National Eligibility cum Entrance Test (NEET)
-
Parliament Special Session: పార్లమెంట్లో నీట్ రగడ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ) వ్యవహా రం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. నీట్ పరీక్షలో అవినీతి అక్రమాలపై, పేపర్ లీకేజీపై వెంటనే చర్చ చేపట్టాలని శుక్రవారం ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. నినాదాలతో హోరెత్తించాయి. ఇతర వ్యవహారాలు పక్కనపెట్టి నీట్ అభ్యర్థుల భవితవ్యాన్ని కాపాడడంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. తర్వాత చర్చిద్దామని సభాపతులు కోరినన్పటికీ ప్రతిపక్ష నేతలు శాంతించలేదు. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. దిగువ సభలో విపక్షాల ఆందోళన లోక్సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సుశీల్కుమార్ మోదీ సహా పలువురు మాజీ సభ్యుల మృతి పట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విపక్ష సభ్యులు నీట్ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందిస్తూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై చర్చ వాయిదా వేయడం కుదరని, ఈ నేపథ్యంలో జీరో అవర్ చేపట్టలేమని అన్నారు. కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నీట్–యూజీపై చర్చించాలని అన్నారు. డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు వారి సీట్ల వద్దే నిల్చొని నినాదాలు ప్రారంభించారు. రాహుల్ గాంధీ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్య క్రమాలు ప్రారంభించారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభాపతి ఎంతగా వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిద్దామని, ఆ తర్వాత నీట్పై చర్చకు సమయం కేటాయిస్తానని సభాపతి పేర్కొన్నప్పటికీ విపక్షాలు పట్టువీడలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పశి్చమ బెంగాల్కు చెందిన నురుల్ హసన్తో ఎంపీగా స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం లోక్సభలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. మరోవైపు నీట్–యూజీపై విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.రాజ్యసభలో వెల్లోకి దూసుకొచి్చన ఖర్గే నీట్ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. విపక్షాల నిరసనలు, నినాదాల వల్ల శుక్రవారం ఎగువ సభను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మూడుసార్లు వాయిదా వేశా రు. రాష్ట్రప తి ప్ర సంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. నీట్పై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని జేడీ(ఎస్) సభ్యుడు హెచ్.డి.దేవెగౌడ గుర్తు చేశారు. సభ సక్రమంగా జరిగేలా విపక్ష సభ్యులంతా సహకరించాలని కోరారు. నీట్పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు. నీట్పై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాల నుంచి 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నానని ధన్ఖడ్ చెప్పారు. దీనిపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్లోకి దూసుకురావడంపై రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకు డు వెల్లోకి రావడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని, పార్లమెంట్కు ఇదొక మచ్చ అని ఆక్షేపించారు. పార్లమెంటరీ సంప్రదాయం ఈ స్థాయికి దిగజారిపోవడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కరినీ మానసికంగా గాయపర్చిందని చెప్పారు. నీట్పై చర్చకు సభాపతి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, సభలో మాట్లాడేందుకు చైర్మన్ ధనఖఢ్ అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాను వెల్లోకి వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. అయితే, ధన్ఖడ్ చెబుతున్నట్లుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత వెల్లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో అప్పటి విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్లోకి వెళ్లారని గుర్తుచేశారు. స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవి నేతమ్ శుక్రవారం స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటు కారణంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. పార్లమెంట్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. నేతమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కోలుకుంటున్నారని, ఈ మేరకు ఆసుపత్రి నుంచి తనకు సమాచారం అందిందని చైర్మన్ ధన్ఖఢ్ సభలో ప్రకటించారు. -
NEET UG Result 2024: నీట్లో ఆరుగురి ఫస్ట్ ర్యాంకు గల్లంతు!
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. నీట్–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్టీఏ పునర్ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్ఏటీ స్పష్టంచేసింది. యథాతథంగా కౌన్సెలింగ్! నీట్ కౌన్సెలింగ్ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ నిలిపివేసేందుకు నిరాకరించింది. -
30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం!
పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్లో నీట్ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పకడ్బందీగా స్కెచ్ బిహార్లో పేపర్ లీక్ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నీట్ పేపర్ లీకేజీపై బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. బిహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు. పట్నాలోని రామకృష్ణానగర్లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్ ఆనంద్ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కుంభకోణంలో నితీశ్ కుమార్ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్లో బయటపడిన నీట్ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
‘నీట్’పై ఉన్నత కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్గఢ్, ఛత్తీస్గఢ్లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్లోని సూరత్తోపాటు చండీగఢ్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. -
పేదరికంలో సరస్వతీ పుత్రుడు.. స్పందించిన కేటీఆర్.. ఆదుకుంటామని హామీ
సాక్షి, కరీంనగర్(జమ్మికుంట): సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువైంది. పట్టుదలతో మెడిసిన్ సీటు సాధించిన ఆ యువకుడి డాక్టర్ విద్యకు పేదరికం అడ్డు పడుతుంది. కూలీ పని చేసుకుంటే కాని పూటగడవని ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేడుకుంటున్నారు. వివరాలు.. జమ్మికుంట మున్సిపల్ పరిధి ధర్మారం గ్రామంలోని రెండో వార్డుకు చెందిన మోతే అశోక్– రాణి దంపతుల కుమారుడు మోతే జయంత్. అశోక్ నాలుగు రేకులు వేసుకొని, చుట్టూ పరదాలు కప్పుకొని, ఆటో అద్దెకు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జయంత్ సోషల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడు. 1 నుంచి 6వ తరగతి వరకు ఇల్లందకుంట జిల్లా పరిషత్ పాఠశాల, పదో తరగతి వరకు మానకొండూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసించి, హైదరాబాద్లోని గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. మెడిసిన్ సీటు వచ్చిందని ఆ తల్లితండ్రులు ఎంతో సంబరపడ్డా.. కుమారుడి చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో కూడా లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికం అతడిని వెంటాడుతున్నా పట్టుదలతో చదివి ఇటీవల నిర్వహించిన నీట్లో 463 మార్కులతో 2,700 ర్యాంక్ సాధించాడు. ఈనెల 8న నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలి. మెడిసిన్ చదువుకు ఏడాదికి రూ.1లక్షకు పైగా ఖర్చువుతుంది. పేద తల్లిదండ్రులు అంత మొత్తంలో ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేదంటున్నారు. దాతలు పెద్ద మనసుతో ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయండి సారు.. డాక్టర్ చదువుకొని, భవిష్యత్లో పేదలకు సేవ చేస్తానని అంటున్నాడు జయంత్. కేటీఆర్ హామీ అయితే నీట్లో మంచి ర్యాంకు సాధించి.. యువకుడి ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయిన పలువురు తమకు తోచిన సాయం చేస్తున్నారు. మరికొంతమంది యువకుడిని ఆదుకోవాలంటూ ‘సాక్షి కథనాన్ని’ ట్విటర్లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. దగ్గరుండి అతనికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై సమన్వయం చేసుకోవాల్సిందిగా మంత్రి కార్యాలయానికి సూచించారు. Will take care personally @KTRoffice please coordinate https://t.co/eYx0boCgYC — KTR (@KTRTRS) November 4, 2022 దాతలు సాయం చేయాల్సిన అడ్రస్ మోతే జయంత్ అకౌంట్ నం : 026312010000566 ఐఎఫ్ఎస్సీ కోడ్ UBI0802638, యూనియన్ బ్యాంకు, జమ్మికుంట బ్రాంచ్ -
NEET అభ్యర్థి లోదుస్తుల తొలగింపుపై రగడ
తిరువనంతపురం: నీట్ పరీక్షలో అభ్యర్థి లోదుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షకు అనుమతించారనే వ్యవహారం ముదురుతోంది. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. స్పందించిన మానవ హక్కుల సంఘం.. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఘటనకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది కూడా. అయితే.. నీట్ ఎగ్జామ్ కోసం వెళ్లిన అభ్యర్థిని లోదుస్తులు తొలగించారనే ఘటనపై ఎట్టకేలకు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ స్పందించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జులై 17న నీట్ పరీక్ష సందర్భంగా.. కేరళ కొల్లాంలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థినిని లోదుస్తులు తొలగించాల్సిందిగా సెంటర్ నిర్వాహకులు కోరారు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి మాట్లాడుతూ.. 90 శాతం విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, వాళ్లంతా మానసిక వేదన అనుభవించారని ఆరోపించారు. మీడియా కథనాల ఆధారంగా.. ఈ ఘటనపై కొల్లాం సెంటర్ సూపరిండెంట్, ఇండిపెండెంట్ అబ్జర్వర్, సిటీ కో ఆర్డినేటర్ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. అలాంటి ఘటనేం జరగలేదని, అభ్యర్థిని పరీక్షకు అనుమతించామని వాళ్లు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఏ సైతం ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ డ్రెస్ కోడ్ ప్రకారం.. నీట్ పరీక్షలో అలా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి నిబంధనలు లేవు. కోడ్ చాలా స్పష్టంగా ఉంది అని ఎన్టీఏ తెలిపింది. విమర్శల నేపథ్యంతో.. కేరళ కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి.. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రంలో తన కూతురికి ఎదురైన ఘోర అవమానంపై కొట్టారకారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్టీఏ రూల్స్లో లేకున్నా తన కూతురి లోదుస్తులు విప్పించి స్టోర్ రూమ్లో పడేయాలని, ఆపైనే పరీక్షకు అనుమతించారని.. తద్వారా ఆమెను మానసికంగా వేధించారని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. మెజార్టీ విద్యార్థులకు ఇలాంటి సమస్యే ఎదురైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేరళ లోక్సభ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ ఈ ఘటనపై స్పందించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతో పరీక్షలో అవకతవకలు గుర్తించగలుగుతున్నాం. అలాంటి సాంకేతిక సాయాన్ని ఉపయోగించకుండా.. ఇలా కర్కశకంగా వ్యవహరించడం సరికాదంటూ విమర్శించారు. ఈ మేరకు ఘటనపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నారు. పోలీస్ కేసు నమోదు బలవంతగా విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేరళ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు ఈ ఘటనపై సీరియస్గా స్పందించారు. కేంద్రం ఈ వ్యవహారంలో ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. అలాగే.. నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికను బలవంతంగా ఇన్నర్వేర్ను తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 354, 509ల కింద కేసు నమోదు చేశారు. అయితే పరీక్ష నిర్వాహణ కేంద్రం అయిన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు.. తమ సిబ్బంది ఎవరూ తనిఖీల ప్రక్రియలో పాల్గొనలేదని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ విద్యాశాఖ కూడా తమ పరిధిలో ఈ పరీక్ష జరగలేదని, రాష్ట్ర నిర్వాహణ అధికారులు ఎవరూ అందులో లేరని అంటోంది. డ్రెస్ కోడ్ ఏంటంటే.. అభ్యర్థులు సాధారణంగా.. వాతావరణానికి తగిన దుస్తులను ధరించాలని సూచిస్తుంది. అయితే, పూర్తి స్లీవ్లతో కూడిన లేత రంగు దుస్తులను మాత్రం ధరించడానికి వీల్లేదు. అలాగే శాండల్స్, ఓపెన్ స్లిప్పర్స్ వేస్కోవచ్చు. షూలు ధరించడానికి మాత్రం వీల్లేదు. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు, నల్ల కళ్లద్దాలు, చేతి వాచీ, బ్రేస్లెట్, కెమెరా, నగలు, మెటాలిక్ వస్తువులు నిషిద్ధం. అయితే మెటాలిక్ హుక్స్ ఉన్న దుస్తులు నిషిద్దమా? కాదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతంలో కేరళలోనే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2017లో కేరళ కన్నూర్లోనే ఓ అభ్యర్థితో బ్రా విప్పించారు సెంటర్ నిర్వాహకులు. ఆ ఘటన విమర్శలకు దారి తీసింది. తొలుత.. హాప్ స్లీవ్, బ్లాక్ ప్యాంట్తో సెంటర్కు చేరుకుంది ఓ అభ్యర్థి. అయితే డార్క్ కలర్ అనుమతించకపోవడంతో.. ఆమె ఆందోళనకు గురైంది. ఆదివారం కావడంతో దుకాణాలు సైతం తెరవలేదు. దీంతో రెండు కిలోమీటర్లు తల్లితో పాటు వెళ్లి కొత్త దుస్తులు కొనుగులు చేసుకుని మార్చుకుని వచ్చింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మెటల్ డిటెక్టర్ గుండా వెళ్తున్న టైంలో.. బ్రాకు ఉన్న హుక్స్ కారణంగా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇన్నర్వేర్ తొలగించి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఆమె పరీక్ష రాసింది. ఆ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లునీట్ నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరం పాలక్కడలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ ఏడాది నీట్ పరీక్షల సమయంలో హిజాబ్ తొలగింపు ఫిర్యాదులు సైతం రావడం విశేషం. -
నీట్ యూజీ సెంటర్ల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) నీట్ యూజీ– 2022 కోసం అభ్యర్థులు ఏ పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ రాస్తారనే జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. అయితే ఈసారి జాబితాను అభ్యర్థుల సౌకర్యార్థం చాలా ముందుగానే విడుదల చేయడం విశేషం. లిస్ట్ను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో సెంటర్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది అడ్మిట్ కార్డు కాదని, కేవలం అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించే వెసులుబాటు అని ఎన్టీఏ తమ నోటీస్లో పేర్కొంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తర్వాత డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 17న జరిగే ఈ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే దఫాలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 546 పట్టణాల్లో నిర్వహించనున్న నీట్ యూజీ–2022 కోసం ఆంధ్రప్రదేశ్లో 29, తెలంగాణలో 24 నగరాలను ఎంపిక చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, కువైట్ సహా పలు దేశాల్లోని 14 నగరాల్లోనూ టెస్ట్ నిర్వహించనున్నారు. -
నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థినికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్
అల్లవరం (కోనసీమ జిల్లా): పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తాజాగా విడుదల చేసిన పీజీ నీట్ ఫలితాల్లో హర్షితకు 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన హర్షిత 9.3 గ్రేడ్ సాధించి విశాఖపట్నంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్లోనూ 9.3 గ్రేడ్ సాధించి ఎంసెట్లో 180వ ర్యాంక్ దక్కించుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించింది. ఎంబీబీఎస్లో ప్రథమ స్థానంలో నిలిచి ఆరు బంగారు పతకాలు సాధించింది. పోస్ట్రుగాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)– చండీగఢ్ నిర్వహించిన ప్రవేశపరీక్షలోనూ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. పీడియాట్రిక్స్లో పీజీ చేయడమే తన లక్ష్యమని హర్షిత తెలిపారు. తమ కుమార్తె నీట్ పీజీలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యాళ్ల శ్రీనివాసరావు, కాంతామణి ఆనందం వ్యక్తం చేశారు. కాగా హర్షిత తమ్ముడు శివ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళంలోని జెమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన హర్షితకు పలువురు అభినందనలు తెలిపారు. -
NEET PG 2022 Result: నీట్ పీజీ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: మే నెలలో నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాలు విడదలయ్యాయి. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఫలితాలు విడుదల చేయడంలో అధికారుల కృషిని కేంద్రమంత్రి ప్రశంసించారు. NEET-PG result is out! I congratulate all the students who have qualified for NEET-PG with flying colours. I appreciate @NBEMS_INDIA for their commendable job of declaring the results in record 10 days, much ahead of the schedule. Check your result at https://t.co/Fbmm0s9vCP — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 1, 2022 నీట్ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2022 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ- 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష వాయిదా వేయలేమని తెలిపింది. కాగా నీట్ పీజీ-2021 కౌన్సిలింగ్ ఉన్నందున చదువుకోవడానికి తగినంత సమయం లేకపోవడంతో పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ వైద్యుల బృందం పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపి శుక్రవారం తీర్పును వెల్లడించింది. నీట్ పీజీ 2022 పరీక్షలు వాయిదా వేయడం సరైన ఆలోచన కాదని, దీని వల్ల ఈ పరీక్ష రాసే 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనిసనం తెలిపింది. నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయడం వల్ల రోగి సంరక్షణ, వైద్యుల కెరీర్ పై ప్రభావం చూపుతుందని బెంచ్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎలా.పరీక్షను వాయిదా వేస్తామని కోర్టు ప్రశ్నించింది. కాగాఈ ఏడాది మే 21న నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్లు మే 16, 2022 నుంచి అధికారిక వెబ్సైట్ nbe.edu.in లో అందుబాటులో ఉండనున్నాయి. చదవండి:చత్తీస్గఢ్లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి -
నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్టెస్టులు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. చదవండి👉: Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుసరిస్తే..! ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్ పరీక్షలకు సాక్షి మాక్టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్ను మరింత మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్) పరీక్ష 25 జూన్, 2022, 26 జూన్, 2022 (శనివారం, ఆదివారం) తేదీల్లో ఆన్లైన్లో జరగనుంది. సాక్షి మాక్ నీట్ పరీక్ష 3 జూలై, 2022 (ఆదివారం) ఆన్లైన్/ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది. ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు https://www. arenaone.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈమెయిల్కు హాల్టికెట్ నంబర్ వస్తుంది. వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 96666 97219, 99126 71555, 96662 83534 -
టీ అమ్మిన చేతులతో నాడిపట్టేలా..
