nagarkurnool district
-
పిల్లలకు పాఠాలు చెబుతున్న కలక్టర్
-
గనులే ఆ ఊరికి శాపం.. మైలారం మాయమయ్యే ముప్పు!
సాక్షి, నాగర్కర్నూల్: చుట్టూ నల్లమల (Nallamala) అటవీప్రాంతం.. కొండలు, గుట్టల నడుమ పచ్చని పొలాలతో అలరారుతున్న ఆ ఊరికి గనులు శాపంగా పరిణమించాయి. గ్రామానికి ఆనుకునే ఉన్న గుట్టపై క్వార్ట్జ్ కోసం సాగుతున్న మైనింగ్ (Mining) తవ్వకాలు ఏకంగా ఆ ఊరినే ఉనికి లేకుండా చేస్తాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బ్లాస్టింగ్లతో ఇళ్లు, గ్రామానికి ముప్పు ఉందని, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా పోరాటానికి దిగుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం(mailaram) గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై ఊరంతా పోరాడుతోంది. మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా గత పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు కూడా. ఇటీవల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షకు దిగగా, అనుమతి లేదంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో మైనింగ్ అనుమతులు రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు కంకణం కట్టుకున్నారు.200 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు ముప్పు మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై క్వార్ట్జ్, ఫెల్స్పార్ ఖనిజ తవ్వకాలకు మైనింగ్ శాఖ 2017లో అనుమతులు జారీ చేసింది. గుట్టపై సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోర్జరీ సంతకాలతో గ్రామసభ తీర్మానం గ్రామ పంచాయతీ పరిధిలో మైనింగ్ తవ్వకాల కోసం గ్రామసభ తీర్మానం కీలకం కాగా, ఈ విషయం గ్రామస్తులకే తెలియకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామసభ తీర్మానం కాపీ వెలుగులోకి వచ్చింది. తీర్మానంలో గ్రామస్తులకు తెలియకుండానే పాలకవర్గం, కొందరు గ్రామస్తుల పేరుతో సంతకాలను ఫోర్జరీ చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మైనింగ్ కోసం అనుమతులు ఉన్నాయని, గ్రామస్తుల ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి సమీక్షిస్తామని జిల్లా మైనింగ్ అధికారి రవీందర్ తెలిపారు. చదవండి: చరిత్రకు సాజీవ సాక్ష్యం రాజకోటమా ఊరే లేకుండా పోతుంది.. మా ఇళ్ల పక్కనే బ్లాస్టింగ్ చేస్తుంటే మేం ఎక్కడికి పోవాలి? మైనింగ్తో మా ఊరే లేకుండా పోతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు మైనింగ్ నిర్వాహకులకే అండగా ఉంటున్నారు. మా బాధ ఎవరికీ పట్టడం లేదు. మైనింగ్ ఆపకపోతే మేమంతా నిరాహార దీక్ష చేసైనా ఊరిని కాపాడుకుంటాం. – గాయత్రి, మైలారం -
మైలారంలో ఉద్రిక్తత.. పోలీసులు రాకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: బల్మూర్ మండలం మైలారం(Mylaram) గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ వెలికితీతను నిలిపివేయాలంటూ గత మూడు నెలలుగా ఆ గ్రామ రైతులు(Farmers), ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. దీంతో మహిళలను, రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామానికి పోలీసులు రాకూడదని.. గ్రామ ప్రధాన రహదారిపై ముళ్ళ కంచె వేసి పెద్ద ఎత్తున పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రైతు ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికైనా సిద్ధమంటూ మందు డబ్బులతో రైతులు, మహిళలు రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు -
మన పెళ్లికి ఒప్పుకోరు.. ఇద్దరం చనిపోదాం
బల్మూర్: బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లికి పెద్దలు అడ్డు చెబుతారని ఆమెను నమ్మించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. చివరకు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూర్కు చెందిన రాఘవేందర్ అదే గ్రామానికి చెందిన బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డు చెబుతున్నారని రాఘవేందర్ ఈ నెల 11న గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు బాలికను తీసుకెళ్లాడు. నువ్వు మైనర్.. పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఇద్దరం కలిసి పురుగు మందు తాగి చనిపోదామని చెప్పా డు. వెంట తెచ్చిన పురుగు మందును మొదటగా ఆమెకు తాగించి, తాను కూడా తాగినట్టు నటించాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోగానే మరో యువకుడి సహాయంతో బాలికను బైక్పై అచ్చంపేట ఆస్పత్రికి తరలించాడు.ఆపై బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంలో మెరుగైన వైద్యం కోసం ఆమెను నిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే తమ కూతురుతో బలవంతంగా పురుగు మందు తాగించాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.పరిహారంగా రెండెకరాల భూమి బాలిక మృతిపై బల్మూర్లో పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు, కులస్తులు రెండెకరాల భూమి çపరిహారంగా ఇవ్వాలని తీర్మానించినట్టు తెలిసింది. రాఘవేందర్ తండ్రికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు బాలిక తరఫున బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కాగితాలు రాసుకొని ధరణిలో స్లాట్ కూడా మంగళవారం బుక్ చేసినట్టు సమాచారం. భూమి మార్పిడి జరిగిన వెంటనే ఆస్పత్రిలో ఉన్న మృతదేహానికి ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా బాలిక ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. -
అడవి తల్లిని వీడం.. బయటకెళ్లి బతకలేం
సాక్షి, నాగర్కర్నూల్: అడవి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చెంచులు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న తాము బయటకు వెళ్లి బతకలేమని, తాము అడవిలోనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. అడవుల్లో పులులకు ఆటంకం లేకుండా జనసంచారాన్ని తగ్గించడంతోపాటు మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే పేరిట నట్టడవిలోని చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీ అధికారులు నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న సార్లపల్లి చెంచుపెంట వాసులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లా డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ నుంచి రీలొకేషన్కు అనుమతి రావడంతో ఈ నెల 5న గ్రామస్తుల నుంచి ఒప్పందాలపై సంతకాల సేకరణ ప్రారంభించింది. రీలొకేషన్లో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, లబ్ధిదారుల మధ్య ఎంఓయూ కోసం అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2–3 నెలల్లోనే సార్లపల్లి వాసుల రీలొకేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సార్లపల్లి తర్వాత విడతల వారీగా కుడిచింతలబైల్, కొల్లంపెంట, కొమ్మెనపెంట వాసులను సైతం అడవి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను చెంచులు వ్యతిరేకిస్తున్నారు. తమను అడవి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మల్లాపూర్ పెంటలోని చెంచుల ఆవాసాలు ఎనీ్టసీఏ ద్వారా పునరావాస ప్యాకేజీ.. అయినా చెంచులు విముఖం అడవి లోపల నివసిస్తున్న వారిని బయటకు తరలిస్తే ఒక్కో కుటుంబానికి ఎన్టీసీఏ ద్వారా రూ.15 లక్షల పునరావాస ప్యాకేజీ అందించనుంది. వీరి పునరావాసం కోసం నాగర్కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద అటవీశాఖకు చెందిన స్థలాన్ని కేటాయించారు. రూ.15 లక్షల ప్యాకేజీ వద్దనుకుంటే బాచారం వద్ద 220 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం, జీవనోపాధి కోసం 5 ఎకరాల వ్యవసాయ భూమిని అందజేస్తారు. సార్లపల్లిలో 269 కుటుంబాలు ఉండగా, వాటిలో 83 కుటుంబాలే చెంచులు. మిగతా కుటుంబాల్లో ఇతర వర్గాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎనీ్టసీఏ ప్యాకేజీకి ఇప్పటివరకు 186 కుటుంబాలు ఒప్పుకోగా వాటిలో చెంచు కుటుంబాలు ఆరే ఉన్నాయి. అడవి నుంచి బయటకు తరలింపునకు మెజార్టీ శాతం చెంచు కుటుంబాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలకు దూరం.. నల్లమల అటవీప్రాంతంలో మొత్తం 88 ఆవాసాల్లో చెంచులు నివసిస్తున్నారు. వీటిలో 20 ఆవాసాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్నాయి. అడవిలో అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడి చెంచులు కనీస మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోవడం లేదు. అడవిలో ఉన్న అప్పాపూర్ గ్రామ పంచాయతీ మినహా మరెక్కడా చెంచుపెంటల్లో కనీసం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, వైద్యశాల లేవు. మేం అడవిలోనే ఉంటాం.. బయటకు పోలేం ఏళ్లుగా తాతల కాలం నుంచి అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మేం బయటకు పోయి జీవించలేం. మా వల్ల వన్యప్రాణులు, పులులకు ఎలాంటి హాని లేదు. ఇప్పుడు కూడా ఉండదు. దయచేసి మమ్మల్ని అడవి నుంచి విడదీయద్దు. మేమంతా అడవిలోనే ఉంటాం. –చిగుర్ల లింగమ్మ, చెంచు మహిళ, సార్లపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా మమ్మల్ని ఆగం చేయొద్దు.. అడవిలో ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఆగం చేయద్దు. మేం బయటి ప్రపంచంలో బతకలేం. బాచారం లాంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తే అక్కడ ఏజెన్సీ నియమాలు, హక్కులు వర్తించవు. మైదాన ప్రాంతాల్లో ఉన్న చెంచులు మాకంటే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. – కుడుముల మల్లేశ్, చెంచు యువకుడు, సార్లపల్లి స్వచ్ఛందంగా ముందుకొస్తేనే.. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో జంతు సంరక్షణ కోసమే స్థానికులకు మరోచోట పునరావాసం కలి్పస్తున్నాం. రీ లొకేషన్లో ఒత్తిడి లేదు, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే తరలింపు ఏర్పాట్లు చేస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ జిల్లా -
11మందిని పొట్టన పెట్టుకుని?
