-
అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు నెటజన్లలలో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సాధారణంగా సినీ నటీనటులలో సామాజిక అంశాల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, జాన్వీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.అంబేద్కర్, గాంధీ మధ్య డిబేట్ చూడటం తనకు చాలా ఆసక్తికరంగా ఉంటుందని జాన్వీ కపూర్ తెలిపింది. ఒక నిర్దిష్ట అంశంపై అంబేద్కర్, గాంధీ అభిప్రాయాలు ఎలా మారాయి అనే దాని మధ్య చర్చ ఉండాలని ఆమె కోరింది. ఆమె మాటలతో ఇంటర్వ్యూయర్లు కూడా 'వావ్' అని ఆశ్చర్యపోయారు. ఈ సమాజం పట్ల వారిద్దరూ ఎంచుకున్న మార్గం పట్ల బలంగా నిలబడ్డారు. వాళ్లిద్దరూ మన సమాజానికి ఎంతో సహాయం చేశారు. వారు ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో అనేది తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన చర్చగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక నిర్దిష్ట అంశంపై వారి అభిప్రాయాలు కాలక్రమేణా ఎలా మారాయి..? కుల ఆధారిత వివక్ష, అంటరానితనం పూర్తిగా అంతమవ్వాలి అనే అంశంపై అంబేద్కర్ వైఖరి ఏమిటో స్పష్టంగా ఉంది. కానీ గాంధీ అభిప్రాయాలు నిరంతరం మారుతూ వచ్చాయి. ఎందుకంటే మన దేశంలో కులతత్వం కాకుండా, దానిపై మూడవ వ్యక్తి నుంచి అభిప్రాయాలు పొందడం అనేది వాస్తవ ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీ పాఠశాలలో ఎప్పుడైనా కులతత్వం గురించి చర్చించారా? అనే ప్రశ్నకు జాన్వీ ఇలా సమాధానమిచ్చింది. 'లేదు, నా స్కూల్లో కాదు, నా ఇంట్లో కూడా కులం గురించి ఎప్పుడూ చర్చ జరగదు.' అని జాన్వీ చెప్పింది. దీంతో నెటిజన్లు కూడా ఆమె మాటలకు ఫిదా అవుతున్నారు. Rather surprised to see this from a mainstream Bollywood actor. Janhvi Kapoor on Ambedkar, Gandhi & caste 👏pic.twitter.com/KyH8Ad08f5— Siddharth (@DearthOfSid) May 24, 2024 -
నా పెళ్లి అలా జరగాలి: జాన్వీ కపూర్
-
శ్రీ దేవి దారిలో జాన్వీ కపూర్..!
-
ఆలియా అవుట్..జాన్వీ ఇన్?
హిందీలో ‘దుల్హనియా’ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ చిత్రాల్లో వరుణ్ ధావన్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాలకు శశాంక్ కేతన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగానికి కేతన్ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్ సమాచారం. వరుణ్ ధావన్, ఆలియా భట్లను కూడా సంప్రదించారట. అయితే వరుణ్ ధావన్ సుముఖంగానే ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కారణంగా ఆలియా మాత్రం ఈ సినిమాలో నటించలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ చాన్స్ జాన్వీ కపూర్కు వెళ్లిందట. ఈ సినిమాకు జాన్వీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయని టాక్. వేసవిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
'ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న శ్రీదేవి'
ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించిన అందాల తార శ్రీదేవి. ఆమె మరణించినా నేటికి శ్రీదేవి పేరు చిరస్మరణీయం. భారతీయ దిగ్గజ నటీమణులలో ఒకరిగా శ్రీదేవి పరిగణించబడ్డారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన శ్రీదేవి 1990ల చివరలో నటనకు విరామం తీసుకుంది. ఆ తర్వాత 2012 మళ్లీ ఇంగ్లీష్ వింగ్లీష్తో ఆమె పవర్-ప్యాక్డ్ పునరాగమనం చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సహనటుడిగా నటించిన ఆదిల్ హుస్సేన్ ఇటీవల పలు ఆసక్తకరమైన విషయాలు పంచుకున్నాడు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఆదిల్ గుర్తుచేసుకున్నాడు. ఆమెతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె నటించిన సద్మా చిత్రం తనకు గుర్తుకు వచ్చిందట. వేశ్యాగృహంలో చిక్కుకున్న నేహలతగా శ్రీదేవి నటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ చిత్రం తనపై ఎంత ప్రభావం చూపిందని, సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులుగా తాను తినలేకపోయానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 'మొదటగా డైరెక్టర్ గౌరీ షిండేనే నన్ను శ్రీదేవికి పరిచయం చేశారు. అప్పుడు ఆమె తన పెద్ద అందమైన కళ్లతో నన్ను చూసింది. సద్మా సినిమా చూసిన తర్వాత నేను ఏమీ తినలేను అని నేను ఆమెకు మొదట చెప్పాను. శ్రీదేవిని చూడగానే అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు నా మాటలు విన్న తర్వాత, ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.. ఎందుకో నాకు కూడా తెలియదు. ఆమె కొద్దిగా మృదువైన తడి కళ్లు కలిగి ఉంది. అలా చాలా సమయం తర్వాత మేము రిహార్సల్స్కు వెళ్లాము.' అని చెప్పాడు. మెరిల్ స్ట్రీప్తో సమానంగా శ్రీదేవి: ఆదిల్ హుస్సేన్ శ్రీదేవిని హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్తో పోలుస్తూ.. ఆమె 'చాలా సెన్సిటివ్' అని పాశ్చాత్య దేశాల మాదిరిగానే ఆమెకు కథలు ఆఫర్ చేసి ఉంటే, శ్రీదేవికి ఆస్కార్ లభించేదని అన్నారు. ఇంగ్లిష్ వింగ్లీష్ గౌరీ షిండే రచించి దర్శకత్వం వహించింది. 2012లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. శ్రీదేవి, జాన్వీ కపూర్ల మధ్య పోలికలు శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వీ కపూర్ మధ్య ఉన్న సారూప్యత గురించి కూడా ఆదిల్ వివరించాడు. జాన్వీ తన తన తల్లి నుంచి చాలా "గుణాలను" వారసత్వంగా పొందిందని చెప్పాడు. "శ్రీదేవిని మరోకరు మ్యాచ్ చేయడం చాలా కష్టమైన పని.. కానీ జాన్వీ కష్టపడి పనిచేస్తే శ్రీదేవికి దక్కినంత గౌరం, పేరు తప్పకుండా వస్తాయి. జాన్వీలో ఆ టాలెంట్ ఉంది. కచ్చితంగా భవిష్యత్లో ఆమె భారత వెండితెరపై తిరుగులేని రాణిలా గుర్తింపు పొందుతుందని ఆదిల్ తెలిపాడు. టాలీవుడ్లో జూ.ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. -
అక్కినేని అఖిల్ గురించి వైరల్ అవుతున్న న్యూస్!
అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' చిత్రం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమాను ప్రకటించలేదు. భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్గా 'ఏజెంట్' తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్తో కనిపించడం కోసం ఆయన కొన్నినెలలపాటు శ్రమించారు. కానీ ఏజెంట్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఎజెంట్ సినిమాలో అఖిల్ హాలీవుడ్ హీరోలకు ధీటుగా కనిపిస్తాడు. అతని ప్రధాన బలం హైట్, అందుకు తగ్గట్టు ఆయన మెయిన్టైన్ చేస్తున్న సిక్స్ ప్యాక్.. ఏజెంట్ స్క్రిప్టు పక్కాగా ఉండుంటే భారీ హిట్ అయిండేది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత బహిరంగంగానే చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) తాజాగా అక్కినేని అఖిల్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుతున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ ఏజెంట్ తర్వాత పక్కా ప్లాన్తో ఒక ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాకు అనిల్ కూమార్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. అనిల్ గతంలో సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తల వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ దేవర చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
కలర్ఫుల్ మీనాక్షి.. నడుము చూపిస్తున్న నిక్కీ!