సాక్షి, ఒంగోలు: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం..కన్నబిడ్డలను కష్టపడి చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. బిడ్డలకు కూడా కష్టం అంటే ఏమిటో తెలియజేస్తోంది. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చదువులో రాణించటం మొదలు పెట్టారు. ఆ కష్టం కాస్తా ఫలించింది. కుమారుడు మెడిసిన్కు సంబంధించి నీట్ ఎంట్రన్స్ పరీక్షలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని నింపాడు. దీంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. స్థానిక ధారావారితోటలో నివాసం ఉంటూ..ప్రకాశం భవన్ ముందు టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దాసరి పిచ్చయ్య, మాధవిల కుమారుడు దాసరి వంశీకృష్ణ ఈ అరుదైన ఘనత సాధించాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన వంశీకృష్ణ చదువుకుంటూనే టీ కొట్టులో కూడా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చివరకు మొన్నటి మెడిసిన్ నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సిలింగ్లో విశాఖపట్నంలోని గాయత్రీ విద్యాపీఠం మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పిచ్చయ్య ఎస్సీ కార్పొరేషన్లో రూ.లక్ష రుణం తీసుకొని జీవనం సాగిస్తూ తన కుమారుడు, కుమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమార్తె వైష్ణవి కూడా బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వైష్ణవి చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహకారం అందుతోంది. ప్రత్యేకంగా అభినందించిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్లో సీటు సాధించిన దాసరి వంశీకృష్ణను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు చంద్రయ్య నగర్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం వచ్చిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్ సీటు సాధించిన వంశీకృష్ణను వెన్ను తట్టి ప్రోత్సహించారు. సాధారణ టీకొట్టు నడుపుకుంటున్న వ్యక్తి కుమారుడు ఎంబీబీఎస్ సీటు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. యువత కష్టపడి చదువుకోవాలని బాలినేని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాసరి వంశీకృష్ణ పడిన కష్టం గురించి మంత్రికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్ వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద టీ అమ్ముకుంటూ కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి పథకం ద్వారా వంశీకృష్ణ చెల్లెలు వైష్ణవి చదువుకుందని, అదేవిధంగా బీటెక్లో చేరాక జగనన్న విద్యా దీవెన పథకం కూడా వచ్చిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ సీటు వచ్చిన ఆర్డర్ను మంత్రి బాలినేని చేతుల మీదుగా వంశీకృష్ణకు అందజేశారు. -
నీట్ ఎగ్జామ్: బీజేపీ ఆఫీస్పై బాంబు దాడి.. .రౌడీ షీటర్ అరెస్ట్!!
చెన్నై(తమిళనాడు): టీ నగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై పెట్రో బాంబు దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు దుండగులు పెట్రోల్ బాటిళ్లతో ఆఫీస్పై దాడికి తెగపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటనకు సంబంధించి వినోద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నీట్ పరిణామాలతోనే తాను బీజేపీ ఆఫీస్పై పెట్రోల్ బాంబుతో దాడి చేశానని ఆ యువకుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై. వినోద్ ఒక రౌడీ షీటర్ అని.. చదువుకు అతనికి పొంతన లేదని, అలాంటప్పుడు నీట్ వ్యతిరేకంగా దాడి ఎందుకు చేస్తాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉండొచ్చని.. ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాడు. ఇక దాడి అనంతరం ఆఫీస్ను పరిశీలించిన అన్నామలై.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉండగా.. నీట్పై తమిళనాడు ముందు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో వ్యతిరేక బిల్లు సైతం రూపొందించి ఆమోదించగా.. బీజేపీ అడ్డుచెప్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. కొన్ని నెలల తర్వాత పరిశీలించిన గవర్నర్.. బిల్లును ఆమోదించకుండానే అసెంబ్లీకి వెనక్కి తిప్పి పంపారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిణామాలు తట్టుకోలేకనే తాను దాడికి పాల్పడినట్లు వినోద్ చెప్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత కొందరితో కలిసి పెట్రల్ సీసాలను బీజేపీ ఆఫీసుల్లోకి విసిరాడు వినోద్. ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాలకు బానిసైన వినోద్పై రౌడీ షీట్ కూడా ఉందని, సీసీ ఫుటేజీ ద్వారా మిగతా నిందితులను పట్టుకుంటామని టీనగర్ డీసీపీ హరి చెబుతున్నారు. -
నీట్ పీజీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: నీట్ పీజీ 2022 పరీక్షను 6– 8 వారాలు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈమేరకు పరీక్ష వాయిదా వేయాలని జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీఈ)ని కోరింది. ప్రభుత్వ ఆదేశం మేరకు పరీక్షను మార్చి 12 నుంచి మే 21కి వాయిదా వేస్తున్నట్లు ఎన్బీఈ ఎంఎస్(మెడికల్ సైన్సెస్) శుక్రవారం ప్రకటించింది. మే 21 ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. పరీక్ష దరఖాస్తుకు ఆన్లైన్ విండో గడువు ఈనెల 4న ముగుస్తుండగా, ఈ గడువును మార్చి 25 రాత్రి 11.55 గంటల వరకు పొడిగించింది. నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ తేదీలతో నీట్ పీజీ 22 పరీక్ష తేదీలు ముడిపడుతున్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫిబ్రవరి 8న విచారణ నీట్ పరీక్ష వాయిదా వేయాలంటూ గత నెల్లో కొందరు విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 8న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. మరోవైపు నీట్ పరీక్షపై చర్చకు డీఎంకే సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీనికి సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు అంగీకరించలేదు. దీంతో నిరసనగా కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. -
‘నీట్’ తీర్మానం వెనక్కి పంపిన గవర్నర్.. దుమారం
After NEET Bill Sent Back GetOutRavi Trending In Twitter: నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని వెనక్కి పంపించినట్టు రాజ్ భవన్ గురువారం ప్రకటించింది. దీంతో గవర్నర్ నిర్ణయంపై డీఎంకేతో పాటుగా నీట్ను వ్యతిరేకిస్తున్న వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి, చెన్నై : గురువారం రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో నీట్పై అసెంబ్లీలో చేసిన తీర్మా నం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నట్టు వివరించారు. నీట్ రాకతో విద్యార్థులందరికీ సామాజిక న్యాయం దక్కుతోందని పేర్కొన్నారు. సమగ్ర పరిశీలన, సమీక్ష మేరకు పేద విద్యార్థులకు నీట్ ఎంతో దోహదకరంగా ఉందన్నారు. Christian Medical College, Vellore Association Vs. Union of India (2020) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని వెనక్కి పంపించడమే కాకుండా, అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో, పునః పరిశీలన జరిపాలని, తగిన వివరణ ఇవ్వాలని స్పీకర్ అప్పవును గవర్నర్ ఆదేశించడం గమనార్హం. గెట్అవుట్రవి ట్రెండింగ్లో.. ఇక గవర్నర్ నిర్ణయంపై పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ ప్రజలంతా గవర్నర్ రవి నిర్ణయాన్ని ఖండిస్తూ.. ట్విటర్లో గెట్ అవుట్ రవి యాష్ ట్యాగ్తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, మనోభావాల్ని గౌరవించలేనప్పుడు తప్పుకోవాలంటూ, వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. #GetOutRavi😡😡 That’s the tweet — Dr Sharmila (@DrSharmila15) February 3, 2022 Hon TR Balu MP at parliament of India Today said that" To call back TN Governor Ravi "#GetOutRavi pic.twitter.com/QQn7fiABR7 — ELAIYA (@elaiyakumar_r) February 3, 2022 ఇదిలా ఉంటే అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఈ బిల్కు మద్ధతు తెలపగా.. బీజేపీ మాత్రం సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. NEET అసమానతలను పెంపొందించడంతో పాటు సమాజంలోని ధనవంతులు, అధిక ప్రాధాన్యత కలిగిన తరగతికి అనుకూలంగా ఉందని, XII తరగతిని కొనసాగించడమే కాకుండా ప్రత్యేక కోచింగ్ను పొందగలుగుతారు. ఇది వాస్తవంగా వైద్య మరియు దంత విద్య నుండి గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన సామాజిక వర్గాలను అడ్డుకుంటుంది. Who are you to decide the NEET is against rural students....#GetOutRavi Or you will be forced to get out of TN pic.twitter.com/ygM9oGN8Lj — selvam (@Selvam_nallavan) February 3, 2022 #GetOutRavi When you can’t work for TN, quit https://t.co/hhbOUJNry1 — Upright (@GATHOBIAS) February 3, 2022 వైద్య UG ప్రోగ్రామ్ల తర్వాత సంపన్న తరగతికి చెందిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడం లేదని. తరచూ విదేశాలలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్నారని, ఇది రాష్ట్రంలో సేవలందిస్తున్న వైద్యుల సంఖ్య క్షీణతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. All party has to take unanimous decision to send back the governer.#GetOutRavi #GetOutGovernorRavi https://t.co/1HoemlZLMx — Aravindan L (@i_am_aravindan) February 3, 2022 రీకాల్ చేయండి ఇదిలా ఉంటే నీట్ బిల్లును వెనక్కి పంపిన నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం గుర్రుగా ఉంది. వెంటనే గవర్నర్ రవిని రీకాల్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం లోక్సభలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు సైతం గళం వినిపించారు. ఐదు నెలల కాలయాపన తర్వాత ఆ బిల్లును పంపించడం ఏంటో అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ(ఎం) ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 5న గవర్నర్ నిర్ణయంపై చర్చించేందుకు.. భవిష్యత్ చర్యల కోసం శనివారం(ఫిబ్రవరి 5న) సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రాజ్యాంగం ప్రకారం.. సాధారణంగా అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిస్తారు. ఒకవేళ వెనక్కి పంపిన బిల్లు మళ్లీ గవర్నర్ దగ్గరికి గనుక వస్తే మాత్రం.. దానిపై ఆయన ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపిస్తారు. ఆపై తుది నిర్ణయం రాష్ట్రపతికే ఉంటుందని రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్ చెప్తున్నారు. -
'సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..
