International League T20
-
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ విజేత దుబాయ్ క్యాపిటల్స్.. ఫైనల్లో వైపర్స్ చిత్తు
2025 ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) టైటిల్ను దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) చేజిక్కించుకుంది. నిన్న (ఫిబ్రవరి 9) జరిగిన ఫైనల్లో క్యాపిటల్స్ డెజర్ట్ వైపర్స్ను (Desert Vipers) 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రసవత్తరంగా సాగిన ఈ పోరులో రోవ్మన్ పావెల్ (38 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సికందర్ రజా (12 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్ను గెలిపించారు. Pride. Ecstacy. Honour. Valour. Glory. Legacy. ✨No better & prouder moment for the @Dubai_Capitals, than when they get their hands on the 🏆#Final #DPWorldILT20 #TheFinalPush #AllInForCricket pic.twitter.com/vgOOrqjDid— International League T20 (@ILT20Official) February 9, 2025190 పరుగుల లక్ష్య ఛేదనలో 39 పరుగులకే మూడు వికెట్లు (డేవిడ్ వార్నర్ (4), గుల్బదిన్ నైబ్ (5), సామ్ బిల్లింగ్స్ (6)) కోల్పోయిన క్యాపిటల్స్ను పావెల్, షాయ్ హోప్ (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరూ క్యాపిటల్స్ స్కోర్ను 100 పరుగులు దాటించారు. ఈ దశలో సామ్ కర్రన్ హోప్ను పెవిలియన్కు పంపి వైపర్స్ను తిరిగి గేమ్లోకి తెచ్చాడు. అయితే హోప్ ఔటయ్యాక కూడా పావెల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్యాపిటల్స్ను గెలుపు రేసులో ఉంచాడు. చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన తరుణంలో సికందర్ రజా మ్యాజిక్ చేశాడు. మొహమ్మద్ ఆమిర్ వేసిన 19వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన రజా.. చివరి ఓవర్లో సిక్సర్, బౌండరీ బాది క్యాపిటల్స్ను తొలి టైటిల్ను అందించాడు. పావెల్ ఔటయ్యాక దుసన్ శనక (10 బంతుల్లో 21; 2 సిక్సర్లు) సికందర్ రజాకు మద్దతుగా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్తో క్యాపిటల్స్ టైటిల్ సాధించేందుకు దోహదపడిన రోవ్మన్ పావెల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సామ్ కర్రన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబాయ్ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓబెద్ మెక్కాయ్ ధాటికి వైపర్స్ 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్, అలెక్స్ హేల్స్ తలో ఐదు పరుగులు చేసి మెక్కాయ్ బౌలింగ్లో ఔటయ్యారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన మ్యాక్స్ హోల్టన్ (51 బంతుల్లో 76; 12 ఫోర్లు), కెప్టెన్ సామ్ కర్రన్ (33 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వైపర్స్ ఇన్నింగ్స్కు జీవం పోశారు. వీరిద్దరు మెరుపు అర్ద శతకాలు చేసి వైపర్స్కు భారీ స్కోర్ అందించారు. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (13 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్యాపిటల్స్ బౌలర్లలో మెక్కాయ్ 2, హైదర్ అలీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన క్యాపిటల్స్ ఆదిలో తడబడింది. షాయ్ హోప్, రోవ్మన్ పావెల్ బాధ్యతాయుతమై ఇన్నింగ్స్లు ఆడి క్యాపిటల్స్ను గేమ్లో ఉంచారు. ఆఖర్లో సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడి క్యాపిటల్స్ను విజయతీరాలకు చేర్చాడు. పావెల్, హోప్, రజా దెబ్బకు క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, డేవిడ్ పేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, నాథన్ సౌటర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, దుబాయ్ క్యాపిటల్స్ ఈ టోర్నీలో మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. తొలి ఎడిషన్లో గల్ఫ్ జెయింట్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్లో ఎంఐ ఎమిరేట్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్పై గెలుపొంది టైటిల్ గెలుచుకుంది. వరుసగా రెండో సీజన్లో ఫైనల్కు చేరిన క్యాపిటల్స్ ఎట్టకేలకు టైటిల్ను కైవసం చేసుకుంది. -
ముంబై ఇండియన్స్కు షాక్.. టోర్నీ నుంచి ఔట్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20-2025) డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్కు (MI Emirates) షాక్ తగిలింది. ప్రస్తుత ఎడిషన్లో ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో నాకౌటైంది. నిన్న (ఫిబ్రవరి 7) షార్జా వారియర్జ్తో (Sharjah Warriorz) జరిగిన మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. 42 పరుగులు (22 బంతుల్లో; 6 ఫోర్లు, సిక్స్) చేసిన నికోలస్ పూరన్ ఎంఐ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. టామ్ బాంటన్ (29), విల్ జాక్స్ (18), కుసాల్ పెరీరా (18), అకీల్ హొసేన్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. భారీ హిట్టర్లు ఆండ్రీ ఫ్లెచర్ (0), బెవాన్ జాకబ్స్ (7), రొమారియో షెపర్డ్ (7) దారుణంగా విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే, దిల్షన్ మధుషంక, అస్టన్ అగర్, హర్మీత్ సింగ్, రోహన్ ముస్తఫా తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (40), జాన్సన్ ఛార్లెస్ (36) వారియర్జ్ విజయానికి గట్టి పునాది వేయగా.. టిమ్ సీఫర్ట్ (40 నాటౌట్), రోహన్ ముస్తఫా (2 నాటౌట్) వారియర్జ్ను విజయతీరాలకు చేర్చారు. జేసన్ రాయ్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ముహమ్మద్ రోహిద్ ఖాన్ 3, ఫజల్ హక్ ఫారూకీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు అనంతరం వారియర్జ్ రెండో క్వాలిఫయర్లో డెసర్ట్ వైపర్స్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్లో విజేత ఫిబ్రవరి 9న జరిగే ఫైనల్లో దుబాయ్ క్యాపిటల్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది.కాగా, యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఇప్పటిదాకా రెండు ఎడిషన్లు జరిగాయి. తొలి ఎడిషన్లో గల్ఫ్ జెయింట్స్ ఛాంపియన్గా నిలువగా.. రెండో సీజన్లో ఎంఐ ఎమిరేట్స్ విజేతగా నిలిచింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్పై విజయం సాధించింది. ఈ సీజన్లో క్యాపిటల్స్ అందరికంటే ముందే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. -
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్చార్జర్స్ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
'ఐరెన్ లెగ్' ఆండ్రీ రసెల్.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ భస్మం..!
విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) ఫ్రాంచైజీ క్రికెట్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రాత్రి ఓ లీగ్ ఆడితే, ఉదయం మరో లీగ్లో పాల్గొంటున్నాడు. మొన్న రసెల్ గంటల వ్యవధిలో (15 గంటలు) దేశాలు దాటి రెండు వేర్వేరు లీగ్ల్లో పాల్గొన్న వైనం సోషల్మీడియాలో వైరలయ్యింది. ఇదే సమయంలో రసెల్ ఓ అపవాదును కూడా మూటగట్టుకున్నాడు. నిద్ర లేకుండా జర్నీ చేసి రెండు వేర్వేరు లీగ్ల్లో పాల్గొంటే రెండు చోట్ల రసెల్ జట్లు లీగ్ల నుంచి నిష్క్రమించాయి. దీంతో నెటిజన్లు రసెల్ను ఐరెన్ లెగ్ అని అంటున్నారు. రసెల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ జట్టు భస్మం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు రసెల్పై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి అతని పేలవ ఫామ్ కూడా ఓ కారణం. రసెల్ ఇటీవలికాలంలో ఏ లీగ్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్లా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో మెరుపులు లేవు, బౌలింగ్లో వికెట్లు లేవు. దీంతో అభిమానులు చిరెత్తిపోయి రసెల్పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. వయసు మీద పడింది, ఇక తప్పుకో అని కొందరంటుంటే.. మరికొందరేమో, పోయి జాతీయ జట్టుకు ఆడుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరేమో డబ్బు కోసం రెస్ట్ లేకుండా ఇన్ని ఊర్లు తిరగాలా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించకుండా ప్రైవేట్ లీగ్ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.రసెల్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20) అబుదాబీ నైట్రైడర్స్ తరఫున ఆడి తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ మ్యాచ్లో ఓటమితో ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబీ నైట్రైడర్స్ కథ ముగిసింది (నిష్క్రమించింది). ILT20లో తన జట్టు ఓడిన వెంటనే రసెల్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగ్లాదేశ్కు పయనమయ్యాడు. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నాడు. ఈ లీగ్లో ఖుల్నా టైగర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన రసెల్ 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ ఓవర్ బౌలింగ్ కూడా చేసిన రసెల్ వికెట్ లేకుండా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్ ఓటమికి రసెల్ ప్రధాన కారణం కానప్పటికీ.. అతని జట్టు మాత్రం లీగ్ నుంచి నిష్క్రమించింది.ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లు చివరి దశకు చేరాయి. బీపీఎల్లో ఫార్చూన్ బారిషల్ ఫైనల్కు చేరగా.. రేపు రెండో క్వాలిఫయర్ జరుగనుంది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ తదుపరి దశకు క్వాలిఫై అయ్యాయి. -
లేటు వయసులోనూ ఇరగదీసిన వార్నర్.. వచ్చాడు.. విరుచుకుపడ్డాడు..!
అబుదాబీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో (ILT20 2025) దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) వచ్చీరాగానే తన ప్రతాపం చూపించాడు. ఐఎల్టీ20లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. అబుదాబీ నైట్రైడర్స్పై విధ్వంసకర ఇన్నింగ్స్ (57 బంతుల్లో 93 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) ఆడి తన జట్టుకు క్వాలిఫయర్స్కు చేర్చాడు. తాజాగా ఇన్నింగ్స్తో వార్నర్ తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు. వార్నర్ మెరుపు బ్యాటింగ్తో చెలరేగడంతో ఈ మ్యాచ్లో నైట్రైడర్స్పై క్యాపిటల్స్ 26 పరుగుల తేడాతో గెలుపొందింది.క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో వార్నర్తో పాటు షాయ్ హోప్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (25 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), దసున్ షనక (12 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. షనక చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివరి రెండు ఓవర్లలో షనక ఎక్కువ భాగం స్ట్రయిక్ తీసుకుని వార్నర్కు బ్యాటింగ్ ఇవ్వలేదు. చివరి రెండు ఓవర్లలో వార్నర్కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చి ఉంటే సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. షనక, వార్నర్ ధాటికి నైట్రైడర్స్ బౌలర్ జేసన్ హోల్డర్ 4 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. నైట్రైడర్స్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్, హోల్డర్, సునీల్ నరైన్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్ చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (47 బంతుల్లో 78; 7 ఫోర్లు, 4 సిక్సర్లు).. ఆఖర్లో జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), సునీల్ నరైన్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నైట్రైడర్స్ను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. క్యాపిటల్స్ బౌలర్ దుష్మంత చమీరా 19వ ఓవర్ను అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవరే నైట్రైడర్స్ విజయావకాశాలపై నీళ్లు చల్లింది.కాగా, ప్రస్తుత ఐఎల్టీ20 ఎడిషన్లో దుబాయ్ క్యాపిటల్స్తో పాటు డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్ క్వాలిఫయర్స్కు చేరుకున్నాయి. గల్ఫ్ జెయింట్స్, అబుదాబీ నైట్రైడర్స్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.ఉదయం శ్రీలంకలో సెంచరీ.. సాయంత్రం అబుదాబీలో మెరుపు ఇన్నింగ్స్నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో క్యాపిటల్స్ ఆటగాడు దసున్ షనక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు ముందు షనక కొన్ని మైళ్ల దూరం ప్రయాణించాడు. ఉదయం శ్రీలంకలో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో సెంచరీ బాదిన షనక.. సాయంత్రం నైట్రైడర్స్పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షనక.. మేజర్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా సింహలీస్ క్లబ్కు ఆడుతూ 87 బంతుల్లో 123 పరుగులు చేశాడు. -
ILT20 2025: చరిత్ర సృష్టించిన ఆండ్రీ రసెల్.. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా..!
విండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ (Andre Russell) పొట్టి క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో (ILT20 2025) ఆడుతున్న రసెల్ (అబుదాబీ నైట్రైడర్స్).. నిన్న (ఫిబ్రవరి 1) గల్ఫ్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్నటి మ్యాచ్లో టామ్ కర్రన్ బౌలింగ్లో బౌండరీ బాదడంతో రసెల్ పొట్టి క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20ల్లో ఈ ఘనత సాధించిన 25వ ఆటగాడిగా నిలిచాడు. ఇక్కడ రికార్డు ఏంటంటే.. రసెల్ ఈ ఘనతను ప్రపంచంలో ఏ ఆటగాడు సాధించనంత వేగంగా (బంతుల పరంగా) సాధించాడు. రసెల్.. 9000 పరుగుల మార్కును కేవలం 5321 బంతుల్లో చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రసెల్ కంటే ముందు ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ పేరిట ఉండేది. మ్యాక్సీ టీ20ల్లో 9000 పరుగులను 5915 బంతుల్లో పూర్తి చేశాడు. టీ20ల్లో 9000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో రసెల్, మ్యాక్సీ తర్వాత ఏబీ డివిలియర్స్ (5985), కీరన్ పోలార్డ్ (5988), క్రిస్ గేల్ ఉన్నారు.టీ20ల్లో రసెల్ ఇప్పటివరకు 536 మ్యాచ్లు ఆడి 26.79 సగటున, 169.15 స్ట్రయిక్రేట్తో 9004 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత రసెల్ మాజీ సహచరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 463 మ్యాచ్ల్లో 144.75 స్ట్రయిక్రేట్తో 14562 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 88 అర్ద శతకాలు ఉన్నాయి.టీ20ల్లో రసెల్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదిరిపోయే రికార్డు కలిగి ఉన్నాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేసే రసెల్.. పొట్టి ఫార్మాట్లో 25.55 సగటున, 8.71 ఎకానమీతో 466 వికెట్లు పడగొట్టాడు.36 ఏళ్ల రసెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంకా రిటైర్ కానప్పటికీ ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్లోనే ఆడుతున్నాడు.రసెల్ ప్రస్తుత ILT20 ఎడిషన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్లో అతను 9 ఇన్నింగ్స్ల్లో 158.53 స్ట్రయిక్రేట్తో కేవలం 130 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. రసెల్ ఈ సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇందులో అతని ఎకానమీ 11.42గా ఉంది.రసెల్ విషయాన్ని పక్కన పెడితే ఈ సీజన్లో అతని జట్టు అబుదాబీ నైట్రైడర్స్ చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటిస్థానంలో ఉంది. ఈ సీజన్లో నైట్రైడర్స్ నిన్నటి మ్యాచ్తో కలుపుకుని 9 మ్యాచ్లు ఆడి ఆరింట ఓడిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ నైట్రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరలేదు. ఇప్పటికే డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి.నిన్నటి మ్యాచ్లో నైట్రైడర్స్ గల్ఫ్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో 9000 పరుగులు పూర్తి చేసిన రసెల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో డేవిడ్ విల్లే (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్.. గెర్హార్డ్ ఎరాస్మస్ (47), టామ్ కర్రన్ (38 నాటౌట్), హెట్మైర్ (20 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. -
టామ్ బాంటన్ విధ్వంసకర శతకం.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ చెలరేగిపోతున్నాడు. డెజర్ట్ వైపర్స్తో నిన్న (జనవరి 27) జరిగిన మ్యాచ్లో బాంటన్ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ 154 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 228 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన టామ్ బాంటన్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాంటన్, ఫ్లెచర్ రెండో వికెట్కు 198 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. యూఏఈ గడ్డపై టీ20ల్లో ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెజర్ట్ వైపర్స్.. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్ల ధాటికి 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. ముహమ్మద్ రోహిద్ ఖాన్, అల్జరీ జోసఫ్ తలో మూడు.. ఫజల్ హక్ ఫారూఖీ, డాన్ మౌస్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టి వైపర్స్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. వీరి దెబ్బకు వైపర్స్ ఇన్నింగ్స్లో ఒక్క ఆటగాడు కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయాడు. కెప్టెన్ సామ్ కర్రన్ (11), వికెట్కీపర్ ఆజమ్ ఖాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన వైపర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.రెండో శతకంఈ సీజన్లో టామ్ బాంటన్కి ఇది రెండో శతకం. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 చరిత్రలో ఒకే సీజన్లో రెండు సెంచరీలు ఎవరూ చేయలేదు. తాజా శతకంతో బాంటన్ ఈ సీజన్ లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. బాంటన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 156.36 స్ట్రయిక్రేట్తో 369 పరుగులు చేశాడు. ఈ సీజన్లో బాంటన్తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఆటగాడు షాయ్ హోప్ ఒక్కడే సెంచరీ చేశాడు. -
