగిన ప్రావీణ్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం, నైపుణ్యాలను పెంచుకునే అవకాశం వారికి తక్కువ. చిన్నదైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు, డిగ్రీ వంటివి పూర్తికాగానే డెలివరీ బాయ్స్, కాల్ సెంటర్ ఉద్యోగాలు వంటివి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురుచూడక తప్పడం లేదు. యువతలో నైపుణ్యాల కల్పనతోపాటు బీకామ్, బీఎస్సీ, బీఏ వంటి కోర్సులు చదివిన వారికి కూడా ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. – రమణ భూపతి, క్వాలిటీ థాట్గ్రూప్ చైర్మన్ , ఎడ్టెక్ కంపెనీ -
భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై భారత్లో మెడికల్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో కూడా ప్రాక్టిస్ చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యూకేషనల్ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC) పది సంవత్సరాల వరకు గుర్తింపు పొందింనట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గుర్తింపుతో భారత్లో వైద్య విద్యనభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో ఇప్పటికే దేశంలో ఉన్న 706 మెడికల్ కాలేజీలతోపాటు రాబోయే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలలు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు పొందనున్నాయి. దీని వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుపడటమే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అపార అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా ఎన్ఎమ్సీలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు యోగేందర్ మాలిక్ మాట్లాడుతూ.. WFME గుర్తింపుతో భారతీయ వైద్య విద్య అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దీనివల్ల భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీన్ను కొనసాగించవచ్చని తెలిపారు. ఎన్ఎమ్సీ అంతర్జాయంగా గుర్తింపు పొందడం ద్వారా విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలు ఆకర్షిస్తాయని చెప్పారు. కాగా డబ్ల్యూఎఫ్ఎమ్ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విధ్యను అందించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనుంది. చదవండి: గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ -
వేలాది ఉద్యోగాల కోత మాత్రమేనా..అమెజాన్ మరో సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక మాంద్యం హెచ్చరికల మధ్య టెక్ దిగ్గజం అమెజాన్ మరో కీలకనిర్ణయం తీసుకుంది. పదివేలకుపైగా ఉద్యోగులకు ఉద్వాసన పలకడమేకాదు.. కొత్త నియామకాలను కూడా ఆలస్యం చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జాయిన్ కావాల్సిన యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల జాయింనింగ్స్ కూడా వాయిదా వేసుకుంది. (చదవండి: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!) తాజా నివేదికల ప్రకారం అమెజాన్లో కొత్త నియామకాలు 2023, మే నాటికి ప్రారంభం కావాల్సిఉంది. కానీ ప్రస్తుత గ్లోబల్ మాంద్యం పరిస్థితుల కారణంగా ఈ నియామకాలను 2023 చివరి వరకు పొడిగిస్తోందని తెలుస్తోంది. ఈమేరకు వారికి ఇంటర్నల్ మెయిల్లో సమాచారం అందించిందట. ఆర్థిక సవాళ్ల దృష్ట్యా, నియామకాలలో కొందరికి ప్రారంభ తేదీలను ఆరు నెలల వరకు ఆలస్యం చేస్తున్నామనీ, అలాగే ఆలస్యం కారణంగా ప్రభావితమైన కొత్త ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తామని కూడా అమెజాన్ తెలిపింది. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిబంధనలకు కట్టుబడి ఉన్నామంటూ వారికి ఈ మెయిల్ సందేశాన్ని పంపింది. అంతేకాదు కంపెనీలో జాయిన్ అయ్యారా లేదా అనేదానితో సంబంధం లేకుండా 13వేల డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఒకేసారి చెల్లింపును అందుకుంటారని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. (ఇది కూడా చదవండి: నథింగ్ స్మార్ట్ఫోన్ (1)పై బంపర్ ఆఫర్: ఏకంగా 22 వేల తగ్గింపు ) కాగా వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్షలో భాగంగా, సర్దుబాట్లలో భాగంగా అమెజాన్ ఉద్యోగుల తొలగింపులకు నిర్ణయించింది. రిటైల్ , మానవ వనరుల విభాగాలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత తాజా పరిణామం సంచలనంగా మారింది. మరోవైపు ఉద్యోగుల కోతను సమర్ధించుకున్న అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ 2023లో మరిన్ని తొలగింపులు ఉంటాయనే సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. -
టీడీపీ దొంగాట!.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వక్రబుద్ధి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్టీచింగ్ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. దీనికి తిరుపతి కేంద్రంగా వ్యవహారం నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనీయకుండా అత్యంత చాకచక్యంగా ముందుకు నడుపుతున్నట్టు సమాచారం. మార్ఫింగ్ చేసి.. నమోదు చేసి టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ నేతలకు సంబంధించిన పాఠశాలలు, కళాశాలలను ఎమ్మెల్సీ ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటున్నారు. యూజీసీ జాబితాలో లేని యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని ఎంచుకుంటున్నారు. వారికి ఎంతో కొంత డబ్బులిచ్చి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నట్టు సమాచారం. అందులో టీడీపీ నేతలు తాము ఎంచుకున్న కళాశాలలు, పాఠశాలల సిబ్బంది ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసేపనిలో నిమగ్నమైనట్టు ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆపై వారికి అనుకూలంగా ఉన్న గెజిటెడ్ అర్హత లేని ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతోనే సంతకాలు చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, మండల స్థాయిలో విచారణాధికారులు అత్యంతపటిష్టంగా ఓటర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలోని ఓ విద్యాసంస్థలో 54 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 18 మంది మాత్రమే. మిగిలిన వారు నాన్ టీచింగ్ సిబ్బంది. వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. నాన్ టీచింగ్ సిబ్బందిని ఉపాధ్యాయులుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రగిరి పరిధిలోని ఓ కన్వెన్షన్ హాల్లో రెండు రోజుల క్రితం టీడీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మండల, గ్రామస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను చేర్పించాలని కోరారు. ‘మీకెంత కావాలి?.. డబ్బులు కాకుండా ఇంకేమైనా కావాలా?’ అని అడిగారు. ఎక్కువ మంది డబ్బే డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం హాజరైన వారందరికీ మందు, విందు ఏర్పాటు చేశారు. టీడీపీ అడ్డదారులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ప్రక్రియ సమయం దగ్గరపడుతుండడంతో టీడీపీలో హడావుడి మొదలైంది. తమకు అనుకూలంగా ఓట్లు వేయించే వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఆ పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు పక్కాప్రణాళికలు రచించారు. అనర్హులను ఓటర్లుగా నమోదుచేసే ప్రక్రిను దిగ్విజయంగా పూర్తిచేసేపనిలో తలమునకలయ్యారు. చిత్తూరుకు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళా శాలలో దాదాపు 35మంది పనిచేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 12 మంది మాత్రమే. కానీ మొత్తం మందిని ఓటర్లుగా చూపేందుకు అక్కడ టీడీపీ నేతలు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. పూతలపట్టుకు సమీపంలోని ఓ ప్రయివేటు కళాశాలలో 17 మంది సిబ్బంది దాకా పనిచేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 8 మంది మాత్రమే. మిగిలిన వారు అనర్హులైనా ఓటర్లుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. గూడూరులో ప్రముఖ విద్యాసంస్థలో మొత్తం 43 మంది వరకు పనిచేస్తుండగా అందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 25 మంది మాత్రమే. కానీ అక్కడ టీడీపీ నేత ఒకరు సిబ్బంది అందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని సదరు యాజమాన్యానికి హుకుం జారీచేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 14 మంది సిబ్బంది ఉండగా అందులో ఎమ్మెల్సీ ఓటు హక్కుకు అర్హులు 08 మంది మాత్రమే. స్థానికంగా టీడీపీ నేత దగ్గరుండి అందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించే పనిలో ఉండడం గమనార్హం. ప్రచారంలో బిజీబిజీ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పురాయలసీమ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు శ్యాంప్రసాద్రెడ్డి, చంద్రశేఖరరెడ్డి దూసుకుపోతున్నారు. అయితే టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన రాకముందే ఆ పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతూ అడ్డదారులు తొక్కడం విమర్శలకు తావిస్తోంది. -
కొత్త పట్టభద్రులకు కొలువులే కొలువులు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఈ ఏడాది రెండో అర్ధభాగం(జూలై–డిసెంబర్ మధ్యకాలం)లో కొత్త పట్టభద్రుల (ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్)కు 59 శాతం కంపెనీ లు, పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీమ్లీజ్ ఎడ్టెక్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించి న ‘కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్’పేర్కొంది. ఇది ఈ ఏడాది తొలి అర్ధభాగంకన్నా 12% అధి కంగా ఉండనుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 865 కంపెనీలు, 18 పరిశ్రమలు, 14 ప్రదేశాల్లో అందుబాటులోకి రానున్న ఉద్యోగ అవకాశాలను విశ్లేషిస్తూ నివేదికను రూపొందించినట్లు టీమ్లీజ్ ఎడ్టెక్ తెలిపింది. అత్యధికంగా ఐటీ రంగం 65% మంది ఫ్రెషర్లను తీసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తుండగా ఈ– కామర్స్ రంగం 48%, టెలికమ్యూనికేషన్స్ రంగం 47% మంది కొత్త పట్టభద్రులకు ఉద్యో గాలివ్వాలని భావిస్తున్నట్లు నివేదిక వివరించింది. అవకాశాలు పెరిగాయి... దేశంలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల కల్పన గణనీయంగా మెరుగైంది. విద్యారంగం, పరిశ్రమల మధ్య సమన్వయం వల్ల నవతరం మంచి నైపుణ్యాలతో బయటకు వస్తోంది – శంతనూ రూజ్, సీఈవో, వ్యవస్థాపకుడు టీమ్లీజ్ ఎడ్టెక్ -
అత్యధికులు విద్యాధికులే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులు ఉన్నారు. ఎండీ (జనరల్) ఒకరు, పీహెచ్డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్లు, బీటెక్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఎనిమిది మంది గ్రాడ్యుయేట్లు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు ముగ్గురు, పదో తరగతి వరకు చదివిన వారు ఇద్దరున్నారు. ► పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడు. ఆయన ఎండీ (జనరల్ మెడిసిన్) చదివారు. ► విద్యుత్, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ చదివాక.. సోషియాలజీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. ► వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలు పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించారు. ► మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ ఎమ్మెస్సీ చదివి.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్పై పీహెచ్డీ చేస్తున్నారు. ► వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ఎంబీఏ చదివారు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు బీటెక్ చదివారు. ► జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. హోంమంత్రిగా ఎస్సీ మహిళలు.. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా మహిళను నియమించడం అదే తొలిసారి. అలాగే, 2019, మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన కేబినెట్లో హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ మేకతోటి సుచరితకు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళను నియమించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఇక పునర్వ్యవస్థీకరణ ద్వారా సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా మళ్లీ ఎస్సీ వర్గానికే చెందిన మహిళ తానేటి వనితను నియమించడం గమనార్హం. -