CM Stalin Stops to Meet Student: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం ఎంకే స్టాలిన్ తనదైన పాలనతో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో చెన్నైలోని టీటీకే రోడ్లో ఓ యువకుడు 'సీఎం సార్ హెల్ప్ మీ' అంటూ ప్లకార్డును పట్టుకుని నిల్చొని ఉండగా, దీనిని గమనించిన సీఎం స్టాలిన్ తన కారును ఆపి ఆ యువకుడితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎన్ సతీష్ దేశమంతటా నీట్ మినహాయింపులు తీసుకు వచ్చేలా చూడాలని సీఎం స్టాలిన్ను విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తమిళనాడులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలను వ్యతిరేకిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. తమిళనాడులోని డీఎంకే ప్రభత్వుం నీట్ రద్దు కోసం చర్యలను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని, విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (Viral Video: పట్టపగలే భారీ దొంగతనం.. తుపాకీతో బెదిరించి కోటి రూపాయలతో పరార్) மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள், தலைமைச் செயலகம் வரும் வழியில் டி.டி.கே சாலையில், ஆந்திர மாநிலம் கிழக்கு கோதாவரி மாவட்டத்தைச் சேர்ந்த மாணவர் திரு. என்.சதிஷ், “CM SIR HELP ME” என்ற பதாகையுடன் நின்றிருந்ததை பார்த்து, அவரை சந்தித்துப் பேசினார். 1/2 pic.twitter.com/279k8ilq8g — CMOTamilNadu (@CMOTamilnadu) February 3, 2022 -
నీట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం రూరల్/చిలకలపూడి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ–2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు కౌషిక్రెడ్డి 23వ ర్యాంక్తో మెరిశాడు. ఇక బాలికల టాప్ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్లు సాధించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్లకు ర్యాంక్ కార్డులను పంపింది. 720కి 720 మార్కులు సాధించింది వీరే.. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్జెండర్లు కూడా నీట్లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in,http://taresults.nic.in/NTARESULTS&CMS/ వెబ్సైట్లలో చూసుకోవచ్చు. పరీక్ష పత్రం ఫైనల్ ‘కీ’ని కూడా ఎన్టీఏ విడుదల చేసింది. కటాఫ్ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్మర్ తదితర సంస్థల్లో నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు.. గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ కటాఫ్ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కటాఫ్ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచ్చినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ ► నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ► అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ► దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ► నీట్లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు www.mcc.nic.in వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. ► ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. కౌషిక్రెడ్డికి పలువురి అభినందన నీట్లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించిన కృష్ణా జిల్లా జేసీ మాధవీలత కుమారుడు కౌషిక్రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. కౌషిక్రెడ్డి తిరుపతి భారతీయ విద్యాభవన్లో పదో తరగతి చదివి 500కు గానూ 488 మార్కులు సాధించాడు. అనంతరం ఇంటర్మీడియెట్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి 985 మార్కులు పొందాడు. సమాజ సేవ చేస్తా.. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పటికీ.. సమాజానికి ఎక్కువ సేవ చేసేందుకు వైద్య రంగమైతే బాగుంటుందని ఎంబీబీఎస్ను ఎంచుకున్నా. వైద్య రంగం ఎంతో ఆసక్తికరమైందే కాకుండా సవాళ్లతోనూ కూడుకున్నది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా అధ్యయనం చేశా. ఏకధాటిగా చదవడం కంటే ప్రతి 45 నిమిషాలకు 10– 15 నిమిషాల విరామమిచ్చేవాడిని. టీవీ చూడటం, వీడియోగేమ్స్ వంటి వాటితో ఒత్తిడిని జయించాను. అమ్మ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, నాన్న హెచ్ఆర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. వారిద్దరూ నన్ను అన్ని విధాల ప్రోత్సహించారు. – మృణాల్ కుట్టేరి, నీట్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ న్యూరాలిజిస్ట్గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేస్తా. ఆ తర్వాత న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేసి పేదలకు సేవలందించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్న లక్ష్మి,Ðð వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించగలిగాను. తెలంగాణ ఎంసెట్లో ఐదో ర్యాంకు, ఏపీ ఈపీసెట్లో ప్రథమ ర్యాంకు సాధించాను. – చందం విష్ణువివేక్, నీట్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు న్యూరో ఫిజీషియన్ అవుతా మాది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వట్టెం గ్రామం. నీట్లో ఐదో ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి వరకు కర్నూలులో చదివాను. హైదరాబాద్లో ఇంటర్మీడియెట్ చదివాను. రోజూ 10 గంటలు అధ్యయనం చేశాను. ఢిల్లీ ఎయిమ్స్లో చేరతాను. న్యూరో ఫిజీషియన్ అవుతా. అమ్మ.. సీనియర్ లెక్చరర్గా, నాన్న.. బిజినెస్ మెడిక్యూర్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. – ఖండవల్లి శశాంక్, ఆలిండియా ఐదో ర్యాంకర్ చదవండి: మన పరీక్షలు ఎంత ‘నీట్’? -
NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
నీట్–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల(సెప్టెంబర్) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు ఆధారంగా.. మెరిట్ లిస్ట్, ఫైనల్ కటాఫ్లను నిర్ణయించి.. ఆల్ ఇండియా కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్ కోటా విధానంలో సీట్లు భర్తీ చేస్తారు!! నీట్ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిపుణుల సలహాలు.. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్ ఈసారి క్లిష్టంగా ఉంది. 450 మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) 450 కంటే ఎక్కువ నీట్ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్ సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది. కౌన్సెలింగ్కు సన్నద్ధం నీట్లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు.. కౌన్సెలింగ్కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి. (ఫ్రెషర్స్కు గుడ్న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు...) ముందుగా ఆల్ ఇండియా కోటా ప్రస్తుతం నీట్–యూజీ ప్రవేశాలను ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆల్ ఇండియా కోటాలో దాదాపు 6,700 ఎంబీబీఎస్ సీట్లు; నాలుగు వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కౌన్సెలింగ్ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే అవకాశముంది. (చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!) రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు. కాలేజ్ ఎంపిక ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విషయంలో ఏ కాలేజ్లో సీటు వచ్చినా ఓకే అనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇన్స్టిట్యూట్లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి. ప్రత్యామ్నాయ మార్గాలు నీట్ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్తోపాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్తోపాటు మరెన్నో కోర్సులను ఎంచుకోవచ్చు. ఆయుష్ కోర్సులూ నీట్తోనే ► ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఆయుష్ కోర్సులు. బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, యునానీ(బీయూఎంఎస్), బీఎన్వైఎస్ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే.. డాక్టర్ కల సాకారం అవుతుంది. ► ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్ఆర్యూహెచ్ఎస్, ఏపీలో ఎన్టీఆర్యూహెచ్ఎస్లు ఈ ప్రక్రియను చేపడతాయి. బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్).గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఏఎంఎస్ మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. యునానీ (బీయూఎంఎస్) ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎన్వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్.. బీఎన్వైఎస్. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది. బీవీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ). ఈ కోర్సు ద్వారా.. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్లో అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. హార్టికల్చర్ సైన్స్ బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్ను ఎంచుకోవచ్చు. వీరికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.. సంక్షిప్తంగా బీఎఫ్ఎస్సీ. బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇతర కోర్సులు కూడా బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. కౌన్సెలింగ్కు ముందే స్పష్టత నీట్ కౌన్సెలింగ్కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు దగ్గర ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్, కేఎన్ఆర్యూహెచ్ఎస్ నీట్–2021– ముఖ్యాంశాలు ► జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్కు దాదాపు 16 లక్షల మంది హాజరు. ► దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్లో 83 వేలు, బీడీఎస్లో 27 వేల సీట్లు. ► నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం–ఏపీలో 5,210 ఎంబీబీఎస్ సీట్లు, తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు. ► గత ఏడాది హెల్త్ యూనివర్సిటీల నోటిఫికేషన్ గణాంకాల ప్రకారం– ఏపీలో 1440 బీడీఎస్ సీట్లు , తెలంగాణలో 1140 బీడీఎస్ సీట్లు. ► 450పైగా స్కోర్ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సెలింగ్కు సన్నద్ధంగా ఉండాలి. ► కౌన్సెలింగ్కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ► ఎంబీబీఎస్, బీడీఎస్కు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఆయుష్, ఏజీ బీఎస్సీ, బీవీఎస్సీ, ఫిషరీస్ తదితరాలు. -
ఏ ర్యాంకుకు ఎక్కడ ఎంబీబీఎస్ సీటు? విద్యార్థుల్లో పరేషాన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఇటీవలే ముగిసింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 59 వేల మందికిపైగా నీట్ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఆందోళన అంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా.. ఇలా అన్నీ కలిపి 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. అభ్యర్థుల్లో అందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది, ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం అభ్యర్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎన్ని మార్కులొస్తే సీటు వస్తుంది? ఏయూ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 343 మార్కులకు డెంటల్ సీటు గతేడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఎస్టీ కేటగిరీలో 162 మార్కులు సాధించిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో దంత వైద్య సీటు లభించింది. జాతీయ స్థాయిలో 6,31,277 ర్యాంకు సాధించిన అభ్యర్థికి 162 మార్కులు వచ్చాయి. అదే ఓపెన్ కేటగిరీలో చివరి సీటు 343 మార్కులు (ర్యాంకు 2,57,671) వచ్చినవారికి దక్కింది. ఎస్సీ కేటగిరీలో 310 మార్కులు వచ్చిన వారికి చివరి సీటు లభించింది. అదే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చూస్తే ఎస్టీ కేటగిరీలో 359 మార్కులు (2,35,606 ర్యాంకు) వచ్చిన వారికి కూడా సీటు దక్కింది. దీన్ని బట్టి చూస్తే ఒకే రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల పరిధిలో ఎంత వ్యత్యాసం ఉందో అంచనా వేయొచ్చు. -
యువతి అదృశ్యం కలకలం: హీరో సూర్య ఆందోళన
చెన్నె: నీట్ భయం ఇంకా తమిళనాడు విద్యార్థులను వెంటాడుతోంది. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు నీట్ ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. నీట్ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినా కూడా విద్యార్థులు ఊరట చెందడం లేదు. తాజాగా ఓ విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నీట్ పరీక్ష రాసి వచ్చిన అనంతరం కీ పేపర్ చూసుకున్న విద్యార్థిని కనిపించకుండాపోయింది. దీంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళనాడులోని నమక్కర్ జిల్లాకు రాసిపురం పోలీస్స్టేషన్ పరిధికి చెందిన శ్వేత (19) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్-నీట్)ను ఈనెల 12వ తేదీన రాసింది. ఈనెల 17వ తేదీన రాసిన పరీక్షకు సంబంధించిన కీ పేపర్ చూసుకుంది. ఉత్తీర్ణత సాధించలేనని గ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు అదృశ్యం కేసు ఫిర్యాదు చేయడంతో రాసిపురం పోలీసులు గాలిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే నీట్ మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అయినా కూడా విద్యార్థుల బలవన్మరణాలు ఆగకపోవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో సందేశం విడుదల చేశారు. ‘పరీక్షపై ఆందోళనతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు. బంగారు భవిష్యత్ ఎంతో ఉంది’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు సూర్య కూడా విద్యార్థులకు ఓ పిలుపునిచ్చారు. -
‘నీట్’కు బలైన ముగ్గురు..సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన
చెన్నె: మూడు రోజుల్లో ముగ్గురు ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై భయంతో ఆందోళన చెందుతూ బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి మరణం తమిళనాడు రాష్ట్రాన్ని కదిలించింది. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే చలించిపోయారు. తమ విద్యార్థులకు బలిపీఠంగా మారిందని పేర్కొన్న స్టాలిన్ నివారణ చర్యలు చేపట్టారు. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ నుంచి ఉపశమనం కలిగిస్తూ అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పెట్టినా కూడా విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా ఓ యువతి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సీఎం స్టాలిన్ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మనోధైర్యం కల్పిస్తూ ఓ సందేశం విడుదల చేశారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ‘నీట్తో ఆందోళన చెందుతున్న విద్యార్థుల కోసం 24/7 పని చేసే హెల్ప్లైన్ను మొదలుపెట్టాం’ అని సీఎం స్టాలిన్ తెలిపారు. విద్యార్థులకు నిరంతరం కౌన్సిలింగ్ ఇస్తామని ప్రకటించారు. మనస్తాపం.. ఒత్తిడితో బాధపడుతుంటే 104కు సంప్రదించాలని.. వ్యక్తిత్వ వికాస నిపుణుడితో మాట్లాడించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వీటికోసం ఏకంగా 330 మంది నిపుణులను నియమించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. ‘ప్రియమైన విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందొద్దు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మేం మొత్తం మారుస్తాం. నీట్ రద్దు చేసేంత వరకు మేం విశ్రమించం’ అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. రాతి హృదయాలను కరిగిద్దాం అని పిలుపునిచ్చారు. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడ్డవద్దని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. నీట్పై తమిళనాడులోని అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. மாணவச் செல்வங்களே! மனம்தளராதீர்கள்! கெஞ்சிக் கேட்டுக்கொள்கிறேன்; ஈடில்லா உயிர்களை மாய்த்துக் கொள்ளாதீர்கள்! கல் நெஞ்சங்கொண்டோரைக் கரைப்போம்!#NEET எனும் அநீதியை ஒழிக்கும்வரை நாம் ஓயமாட்டோம்! https://t.co/sE6530aZR7 — M.K.Stalin (@mkstalin) September 15, 2021 -
నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, చెన్నై: మెడికల్ ప్రవేశపరీక్ష నీట్ నుంచి పూర్తిగా మినహాయింపు కోరుతూ సీఎం ఎంకే స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తమిళ విద్యార్థులకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతునివ్వాలని విపక్షాలను కోరారు. ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో నీట్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష అన్నా డీఎంకే మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. తమిళనాడులో నీట్ జరుగుతుందా లేదా తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని, చివరికి విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా అసెంబ్లీలో చర్చించనివ్వలేదని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు. నీట్పై డీఎంకే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించలేదని మండిపడ్డారు. నీట్నును రద్దు చేస్తారనుకొని విద్యార్థులు ఆ పరీక్షకు సిద్ధం కాలేదు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామని, అయితే నీట్ తీర్మానానికి మద్దతిస్తున్నామని పళనిస్వామి అన్నారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి -
నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
చెన్నె: వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై విద్యార్థుల్లో భయాందోళన నెలకొని ఉంది. ఆ పరీక్షపై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్ రాయగా అర్హత సాధించలేకపోయాడు. ఏడాదిగా మూడోసారి నీట్కు శిక్షణ పొందాడు. చివరకు ఆదివారం పరీక్ష ఉండగా ఫెయిలవుతాననే భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. ఈ ఘటనపై తమిళనాడులో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ.. 48 గంటల్లో భూవివాదం పరిష్కారం సేలం జిల్లా కుజయ్యూర్కు చెందిన ధనుశ్ (19) నీట్కు ప్రిపేరవుతున్నాడు. గతంలో రెండుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించకపోయాడు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు. తీరా ఆదివారం పరీక్ష ఉండగా భయాందోళన పెంచుకున్నాడు. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేమోననే భయంతో పరీక్షకు కొన్ని గంటలు ఉందనగా ఆ యువకుడు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్పై ఒత్తిడి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు, మృతుడి సోదరుడు నిశాంత్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుశ్ తల్లిదండ్రులు ‘నీట్ పరీక్ష రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ విద్యార్థి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నీట్ బలిపీఠం మీద మరొక మరణం. ఈ ఘటన నన్ను షాక్కు గురి చేసింది. నీట్కు శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాం’ అని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. நீட் எனும் பலிபீடத்தில் மற்றுமொரு மரணம்! கல்வியால் தகுதி வரட்டும்; தகுதி பெற்றால் மட்டுமே கல்வி எனும் அநீதி நீட் ஒழியட்டும்! நாளை நீட் நிரந்தர விலக்கு சட்ட மசோதா கொண்டு வருவோம்; #NEET-ஐ இந்தியத் துணைக்கண்டத்தின் பிரச்சினையாகக் கொண்டு செல்வோம். pic.twitter.com/iAI4zm9knA — M.K.Stalin (@mkstalin) September 12, 2021 -
NEET Exam: ఈనెల 12న షెడ్యూల్ ప్రకారం యథాతథం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంర్ 12న ఆదివారమే ఈ పరీక్షను నిర్వహించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని.. అలాగే సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని.. అందువల్ల నీట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
నీట్(యూజీ) 2021: ఇలా ప్రిపేరయితే విజయం ఖాయం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) –యూజీ–2021.. ఎంబీబీఎస్, బీడీఎస్తోపాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష! గత కొన్ని నెలలుగా.. నీట్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు.. ఎట్టకేలకు ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పరీక్ష విధానంలో కొన్ని కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ–2021లో మార్పులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. నీట్–యూజీ–2021 నిర్వహణ తేదీపై సందేహాలకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్) తాజాగా పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది.దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్షను పెన్–పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు నీట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛాయిస్ విధానం నీట్ పరీక్షలో ఈ ఏడాది ఛాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్బీలోని 15 ప్రశ్నల్లో పదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. నీట్లో గతేడాది వరకు బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్ట్లను కలిపి బయాలజీ విభాగం పేరుతో 90 ప్రశ్నలు అడిగేవారు. కాని ఈ ఏడాది బోటనీ, జువాలజీలను రెండు వేర్వేరు సబ్జెక్టులుగా పేర్కొన్నారు. ఒక్కోదాన్ని నుంచి 45 ప్రశ్నలు అడగనున్నారు. రెండు సెక్షన్లు ► మొత్తం నాలుగు సబ్జెక్ట్ల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) పరీక్ష జరుగుతుంది. ► ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ పేరుతో రెండు విభాగాలు ఉంటాయి. ► ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్–ఏ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్–బీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. ► సెక్షన్–బీలోని 15 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్గా వదిలేసి.. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ► ప్రతి సబ్జెక్ట్ నుంచి మొత్తం 50 ప్రశ్నలు అడిగినా.. సెక్షన్–బీలో కల్పించిన ఛాయిస్ విధానం వల్ల 45 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ► అంటే.. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు చొప్పున.. నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన ప్రకారం– ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పదమూడు భాషలు నీట్ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కోరుకుంటే.. కేవలం ఇంగ్లిష్ ప్రశ్న పత్రం అందిస్తారు. హిందీ కోరుకుంటే.. ఇంగ్లిష్/హిందీ ఇలా రెండు భాషల్లో.. అంటే బైలింగ్వల్ టెస్ట్ బుక్లెట్ను ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాంతీయ భాషను ఎంచుకుంటే.. సదరు ప్రాంతీయ భాష/ఇంగ్లిష్ బుక్లెట్ అందిస్తారు. ఉదాహరణకు తెలుగును కోరుకున్న విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్.. ఇలా రెండు భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఛాయిస్ కల్పించినా.. పెరగని సమయం ఈ ఏడాది నీట్లో ప్రశ్నల సంఖ్య పెంచి ఛాయిస్ విధానాన్ని కల్పించినా.. పరీక్ష సమయాన్ని పెంచలేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది విద్యార్థులు అదనంగా 20 ప్రశ్నలు చదివి, వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరీక్షలో సమయాభావానికి దారితీసే ఆస్కారముందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉన్నా.. మొత్తం 15 ప్రశ్నలు చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఛాయిస్గా వదిలేయాల్సిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకునేందుకు సమయం పడుతుంది. బోటనీ, జువాలజీ వేర్వేరుగా ► బయాలజీ విషయానికొస్తే.. ఈ ఏడాది కొత్తగా బోటనీ, జువాలజీ పేరుతో రెండు ప్రత్యేక సబ్జెక్టులుగా పరీక్ష నిర్వహించనున్నారు. ► బోటనీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై దృష్టిపెట్టడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు,కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటన్స్లో రెప్లికేషన్, ట్రాన్స్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. ► జువాలజీకి సంబంధించి హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ► ఫిజిక్స్లో.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. రివిజన్కు ప్రాధాన్యం ► నీట్లో మంచి స్కోర్ సాధించేందుకు విద్యార్థులు సిలబస్పై గట్టి పట్టు బిగించాలి. ► ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని.. ఆయా సబ్జెక్ట్ల అభ్యసనం చేయాలి. ► ప్రస్తుత సమయంలో స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► నిర్దిష్ట సమయంలో అవగాహన పొందేలా ముందుకు కదలాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► మోడల్ కొశ్చన్స్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్డైరెక్ట్ కొశ్చన్స్నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు ర్యాపిడ్ రివిజన్కు ఉపయోగపడుతుంది. నీట్–యూజీ(2021) సమాచారం ► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 12, 2021 (మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు) ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: డిసెంబర్ 31 నాటికి కనిష్ట వయోపరిమితి 17ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25ఏళ్లు ఉండాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 13 నుంచి ఆగస్ట్ 6 వరకు. ► ఆన్లైన్లో దరఖాస్తులో సవరణ అవకాశం: ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 12 వరకు. ► పరీక్ష కేంద్రం కేటాయింపు ప్రకటన: ఆగస్ట్ 20, 2021. ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తుకు వెబ్సైట్స్: https://ntaneet.nic.in ఈజీ టు డిఫికల్ట్ పరీక్ష రోజున అభ్యర్థులు తొలుత ప్రశ్న పత్రం చదివేందుకు పది, పదిహేను నిమిషాలు కేటాయించాలి. ఛాయిస్ సెక్షన్ విషయంలో వీలైనంత వేగంగా ప్రశ్నలను అర్థం చేసుకొని.. తమకు కచ్చితంగా సమాధానాలు తెలిసిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకోవాలి. ముందుగా సులభమైన ప్రశ్నలతో సమాధానాలు గుర్తించడం ప్రారంభించాలి. ప్రిపరేషన్ పరంగా.. ఎక్కువ సమయం రివిజన్కు కేటాయించాలి. అదే విధంగా మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లకు హాజరై తమ సామర్థ్యం స్థాయి తెలుసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. – బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు -
దేశవ్యాప్తంగా 83,275 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) పీజీ, యూజీ ప్రవేశ పరీక్షలు త్వరలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వివిధ కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అందులో ప్రభుత్వ కాలేజీలు 289 ఉంటే, వాటిలో 43,435 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 269 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 39,840 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం అంటే, 6,515 సీట్లను అన్ని రాష్ట్రాలు నేషనల్ పూల్కు ఇస్తాయి. వాటిని జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేటాయిస్తారు. జాతీయస్థాయిలో రెండుసార్లు కౌన్సెలింగ్ జరిగాక, నేషనల్ పూల్లో మిగిలిన సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు. ఇదిలావుంటే తెలంగాణలో 34 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 11 ప్రభుత్వ కాలేజీల్లో 1,790 సీట్లు, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని సీట్లల్లో 15 శాతం అంటే 268 సీట్లు నేషనల్ పూల్లోకి వెళ్తాయి. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లల్లో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన 35 శాతం బీ కేటగిరీ కింద నిర్ణీత ఫీజుతో భర్తీ చేస్తారు. 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద తమకు ఇష్టమైన వారికి ప్రైవేట్ యాజమాన్యాలు కేటాయించుకునే వెసులుబాటుంది. ‘మనూ’ కొత్త వైస్ చాన్స్లర్ ఐనుల్ హసన్ హెచ్సీయూకు బసుత్కర్ జే రావు.. రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) నూత న వైస్ చాన్స్లర్గా ప్రముఖ పర్షియన్ పండితుడు ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా తిరుపతిలోని ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)లో బయాలజీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ బసుత్కర్ జే రావు నియమితులయ్యారు. -
స్కూళ్లలోనే నీట్ దరఖాస్తు.. డెడ్లైన్ ఆగస్టు 6
సాక్షి, చెన్నై: నీట్కు సిద్ధం అవుతున్న విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలల నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే వెసులు బాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సెప్టెంబర్లో దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష తేదీని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్రంలో వైద్య చదువుల ఆశలతో ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ దరఖాస్తుల ప్రక్రియ రెండు రోజుల క్రితమే మొదలైనా రాష్ట్రంలో జాప్యం తప్పలేదు. ఈ ఏడాది నీట్ ఉంటుందా, ఉండదా అన్న డైలమాలో ఉన్న విద్యార్థులు తాజాగా దరఖాస్తు ప్రక్రియపై దృష్టి పెట్టారు. అదే సమయంలో నీట్ దరఖాస్తుల నమోదు ప్రకియ అంతా ఆన్లైన్లో సాగనుంది. ఈ పరీక్షకు సిద్ధం అవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు దరఖాస్తులను పూర్తి స్థాయిలో ఏ మేరకు ఆన్లైన్లో నమోదు చేయగలరో, ఏదేని పొరబాట్లు జరిగిన పక్షంలో పరీక్ష రాయలేని పరిస్థితి తప్పదన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తించింది. స్కూళ్లలోనే నమోదు.... గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, నగర, పట్టణాల్లోని పేద విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల నమోదు కష్టాలను పరిగణించి ఆయా స్కూళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో సాగుతున్న పాఠశాలల నుంచి నీట్కు సిద్ధం అవుతున్న విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు నమోదు ఆన్లైన్లో సక్రమంగా జరిపే రీతిలో చర్యలు తీసుకోవడమే కాకుండా, ఈ ప్రక్రియను ఆగస్టు 6వ తేదీలోపు ముగించాలని, ఆయా పాఠశాలలకు విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా సెంటర్లు.. నీట్ శిక్షణ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోగ్యమంత్రి ఎం సుబ్రమణ్యం తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నీట్ నుంచి మినహాయింపు వస్తుందని ఎదురుచూశామని, అయితే, కేంద్రం పరీక్షల్ని ప్రకటించిందని పేర్కొన్నారు. తాము మాత్రం ఈ పరీక్షల్ని వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు. ప్రస్తుతం కేంద్రం తేదీ ప్రకటించిన దృష్ట్యా, ఆన్లైన్లో దరఖాస్తుల నమోదుకు చర్య చేపట్టక తప్పలేదన్నారు. ఈ సారి పరీక్షలకు రాష్ట్రంలో 18 కేంద్రాలు ఏర్పాటు చేశారని, అలాగే, వారి వారి మాతృభాషల్లో పరీక్షలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. -
అదే జరిగితే పీహెచ్సీల్లో డాక్టర్లు కనిపించరు!