సాక్షి, నాగర్కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం.. ఎవరైనా ఎదురుతిరిగితే మట్టుబెట్టడం.. ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని∙పొట్టన పెట్టుకున్నాడని భావిస్తున్న ఓ నరహంతకుడిని నాగర్కర్నూల్ జిల్లా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ యాదవ్ కొన్నేళ్లుగా తనకు మంత్రాలు, మాయలు తెలుసునంటూ అమాయక మహిళలు, వ్యక్తులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.' తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని, కుటుంబ కలహాలు, సమస్యలను పరిష్కరిస్తానంటూ మొదట తనకు పరిచయం అయిన వారిని నమ్మిస్తాడు. ఈ క్రమంలో వారి పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తిపాస్తులను తన పేరిట, అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడితే గుట్టుచప్పుడు కాకుండా పథకం ప్రకారం హత్యకు తెగబడతాడని బాధితుల నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 11 మంది అమాయకులను బలితీసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. కాగా మంగళవారం నిందితుడి పూర్తి వివరాలను వెల్లడిస్తామని నాగర్కర్నూల్ సీఐ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఓ రియల్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్ (10) ఉన్నారని తెలుస్తోంది. రెండేళ్ల కిందట నాగర్కర్నూల్ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. కందనూలులో కలకలం! 'మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను నమ్మిస్తాడు.. మాటలతో పూర్తిగా మభ్యపెట్టి ఆస్తులు రాయించుకుంటాడు.. ఎవరైనా తన దారిలోకి రాలేదని అనుమానం వస్తే మట్టుబెట్టేందుకు సైతం వెనకాడడు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 11 మందిని హతమార్చాడు.. ఇలా మాయమాటలతో మొదలుపెట్టి.. హత్యలతో ముగింపు పలుకుతున్న సదరు మాయగాడి పాపం పండింది.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతుండటంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..' కందనూలులో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా.. మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న మాయగాడు రామెట్టి సత్యనారాయణయాదవ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తన దారికి రానందుకు ఏకంగా 11 మందిని హత్య చేసి పొట్టనబెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం, ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు వదకొండు మంది అమాయకుల హత్యలో సత్యనారాయణకు ప్రమేయం ఉందని, పూర్తిస్థాయి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మాయగాడు సత్యనారాయణయాదవ్ కు సంబంధించి పూర్తి వివరాలను పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది. ► తనకు మంత్రాలు తెలుసంటూ అమాయకులను మచ్చిక చేసుకోవడం, గుప్తనిధులను వెలికితీస్తానంటూ నమ్మిస్తూ సత్యనారాయణయాదవ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన రామస్వామి(50) 2022 నవంబర్ 17న వనపట్ల శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. లింగస్వామి కుమారుడికి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రతిఫలంగా ఆయనకు ఉన్న 130 గజాల ప్లాటును మార్టిగేజ్ చేయాలని నమ్మించాడని బాధిత కుటుంయిం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లాటును మార్టిగేజ్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న 10 రోజుల వ్యవధిలోనే రామస్వామి హత్యకు గురయ్యాడని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణంలో ఓ వ్యక్తి మరణంతో పాటు వీపనగండ్ల మండలానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసుతోనూ సత్యనారాయణ యాదవ్ కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ► ఇప్పటికే 11 మందిని హత్య చేసినట్లు అనుమానాలు ► హైదరాబాద్లో జరిగిన ఓఘటనతో కదులుతున్న డొంక ► పోలీసుల అదుపులో మాయగాడు సత్యనారాయణ ► మూడేళ్ల క్రితం నాగాపూర్లో సంచలనం రేపిన నలుగురి మృతి ► ఈ ఘటన వెనుక కూడా ఇతడి హస్తమే ఉన్నట్లు సమాచారం ► గతంలోనే నిందితుడి బాగోతాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ మహిళలపై లైంగిక వేధింపులు.. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళలను నమ్మిస్తూ వారిపై సత్యనారాయణయాదవ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటుండగా.. వారి కుటుంబ సమస్యను మంత్రశక్తితో పరిష్కరిస్తానంటూ ఆమెకు చెందిన భూమిని సత్యనారాయణయాదవ్ తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సత్యనారాయణయాదవ్ బాగోతాలపై ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’ శీర్షికన కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇటీవల సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పటి వరకు కొనసాగిన హత్యోదంతం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. సంచలనం రేపిన నాగాపూర్ ఘటన! 'జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలో తరచుగా చోటుచేసుకుంటున్న ఘటనలపై బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం ఉండటం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తన మంత్రశక్తితో దూరమైన భార్యాభర్తలను కలుపుతానంటూ మహిళను నమ్మించి రూ.లక్షలు విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ మనోహర్ని కలసి ఫిర్యాదు చేసింది.' ► జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న సెటిల్మెంట్ రాయుళ్లదందా ► మంత్రాలు, మాయలతో అమాయకులకు బురిడి ► వరస ఘటనలు చోటుచేసుకుంటున్నా పట్టని పోలీసు అధికారులు ► చోద్యం చూస్తూ నేరస్తులకే సహకరిస్తున్నారన్న ఆరోపణలు మంత్రాలు, మాయలు అంటూ అడ్డగోలు దందా.. జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ నమ్మబలుకుతూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్న మాయగాళ్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. మాయగాళ్ల చేతుల్లో నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.. జిల్లాలోని వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఆమె భర్తతో కొన్నాళ్లుగా గౌడవలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ తాను మంత్రాలు చేసి భార్యభర్తలను కలుపుతానని నమ్మబలికాడు. ఇందుకోసం మహిళ పేరిట భూమి, ఆస్తులు ఉంటే పని జరగదని చెప్పి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒప్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ పరిధిలో సదరు మహిళకు ఉన్న రెండు ప్లాట్లను సత్యనారాయణ పేరిట, అతని బందువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం భర్తకు చెప్పిన తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న భార్యభర్తలు ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణపై ఫిర్యాదుచేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన.. నాగర్ కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన లింగస్వామి (50)కి రామెట్టి సత్యనారాయణ 2013లో 130 గణాల ప్లాటును విక్రయించాడు. తర్వాత లింగస్వామితో పరిచయం పెంచుకున్న సత్యనారాయణ.. లింగస్వామి చిన్న కుమారుడు శివశంకర్కు బ్యాంకులో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్లాటును మార్టిగేజ్ చేయాలని ఒప్పించారు. 2022 నవంబర్ 7న తన బందువు మహేశ్ పేరిట భూమిని మార్టిగేజ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేయించాడు. తర్వాత పది రోజులకే 2022 నవంబర్ 17న లింగస్వామి వనపట్ల శివారులో దారుణహత్యకు గురయ్యాడు. లింగస్వామి హత్యకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు నిందితులను పట్టుకోలేదు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన మహ్మద్ పాషా శ్రీపురం రోడ్డులో డబ్బాను ఏర్పాటుచేసుకుని చిన్నపిల్లలకు తాయత్తులు కడుతుండేవాడు. తన వద్దకు వచ్చే మహిళకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెకు సంబందించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశాడు. అతని వేధింపులకు తాళలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడిచినా స్పందన లేదు! జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణ నాకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, భూమిని మార్టిగేజ్ చేయించాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత పదిరోజులకే మా నాన్న హత్యకు గురయ్యాడు. మాకు వేరే ఎవరితో గొడవలు లేవు. నిందితులను పట్టుకోవాలని ఇప్పటికీ పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను బయటపెట్టాలి. -శివశంకర్,గన్యాగుల విచారణ చేపట్టాం.. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ప్రతి కేసును లోతుగా విచారణ చేపడుతున్నాం. త్వరలోనే విచారణ పూర్తిచేస్తాం.- మోహన్ కుమార్, డీఎస్పీ, నాగర్ కర్నూల్ -
నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డ సీరియల్ కిల్లర్ సత్యం
-
రేవంత్ స్వగ్రామంలో సంబరాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/వంగూరు: కాంగ్రెస్ అధిష్టానం రేవంత్రెడ్డిని సీఎంగా ప్రకటించగానే ఆయన స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం గ్రామ ప్రజలు రోడ్లమీదకు వచ్చి టపాకాయలు కాల్చి డీజే పాటలకు డ్యాన్సులు చేశారు. మా మధ్యలో పెరిగిన మా రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థి దశ నుంచే తెలివైనవాడు రేవంత్రెడ్డి తాండ్ర ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదివినప్పుడు నేను టీచర్గా పనిచేశాను. అప్పుడే తరగతిగదిలో రేవంత్ మ క్కువను నేను గమనించేవాడిని. భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదుగుతాడ ని అనుకున్నాను. నేను చదువు చెప్పిన విద్యార్థి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గర్వంగా ఉంది. – జగన్మోహన్రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం, తాండ్ర చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి రేవంత్రెడ్డి నాకు క్లాస్మేట్, బంధువు కూడా. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయా లపై ఆసక్తి ఎక్కువ. చదువులోనే కాకుండా ఆటల్లోనూఉత్సాహం కనబరిచేవాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో, 6వ తరగతి తాండ్ర గ్రామంలో చదువుకున్నాం. నా స్నేహితుడు రాష్ట్రానికి సీఎం కావడం ఎంతో గర్వంగా ఉంది. – కేవీఎన్ రెడ్డి, వంగూరు జెడ్పీటీసీ, రేవంత్రెడ్డి స్నేహితుడు నా సంతోషానికి అవధుల్లేవు రాజకీయ నేపథ్యం లేకున్నా కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. నా స్నేహితుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాతో పాటు మా గ్రామస్తులంతా గర్వపడుతున్నాం. ఐదో తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో ఒకే పాఠశాలలో చదువుకున్నాం. – ధర్మారెడ్డి, రేవంత్రెడ్డి స్నేహితుడు -
నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ
-
నాగర్ కర్నూల్: అమ్రాబాద్ అడవుల్లో అగ్నిప్రమాదం
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దోమలపెంట వద్ద అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు ఐదు హెక్టార్ల మేర అడవి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖాతాలు, మనుషులే.. పరాన్నజీవులు! -
టెన్త్ విద్యార్థి బలవన్మరణం