వైద్య విద్య కఠినతరం .. ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో నాసిరకమైన వైద్య విద్యకు చెక్ పెట్టేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశాల్లో నాణ్యమైన ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికే మన దేశంలో శాశ్వత మెడికల్ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఏ దేశంలోనైనా గుర్తింపు పొందిన వైద్య కాలేజీల్లోనే చదవాలని విద్యార్థులకు సూచించింది. మన దేశంలో మాదిరిగా వైద్య విద్య కోర్సు (నాలుగున్నరేళ్లు), ఇంటర్న్షిప్ (ఏడాది) రెండూ కలిపి ఐదున్నరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. విద్యార్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయాలి. కోర్సు పూర్తయి వచ్చాక, స్వదేశంలో మరో 12 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఎగ్జిట్ పరీక్షలో పాసై తీరాలి. పదేళ్లలోపే ఎంబీబీఎస్ కోర్సు, ఇంటర్న్షిప్ మొత్తం పూర్తిచేయాలి. అప్పుడే మనదేశంలో రిజి స్ట్రేషన్కు, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లేదా ఏదైనా ఆసుపత్రిలో పనిచేయడానికి వీలుపడుతుందని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. చదవండి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం సీటు రాక .. తక్కువ ఫీజుతో.. ఈ ఏడాది 15.44 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, దాదాపు 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కానీ, మన దేశంలో కేవలం 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 5,200 బీబీఎస్ సీట్లున్నాయి. కానీ 20 వేల మందికిపైగా నీట్ అర్హత సాధించి ఉంటా రని అంచనా. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.50 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ.23 లక్షల వరకు ఉంటోంది. విదేశాల్లో చదివితే రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలవుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా, పాకిస్తాన్ ల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎఫ్ఎంజీఈ ఉత్తీర్ణత 14 శాతమే... విదేశాల్లో ఎంబీబీఎస్ అంత నాణ్యతతో ఉండటం లేదన్న అభిప్రాయం ఉంది. పలు దేశాల్లో చదివి వచ్చినవారు అనేకమంది ఇక్కడ రిజిస్ట్రేషన్కు ముందు రాసే పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోవడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మనదేశంలో ప్రాక్టీస్ చేసేలా లైసెన్స్ పొందడానికి మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలకు 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, కేవలం 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే 14.22 శాతమే ఉత్తీర్ణులయ్యారన్నమాట. చైనా, రష్యా, ఆయా దేశాల్లో చదివినవారు చాలా తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారని కేంద్రం తెలిపింది. ప్రతి విద్యార్థికీ ఈఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు అవకాశముంటుంది. కొత్త నిబంధనల మేర కు విదేశాల్లో వైద్యవిద్య ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు నాణ్యమైన విద్యకు తోడ్పాటు ఎన్ఎంసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విదేశాల్లో నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించడానికి తోడ్పడతాయి. తద్వారా ఇక్కడ ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసవడానికి, ప్రాక్టీస్ చేయడానికి వీలుకలుగుతుంది. మన దేశంలో మాదిరి కోర్సు కాలవ్యవధి, ఇలాంటి సిలబస్ ఉన్న వియత్నాంలో చదివేం దుకు అడ్మిషన్ తీసుకున్నా. – నర్మద తూతూ మంత్రం చదువుకు చెక్ కొన్ని విదేశీ మెడికల్ కాలేజీలు తూతూమంత్రంగా చదువుచెప్పి మన విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ఎన్ఎంసీ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. – డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ -
కొలువుల చదువులు.. నైపుణ్యాభివృద్ధికి ఇంటర్న్షిప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి ఫలాలు విద్యార్థులకు అందేలా కార్యాచరణ రూపొందించారు. డిగ్రీ పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకొనేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమల్లోకి తెస్తున్నారు. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేయించారు. మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్షిప్ చేసేలా కోర్సులను రూపొందించారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానిస్తున్నారు. విద్యార్థులు తమ కోర్సులతో సంబంధమున్న అంశాల్లో అందుబాటులో ఉన్న సంస్థలో ఇంటర్న్షిప్ చేయవచ్చు. ఇందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్లోని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)లో వీటిని పొందుపరుస్తారు. జిల్లాలవారీగా ఈ సంస్థలను ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పెడతారు. జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగానే జిల్లాలోని కంపెనీలను సంప్రదించి, ఇంటర్న్షిప్కు ఏర్పాట్లు చేస్తాయి. ఇంటర్న్షిప్ కోసం విద్యార్థులు కోఆర్డినేటర్ల సహకారంతో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సంస్థలు వాటికి అవసరమైన సంఖ్యలో విద్యార్థులకు ఇంటర్న్షిప్లో అవకాశం కల్పిస్తాయి. మైక్రో నుంచి మెగా సంస్థల వరకు.. ఇంటర్న్షిప్కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఇందులో మాన్యుఫాక్చరింగ్, సర్వీసు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ ద్వారా ఆయా సంస్థలకు కూడా మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. ఉభయ ప్రయోజనకరంగా ఈ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. మరోపక్క విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను పెంపొందించడానికి ఉన్నత విద్యా మండలి కమ్యూనిటీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. సమాజంపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు అక్కడి సమస్యలకు తాము నేర్చుకున్న విఙ్ఙానం ద్వారా పరిష్కారాలను అన్వేషించేలా చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సమస్యలను అధిగమించే తత్వం ఏర్పడుతుంది. ఇంటర్న్షిప్ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన సంస్థలు జిల్లా పేరు మైక్రో స్మాల్ మీడియం లార్జ్ మెగా మొత్తం అనంతపురం 1,631 962 65 107 14 2,779 చిత్తూరు 1,453 1,443 107 232 34 3,269 తూర్పు గోదావరి 1,031 971 67 150 16 2,235 గుంటూరు 1,436 1,252 43 67 7 2,805 కృష్ణా 1,134 1,018 77 131 5 2,365 కర్నూలు 619 524 28 59 11 1,241 ప్రకాశం 1,118 1,813 35 45 1 3,012 నెల్లూరు 726 688 58 121 15 1,608 శ్రీకాకుళం 778 603 16 30 11 1,438 విశాఖపట్నం 788 1,041 139 317 36 2,321 విజయనగరం 543 376 17 43 6 985 పశ్చిమ గోదావరి 832 794 57 87 4 1,774 వైఎస్సార్ కడప 799 441 9 29 9 1,287 మొత్తం 12,888 11,926 718 1,418 169 27,119 వీటిలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ విభాగాల సంఖ్య ఇలా కేటగిరీ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీస్ మైక్రో 11,510 1,378 స్మాల్ 10,169 1,757 మీడియం 569 149 లార్జ్ 1,191 227 మెగా 144 25 ఇంటర్న్షిప్ కోసం వివిధ జిల్లాల్లో గుర్తించిన కొన్ని ముఖ్యమైన సంస్థలు 400 ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏపీ జెన్కో, తలారిచెరువు, అనంతపురం హ్యుందాయ్ ట్రాన్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కియా మోటార్స్ అనంతపురం విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ పిస్టన్ రాడ్ ప్లాంట్ అనంతపురం అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, కరకంబాడి, చిత్తూరు కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఎక్స్ట్రాన్ సర్వర్స్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు హీరో మోటోకార్్ప లిమిటెడ్, చిత్తూరు గుంటూరు టెక్స్టైల్ పార్కు, గుంటూరు జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గుంటూరు మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా ది కేసీపీ లిమిటెడ్ సిమెంటు యూనిట్, కృష్ణా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, కృష్ణా ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్, కృష్ణా గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, కర్నూలు ఎస్బీజీ క్లింటెక్ ప్రాజెక్టు కో ప్రైవేట్ లిమిటెడ్. కర్నూలు టీజీవీ స్రాక్ లిమిటెడ్, కర్నూలు అమ్మన్ ట్రై స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెల్లూరు ఎన్జీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు సెంబ్కార్్ప ఎనర్జీ లిమిటెడ్, నెల్లూరు అరబిందో ఫార్మా లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, శ్రీకాకుళం శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీకాకుళం స్మార్ట్కెమ్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, విశాఖపట్నం హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, విశాఖపట్నం ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్, విజయనగరం శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ లిమిటెడ్, విజయనగరం ఎస్ఎంఎస్ ఫార్మాస్యుటికల్స్ లిమిటెడ్, విజయనగరం నవభారత్ లిమిటెడ్, పశ్చిమగోదావరి పాండురంగ ఎనర్జీ సిస్టమ్ ప్రయివేటు లిమిటెడ్, పశ్చిమ గోదావరి వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమ గోదావరి ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వైఎస్సార్ కడప ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్, వైఎస్సార్ కడప టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్, వైఎస్సార్ కడప మిడ్వెస్ట్ నియోస్టోన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం జేసీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం కల్లామ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, ప్రకాశం పెరల్ డిస్టిలరీ లిమిటెడ్, ప్రకాశం ఇంజినీరింగ్ విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లులు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ 1. వ్యవసాయంలో నేల ఆరోగ్యం , పంట రీసైక్లింగ్ కోసం సిఫార్సు చేసే వ్యవస్థ అభివృద్ధి 2. వ్యవసాయం కోసం స్ప్రింక్లర్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు 3. అంటువ్యాధులకు సంబంధించి కంప్యూటర్ సహాయక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రూపకల్పన ------------ సివిల్ ఇంజనీరింగ్ 1. ల్యాండ్ స్లైడ్ల కోసం ప్రత్యేకంగా జియోసింథటిక్స్ ఉపయోగించి నేల స్థిరీకరణ 2. జీఐఎస్ ఉపయోగించి భూగర్భ జలాల గుర్తింపు 3. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి నివాస భవనంలో భూఉష్ణ శక్తి వినియోగం -------------- మెకానికల్ ఇంజనీరింగ్ 1. అగ్రికల్చరల్ పెస్టిసైడ్ స్ప్రేయర్ – కోవిడ్ శానిటైజేషన్ డ్రోన్ 2. గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం బయోగ్యాస్ కంప్రెషన్ - స్టోరేజ్ సిస్టమ్ 3. వ్యవసాయం కోసం స్కాచ్ యోక్ మెకానిజం ఉపయోగించి డ్యూయల్ సైడ్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ------------ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ 1. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా స్మార్ట్ అగ్రికల్చర్ విధానం, మాయిశ్చర్ హ్యుమిడీటీని గుర్తించడం 2. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్మార్ట్ రెస్క్యూ సిస్టమ్ 3. స్మార్ట్ మాస్క్ – సామాజిక దూర హెచ్చరిక --------------- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 1. వ్యవసాయ అవసరాల కోసం నేలలో నీటిశాతం, తేమను కనుగొనేందుకు సోలార్ పవర్తో నడిచే ఆటో ఇరిగేషన్ సిస్టమ్ వినియోగం 2. మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇ హెల్త్ కేర్ కంప్యూటింగ్ విధానం అనుసరణ 3. జిగ్బీ ఆధారిత సోలార్ పవర్ ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ సిస్టమ్ డిగ్రీ నాన్ప్రొఫెషనల్ విద్యార్థుల కోసం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ విద్యార్ధులకు కూడా వివిధ అంశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఆర్ట్స్ విద్యార్థులకు 51, కామర్స్ విద్యార్థులకు 50, సైన్సు విద్యార్థులకు 38 ప్రాజెక్టులు ఉంటాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, ఉమెన్, యూత్ ఎంపవర్మెంటుతో పాటు వివిధ క్యాంపుల నిర్వహణ అంశాలతో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఇదో విప్లవాత్మక కార్యక్రమం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువు పూర్తిచేసి బయటకు వచ్చేనాటికి వారిని సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్షిప్తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానిస్తున్నాం. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశారు. కాలేజీలు, పరిశ్రమలు, బిజినెస్ ఎంటర్ప్రయిజర్లను అనుసంధానం చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాం. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థి పూర్తి నైపుణ్యం సాధించేలా చేస్తాం. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమం. -
విద్యార్థులకు గుడ్న్యూస్ అందించిన మైక్రోసాఫ్ట్...!