నీట్ ఎగ్జామ్ను గనుక కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు కనిపించరని ఆందోళన వ్యక్తం చేశారు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, విద్యావేత్త ఏకే రాజన్. నీట్ పరీక్ష-ప్రజాభిప్రాయసేకరణ కోసం రాజన్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను సమర్పించింది కూడా. చెన్నై: ‘నీట్ వల్ల పేదలకు ఇబ్బందులే ఎదురవుతాయి. ఉన్నత వర్గాలకు చెందినవాళ్లే ఎక్కువ సీట్లను దక్కించుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు స్థానికులకు వైద్య విద్య దక్కదు. బాగా డబ్బున్నవాళ్లు మారుమూల పల్లెల్లో వైద్య సేవలను అందించేందుకు ముందుకొస్తారా? విదేశాలకు వెళ్లడానికి, వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికే ఇష్టపడతారు. అప్పుడు పీహెచ్సీలు ఖాళీగా ఉంటాయి. వైద్యం అందక పేదల ప్రాణాల మీదకు వస్తుంది’అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రాజన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలేవీ నీట్ను వ్యతిరేకించట్లేదని, కానీ, త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా తమిళనాడు బాటలోనే డిమాండ్ వినిపిస్తాయని, ‘హిందీ తప్పనిసరి’ ఆదేశాల విషయంలో జరిగిందే నీట్ విషయంలోనూ జరగొచ్చని రంజన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 86 వేల మంది నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిశీలనలోకి తీసుకుని.. మరికొందరితో మాట్లాడి, విద్యావేత్తలతో చర్చించాకే ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు రాజన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన తప్పనిసరి ఎగ్జామ్ నీట్ వల్ల వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంత పిల్లలకు వైద్య విద్యలో అవకాశాలు దక్కవని, సిలబస్ సమస్యతో పాటు కోచింగ్ లాంటి వాటితో ఆర్థిక భారం పడుతుందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావిస్తూ రాజన్ కమిటీ తన ప్రాథమిక రిపోర్ట్ను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. అందరికీ సమాన హక్కులు దక్కనప్పుడు.. అడ్డుగా ఉన్న నిబంధనలను(నీట్) మార్చాల్సిన అవసరం ఉంటుందని రాజన్ అంటున్నారు కూడా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ వల్ల విద్యార్థులకు సామాజిక న్యాయం దక్కదనే అంశంపై పార్టీలకతీతంగా తమిళనాడు నుంచి పరీక్ష రద్దు డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్కు పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతుండడం విశేషం. అయితే ఇవేం పట్టించుకోని కేంద్రం నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘స్కూళ్లు, కాలేజీలు మూసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలె ప్రధాని మోదీని కోరారు. ఇంకోవైపు విద్యార్థులు కూడా అక్టోబర్ వరకు ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ట్విటర్లో ట్రెండ్ కొనసాగిస్తున్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్ ప్రవేశపరీక్ష తీరుతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈతిబాధలపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం నియమించిన విచారణ బృందాన్ని రద్దు చేయాలన్న బీజేపీ నేత పిటిషన్కు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణ జరపడంలో తప్పులేదని పేర్కొంటూ పిటిషన్ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. వివరాలు... వైద్య విద్యలో ప్రవేశానికి కేంద్రప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన నీట్ పరీక్షలో గట్టెక్కెడం తమిళనాడులోని పేద, గ్రామీణ విద్యార్థులకు తీవ్రకష్టతరంగా మారింది. నీట్ ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ నీట్ ప్రవేశపరీక్షను వ్యతిరేకించాయి. ఆందోళనలు చేపట్టి నీట్ రద్దు చేయాలని నినదించాయి. ఈ క్రమంలో కొన్ని విద్యార్థి సంఘాలు కోర్టుల్లో పిటిషన్లు వేశాయి. మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వ్యతిరేకత రాజకీయ ముడిసరుకుగా మారింది. డీఎంకే అధికారంలోకి వస్తే నీట్ ప్రవేశపరీక్ష రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకుంటామని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నీట్ వల్ల విద్యార్థిలోకం, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను విచారించించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే రాజన్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని సీఎం స్టాలిన్ నియమిస్తూ గతనెల 10వ తేదీన ఉత్తర్వులు జారీచేశారు. ఈ జీఓను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు నాగరాజన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో... ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు నీట్ వ్యవహారంలో బృందం ఏర్పాటుపై సుప్రీంకోర్టు అనుమతి పొందారా అని ప్రశ్నను లేవనెత్తింది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు వీలులేదని వ్యాఖ్యానించింది. అంతేగాక ఈ కేసుకు సంబంధించి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దాఖలు చేసిన పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నీట్ ప్రవేశపరీక్షకు సంబంధించిన చట్టాల అమలుపై కేంద్రం పర్యవేక్షణ ఉన్నందున తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకే రాజన్ విచారణ బృందం సుప్రీంకోర్టు తీర్పుకు భంగకరం. రాష్ట్ర పరిధిలోని అంశాలపై మాత్రమే విచారణ బృందం నియమించుకునే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉంది. నీట్ ప్రవేశపరీక్ష తీరుపై విచారణ జరపడం రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిదాటి ప్రవర్తించడమే అవుతుందని పేర్కొంది. ఈ క్రమంలో... మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కు ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. నీట్ ప్రవేశపరీక్ష వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు ఎంతమాత్రం విరుద్ధం కాదు. వివరాలు సేకరించి నివేదికను సమర్పించాలని కోరిందేకానీ అంతకు మించి మరేమీ లేదు. విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే అంశాలు నివేదికలో బయటపడితే వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మార్పులకు సూచించవచ్చు. అంతేకాదు... విచారణ బృందం ఏర్పాటు వృథా ఖర్చని భావించడానికి వీలులేదు. ప్రభుత్వం నిర్వహించే ప్రజాభిప్రాయసేకరణలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలోని విచారణ బృందంపై నిషేధం విధించడానికి వీలులేదని తీర్పు చెప్పింది. గురు నాగరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం స్టాలిన్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న బీజేపీ, అన్నాడీఎంకేకు ఈ తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. నేడే నివేదిక సమర్పణ: కోర్టు తీర్పు రాష్ట్రప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే రాజన్ బృందం బుధవారం తమ నివేదికను సీఎం స్టాలిన్కు సమర్పించనుంది. నీట్కు వ్యతిరేకంగా, అనుకూలంగా 89,342 మంది విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఈ బృందం అభిప్రాయాలను సేకరించింది. ఈ అభిప్రాయాలపై పలు దఫా విశ్లేషణ సమావేశాలు పూర్తి చేసి సిద్ధం చేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. సెప్టెంబర్12వ తేదీన నీట్ ప్రవేశపరీక్ష జరగనుండగా ఆన్లైన్ ద్వారా విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభించారు. -
బ్రేకింగ్: నీట్ పీజీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు 10,12 తరగతలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘ నీట్ పీజీ పరీక్షను దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. ఈ ఏడాది ఆగస్ట్ 31న పరీక్ష నిర్వహించలేము. ఎగ్జామ్ డేట్ ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఒక నెల రోజులు వ్యవధి ఇస్తాం. ఆ తర్వత పరీక్ష నిర్వహిస్తాం. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది క్వాలిఫైడ్ డాక్టర్లు కోవిడ్ విధి నిర్వహణలో పాల్గొనే అవకాశం లభిస్తుంది’’ అన్నారు. కరోనా కట్టడికి తగినంత మంది వైద్యుల లభ్యత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనివల్ల కోవిడ్ డ్యూటీ నిర్వహించే వైద్య సిబ్బంది లభ్యత గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల పీజీ విద్యార్థుల కొత్త బ్యాచ్ ప్రారంభం అయ్యేవరకు చివరి సంవత్సరం పీజీ విద్యార్థుల (విస్తృత మరియు సూపర్-స్పెషాలిటీలు) సేవలను ఉపయోగించుకోవడానికి ఇది దోహదపడుతుందన్నారు అధికారులు. "ఇంటర్న్షిప్ రొటేషన్లో భాగంగా కోవిడ్ మేనేజ్మెంట్ విధుల్లో మెడికల్ ఇంటర్న్లను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో మోహరించడానికి అనుమతించాలని నిర్ణయించాము’’ అని తెలిపారు అధికారులు. తాజా నిర్ణయం ఇప్పటికే కోవిడ్ విధుల్లో నిమగ్నమైన వైద్యులపై పడుతున్న పని భారాన్ని తగ్గిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాలు అర్థం కావట్లేదు -
NEET UG 2021: ర్యాంక్ సాధించే మార్గం!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా.. నీట్–యూజీ! జాతీయ స్థాయిలో.. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్లతోపాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్–యూజీ ఎంట్రన్స్లో స్కోరే ప్రధానం! నీట్లో సాధించిన స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే.. ఇంటర్మీడియెట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు.. ఏటేటా పోటీ పెరుగుతోంది. నీట్–యూజీ–2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ 2021 విధి విధానాలు.. పరీక్ష ప్యాట్రన్.. ఈ టెస్ట్లో మంచి స్కోర్ సాధించడానికి నిపుణుల సలహాలు.. ఎంబీబీఎస్, బీడీఎస్.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల. తమ డాక్టర్ కలను సాకారం చేసుకునే దిశగా.. నీట్ యూజీలో ర్యాంకు సాధిం చేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఇంతటి కీలకమైన నీట్–యూజీ –2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఇటీవల వెల్లడించింది. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలో స్కోర్ సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. మొత్తం పదకొండు భాషలు నీట్–యూజీని తెలుగు సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు దరఖాస్తు సమ యంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచు కుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్ను అందిస్తారు. ఒక్కసారే.. ఆఫ్లైన్లోనే నీట్ను కూడా జేఈఈ మెయిన్ మాదిరిగానే ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించే అవకాశముందనే వార్తలు ఇటీవల వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ.. గతేడాది మాదిరిగానే నీట్ ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. అది కూడా ఆఫ్లైన్ విధా నంలో పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్న ట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడిక ఎలాంటి ఆందోళన లేకుండా.. పూర్తిగా ప్రిపరేషన్కు ఉప క్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. 180 ప్రశ్నలు.. 720 మార్కులు నీట్ యూజీకి అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీ. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు నీట్ పరీక్ష ఉంటుంది. వివరాలు.. సిలబస్ కుదింపు కష్టమే కొవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ +2 స్థాయిలో సిలబస్ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్ సిలబస్ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్ సిలబస్ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. జేఈఈ–మెయిన్ మాదిరిగానే నీట్లోనూ ఛాయిస్ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవగాహన ముఖ్యం నీట్–యూజీ–2021కు తేదీ వెల్లడైంది. కాబట్టి ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్తో సమన్వయం చేసుకుంటూ.. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. తొలుత అభ్యర్థులు నీట్ సిలబస్పై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాతే ప్రిపరేషన్కు ఉపక్రమించాలి. సిలబస్లో పేర్కొన్న దానికి అదనంగా ఇతర అంశాలను చదవాల్సిన అవసరం లేదు. నీట్, బోర్డ్ సిలబస్లో కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. ఆయా అంశాలను మొదట బోర్డు ఎగ్జామ్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. టైమ్ ప్లాన్ కూడా ► నీట్ విద్యార్థులు ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ముందుగానే నిర్దిష్ట సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి కట్టుబడి ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ టైమ్ టేబుల్ను తప్పనిసరిగా ఏరోజుకారోజు అనుసరించాలి. ► నీట్ సిలబస్కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్లకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. ► నిర్దిష్ట సమయంలో సిలబస్ను పూర్తి చేసేలా ముందుకు కదలాలి. ► ఈ సమయంలో అభ్యర్థులంతా స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఫలితంగా స్వీయ సామర్థ్యాలపై అవగాహన వస్తుంది. ఇంకా ఏఏ సబ్జెక్ట్లలో పట్టు సాధించాలనే దానిపై స్పష్టత లభిస్తుంది. ► సబ్జెక్ట్ పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ► పరీక్షకు రెండు నెలల ముందు కొత్త చాప్టర్లు, అంశాల జోలికి వెళ్లకూడదు. ఈ సమయాన్ని పూర్తిగా రివిజన్కే కేటాయించాలి. ► మోడల్ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఇంటర్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్ ప్రిపరేషన్ను సమాంతరంగా కొనసాగించొచ్చు. ► ఇంటర్మీడియెట్ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్ పరీక్షలకే సమయం కేటాయించాలి. ► ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక.. తిరిగి నీట్కు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్ టిప్స్ ఫిజిక్స్.. ఈ టాపిక్స్ ప్రధానం నీట్ ఫిజిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన సిలబస్ అంశాలను అధ్యయనం చేయాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అర్థం అవుతోంది. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు విద్యార్థులకు అంత త్వరగా ఎక్కవు. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించాలి. - ఎన్.నరసింహమూర్తి, సబ్జెక్ట్ నిపుణులు కెమిస్ట్రీ.. పునశ్చరణ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ తదితరాలను కెమిస్ట్రీలో కీలక పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికొస్తే... ఇందులో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందిం చుకోవాలి. ఫలితంగా ఫార్ములాను అన్వయించే నైపుణ్యాలు సొంతమవుతాయి. పీరియాడిక్ టేబుల్పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. పునశ్చరణ చేస్తూ, మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా.. పరీక్షకు కావల్సిన సన్నద్ధత లభిస్తుంది. - విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు బయాలజీ.. కాన్సెప్ట్లపై పట్టు నీట్–యూజీ పరీక్షలో కీలకంగా భావించే విభాగంగా బయాలజీని పేర్కొనొచ్చు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీపై ఎక్కువ పట్టు కలిగి ఉంటారు. నీట్ బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో.. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటన్స్లో రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. - బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు జువాలజీలో ఇలా జువాలజీలో గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 45 ప్రశ్నల్లో హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 14, ఎకాలజీ నుంచి 10–12, జెనిటిక్స్, ఎవల్యూషన్ కలిపి 6 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం. - కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు అనలిటికల్ అప్రోచ్తో ఎంతో మేలు నీట్ ప్రిపరేషన్ క్రమంలో అనలిటికల్ అప్రోచ్తో సాగితే..ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రతి రోజు తాము చదివిన అంశాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవడం, ఇన్స్టిట్యూట్లు నిర్వహించే వీక్లీ టెస్ట్లు, మోడల్ టెస్ట్లకు హాజరు కావడం కూడా ఎంతో మేలు చేస్తుంది. – అనంత పరాక్రమ్ భార్గవ్, నీట్–2020 11వ ర్యాంకు నీట్–యూజీ(2021) సమాచారం ► నీట్ పరీక్ష తేదీ: ఆగస్ట్ 1, 2021 ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► నీట్కు బైపీసీతో ఉత్తీర్ణత అని పేర్కొన్నప్పటికీ.. ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్లు బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్లలో 50 శాతం మార్కులు పొంది ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. ► వయో పరిమితి: కనిష్ట వయోపరిమితి 17 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ► పూర్తి వివరాలకు వెబ్సైట్స్: https://ntaneet.nic.in, https://nta.ac.in -
ఆగస్ట్ 1న నీట్–2021
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ తదితర మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్(యూజీ)–2021ను ఈ ఏడాది ఆగస్టు 1న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. హిందీ, ఇంగ్లీష్తో సహా మొత్తం 11 భాషల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నీట్–2021ను విద్యార్థులు పెన్ అండ్ పేపర్ విధానంలో రాయాల్సి ఉంటుంది. సిలబస్, వయస్సు, రిజర్వేషన్లు, సీట్ల వర్గీకరణ, పరీక్ష ఫీజు, పరీక్షా నగరాలు, స్టేట్ కోడ్ తదితర పూర్తి వివరాలతో త్వరలో బుటెటిన్ను వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఆన్లైన్ పాఠాలు అర్థం కావట్లేదు
కరోనా వేళ నాకు ఆన్లైన్ బోధన అందుబాటులో లేదు. పుస్తకాలు కొనుక్కునే పరిస్థితీ లేదు. అందుకే ఇప్పట్లో పరీక్షలు వద్దు. ఆఫ్లైన్ తరగతుల తర్వాతే పరీక్షలు పెట్టండి.’ – కరుణ శర్మ, 12వ తరగతి ఆన్లైన్ బోధన అర్థం కావట్లేదు. అభ్యసనపై సంతృప్తిగా లేదు. ప్రత్యక్ష విద్యా బోధన కావాలి. ఆ తర్వాతే పరీక్షలు పెట్టండి. పరీక్షలన్నీ జూన్ వరకు వాయిదా వేయండి. – అబు అనస్, విద్యార్థి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం, పరీక్షల నిర్వహణ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు నుంచి వ్యక్తమైన అభిప్రా యాలు. ప్రత్యక్ష విద్యా బోధన, సిలబస్ కుదింపుపైనా దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్కు అనేక విజ్ఞ ప్తులు, సూచనలు చేశారు. జేఈఈ మెయిన్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు, సీబీఎస్ఈ 11, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులతో ఈనెల 10న 10 గంటలకు ట్విటర్ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించగా వేల మంది స్పందించారు. పరీక్షలు ఇప్పట్లో వద్దని 99 శాతం మంది స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనపై చర్యలు చేపట్టాకే ముందుకు సాగాలని సూచించారు. మరికొంత మంది విద్యార్థులైతే 12వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధన కంటే ఆన్లైన్ బోధన కొనసాగించాలని, పరీక్షలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని కోరారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో సిలబస్ను తగ్గించాలని సూరజ్ అనే విద్యార్థి విజ్ఞప్తి చేశారు. ఇంకొంత మంది విద్యార్థులైతే ప్రాక్టికల్ పరీక్షల ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నీట్ పరీక్షను కూడా జూన్ వరకు వాయిదా వేయాలని కోరారు. ఆన్లైన్ విద్యా బోధనకు అవసరమైన చాలామంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేవని, అవి ఉన్నా కొందరు ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలతో విద్యా బోధన ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధనతోనే ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాతే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న జరిగే ఆన్లైన్ చర్చా కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం వెల్లడించనున్నారు. పరీక్షలకు ఉపయోగపడని ఆన్లైన్ బోధన ఇంటర్మీడియెట్ విద్యలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్లైన్ బోధన.. పరీక్షలకు ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఆన్లైన్ విద్యతో పరీక్షలు నిర్వహించడం సరికాదు. నేరుగా తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రత్యక్ష విద్యా బోధన కనీసం 3 నెలలు నిర్వహించాల్సిందే. – ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్రెడ్డి -
పొరపాటు దిద్దుకున్న ఎయిమ్స్!