ధోనిని అధిగమించిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ టీ20ల్లో ఓ భారీ రికార్డును సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు. టీ20ల్లో ధోని 391 మ్యాచ్ల్లో 7432 పరుగులు చేయగా.. డీకే 409 మ్యాచ్ల్లో 7451 పరుగులు సాధించాడు. ఐపీఎల్ సహా భారత క్రికెట్ మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించిన డీకే ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్లో (SA20 2025) ఆడుతున్నాడు. ఈ లీగ్లో పార్ల్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న డీకే.. నిన్న (జనవరి 27) డర్బన్ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ధోని రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్లో 15 బంతుల్లో 2 భారీ సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసిన కార్తీక్ మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోని రికార్డును బద్దలు కొట్టాడు.39 ఏళ్ల దినేశ్ కార్తీక్ పొట్టి ఫార్మాట్లో 26.99 సగటున, 136.84 స్ట్రయిక్రేట్తో 34 హాఫ్ సెంచరీల సాయంతో 7451 పరుగులు చేశాడు. ఇందులో 718 బౌండరీలు, 258 సిక్సర్లు ఉన్నాయి. ధోని విషయానికొస్తే.. ఈ మాజీ సీఎస్కే కెప్టెన్ తన టీ20 కెరీర్లో 38.11 సగటున, 135.64 స్ట్రయిక్రేట్తో 28 హాఫ్ సెంచరీల సాయంతో 7432 పరుగులు చేశాడు. ఇందులో 517 ఫోర్లు, 338 సిక్సర్లు ఉన్నాయి. 43 ఏళ్ల ధోనికి కార్తీక్ రికార్డును తిరిగి అధిగమించేందుకు మరో అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. తదుపరి ఐపీఎల్ సీజన్లో ధోని మరి కొన్ని పరుగులు చేసినా డీకేను అధిగమిస్తాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండో ఎడిషన్లో డీకేకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. ఈ సీజన్లో అతను ఎనిమిది ఇన్నింగ్స్ల్లో ఐదుసార్లు మాత్రమే బ్యాటింగ్కు దిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్ల్లో కూడా నిన్న జరిగిన మ్యాచ్లో చేసిన స్కోరే అత్యధికం. కార్తీక్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేకపోయినా పార్ల్ రాయల్స్ ఈ సీజన్లో అదరగొట్టింది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. తాజా గెలుపుతో రాయల్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రాయల్స్ చేతిలో ఓటమితో డర్బన్ సూపర్ జెయింట్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. డర్బన్ సూపర్ జెయింట్స్పై పార్ల్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్ జెయింట్స్ తరఫున మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ మరో బంతి మిగిలుండగా 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ జో రూట్ డకౌటై నిరాశపర్చగా.. డ్రి ప్రిటోరియస్ (43), రూబిన్ హెర్మన్ (59) రాయల్స్ను గెలిపించారు. చివర్లో దినేశ్ కార్తీక్ (15 బంతుల్లో 21) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. -
రొమారియో షెపర్డ్ ఊచకోత
అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ మరో విజయం సాధించింది. నిన్న (జనవరి 21) జరిగిన మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ అబుదాబీ నైట్రైడర్స్పై 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఎంఐ ఎమిరేట్స్ (6 పాయింట్లు) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 5 మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో డెజర్ట్ వైపర్స్ (8 పాయింట్లు) టాప్ ప్లేస్లో ఉండగా.. అబుదాబీ నైట్రైడర్స్ (4) మూడో స్థానంలో, దుబాయ్ క్యాపిటల్స్ (4), షార్జా వారియర్జ్ (4), గల్ఫ్ జెయింట్స్ (2) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.రొమారియో షెపర్డ్ ఊచకోతతొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. పూరన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. ఓపెనర్లు కుసాల్ పెరీరా (20 బంతుల్లో 23; 5 ఫోర్లు), ముహమ్మద్ వసీం (35 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఐదు బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్లోనూ షెపర్డ్ రెండు బౌండరీలు బాదాడు. షెపర్డ్ ఊచకోత దెబ్బకు ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో గత మ్యాచ్ సెంచరీ హీరో టామ్ బాంటన్ (9), కీరన్ పోలార్డ్ (5), మౌస్లీ (6) నిరాశపరిచారు. నైట్రైడర్స్ బౌలర్లలో అలీ ఖాన్, జేసన్ హోల్డర్ తలో రెండు, ఇబ్రార్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్కు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (14 బంతుల్లో 22; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (34 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇన్నింగ్స్ మధ్యలో నైట్రైడర్స్ తడబడింది. జో క్లార్క్ (3), కైల్ పెప్పర్ (5), అలీషాన్ షరాఫు (4), లారీ ఇవాన్స్ (7) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో బరిలోకి దిగిన ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) నైట్రైడర్స్ను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో రసెల్ ఏమీ చేయలేకపోయాడు. చివరి వరుస బ్యాటర్లు సునీల్ నరైన్ 13, డేవిడ్ విల్లే 1, జేసన్ హోల్డర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. నైట్రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఫజల్ హక్ ఫారూకీ, వకార్ సలామ్కిల్, జహూర్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
గుల్బదిన్ ఆల్రౌండ్ షో.. వైపర్స్కు తొలి పరాజయం
ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20-2025) డెసర్ట్ వైపర్స్కు తొలి పరాజయం ఎదురైంది. నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్లో వైపర్స్ దుబాయ్ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. క్యాపిటల్స్ను గుల్బదిన్ నైబ్ ఆల్రౌండ్ షోతో గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్ 19.5 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. వైపర్స్ ఇన్నింగ్స్లో అలెక్స్ హేల్స్ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (27), డాన్ లారెన్స్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫకర్ జమాన్ (14), సామ్ కర్రన్ (3), ఆజమ్ ఖాన్ (10), హసరంగ (13), తనిశ్ సూరి (0), అలీ నసీర్ (2), లకీ ఫెర్గూసన్ (7) నిరాశపరిచారు. క్యాపిటల్స్ బౌలర్లలో చమీరా, జహీర్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. హైదర్ అలీ, మెక్కాయ్, గుల్బదిన్, సికందర్ రజా తలో వికెట్ తీశారు.అనంతరం 140 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని క్యాపిటల్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఆ జట్టు 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బౌలింగ్లో ఓ వికెట్ తీసి, ఫీల్డింగ్లో ఓ క్యాచ్ పట్టిన గుల్బదిన్ నైబ్.. బ్యాటింగ్లోనూ సత్తా చాటి రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.నైబ్కు జతగా సికందర్ రజా (24), నజీబుల్లా జద్రాన్ (10 నాటౌట్) నిలబడి క్యాపిటల్స్ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో బెన్ డంక్ 13, షాయ్ హోప్ 8, ఖలద్ షా 4 పరుగులు చేశారు. వైపర్స్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, మొహమ్మద్ అమిర్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు క్యాపిటల్స్కు ప్రస్తుత ఎడిషన్లో రెండోది. ప్రస్తుతం ఆ జట్టు 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. క్యాపిటల్స్ చేతిలో ఓడినా వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది. -
శతక్కొట్టిన టామ్ బాంటన్.. ముంబై ఇండియన్స్ తరఫున తొలి సెంచరీ
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025 ఎడిషన్లో రెండో సెంచరీ నమోదైంది. షార్జా వైపర్స్తో నిన్న (జనవరి 19) జరిగిన మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ శతక్కొట్టాడు. ఐఎల్టీ20 (ILT20) చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. బాంటన్కు ముందు ఐఎల్టీ20లో కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీలు చేశారు. లీగ్ చరిత్రలో తొలి సెంచరీని టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) చేయగా.. రెండో సెంచరీని అలెక్స్ హేల్స్ (డెజర్ట్ వైపర్స్) చేశాడు. లీగ్లో మూడో సెంచరీ ఇదే సీజన్లో నమోదైంది. సీజన్ నాలుగో మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్పై షాయ్ హోప్ (దుబాయ్ క్యాపిటల్స్) శతక్కొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వారియర్స్పై ఎంఐ ఎమిరేట్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్, ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లూక్ వెల్స్ (18), కరీమ్ జనత్ (18), ఎథన్ డిసౌజా (11) రెండంకెల స్కోర్లు చేశారు. జేసన్ రాయ్ (1), రోహన్ ముస్తఫా (6), కీమో పాల్ (4), కెప్టెన్ సౌథీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ రెండు, రొమారియో షెపర్డ్, వకార్ సలామ్కిల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్ 17.4 ఓవర్లలో ఆడుతూపాడుతూ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎమిరేట్స్ ఆదిలోనే ముహమ్మద్ వసీం (12) వికెట్ కోల్పోయినా, టామ్ బాంటన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ కుసాల్ పెరీరా (42 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్కు అజేయమైన 157 పరుగులు జోడించారు. ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఐఎల్టీ20లో డెసర్ట్ వైపర్స్ ఆటగాళ్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 164 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్కైనా అత్యధికం. 2023 సీజన్లో మున్రో, హేల్స్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపుతో ఎమిరేట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో పోలార్డే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
పూరన్ సిక్సర్ల సునామీ.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. హోప్ సెంచరీ వృధా