సాంకేతిక నైపుణ్యాలు, ఉపాది అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడంకోసం మైక్రోసాఫ్ట్, ఫ్యూచర్ రెడీ టాలెంట్ వర్చువల్ ఇంటర్నషిప్ ప్రోగ్రాంను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను మైక్రోసాఫ్ట్ ఆహ్వనిస్తుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్నషిప్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చును. మైక్రోసాఫ్ట్ అజూర్ , గిట్హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...! ఈ ప్రోగ్రాంతో విద్యార్థులు గిట్హబ్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్ను యాక్సెస్ చేయవచ్చును. ఈ ప్రోగాంలో 2021 గ్రాడ్యుయేషన్ పూర్తైన విద్యార్థులు పాల్గొనవచ్చును. వారితో పాటుగా 2022, 2023లో గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గోనేందుకు మైక్రోసాఫ్ట్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఏదైనా స్పెషలైజేషన్ను కల్గిన విద్యార్థులు ఈ ప్రోగాంకు దరఖాస్తు చేసుకోవచ్చుని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఫ్యూచర్ రెడీ టాలెంట్ ‘https://futurereadytalent.in’ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ఇంటర్న్షిప్ వ్యవధి సుమారు 8 వారాల పాటు ఉండనుంది. మైక్రోసాఫ్ట్ తన లెర్నింగ్ ప్లాట్ఫామ్ మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్ సర్టిఫికేషన్లను విద్యార్థులకు అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. చదవండి: Startup: దేశంలోనే ఫస్ట్ ప్లేస్..స్టార్టప్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నగరం ఇదే! -
చట్టసభలను అధ్యయనం చేయాలనుకుంటున్నారా?
భారత పార్లమెంట్.. ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను అధ్యయనం చేయాలని, అవగాహన పెంచుకోవాలని కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. రాజ్యసభలో ఫెలోషిప్, ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యసభ దరఖాస్తులు ఆహ్వా నిస్తోంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఫెలోషిప్, ఇంటర్న్షిప్ల పూర్తి సమాచారం... ఆర్ఎస్ఆర్ఎస్ అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని వివిధ అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. 2009లో డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ చైర్ అండ్ రాజ్యసభ ఫెలోషిప్స్ పథకాన్ని రాజ్యసభ ఏర్పాటు చేసింది. దీనికి ‘రాజ్యసభ రీసెర్చ్ అండ్ స్టడీ’ (ఆర్ఎస్ఆర్ఎస్) స్కీమ్గా పేరుపెట్టారు. ఇందులో రాజ్యసభ ఫెలోషిప్లు నాలుగు, రాజ్యసభ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇంటర్న్షిప్లు పది అందిస్తున్నారు. వీటికి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యసభ ఇంటర్న్షిప్– అర్హతలు ► భారత పార్లమెంటులోని వివిధ విధానపరమైన అంశాలను..ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ ఇంటర్న్షిప్ లక్ష్యం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు రాజ్యసభ ఇంటర్న్షిప్కు అర్హులు. గ్రాడ్యుయేట్స్ ఐదుగురు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఐదుగురికి(మొత్తం 10 మంది) ఇంటర్న్స్గా అవకాశం కల్పిస్తారు. రాజ్యసభ సెక్రటేరియట్ ద్వారా సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఇంటర్న్స్ ఎంపిక జరుగుతుంది. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది. ► ఇంటర్న్షిప్కు ఎంపికైన విద్యార్థులను సచివాలయంలోని కీలకమైన లెజిస్లేటివ్ సెక్షన్, బిల్ ఆఫీస్, టేబుల్ ఆఫీస్, కమిటీ సెక్షన్స్ మొదలైన వాటిలో సంబంధిత బ్రాంచ్ సూపర్విజన్/మెంటారింగ్ కింద నియమిస్తారు. ఎంపికైన తేదీ నుంచి రెండు నెలలపాటు ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది. వీరికి నెలకు రూ.10వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. ► ఇంటర్న్షిప్ గడువు నాటికి ఇంటర్న్లు తాము చేసిన పని, నేర్చుకున్న అంశాలతో నివేదికను తమకు కేటాయించిన సూపర్వైజర్/మెంటార్కు సమర్పించాల్సి ఉంటుంది. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసినవారికి రాజ్యసభ నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. రాజ్యసభ ఫెలోషిప్– అర్హతలు ► మొత్తం నాలుగు ఫెలోషిప్స్ అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్ స్కీమ్ ద్వారా అభ్యర్థులు పార్లమెంటరీ సంస్థల పనితీరు, ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేస్తారు. సంబంధిత విద్యార్హత, సోషల్ సైన్స్, లా ఇతర సంబంధిత అంశాల్లో కనీసం మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు/అనుభవం గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఫిల్, పీహెచ్డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వీటికి మాజీ పార్లమెంటు సభ్యులు/రాష్ట్ర శాసనసభ సభ్యులు, పార్లమెంటు/రాష్ట్ర శాసనసభ సచివాలయాల మాజీ అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 25ఏళ్ల నుంచి 65ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ► కాలవ్యవధి: ఫెలోషిప్ 18 నెలల పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది. ► అధ్యయనం చేయాల్సిన అంశాలు: ప్రధాన చట్టాల మదింపు, పార్లమెంటరీ కమిటీల పనితీరు, ప్రధాన పార్లమెంటరీ కమిటీల సమర్థత, భారతీయ పార్లమెంట్లో సంస్థాగత/విధానపరమైన సంస్కరణలు, ఇతర కామన్వెల్త్ పార్లమెంట్ల ప్రత్యేకతలపై అధ్యయనం చేయాలి. రాజ్యసభ సెక్రటేరియట్ సూచించిన అంశాలపై కూడా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ► రీసెర్చ్ గ్రాంట్: రాజ్యసభ ఫెలోషిప్స్ కేవలం నలుగురు మాత్రమే పొందగలరు. ప్రతి ఫెలోషిప్కు రీసెర్చ్ గ్రాంట్గా రూ.8లక్షలను పలు దఫాలుగా అందిస్తారు. దీంతోపాటు మరో రూ.50 వేలు కంటిజెన్సీ ఫండ్గా ఇస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► రాజ్యసభ ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rksahoo.rs@sansad.nic.in ► రాజ్యసభ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rssei.rsrs@sansad.nic.in ► దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021 ► వెబ్సైట్: https://rajyasabha.nic.in/rsnew/ fellowship/felloship_main.asp -
పట్టభద్రుల చైతన్యం.. గణనీయంగా పెరిగిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులు చైతన్యం కనబరిచారు. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాలకు ఆదివారం నిర్వహిం చిన ఎన్నికల్లో గణనీయంగా పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 64.87 శాతం, వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 76.35% పోలింగ్ నమోదైనట్టు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. సాయంత్రం 4 తర్వాత జరిగిన పోలింగ్ను పరిగణనలోకి తీసుకుని ఆర్వోలు ఈ ప్రకటన చేశారు. అయితే, సాయంత్రం నాలుగు గంటల నాటికి హైదరాబాద్ స్థానానికి 59.96 శాతం, నల్లగొండ స్థానానికి 64.7 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో శశాంక్ గోయల్ ప్రకటించారు. సోమవారం కచ్చితమైన పోలింగ్ గణాంకాలను ప్రకటిస్తామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత తగ్గాక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్దసంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఉండటంతో నిబంధనల ప్రకారం వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని చోట్లలో రాత్రి 7 గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ పెట్టెలు రావాల్సి ఉందని, అప్పుడే స్పష్టమైన పోలింగ్ గణాంకాలు వెల్లడవుతాయని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి తెలిపారు. బ్యాలెట్ పెట్టెల్లో భవితవ్యం ‘హైదరాబాద్’మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్లను ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు. జంబో బ్యాలెట్ బ్యాక్సుల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. ఈ నెల 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ‘హైదరాబాద్’, నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ఓట్లను లెక్కించనున్నారు. పట్టిష్టమైన భద్రత ఏర్పాట్లతో బ్యాలెట్ పెట్టెలను ఆయా ప్రాంతాల్లో నిల్వచేశామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. ఓట్ల నమోదు నుంచి కనిపించిన చైతన్యం చివరిసారిగా 2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ‘హైదరాబాద్’స్థానానికి 39 శాతం పోలింగ్ జరగగా, తాజా ఎన్నికల్లో 64.87 శాతానికి పెరిగింది. అప్పటి ఎన్నికల్లో ‘నల్లగొండ’స్థానానికి 58 శాతం పోలింగ్ నమోదు కాగా తాజా 74 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో 2,96,318 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 5,31,268 మందికి పెరిగారు. నల్లగొండ స్థానంలో 2,81,138 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 5,05,565 మందికి పెరిగారు. గత ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో మార్పులు రావడం, భారీగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావడం, రాజకీయపార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం, ఆదివారం పోలింగ్ నిర్వహించడం వంటి కారణాలతో ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. హోంమంత్రిపై ఈసీకి నివేదిక టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి మేడమ్కు ఓటు వేశానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేసిన కామెంట్స్పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమర్పించిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. నివేదిక పరిశీలించి చర్యలపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
ఆశావహంగా ఉండండి..