రంగుల డ్రస్ లో మీనాక్షి.. చూస్తుంటే మాత్రం బ్లూ కలర్ ఔట్ఫిట్లో జాన్వీ సొగసులు మాల్దీవులు వెకేషన్లో మేఘా ఆకాశ్ జీన్స్ స్కర్ట్లో సమంత క్యూట్ డ్యాన్స్ విచిత్రమైన చూపులతో మాయ చేస్తున్న నందితా నిక్కీ తంబోలి హాట్ షో.. నడుము చూపిస్తూ కేథరిన్ కొంటె చూపులు.. చూస్తే మీరు ఫ్లాట్ అద్దం ముందు శోభిత వయ్యారాలు చీరలో అందాల విందు చేసిన పూజిత రితికా సింగ్ స్టిల్స్.. వెనక్కి తిరిగి మరీ View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన తాజా చిత్రం బవాల్. ఈ చిత్రంలో జూలై 21న నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవలే ఆష్విట్జ్ సీన్స్పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూదుల మారణకాండను ఉద్దేశించేలా చిత్రీకరించిన సన్నివేశాలపై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి పూర్తిగా తొలగించాలని యూదుల మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నాజీల డెత్ క్యాంపుల్లోని సన్నివేశాలతో దర్శకుడు ప్రచారం పొందాలనుకున్నాడని ఆరోపించింది. హిట్లర్ జరిపిన మారణహోమంలో 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధాన్ని ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే ప్రైమ్ నుంచి తొలగించాలని మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ అసోసియేట్ డీన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ సోషల్ యాక్షన్ రబ్బీ అబ్రహం కూపర్ డిమాండ్ చేశారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. నెటిజన్స్ కామెంట్స్ సైతం జాన్వీ కపూర్ స్పందించింది. మీరు సరైన కోణంలో చూడాలని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు నెట్టింట జరుగుతోన్న వివాదంపై నితీశ్ తివారీ ఇటీవల స్పందించారు. బవాల్లో మంచి సందేశాలు ఉన్నాయని తెలిపారు. ఆష్విట్జ్లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాం కదా.. విమర్శలు చేసేవాళ్లకు అవీ కనిపించలేదా? అని నితీశ్ ప్రశ్నించారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) -
'దేవర' తర్వాత జాన్వీని తమిళ్కు పరిచయం చేయనున్న టాప్ హీరో
నటి శ్రీదేవి ఈ పేరే అందానికి బ్రాండ్ అంబాసిడర్. మొదట కోలీవుడ్లో బాలనాటిగా తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత టాప్ హీరోయిన్గా పేరు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి ఇండియన్ సినీ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఆమె జీవితం కథానాయకిగానే ముగిసింది. ఇక శ్రీదేవి వారసురాలిగా రంగప్రవేశం చేస్తున్న పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఇప్పటికే క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. నటన కంటే తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న జాన్వీకపూర్పై దక్షిణాది సినిమా చూపు చాలా కాలం క్రితమే పడింది. పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతలు తమ చిత్రాల ద్వారా పరిచయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆమెకు దక్షిణ చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉన్నా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అలా ఇటీవలే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటించడానికి అంగీకరించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. (ఇదీ చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!) కాగా జాన్వీకపూర్ దక్షిణాదిలో తన రెండవ చిత్రాన్ని కోలీవుడ్లో చేయబోతున్నారని తాజా సమాచారం. కోలీవుడ్లో కమలహాసన్, శ్రీదేవిలది సూపర్ హిట్ కాంబో. కాగా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ను కమలహాసన్ కోలీవుడ్లో పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల విక్రమ్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్న్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ‘భాగ్ సాలే’మూవీ రివ్యూ) కాగా మరోపక్క ఆయన వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. నటుడు శింబు హీరోగా ఒక చిత్రం, శివకార్తికేయన్తో మరో చిత్రం చేస్తున్న కమలహాసన్, ఇటీవల చిన్నచిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'లవ్ టుడే' చిత్ర దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథం హీరోగా, నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని కమల్ నిర్మాతగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే నటి జాన్వీకపూర్ను కథానాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో కమల్ ఒక కీలక పాత్రలో చేయనున్నట్లు సమచారం. -
లండన్లో ఇండియన్ ఆఫీసర్
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్గా లండన్లో చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ జాన్వీకపూర్. అయితే ఇది రియల్ లైఫ్లో కాదు.. రీల్ లైఫ్లో అన్నమాట. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ‘ఉలజ్’ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్గా నటిస్తున్నారు జాన్వీకపూర్. ఈ సినిమా షూటింగ్ తాజాగా లండన్లో ప్రారంభమైంది. జాన్వీకపూర్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు సాగుతుందని టాక్. కాగా జాన్వీకపూర్ నటించిన మరో హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంతో జాన్వీ తెలుగుకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో బవాల్.. వరుణ్ధావన్, జాన్వీకపూర్ జంటగా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ లవ్స్టోరీ ‘బవాల్’. షాజిద్ నదియాద్వాలా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూలైలో డైరెక్ట్గా అమేజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
చరణ్ తో రొమాన్స్ చేయబోతున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్
-
హైదరాబాద్ టు గోవా
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హీరో కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ డిజైన్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారట. షిప్లో సాగే ఈ ఫైట్ కోసం ప్రస్తుతం చిత్రయూనిట్ నైట్ షూట్ జరుపుతోంది. కాగా ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ను గోవాలో ప్లాన్ చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
నా బిడ్డను ఆమెతో పోలుస్తారా.. అడ్డుకున్న బోనీ కపూర్
దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిలి'. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్, ఫస్ట్లుక్ ఈ మూవీపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మలయాళ సినిమా హెలెన్కు హిందీ రీమేక్గా వస్తోంది. ఈ చిత్రానికి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె తండ్రి బోనీ కపూర్తో కలిసి పాల్గొన్నారు. అక్కడే ఉన్న ఓ మీడియా వ్యక్తి జాన్వీ కపూర్ను శ్రీదేవితో పోల్చడాన్ని బోనీ కపూర్ అడ్డుకున్నారు. నా బిడ్డను శ్రీదేవితో పోల్చవద్దంటూ సూచించారు. (చదవండి: ఉత్కంఠ రేపుతున్న జాన్వీకపూర్ ‘మిలి’ ట్రైలర్..) బోనీ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రతిఒక్కరూ తమ పాత్రను అర్థం చేసుకోవడానికి విభిన్నమైన శైలిని కలిగి ఉంటారు. అందులో శ్రీదేవి ఒకరు. జాన్వీ కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటుంది. శ్రీదేవిని దాదాపు 150-200 సినిమాల్లో ప్రేక్షకులు చూశారు. కానీ నా కుమార్తె ఇప్పుడే తన ప్రయాణం ప్రారంభించింది. దయచేసి అమ్మతో ఆమెను పోల్చవద్దు.' అని అన్నారు. జాన్వీ కపూర్ మిలి ట్రైలర్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, ఆమె సహచరులు ప్రశంసలతో ముంచెత్తారు. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మిలి ట్రైలర్ను ప్రస్తావిస్తూ జాన్వీ కపూర్ టీమ్కి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఆమె సోదరుడు అర్జున్ కపూర్ ఆమె నటనను ప్రశంసించారు. నా చెల్లెలు చాలా గొప్ప పనులు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.' అన్నారు. జాన్వీ కపూర్ మిలితో పాటు స్టార్ కిడ్ రాజ్కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె క్రికెట్తో ముడిపడి ఉన్న ఓ సినిమా కోసం ప్రిపరేషన్లో బిజీగా ఉంది. వరుణ్ ధావన్తో కలిసి బావాల్ మూవీలో కూడా కనిపించునుంది. -
బిగ్ బాస్ వైరల్ వీడియోను రిపీట్ చేసిన జాన్వీ కపూర్
Janvi Kapoor Recreates Bigg Boss Viral Video: సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండరు. సోషల్ మీడియాలో కూడా షూటింగ్లకు మించి యాక్టివ్గా ఉంటారు. తమదైనా రీతిలో పోస్ట్లు పెడుతూ అటెన్షన్ డ్రా చేస్తుంటారు. కొన్ని సార్లు అవి ప్రశంసలకు నోచుకుంటే మరికొన్ని సార్లు బెడిసికొట్టి ట్రోలింగ్కు గురవుతాయి. ఆ పోస్టులు, వీడియోలను నెటిజన్లు ఎలా తీసుకున్న సెలబ్రిటీలు పట్టించుకోరు. ప్రశంసలు, ట్రోలింగ్, నెటిజన్లను పక్కన పెడితే బాలీవుడ్ హీరోయిన్, అతిలోక సుందరీ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా ఒక ఫన్ వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకుంది. హిందీ బిగ్బాస్ సీజన్ 5లో జరిగిన 'పూజా, ఈ ప్రవర్తన ఏంటీ ?' అనే సంఘటనను రీక్రియేట్ చేసింది జాన్వీ. ఆ హౌజ్లో షొనాలీ నాగరాణి, పూజా మిశ్రాల మధ్య జరిగిన గొడవను జాన్వీ, తన మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్తో కలిసి వీడియో చిత్రీకరించింది. పూజా మిశ్రా పాత్రను జాన్వీ చేయగా, షొనాలీ పాత్రలో రివేరా లిన్ నటించింది. వీడియోలో జాన్వీ తెల్లటి షార్ట్స్తో నీలిరంగు టాప్ ధరించి వస్తువును తన్నగా, అది లిన్కు తాకింది. అప్పుడు 'పూజా, ఈ ప్రవర్తన ఏంటీ?' అని లిన్ అనగా 'పొరపాటున తన్నాను' అని పూజా పాత్రలో ఉన్న జాన్వీ సమాధానం ఇచ్చింది. ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు సహాయం కావాలని మీరు అనుకుంటున్నారా ?' అని క్యాప్షన్ ఇచ్చింది దఢక్ హీరోయిన్. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) జాన్వీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే, హీరో-సోదరుడు అర్జున్ కపూర్ 'అవును' అని బదులిచ్చాడు. తర్వాత జాన్వీ కజిన్ షానాయ కపూర్ 'నేను నీకోసం పార్థిస్తున్నాను' అని కామెంట్ చేసింది. అలాగే సన్నీ కౌశల్, ఫాతిమా సనా షేక్ తదితరులతో సహా బీటౌన్ ప్రముఖులు ఈ వీడియోపై స్పందించారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'దోస్తానా 2', ఆనంద్ ఎల్ రాయ్ 'గుడ్ లక్ జెర్రీ' సినిమాల్లో నటిస్తుంది. ఇదీ చదవండి: న్యూడ్గా కనిపించి షాకిచ్చిన జాన్వీ కపూర్.. ఫోటో వైరల్ -
యువరాణులు అంటే ఇలా ఉంటారన్న సారా, పట్టరాని సంతోషంలో కృతీ
జాన్వి కపూర్తో ఫొటో షేర్ చేసిన సారా అలీ ఖాన్, యువరాణుల ఒకరి అంటే ఇలా ఉంటారంటున్న సారా హాలీడే రోజు ఇది నా విందు అంటూ రెస్టారెంట్కు వెళ్లిన ఫొటోను పంచుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం సితాకోక చిలుకలా ఎగురుతున్నంత ఆనందంలో ఉన్నానంటున్న కృతీ సనన్ View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ravi Babu (@ravibabuofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by MONALISA (@aslimonalisa) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