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ బోణీ కొట్టింది. దుబాయ్ క్యాపిటల్స్తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (52 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (29 బంతుల్లో 59; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ అర డజను సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్లో పోలార్డ్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ వసీం (18) రెండంకెల స్కోర్లు చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓలీ స్టోన్ 2, చమీరా ఓ వికెట్ దక్కించుకున్నారు.హోప్ సెంచరీ వృధాఛేదనలో క్యాపిటల్స్ ఓపెనర్ షాయ్ హోప్ (59 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హోప్కు మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ డంక్ (10), బ్రాండన్ మెక్ముల్లెన్ (16), గుల్బదిన్ నైబ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సికందర్ రజా (6), దుసన్ షనక (0) విఫలమయ్యారు. క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూఖీ, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్కిల్, అల్లా ఘజన్ఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. క్యాపిటల్స్ చేసిన స్కోర్లో హోప్ ఒక్కడే మూడొంతులు చేయడం విశేషం. 161 పరుగుల్లో హోప్ 101 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు, ఎక్స్ట్రాల రూపంలో 60 పరుగులు వచ్చాయి. -
గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. పూరన్, పోలార్డ్ కూడా ఏమీ చేయలేకపోయారు..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్తో తలపడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్ను గెలిపించలేకపోయారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్ముల్లెన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్ పావెల్ (25), దసున్ షనక (13), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్ హోప్ 9, రొస్సింగ్టన్ 9, గుల్బదిన్ నైబ్ 2, ఫర్హాన్ ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి దుబాయ్ క్యాపిటల్స్ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్, జహూర్ ఖాన్కు తలో వికెట్ దక్కింది.స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్కు అకీల్ హొసేన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్లో కీరన్ పోలార్డ్ (15 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. దుబాయ్ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో ముహమ్మద్ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, అల్జరీ జోసఫ్ డకౌట్లు కాగా.. కుసాల్ పెరీరా 12, టామ్ బాంటన్ 7 పరుగులు చేశారు.గెలుపు దూరం చేసిన గుల్బదిన్ నైబ్, ఓల్లీ స్టోన్ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్ నైబ్ (4-0-13-3, ఓల్లీ స్టోన్ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్ వేసిన గుల్బదిన్ నైబ్ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్, అల్జరీ జోసఫ్) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్ వేసిన ఓల్లీ స్టోన్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్ ఖాన్ బౌలింగ్లో పోలార్డ్ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్ నైబ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్పై నిషేధం
గుజరాత్ టైటాన్స్ బౌలర్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్పై ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) మేనేజ్మెంట్ నిషేధం విధించింది. షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ నూర్పై 12 నెలల నిషేధం విధిస్తున్నట్లు ILT20 యాజమాన్యం ప్రకటించింది. నూర్కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నూర్పై నిషేధం విధించింది. నూర్ ఇంటర్నేషనల్ లీగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడేందుకు మొగ్గు చూపాడు. ILT20 క్రమశిక్షణా ఉల్లంఘణ కమిటీ తొలుత నూర్పై 20 నెలల నిషేధం విధించింది. అయితే ఒప్పందంపై సంతకం చేసే సమయానికి నూర్ మైనర్ కావడంతో అతని నిషేధ కాలాన్ని ఎనిమిది నెలలు తగ్గించి 12 నెలలకు కుదించారు. ఇంటర్నేషనల్ లీగ్ యాజమాన్యం కొద్ది నెలల క్రితం నూర్ సహచరుడు, ఆఫ్ఘనిస్తాన్ వివదాస్పద బౌలర్ నవీన్ ఉల్ హాక్పై కూడా నిషేధం విధించింది. అతను కూడా నూర్ లాగే కాంట్రాక్ట్ పొడిగింపు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. 19 ఏళ్ల నూర్.. 2023 ILT20 సీజన్లో వారియర్స్ తరఫున ఏడు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ నూర్తో 2023 సీజన్కు ముందు 30 లక్షల బేస్ ధరకు ఒప్పందం కుదుర్చుకుంది. నూర్ 2023 ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. -
పూనకాలు తెప్పించిన పూరన్.. మరో టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2024 ఎడిషన్ టైటిల్ను ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కైవసం చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్తో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన ఫైనల్లో ఎమిరేట్స్ టీమ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెబర్ (37 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో ముహమ్మద్ వసీం (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో సికందర్ రజా, ఓలీ స్టోన్, జహీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. MI won the T20 league in India.MI won the T20 league in America.MI won the T20 league in Dubai. - MI franchise is ruling everywhere 🏆🫡 pic.twitter.com/ORTEE65GD0— Johns. (@CricCrazyJohns) February 17, 2024 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన దుబాయ్ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-20-2), విజయ్కాంత్ వియాస్కాంత్ (4-0-24-2) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు (7 వికెట్ల నష్టానికి) మాత్రమే చేయగలిగింది. అకీల్ హొసేన్, రోహిద్ ఖాన్, సలాంకీల్ తలో వికెట్ పడగొట్టారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40), టామ్ బాంటన్ (35), జేసన్ హోల్డర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టార్ ఆటగాళ్లు సికందర్ రజా (10), రోవ్మన్ పావెల్ (8) విఫలమయ్యారు. మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగిన ముంబై కెప్టెన్ పూరన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఇది తొమ్మిదో టైటిల్. MI won CLT20 in 2011MI won IPL in 2013MI won CLT20 in 2013MI won IPL in 2015MI won IPL in 2017MI won IPL in 2019MI won IPL in 2020MI won WPL in 2023MINY won MLC in 2023MIE won ILT20 in 2024The Dominance of MI franchise. 🤯🔥 pic.twitter.com/GcGDcOqQ4I— Johns. (@CricCrazyJohns) February 17, 2024 -
నిన్న ప్రత్యర్దులు.. నేడు సహచరులు, ఒక్క రోజులో సీన్ రివర్స్
ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్ పూరన్ (వెస్టిండీస్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్లో పూరన్, డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్ స్కోర్ 45/2గా ఉంది. ముహమ్మద్ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్ (0) ఔట్ కాగా.. పూరన్ (9), కుశాల్ పెరీర్ (22) క్రీజ్లో ఉన్నారు. కాగా, నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్తో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది. -
సికందర్ రజా ఆల్రౌండ్ షో.. నైట్రైడర్స్ నిష్క్రమణ
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో అబుదాబీ నైట్రైడర్స్ కథ ముగిసింది. వరుసగా రెండో సీజన్లోనూ ఆ జట్టు ఎలిమినేటర్ దశ దాటలేకపోయింది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో దుబాయ్ క్యాపిటల్స్.. నైట్రైడర్స్ను 85 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. క్యాపిటల్స్ ఆటగాడు సికందర్ రజా (40, 2/27) ఆల్రౌండ్ షోతో నైట్రైడర్స్ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. టామ్ బాంటన్ (44), ఏబెల్ (41), సామ్ బిల్లింగ్స్ (46 నాటౌట్), సికందర్ రజా (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బౌలర్లలో సాబిర్ అలీ 2, విల్లే, జాషువ లిటిల్, ఫేబియన్ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నైట్రైడర్స్.. సికందర్ రజాతో పాటు స్కాట్ కుగ్గెలిన్ (4/17), జహీర్ ఖాన్ (2/25), ఓలీ స్టోన్ (1/18) విజృంభించడంతో 16.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో డేవిడ్ విల్లే (36) టాప్ స్కోరర్గా నిలువగా.. సామ్ హెయిన్ (29), జో క్లార్క్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సీజన్ క్వాలియర్-1కు ఎంఐ ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ ఇదివరకే అర్హత సాధించగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఓడిన జట్టు ఫిబ్రవరి 15న జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ మధ్య క్వాలియర్-1 మ్యాచ్ ఇవాళ జరుగనుంది. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్లో ఒకలా మరో, మరో లీగ్లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్లో డెజర్ట్ వైపర్స్పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్లో ఎంఐ కేప్టౌన్ కథ ముగిసింది. -
ఇకపై ధోని నాకు బౌలింగ్ ఇవ్వనన్నాడు: తీక్షణ కామెంట్స్ వైరల్