బల్మూర్: పదో తరగతి విద్యారి్థ.. చదువుతున్న స్కూళ్లోనే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని పొలిశెట్టిపల్లి జేఎంజే ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యం కథనం ప్రకారం.. అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన మణెమ్మ కుమా రుడు ఆకాశ్(15) పదో తరగతి చదువుతూ.. పాఠశాలకు చెందిన హాస్టల్లోనే ఉంటున్నాడు. మంగళవారం అతను తరగతి గదిలో లేకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పరిసరాల్లో వెతకగా.. పాఠశాల వెనక ఆవరణలో ఉన్న చెట్టుకు బోరుమోటార్ వైరుతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి రక్షించడానికి ప్రయతి్నంచగా అప్పటికే మృతిచెందాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన ఆకాశ్ మరణ వార్తను తెలుసుకున్న తల్లి మణెమ్మ, బంధువులు పాఠశాల వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. పదేళ్ల కితం తన భర్త కరెంటు షాక్తో చనిపోయాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న కుమా రుడు ఇప్పుడు ఇలా మృతి చెందడం తట్టుకోలేని విషాదమని ఆమె బోరున విలపించారు. కాగా, పాఠశాలలో వసతులు సక్రమంగా లేవని, భోజనం నాణ్యతగా లేదని తమతో ఆకాశ్ చెప్పేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రార్థన సమయంలో టై పెట్టుకుని రాకపోవడంతో తోటి విద్యార్థుల ముందు టీచర్లు మందలించి గంటపాటు నిల్చోబెట్టారని, ఆ అవమానంతోనే తమ పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయా లని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు నాగర్కర్నూల్– అచ్చంపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అయితే విద్యార్థి చెడు వ్యసనాలకు (సిగరెట్ తాగడం) అలవాటుపడుతున్నాడని తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చామని.. ఆమె ఫోన్ చేసి కొడుకును మందలించడంతో మనస్తాపంతోనే ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడని స్కూలు హెచ్ఎం సిస్టర్ అమూల్య తెలిపారు. రాస్తారోకోకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఏబీవీపీ, వీహెచ్పీ, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Nagarkurnool: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్ఎస్లో అలజడి
సాక్షి, మహబూబ్నగర్: నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు జిల్లా పరిషత్ పీఠం సాక్షిగా మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాగర్కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ప్రసాద్ను కాదని.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం దుమారానికి దారితీసినట్లు తెలుస్తోంది. భరత్ప్రసాద్కు చెక్ పెట్టేలా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే పావులు కదిపి.. తెరవెనుక తతంగం నడిపించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల్లో వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. తొలుత అలా.. 2019 జూన్లో జరిగిన నాగర్కర్నూల్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు 17 స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వేషన్ కాగా.. కల్వకుర్తి నుంచి గెలుపొందిన భరత్ప్రసాద్ను చేయాలని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి పేరును ఓ ఇద్దరు ముఖ్యనేతలు తెరపైకి తీసుకు రాగా.. ఆమెకే అవకాశం దక్కింది. రాములు ప్రస్తుతం నాగర్కర్నూల్ ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడంతో ఆయన కుమారుడు, విద్యావంతుడైన భరత్ప్రసాద్ను చైర్మన్ చేస్తే తమకు భవిష్యత్లో సమస్యలు తలెత్తుతాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరమీదికి తెచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు, వారి అనుచరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ అనుచరుల్లో అసహనం.. విమర్శలు జెడ్పీ పీఠానికి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఎంపీ రాములు, అతడి అనుచరుల్లో అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. అంతర్గత భేటీలో ఈ విషయం చర్చకు రాగా.. కావాలనే గతంలో తెరచాటు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారని ఒకరిద్దరు ఆగ్రహావేశాలకు లోనైనట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని.. సంయమనం పాటించాలని వారికి ఎంపీ సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదికి పైగా ఉన్నప్పటికీ బాలాజీసింగ్కు ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టడం.. ఎస్సీకి కేటాయించిన స్థానంలో వేరొకరిని నియమించడంపై ఆ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలకపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర ప్రమాణస్వీకారంలో జాప్యం జరుగుతోంది. పద్మావతి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే జాప్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా.. తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. 1997లో మొదటి కుమారుడు, 2001లో ఇద్దరు కవలలు జన్మించినట్లు పేర్కొన్నారని.. వాస్తవానికి 1991లో మొదటి కుమారుడు, 1997లో ఒకరు, 2001లో మరొకరు జని్మంచారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జెడ్పీటీసీ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. చివరకు స్టే పిటిషన్ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించడంతో పద్మావతిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచీకి వెళ్లినా చుక్కెదురైంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా.. భరత్ప్రసాద్తో పాటు ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్నే జెడ్పీచైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక సైతం తొలుత అడ్డు పడిన వారే ఉన్నారని.. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అన్నీ తానై పథకం ప్రకారం భరత్కు చెక్పెట్టేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
అవమానంతో ఒకరు.. భయంతో మరొకరు
వంగూరు: గ్రామంలో పదిమంది సమక్షంలో తనకు అవమానం జరిగిందని.. ఆ అవమానభారాన్ని భరించలేక బావమరిది పురుగు మందు తాగితే, తన మీద కేసు అవుతుందేమోనన్న భయాందోళనతో బావ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మల్లయ్య, రాములు అన్నదమ్ములు. వీరి తల్లి ముత్తమ్మ కొంతకాలం కిందట అనారోగ్యంతో మృతిచెందింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ. లక్ష నగదు, రెండు తులాల బంగారం, కొంత వెండిని రాములు, మల్లయ్య పంచుకోవడంలో విభేదాలు వచ్చి మేన బావ అయిన అంజయ్య వద్ద ఉంచారు. ఇందుకు సంబంధించి గురువారం ఉదయం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ సమయంలో మల్లయ్యపై అన్న రాములు, వదిన జంగమ్మ దాడిచేశారు. దీంతో మల్లయ్య దాడి ఘటనతోపాటు తన వాటాకు రావాల్సిన బంగారం, నగదు ఇప్పించాలని వంగూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్తుండగా.. బావ అంజయ్య తనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఉదయం గ్రామంలో జరిగిన దాడి, సాయంత్రం బావ తిట్టిన మాటలను అవమానంగా భావించి మల్లయ్య(50) అదేరోజు రాత్రి తన పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య చెన్నమ్మ పొలంలో పడి ఉన్న భర్తను బంధువుల సాయంతో కల్వకుర్తి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న బావ అంజయ్య (55) బామ్మర్ది మల్లయ్య చావుకు తనపై కేసు పెడతారన్న భయంతో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. ఈ విషయాన్ని ఫోన్చేసి బంధువులకు చెప్పడంతో కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజయ్య కూడా మృతి చెందాడు. ఈ ఘటనలపై మల్లయ్య కొడుకు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాములు, జంగమ్మలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. గ్రామంలో విషాదం.. రూ.లక్ష నగదు, బంగారం కోసం వచ్చిన విభేదాలతో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకేరోజు చనిపోవడంతో ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ఇద్దరు బావబామ్మర్దులు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. -
తండ్రి నీట మునుగుతుంటే వీడియో తీసి..
పెంట్లవెల్లి: కళ్ల ముందే కన్నతండ్రి నీటమునుగుతుంటే ఒడ్డునే ఉన్న కుమారులు కాపాడాల్సింది పోయి తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. తండ్రి మరణ దృశ్యాన్ని ఏకంగా వీడియో తీసి పైశాచికానందం పొందారు. ఆపై ఏమీ ఎరగనట్లు ఇంటికి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెంట్లవెల్లికి చెందిన కేశంపోగుల కృష్ణయ్య, గోవిందమ్మ దంపతులకు రవితేజ, ఉదయ్కుమార్ అనే కుమారులతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మంగళవారం గ్రామంలో పెద్ద దేవర్ల పండగ జరగ్గా ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కృష్ణయ్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ సాయంత్రం వరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చౌవుట చెరువు వద్ద కుమారులకు తండ్రి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రిని ఇంటికి రావాలని కోరినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో మరోసారి తండ్రికి, కుమారులకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. మద్యం వాలని తండ్రి అడగడంతో.. చెరువులో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి వరకు ఈదుకుంటూ వెళ్తే మద్యం ఇప్పిస్తామని కుమారులు పందెం కాశారు. మత్తులో ఉన్న కృష్ణయ్య అందుకు ఒప్పుకొని చెరువులోకి దిగి.. ఈదడం మొదలుపెట్టాడు. సగ దూరం వెళ్లాక.. ఈదలేక నీటిలో మునిగిపోయాడు. చెరువు ఒడ్డున ఉండి ఇదంతా సెల్ఫోన్లో వీడియో తీసున్న కుమారులు.. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఇంటికి వెళ్లి అందరితో కలిసి పండుగలో సందడి చేశారు. బుధవారం సాయంత్రం వరకు కృష్ణయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య గోవిందమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆయన కోసం ఆరా తీశారు. గ్రామస్తుల సమక్షంలో కుమారులు రవితేజ, ఉదయ్కుమార్ను గట్టిగా నిలదీయగా వారు తండ్రి నీటిలో మునిగిపోతున్న వీడియోను గ్రామస్తులకు చూపించారు. గోవిందమ్మ గురువారం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉదయం చెరువులో తేలిన మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్ఐ రామేశ్వర్రెడ్డి తెలిపారు. -
నాగర్కర్నూల్: ర్యాగింగ్ భూతానికి మైనా బలి!
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో ఓ ప్రభుత్వకాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ర్యాగింగ్ చేశారనే మనస్థాపంతో మైనా అనే ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హనుమాన్ తండాకి చెందిన మైనా(19).. జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదవుతోంది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగింది. ఆపై ఇంటికి వచ్చి బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాయంత్రానికి కన్నుమూసింది. తొలుత సూసైడ్కి గల కారణాలు తెలియరాలేదు. అయితే ర్యాంగింగ్కు సంబంధించిన వీడియోగా ఒకటి వైరల్ కావడంతో.. తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వీడియోలో ఒకరు.. మైనాను కొడుతున్నట్లుగా ప్రచారం అవుతోంది. కౌన్సెలింగ్.. బెదిరింపులు? మైనాపై జరిగిన ర్యాగింగ్ బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఐదుగురు లెక్చరర్లు ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు విషయం బయట చెప్పొద్దని ప్రిన్సిపాల్ సైతం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
అధికార పార్టీ నాయకుడు వినూత్న నిరసన
-
బిర్యానీ ఏదని అడిగాడని..
అచ్చంపేట రూరల్: తన బిర్యానీ ప్యాకెట్ కని పించడం లేదంటూ ఒక విద్యార్థి అడిగినందుకు మరో విద్యార్థి వసతి గృహం టెర్రస్ పైనుంచి కిందికి దూకేయడంతో అతని కాలు విరిగింది. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతిగృహంలో ఆదివారం జరిగింది. అమ్రాబాద్ మండలం ఎలమపల్లికి చెందిన రామస్వామి, సువ ర్ణ దంపతుల కుమారుడు చారగొండ రాజేశ్ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా డు. ఆదివారం కావడంతో విద్యార్థులను చూ సేందుకు తల్లిదండ్రులు వచ్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థి రాజేశ్ అదే తరగ తికి చెందిన అరుణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు బిర్యానీ ప్యాకెట్ తీసుకువచ్చారు. మధ్యాహ్నం అరుణ్ బిర్యానీ తిని మిగిలింది రాత్రికి తినేందుకు బాక్సులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా బిర్యానీ ప్యాకెట్ కనిపించకపోవడంతో తోటి స్నేహితులను అడిగాడు. ఈ క్రమంలో రాజేష్ను ప్రశ్నించగా.. అతనేమీ మాట్లాడకుండా వసతిగృహం టెర్రస్పైకి ఎక్కి దూకేశాడు. వెంటనే పాఠశాల సిబ్బంది రాజేశ్ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. ఎడమ కాలు విరిగిందనే అనుమా నంతో మహబూబ్నగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. -
మాటేసి.. కాటేసి..