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బైటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు ఆశావహంగాను, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తిగాను ఉండాలని టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. అంతే కాకుండా కొంత అసహనంగా కూడా ఉండాలని, దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం రాగలదని ఆయన పేర్కొన్నారు. 2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పిచాయ్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఈ స్నాతకోత్సవం ఇలా జరుగుతుందని మీరెవరూ ఊహించి ఉండరు. మీరు వేడుకగా జరుపుకోవడానికి బదులు కోల్పోయిన అవకాశాలు, తల్లకిందులైన ప్రణాళికల గురించిన ఆందోళనతో జరుపుకోవాల్సి వస్తోందని మీరు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆశావహంగా ఉండటం కష్టమే. కానీ ఆశావహంగా ఉండగలిగితే, ఈ ఏడాది గ్రాడ్యుయేట్లయిన మీరు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలరు. చరిత్రలో నిల్చిపోగలరు‘ అని సుందర్ చెప్పారు. మెరుగైన ప్రపంచం.. ఒక తరం సాధించిన పురోగతి మరో తరానికి పునాదిరాయి కాగలదని సుందర్ తెలిపారు. నేటి యువత ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పురోగతి సాధించాలంటే కాస్త అసహనం కూడా ఉండాలన్నారు. ‘కొన్ని టెక్నాలజీ సంబంధిత విషయాలు మీకు విసుగు తెప్పించవచ్చు. అసహనానికి గురిచేయొచ్చు. ఆ అసహనాన్ని కోల్పోవద్దు. దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం సృష్టి జరగొచ్చు, మా తరం కనీసం కలలో కూడా ఉహించని కొత్తవన్నీ మీరు నిర్మించవచ్చేమో. కాబట్టి అసహనంగా ఉండండి. ప్రపంచానికి అవసరమైన పురోగతి దాన్నుంచే వస్తుంది‘ అని సుందర్ పేర్కొన్నారు. నేనూ సవాళ్లు ఎదుర్కొన్నా.. గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తానూ పలు సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా సుందర్ చెప్పారు. తన చిన్నతనంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో ఉండేది కాదని, కానీ ప్రస్తుత తరం పిల్లలు కంప్యూటర్లతోనే పెరుగుతున్నారన్నారు. ‘నేను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా రావడం కోసం మా నాన్న దాదాపు ఏడాది జీతం వెచ్చించి విమానం టికెట్ కొనిచ్చారు. నేను విమానం ఎక్కడం అదే మొదటిసారి. నన్ను అక్కడ (భారతదేశం) నుంచి ఇక్కడి దాకా (అమెరికా) తీసుకొచ్చినది కేవలం అదృష్టం ఒక్కటే కాదు. టెక్నాలజీ అంటే నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలనే అభిలాష కూడా ఇందుకు కారణం‘ అని సుందర్ తెలిపారు. -
‘ఉపాధి హామీ’ వైపు నిరుద్యోగ యువత చూపు
లక్నో : కరోనా సృష్టించిన విధ్వంసం బడుగు జీవులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై.. పొట్ట చేత పట్టుకొని పట్టణ బాట పట్టిన వలస జీవులు తిరిగి పల్లెలకు తిరిగివచ్చేలా చేసింది. లాక్డౌన్తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రిటైల్ తదితర రంగాలు కుదేలు కావడంతో ఉపాధి కోల్పోయి సొంతూరుకు చేరుకున్న నిరుద్యోగులు ‘ఉపాధి హామీ’ పనులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దశాబ్ధంలోనే అత్యధికంగా, ఏప్రిల్ 1 నుంచి దాదాపు 35 లక్షల మంది పనులు లేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎమ్జీఎన్ఆర్ఈజీఏ)కింద దరఖాస్తు చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన 30 లక్షల మంది వలస కార్మికుల కుటుంబాలకు గ్రామీణ ఉపాధి పథకాన్ని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. అయితే వలస కార్మికులే కాకుండా నిరుద్యోగులు కూడా ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. యూపీ రాజధాని లక్నోకి150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునైద్పుర్ గ్రామానికి చెందిన రోషన్ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాడు. పీజీ చదువుకున్న రోషన్ రోడ్డు పనులు, పూడిక తీయడం వంటి పనులు చేయడానికి ముందుకొచ్చాడు. లాక్డౌన్తో ఉద్యోగం కోల్పోవడంతో ఇంటికొచ్చానని ఎంఏ డిగ్రీ చేసిన కుమార్ అన్నాడు. బీబీఏ డిగ్రీ పట్టా ఉన్నా, సరైన పని దొరకలేదు. చివరకు 6నుంచి 7వేల జీతం వచ్చే ఉద్యోగం దొరికినా, లాక్డౌన్తో అదికూడా పోయింది. అందుకే తిరిగి ఇంటికి వచ్చానని తెలిపాడు. తాను ఎంఏ, బీఈడీ పూర్తి చేశానని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగానే లాక్డౌన్ వచ్చిందని సుర్జిత్ కుమార్ అన్నాడు. దీంతో చేసేదేమీలేక ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. లాక్డౌన్తో ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటున్నారని జునైద్పుర్ గ్రామపెద్ద వీరేంద్ర సింగ్తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 14 కోట్ల మందికి ఎమ్జీఎన్ఆర్ఈజీఏ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 100 రోజుల పనిదినాలను కల్పించడానికి ఏడాదికి 2.8 లక్షల కోట్ల రూపాయలు అవసరం కానుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను తీసుకొచ్చింది. -
గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేదు
-
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీకానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రుల స్థానం నుంచి కె.స్వామిగౌడ్, ఉపాధ్యాయుల స్థానాల్లో మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గం నుంచి పి.సుధాకర్రెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి పూల రవీందర్ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి మే 1వ తేదీతో ఎంఎస్ ప్రభాకర్రావు పదవీకాలం పూర్తికానుంది. ఇక ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీల కోటాలో కె.రవికిరణ్వర్మ (గోదావరి జిల్లాల నియోజకవర్గం), బొడ్డు నాగేశ్వరరావు (కృష్ణా–గుంటూరు జిల్లాల నియోజకవర్గం), ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోటాలో జి.శ్రీనివాసులనాయుడు (ఉత్తరాంధ్ర జిల్లాల నియోజకవర్గం)ల పదవీ కాలం పూర్తికానుంది. అలాగే విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ప్రతి నిధిగా ఎన్నికైన ఎంవీవీఎస్ మూర్తి ఇటీవల మృతి చెందడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహిం చేందుకూ ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఇదీ షెడ్యూల్.. నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 25 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 5 నామినేషన్ల పరిశీలన: మార్చి 6 నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చి 8 ఎన్నికలు: మార్చి 22 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు) కౌంటింగ్: మార్చి 26 ఎన్నికల ప్రక్రియ పూర్తి: మార్చి 28లోపు -
అధిక వేతన ప్యాకేజ్లు వారికే..
సాక్షి, న్యూఢిల్లీ : ఇతర ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంలే అధిక వేతన ప్యాకేజీలను ఆకర్షిస్తున్నాయని ఓ సర్వే వెల్లడించింది. మెటిల్ ఆన్లైన్ టాలెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ నిర్వహించిన అథ్యయనంలో అగ్రశ్రేణి ఐఐఎం విద్యార్ధులే సగటు ఎంబీఏ గ్రాడ్యుయేట్తో పోలిస్తే 121 శాతం అధిక వేతన ప్యాకేజ్ పొందుతున్నారని తేలింది. ఇక టాప్ ఐఐటీల గ్రాడ్యుయేట్లు సగటు ఇంజనీర్, సీఎస్ , ఐటీ గ్రాడ్యుయేట్లతో పోలిస్తే137 శాతం అధిక ప్రారంభవేతనాలను పొందుతున్నారని వెల్లడించింది. ఇక వేతన ప్యాకేజ్ల్లో ఎన్ఐటీలను కొత్తగా ఏర్పాటైన ఐఐటీలు అధిగమిస్తున్నాయని, ఇక మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవడంతో టాప్ ఐఐటీ గ్రాడ్యుయేట్లకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 114 ఇంజనీరింగ్ కాలేజీలు, 80 మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో సర్వే చేపట్టారు. ఇక టెక్నాలజీ విభాగంలో అత్యధిక సగటు వార్షిక వేతనం రూ 14.8 లక్షలుగా నమోదైంది. జనరల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో దాదాపు 31 శాతం హైరింగ్ జరిగింది. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కంటే 118 శాతం అధికంగా వేతనాన్ని ఆఫర్ చేశారు. -
పాలిటిక్స్లోకి పట్టభద్రులు..!
వెంట నడిచే అనుచర గణం.. హోదా తెచ్చిపెట్టే అధికార దర్పం.. రాజకీయమంటే అదో ‘ప్రత్యేకమైన’ ఆసక్తి.. అందుకే పాలిటిక్స్లోకి వచ్చేందుకు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. డాక్టర్లు, ఇంజినీర్లు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారే కాదు.. విద్యావంతులు సైతం బరిలోకి దిగేందుకు ఎన్ని‘కలలు’ కంటున్నారు. విద్యాసంస్థల నిర్వాహకులు కూడా అధికార పీఠమెక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే కొందరు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగా.. మరికొందరు ఏదో ఒక పార్టీలో చేరి సార్వత్రిక ఎన్నికల సమరంలో తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, కామారెడ్డి: రాజకీయాల్లోకి వచ్చేందుకు విద్యా వంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు ఆస క్తి చూపుతున్నారు. అధికార పీఠమెక్కేందు కు అవసరమైన బాటలు వేసుకుంటున్నా రు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే పలువురు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు విద్యావంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు వివిధ రాజకీయ పా ర్టీల గొడుగు కిందకు చేరగా, ఇంకొందరు ఏదో పార్టీలో చేరడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం కావాలని యత్నిస్తున్నారు. ఎలాగైనా ఏదో ఒక పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. ఎల్లారెడ్డిలో పోటీ అధికమే.. ఇక, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెలే ఏనుగు రవీందర్రెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆయన భార్య మంజులారెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఈ నియోజక వర్గంలో తెలంగాణ జన సమితి పార్టీ నుంచి ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి భూ నిర్వాసితుల పక్షాన న్యాయపోరాటం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన రచనారెడ్డి ప్రొఫెసర్ కోదండరాం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ బృందంలో ఒకరుగా ఉన్నారు. ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ప్రొఫెసర్ కోదండరాం దగ్గర పరిశోధన విద్యార్థిగా ఉన్న లింగంపేట మండలానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు నిజ్జెన రమేశ్ కూడా ఎల్లారెడ్డి నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఎల్లన్నయాదవ్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర నాయకుడిగా నియోజక వర్గాన్ని చుట్టి వస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత హోదాలో అధికారిగా ఉన్న ఒకరు అధికార పార్టీ టికెట్ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బాన్సువాడ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న విద్యావంతుడు మల్యాద్రిరెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన గ్రూప్ వన్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్గౌడ్ కూడా రాజకీయాలపై ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జు క్కల్ నుంచి పోటీ చేయడానికి కొందరు ఆ సక్తి చూపుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుం చి సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తిరిగి బరిలో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నా యి. కాంగ్రెస్ నుంచి విద్యావంతురాలైన మాజీ ఎమ్మెల్యే అరుణతార పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరో ఇద్దరు విద్యావంతులు కూడా ఇతర పార్టీల వైపు చూస్తు న్నట్టు తెలుస్తోంది. జిల్లా రాజకీయాల్లో వి ద్యావంతులు, విద్యా సంస్థల యజమాను లు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుండడంపై అంతటా చర్చ జరుగుతోంది. రేసులో నిలిచేదెవరో..? జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాలపైనే ఎక్కువ మంది విద్యావంతులు దృష్టి సారించారు. అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలవడానికి పలువురు విద్యావంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు ఆరాటపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజక వర్గమైన జుక్కల్లో ఇప్పుడిప్పుడే ఒకరిద్దరు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తిరిగి బరిలో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయ నాయకురాలు సుమిత్రానంద్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గతంలోనే ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. ఈ సారి కూడా ఆమె ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఉంటారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నియోజక వర్గ ఇన్చార్జీగా కొనసాగిన, ప్రస్తుత ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్రెడ్డి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో నిలిచే అవాకశం ఉంది. అయితే, టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తిరిగి పోటీ చేయనుండడంతో టిక్కెట్ ఆశిస్తున్న వాళ్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ తిరిగి పోటీ చేస్తారని భావిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న విద్యావంతుడు డాక్టర్ మురళీధర్గౌడ్ కూడా కామారెడ్డి నియోజక వర్గంలో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ సారి టిక్కెట్ కోసం ప్రయత్నించవచ్చని చెబుతున్నారు. లేదంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. పట్టణంలో ఫ్రొబెల్స్ స్కూల్ యజమాని, జెడ్పీ మాజీ చైర్మన్ కేపీ వెంకటరమణారెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన కూడా కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ హరిస్మరణ్రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. అలాగే, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ ఇన్చార్జీగా కొనసాగుతున్న ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్ కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీకి దిగాలని, లేదంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో ఆర్కే డిగ్రీ కళాశాల నిర్వాహకుడు, గతంలో విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పని చేసిన ముస్కు జైపాల్రెడ్డి కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. -