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అదరగొట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యువ క్రికెటర్లలో శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణ ఒకడు. 2021లో లంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్.. మూడు ఫార్మాట్లలోనూ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక సభ్యుడిగా ఎదిగి జట్టులో తన స్థానం సుసిర్థం చేసుకున్నాడు. కాగా మహీశ్ తీక్షణ 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్కు అతడు ఆడుతున్న విషయం తెలిసిందే. అనుకున్న ఫలితాలు రాబడుతూ.. తీక్షణ బౌలింగ్ నైపుణ్యాలను వినియోగించుకుంటూ.. ఎప్పటికప్పుడు అతడిని ప్రోత్సహిస్తూ జట్టుకు కావాల్సిన ఫలితాలు రాబట్టాడు తలా. అంతేకాదు విమర్శలు వచ్చిన సమయంలోనూ అతడికి అండగా నిలబడ్డాడు. ఈ విషయాన్ని మహీశ్ తీక్షణ తాజాగా పునరుద్ఘాటించాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో.. షార్జా వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న తీక్షణ.. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి పంచుకున్నాడు. ఐపీఎల్-2024లో ధోని తనకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వనన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నన్ను హగ్ చేసుకున్నారు.. ఇకపై బౌలింగ్ వద్దన్నారు! ‘‘ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత నేను, మతీశ పతిరణ మా దేశానికి పయనం కావాల్సి ఉంది. అప్పటికే పార్టీ ముగించుకున్నాం. అయితే, వెళ్లేముందు ఒకసారి ధోనిని కలిసి వీడ్కోలు చెప్పాలని అనుకున్నాం. ఆయన మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. నన్ను ఆలింగనం చేసుకుని.. ‘వచ్చే సీజన్లో నీకు బౌలింగ్ ఛాన్స్ ఇవ్వను. నువ్వు కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేయాలి’ అని నాతో అన్నారు’’ అంటూ తమ మధ్య జరిగిన సరదా సంభాషణను తీక్షణ వెల్లడించాడు. అదే విధంగా తనపై విమర్శలు వచ్చిన సమయంలో ధోని అండగా నిలబడిన తీరును ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. క్యాచ్లు డ్రాప్ చేసినా నన్ను నమ్మారు ‘‘గతేడాది నా ఫీల్డింగ్ సరిగ్గా లేదు. కనీసం 4- 5 క్యాచ్లు డ్రాప్ చేశాను. అందుకు నేనే జవాబుదారీగా ఉన్నాను. ఏదేమైనా వాళ్లు(మేనేజ్మెంట్) నాపై నమ్మకం కోల్పోలేదు. నన్ను తుదిజట్టు నుంచి తప్పించలేదు. అందుకే ధోనితో కలిసి ఆడటం అందరికీ అంత ఇష్టం మరి! మనుషులన్నాక తప్పులు చేయడం సహజం.. ఇంకో అవకాశం ఇస్తే వాటిని కచ్చితంగా సరిదిద్దుకుంటారని ఆయనకు తెలుసు. ఆయనలో నాకు ఎక్కువగా నచ్చే గుణం అదే’’ అంటూ మహీశ్ తీక్షణ తలాపై ప్రశంసలు కురిపించాడు. ఎల్లవేళలా అండగా ధోని కాగా గతేడాది ఐపీఎల్ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫు మహీశ్ తీక్షణ 11 వికెట్లు తీశాడు. తద్వారా సీఎస్కే ఏకంగా ఐదోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్ని కీలక మ్యాచ్లలో క్యాచ్లు డ్రాప్ చేయడం వల్ల అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి సమయంలో ధోని తనకు అండగా నిలిచాడని తాజా ఇంటర్వ్యూలో 23 ఏళ్ల తీక్షణ గుర్తు చేసుకున్నాడు. అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. చదవండి: Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు -
ఉత్కంఠ సమరంలో చివరి బంతికి విజయం.. వైపర్స్ను గెలిపించిన అఫ్రిది
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో నిన్న మరో రసవత్తర సమరం జరిగింది. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్తో జరిగిన మ్యాచ్లో డెజర్ట్ వైపర్స్ చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి బంతికి వైపర్స్ మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో షాహీన్ అఫ్రిది (12 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్) కావాల్సిన పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఫలితంగా వైపర్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్లో వైపర్స్కు ఇది రెండో విజయం. pic.twitter.com/s2yg5r0O5B — Jas Pope (@jas_pope93438) January 30, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. మొహమ్మద్ ఆమీర్ (4-0-26-3), లూక్ వుడ్ (4-0-32-2), మతీష పతిరణ (4-0-32-2), హసరంగ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ (28), అకీల్ హొసేన్ (24), అంబటి రాయుడు (23) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన వైపర్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహీన్ అఫ్రిది చివరి బంతికి మూడు పరుగుల తీసి వైపర్స్ను గెలిపించాడు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. అఫ్రిది, లూక్ వుడ్ (6 నాటౌట్) సాయంతో తన జట్టును గెలిపించాడు. వైపర్స్ ఇన్నింగ్స్లో షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (35), హసరంగ (26), ఆజమ్ ఖాన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిద్ ఖాన్ 3 వికెట్లతో వైపర్స్ను ఇబ్బంది పెట్టగా.. ఫజల్ హక్ ఫారూకీ, డ్వేన్ బ్రావో తలో 2 వికెట్లు, సలామ్కీల్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఇది కదా క్రీడా స్పూర్తి అంటే? రనౌట్ అయినా కూడా వెనుక్కి! వీడియో
ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం షార్జా వేదికగా డెసర్ట్ వైపర్స్, షార్జా వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ కోలిన్ మున్రో మాత్రం అభిమానులు మనసును గెలుచకున్నాడు. ఈ మ్యాచ్లో క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. రనౌట్ రూపంలో వికెట్ పొందే అవకాశం ఉన్నప్పటకీ మున్రో మాత్రం తన నిర్ణయంతో అందరని ఆశ్చర్యపరిచాడు. ఏం జరిగిందంటే? షార్జా వారియర్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన షాదాబ్ ఖాన్ బౌలింగ్లో జో డెన్లీ స్ట్రైట్గా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న మార్టిన్ గప్టిల్కు బలంగా తాకి బౌలర్ చేతికి వెళ్లింది. బంతి తగిలిన వెంటనే గప్టిల్ నొప్పితో కిందపడిపోయాడు. అప్పటికే గప్టిల్ క్రీజు బయట ఉండడం గమనించిన షాదాబ్ ఖాన్.. స్టంప్స్ను పడగొట్టి రనౌట్కు అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఔట్ ఇచ్చేశాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మాన్రో షాదాబ్తో మాట్లాడి రనౌట్ అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు. ప్టిల్కు తన ఇన్నింగ్స్ను కొనసాగించే అవకాశాన్ని మున్రో కల్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మున్రోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా గప్టిల్, మున్రో న్యూజిలాండ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైంది. చదవండి: అతి జాగ్రత్తే కొంపముంచింది.. రోహిత్ కూడా సచిన్లా ఆడాలి: మాజీ క్రికెటర్ Being a good sport goes above being good at the sport. Hats off to the @TheDesertVipers skipper for playing a fair game 🫡🫡#DPWorldILT20 #AllInForCricket #DVvSW pic.twitter.com/IotodgnKs7 — International League T20 (@ILT20Official) January 28, 2024 -
క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్.. పక్షిలా ఎగురుతూ! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్తో మెరిశాడు. అబుదాబి బ్యాటర్ లారీ ఎవాన్స్ను సంచలన క్యాచ్తో బౌల్ట్ పెవిలియన్కు పంపాడు. అబుదాబి ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్లో ఎవాన్స్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్ ఆఫ్లో ఉన్న బౌల్ట్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన ఎవాన్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. బౌల్ట్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో అబుదాబి నైట్ రైడర్స్పై 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ విజయం సాధించింది. N̶o̶ f̶l̶y̶ z̶o̶n̶e̶ this term doesn't exist in Boult's dictionary ✈️ #MIEvADKR | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/RUPxDCx488 — Zee Cricket (@ilt20onzee) January 28, 2024 -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో అబుదాబీ నైట్రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్లో నైట్రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్ను గెలిపించాడు. నైట్రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో డెజర్ట్ వైపర్స్పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
ఇదేమి సిక్స్రా బాబు.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్-2024లో ఎంఐ ఎమిరేట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా షార్జా వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 106 పరుగుల తేడాతో ఎమిరేట్స్ ఘన విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా.. ముంబై బౌలర్ల దాటికి 12.1 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. ఎంఐ బౌలర్లలో స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్, సలీమీఖాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కుశాల్ పెరీరా, ఫ్లెచర్ చెరో 42 పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. నికోలస్ పూరన్ భారీ సిక్సర్.. కాగా ఈ మ్యాచ్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. ఎంఐ ఇన్నింగ్స్ 19 ఓవర్లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 102 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో పూరన్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. The 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 show 🥵 Waah, kya maara hai 👌#SWvMIE | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/GwswS0vW0V — Zee Cricket (@ilt20onzee) January 26, 2024 -
వెస్టిండీస్ క్రికెటర్ ఊచ కోత.. కేవలం 26 బంతుల్లోనే!