చౌటుప్పల్ రూరల్: ఓ మృగాడి కర్కశత్వానికి మరో మహిళ బలైంది. నాగర్కర్నూల్ జిల్లా నుంచి పొట్టచేత పట్టుకొని వచ్చిన గిరిజన వివాహిత ఉసురు తీశాడు. లైంగికదాడి చేసి కొట్టి చంపాడు. హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దులో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలి భర్త, పోలీసుల నుంచి విశ్వనీయంగా తెలిసిన వివరాల మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా కోడూరు మండలం కర్రెన్నబండ తండాకు చెందిన ముఢావత్ కృష్ణ, లావణ్య అలియాస్ శ్రావ్య(28)కు ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. అక్కడే కూలీ పని చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. సంతానం కలగకపోవడంతో హైదరాబాద్లో పనిచేసుకుంటూ, ఆస్పత్రుల్లో చూపించుకోవచ్చని 2 నెలల క్రితం వలస వచ్చారు. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట శివారులోని గోడౌన్లో వాచ్మెన్గా పనికి కుదిరారు. గోదాం వెనకాల గదుల్లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే పని చేస్తే పూటగడవదని, లావణ్యను గోదాం వద్ద ఉంచి, అశోకా ఇంజనీరింగ్ కళాశాలలో కృష్ణ వాచ్మన్గా ఏప్రిల్ 12న చేరాడు. లావణ్య ఒంటరిగా ఉండటం చూసి.. గోదాంలో లావణ్య పొద్దంతా ఒంటరిగా ఉంటోంది. కృష్ణ ఉదయం 7.40గం.కు కాలేజీకి వెళ్లి రాత్రి 8.40గం.కు వచ్చేవాడు. గోదాం వెనుక సిమెంట్ పలకలు తయారు చేసే కంపెనీ ఉంది. ఇందులో ఉన్న గదుల్లో వర్కర్లతో పాటు ఇతరులూ అద్దెకు ఉంటూ మేస్త్రీ పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన హరీశ్ ఇక్కడ ఉంటూ సుతారి పనిచేస్తున్నాడు. గోదాంలో లావణ్య ఒంటరిగా ఉండటం చూసి కన్నేశాడు. ఈ క్రమంలో సోమవారం పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. ఆమె బాత్రూంకు రావడం గమనించి లైంగికదాడికి యత్నించాడు. ఆమె తిరస్కరించినా లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇటుకలు, కర్రతో తలపై దారుణంగా కొట్టి చంపేశాడు. ఆమె మెడలో ఉన్న పుస్తెలను, 8 తులాల వెండి పట్టాగొలుసులను ఎత్తుకెళ్లాడు. పోలీసుల అదుపులో నిందితుడు?.. కృష్ణ సోమవారం రాత్రి డ్యూటీ దిగి 8.40గం.కు ఇంటికొచ్చాడు. లావణ్య కోసం వెతకగా.. బూత్ రూం పక్కనే గడ్డివాము వద్ద అనుమానాస్పద స్థితి లో మృతిచెంది ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రాత్రి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చెప్పులు మినహా ఆధారాలేవీ లభ్యంకాలేదు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు. మంగళవారం చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి రంగంలో కి దిగారు. దొరికిన ఆధారంతో, సుతారీ మేస్త్రీల సాయంతో, తుఫ్రాన్పేట శివారులో సుతారీ పనిచేస్తున్న హరీశ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడి గది నుంచి లావణ్య పుస్తెలను, వెండి పట్టాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. -
సలేశ్వరంలో విరిగిపడిన కొండచరియలు
లింగాల/అచ్చంపేట/అచ్చంపేట రూరల్/మన్ననూర్: నల్లమలలో కురుస్తున్న అకాల వర్షాలతో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని సలేశ్వరం లోయలో ఉన్న భక్తులు శివ(నాగర్కర్నూల్), సూర్యనారా యణ(నల్లగొండ), విజయలక్ష్మి (లింగో టం, అచ్చంపేట మండలం), కొత్తపల్లి ప్రతాప్రెడ్డి, పాండయ్య(షాబాద్, రంగా రెడ్డి జిల్లా), జిందమ్మ(శక్తినగర్, రాయచూర్, కర్ణాటక)లకు గాయాల య్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. ఇదిలా ఉండగా... మూడు రోజుల పాటు సాగిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అక్కడి కొండలు, గుట్టలు ఎక్కుతూ ‘వస్తున్నాం.. లింగమయ్యా, వెళ్లొస్తాం లింగమయ్య..’ అంటూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. అమ్రాబా ద్ అభయారణ్యం శివనామ స్మరణతో మార్మోగింది. -
నల్లమలలో వైభవంగా చెంచుల జాతర
నాగర్కర్నూలు: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం భౌరాపూర్పెంటలో చెంచుల ఆరాధ్య దైవం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి కల్యాణాన్ని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించింది. చెంచులు భౌరమ్మను ఆడబిడ్డగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించి కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు స్వామివారి తరపున, కలెక్టర్ ఉదయ్కుమార్ దంపతులు అమ్మవారి తరపున పెళ్లిపెద్దలుగా వ్యవహరించి స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. చెంచుల గురువు గురువయ్య శివపార్వతుల కల్యాణం జరిపించారు. కాగా, సిద్ది పేటజిల్లా కొమురవెల్లిలో మంగళవారం రాత్రి పెద్దపట్నం వేశారు. -
కేసీఆర్, చినజీయర్ దళిత వ్యతిరేకులు
జడ్చర్ల/ నాగర్కర్నూల్ రూరల్: సీఎం కేసీఆర్, చినజీయర్స్వామి దళిత వ్యతిరేకులని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో చేపట్టిన కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ సాధ్యమైందని ఒకప్పుడు పొగిడిన కేసీఆర్ ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొదటి నుంచి అంబేడ్కర్పై వివక్ష చూపిస్తూ ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలని కుట్ర చేస్తున్నారన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ప్రారంభ కార్యక్రమానికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కోవింద్ను ఆహ్వానించకపోవడం అవమానకరమన్నారు. రామానుజాచార్యుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చినజీయర్స్వామి వ్యవహరిస్తున్నారని, ఆధ్యాత్మికత ముసుగులో ‘రియల్’వ్యాపారవేత్తగా మారారని విమర్శించారు. -
అచ్చంపేటలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
అచ్చంపేట: రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరా జు సమర్థించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాయి. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల కళ్లు కప్పి పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయ గా టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు వంశీకృష్ణను అరెస్టు చేయగా, రెండు వర్గాల కార్యకర్తలు బాహాబహీకి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ముట్టడికి వచ్చిన కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ముట్టడి సమయంలో ఎమ్మెల్యే గువ్వల అక్కడ లేరు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ముందుగానే చెప్పడంతో సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ముట్టడికి ముందుగానే టీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయంలో సమావేశం కావడం వల్ల ఘర్షణకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముట్టడి ఉందని ముందుగానే తెలిసినా.. టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు క్యాంపు కార్యాలయంలోకి అనుమతించడంపై విమర్శలు వస్తున్నా యి. టీఆర్ఎస్ శ్రేణులు క్యాంప్ కార్యాలయం లో లేకపోతే ఘర్షణ జరిగేది కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. డీఎస్పీలు నర్సింహులు, గిరిబాబు, సీఐలు అనుదీప్, రామకృష్ణ, గాంధీనాయక్, ఎస్ఐ ప్రదీప్కుమార్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. -
జిల్లా ఆస్పత్రికి వెళ్లినా అంతే..
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్గా తేలడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్పల్లికి చెందిన గర్భిణికి కాళ్లు, ఒంటినొప్పులు ఎక్కువగా ఉండటంతో గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలడంతో మహబూబ్నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో గర్భిణికి పీపీఈ కిట్ వేసి అంబులెన్స్లో మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన గర్భిణులకు పీహెచ్సీలు, సీహెచ్సీలతో సహా ఎక్కడికక్కడే కాన్పులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. ఈనెల 25న అచ్చంపేట ఆస్పత్రిలో ఘటన నేపథ్యంలో.. జిల్లా ఆస్పత్రి నుంచి గర్భిణి తరలింపు విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం వివరణ కోరగా.. ఆస్పత్రి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్తో పాటు రక్తం తక్కువగా ఉండటంతో హైరిస్కు కేసుగా భావించి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి సురక్షితంగా తరలించామని చెప్పారు. -
కొత్తగా మరో జాతీయ రహదారి.. హైదరాబాద్–తిరుపతి.. మరింత దగ్గర
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా మరో జాతీయ రహదారి ఏర్పాటుకానుంది. దీనివల్ల హైదరాబాద్, తిరుపతి మధ్యదూరం దాదాపు 70 కిలోమీటర్ల మేర తగ్గనుంది. తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి (కొల్లాపూర్ ఎన్హెచ్ –167కే) నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఈ రహదారిలో భాగంగా కృష్ణా నదిపై సోమశిలవద్ద వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అలాగే మహబూబ్నగర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు ఎన్హెచ్–167ఎన్ విస్తరణకు కూడా గ్రహణం వీడింది. దీని అలైన్మైంట్ ఖరారు కావడంతో పాటు నిర్మాణానికి రూ.703.68 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారుల నిర్మాణంతో వివిధ ప్రాంతాలకు దూరం తగ్గనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొల్లాపూర్ ఎన్హెచ్కు టెండర్లే తరువాయి.. కొల్లాపూర్ జాతీయ రహదారి–167కే నిర్మాణానికి కేంద్రం గతేడాది గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్న ఈ రహదారి పనులకు రూ.600 కోట్లు, మార్గ మధ్యలో కొల్లాపూర్ వద్ద సోమశిల సమీపంలోని కృష్ణానదిపై 2 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఐకానిక్ వంతెన నిర్మాణానికి మరో రూ.600 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ రహదారి డీపీఆర్కు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడమే తరువాయని తెలుస్తోంది. తెలంగాణలోని కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్, రాంపూర్.. ఆంధ్రప్రదేశ్లోని మందుగుల, శివాపురం, కరివెన మీదుగా నంద్యాల వరకు నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య దాదాపు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ మార్గంలో పది ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. కల్వకుర్తి కొట్రా జంక్షన్ టు నంద్యాల బైపాస్ తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని కొట్రా జంక్షన్ నుంచి కొల్లాపూర్ ఎన్హెచ్–167కే ప్రారంభమవుతుండగా.. కల్వకుర్తి, తాడూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్లలో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీపంలో కృష్ణా నదిపై రీ–అలైన్మెంట్ బ్రిడ్జి, ఆ తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై నంద్యాల బైపాస్ రోడ్డు వరకు రహదారి నిర్మిస్తారు. చివరగా అక్కడ జాతీయ రహదారి–40 జంక్షన్కు అనుసంధానించనున్నట్లు డీపీఆర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నంద్యాలనుంచి హైదరాబాద్ రావాలంటే కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం పూర్తయితే నంద్యాలనుంచి నేరుగా నాగర్కర్నూలు మీదుగా హైదరాబాద్కు చేరుకోవచ్చు. అలైన్మెంట్ ఖరారు ఇలా.. మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ ఫ్లైఓవర్, పాలకొండ, పాలమూరు యూనివర్సిటీ మీదుగా ఎన్హెచ్–167ఎన్ అలైన్మెంట్ ఖరారైంది. ఆ తర్వాత వీరన్నపేట, డంప్ యార్డు మీదుగా చిన్న దర్పల్లి, హన్వాడ.. నారాయణపేట జిల్లాలోని కోస్గి, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటకలోని చించోలి వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం చుట్టూ 8 కి.మీ.లు, కొడంగల్లో 5 కి.మీ.లు, తాండూర్లో 6 కి.మీ.ల మేర బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ఎన్హెచ్–167ఎన్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ నుంచి ముంబైకి వెళ్లే వారికి దూరం తగ్గనుంది ఎన్హెచ్–167ఎన్.. రూ.703 కోట్లు మంజూరు మహబూబ్నగర్–చించోలి అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది ప్రకటించారు. ఈ మేరకు సర్వే పూర్తి కాగా.. అలైన్మెంట్పై కూడా స్పష్టత వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో ఎన్హెచ్–44పై ఉన్న భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు జాతీయ రహదారి–167ఎన్ను విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. దీంతో ఇటీవల రూ.703.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గడ్కరీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ రహదారి మొత్తం 190 కిలోమీటర్ల నిడివి ఉండగా.. మహబూబ్నగర్ నుంచి వికారాబాద్లోని కర్ణాటక సరిహద్దు వరకు 126కి.మీ.లు, కర్ణాటక రాష్ట్రం పరిధిలో 64కి.మీ.లు విస్తరించనున్నారు. పట్టణాలు, గ్రామాలు కలిసే చోట 120 అడుగులు, మిగతా చోట్ల 100 అడుగుల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. -