పట్టభద్రులూ ఆలోచించి ఓటేయండి
- చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగం కానీ, భృతి కానీ ఇవ్వలేదు - ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు - ప్రభుత్వ వ్యతిరేకత తెలుపుతూ వెన్నపూసకు ఓటు వేయండి - పొరపాటు చేస్తే అధికారపార్టీ అరాచకాలు ఎక్కువవుతాయి - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం : 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయని చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి తరుణమని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఈ మూడేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అనేది పట్టభద్రులు ఆలోచించాలన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పల్లవి పాడిన చంద్రబాబునాయుడు ఈరోజు ప్రత్యేకహోదా నినాదాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. ఈ మూడేళ్లలో అధికారపార్టీ నాయకులు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం పొరబాటు చేసినా టీడీపీ అరాచకాలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, యువత అప్రమత్తం కావాలని సూచించారు. ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం తెలుసుకోవాలన్నా, వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమానికి మరింత ఊతం ఇవ్వాలన్నా వెన్నపూస గోపాల్రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వం తమపై వస్తున్న వ్యతిరేకతను గుర్తించి కాస్తోకూస్తో అయినా మంచి పనులు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ మొదటి ప్రాధాన్యత ఓటును గోపాల్రెడ్డికి వేయాలని కోరారు. -
గ్రాడ్యుయేట్లు, టీచర్లకు స్మార్ట్ఫోన్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో అధికార తెలుగుదేశంపార్టీ ఓట్ల కొనుగోలుకు తెరలేపింది. పట్టభద్రులకు ఒక్కో ఓటుకు రూ.4వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్, ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లకు రానుపోను చార్జీలు ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు డబ్బులు ఎరవేసి శనివారం రాత్రి నుంచి శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తనకు అనుకూలంగా ఓటు వేసే వారికి స్మార్ట్ ఫోన్లు, ఎన్నికల ఖర్చులు పంపిణీ ప్రారంభించింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల శాసనమండలి ఎన్నికలకు సోమవారంతో ప్రచారం గడువు ముగుస్తుంది. ఈ నెల 9వ తేదీ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్కు మూడు రోజులే గడువు ఉండటంతో అధికారపార్టీ ఓట్లు కొనుగోలు చేసే పనిలో పడింది. రాజధాని అమరావతి నిర్మాణంలో తెలుగుదేశంపార్టీ నుంచి వేల కోట్ల రూపాయల లబ్ధిపొందిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ టీడీపీ తరపున పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు పోటీచేస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, వాసుదేవనాయుడు తరపున ఓటర్లకు పంపిణీ చేయడానికి పెద్ద సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం నాటికి జిల్లాలో సుమారు 75వేల మొబైల్ ఫోన్లు చేరవేశారు. ఓటరు జాబితా ప్రకారం పట్టభద్రులకు స్థానిక టీడీపీ నాయకులు స్లిప్ అందజేస్తారు. ఓటర్లు ఆ స్లిప్ను నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న నాయకుడి వద్దకు తీసుకెళ్తే స్మార్ట్ ఫోన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులు తమ ప్రాంతానికి వచ్చి ఓటు వేయడంకోసం వారికి ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులకు డబ్బులు అందించేందుకు గాను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో నగదు సరఫరా అయింది. దీంతోపాటు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను చేర వేసేందుకు నియోజక వర్గానికి పది చొప్పున ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపాధ్యాయ ఓటర్లను ప్రలోభపెట్టడంకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కుదిరితే తాయిలాలు ఇవ్వడం, లేకపోతే బెదిరించి తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక ఓటర్లను చేజారనియొద్దు స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులను ఒక్కరిని కూడా చేజారకుండా చూసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లా నాయకులకు సూచించారు. ఆదివారం ఆయన పార్టీ అభ్యర్థి వాకాటి నారాయ ణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో ఎన్నికల గురించి ఫోన్లో చర్చించారు. అవసరమైతే ఏ స్థాయిలో అయినా అధికా ర దుర్వినియోగం చేసి అసంతృప్తి ఓటర్లను కట్టడి చేయాలని సూచించారు. సోమవారం సాయంత్రానికి ఏ రకంగానైనా పరిస్థితి అనుకూలంగా మలిచే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
పట్టభద్రులు మేల్కొనాలి
► టీడీపీ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పాలి ► వెన్నపూస గోపాల్రెడ్డికి ఓటేసి గెలిపించుకుందాం ► కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి కడప అగ్రికల్చర్: టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేం దుకు ఎమ్మెల్సీ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పట్టభద్రులకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నిరుద్యోగులు, పట్టభద్రులు.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిం దని ఆయన తెలిపారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వైఎస్సార్ సీపీ తరఫున పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది: కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎంపీ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఓట్లు దండుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేయడమే పనిగా ముందుకు వెళుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేజే రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను, నిరుద్యోగులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముంచారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, పరిశ్రమలు నెలకొల్పుతున్నానని చెప్పి అందినకాడికి దండుకుని నిరుద్యోగులను మోసగించారన్నారని తెలిపారు. సామాన్యులను మోసం చేసిన ఘనుడు కేజే రెడ్డి: కర్నూలు జిల్లాలో సామాన్యులను సైతం మోసం చేసిన ఘనుడు కేజే రెడ్డి అని ఆరోపించారు. ఈయన బాగోతం కర్నూలు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అటువంటి మోసగాడికి, అక్రమార్కుడిని సీఎం చంద్రబాబు చేరదీసి అభ్యర్థిగా నిలబెట్టడం దారుణమన్నారు. నీతి, నిజాయితీ పనిచేసే వెన్నపూసను గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈయన్ను గెలిపిస్తే నిరుద్యోగులు, యువకుల తరఫున శాసనమండలిలో టీడీపీని నిలదీస్తారని చెప్పారు. సమావేశంలో మేయర్ కె సురేష్బాబు, గోపాల్రెడ్డి తనయుడు రవీంద్రరెడ్డి, పార్టీ నాయకుడు మధువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి కడప ఎడ్యుకేషన్: నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబుకు పట్టభద్రులు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా పిలుపునిచ్చారు. కడప నగరంలో పలు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల్లో ఆదివారం వెన్నపూసకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ నిరుద్యోగులను, రైతులను.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని తెలిపారు. యువతంతా ఓటింగ్లో పాల్గొని ఓటు వేసి వెన్నపూసను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్వరరెడ్డి, యాసిన్, రహీమ్, సాయిదత్త, రవితేజ పాల్గొన్నారు. -
బోగస్ పట్టభద్రుల ఓటర్లను తొలగించండి
–అధికార పార్టీ నేతలు అక్రమంగా లబ్ధిపొందేందుకు బోగస్ ఓటర్లను చేర్పించారు –రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తాం – వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలుగా బోగస్ ఓటర్లను చేర్పించారని, వీటిని వెంటనే తొలగించాలని వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతలు ఓటమి భయంతో ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ...పట్టభధ్రుల ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. 2013 అక్టోబరులోపు డిగ్రీ, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే ఓటర్లుగా నమోదు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం దారుణమనా్నరు. ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 8500 బోగస్ పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వానికి పట్టభద్రులు వ్యతిరేకంగా ఉన్నందున టీడీపీ నేతలు బోగస్ ఓటర్లతో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రోజాను అడ్డుకోవడం దారుణం ఎమ్మెల్యే రోజాను అమరావతిలో నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సుకు అనుమతించకపోవడం అత్యంత దారుణమని వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు మహిళా ప్రజాప్రతినిధి పట్ల అమానుషంగా ప్రవర్తించడం బాధాకరమని చెప్పారు. వెంటనే ప్రభుత్వం రోజాకు క్షమాపన చేప్పాలని డిమాండ్ చేశారు. -
బోగస్ పట్టభద్రులు
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతల గిమ్మిక్కు - ఐటీఐ చేసిన వారినీ ఓటర్లుగా చేర్చిన వైనం - ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా ఓటర్లుగా నమోదు -జిల్లాలో ఇలాంటి వారు 8,500 మంది గుర్తింపు రమేష్..కర్నూలులోని ఓ కళాశాలలో ఐటీఏ పూర్తి చేశారు.అతని సర్టిఫికెట్లు తీసుకొని అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు చేర్చారు. ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్లు సమాచారం. వెంకటేష్..సర్టిఫికెట్లు అన్నీ ఉన్నా జిరాక్స్ కాపీలపైన గజిటెడ్ అధికారి సంతకం లేదు. అయినా అధికారులు ఇతన్ని పట్టభద్రుల ఓటరుగా నమోదు చేశారు. ..జిల్లాలో ఇలాంటి వారు వేలల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిని గెలుపొందేందుకు టీడీపీ నేతలు నిబంధనలు తుంగలోకి తొక్కారు. తమకు అనుకూలమైన వారిని ఓటరు జాబితాలో చేర్చించారనే విమర్శలు ఉన్నాయి. కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తన బోగస్ ఓటర్లను చేర్పించినట్లు స్పష్టం అవుతోంది. జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 84,754 మంది ఉన్నారు. ఇందులో 8,500 వరకు బోగస్ ఒటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అభ్యర్థి ఓటమిపాలైతే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. విజయాన్ని దక్కించుకునేందుకు బోగస్ ఓటర్లను భారీగా చేర్పించారు. ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2013 అక్టోబరు నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా 2014 నుంచి 2016 మధ్యన డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులను సైతం ఓటర్లుగా నమోదు చేయడం గమానార్హం. ఏదేని డిగ్రీ లేదా దాని సమాన పరీక్షలో ఉత్తీర్ణులయిన వారిని పట్టభద్రులుగా వ్యవహరిస్తారు. అయితే ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారిని సైతం ఓటర్లుగా నమోదు చేశారంటే అధికారపార్టీ నేతలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో స్పష్టం అవుతోంది. ఓటకె నమోదులో అధికారులు విధిగా డిగ్రీ సర్టిఫికెట్లను పరిశీలించాలి. వాటి జిరాక్స్ కాపీలపై గజిటెడ్ అధికారి సంతకం ఉండాలి, కాని దరఖాస్తులకు ఎటువంటి సర్టిఫికెట్లు జతపరచకపోయినా ఓటర్లుగా నమోదు చేశారు. ఓటర్ల జాబితా తయారీలో మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు స్పష్టం అవుతోంది. ఓటర్లు ఒక చోట పోలింగ్ కేంద్రం మరో చోట... పట్టభద్రుల నియోజక వర్గానికి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పట్టభద్రులకు 112 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరానికి చెందిన వారికి కర్నూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే కర్నూలుకు చెందిన పట్టభద్రులకు పాణ్యంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతేగాక 15 మందికి ఒకపోలింగ్ కేంద్రం.. 2500 మందికి ఒకే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం నాయకుల సూచనల మేరకు వారి ప్రయోజనం చేకూరే విధంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సవరణలకు అవకాశం: విజయమోహన్, జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల 20 వరకు అవకాశం ఉంది. బోగస్ ఓటర్లు ఎవరైనా ఉంటే ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. వివరాలతో స్థానిక తహసీల్దార్లను, ఆర్డీఓలను సంప్రదిస్తే వారు కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి
– పట్టభద్రుల సమస్యలపై గళం విప్పుతా – వైఎస్ జగన్ నాయకత్వంలో విద్యాభివృద్ధికి కృషి – డిగ్రీ, డిప్లొమా చేసినవారంతా ఓటర్లుగా చేరండి – వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి కర్నూలు(రాజ్విహార్): వచ్చే ఏడాది జరిగే శాసన మండలి ఎన్నికల్లో తనకు మద్దతు ఇస్తే పట్టభద్రుల సమస్యలపై గళం విప్పుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎన్జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ పశ్చిమ ప్రాంత పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలి ఎన్నికల్లో పోటీకి తన పేరును వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో విద్యాభివృద్ధికి, పట్టభద్రుల సమస్యలపై పోరాటాలు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి, వారి కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల పక్షాన ఉండి గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. పట్టభద్రులందరూ మండలి ఎన్నికల్లో తనను ఆదరిస్తే యువనేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాటాలు చేస్తానని చెప్పారు. డిగ్రీలతోపాటు ఇంజనీరింగ్, మెడిసిన్, డిప్లోమా తదితర పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను మండలి ఎన్నికల జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జెడ్పీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు మీసాల రంగన్న పాల్గొన్నారు. -
హమాలీ పోస్టులకు 984 మంది గ్రాడ్యుయేట్లు!
ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎమ్ పీఎస్సీ) తాజా విడుదల చేసిన హమాలీ పోస్టులకు 984 మంది గ్రాడ్యుయేట్లు, ఐదుగురు ఎంఫిల్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు సోమవారం ఓ అధికారి తెలిపారు. మొత్తం ఐదు హమాలీ పోస్టులకు గత ఏడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థుల కనీస విద్యార్హత నాల్గవ తరగతిగా పేర్కొన్నట్లు వివరించారు. మొత్తం 2,424 మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో 5 గురు ఎం.ఫిల్ డిగ్రీ, 253మంది పీజీ, 109 మంది డిప్లొమా, 9 మంది పీజీ డిప్లొమా, 984 మంది డిగ్రీ, 605 మంది ఇంటర్, 282 మంది టెన్త్, 177 మంది టెన్త్ కు దిగువ తరగతులను తమ విద్యార్హతగా పేర్కొన్నట్లు తెలిపారు. వీరందరికి వచ్చే ఆగష్టులో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలో అభ్యర్థులకు భాషపై పట్టు, బేసిక్ మ్యాథమెటిక్ స్కిల్ పై ప్రశ్నలుంటాయని తెలిపారు. -
బి-స్కూల్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు రావట్లేదా?
న్యూఢిల్లీ : ఐఐఎమ్స్ లాంటి టాప్ బిజినెస్ స్కూళ్లను మినహాయిస్తే, మిగతా బిజినెస్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్లుగా ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగాలు రావడం లేదట. ఒకవేళ వచ్చినా రూ.10వేలకు తక్కువగానే వేతనం పొందుతున్నారట. నాణ్యత నియంత్రణ, మౌలిక సదుపాయాలు లేకపోవడం, క్యాంపస్ ప్లేస్ మెంట్లలో తక్కువ జీతం పొందడం, తక్కువ నైపుణ్యమున్న వారు ఫ్యాకల్టీగా ఉండటం బిజినెస్ స్కూళ్ల పరిస్థితిని దిగజారుస్తున్నాయని అసోచామ్ అధ్యయనంలో వెల్లడించింది. భారత్ లో కనీసం 5,500 బిజినెస్ స్కూళ్లు నడుస్తుండగా, వాటిలో చాలా అనుమతి పొందని ఇన్ స్టిట్యూట్లే ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. భారత బిజినెస్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన వాళ్లలో కేవలం 7శాతం మందే ఉద్యోగవకాశాలు పొందుతున్నారని తెలిపింది. గత రెండేళ్లలో ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతం,ముంబై, కోల్ కత్తా,బెంగళూరు,అహ్మదాబాద్,లక్నో, హైదరాబాద్, డెహ్రడూన్ ప్రాంతాల్లో దాదాపు 220 బిజినెస్ స్కూల్ లు మూతపడ్డాయని సర్వేలో పేర్కొంది. ఈ ఏడాది 120పైగా బిజినెస్ స్కూల్ కనుమరుగవుతాయని రిపోర్టు నివేదించింది. ఎడ్యుకేషన్ నాణ్యత తగ్గడంతో, క్యాంపస్ రిక్రూట్ మెంట్లు కూడా 2014-2016లో 45శాతం పడిపోయాయని పేర్కొంది. బిజినెస్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్లుగా సీటు సంపాదించిన వారు, రెండేళ్లకి దాదాపు రూ.3-5 లక్షలు ఖర్చు చేస్తున్నారని, కానీ వారు పొందే జీతం కేవలం రూ.8,000 నుంచి రూ.10,000ల మధ్యలో ఉంటుందని అసోచామ్ అధ్యయనంలో పేర్కొంది. -
పట్టభద్రులకు శుభవార్త..
హైదరాబాద్: నగరంలో నివసిస్తున్న పట్టభద్రులకు శుభవార్త. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఏదేనీ డిగ్రీ పొంది, 20 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఇంటరవ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైనవారికి ప్రారంభవేతనం రూ. 12 వేలు. అంతేకాక ఇతర ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికేట్లతో ఈ నెల 26న (గురువారం) విజయనగర్ కాలనీలోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి రావచ్చని, ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి కె. నాగభారతి ఓ ప్రకటనలో తెలిపారు. సమగ్ర వివరాల కోసం 81217 28818 నెంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
పోలింగ్ 34.19 శాతమే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు స్పందన అంతంతమాత్రమే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు నెలరోజులుగా అటు రాజకీయ పార్టీలు, ఇటు ఉద్యోగ, విద్యార్థి సంఘాలు చేసిన ప్రచార పర్వం తాలుకూ ప్రతిఫలంలో భాగంగా ఆదివారం ఓటర్లు తమ ఓటుతో నిర్ణయాన్ని ప్రకటించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో 1,37,261 ఓట్లున్నాయి. మిగతా రెండు జిల్లాల్లో కంటే ఇక్కడ ఓట్లు అధికంగా ఉండడంతో పోలింగ్ తీరు గెలుపోటములపై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు సైతం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ.. చివరకు పోలింగ్ నాడు మాత్రం విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు తీవ్ర నిరాసక్తత చూపారు. కేవలం 34.19 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. అంతా మందకొడిగానే.. జిల్లాలోని 170 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఎనిమిది గంట లకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల ఎన్నికల సంఘం ఓటరు చైతన్యం పేరిట పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టడం, గతేడాది స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో సైతం పోలింగ్ శాతం భారీగా పెరగడంతో తాజా పోలింగ్పై అంచనాలు పెరి గాయి. కానీ ఆదివారం నాటి పోలింగ్ తీరును పరిశీలిస్తే.. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కేవలం 34.19 శాతం మాత్రమే ఓటింగ్కు హాజరయ్యారు. తొలి గంటన్నర వ్యవధిలో కేవలం 8 శాతం మాత్రమే పోలింగ్ జరగగా.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓటింగ్ కొంత పుంజుకుని 18 శాతానికి పెరిగింది. అనంతరం రెండు గంటల ప్రాంతంలో ఓటింగ్ మందకొడిగానే సాగుతూ 27.63శాతానికి చేరుకుంది. చివరకు నాలుగు గంటల ప్రాంతంలో 34.19శాతానికి పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 1,37,261 మంది ఓటర్లున్నారు. ఇందులో కేవలం 46,930 మంది మాత్రమే ఓటు వేయగా.. 90,330 మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి దూరంగా ఉన్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 22కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలులో ఇంటర్ పరీక్షల కారణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ‘వరంగల్, ఖమ్మం, నల్లగొండ’, ‘హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్’ నియోజకవర్గాల్లో మార్చి 16న జరగాల్సిన పోలింగ్ను 22వ తేదీకి మార్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 25న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. -
పెద్దల పోరుకు సన్నద్ధం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో మరో ఎన్నిక దగ్గరపడుతోంది. శాసనమండలిలో ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్ల స్థానానికి ఫిబ్రవరిలో ఎన్నిక జరగనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ దిలీప్కుమార్ పదవీకాలం 2015 మార్చిలో ముగియనుంది. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,33,506 ఓటర్లు ఉన్నారు. నల్లగొండలో 46,291, వరంగల్ జిల్లాలో 44,512, ఖమ్మం జిల్లాలో 42,703 ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఓటు హక్కు పొందేందుకు 2011, అక్టోబరు 31కి ముందే డిగ్రీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నవంబరు 25 నుంచి డిసెంబరు 16 వరకు నమోదు చేసుకోవచ్చు. 2015 జనవరి 15న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తారు. ‘పట్టభద్రుల ఓటర్ల జాబితా(2008)లో ఓటరుగా నమోదై ఉన్నవారు ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన పనిలేదు. ఓటరు గుర్తింపు కార్డు వివరాలు అందజేస్తే సరిపోతుంది. గుర్తింపు కార్డులేనివారు ఫోటో, నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది’ అని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఎన్నికలపై పార్టీల దృష్టి తెలంగాణలో జరుగుతున్న మొదటి ఎమ్మెల్సీ ఎన్నిక అవుతుండడంతో రాజకీయంగా ప్రాధాన్యత ఉండనుంది. రాజకీయ పార్టీలకు గ్రాడ్యుయేట్స్ ఎన్నిక విషయంలో ఇప్పటి నుంచే దృష్టి పెడుతున్నాయి. ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలే అయినా.. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగానే పోటీ పడడం సహజంగా జరుగుతోంది. శాసనమండలి మళ్లీ ఏర్పాటైనప్పటి నుంచి వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగిన కపిల వాయి దిలీప్కుమార్ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్రావును ఖరారు చేసింది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పా ర్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ వరా లు చెబుతున్నాయి. మిగిలిన రాజకీయ పార్టీల్లో ఇ ప్పుడే సందడి మొదలవుతోంది. మిగిలిన పార్టీలతో పోల్చితే అధికార టీఆర్ఎస్లో ఎక్కువ మంది ఎమ్మె ల్సీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి ఈ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎస్.సుందర్రాజు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటే... నల్లగొండ ఎంపీగా పో టీ చేసిన రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రయత్నించనున్నారు. ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కీలకంగా మారనుంది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా వరంగల్కు చెందిన బండా ప్రకాశ్కు అవకాశం ఇస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వామపక్ష పార్టీలు బరిలో దిగితే పొరుగన ఉన్న ఖమ్మం, నల్లగొండ నేతలకే అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉంది. -
డేటా సైంటిస్ట్..నవ యువ కెరీర్..