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థినికి ఆలిండియా ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీటు నిరాకరించడం సంచలనమైంది. నీట్-2020లో 66వ ర్యాంక్ పొందిన ఫర్హీన్ కేఎస్కు ఎయిమ్స్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె టూరిజం శాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అల్ఫోన్స్ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన ఎంపీ అల్ఫోన్స్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్కు లేఖ రాసి విద్యార్థిని సమస్య పరిష్కరించాలని కోరారు. విషయం ఆరోగ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో తమ పొరపాటును సరిదిద్దుకున్న ఎయిమ్స్ యాజమాన్యం ఎట్టకేలకు ఫర్హీన్ కేఎస్కు ప్రవేశం కల్పించింది. కాగా, నీట్లో 66 ర్యాంక్ సాధించిన ఫర్హీన్ గడువులోగా క్రిమి లేయర్ సర్టిఫికెట్ సమర్పించలేదన్న కారణంతో ఎయిమ్స్ సీటు నిరాకరించిన సంగతి తెలిసిందే. పేద కుటుంబంలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఎయిమ్స్లో చేదు అనుభవం ఎదురవడం దురదృష్టకరమని అల్ఫోన్స్ ఈ సంర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చొరవతో ఫర్హీన్కు సీటు దక్కిందని, మరి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ చిన్నచిన్న కారణాలతో ప్రవేశాలకు దూరమవుతున్నవారి సంగతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారానికి ఒక అప్పిలేట్ అథారిటీ ఉండాలని అల్ఫోన్స్ సూచించారు. ఉన్నత చదువులకు సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చే విద్యార్థులంతా మంత్రులను కలవలేరు కదా అని అన్నారు. ప్రవేశాలకు సంబంధించి ప్రాస్పెక్టస్లో సవివరంగా చెప్పాలని అన్నారు. -
‘నీట్’లాగే నర్సింగ్కూ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: మెడికల్ అడ్మిషన్లకు ‘నీట్’ ఎలాగో నర్సింగ్ ప్రవేశాలకూ జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష (యూనిఫామ్ ఎంట్రీ ఎగ్జామ్) రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న జాతీయ నర్సింగ్ కౌన్సిల్ స్థానంలో కొత్తగా ‘నేషనల్ నర్సింగ్, మిడ్వైఫరీ కమిషన్ (ఎన్ఎన్ఎంసీ)ను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 6నాటికి దేశవ్యాప్తంగా అభిప్రాయాలు కోరింది. నర్సింగ్ విద్య, వృత్తిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకనుగుణంగా తీర్చిదిద్దేందుకు బిల్లులో అనేక అంశాలను చేర్చారు. ప్రస్తుత నర్సింగ్ వ్యవస్థను సమూలంగా మార్చాలన్నదే దీని ఉద్దేశమని నర్సింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇకపై నర్సింగ్ కోర్సు చేయాలంటే.. ఇప్పటివరకు బీఎస్సీ నర్సింగ్లో చేరాలంటే ఇంటర్ బైపీసీ అర్హతగా ఉంది. ఓపెన్ కేటగిరీలో 45%, రిజర్వేషన్ కేటగిరీలో 40% మార్కులు సాధించిన వారు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన అనంతరం దరఖాస్తు చేసుకోవాలి. మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇక ఎంఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలంటే బీఎస్సీ నర్సింగ్ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే ఏడాదిపాటు ఎక్కడో ఒకచోట పనిచేసిన అనుభవం ఉండాలి. అలాంటివారికి వారి మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 2014కు ముందు ఎంఎస్సీ నర్సింగ్లో చేరేందుకు ఎంట్రన్స్ నిర్వహించేవారు. తదనంతరం దాన్ని ఎత్తేశారు. ప్రస్తుతం దేశంలో బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరడానికి మార్కులే అర్హత. నర్సింగ్ కోర్సు పూర్తయ్యాక రాష్ట్రాల్లోని నర్సింగ్ కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నర్సులుగా చేరేవారు. ఇకపై నర్సింగ్ వృత్తి చేపట్టడం అంత సులువు కాదు. నర్సింగ్ విద్యలో నాణ్యతను పెంచడానికి కొత్తగా జాతీయస్థాయిలో నీట్ తరహా ఎంట్రన్స్ పెడతారు. దానిని ‘యూనిఫామ్ ఎంట్రీ ఎగ్జామ్’గా పేర్కొన్నారు. ఇందులో అర్హత సాధించినవారు జాతీయ, రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక నర్సింగ్ కోర్సు పూర్తయినవారికి మళ్లీ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో పాసైన వారే నర్సింగ్ వృత్తి చేపట్టడానికి లేదా ఎంఎస్సీ కోర్సులో చేరడానికి అర్హులు. ముసాయిదాలోని మరికొన్ని అంశాలు నర్సింగ్ కోర్సు సిలబస్ ఆలిండియా స్థాయిలో ఆంగ్లంలో ఒకటే ఉంటుంది. కాలేజీల్లో నర్సింగ్ విద్యా ప్రమాణాలను పెంచాలి. నైపుణ్యం, విజ్ఞానం, ప్రవర్తన, విలువలు, నైతికత, హెల్త్కేర్, పరిశోధన వంటివి నేర్పించాలి. పోటీతత్వం పెంచాలి. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నర్సింగ్ విద్యాసంస్థలను తీర్చిదిద్దేలా మార్గదర్శకాలు రూపొందించాలి. మౌలిక సదుపాయాల కల్పన, మంచి ఫ్యాకల్టీని కల్పించడం ద్వారా నాణ్యతను పెంచాలి. అంతర్జాతీయ స్థాయిలో నర్సింగ్ ఫ్యాకల్టీకి శిక్షణనివ్వాలి. కమిషన్ అమల్లోకి వచ్చిన తరువాత మూడేళ్లలోపునే జాతీయస్థాయి ప్రవేశ పరీక్షను తీసుకొస్తారు. బిల్లు పాసైన ఐదేళ్లలో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ అమలుచేస్తారు. జాతీయస్థాయి రిజిస్ట్రేషన్ నర్సింగ్ కోర్సు ఏ రాష్ట్రంలో చదివినవారు ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ప్రస్తుత నిబంధన. కానీ కొత్త కమిషన్లో కీలకమార్పు చేశారు. నేషనల్ పోర్టల్లో జాతీయస్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. కాలేజీల్లో తనిఖీలు కఠినంగా ఉంటాయి. థర్డ్ పార్టీకి తనిఖీల బాధ్యత అప్పగిస్తారు. తనిఖీ వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఏఎన్ఎంలు ఇకపై ‘నర్స్ అసోసియేట్’గా కొత్త హోదా పొందుతారు. లేడీ హెల్త్ వర్కర్స్, మేల్ హెల్త్ వర్కర్లను కూడా నర్స్ అసోసియేట్గానే పిలుస్తారు. నాలుగు మండళ్ల ఏర్పాటు ఎన్ఎన్ఎంసీ పరిధిలో కొత్తగా నర్సింగ్–మిడ్ వైఫరీ యూజీ ఎడ్యుకేషన్ బోర్డు, నర్సింగ్– మిడ్వైఫరీ పీజీ ఎడ్యుకేషన్ బోర్డు, నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అసెస్మెంట్–రేటింగ్ బోర్డు, నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఎన్ఎన్ఎంసీకి చైర్పర్సన్, నర్సింగ్ అడ్వైజరీలు, సభ్యులు ఉంటారు. వీరిలో ఎయిమ్స్ వంటి సంస్థలు, ఆసుపత్రుల్లో పనిచేసే సూపరింటెండెంట్లు ఉంటారు. 12 మంది నిపుణుల్లో నర్సులు ఉంటారు. మిడ్వైఫరీ నుంచి, ఎన్జీవో నుంచి ఒక్కొక్కరు ఉంటారు. ఒకరు మెడికల్ లా తెలిసినవారు సభ్యులుగా ఉంటారు. సెర్చ్, సెలక్షన్ కమిటీలో ఆఫీస్ బేరర్లను నియమిస్తారు. చైర్మన్, సభ్యులు నాలుగేళ్లకోసారి మారతారు. చైర్మన్, సభ్యులు ఆస్తులు ముందే ప్రకటించాలి. నాణ్యత పెరుగుతుంది ప్రస్తుత నర్సింగ్ కౌన్సిల్ స్థానే నేషనల్ నర్సింగ్, మిడ్వైఫరీ కమిషన్ను తీసుకురావడం వల్ల నర్సింగ్ విద్యలో సమూల మార్పు లొస్తాయి. జాతీయస్థాయి పరీక్ష, ఎగ్జిట్ ఎగ్జామ్ల వల్ల నర్సింగ్ వృత్తి, విద్యలో ప్రమాణాలు, నాణ్యత పెరుగుతాయి. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందుతాయి. – లక్ష్మణ్ రుడావత్, ప్రధాన కార్యదర్శి, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ -
నీట్ ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ ntaneet.nic.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా సెప్టెంబర్ 13 న జరిగిన నీట్ పరీక్షా ఫలితాలు, షెడ్యూల్ ప్రకారం సోమవారం విడుదల కావాల్సి ఉండగా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో జాప్యం నెలకొన్న విషయం తెలిసిందే. మహమ్మారి కరోనా కారణంగా, కంటైన్మెంట్ జోన్లలో ఉండిపోవడం వల్ల పరీక్ష రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో నేడు ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈసారి నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్లతోపాటు జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019లో సవరణ చేశారు. -
ఫలితాలు వాయిదా, మరోసారి నీట్
న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వాయిదాపడ్డాయి. సెప్టెంబర్ 13 న జరిగిన నీట్ పరీక్షా ఫలితాలు షెడ్యూల్ ప్రకారం నేడు (సోమవారం) విడుదల కావాల్సి ఉండగా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఫలితాలు ఆలస్యం కానున్నాయి. కరోనా నియంత్రణ చర్యలతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్ 14న ఎగ్జామ్ నిర్వహించాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈమేరకు ఫలితాల విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 16 న ఫలితాలు విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన నీట్ పరీక్షా నిర్వహణ ఎట్టకేలకు సెప్టెంబర్ 13 న జరిగింది. అయితే, దేశవ్యాప్తంగా 15 లక్షల మంది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 90 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. (చదవండి: అఖిల భారత కోటా 6,410) .@DG_NTA will be declaring the results of #NEETUG 2020 on 16th October 2020. Exact timing of the results will be intimated later. I wish all the best to the candidates. #NEETResult2020 #NEETRESULTS — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) October 12, 2020 -
అఖిల భారత కోటా 6,410
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వారం రోజుల్లోగా నీట్ ఫలితాలు వెలువడగానే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలు మొదలుకాను న్నాయి. నీట్ అర్హత ద్వారానే అడ్మిషన్లు జరుగుతుండటంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు జాతీయస్థాయిలో పేరొందిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లు జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాల విద్యార్థులూ తమ ర్యాంకును బట్టి ఇష్టమైన కాలేజీల్లో సీట్లు పొందే అవకాశముంది. అందుకోసం ఆప్షన్లు ఉంటాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 541 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 82,926 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 278 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 42,729 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇక 263 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 38,840 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ సహా మరో 15 ఎయిమ్స్ల్లో 1,367 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. ఆ ప్రకారం జాతీయంగా 6,410 ఎంబీబీఎస్ సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. ఈ మేరకు జాతీయస్థాయి కౌన్సెలింగ్ జరగనుంది. ఆ ప్రాతిపదికనే నీట్లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో తమకు ఇష్టమైన మెడికల్ కాలేజీలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులకు నీట్ ర్యాంకు ఆధారంగా కాలేజీలను కేటాయిస్తారు. రాష్ట్రంలో 5,040 ఎంబీబీఎస్ సీట్లు.. ఎంసీఐ లెక్క ప్రకారం రాష్ట్రంలోని 32 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 5,040 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లుండగా, 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3,300 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో 15 శాతం అంటే 261 సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లన్నింటినీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక బీబీనగర్ ఎయిమ్స్లో 50 ఎంబీబీఎస్ సీట్లున్నా వీటన్నింటినీ జాతీయ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులు అఖిల భారత స్థాయిలో దాదాపు 8 వేల సీట్లకు పోటీపడే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖిల భారత కోటాలో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం, రాష్ట్రంలో మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జాతీయ కోటా రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక, ఇక మిగిలే సీట్లను ఆయా రాష్ట్రాలకే తిరిగి ఇచ్చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మిగిలిన సీట్లను మాప్ అప్ రౌండ్ పద్ధతి కౌన్సెలింగ్ ద్వారా అన్నింటినీ భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లనూ, ప్రైవేటులోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. 3 నెలలు ఆలస్యంగా అడ్మిషన్లు.. సాధారణంగా మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ జూలైలో ప్రారంభమై ఆగస్టు 31 నాటికి ముగుస్తుంది. ఈ ఏడాది కరోనా కారణంగా ప్రవేశాల ప్రక్రియ దాదాపు మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. గతేడాది మాదిరిగానే ఫీజులుండే అవకాశముంది. ఫీజులు పెంచాలన్న డిమాండ్ ఉన్నా కరోనా కారణంగా పెంపుపై ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని తెలిసింది. ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ఏడాదికి రూ.60 వేలు, మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరీ)లో రూ.11.50 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరీ)లో రూ.23 లక్షల వరకు వసూలు చేసుకునే వెసులుబాటుంది. ‘నీట్’కీ విడుదల.. ఈనెల 13న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సమాధానాల కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. ఆ సమాధానాలను సరిచూసుకోవాలనీ, ఒకవేళ జవాబుల్లో తప్పులు దొర్లినట్లుగా భావిస్తే విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు తమ సందేహాలను అధికారిక వెబ్సైట్లో తెలియజేయాలని పేర్కొంది. అందుకోసం అభ్యర్థులు రూ.వెయ్యి ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. సమాధాన పత్రంలో నిజంగానే తప్పులు దొర్లితే, ఆ మేరకు జవాబును సరిదిద్దుకోవడంతో పాటు విద్యార్థికి రుసుమును కూడా తిరిగి చెల్లిస్తామని తెలిపింది. నీట్ నిర్వహణ అనంతరం విద్యార్థులు తాము రాసిన ప్రశ్నలకు ఎంత మేరకు సమాధానాలు సరైనవిగా ఉన్నాయో ప్రాథమికంగా సరిచూసుకొని ఒక అంచనాకు వచ్చారు. అయితే తాజాగా అధికారికంగా సమాధాన పత్రం విడుదల చేయడంతో విద్యార్థులకు తమకు ఎన్ని మార్కులు నీట్లో వస్తాయనే స్పష్టత ఇప్పుడొచ్చింది. దీంతో గతేడాది ఎన్ని మార్కులకు ఎక్కడ సీటు వచ్చిందనే అవగాహనతో ఈ ఏడాది కూడా ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రానున్నారు. ఆ మేరకు విద్యార్థులు కూడా నిపుణుల సలహా తీసుకుంటున్నారు. -