ముళ్లపొదల్లో కాకతీయ శిల్పాలు
సాక్షి, హైదరాబాద్: కాకతీయ కాలానికి చెందిన అరుదైన వీరభద్రుడి విగ్రహం ఇది. నాగర్కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో ఇలా ఎన్నో విగ్రహాలు మట్టిపాలై ఉన్నాయి. వీటిని చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఉమామహేశ్వర దేవాలయంలో 1320లో వేయించిన ప్రతాపరుద్రుని శాసనం, 14వ శతాబ్దినాటి శిల్ప సోదరులు పెద శరభయ్య, చిన శరభయ్యలు దేవాలయంలోని పార్వతి, చెన్నకేశవ, మహిషాసుర మర్ధిని, వీరభద్ర, నందికేశ్వరుల విగ్రహాలను చెక్కారని, వాటిని సదానంద స్వామి అనే వ్యక్తి ప్రతిష్టించారని రాసి ఉందన్నారు. కొన్ని విగ్రహాలు ఆలయ మండపంలో ఉండగా, గల్లంతైన వీరభద్ర, నంది విగ్రహాలు ఈ ముళ్లపొదల్లో కనిపించాయన్నారు. -
Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు
సాక్షి, మహబూబ్నగర్(అచ్చంపేట రూరల్): ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గుట్టలో నిర్వహిస్తున్న జంతు ఎముకలతో తయారుచేసే పౌడర్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై సోమవారం అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో పులిజాల గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ పాండునాయక్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి తహసీల్దార్ కృష్ణయ్య, ఎస్ఐ ప్రదీప్కుమార్, ట్రాన్స్కో ఏఈ మేఘనాథ్, సిబ్బందితో కలిసి చేరుకున్నారు. అక్కడి మూడు షెడ్లలో జంతువుల ఎముకలను చూర్ణం చేసే యంత్రాలు, కుప్పలుగా ఉన్న వాటి వ్యర్థాలను పరిశీలించారు. చదవండి: (సీఎం కేసీఆర్తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించడం, స్థానికంగా ఏ శాఖ అనుమతి పత్రాలు లేనందున ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అలాగే విద్యుత్ సరఫరా కాకుండా జంపర్లను తీయించారు. కాగా, నిర్వాహకులు మాత్రం ఈ పౌడర్ను ఆర్గానిక్ ఎరువులలో ఉపయోగిస్తారని, దీనిని చెట్లకు వాడతారని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా గతంలోనూ అచ్చంపేట మండలంలోని చౌటపల్లి, సిద్దాపూర్ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా జంతు కళేబరాలతో తయారుచేసే నూనె ఫ్యాక్టరీలను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కన్నబిడ్డల్ని హత్యచేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య) -
పాలన చేతకాకపోతే తప్పుకోండి!
కొల్లాపూర్ రూరల్: ముఖ్యమంత్రికి పాలన చేతకాకపోతే తప్పుకోవా లని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రం లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్ర భుత్వంపై సీఎం కేసీఆర్ అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులనుంచి ధాన్యం కొనుగోలుకు రూ.500 కోట్లు కూడా వెచ్చించలేరా? అని ప్రశ్నించారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో జరిగిన బీజేపీ జిల్లాస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన పా ల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ శాంతిభద్రతలు కాపాడటంలో సీఎం విఫ లమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు కాల్చడం, చావుడ ప్పులు కొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒకవైపు కేంద్రంతో చర్చలు జరుపుతూనే తమ తప్పు లు కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం సిగ్గుచేట న్నారు. రైతులు ప్రగతిభవన్ ఎదుట కేసీఆర్ బొమ్మను తగులబెట్టి చావుడప్పు కొట్టాలన్నా రు. దళితులకు మూడెకరాల భూమి, సబ్సిడీ రుణాలు ఇవ్వనందుకు చావుడప్పు కొట్టాల న్నారు. ప్రగతిభవన్కు ఇనుప కంచెలు వేసుకు న్నారని, మంత్రులకు అధికారాలు లేకుండా చేశారని ఈటల విమర్శించారు. సమావేశంలో బీజేపీ నేతలు బంగారు శృతి, సుధాకర్రావు, దిలీప్చారి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య
పెద్దకొత్తపల్లి: మతాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న భయంతో పురుగుల మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన షాలిమియా, ముంతాజ్ దంపతుల కుమారుడు హష్రు (26) పెద్దకొత్తపల్లిలోని మేనమామ రఫీక్ ఇంట్లో ఉంటూ స్థానికంగా లేడీస్ కార్నర్ నిర్వహిస్తున్నాడు. రఫీక్ ఇంటి యజమాని కుమార్తె గోపిక (18)తో హష్రుకు పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి వెంటనే 108 అంబులెన్స్లో నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో హష్రు మృతి చెందాడు. గోపిక నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
బీసీ కులగణన చేయాల్సిందే: జాజుల
అచ్చంపేట రూరల్: పదేళ్లకు ఓసారి నిర్వహించే జనగణనలో బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అతిథిగృహం ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో జంతువులు, పక్షులను లెక్కబెడుతున్నారే గానీ..బీసీలను మాత్రం లెక్కించడానికి కేంద్రానికి మనసు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు సీఎం కేసీఆర్ కూడా బీసీ కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. బీసీల కులగణనపై నవంబర్లో అన్ని రాష్ట్రాలు పర్యటించి ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే డిసెంబర్లో భారత్బంద్కు పిలుపునివ్వడంతో పాటు జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆత్మగౌరవ పోరాటానికి బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, బీసీ సంఘం నాయకుడు కాశన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
దారుణం: 8 మందిని బలిగొన్న నిర్లక్ష్యం
కట్టంగూర్/అమ్రాబాద్: డ్రైవర్ల నిర్లక్ష్యం.. అతివేగానికి ఎనిమిది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేగంగా గమ్యస్థానానికి వెళ్లిపోవాలని భావించి వాహనం నడపడంతో ఏకంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఎనిమిది మందిని బలిగొన్నాయి. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు.. 65వ జాతీయ రహదారిపై... నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం, పామనగుండ్ల గ్రామాల మధ్య 65వ నంబర్ జాతీయ రహదారిపై గచ్చుగురువు చెరువు వద్ద ఆదివారం అరగంట వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. శాలిగౌరా రం రూరల్ సీఐ నాగదుర్గాప్రసాద్, కట్టంగూర్ ఎస్ఐ శివప్రసాద్ తెలిపిన వివరాలు.. ఏపీ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం హైపరాజుపాలెంకు చెందిన కదిరి గోపాల్రెడ్డి (31), కదిరి రచన (30) దంపతులు. వీరి కూతురు రియాన్షుతోపాటు కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ప్రశాంత్ (24) కలిసి హైదరాబాద్ నుంచి కారులో నూజివీడుకు బయలుదేరారు. కట్టంగూర్ మండలం ముత్యాల మ్మగూడెం శివారులోకి రాగానే విజయవాడ వైపు వెళ్తున్న ఎస్ఆర్ఎంటీ పార్శిల్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అతివేగంగా వచ్చిన కారు లారీ వెనుకభాగాన్ని ఢీకొట్టింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. కారు నడుపుతున్న ప్రశాంత్తోపాటు గోపాల్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన రచన, రియాన్షును నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా రచన మార్గమధ్యలో మృతి చెందింది. రియాన్షు స్వల్ప గాయాలతో బయటపడింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులు మృతదేహాలు తీస్తుండగా... కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు జేసీబీ సాయంతో తీసేందుకు యత్నిస్తుండగా 300 మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇదే సమయంలో హైదరాబాద్లోని హయత్నగర్ నుంచి పూజారులు జంగం శివప్రసాద్ (23), రోమాల వినయ్కుమార్ (21) సూర్యాపేటలోని సత్యసాయి సేవా సమితిలో జరిగే రుద్రాభిషేకం కార్యక్రమానికి కారులో బయలుదేరారు. ముత్యాలమ్మగూడెం గ్రామశివారులోకి రాగానే ట్రాఫిక్లో ఆగిఉన్న సిమెంట్ లారీని వెనుకనుంచి అతివేగంగా ఢీకొట్టారు. వినయ్కుమార్, జంగం శివప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. అరగంట వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో ఐదు ప్రాణాలు గాల్లో కలిశాయి. రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. వినయ్ది హైదరాబాద్లోని బాలాపూర్ మండలం బడంగ్ పేట కాగా, శివప్రసాద్ది రంగారెడ్డి జిల్లా దోమ మండలం మోత్కూరు. అవివాహితులైన వీరు హయత్నగర్లోని సత్యసాయిసేవా సమితిలో పూజారులుగా పనిచేస్తున్నారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదాలకు కారణమని చెప్పిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు.. మృతుడు కదిరి గోపాల్రెడ్డి రాజస్తాన్లో మైనింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో వేరే ఉద్యోగం రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈనెల 18న లగేజీని ట్రాన్స్పోర్ట్లో పంపి, భార్య రచన, కూతురు రియాన్షుతో కలిసి రాజస్తాన్ నుంచి ఆదివారం హైదరాబాద్కు వచ్చాడు. స్నేహితుడు ప్రశాంత్తో కలిసి కారులో స్వగ్రామం అయిన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం హైపరాజుపాలెం బయలుదేరాడు. స్నేహితుడిని అతని స్వగ్రామమైన నూజివీడులో దించి వెళ్లేందుకు విజయవాడ హైవే మీదుగా బయలుదేరగా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద ప్రమాదం జరిగింది. దంపతులతోపాటు ప్రశాంత్ మృతి చెందాడు. గోపాల్రెడ్డి, రచనలది ప్రేమవివాహం. వీరికి 2014లో వివాహం జరగగా 2017లో కూతురు రియాన్షు జన్మించింది. ప్రశాంత్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పుట్టువెంట్రుకలు తీయించేందుకు వెళ్లి.. ఎప్పుడూ భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే మద్దిమడుగు రహదారి రక్తమోడింది. దైవదర్శనానికి ఆటోలో వెళ్లివస్తున్న భక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదం నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జటావత్తండాకు చెందిన రాజు, చంద్రకళ దంపతులు. కుమారుడు బాలపరమేశ్ పుట్టువెంట్రుకలు తీయించేందుకు బంధువులతో కలిసి శనివారం ఆటోలో మద్దిమడుగుకు వెళ్లారు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మద్దిమడుగు సమీపంలోని మలుపు వద్ద దేవరకొండ డిపో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలోని జమృ (55), జటావత్ పోలి (66), డ్రైవర్ శ్రీను (32) అక్కడికక్కడే చనిపోయారు. రాజు, చంద్రకళ, జ్యోతి, శిరీష, బాలపరమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి, పదర, అమ్రాబాద్ ఎస్ఐలు సురేష్కుమార్, వెంకటయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు మృతుల బంధువులు ఆరోపించారు. -
చున్నీ బిగించి చంపి.. లోయలో తోసి..