కార్పొరేట్ కెరీర్గా ఐదేళ్ల క్రితం ఆవిర్భవించి... ఆకాశమే హద్దుగా అవకాశాలు కల్పిస్తూ.. నేటి యువత.. ‘హాట్ ఫేవరెట్ జాబ్స్’ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్న ఉద్యోగం.. డేటా సైంటిస్ట్. అంకెలు, సంఖ్యల పట్ల ఆసక్తి, విశ్లేషణ నైపుణ్యం.. విభిన్న గణాంకాలను క్రోడీకరించే సామర్థ్యం ఉన్నవారికి ఉన్నత శిఖరాలు అధిరోహిం చేందుకు వీలు కల్పించే కెరీర్. ‘డేటా సైంటిస్ట్’.. ఈ పదం వినడానికి, చదవడానికి కొంత గంభీరంగా ఉన్నప్పటికీ సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ఉజ్వలమైన కెరీర్ను సొంతం చేసుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఇంటర్నెట్ యుగంలో ఆన్లైన్ వినియోగం విస్తృతమైన ప్రస్తుత పరిస్థితుల్లో.. సంస్థలకు తప్పనిసరిగా మారి, యువతకు పుష్కల అవకాశాలు కల్పిస్తున్న ‘డేటా సైంటిస్ట్’ కెరీర్పై ఫోకస్.. డేటా సైంటిస్ట్ అంటే? కార్పొరేట్ ప్రపంచంలో వందల సంఖ్యలో సంస్థలు, ఆయా కంపెనీల నుంచి లెక్కకు మించి ఉత్పత్తులు. అన్నిటిలక్ష్యం ఒక్కటే. అదే.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తు, సేవలు అందించడం ద్వారా వారి మనసులు గెలుచుకోవడం! ఇందుకోసం విభిన్న వర్గాల వినియోగదారులు, మారుతున్న వారి అవసరాలు, అభిరుచులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి,క్రోడీకరించి, వర్గీకరించడం.. వీటి ఆధారంగా విశ్లేషణలు, సూచనలు, సలహాల తో కూడిన నివేదికలను రూపొందించి సంస్థకు అందించడం.. ఇవి స్థూలంగా డేటా సైంటిస్ట్ ప్రధాన విధులు. ఈ-కామర్స్కు కీలకంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ జోరు కొన సాగుతోంది. వినియోగదారుల్లో అధిక శాతం మంది ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ-కామర్స్ సంస్థలకు కస్టమర్ల గురించి నేరుగా తెలుసుకునే అవకాశం ఉండదు. ఆయా సంస్థల వెబ్సైట్లలో వినియోగదారులు స్వయంగా వెల్లడించే వివరాలు మాత్రమే సేవలందించే క్రమంలో కంపెనీలకు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే డేటా సైంటిస్ట్ సేవలు ఈ-కామర్స్ సంస్థలకు ఎంతో కీలకంగా మారాయి. డేటా సైంటిస్ట్లు వినియోగదారులు నమోదు చేసిన వివరాలను పరిశీలిస్తూ.. వాటి ఆధారంగా సంస్థకు అవసరమైన సమాచారాన్ని విశ్లేషించి అందిస్తారు. కస్టమర్స్ను కేటగిరీలుగా వర్గీకరించి ప్రతి కస్టమర్కు సంబంధించి సానుకూల, ప్రతికూల అంశాలను తెలియజేస్తారు. అంతేకాకుండా ఆన్లైన్ షాపింగ్లో వారు అనుసరిస్తున్న అన్ని అంశాలను పరిశీలిస్తారు. పేమెంట్ విధానాలు, చెల్లింపుల పరంగా గతంలో చేసిన పొరపాట్లు వంటివి. ఉదాహరణకు.. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తున్న వినియోగదారులు చేస్తున్న తప్పులు, వాటివల్ల సంస్థకు కలిగే పర్యవసానాలను అంచనా వేస్తారు. లక్షల్లో కొలువులు ప్రపంచవ్యాప్తంగా డేటా సైంటిస్ట్ కొలువులు లక్షల్లోనే ఉన్నట్లు అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి బిగ్ డేటా మార్కెట్ విలువ 23.8 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. మన దేశంలో వచ్చే పదేళ్లు ప్రస్తుతం కంటే 60 రెట్లు పెరగనుంది. మానవ వనరుల కోణం లోనూ దేశంలో వచ్చే రెండేళ్లలో లక్షల్లో డేటా సైంటిస్ట్ల అవసరం ఏర్పడనుంది. మెకిన్సే నివేదిక ప్రకారం- 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.4 మిలియన్ డేటా సైంటిస్ట్ల అవసరం ఉంది. భారత్లో ఆ సంఖ్య రానున్న రెండేళ్లలో రెండు లక్షలకు పైమాటే. జిగ్వాస్ అకాడమీ రిపోర్ట్ ప్రకారం- భారీ వేతనాలతోపాటు ఎంట్రీ లెవల్లోనే 12 లక్షల వార్షికాదాయం అందుకోవచ్చు. ఇప్పటికే ఈ విభాగంలో మానవ వనరుల డిమాండ్-సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. మొత్తం అవసరాల్లో 20 శాతం మంది మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. అన్ని రంగాలు.. విభాగాల్లోనూ అవసరం డేటా సైంటిస్ట్ల అవసరం కేవలం టెక్నికల్ విభాగానికి లేదా వినియోగదారుల సమాచారం తెలుసుకోవడానికే పరిమితం కాదు. ఆయా సంస్థల్లో అంతర్గత విభాగాల్లో (ఉదా:హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్) కూడా డేటా సైంటిస్ట్ల అవసరం ఉంటుంది. కంపెనీల్లో ఉద్యోగుల వివరాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమాచార క్రోడీకరణ, విశ్లేషణలో కూడా డేటా సైంటిస్ట్లదే కీలక పాత్ర. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలోనూ ఇటీవల కాలంలో డేటా సైంటిస్ట్లు ప్రాధాన్యతను పొందుతున్నా రు. అంతేకాకుండా జాతీయస్థాయిలో సాగుతున్న ఆధార్ నమోదులోనూ డేటా సైంటిస్ట్లు ప్రధాన పాత్ర పోషించారు. నమోదు చేసుకున్న వ్యక్తుల వివరాలను విభిన్న కేటగిరీలుగా(పాన్ కార్డ్ నెంబర్లు, రేషన్ కార్డ్ నెంబర్లు తదితర) ఒక చోట సంక్షిప్తం చేయడంలో విశేషంగా పనిచేశారు. అంటే.. వినియోగదారుల సంఖ్య అధికంగా ఉండే ప్రతి రంగంలో, విభాగంలో డేటా సైంటిస్ట్ల అవసరం ఉంటోంది. లక్షల్లో వేతనాలు డేటా సైంటిస్ట్లకు వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఇతర ఐటీ ఉద్యోగాలతో పోల్చితే డేటా సైంటిస్ట్లు సగటున 30 నుంచి 40 శాతం మేర అధికంగా జీతాలు అందుకుంటున్నారు. ప్రారంభంలో డేటా సైంటిస్ట్గా కనీసం రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వార్షిక వేతనం ఖాయం. అకడమిక్ అర్హతలివే డేటా సైంటిస్ట్గా కెరీర్ ప్రారంభించడానికి అకడమిక్గా మూడు ముఖ్యమైన అర్హతలు అవసరం. అవి.. మ్యాథమెటికల్ స్కిల్స్, స్టాటిస్టికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్. అంతమాత్రాన ఇవి.. ఆయా విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి డిగ్రీలు చేసినవారికే అనే అభిప్రాయం కూడా అపోహే. ఈ అంశాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయి నైపుణ్యాలతోనూ డేటా సైంటిస్ట్గా కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అయితే అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉంటే.. వేతనాలపరంగా కొంత ముందంజలో ఉంటారు. ఈ క్రమంలో పీజీ స్థాయిలో మ్యాథమె టిక్స్, స్టాటిస్టిక్స్ వంటి స్పెషలైజేషన్లు చేయడం ఉపయుక్తం అనేది నిపుణుల అభిప్రాయం. వీటితోపాటు స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్, ఏ్చఛీౌౌఞ వంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లలో శిక్షణ పొందితే మరింత మెరుగైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు. పెరుగుతున్న అవగాహన జాబ్ మార్కెట్ ట్రెండ్ను దృష్టిలో పెట్టుకుని అకడమిక్ స్థాయిలో పలు ఇన్స్టిట్యూట్లు డేటా సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ ఇన్స్టిట్యూట్లు డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ సంబంధిత కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. అవి.. ఐఐఎం - రాంచీ (http://www.iimranchi.ac.in) కోర్సు: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఐఐఎం- కోల్కతా (https://www.iimcal.ac.in) కోర్సు: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఐఎస్బీ- హైదరాబాద్ (http://www.isb.edu) కోర్సు: బిజినెస్ అనలిటిక్స్. ఐఐఎస్సీ- బెంగళూరు, (http://www.iisc.ernet.in) కోర్సు: బిజినెస్ అనలిటిక్స్లో పీజీ. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, (http://vit.ac.in) కోర్సు: విస్టా-డేటా సైంటిస్ట్ (విప్రోతో కలిసి సంయుక్తంగా) మనదేశంలోని కొన్ని డేటా సైన్స్ శిక్షణ సంస్థల వివరాలు.. జిగ్వాస్ అకాడమీ- బెంగళూరు వెబ్సైట్: www.jigsawacademy.com ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ - హైదరాబాద్ వెబ్సైట్: www.insofe.edu.in/ ఎడ్వాన్సర్ ఎడ్వెంచర్స్ - ముంబై వెబ్సైట్: www.edvancer.in అనలిటిక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - బెంగళూరు వెబ్సైట్: www.analyticstraining.in స్టాటిస్టిక్స్ అనుభవంతో మరిన్ని అవకాశాలు ప్రస్తుత సమాచార విప్లవం నేపథ్యంలో ప్రతి సంస్థలోనూ డేటా సైంటిస్ట్ల ఆవశ్యకత నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్ దిశగా కదులుతున్న నేపథ్యంలో రానున్న రెండు, మూడేళ్లలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రాను న్నాయి. స్టాటిస్టిక్స్లో పరిజ్ఞానం, విశ్లేషణ నైపుణ్యాలు ఉంటే డేటా సైంటిస్ట్గా కెరీర్లో అద్భుతంగా రాణించొచ్చు. అన్నిటి కంటే ముఖ్యంగా కంప్యూటరైజేషన్ ద్వారా గిగా బైట్లలో ఉండే సమాచారం నుంచి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కచ్చితమైన సమాచారాన్ని అన్వేషించి, క్రోడీకరించే క్రమంలో ఎంతో ఓర్పు అవసరం. ఈ లక్షణాలు ఉంటే డేటా సైంటిస్ట్ కెరీర్ బాగుంటుంది. - ప్రొఫెసర్ ఎ. అప్పారావు, డెరైక్టర్, సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సేవారంగంలో పుష్కల అవకాశాలు డేటా సైంటిస్ట్లకు బ్యాంకింగ్, ఈ-కామర్స్, టెలికాం, బీపీఓ తదితర కస్టమర్ సర్వీస్ సెక్టార్లలో పుష్కల అవకాశాలు లభిస్తున్నాయి. కారణం.. వీటన్నిటి కార్యకలాపాలు వినియోగ దారుల అభిరుచులకు చెందినవి కావడం. ఆ క్రమంలో వారికి సంబంధించిన విస్తృత సమాచారాన్ని వర్గీకరించి, క్లుప్తంగా క్రోడీకరించడం సంస్థ మనుగడకు ఎంతో ముఖ్యమైనది. వాటిపై శిక్షణ పరంగా నైపుణ్యాలు అందించే కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్లు డేటా సైన్స్లో ఉంటాయి. ప్రస్తుతం చాలా ఇన్స్టిట్యూట్లు బిజినెస్ అనలిటిక్స్లో భాగంగా డేటా సైన్స్లో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. కానీ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ విషయంలో డేటా సైన్స్ను కోర్ సబ్జెక్ట్గా శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. -డాక్టర్ క్రాంతి మిత్ర అడుసుమిల్లి, సీనియర్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ -
ఇంజనీరింగ్లో నాణ్యత సున్నా