ఎన్నదగిన తీర్పు
ప్రముఖ నటుడు సూర్యపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలన్న సూచనను తోసి పుచ్చుతూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎన్నదగ్గది. నీట్ పరీక్షలు నిర్వహణ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను తప్పుబడుతూ సూర్య సామాజిక మాధ్యమం ద్వారా వ్యాఖ్యలు చేశారు. ఇవి న్యాయవ్యవస్థను కించపరిచేలా వున్నాయంటూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్ర హ్మణ్యం హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. ఈ విషయంలో కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటూనే న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తుల పనితీరుపై వాఖ్యానాలు చేసేటపుడు జాగ్ర త్తగా మాట్లాడాలని ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం హితవు పలికింది. కోర్టు ధిక్కార నేరం అస్త్రాన్ని ప్రయోగించే విషయంలో మన దేశంలోనే కాదు... అనేక దేశాల్లో మొదటి నుంచీ భిన్నాభిప్రాయాలున్నాయి. బ్రిటన్లో వందేళ్లక్రితమే ఒక తీర్పు సందర్భంగా లార్డ్ మోరిస్ కోర్టు ధిక్కార నేరానికి కాలదోషం పట్టిందని వ్యాఖ్యానించారు. కోర్టుల పట్ల ప్రజాభిప్రాయం దాడి రూపంలోవున్నా, అపఖ్యాతిపాలు చేసేవిధంగా వున్నా, అవమానకరంగా వున్నా దాన్ని వారికే వది లేయడం మంచిదన్నారు. అనంతరకాలంలో బ్రిటన్లో కోర్టు ధిక్కారాన్ని నేరంగా పరిగణించే చట్టాన్ని రద్దు చేశారు. 2009నుంచి అయిదేళ్లపాటు లా కమిషన్ చైర్మన్గా వ్యవహరించిన జస్టిస్ బీఎస్ చౌహాన్ ఈ అంశాన్ని పరిశీలించారు. అయితే మన దేశంలో కోర్టు ధిక్కార నేరాలు పెరుగు తున్నందువల్ల ఈ చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం వున్నదని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఇందులోనే తగిన రక్షణలున్నాయన్నారు. సుప్రీంకోర్టుకు 1964లో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ గజేంద్ర గడ్కర్ కోర్టు ధిక్కార నేరాల విషయంలో అధికారాన్ని వినియోగించేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని న్యాయ మూర్తులకు హితవు పలికారు. కోర్టు ధిక్కార నేరానికి సంబంధించి వున్న చట్టం న్యాయమూర్తుల వ్యక్తిగత పరిరక్షణ కోసం కాదు. సరైన న్యాయం అందజేయడానికి న్యాయస్థానానికి గల అధికారానికి విఘాతం కలగకుండా వుండటం కోసం. వాస్తవానికి ఇది సాధారణ పౌరుడు న్యాయస్థానం నుంచి ఫలవంతమైన, ప్రభావశీలమైన న్యాయం పొందడానికుండే హక్కును రక్షించడం కోసం. కనుక ఏది కోర్టు ధిక్కారం అవుతుంది... ఏది కాదు అనే అంశంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరిం చాల్సివుంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలోని 19వ అధికరణ పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పూచీ పడుతోంది. అదే సమయంలో ఆ హక్కుకు సహేతుకమైన కొన్ని పరిమితులు కూడా విధిం చింది. అందువల్లే నిర్దిష్టమైన అభిప్రాయం లేదా ప్రసంగం కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయా రావా అన్న అంశాన్ని నిర్ధారించడానికి నిశిత పరిశీలన అవసరమవుతుంది. ఈ నెల మొదట్లో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కోర్టు ధిక్కరణ అంశం బాగా చర్చలోకొచ్చింది. తనకు సుప్రీంకోర్టుపైనా, మొత్తం న్యాయవ్యవస్థపైనా ఎంతో గౌరవం వున్నదని, ఆ రెండింటినీ అప్రదిష్టపాలు చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ప్రశాంత్ భూషణ్ వాదిం చారు. అయితే ఆయన నేరానికి పాల్పడ్డారని ధర్మాసనం అభిప్రాయపడి రూపాయి జరిమానా విధిస్తూ, అది చెల్లించకపోతే మూడు నెలల జైలు, మూడేళ్లపాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ వుంటాయని హెచ్చరించింది. ప్రశాంత్భూషణ్ జరిమానా చెల్లించి, తీర్పును పునఃసమీక్షించాలని అప్పీల్ చేశారు. ఆ వివాదం ముగియకముందే సూర్య వ్యాఖ్యలు దుమారం రేపాయి. సూర్య కేసు పూర్వాపరాలు గమనిస్తే ఆయన నీట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా లేదా న్యాయమూర్తులపైనా నిందలు వేయలేదు. ఉద్దేశాలు ఆపాదించలేదు. కానీ వ్యంగ్య ధోరణితో మాట్లాడారు. ‘కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న న్యాయ స్థానం విద్యార్థులు మాత్రం నిర్భయంగా పరీక్ష రాయాలని చెబుతోంద’న్నారు. సూర్య ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అందరికీ తెలుసు. తమిళనాడులో నీట్ పరీక్షలు రాయాల్సిన నలుగురు విద్యార్థులు ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో తాము పరీక్షలు రాసే పరిస్థితుల్లో లేమని వీరు లేఖలు రాసి చనిపోయారు. దీనిపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగినప్పుడు సూర్య ఈ వ్యాఖ్య చేశారు. న్యాయస్థానాలపై వ్యాఖ్యానాలు చేసేటపుడు వ్యక్తమయ్యే భాష, పదాలు సముచితమైన, న్యాయమైన విమర్శ పరిధుల్ని దాటి పోకుండా చూసుకోవాల్సిన అవసరం వున్నదని సూర్య వ్యాఖ్యపై తీర్పునిచ్చిన సందర్భంగా ధర్మాసనం తేల్చింది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలో అన్ని వ్యవస్థలూ స్తంభించిన మాట వాస్తవమే. అది అంతరించేవరకూ బాధితులకు న్యాయం కోసం వేచిచూసే పరిస్థితులు ఉండకూడదన్న ఉద్దేశంతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసుల్ని విచారించడం, వాదనలు వినడం అన్ని దేశాల్లోనూ మొదలుపెట్టారు. నేరుగా కేసుల్ని విచారించేటప్పుడు అందులో వున్న తీవ్రత తెలిసినంతగా, ఆన్లైన్ విచారణల్లో తెలిసే అవకాశం లేదని కొందరు న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేయకపోలేదు. ఈ ప్రక్రియలో వుండే సాంకేతికమైన అవరోధాల సంగ తలావుంచి, బహిరంగ విచారణ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని వారు అభి ప్రాయపడ్డారు. కేవలం కక్షిదారులకూ, వారి న్యాయవాదులకూ మాత్రమే పరిమితమయ్యే ప్రక్రియ సరికాదన్నారు. సూర్య విమర్శించిన కోణం వేరు. అయితే విమర్శించడానికి సూర్యకు గల హక్కును మద్రాస్ హైకోర్టు ప్రశ్నించలేదు. ఆ విమర్శ ఆరోపించేవిధంగా కాక హుందాగా వుండాలని సూచించింది. ఏ అంశంపైన అయినా అన్నీ తెలుసుకున్నాకే అభిప్రాయాలు వ్యక్తం చేయాలని హితవు పలికింది. మొత్తానికి మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఎంతో సంయమనంతో ఇచ్చిన ఈ తీర్పు ఎన్నదగినది. -
‘నటుడు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోం’
చెన్నై: తమిళ నటుడు సూర్యపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబోమని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తెలిపింది. నీట్ పరీక్షల నిర్వహణను ఉద్దేశించి సూర్య న్యాయమూర్తులను కించపరిచే విధంగా ట్వీట్లు చేశాడనే వాదనలపై ఈమేరకు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సూర్య వ్యాఖ్యలు అనవసరమైన, సమర్థనీయం కానివని పేర్కొంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రజా స్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని వెల్లడించింది. తమ పనితీరును తక్కువ చేసి మాట్లాడటం తగదని హితవు పలికింది. కాగా, నీట్ పరీక్షల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. (చదవండి: దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!) ఈ ఘటనపై నటుడు సూర్య స్పందిస్తూ.. ‘విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసింది. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారు. విద్యార్థులను మాత్రం భయం లేకుండా పరీక్షలు రాయమని ఆదేశిస్తారు’అని ట్వీట్లు చేశారు. దీంతో వివాదం రాజుకుంది. సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. న్యాయమూర్తుల నైతికతపై సూర్య ట్వీట్లు చేశారని పేర్కొన్నారు. అయితే, తమిళంలో ఉన్న ట్వీట్లను అన్వయం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని, సూర్య ట్వీట్లలో నైతికత అన్న పదమే లేదని కొందరు వాదిస్తున్నారు. (చదవండి: నీట్పై వ్యాఖ్యలు : చిక్కుల్లో హీరో సూర్య) -
నీట్పై వ్యాఖ్యలు : చిక్కుల్లో హీరో సూర్య
సాక్షి, చెన్నై: నీట్ పరీక్షపై స్పందించిన నటుడు సూర్య న్యాయపరమైన ఇబ్బందుల్లో పడనున్నారు. దేశంలోని న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను విమర్శించిన సూర్యపై కోర్టు ధిక్కార చర్యల తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.ఎం.సుబ్రమణ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే సూర్యపై ధిక్కార చర్య దిశగా అడుగులు పడటం సంచలనంగా మారింది. మీడియా, యూట్యూబ్లో నీట్ ప్రవేశ పరీక్షలపై సూర్య ప్రకటనను చూశానని జస్టిస్ ఎస్.ఎమ్. సుబ్రమణ్యం చెప్పారు. ఈ సందర్భంగా సూర్య వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ, ఆయనపై కోర్టు ధిక్కార చర్యల్ని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి అమ్రేశ్వర్ ప్రతాప్ సాహికి లేఖ రాశారు. న్యాయవ్యవస్థను కించపర్చేవిగా ఆయన వ్యాఖ్యలున్నాయని ఆయనపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ ధోరణి న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసానికి ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సూర్యపై ధిక్కార చర్యలను ప్రారంభించి ‘భారతీయ న్యాయ వ్యవస్థ ఘనతను చాటి చెప్పాలని’ ప్రధాన న్యాయమూర్తిని సుబ్రమణ్యం అభ్యర్థించారు. కరోనా కాలంలో నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న వైనం, కేంద్ర ప్రభుత్వ విద్యావిధానాన్ని గతంలో కూడా తప్పుబట్టిన సూర్య భయం, ఒత్తిడి కారణంగా తమిళనాడులో ఒకేరోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య ఘటనలతో చలించిపోయారు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయం చేస్తున్నగౌరవనీయ న్యాయమూర్తులు విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి పరీక్షలను ‘మనునీతి పరీక్షలు’లుగా అభివర్ణించిన సూర్య వీటివల్ల విద్యార్థుల జీవితాలను బలి తీసుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. అంతేకాదు ఈ ఆత్మహత్యలు తల్లిదండ్రులకు జీవితకాల శిక్షగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కోర్టులు క్రూరంగా వ్యవహరిస్తున్నాయంటూ ట్విటర్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో సూర్యను పలువురు ప్రశంసించడంతోపాటు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. My heart goes out to the three families..! Can't imagine their pain..!! pic.twitter.com/weLEuMwdWL — Suriya Sivakumar (@Suriya_offl) September 13, 2020 -
ప్రశాంతంగా ముగిసిన నీట్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆదివారం జరిగిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు మాస్కులు, గ్లౌజులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులను మూడు స్లాట్లుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడంతో ఉదయం 11 గంటలకే కేంద్రాలకు వచ్చినవారు మూడు గంటల పాటు వేచిఉండాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలు ఆదివారం తగ్గి వాతావరణం చల్లబడటంతో అభ్యర్థులు కాస్త ఉపశమనం పొందారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులను థర్మల్ స్క్రీనింగ్తో పాటు ఇతర సెక్యూరిటీ పరికరాలతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించారు. ప్రశ్నపత్రంపై మిశ్రమ స్పందన పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రశ్న పత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పేపరు కొంచెం సరళంగా వచ్చిందని కొంతమంది, ఫిజిక్స్ కష్టంగా ఉందని మరికొందరు, బయాలజీ, కెమిస్ట్రీ పేపర్లు సులభంగా ఉన్నాయని ఇంకొందరు చెప్పారు. గతేడాది కంటే ఈ ఏడాది కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉన్నట్టు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది 518 మార్కులకు ఓసీకి సీటు వచ్చింది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ వస్తేనే సీటు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 61 వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. -