మన్ననూర్/షాబాద్: ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసిన సంఘటన నల్లమలలో ఆలస్యంగా వెలుగు చూసింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేశగూడెంకు చెందిన మాణిక్యరావు(35), శోభారాణికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా యాదయ్యతో శోభారాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలసి ఆమె పక్కా ప్లాన్ వేసింది. ఆరోగ్యం బాగా లేదని ఈ నెల 13న భర్తతో కలసి షాద్నగర్ ఆస్పత్రికి వచ్చింది. ఆ తర్వాత మామిడిపల్లిలో కల్లు తాగి.. అటవీ ప్రాంతంగా ఉన్న షాబాద్ మండలం తుమ్మన్గూడ గ్రామం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే యాదయ్యకు ఫోన్ చేయడంతో అటవీ ప్రాంతం మార్గమధ్యలోకి వచ్చాడు. ఇద్దరూ కలసి మాణిక్యరావును కుమ్మరిగూడ ప్రాంత చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి చున్నీని మెడకు బిగించి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే అటవీప్రాంతంలో ఉంచి వచ్చారు. 14వ తేదీ తెల్లవారుజామున ఓ కారును అద్దెకు తీసుకుని మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టి కారు డిక్కీలో వేసుకున్నారు. వీరికి యాదయ్య స్నేహితులు శ్రీశైలం, వినోద్ సహకరించారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలోని ఓ మూలమలుపు వద్ద రోడ్డుపై నుంచి మృతదేహాన్ని లోయలోకి విసిరేశారు. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని ఈ నెల 24న బంధువులతో కలసి ఆమె షాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భార్య శోభారాణి, ఆమె ప్రియుడి యాదయ్యపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. వీరికి సహకరించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రెండు వారాల క్రితం హత్య జరగడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే ఉన్నాయి. దీంతో అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించారు. -
చెత్తకుప్పలో నవజాత ఆడశిశువు
నాగర్కర్నూల్ క్రైం: తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన నవజాత శిశువు చెత్తకుప్పలోకి చేరింది. కళ్లు తెరవని పసికందు చెత్తకుప్పల నడుమ ఆకలికేకలతో దర్శనమిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం శివారులోని గొల్లగేరి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తకుప్పల మధ్య ఆదివారం ఓ నవజాత ఆడశిశువు కన్పించింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై విజయ్కుమార్ శిశువును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని, ఐదురోజుల ఆడశిశువుగా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, డంపింగ్యార్డులో శిశువు ను వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి మృతి
సాక్షి, నాగర్కర్నూల్ (వంగూరు): ‘‘అమ్మా... నాన్న... న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటున్నారు? తమ్ముడితో కలసి కేక్ కట్ చేస్తున్నారా? నేను బాగా చదవాలని గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించండి. తమ్ముడు అల్లరి చేసినా ఏమీ అనకండి’’ అంటూ విదేశీ గడ్డ నుంచి తల్లి దండ్రులను ఫోన్లో పలకరించిన ఆ స్వరం కొన్ని గంటలకే మూగబోయింది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన తెలంగాణ బిడ్డ కల నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. సిడ్నీ నగరంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మల్లెపల్లి రక్షిత (22) దుర్మరణం పాలైంది. ఆమె మరణవార్త కుటుంబ సభ్యులకు శనివారం అందింది. యూనివర్సిటీకి వెళ్తుండగా... నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మల్లెపల్లి వెంకట్రెడ్డి, అనిత దంపతులకు కుమార్తె రక్షిత, కుమారుడు అక్షత్ ఉన్నాడు. మాజీ సైనికోద్యోగి అయిన వెంకట్రెడ్డి డీఆర్డీవోలో చేరడంతో కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని కేశవరెడ్డి కాలనీ జీఎంఆర్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. రక్షిత హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేయగా ఆమె తమ్ముడు అక్షత్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రక్షిత ఉన్నత చదువుల కోసం 2019 నవంబర్ 19న ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లింది. ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. అయితే నూతన సంవత్సర రోజున ఆమె స్కూటీపై యూనివర్సిటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందో మాత్రం వెంటనే తెలియరాలేదు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న ఆమె బంధువులు తండ్రి వెంకట్రెడ్డికి శనివారం ఫోన్ చేసి చెప్పారు. కుమార్తె పరిస్థితి తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మరికొన్ని నెలల్లో హైదరాబాద్ వస్తానని చెప్పి అంతలోనే దూరమయ్యావా అంటూ విలపించారు. ఇంతటి దుఃఖంలోనూ వారు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. రక్షిత అవయవాలను ఇతరులకు దానం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ అంగీకారాన్ని ఆస్పత్రికి తెలియజేశారు. కాగా, రక్షిత మృతదేహన్ని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీశైలం: లోయలో పడిన వ్యాన్
-
శ్రీశైలం ఘాట్రోడ్డు: లోయలో పడిన వ్యాన్
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా ఈగలపెంట శ్రీశైలం ఘాట్రోడ్డులో మంగళవారం రాత్రి ఓ వ్యాన్ లోయలో పడింది. అందులో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ధూల్పేటలోని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది క్వాలీస్ వాహనంలో శ్రీశైలం బయల్దేరారు. ఈగలపెంట సమీపంలో మైసమ్మగుడి మొదటి మలుపు వద్ద వాహనం అదుపుతప్పి 50 అడుగుల లోతు లోయలో పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న నమ్రతాసింగ్, హేమలత, అనిల్ సింగ్, అస్మిత్ సింగ్, ధర్మేష్, సుమన్లత, నీతూ సింగ్, రాజకుమారి, ధార్మిక్ గాయపడ్డారు. (స్పీడ్పోస్టు, కొరియర్లలో డ్రగ్స్) క్షతగాత్రులను మూడు అంబులెన్స్లో ఈగలపెంట జెన్కో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నీతూ సింగ్ (40), రాజకుమారి (55), ధర్మిక్ (8) పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలించారు. మిగతావారిని కూడా ఈగలపెంటలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. (సారు చెబితేనే చేశాం..) స్థానికుల సహాయం దోమలపెంట ప్రాంత యువకులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం చేశారు. కర్నూలు జిల్లా సున్నిపెంట అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈఓ రామారావు దేవస్థానానికి చెందిన రెండు అంబులెన్స్లు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఓ అంబులెన్స్ను ఈగలపెంటకు పంపారు. -
రైతు దంపతులు సురక్షితం
అచ్చంపేట రూరల్: డిండి వాగు ఉధృతితో అవతలి ఒడ్డున 12 గంటల పాటు అలాగే ఉండిపోయిన గిరిజన రైతు దంపతులు సబావత్ బుజ్జి, వెంకట్రాం ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. వీరిని గురువారం తెల్లవారుజామున ప్రాణాలకు తెగించి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు కాపాడారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ సమీపంలోని ఈ వాగుకు అవతలి వైపు ఎత్తు ప్రాంతంలో బిక్కుబిక్కుమంటున్న దంపతులను చిమ్మచీకట్లో వారు సురక్షిత ప్రాంతానికి చేర్చారు. సిద్ధాపూర్కు ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు బుధవారం రాత్రి పది గంటలకు జనరేటర్ సాయంతో సిగ్నల్ లైట్ను ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో పడవను తయారు చేసుకుని వరద నీటిలోకి నలుగురు వెళ్లారు. ఉధృతి ఎక్కువగా ఉండటంతో వెనకకు తిరిగి వచ్చారు. కొద్దిసేపటికి మరోసారి అతి కష్టం మీద అవతలి ఒడ్డుకు చేరుకుని అక్కడే ఉన్న దంపతులకు ధైర్యం చెప్పారు. ఒంటి గంట తర్వాత పడవలో వారిని ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా, తాము అర్ధరాత్రి వరకు నరకయాతనను అనుభవించామని దంపతులు తెలిపారు. ఆపదలో ఉన్న తమను కాపాడటానికి కృషి చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘టిక్టాక్’ కలిపింది
మక్తల్/బిజినేపల్లి: పదమూడేళ్ల క్రితం అదృశ్యమైన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి టిక్టాక్ సాయంతో ఇంటికి చేరుకున్నాడు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పెద్ద తండాకు చెందిన చంద్రు నాయక్ (45)కు మతిస్థిమితం సరిగా లేదు. ఈయనకు భార్య మారోనా, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చంద్రు 2007 సంవత్సరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లకు చేరుకున్నాడు. అక్కడ గ్రామస్తులు చెప్పిన పని చేస్తూ వారు పెట్టింది తింటూ కాలం వెళ్లదీసేవాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన మ్యాకలి రామాంజనేయులు ఖాళీ సమయంలో సెల్ఫోన్లో తరచూ టిక్టాక్ షోలను చూసేవాడు. ఈ క్రమంలో మతిస్థిమితం లేని సదరు వ్యక్తి ఫొటో తీసి అందులో పెట్టాడు. దీనిని పెద్దతండా వాసులు చూసి అదృశ్యమైన చంద్రునాయక్ అని గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వివరాలు సేకరించి శుక్రవారం గుడిగండ్లకు చేరుకున్నారు. అక్కడ చంద్రుని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి చంద్రును కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, తన భర్త చనిపోయాడని అనుకున్నానని భార్య మారోనా వాపోయింది. -
అదిగో పులి..