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో షార్జా వారియర్స్ తొలి విజయం నమోదు చేసింది. సోమవారం దుబాయ్ వేదికగా దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో షార్జా గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దుబాయ్ బ్యాటర్లలో సామ్ బిల్లింగ్స్(52) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సికిందర్ రజా 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షార్జా వారియర్స్ బౌలర్లలో డానియల్ సామ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. చార్లెస్ ఊచకోత.. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా వారియర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో విండీస్ ఓపెనర్ జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు బసిల్ హమిద్(24) ఆఖరిలో బౌండరీలు వర్షం కురిపించి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్.. -
సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఇవాళ (జనవరి 21) ఆసక్తికర మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో అబుదాబీ నైట్రైడర్స్ సునాయాసంగా విజయం సాధించి, లీగ్లో తమ గెలుపును నమోదు చేసింది. మ్యాచ్ వరకు సాదాసీదాగా సాగినా ఓ సందర్భం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నైట్ రైడర్స్ ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశం ఉన్నా సహచర ఆటగాడి కారణంగా ఆ మార్కును అందుకోలేకపోయాడు. ఆఖర్లో గౌస్ సిక్సర్ కొడితే అతని సెంచరీ పూర్తి కావడంతో పాటు తన జట్టు కూడా గెలుస్తుంది. అయితే అప్పుడే క్రీజ్లోకి వచ్చిన ఇమాద్ వసీం.. స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా గెలుపు కావాల్సిన పరుగులు (ఫోర్) చేశాడు. ఇమాద్ సింగిల్ తీసి గౌస్కు స్ట్రయిక్ ఇచ్చుంటే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. అప్పటివరకు దూకుడుగా ఆడిన గౌస్.. సెంచరీ కోసమనే నిదానంగా ఆడుతూ 18వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లాడు. ఇమాద్.. గౌస్ సెంచరీ విషయాన్ని పట్టించుకోకుండా బౌండరీ కొట్టి మ్యాచ్ను ముగించడంతో అంతా ఆశ్చర్యపోయారు. టీ20 క్రికెట్లో సెంచరీ చేసే అవకాశం తరుచూ రాదు కాబట్టి గౌస్ పట్ల అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. అలీ ఖాన్ (3/29), సునీల్ నరైన్ (2/23), జాషువ లిటిల్ (1/21), ఇమాద్ వసీం (1/45), డేవిడ్ విల్లే (1/24) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులకు పరిమితమైంది. వైపర్స్ ఇన్నింగ్స్లో ఆడమ్ హోస్ (45) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఆండ్రియస్ గౌస్ రెచ్చిపోవడంతో నైట్రైడర్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గౌస్కు కైల్ పెప్పర్ (36), లారీ ఈవాన్స్ (21) సహకరించారు. గౌస్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 30 ఏళ్ల గౌస్ సౌతాఫ్రికాకు చెందిన వాడు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన గౌస్.. నైట్రైడర్స్ ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడు. -
జీరో దగ్గర వదిలేశాడు.. ఏకంగా విధ్వంసం సృష్టించేశాడు! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో దుబాయ్ క్యాపిటిల్స్ శుభారంభం చేసింది. శనివారం ఎంఐ ఎమిరేట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్(81) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్ స్కోరర్గా నిలిచాడు. కొంపముంచిన ట్రెంట్ బౌల్ట్.. దుబాయ్ క్యాపిటిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన గుర్బాజ్కు ఆరంభంలోనే ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓ అవకాశమిచ్చేశాడు. సున్నా పరుగుల వద్ద గుర్బాజ్ ఇచ్చిన ఈజీ రిటర్న్ క్యాచ్ను బౌల్ట్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకు ఎంఐ ఎమిరేట్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత గుర్భాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీల వర్షం కురిపించాడు. గుర్బాజ్ ఏకంగా 81 పరుగులతో విజయాన్ని ముంబైకు దూరం చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 8 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. ఒక వేళ గుర్భాజ్ క్యాచ్ను బౌల్ట్ పట్టివుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. బౌల్ట్ విడిచిపెట్టిన క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 🫣 🫣#DCvMIE | #KoiKasarNahiChhodenge | #DPWorldILT20onZee | @ILT20Official pic.twitter.com/9D7H6fB9H8 — Zee Cricket (@ilt20onzee) January 20, 2024 -
తుస్సుమన్పించిన అంబటి రాయుడు.. కేవలం ఒక్క పరుగుకే
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024ను టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు పేలవంగా ఆరంభించాడు. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీకి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయుడు దారుణంగా విఫలమయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రాయుడు 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్ 2023 విజయానంతరం అన్ని రకాల క్రికెట్కు రాయుడు గుడ్బై చెప్పాడు. బీసీసీఐతో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో భాగమయ్యాడు. అనంతరం ఐఎల్ టీ20 టోర్నీ-2024లో ఆడేందుకు ఎంఐ ఎమిరేట్స్తో రాయుడు ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఎమిరెట్స్పై 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దుబాయ్ బ్యాటర్లలో హ్మనుల్లా గుర్బాజ్(89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చదవండి: గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్ -
స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్ ఖాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చాడు. స్టాండ్స్లో కూర్చుని మ్యాచ్ను షారుఖ్ ఎంజాయ్ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు. షారుఖ్తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కిరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గత ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సైతం షారుఖ్ హాజరయ్యాడు. ఈ లీగ్లో అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్కు చెందిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగమయ్యారు. కాగా కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఎమిరేట్స్పై 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు Shah Rukh Khan spotted watching #ILT20 game in UAE pic.twitter.com/AW6BywpDF0 — Syed Irfan Ahmad (@Iam_SyedIrfan) January 20, 2024 -
కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్ల కోసం తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్ కేప్టౌన్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ కేప్టౌన్కు (SA20 2024) కీరన్ పోలార్డ్, ఎంఐ ఎమిరేట్స్కు (ILT20 2024) నికోలస్ పూరన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని ముంబై యాజమాన్యం ఇవాళ వెల్లడించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఈ నెల 19 నుంచి మొదలవుతుంది. కాగా, కీరన్ పోలార్డ్ అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో కూడా ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ ఇటీవల తమ కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబై ఇండియన్స్ను ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్ల తర్వాత మే నెలలో ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఎడిషన్లో అట్టడుగు స్థానంలో నిలిచి ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపర్చిన ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా పేస్ గన్ గెరాల్డ్ కోయెట్, లంక పేసర్ దిల్షాన్ మధుశంకను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు.. రోహిత్ శర్మ బ్యాట్స్మన్ 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్మన్ 8 కోట్లు ఇషాన్ కిషన్ బ్యాట్స్మన్ 15.25 కోట్లు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్మన్ 3 కోట్లు తిలక్ వర్మ బ్యాట్స్మెన్ 1.7 కోట్లు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్) టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు జాసన్ బెహ్రెన్డార్ఫ్ బౌలర్ 75 లక్షలు ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు -
ILT20 2024: దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్గా వార్నర్
International League T20: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్ మార్వెల్ అంటూ వార్నర్ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. కాగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్-2023లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్లలో కలిపి 516 పరుగులు సాధించిన వార్నర్.. ఆటగాడిగా సఫలమైనా.. కెప్టెన్గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రోవ్మన్ పావెల్ స్థానంలో వార్నర్ అయినప్పటికీ వార్నర్ నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచిన క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఈసారి ఐఎల్టీ20 లీగ్లో అతడిని తమ సారథిగా ఎంచుకుంది. ఇక దుబాయ్ క్యాపిటల్స్కు తొలి ఎడిషన్(2023)లో వెస్టిండీస్ స్టార్ రోవ్మన్ పావెల్ కెప్టెన్గా వ్యవహరించాడు. పది మ్యాచ్లలో నాలుగు గెలిపించి ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. ప్రస్తుత సీజన్ కోసం 37 ఏళ్ల వార్నర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా జనవరి 13 నుంచి ఐఎల్టీ20 -2024 ఎడిషన్ ఆరంభం కానుంది. కాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను టైటిల్ విజేతగా నిలిపిన ఘనత కలిగిన వార్నర్కు టీ20లలో బ్యాటర్గానూ మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ వన్డేలకూ రిటైర్మెంట్ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తంగా 356 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్.. 11695 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్కప్ విజేతగా నిలపడంలో అతడిది కీలక పాత్ర. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఆండ్రూ టై, దసున్ షనక, దుష్మంత చమీర, జో రూట్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, నువాన్ తుషార, రహ్మనుల్లా గుర్బాజ్, రజా ఆకిఫ్, రోవ్మన్ పావెల్, రోలోఫ్ వాన్డెర్ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్, సికిందర్ రజా. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? View this post on Instagram A post shared by Dubai Capitals (@dubaicapitals) -
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్పై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్పై దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) నిషేధం విధించింది. లీగ్లో భాగమైన షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నవీన్పై 20 నెలల నిషేధం విధిస్తున్నట్లు లీగ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నవీన్కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నవీన్పై నిషేధం విధించింది. నవీన్ ఈ ఏడాది ఆరంభంలో (2023, జనవరి) జరిగిన ILT20 సీజన్-1లో షార్జా వారియర్స్ తరపున ఆడాడు. ముందస్తు అగ్రిమెంట్లో భాగంగా ఫ్రాంచైజీ యాజమాన్యం నవీన్కు రిటెన్షన్ నోటీసులు పంపింది. అయితే నవీన్ సదరు నోటీసులపై సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో లీగ్ మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో నవీన్పై 20 నెలల నిషేధం విధించింది. నవీన్.. 2023 సీజన్లో వారియర్స్ తరఫున మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఆడి, 24.36 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్లో నవీన్ ప్రాతినిథ్యం వహించిన షార్జా వారియర్స్ ఐదో స్థానంతో గత సీజన్ను ముగించింది. ఈ సీజన్లో వారు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించారు. -