గత ఏడాది మిగిలిపోయిన 2 లక్షల సీట్లు విభజనతో ఇంకా ఎక్కువే మిగులుతాయంటున్న నిఫుణులు స్పష్టం చేస్తున్న ఆస్పరింగ్ మైండ్స్ నివేదిక హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతాప్రమాణాలు పడిపోయి, గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ విద్యపై అనాసక్తి పెరిగిపోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాలుగేళ్ల కిందట ఇంజనీరింగ్లో 1,94,203 సీట్లు భర్తీకాగా.. మూడేళ్ల కిందట 1,84,080 సీట్లు భర్తీ అయ్యాయి. రెండేళ్ల కిందట 1,58,700, సీట్లు మాత్రమే భర్తీ కాగా, గత ఏడాది 1,28,950 సీట్లే నిండాయి. గత ఏడాది 32 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈసారి కూడా 3.20 లక్షల సీట్లు అందుబాటులో ఉంటే అర్హత సాధించిన వారు 1.81 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో యాజమాన్యం పరిధిలోనే ఐదారు కాలేజీలు ఉండడం.. కాలేజీల మధ్య అనారోగ్యకర పోటీ... సీట్లు నింపుకునేందుకే తాపత్రయం.. వెరసి ఇంజనీరింగ్లో నాణ్యత కరువైంది. నిర్వహణకే తంటాలు పడుతున్న కాలేజీలు నాణ్యతపై దృష్టిపెట్టడం లేదు. 25వ స్థానానికి పడిపోరుున రాష్ట్రం... ఐటీలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ (ఇపుడు రెండు రాష్ట్రాలు) ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రస్తుతం దేశంలోనే 25వ స్థానానికి పడిపోయింది. ఒకప్పుడు అగ్రదేశాల్లో ఒక వెలుగువెలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇపుడు కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్టు సామర్థ్యాలు లేక వెనుకబడిపోయారు. ఆరు మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ చివరి నుంచి రెండో స్థానానికి దిగజారింది. కాగా, వుహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఉద్యోగ అవకాశాల కల్పనలో పురోగతి సాధించారుు. 2011లో చేసిన సర్వేతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ 2011లో కిందినుంచి 25 పర్సంటైల్లోనే ఉండగా, ఇపుడు అదే పర్సంటైల్లోనే ఉంది. కర్ణాటక వూత్రం 50-25 స్థానంలోకి వెళ్లింది. ఇక వుహారాష్ట్ర అవకాశాలు పెంచుకొని 75-50 పర్పంటైల్లోకి వెళ్లింది. ఆందోళన కలిగించే ఇలాంటి నిజాలెన్నింటినో ‘ఆస్పరింగ్మైండ్స్’ అనే సంస్థ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు, పరిస్థితులపై రూపొందించిన నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్-2014లో వివరించింది. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 2,500కు పైగా కాలేజీల కు చెందిన 10 ల క్షల వుంది విద్యార్థులపై ఈ సర్వే చేసినట్టు వెల్లడించింది. నాణ్యత పట్టని యాజమాన్యాలు.. కొద్దిగా పేరున్న కాలేజీలు ఏటికేడు సీట్లు పెంచుకుంటున్నాయి. కామన్ ఫీజున్నప్పటికీ యాజమాన్య కోటాలో భారీగా వసూలు చేస్తున్నాయి. 15 శాతం ఎన్ఆర్ఐ కోటానే కాకుండా, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. సాధారణ కాలేజీల్లో ప్రవేశాలు లేక మూసివేత దిశగా నడుస్తున్నాయి. వసతుల్లేని కాలేజీలు, అర్హత లేని అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. అధిక మొత్తం ఫీజులున్న కాలేజీల్లో కూడా ప్రమాణాలు లేవు.దీంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు కొరవడి, ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నారు. 32 కాలేజీల్లో ఒక్కరూ చేరలేదు.. గత ఏడాది 32 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఒకటి నుంచి 5 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 14 ఉండగా, 6 నుంచి 10 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 14 ఉన్నాయి. 11 నుంచి 15 మందిలోపు విద్యార్థులు చేరినవి మరో 14 కాలేజీలు ఉండగా, 16 నుంచి 20 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 19 ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 400కు పైగా సీట్లు ఉంటే 100 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 250 ఉండడం గమనార్హం. 2013లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పనలో రాష్ట్రాల పరిస్థితి.. టాప్ 25 పర్సంటైల్లో - బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్ 75 - 50 పర్సంటైల్లో - గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ 50-25 పర్సంటైల్లో - హర్యానా, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్ కింది నుంచి 25 పర్సంటైల్లో - ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఆస్పరింగ్మైండ్స్ నివేదికలోని ముఖ్యాంశాలు... దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయూరుు. ఇంజనీరింగ్ విద్యలో సావుర్థ్యాల పెంపునకు దేశంలో 3 వేల కాలేజీలే దీర్ఘకాలిక ప్రణాళికను కలిగి ఉన్నాయి. పట్టణాల్లోని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగిష్ భాషానైపుణ్యం ఉండడం లేదు. అనాలిసిస్లో విద్యార్థులు పూర్తిగా వెనుకబడి పోతున్నారు. -
ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలెన్నో..!
గతంలో కొన్ని రంగాలకే పరిమితమైన ఎంబీఏ గ్రాడ్యుయేట్ల అవసరం ప్రస్తుతం ఇతర రంగాలకు సైతం వేగంగా విస్తరిస్తోంది. అంటే ఎంబీఏ పూర్తిచేసిన వారికి డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సును ఎంచుకున్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) సీనియర్ డెరైక్టర్, కెరీర్ అడ్వాన్స్మెంట్ సర్వీసెస్, అడ్మిషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్.. వి.కె. మీనన్. దేశంలో మేనేజ్మెంట్ విద్య, ఎంబీఏ కళాశాలల స్థితిగతులు, భవిష్యత్ పరిణామాలపై తాజాగా ఆయన తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. మేనేజ్మెంట్ విద్యలో భారతదేశం ఇప్పుడిప్పుడే ప్రపంచస్థాయి వేదికగా అవతరిస్తోంది. ప్రస్తుతం మేనేజ్మెంట్ స్టడీస్లో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే యూఎస్లోని విద్యా సంస్థలు అత్యుత్తమ మేనేజ్మెంట్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ను అందిస్తున్నాయి. భారత్లో మేనేజ్మెంట్ విద్య ఇప్పటిదాకా సంప్రదాయబద్ధమైన తరగతి గది బోధనకే పరిమితం. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. ఇక్కడ బీ స్కూల్స్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల నిపుణులను, అధ్యాపకులను ఆకర్షిస్తున్నాయి. ఎంబీఏ... అదనపు అర్హత తమ సంస్థ విలువను పెంచే సామర్థ్యాలు ఉన్నవారినే యాజమాన్యాలు ఉద్యోగులుగా నియమించుకుంటాయి. అదనపు అర్హతగా ఎంబీఏ చేసిన వారికి జాబ్ మార్కెట్లో తిరుగుండదు. ఉదాహరణకు.. ఒక ఆసుపత్రిని సమర్థంగా నిర్వహించాలంటే కేవలం వైద్యుడిగా పట్టా సంపాదిస్తే సరిపోదు. ప్లానింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ వంటి వాటిపై పట్టుండాలి. కాబట్టి వైద్య విద్య తర్వాత ఎంబీఏ చేస్తే పుష్కలమైన అవకాశాలున్నాయి. వైద్య రంగంతోపాటు ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ రంగాల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ఐఎస్బీలో ఏటా చాలామంది వైద్యులు మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఎంబీఏ పూర్తిచేసిన వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి వారికి మంచి డిమాండ్ ఉంది. కేవలం మెడిసిన్ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో ఉన్నవారు సైతం ఎంబీఏ చేసి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. గతంలో కంటే మెరుగైన అవకాశాలు ఎంబీఏ వ్యాపారంలో విజయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పుతుంది. ప్రపంచీకరణతో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు గతంలో కంటే ఎన్నో రెట్లు అవకాశాలు పెరిగాయి. బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కన్సల్టింగ్ రంగంలో స్థిరపడాలంటే ఎంబీఏ దాదాపు తప్పనిసరిగా మారింది. దీంతోపాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ, కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాలూ వీరికే ప్రాధాన్యమిస్తున్నాయి. సాంకేతిక రంగంలో అవకాశాలు అపారం! ఇక సాంకేతిక రంగం ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు సాదర స్వాగతం పలుకుతోంది. బిజినెస్ డెవలప్మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో వీరికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కన్సల్టింగ్, ఫైనాన్స్, సేల్స్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ రంగాలు సంప్రదాయ ఎంబీఏ ప్రొఫెషనల్స్ను ఎంచుకుంటున్నాయి. కొత్తకొత్త రంగాల్లో ఎంబీఏల అవసరం పెరిగినట్లు మా పరిశీలనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్కేర్, ఫార్మా, లైఫ్సెన్సైస్, మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్స్టైల్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా, ఎంటర్టైన్మెంట్ తదితర రంగాల్లో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకే మొదటి ప్రాధాన్యత దక్కుతున్నట్లు తేలింది. పలు కీలక రంగాల్లో ఐఎస్బీ గ్రాడ్యుయేట్లకు ఉన్నత ఉద్యోగాలు దక్కడమే ఇందుకు నిదర్శనం. పరిశోధనాపరమైన బోధన కావాలి ప్రపంచంలోని ఉత్తమ మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో నాణ్యమైన పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలను ఆయా సంస్థల విద్యార్థులు పొందుతున్నారు. భారత్లోనూ పరిశోధనలు పెరుగుతుండడం శుభ పరిణామం. బిజినెస్ స్కూల్స్ ప్రధాన లక్ష్యం.. సమస్యలను పరిష్కరించే, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే. పరిశోధనాపరమైన వాస్తవిక బోధన ఇందుకు కచ్చితంగా ఉపకరిస్తుంది. సామాజిక బాధ్యతను మరవొద్దు బిజినెస్ స్కూల్స్పై సామాజిక బాధ్యత కూడా తప్పనిసరిగా ఉంటుంది. సమాజం ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలకు పరిష్కార మార్గాలను చూపేందుకు కృషి చేయాలి. అత్యధిక జనాభా ఉన్న భారత్లో ఈ అవసరం మరింత ఎక్కువగా ఉంది. నిరుపేదలు, నిరక్షరాస్యులకు మేలు కలిగించే విధానాలను అభివృద్ధి చేయాలి. ఈ దిశగా ఐఎస్బీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. పేదలకు గృహ వసతిపై ఇప్పటికే ఎన్నో ప్రాజెక్ట్లు చేపట్టాం. భారత్లో కంటే విదేశాల్లో బిజినెస్ స్కూల్స్ వేగంగా అభివృద్ధి చెందాయి. దీనికి కారణం.. పరిశ్రమల నుంచి, దాతల నుంచి తగిన ఆర్థిక సహాయం లభించడమే. భారత్లో మేనేజ్మెంట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి సాయం అందాల్సిన అవసరం ఉంది. కరిక్యులమ్పై పున:సమీక్ష భారత బిజినెస్ స్కూల్స్ కరిక్యులమ్ను పున:సమీక్షించాల్సిన సమయం వచ్చింది. కరిక్యులమ్ సమకాలీనంగా, ప్రపంచస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇది ప్రస్తుత మార్కెట్ అవసరాలను తీర్చేలా తీర్చిదిద్దాలి. కేస్ టీచింగ్ మెథడాలజీని ప్రవేశపెట్టాలి. విదేశీ విద్యార్థులను మరింతగా ఆకర్షించేలా ఎంబీఏ కోర్సును రూపొందించాలి. అంతర్జాతీయంగా విదేశీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాల వల్ల భారత విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఎంబీఏ విద్యార్థికి, పరిశ్రమకు మధ్య సన్నిహిత సంబంధం ఉండాలి. దీనివల్ల పరిశ్రమల అవసరాలేంటో విద్యార్థులకు తెలుస్తాయి. దానికనుగుణంగా వారు సంసిద్ధులయ్యేందుకు అవకాశం ఉంది. కుటుంబ వ్యాపారాలకు మేలు మనదేశ వ్యాపారాల్లో 85 శాతానికిపైగా కుటుంబ వ్యాపారాలే ఉన్నాయి. ఈ వ్యాపార కుటుంబాలు తమ సంప్రదాయ పాత పంథాను వీడి ఆధునికతను అందిపుచ్చుకుంటున్నాయి. దీనివల్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు విస్తృతమవుతున్నాయి. వ్యాపార కుటుంబాలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించవచ్చు. ఈ కుటుంబాల నుంచి వ్యాపారంలోకి ప్రవేశించే కొత్త తరాలకు తగిన శిక్షణ అవసరమవుతోంది. ఇలాంటి వారి కోసం ఐఎస్బీ.. మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ బిజినెస్(ఎంఎఫ్ఏబీ) కోర్సుకు రూపకల్పన చేసింది. కుటుంబ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన నైపుణ్యాలను బోధిస్తోంది. వ్యాపారంలో భవిష్యత్ నాయకులుగా ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తోంది. -
నిరాశా నిస్పృహల్లో ఇంజినీరింగ్ పట్టభద్రులు