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులుల గణన వేగంగా కొనసాగుతోంది. టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో యేటా నిర్వహించే జంతుగణనలో భాగంగా ఈ ఏడాది కూడా జంతు గణన ప్రారంభమైంది. తొలి విడతగా పులులు, అనంతరం ఇతర జంతువులను లెక్కించనున్నారు. ఇందుకోసం అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను బిగించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పర్యవేక్షణలో గణన కొనసాగుతోంది. ముందుగా పులుల గణన దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ కారిడార్లలో ప్రతియేటా అటవీ శాఖ అధికారులు పులుల గణన చేపడతారు. అందులో భాగంగానే తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులలో పది రోజుల క్రితం గణన ప్రారంభమైం ది. ఇందుకు అడవిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో నిక్షిప్తమైన గుర్తుల ప్రకారం వాటి సంఖ్యను లెక్కిస్తారు. పాదముద్రలు, విసర్జితాలు, ఇతర అవశేషాలను సైతం లెక్కలోకి తీసుకొని జంతువుల గణన చేపడతారు. 3,027.53 చ.కి.మీలలో అభయారణ్యం నల్లమల అటవీ ప్రాంతం సుమారు 3,563 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా అందులో 3,027.53 చదరపు కిలోమీటర్లలో అభయారణ్యం ఉంది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలో 150 రకాల జంతువులు, 60 రకాల పక్షులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని రెండు బ్లాక్లుగా విభజించి గణన చేపట్టారు. మన్ననూర్, దోమలపెంట రేంజ్ను మొదటి బ్లాక్గా, మద్దిమడుగు, అమ్రాబాద్ ప్రాంతాలను రెండో బ్లాక్గా విభజించారు. బ్లాక్–1లో 100 కెమెరాలు, బ్లాక్–2 లో 117 సీసీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పదిరోజులుగా కెమెరా ల్లో నిక్షిప్తమైన అటవీ జంతువుల వివరాలను అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. 134 మంది సిబ్బంది 700 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో తిరుగు తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ముందుగా నెలరోజుల పాటు పులుల గణన చేపట్టనున్నారు. గతేడాది లెక్కల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 20 పెద్దపులులు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా. కవ్వాల్లో.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని కాగజ్నగర్, బెల్లపల్లి డివిజన్లలో అటవీ ప్రాంతంలో 120 చోట్ల 240 కెమెరాలను అమర్చారు. జన్నారం, చెన్నూర్ డివిజన్లలోనూ లెక్కింపు కొనసాగుతోంది. చెన్నూర్లో 3, జన్నారంలో ఒకటి, కాగజ్నగర్లో 5 వరకు పులులు ఉన్నట్లు తెలిసింది. గణన అనంతరం పులుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. గణన కొనసాగుతోంది అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని వన్యప్రాణుల గణనకు ఏర్పాట్లు చేశాం. అటవీశాఖ పర్యవేక్షణలో హిట్కాస్ సంస్థ ఎన్జీవో సభ్యులు కూడా గణనలో పాల్గొంటున్నారు.– జోజి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ సీసీ ట్రాప్ కెమెరాలతో పరిశీలిస్తున్నాం అమ్రాబాద్ అభయారణ్యంలో బిగించిన సీసీ ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తులను పరిశీలించి పులుల లెక్కింపు చేపడుతున్నాం. ఈ సారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పులులను లెక్కిస్తున్నాం. – బాపురెడ్డి,రీసెర్చ్ ఆఫీసర్, ఎన్టీసీ, అమ్రాబాద్ ఇన్చార్జ్ నల్లమలలో 2018లో గుర్తించిన వన్యప్రాణుల సంఖ్య పెద్ద పులులు: 20 చుక్కల దుప్పులు: 3,040 కణితి: 4,608 అడవి పందులు: 2,272 కొండ గొర్రెలు: 1,072 మనుబోతులు: 480 బుర్ర జింకలు: 1,888 కొండ ముచ్చులు: 11,600 -
ఏసీబీ వలలో మైనింగ్ ఏడీ
సాక్షి, నాగర్కర్నూల్: అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొంతమంది అధికారులు ప్రభుత్వ వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు. వేలకువేలు జీతాలు వస్తున్నా అక్రమ సంపాదనపై మోజుతో అత్యాశకు పోయి ఇరుక్కుంటున్నారు. మంగళవారం తాజాగా గనులు, భూగర్భశాఖ అధికారి పి.శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల మొదటి రోజే అధికారి పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. డబ్బులు డిమాండ్ చేసి.. స్టోన్ అండ్ మెటల్ క్వారీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తినుంచి డబ్బులు డిమాండ్ చేయగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడించారు. వెల్దండ మండలం శంకర్కొండతండాలోని 303 సర్వే నెంబర్లో 18 ఎకరాల భూమిలో స్టోన్ అండ్ క్రషర్ క్వారీ ఏర్పాటుకు నారాయణ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. మీ సేవా కేంద్రంలో నవంబర్ 10న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా నవంబర్ 13న మైనింగ్శాఖ కార్యాలయంలో ఫైల్ను సమర్పించారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్ వద్దకు గత 18 రోజులుగా అనుమతి కోసం తిరుగుతున్నాడు. నవంబర్ 28న మరోసారి ఏడీని కలిస్తే మొత్తం పని కావాలంటే రూ.లక్ష ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఎంత బతిమిలాడినా వినలేదు. విసుగుచెందిన నారాయణ ఏసీబీని ఆశ్రయించాడు. పట్టుబడ్డారిలా.. ఏసీబీ అధికారుల సూచన మేరకు నారాయణ మొదటి విడతగా మంగళవారం రూ.15వేలను మైనింగ్ ఏడీ శ్రీనివాస్కు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్టుగానే కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా వలపన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఏసీబీ కోర్టుకు హాజరుపర్చి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి డబ్బులు డిమాండ్ చేసినా ప్రజలు నిర్భయంగా ఏసీబీని ఆశ్రయించాలని, వారిపేరును గోప్యంగా ఉంచి అవినీతి పరుల పనిపడతామని ఈ సందర్భంగా విలేకరులతో తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు. పెరిగిన అవినీతిపరుల ఆగడాలు జిల్లాలో అవినీతి అధికారుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల ఏసీబీ అధికారుల దాడులు పెరిగినా అధికారుల్లో మార్పు రావడంలేదు. జిల్లాలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా పట్టుబడిన మైనింగ్ ఏడీ శ్రీనివాస్పై ఎన్నో ఆరోపణలున్నాయి. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుండటంతో ప్రభుత్వ పనుల పేరుతో పర్మిట్లు పొంది బయట అమ్ముకుంటున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమ ఇసుక రవాణాకు పర్మిట్లు ఇష్టారాజ్యంగా ఇచ్చాడనే ఆరోపణలు లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతిలేని క్వారీలు జిల్లాలో అనేక కొనసాగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఒక్కశాఖలోనే కాదు వివిధ శాఖల్లోనూ అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. -
వేదమంత్రాల సాక్షిగా.. ఒక్కటైన 165 జంటలు
సాక్షి, నాగర్కర్నూల్: వేదమంత్రాల సాక్షిగా ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీలు పి.రాములు, కొత్త ప్రభాకర్, ప్రభుత్వ విప్లు కూచకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జైపాల్యాదవ్, భీరం హర్షవర్ధ్దన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్దాస్, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బాద్మీశివకుమార్, జెడ్పీ ఛైర్మన్ పెద్దపల్లి పద్మావతి, స్వర్ణ సుధాకర్రెడ్డి, జేసీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు జక్కా రఘునందన్రెడ్డి, బైకాని శ్రీనివాస్యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ లోక కల్యాణం కోసం 165 జంటల వివాహాలు జరిపిస్తున్నట్లు భావిస్తున్నానన్నారు. సామూహిక వివాహాలు ఒకే రోజులో సాధారణంగా కాకుండా పారిశ్రామిక వేత్తలు, ధనవంతుల పెళ్లిళ్లు చేసినట్లుగా అంగరంగవైభవంగా నాలుగురోజుల పాటు పేదల వివాహాలు జరిపించడం గొప్ప విషయమన్నారు. బతుకునిచ్చిన సమాజానికి, పేదలకు ఎంతో కొంత చేయాలన్న సంకల్పంతో మర్రి జనార్దన్రెడ్డి సేవలు చేయడం సంతోషకరమన్నారు. అనంతరం ఎంజేఆర్ ట్రస్ట్ ఛైర్మన్ మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాదవసేవ అనే కోణంలో పుట్టిందే ఎంజేఆర్ ట్రస్ట్ అని అన్నారు. పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 165 జంటలకు పెళ్లి రోజునే కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గాయకుడు సాయిచంద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి, డిజిటల్ వీడియోగ్రఫి, కోలాటం తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే నూతన వధూవరులకు కనీస అవసరాలైన వస్తు సామగ్రిని కూడా అందజేశారు. ఈ వివాహాలకు జిల్లా వ్యాప్తంగా 20వేల మందికిపైగా ప్రజలు తరలివచ్చారు. -
కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు?
సాక్షి, కొల్లాపూర్: డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని, దానికి జాతీయ హోదా ఎలా ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సోమశిల–సిద్దేశ్వరం వంతెనతో పాటు జాతీయ రహదారి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. -
నీటి మధ్యలో ఆగిన ఆర్టీసీ బస్సు
తాడూరు (నాగర్కర్నూల్) : ఆర్టీసీ బస్సు సెల్ఫ్ స్టార్టర్ పనిచేయకపోవడంతో అర్ధంతరంగా ఓ కాజ్వేపై నీటిలో నిలిచిపోయింది. బుధవారం ఉదయం నాగర్కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 25 మంది ప్రయాణికులతో చర్లతిర్మలాపురానికి బయలుదేరింది. దారిలోని కాజ్వే మధ్యలోకి వెళ్లి అకస్మాత్తుగా ఆగిపోయింది. కేఎల్ఐ కాల్వల ద్వారా వస్తున్న నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ లోతుగా ఉంది. ఆగిన బస్సు వెంటనే స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు కిందకి దిగి బస్సును తోసి కాజ్వేను ఎలాగోలా దాటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
చిత్రాల శివుడు
అతనొక అజ్ఞాత కళాకారుడు. స్పష్టంగా మాట్లాడలేడు కాని అందమైన బొమ్మలకు, అనూహ్యమైన ఘటనలకు ప్రాణం పోయగలడు. గడపలకు, గుమ్మాలకు రంగులు వేయడమైతే పుట్టుకతో వచ్చిన విద్య. వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్తో ప్రముఖ రాజకీయ నాయకుల బొమ్మలను కూడా సొంతంగానే వేస్తున్నాడు. తన బొమ్మలకు గుర్తింపు కావాలని మూగగానే అభ్యర్థిస్తున్నాడు. గాంధీని గాడ్సే షూట్ చేశాడు. ఇందిరా గాంధీని సెక్యూరిటీ గార్డులే పొట్టన పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రాజీవ్గాంధీని మానవ బాంబు హతమార్చింది, సంజయ్గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. వీటిని తన రంగులలో చిత్రీకరించాడు నాగర్కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఎడ్ల శివకుమార్. రాజీవ్గాంధీ, సోనియా గాంధీ జంటను చిత్రీకరించి, సోనియాను అచ్చతెలుగు ఆడపడుచులా నగలతో అలంకరించి, తన సృజనను నిరూపించుకున్నాడు. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న శివకుమార్, పది సంవత్సరాల వయస్సు వరకు బాగానే మాట్లాడేవాడు. ‘‘ఏం జరిగిందో ఏమో తెలియదుకాని, పదో ఏట నుంచి మాట పోయింది’’ అంటారు శివకుమార్ తల్లి సాయిలమ్మ. బుచ్చన్న సాయిలమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. శివకుమార్ రెండో సంతానం. ఒక అన్న, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అనారోగ్యం కారణంగా తండ్రి బుచ్చన్న పది సంవత్సరాల క్రితం మరణించాడు. కుటుంబాన్ని తల్లి ఒంటి చేత్తో పోషించవలసి వచ్చింది. కూరగాయలు అమ్ముతూ పిల్లల్ని పెంచుకొస్తోంది. అన్న మల్లేశ్, చెల్లెలు విజయలక్ష్మి ఇద్దరూ మానసికంగా ఎదగలేదు. ‘‘నాకు వచ్చిన విద్య బొమ్మలు వేయడం మాత్రమే. మా కుటుంబానికి అండగా ఉండాలంటే, నేను మరింత కష్టపడాలి. ఎవరి సహకారమూ లేకుండానే తలుపులకు రంగులు, గడపలకు ముగ్గులు వేసి, ఎంతో కొంత సంపాదిస్తున్నాను. అప్పుడప్పుడు ముగ్గుల పోటీలో పాల్గొని, చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నాను. ఇప్పుడు రాజకీయ నాయకుల బొమ్మలు వేస్తున్నాను’’ అని చెప్పారు 35 ఏళ్ల శివకుమార్. తమ్ముడు సంజయ్ డిగ్రీ వరకు చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబం ఒక పాత ఇంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బొమ్మలను గుర్తించి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే బాగుండునని శివకుమార్ ఆశ. – వైజయంతి పురాణపండ ఫొటోలు: గోరటి శ్రీరాములు, సాక్షి, తెలకపల్లి -
సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కలేనా!