2024 సీజన్ ప్లేయర్ల రిటెన్షన్.. స్టార్ ఆటగాళ్లందరూ తిరిగి ఆయా జట్లకే..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు.. తదుపరి ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ (తిరిగి దక్కంచుకోవడం) ప్రక్రియను ఇవాళ (జులై 10) పూర్తి చేశాయి. వచ్చే ఏడాది (2024) జనవరి 13 నుంచి ప్రారంభం కాబోయే ILT20 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గల్ఫ్ జెయింట్స్ సహా మిగతా అన్ని జట్లు తమ స్టార్ క్రికెటర్లను తిరిగి దక్కించుకున్నాయి. The big names are back for Season 2!🙌 All your favorites from the inaugural edition return to battle it out once again in Season 2 of the #DPWorldILT20. Are you ready for a firecracker of a tournament?💥 For more details, please visit: https://t.co/PXt4HL1vCp pic.twitter.com/dHdUYMN1D4 — International League T20 (@ILT20Official) July 10, 2023 గల్ఫ్ జెయింట్స్.. షిమ్రోన్ హెట్మైర్, క్రిస్ జోర్డన్, జేమ్స్ విన్స్, క్రిస్ ఓవర్టన్, క్రిస్ లిన్, అయాన్ ఖాన్, సంచిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్, కార్లోస్ బ్రాత్వైట్, రెహాన్ అహ్మద్, గెర్హార్డ్ ఎరాస్మస్లను దక్కించుకోగా.. గతేడాది రన్నరప్ డెసర్ట్ వైపర్స్.. హసరంగ, అలెక్స్ హేల్స్, టామ్ కర్రన్, కొలిన్ మన్రో, షెఫానీ రూథర్ఫోర్డ్, లూక్ వుడ్, పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, చండీమాల్, అట్కిన్సన్, అలీ నసీర్లను రీటైన్ చేసుకున్నాయి. అబుదాబీ నైట్రైడర్స్.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, జో క్లార్క్, చరిత్ అసలంక, అలీ ఖాన్, మతీవుల్లా ఖాన్, మర్చంట్ డి లాంజ్, సాబిర్ అలీని తిరిగి దక్కంచుకుంది. మిగతా మూడు జట్లు తిరిగి దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు: దుబాయ్ క్యాపిటల్స్.. జో రూట్, సికందర్ రజా, రోవ్మన్ పావెల్, దుష్మంత చమీరా, రజా అకీఫుల్లా ఖాన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, మహ్మద్ వసీం, డేవిడ్ మౌస్లీ, జహూర్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, థామ్సన్, మెక్ కెన్నీ క్లార్క్, ఆండ్రీ ఫ్లెచర్ షార్జా వారియర్స్.. క్రిస్ వోక్స్, జునైద్ సిద్ధిఖీ, మార్క్ దెయాల్, జో డెన్లీ, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కొహ్లెర్ క్యాడ్మోర్` -
ILT20 2023: ఐఎల్ టీ20 తొలి విజేతగా అదానీ గ్రూప్ జట్టు.. అంబరాన్నంటిన సంబరాలు
International League T20, 2023 - Desert Vipers vs Gulf Giants: ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20) మొదటి ఎడిషన్ విజేతగా గల్ఫ్ జెయింట్స్ అవతరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో డెజెర్ట్ వైపర్స్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. గల్ఫ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్వైట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. నెల రోజుల పాటు సాగిన టోర్నీ ఈ ఏడాది ఆరంభంలో యూఏఈ దుబాయ్ క్యాపిటల్స్- అబుదాబి నైట్ రైడర్స్ మ్యాచ్తో జనవరి 13న ఐఎల్టీ20కి తెరలేచింది. ఈ రెండు జట్లతో పాటు ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, డెజర్ట్ వైపర్స్ సహా గల్ఫ్ జెయింట్స్ ట్రోఫీ కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో తుదిపోరుకు అర్హత సాధించిన డెజర్ట్ వైపర్స్- గల్ఫ్ జెయింట్స్ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 12) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన గల్ఫ్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బ్రాత్వైట్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. గల్ఫ్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్.. అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ పతనాన్ని శాసించాడు. ఇతరులలో గ్రాండ్హోం ఒకటి, కైస్ అహ్మద్ రెండు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గల్ఫ్ జట్టుకు ఓపెనర్ క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) అదిరిపోయే ఆరంభం అందించాడు. క్రిస్ లిన్ అద్భుత ఇన్నింగ్స్ ఐదో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లిన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేయగా.. హెట్మెయిర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో 18.4 ఓవర్లలోనే గల్ఫ్ జెయింట్స్ టార్గెట్ను ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి 149 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. డెజర్ట్ వైపర్స్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐఎల్టీ20 మొదటి చాంపియన్గా రికార్డులకెక్కింది. దీంతో జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కాగా గల్ఫ్ జెయింట్స్ అదానీ స్పోర్ట్స్లైన్కు చెందిన జట్టు అన్న సంగతి తెలిసిందే. ఐఎల్టీ20 ఫైనల్: డెజర్ట్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మ్యాచ్ స్కోర్లు డెజర్ట్ వైపర్స్- 146/8 (20) గల్ఫ్ జెయింట్స్- 149/3 (18.4) చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ Ind Vs Pak: ప్రపంచకప్లో పాక్పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు 🎶 BRING IT ON! 🎶 Strength, challenge, & victory! Our anthem tells you all you need to know about us!🤩#GiantArmy, presenting to you the Gulf Giants anthem, written & performed by @salim_merchant @Sulaiman 💪#ALeagueApart #DPWorldILT20 #BringItOn @ilt20official @ilt20onzee pic.twitter.com/jJJbUHBxq6 — Gulf Giants 🦅 (@GulfGiants) January 15, 2023 -
ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్కు ఎంఐ ఎమిరేట్స్
అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి ఎడిషన్ ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ఎంఐ ఎమిరేట్స్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇప్పటికే వరుస అర్థసెంచరీలతో జోరు కనబరుస్తున్న పొలార్డ్ తాజాగా మరో కీలక ఇన్నింగ్స్తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్లాడిన పొలార్డ్ 337 పరుగులు చేశాడు. మూడు అర్థసెంచరీలు సాధించిన పొలార్డ్ ప్రస్తుతం లీగ్లో రెండో టాప్స్కోరర్గా కొనసాగుతున్నాడు. శుక్రవారం లీగ్లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్రైడర్స్ మధ్య 26వ మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మహ్మద్ వసీమ్ 60 పరుగులతో రాణించగా.. ఆఖర్లో పొలార్డ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టక్కర్ 33 పరుగులు చేశాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నైట్రైడర్స్ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, జహూర్ ఖాన్లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్స్కు చేరుకోగా.. సీజన్లో అబుదాబి నైట్రైడర్స్కు ఇది వరుసగా ఎనిమిదో పరాజయం. ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ రద్దు కాగా.. ఎనిమిదింటిలో ఓడిన ఆ జట్టు ఎప్పుడో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక ఇప్పటికే డెసర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్కు వెళ్లగా.. తాజాగా ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్కు చేరకుంది. ఇక షార్జా వారియర్స్, దుబాయ్ క్యాపిటల్స్లో ఏ జట్టు నాలుగో స్థానంలో ప్లేఆఫ్కు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. Four 4️⃣s. Three 6️⃣s. A powerful 4️⃣3️⃣ off just 17 balls.@KieronPollard55 lit up the field with every shot. Another #DPWorldILT20 innings you don't want to miss! #ALeagueApart #MIEvADKR @MIEmirates pic.twitter.com/vR4FkASBZs — International League T20 (@ILT20Official) February 3, 2023 With a never-say-die attitude, the @MIEmirates have made it to the playoffs 🤩 Congratulations, team 💙 #MIEmirates #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/46XEgirZxK — International League T20 (@ILT20Official) February 3, 2023 చదవండి: అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్లపై ప్రాక్టీస్ -
ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్ను ఉతికారేసిన విండీస్ స్టార్
అబుదాబి వేదికగా ఇంటర్నేషనల్ లీగ్ టి20లో షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్ అయినప్పటికి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. రూథర్ఫోర్డ్ దెబ్బకు యూసఫ్ పఠాన్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. గురువారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య 25వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16 ఓవర్లో యూసఫ్ పఠాన్ బౌలింగ్కు వచ్చాడు. తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీసి రూథర్ఫోర్డ్కు స్ట్రైక్ ఇచ్చాడు. ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు రూథర్ఫోర్డ్. రెండో బంతిని లాంగాఫ్ మీదుగా 90 మీటర్లు, మూడో బంతి లాంగాన్ మీదుగా, నాలుగో బంతిని బ్యాక్ఫుట్ తీసుకొని కళ్లుచెదిరే స్ట్రెయిట్ సిక్స్ కొట్టి హ్యాట్రిక్ సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. ఐదో బంతిని స్క్వేర్లెగ్లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓవర్ చివరి బంతిని మోకాళ్లపై కూర్చొని స్వీప్ షాట్తో సిక్సర్ తరలించాడు. దీంతో ఐదు వరుస బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన రూథర్ఫోర్డ్ మరుసటి ఓవర్లో ఆరో సిక్సర్ కొట్టే అవకాశం వచ్చినప్పటికి విఫలమయ్యాడు. ఈ దశలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికే బిల్లింగ్స్తో ఏర్పడిన సమన్వయలోపంతో రూథర్ఫోర్డ్ రనౌట్గా వెనుదిరగడంతో అతని విధ్వంసానికి తెరపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.రూథర్ఫోర్డ్(23 బంతుల్లో 50, ఆరు సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్(48 బంతుల్లో 54 పరుగులు), ముస్తఫా 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి 22 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The maestro, Sherfane Rutherford put up a stunning batting display tonight #DVvDC. 5 back to back 6’s 😯 Big contribution to his teams total with a 23-ball 5️⃣0️⃣ 🔥#DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/OSW8Av4lnh — International League T20 (@ILT20Official) February 2, 2023 చదవండి: ట్రెండింగ్ పాటకు క్రికెటర్స్ అదిరిపోయే స్టెప్పులు -
ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20 క్రికెట్లో హాస్యాస్పద సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్ కొట్టిన బంతి స్టేడియం అవతల పడింది. అయితే స్డేడియం బయట ఉన్న వ్యక్తి దానిని క్యాచ్గా తీసుకున్నాడు. ఆ తర్వాత బంతిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు. చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినప్పటికి సదరు వ్యక్తి చర్య నవ్వులు పూయించింది. ఎంఎఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇది జరిగింది. ఎమిరేట్స్ బ్యాటింగ్ సమయంలో మౌస్లే డీప్స్క్వేర్ లెగ్ దిశగా బంతిని స్టాండ్స్ బయటికి పంపించాడు. బంతి వెళ్లి నేరుగా రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. స్టేడియంలోకి తిరిగి విసురుతాడనుకుంటే.. బంతితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత కాసేపటికే కీరన్ పొలార్డ్ భారీ సిక్సర్ కొట్టాడు. ఈసారి కూడా బంతి స్టేడియం అవతల పడింది. ఆ వ్యక్తి మళ్లీ కనిపిస్తాడేమో అని చూస్తే బంతిని తీసుకోవడానికి ఎవరు రాలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎల్టి20 తన ట్విటర్లో షేర్ చేసింది. సిక్సర్ల వర్షం కురుస్తోంది.. మీరు ఏ టైప్ క్రికెట్ లవర్స్.. 1). తీసుకొని పారిపోవడం..2). తీసుకొని తిరిగిచ్చేయడం .. మీరే ఎంపిక చేసుకొండి అంటూ కామెంట్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్ వసీమ్ 86, ఆండ్రీ ఫ్లెచర్ 50, కీరన్ పొలార్డ్ 50, మౌస్లే 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ 84 పరుగులకే కుప్పకూలింది. ఎమిరేట్స్ బౌలింగ్లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. జహూర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్లు చెరో రెండు వికెట్లు తీశారు. When it’s raining 6️⃣s, There are 2 types of cricket lovers.. 1. Pick and run 🏃♂️ 2. Pick and return Which category are you? Book your tickets now : https://t.co/sv2yt8acyL#DPWorldILT20 #ALeagueApart #DVvMIE pic.twitter.com/P0Es01cMz8 — International League T20 (@ILT20Official) January 29, 2023 చదవండి: కాఫీ బ్యాగులతో ఆసీస్ క్రికెటర్; తాగడానికా.. అమ్మడానికా? రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఓపెనర్ -
విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్ప్రెషన్కు అర్థమేంటి!