లేడీ బాస్గా రీతూ వర్మ, మూతి ముడుచుకున్న నిహారిక
నలుపు అంటే ఇష్టం అంటున్న ఐశ్వర్య రాజేశ్ చీరకట్టులో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తండ్రి కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్తో శుృతి హాసన్ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Madonna Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
అలా ప్రేమలో పడమంటున్న జాన్వి, అదే నా సంతోషమంటున్న మోనల్
మీ సంతోషాన్ని నాతో పంచుకోండి అంటున్నా బిగ్బాస్ బ్యూటీ మెనల్ గజ్జర్ ఆమెతో షూటింగ్ అంటే ఎప్పుడూ సరదానే: లావణ్య త్రిపాఠి కళ్లు మూసి ప్రేమలో పడమంటున్నా జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) -
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్కు ఐకాన్ అవార్డు
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ బాక్సాఫీసుకు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ధర్మప్రొడక్షన్లో స్వయంగా ఎన్నో సినిమాలు నిర్మించాడు. ఆయన ఇండియన్ సినీ పరిశ్రమకు చేసిన కృషిగాను లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎల్ఐఎఫ్ఎఫ్) ఐకాన్ అవార్డుతో సత్కరించింది. లండన్ వేదికగా గతవారం ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమం చివరిలో కరణ్ జోహార్తో పాటు బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆసిఫ్ కపాడియా ఈ ఐకాన్ ఆవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించారు. అలాగే హీరోయిన్ శృతి హాసన్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్లకు ఎల్ఐఎఫ్ఎఫ అవుట్ స్టాడింగ్ ఎచీవ్మెంట్ అవార్డు దక్కడం విశేషం. -
న్యూడ్గా కనిపించి షాకిచ్చిన జాన్వీ కపూర్.. ఫోటో వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్కిన్ షో విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమాల హిట్, ఫ్లాప్లలతో సంబంధం లేకుండా గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఆ మధ్య జాన్వీ బికినీలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ మధ్యకాలంలో పాత్ర డిమాండ్ చేయాలే కానీ నగ్నంగా నటించేందుకు హీరోయిన్లు ముందుకొస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా ఫోటో షూట్లోనూ కూడా నగ్నంగా కనిపించేందుకు రెడీ అంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లకు అయితే న్యూడ్గా, సెమీ న్యూడ్గా కెమెరా ముందుకు రావడానికి కామన్ అయిపోయింది. ఇటీవలె బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నగ్నంగా దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. డబూ రత్నానీ ఫొటో షూట్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలోకి జాన్వీకపూర్ కూడా చేరింది. టాప్ లెస్ ఫోటోతో న్యూడ్ లుక్లో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జాన్వీ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్స్టా స్టోరీలో ఈ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. క్యాలెండర్ షూట్ కోసం ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటిస్తుంది. ‘కోలమావు కోకిల అనే తమిళ రీమేక్ ఆథారంగా తెరకక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి : టాప్లెస్ ఫోటో షూట్.. కియారా అద్వానీ ఫోటో వైరల్ ఎంతో ప్రయత్నించాను.. కానీ విడిపోక తప్పలేదు: నటి -
హల్చల్ : అనుపమ సొగసులు.. అనసూయ కవ్వింపులు..