సాక్షి, నాగర్కర్నూల్: సోమశిల–సిద్దేశ్వరం వంతెన నిర్మాణంపై అడుగు ముందుకు పడడం లేదు. పదేళ్ల క్రితం అప్పటి సీఎం వైఎస్సార్ చేసిన శంకుస్థాపన చేయగా.. ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో ఆదివారం బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2007లో మంచాల కట్ట వద్ద మరబోటు మునిగి 61మంది జలసమాధి అయిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. వంతెన నిర్మించడంలో పాలకులు నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రతి రోజూ జిల్లాలోని కృష్ణానది తీర గ్రామాల నుంచి నిత్యం అవతలి ఒడ్డున ఉన్న రాయలసీమ ప్రాంత గ్రామాలకు పుట్టీలు, పడవల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే పుట్టీ నిర్వాహకులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ పెద్దగా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గోధావరి ఘటనతోనైనా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో రాకపోకలు కృష్ణానదికి ఇవతలి వైపునాగర్కర్నూల్ జిల్లా అటువైపు కర్నూలు జిల్లా ఉన్నాయి. ఇరు జిల్లాల పరిధిలోని నదీతీర గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు బోటులో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ ప్రయాణిస్తుంటారు. జిల్లాలోని పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, కొల్లాపూర్ మండలంలోని సోమశిల ప్రాంతాల నుంచి బోటు, పుట్టి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు బోట్లు, పుట్టీలలో ప్రయాణిస్తూ ఉంటారు. అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడం, బోట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పరిస్థితి. పర్యవేక్షణ కరువు.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సందర్భంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఉదయం 9గంటల నుంచి సాయంకాలం 5గంటల వరకు ఆయా ప్రాంతాల నుంచి బోట్లు రాకపోకలు సాగుతూనే ఉంటాయి. బోటు నిర్వాహకులు మాత్రం ప్రయాణికుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లైఫ్ జాకెట్లు కచ్చితంగా ప్రయాణికులకు ఇవ్వాల్సి ఉన్నా ఒక పర్యాటక బోటులో తప్పా, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే బోట్లలో ఇవ్వడం లేదు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. కృష్ణానది ఉధృతంగా ప్రహిస్తున్న నేపథ్యంలో బోటు ప్రయాణం అంత సురక్షితం కాదు. రోడ్డు మార్గంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాలకు వెళ్లాలంటే ఆరు గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ మంది బోట్లలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగోటం బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే బోటు ప్రయాణాలపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది తప్పా మిగతా రోజుల్లో అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ పెంచాలని, వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 2009లో శంకుస్థాపన 2007 జనవరి 18న కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నెహ్రూనగర్ నుంచి నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని సింగోటం లక్ష్మి నరసింహ్మాస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తున్న మరబోటు మంచాలకట్ట వద్ద నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 61మంది మృతి చెందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో పాటు రూ.149.40కోట్లు కేటాయిస్తామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం 2009 ఫిబ్రవరి 13న కొల్లాపూర్లో శంకుస్థాపన కూడా చేశారు. ఆ మహానేత అకాల మరణంతో తర్వాత వచ్చి న పాలకులు బ్రిడ్జి నిర్మాణంపై పాలకులు పట్టించుకోలేదు. అయి తే గత నెల 29న పాలమూరు–రంగారెడ్డి ప నుల పరిశీలనకు కొల్లాపూర్కు వచ్చిన సీఎం కే సీఆర్ బ్రిడ్జి నిర్మానంపై మాట్లాడతారని స్థానిక ప్రజలు ఆశించినప్పటికీ ఆ ప్రస్తావనే తేలేదు. వంతెన నిర్మించాలి సోమశిలలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తామని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. కానీ పనులు మాత్రం చేపట్టడం లేదు. వంతెన నిర్మాణం జరిగితే కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నదీ ప్రయాణాలు కూడా సులభతరంగా మారుతాయి. వంతెన నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలి. – లక్ష్మీనర్సింహ, సోమశిల -
అచ్చంపేటలో కోదండరామ్ అరెస్టు..!
సాక్షి, నాగర్కర్నూల్ : అచ్చంపేట మండలం నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించేందుకు వెళ్తున్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన హజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు నిరసనగా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు, పదర, అమ్రాబాద్ మండలాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. యురేనియం వెలికితీత వల్ల వాటిల్లే నష్టాల గురించి ప్రజలతో చర్చించడానికి వచ్చిన కోదండరామ్ బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడం సరైందని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నాగర్కర్నూల్లో ఉపాధ్యాయురాలి దాష్టీకం
-
కొత్తజిల్లాకు తలమానికం నల్లమల
నాగర్కర్నూల్ జిల్లాకు అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టు అచ్చంపేట, కొల్లాపూర్లో అధిక విస్తీర్ణం భూమి అరుదైన జంతువులతో పాటు ఔషధ మొక్కలు జాలువారే జలపాతాల సోయగాలు.. పచ్చదనంతో కనువిందు చేసే గిరులు, కొండల మధ్య ప్రవహించే కృష్ణమ్మ, నదిలో మత్య్సకారుల చేపల వేట, పక్షుల రాగాలు.. వన్యప్రాణుల అరుపులు.. చూపరులను ఇట్టే ఆకట్టుకునే అందాలు.. ఇలా ఎన్నో ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం నల్లమల సొంతం. ప్రస్తుతం కొత్త జిల్లాకు నల్లమల తలమానికం కానుంది. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు జిల్లాల పునర్విభజనలో నాగర్కర్నూల్ జిల్లాలోకి రానుంది. – అచ్చంపేట టైగర్ ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో 2,484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నల్లమల అడవి విస్తరించి ఉంది. ఇందులో 1750చదరపు కి.మీ. విస్తీర్ణాన్ని కోర్ ఏరియాగా, 445చదరపు కి.మీ.లలో బంపర్ ఏరియాగా, 289.47చదరపు కి.మీ.ల విస్తీర్ణాన్ని రిజర్వు ఫారెస్టుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో అచ్చంపేట, నాగార్జునసాగర్ అటవీశాఖ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో అచ్చంపేట సబ్డివిజన్ ఈ జిల్లాలో ఉండబోతుంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం(ఎన్టీసీఏ)పరిధిలో ఉన్న 44 టైగర్ ప్రాజెక్టుల అభయారణ్యల్లో ఇదీ ఒక్కటి. రాష్ట్ర విభజనలో నాగార్జునసాగర్–శ్రీశైలం రాజీవ్ టైగర్ ప్రాజెక్టును నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రవాహిస్తున్న కృష్ణానది ఎడమ వైపు తెలంగాణ, కుడివైపు ఆంద్రప్రదేశ్కు కేటాయించారు. ఇదీ మొత్తం ఇప్పుడు నాగర్కర్నూల్కు రావడంతో ఇక్కడి వనరులు ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణ అటవీ పరిధిలో 15–20 వరకు పెద్ద పులులు ఉంటాయన్నది అధికారులు లెక్కలు. వివిధ రకాల వన్యప్రాణులకు నిలయంగా మారిన అభయారణ్యంలో పెద్దపులులు, చిరుతపులులు, జింకలు, ఎలుగుబంట్లు, రేసులు, లేళ్లు, దుప్పులు, కుందేళ్లు, నెమళ్లు,అడవిపందులు, అడవికుక్కలు, వంటి అనేక జంతువులు పక్షులు సేదతీరుతున్నాయి. ప్రపంచంలోనే అరుదైన 800ల రకాల ఔషధ, అలంకార మొక్కలు ఇక్కడ లభ్యమవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో కొనసాగుతున్న టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయం అచ్చంపేటలో ఏర్పాటు చేయాల్సి ఉన్న ఇంత వరకు ఏర్పాటుకు నోచుకోలేదు. జలవిద్యుత్ కేంద్రం.. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు భూగర్భ పవర్హౌస్‡నాగర్కర్నూల్ జిల్లాలోకి రానుంది. భూగర్భ పవర్ హౌస్లోని రివర్స్బుల్ పంపుల ద్వారా నీటిని వెనక్కి తొక్కి కేంద్రంలోని ఆరు జనరేటర్ల ద్వారా 900మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తిని చేసే సామర్థ్యం ఉంది. ఈగలపెంట జెన్కో శక్తి సదన్లో తెలంగాణ జలవిద్యుత్ కేంద్రాల ముఖ్య ఇంజనీర్ కార్యాలయం కొనసాగుతోంది. ఈశక్తి సదన్ నుంచి జెన్కో జలవిద్యుత్ కేంద్రాల పని తీరు, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వపైన ఉన్న 60 మెగావాట్లు కేంద్రం, సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రంలోని 815.6మెగావాట్లు, నిర్మాణంలో ఉన్న పులిచింతల 90 మెగావాట్లు, జూరాల ఎగువ, దిగువ 240 మెగావాట్ల కేంద్రాల పరిపాలన ఇక్కడి నుంచే సాగుతుంది. – కొత్త జిల్లాకు ఏపీ సరిహద్దు కలవనుంది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలో ఎడమగట్టు పాతాళగంగ వద్ద శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో వారధిగా ఉన్న బ్రిడ్జి అవతల ఏపీ సరిహద్దు ఉంది. ఇదీ కొత్త జిల్లా నాగర్కర్నూల్ పరిధిలోకి వస్తోంది. జాతీయ రహదారి.. హైదరాబాద్–శ్రీశైలం–తోకపల్లి (దోర్నాల, నంద్యాల) 280 కిలోమీటర్ల జాతీయ రహదారిలో నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోకి కడ్తాల్ నుంచి పాతాళగంగ వరకు సుమారు 175 కిలోమీటర్ల రహదారి ఉంటుంది. హైదరాబాద్ నుంచి మన్ననూర్ కుంచోనిమూల వరకు త్రీ వే రోడ్డు పనులు పూర్తయ్యాయి. డిండి ప్రాజెక్టు వద్ద బ్రిడ్జి పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మన్ననూర్–తోకపల్లి వరకు రోడ్డు విస్తరణ కొనసాగితే కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.