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో మెరిసిన పొలార్డ్ ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెసర్ట్ వైపర్స్తో మ్యాచ్లో పొలార్డ్ క్యాచ్ తీసుకునే క్రమంలో చేసిన విన్యాసం అదుర్స్ అనిపించింది. బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో పొలార్డ్ అందుకున్న క్యాచ్ హైలైట్గా నిలిచింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సమిత్ పటేల్ వేసిన ఫుల్టాస్ బంతిని కొలిన్ మున్రో లాంగాన్ దిశగా బాదాడు. కచ్చితంగా సిక్సర్ అనుకున్న తరుణంలో అక్కడే ఉన్న పొలార్డ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ను తీసుకొని వెనుకవైపుకు డైవ్ చేశాడు. ఆ తర్వాత బౌండరీలైన్ ముంగిట నిలబడి అభిమానులను చూస్తూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెసర్ట్ వైపర్స్ ఏడు వికెట్ల తేడాతో ముంబై ఎమిరేట్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పొలార్డ్ 67 నాటౌట్, పూరన్ 57 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్.. అలెక్స్ హేల్స్(44 బంతుల్లో 62 నాటౌట్), షెర్ఫెన్ రూథర్ఫోర్డ్(29 బంతుల్లో 56 నాటౌట్) విధ్వంసం ధాటికి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కొలిన్ మున్రో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. #PollyPandey, what have you done! 🤯🤯🤯🤯@KieronPollard55 with a 𝑩𝒂𝒘𝒂𝒂𝒍 one-handed catch and the celebration to match. 😎#MIEvDV #CricketOnZee #DPWorldILT20 #BawaalMachneWalaHai #HarBallBawaal @MIEmirates @ILT20Official pic.twitter.com/2eKZPWjoYk — Zee Cricket (@ilt20onzee) January 24, 2023 చదవండి: టాప్లెస్గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
మూడు పరుగులతో శతకం మిస్.. చేయాల్సిన విధ్వంసం చేసేశాడు
విండీస్ హార్డ్ హిట్టర్ రోవ్మెన్ పావెల్ ఇంటర్నేషనల్ లీగ్ టి20(ILT20) క్రికెట్లో తుఫాన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటైనప్పటికి చేయాల్సిన విధ్వంసం అంతా చేసిపారేశాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనికి తోడుగా జో రూట్ కూడా 54 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ తరపున రోవ్మెన్ పావెల్ 45 వన్డేల్లో 897 పరుగులు, 55 టి20ల్లో 890 పరుగులు సాధించాడు. మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. The captain came out all guns blazing 💥 A 100+ partnership with Root, 10 6️⃣s, 97 runs 🤩 It was indeed a captain's inning from @Ravipowell26. Book your tickets from https://t.co/VekRYhpzz6#DPWorldILT20 #ALeagueApart #MIEvDC pic.twitter.com/YWYuCo8qFl — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే -
విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే
ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ అనగానే టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ గుర్తొస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో చూసుకుంటే వన్డేలు మాత్రమే ఆడే రూట్ టి20లు చాలా తక్కువగా ఆడాడు. ఇక టెస్టుల్లో తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెప్టెన్గా, బ్యాటర్గా టెస్టుల్లో ఇంగ్లండ్కు ఎన్నో విజయాలు అందించాడు. టెస్టు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉండడంతో ఐపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్స్లో రూట్ పేరు పెద్దగా కనిపించదు. ఒకవేళ వేలంలో పాల్గొన్నా అతన్ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపేది కాదు. అయితే రూట్కున్న టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ చెరిపేయాల్సిన సమయం వచ్చినట్లుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో రూట్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అందుకు కారణమయింది. ఆదివారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. We saw the reverse sweep yesterday. Here's the conventional sweep with the SAME precision!@root66 is all class!pic.twitter.com/GRo5zKQAyd — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..! -
కోల్కతా నైట్రైడర్స్ కీలక నిర్ణయం..! అబుదాబి కెప్టెన్గా సునీల్ నరైన్
యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి సీజన్ వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ లీగ్లో అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్గా వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ సునీల్ నరైన్ నియమితుడయ్యాడు. కాగా అబుదాబి నైట్ రైడర్స్ ప్రాంఛైజీని ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి సునీల్ నరైన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి అబుదాబి జట్టు పగ్గాలు కేకేఆర్ యాజమాన్యం అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇక టీ20 క్రికెట్లో సునీల్ నరైన్ అద్భుతమైన ఆటగాడు. అతడికి 400 పైగా టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో నరైన్తో పాటు ఆండ్రీ రస్సెల్, రవి రాంపాల్, అకేల్ హొస్సేన్, రేమాన్ రీఫర్, కెన్నార్ లూయిస్ వంటి విండీస్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక కెప్టెన్గా ఎంపికైన అనంతరం సునీల్ నరైన్ స్పందించాడు. "అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్దంగా ఉన్నాను. ఇది ఒక కొత్త సవాలు. ఎందుకంటే ఇప్పడు నేను నా బ్యాటింగ్, బౌలింగ్పై కాకుండా జట్టు మొత్తం ఆటతీరుపై దృష్టిపెట్టాలి. నాకు నైట్ రైడర్స్ గ్రూపుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చాలా ప్రాంఛైజీలో లీగ్ల్లో నైట్ రైడర్స్కు సంబంధించిన జట్లు ఉన్నాయి. ప్రతీ చోటా వాళ్ల జట్టులో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇక యూఏఈలో నేను చాలా క్రికెట్ ఆడాను. అక్కడి పరిస్థితులు బాగా తెలుసు. కాబట్టి జట్టును విజయ పథంలో నడిపించడానికి ప్రయత్నిస్తాను అని సునీల్ నరైన్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs BAN: పాపం శ్రేయస్ అయ్యర్.. తృటిలో సెంచరీ మిస్! -
పార్థివ్ పటేల్కు లక్కీ ఛాన్స్.. ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్గా..
International League T20- MI Emirates Coaching Staff: యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నేపథ్యంలో ఎంఐ ఎమిరేట్స్ తమ జట్టు ప్రధాన కోచ్గా షేన్ బాండ్ను నియమించింది. అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్ను బ్యాటింగ్ కోచ్గా.. వినయ్ కుమార్ను బౌలింగ్ కోచ్గా ఎంపిక చేసినట్లు తెలిపింది. న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ తమ జట్టు ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీతో ప్రయాణం ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు బౌలింగ్ కోచ్గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2015 నుంచి ఈ ఫ్రాంఛైజీతో అతడి ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి నాలుగు సార్లు(2013 మినహా) టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. కోచ్లకు స్వాగతం! ఎంఐ ఎమిరేట్స్ కోచ్ల నియామకం నేపథ్యంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ఎంఐ ఎమిరేట్స్ కుటుంబంలోకి షేన్, పార్థివ్, వినయ్లకు స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ మాదిరిగానే.. వారికున్న అపార అనుభవంతో కొత్త జట్టును కూడా విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నాకు దక్కిన గౌరవం! ఇక తన నియామకంపై షేన్ బాండ్ స్పందిస్తూ.. ఎంఐ ఎమిరేట్స్ హెడ్కోచ్గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ.. ఎంఐ ఎమిరేట్స్ స్థాయిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించాడు. కాగా యూఏఈ లీగ్ వచ్చే ఏడాది ఆరంభం కానుంది. ఈ లీగ్ ద్వారా పార్థివ్ పటేల్, వినయ్ కుమార్ కోచ్లుగా ఎంఐ ఎమిరేట్స్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. చదవండి: అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటు: శ్రీలంక మాజీ కెప్టెన్ అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ? 𝘿𝙖𝙫𝙖𝙣𝙜𝙚𝙧𝙚 Express is here 🔥 We are excited to announce that @Vinay_Kumar_R has joined MI Emirates as the bowling coach! 🤩#OneFamily #MIemirates @ILT20Official pic.twitter.com/z5spZNsi4j — MI Emirates (@MIEmirates) September 17, 2022