♦ లైఫ్ ఈజ్ ట్రిక్కీ అంటోన్న అనసూయ ♦ మల్లెపూలతో న్యూ హెయిల్ స్టైల్లో అనుపమ ♦ చీరకట్టులో సిగ్గుపడుతున్న వైష్ణవి ♦ సోహేల్ను ఎత్తుకున్న అరియానా ♦ బిందీస్గా ఫోటోకు ఫోజిచ్చిన దివ్యాంక ♦ నీ చిక్కులు నీవేనంటోన్న దీప్తి సునయన ♦ భర్తతో రీల్స్ చేసిన సీరియల్ నటి మెరీనా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Shravya Varma (@shravyavarma) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Marina Abraham Sahni (@marina.a1203) View this post on Instagram A post shared by aamna sharif (@aamnasharifofficial) View this post on Instagram A post shared by Moniekaaa (@monie_kaaa1) -
హల్చల్ : వెనక్కి వెళ్లనంటోన్న అనసూయ...తప్పు కాదంటోన్న ప్రియమణి
♦ అది ఎప్పటికీ తప్పు కాదంటున్న ప్రియమణి ♦ వెనక్కి వెళ్లనంటున్న అనసూయ ♦ క్యూట్ లుక్స్తో కవ్విస్తున్న జాస్మీన్ ♦ బ్లూపర్ షేర్ చేసిన భాను ♦ తన అందానికే సీక్రెట్ ఇదేనంటోన్న కత్రినా ♦ ఆ సమస్య లేకపోతే రోజూ అవే తింటానంటున్న కల్పిక ♦ యోగాతో మోటివేషన్ అంటోన్న ఙ్ఞానేశ్వరి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
హల్చల్ : సెలబ్రేషన్స్లో శిల్పా.. సెట్స్లో సన్నీలియోన్
♦ ఆ మూడ్ శాశ్వతం అంటోన్న జాన్వీ ♦ బర్త్డే సెలబ్రేషన్స్లో శిల్పా శెట్టి ♦ దానిపైనే నమ్మకం ఉంచుతానంటున్న సోనమ్ ♦ ఫోటో షూట్లతో షెహ్నాజ్ ♦ సెట్లో ఎలా ఉంటుందో చూపించేసిన సన్నీ ♦ నో క్యాప్షన్ అంటోన్న రాహుల్ సిప్లిగంజ్ ♦ బాడీతో పాజిటివ్గా ఉండాలంటోన్న సమీరా రెడ్డి ♦ బేబీ పింక్లో అందంగా ముస్తాబైన మెహ్రీన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by manasa varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) View this post on Instagram A post shared by Nititaybawa (@nititaylor) View this post on Instagram A post shared by Ananya Nagalla Fans (@ananyanagalla.official) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) -
త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ!
అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తుంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విదేశాలలో ఇటీవలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని భావిస్తోందట. తండ్రి బోనీకపూర్ కూడా ఆమెను వెండితెరకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మొదట బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని భావించినా తండ్రి బోనీ కపూర్ మాత్రం తెలుగు సినిమాతో అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఖుషీ కపూర్ యాక్టింగ్లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇంతకుముందే జాన్వీ కపూర్ సైతం టాలీవుడ్లో నటించనుందనే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్- మహేష్బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇవి కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికే ఆ సినిమాలో పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ ఎవరు అన్న దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. చదవండి : శ్రీదేవి నాకు రోల్మోడల్ : ప్రియంక చోప్రా బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్ -
ఆలియా.. జాన్వీ... ఫైనల్గా ఎవరో?
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్ ఇండియా మూవీని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్, ఆలియా భట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీని దక్షిణాది తెరకు పరిచయం చేయడానికి చాలామంది దర్శక–నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో రామ్చరణ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఆలియా భట్ను హీరోయిన్గా ఫిక్స్ చేసి ‘ఆర్ఆర్ఆర్’ జోడీని దర్శకుడు శంకర్ రిపీట్ చేస్తారా? లేక జాన్వీని కన్ఫార్మ్ చేసి, కొత్త జోడీని వెండితెరపై చూపిస్తారా? ఆలియా, జాన్వీ కాకుండా మరో హీరోయిన్ని ఎంపిక చేస్తారా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
NRI: ఘనంగా.. 'నేషనల్ ఇండియా హబ్' ప్రారంభోత్సవం!
కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
‘శరద్ పవార్కు టచ్లో 19 మంది ఎమ్యెల్యేలు’.. రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
మాల్యా ఇంట పెళ్లి సందడి : లవర్తో సిద్ధూ వెడ్లాక్ (ఫొటోలు)
రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక!
దేవుని సేవకు ఇదోమార్గం..
ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?
టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్కు గాయం
Ind Vs Pak: భారత్లో అణ్వాయుధాలు ఎన్నో తెలుసా.. పాక్లో ఇలా..
పన్నూ హత్య కేసు: న్యూయార్క్ కోర్టులో నిఖిల్ గుప్తా వాదన ఇదే..
Advertisement