‘నీట్’ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ‘నీట్’పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వైద్య కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన పరీక్ష తెలంగాణలో కట్టుదిట్టంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగితే, ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను విడతల వారీగా అనుమతించారు. అన్ని కేంద్రాల్లోనూ థర్మల్ గన్స్ను పెట్టారు. జ్వరం చూసిన తర్వాతే వారిని లోనికి అనుమతించారు. జ్వరం ఉన్నవారికి, కరోనా లక్షణాలున్న వారికి ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహించారు. గతంలో ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులకుసీటింగ్ ఏర్పాట్లు చేస్తే, ఈసారి 12 మందినే కూర్చోబెట్టారు. దీనిద్వారా ఒక్కో బెంచీకి ఒక్క విద్యార్థే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 94 శాతం హాజరు... ఈ ఏడాది తెలంగాణ నుంచి 55,800 మంది విద్యార్థులు నీట్కు దరఖాస్తు చేసుకున్నారు. హైదారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 112 నీట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 94 శాతం మంది విద్యార్థులు ‘నీట్’పరీక్షకు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. నీట్ పరీక్షా పేపర్ ఈసారి మోడరేట్ నుంచి సులువుగా ఉందని చాలామంది విద్యార్థులు అంటున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పేపర్ చాలా ఈజీగా ఉందని చెబుతున్నారు. 99 శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచే వచ్చాయి. కెమిస్ట్రీలోని రెండు మూడు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. ఒకే ప్రశ్నకు ఇచ్చిన జవాబులు దగ్గరగా ఉన్నాయి. బయాలజీలోని నాలుగైదు ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఈసారి అర్హత మార్కు 150..! మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించారు. అర్హత మార్కులు గతేడాది కంటే ఈసారి పెరుగుతుంది. గతేడాది జనరల్లో అర్హత మార్కు 134 ఉండగా, ఈసారి దాదాపు 150 వరకు పెరిగే చాన్స్ ఉందని నిపుణులు అంచనా వేశారు. గతేడాది జనరల్ కేటగిరీలో 480 మార్కులు వస్తే ఎక్కడో ఒకచోట సీటు వచ్చేది. ఈసారి 500 మార్కులు వచ్చినవారికి సీటు వచ్చే అవకాశం ఉంది. కన్వీనర్ కోటాలో గతేడాది 520 మార్కులకు సీటు రాగా... ఈసారి 550 మార్కులు వస్తే సీటు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈజీగా ఉంది: ముత్యాల సాయి వరుణ్, శ్రీచైతన్య, హైదరాబాద్ పేపర్ చాలా బాగుంది. ఎన్సీఈఆర్టీ నుంచే ఇచ్చారు. ప్రతీ సబ్జెక్ట్లో రెండు మూడు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. బాటనీలో కొంచెం ఎన్సీఈఆర్టీ నుంచి కాకుండా బయటి నుంచి ఇచ్చారు. అయితే అవి కూడా ఎన్సీఈఆర్టీకి రిలేటెడే. చాలా ఈజీగా ఉంది. కెమిస్ట్రీ టఫ్గా ఉంది: రోహిత్ సింహా, హైదరాబాద్ మొత్తంగా ఈసారి నీట్ పరీక్ష పేపర్ ఈజీగానే ఇచ్చారు. కెమిస్ట్రీ మాత్రం టఫ్గా ఉంది. ఒకే రకమైన ఆన్సర్లు ఉన్నాయి. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఫిజిక్స్లో 95 శాతం ఫార్ములా బేస్డ్ ప్రశ్నలు ఇచ్చారు. బాటనీ 90 శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ నుంచే ఇచ్చారు. ముందు నిరాకరణ.. ఆ తర్వాత అనుమతి కరీమాబాద్: హన్మకొండకు చెందిన సాయివైష్ణవి నీట్ పరీక్ష రాసేందుకు ఆదివారం తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల సెంటర్కు వచ్చింది. అయితే సంబంధిత అధికారులు, సిబ్బంది వైష్ణవిని కోవిడ్ పేషంట్గా గుర్తించి లోనికి అనుమతి ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన సాయివైష్ణవి తనకు కరోనా సోకిన మాట నిజమేనని.. అయితే 14 రోజల పాటు హోం ఐసోలేషన్లో ఉన్నానని, ప్రస్తుతం తనకు నెగెటివ్ వచ్చిందని చెప్పింది. అయినా కళాశాల సిబ్బంది అనుమతి నిరాకరించారు. ఆమె పరిస్థితిని గమనించిన మిల్స్కాలనీ పోలీస్ ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్... సాయివైష్ణవిని సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్కు తరలించి కోవిడ్ పరీక్ష చేయించగా నెగెటివ్ వచ్చింది. దాంతో ఆమెను తిరిగి సెంటర్కు తీసుకువచ్చి పరీక్ష రాసేందుకు అనుమతించారు. -
‘నీట్’గా రాసేద్దాం..
-
నేడే ‘నీట్’
సాక్షి, హైదరాబాద్ : వైద్య విద్య ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) ఆదివారం దేశ వ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్షాకేం ద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఎప్పుడు పరీక్షాకేంద్రానికి రావాలో ముందేవారికి మెసేజ్లు పంపించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకేసారి రాకుండా నివారించాలనేది ఉద్దే శం. జ్వరం ఉందో లేదో ప్రవేశద్వారం వద్ద ఒక్కో అభ్యర్థిని పరిశీలించి లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమ వెంట లోపలికి తీసుకెళ్లేందుకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, నీళ్ల బాటిళ్లనుఅనుమతిస్తారు. తెలంగాణ నుంచి ఈ ఏడాది 55,800 మంది నీట్కు హాజరు కానున్నారు. ఒక్కో గదిలో కేవలం 12 మంది ఉండేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్ రాసే విద్యార్థులకు డ్రెస్కోడ్ విధించారు. సంప్రదాయ దుస్తులతో హాజరయ్యేవారు(బురఖా వంటివి) ఓ గంట ముందే పరీక్షా కేంద్రా లకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల హాల్ టికెట్లో మూడు పేజీలుంచి, పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. తమ ఆరోగ్య పరిస్థితిని వివరించే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా ఉంచారు. నీట్ ఫలితాలు వచ్చే నెల రెండోవారంలో వస్తాయని ఎన్టీఏ ప్రకటించింది. -
జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : జేఈఈ, నీట్ పరీక్షలను 15 రోజుల పాటు వాయిదా వేయాలని రాయ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ , పద్మశ్రీ అవార్డు గ్రహీత శంకర్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాలలో తీవ్రమైన వరదలు వచ్చాయని, అనేక చోట్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ ఇల్లు విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లటం వల్ల వాళ్లకు పరీక్షలు రాసే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేవలం పట్టణ ప్రాంత విద్యార్థులనే కాదు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోవాలి. సమాన విద్యావకాశాలు అందరికీ కలగాలి. వరద ప్రాంతాల్లోని విద్యార్థులను పరీక్ష సెంటర్ల సమీపంలో ఒక వారం ముందే ప్రిపరేటరీ జోన్లో ఉంచాలి. లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. పరీక్షలను 15 రోజుల పాటు వాయిదా వేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. ఎన్నడూ లేనంతగా అసాధారణ రీతిలో దేశవ్యాప్తంగా వరదలు వస్తున్నాయి. ( జేఈఈ, నీట్ పరీక్షలపై సందేహాలెన్నో!?) కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే విద్యార్థులంతా మానసికంగా సిద్ధమయ్యారు. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు సైతం ఈ అంశంలో మానవీయ దృక్పథంతో స్పందించాలి. పదిహేను రోజుల పాటు వాయిదా వేస్తే విద్యాసంవత్సరం నష్టం ఏమీ జరగదు. తీవ్రమైన వరదలతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పరీక్ష సెంటర్లకు చేరుకునేందుకు ఎటువంటి సదుపాయాలు లేవు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన పరీక్షకు అంగీకరించినట్లు కాద’’ని అన్నారు. -
నో పాలిటిక్స్; అన్ని జాగ్రత్తలతో నీట్-జేఈఈ
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఆందోళన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. విద్యార్ధుల భద్రత, కెరీర్ తమకు ప్రధానమని, ఈ పరీక్షల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పలు మార్గదర్శకాలు, నిర్దిష్ట విధానాలను జారీ చేసిందని చెప్పారు. మే-జూన్ నుంచి ఈ పరీక్షలు రెండుసార్లు వాయిదాపడ్డాయని, పెద్దసంఖ్యలో విద్యార్ధులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణకు సానుకూలంగా స్పందించారని, మెయిల్స్ ఇతర మార్గాల ద్వారా తమ సమ్మతి తెలిపారని మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. విద్యార్ధుల సౌకర్యానికి అనుగుణంగా పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసిందని చెప్పారు. 99 శాతం విద్యార్ధులు వారు ఎన్నుకున్న కేంద్రంలోనే పరీక్షకు హాజరవుతారని, ఎలాంటి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై రాజకీయాలకు తావులేదని అన్నారు. అన్ని వాదనలు విన్నమీదట సుప్రీంకోర్టు సైతం విద్యార్ధుల విద్యా సంవత్సరాన్ని మనం వృధా చేయరాదని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇక ఈ పరీక్షలకు హాజరవుతున్న 8.58 లక్షల విద్యార్ధుల్లో 7.50 లక్షల మంది విద్యార్ధులు తమ జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్లౌడ్ చేసుకోగా, నీట్ పరీక్షలకు హాజరయ్యే 15.97 లక్షల మంది విద్యార్ధుల్లో 10 లక్షల మంది విద్యార్ధులు అడ్మిట్ కార్డులను ఇప్పటివరకూ డౌన్లోడ్ చేసుకున్నారు. నీట్-జేఈఈ పరీక్షలకు ఎన్టీఏ జారీ చేసిన మార్గదర్శకాల అమలు చేస్తూ విద్యార్ధు భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఎన్టీఏ అధికారులు, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పలు భేటీలు జరుగుతున్నాయని వివరించారు. విద్యా శాఖ కార్యదర్శి సైతం రాష్ట్రాల విద్యాశాఖాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఇక జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ నుంచి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వరకూ పలువురు ప్రముఖులు కరోనా విజృంభిస్తున్న సమయంలో నీట్ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేస్తున్నారు. చదవండి : జేఈఈ, నీట్లపై గళమెత్తిన గ్రెటా థన్బెర్గ్ -
జేఈఈ, నీట్ పరీక్షలపై సందేహాలెన్నో!?
సాక్షి, న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషణ్ (జేఈఈ), అండర్ గ్రాడ్యువేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెల్సిందే. ఓ పక్క దేశంలో ప్రాణాంతక కోవిడ్–19 కేసులు విజృంభిస్తోంటే ఈ పరీక్షలు నిర్వహించడం ఏమిటని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాడం ఆడడమేనని విమర్శిస్తున్నాయి. విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోరాదనే సదుద్దేశంతోనే పరీక్షల నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం వాదిస్తోంది. ఆ వాదనలో నిజం ఎంత ? ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ సోకకుండా భౌతిక దూరం పాటించేంత మౌలిక సౌకర్యాలు మన విద్యాలయాల్లో ఉన్నాయా ? తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రవేశ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం మన విద్యారంగానికి ఉందా? పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ నుంచి ముప్పు ఉండదని కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం భరోసా ఇవ్వగలదా?డజన్ల సంఖ్యలో, కొన్ని సార్లు వందకు మించి విద్యార్థులు ఒకే గదిలో కూర్చొని పరీక్షలు రాయడం మనం చూశాం.(చదవండి : నీట్ 2020 అడ్మిట్ కార్డ్ విడుదల) వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాసినప్పుడే ఈ పరిస్థితులు కనిపిస్తాయి. ఇక నీట్కు, జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే పరీక్ష గదులు లేదా హాళ్లు ఎంతగా కిక్కిర్సి పోతాయో సులభంగానే ఊహించవచ్చు. ఈ రెండు పరీక్షలకు కలిపి దాదాపు 25 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. ఇవి ముఖ్యమైన వృత్తిపరమైన ప్రవేశ పరీక్షలు అవడం వల్ల కోవిడ్ లక్షణాలున్న అభ్యర్థులు కూడా పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. వారి ద్వారా సహచర విద్యార్థులకు కోవిడ్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి ద్వారా, వారి తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు సోకే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే సమాజంలో కోవిడ్ కేసులు కోకొల్లలుగా పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి పరీక్షలకు ఒక్క నిమిషం దాటినా, మూడు నిమిషాలు దాటినా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణాధికారులు తరచు హెచ్చరించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకుండా ఇప్పుడు ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా హాజర కాగలరు? ప్రైవేటు వాహనాలను పట్టుకొని రాగలరా? వాటిలో గుంపులుగా ప్రయాణించడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉండదా? మూడు, నాలుగు వందల మంది హాజరయ్యే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు భయపడిన కేంద్ర ప్రభుత్వం, తరచుగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేస్తూ వస్తోంది. అలాంటిది పాతిక లక్షల మంది హాజరయ్యే పరీక్షలను సురక్షితంగా ఎలా నిర్వహించగలదు ? వలస కార్మికులను దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం తొందర పడి గత మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసినట్లే అవుతుంది. నాటి తొందరపాటు నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 950 మంది అన్యాయంగా మృత్యువాత పడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తొందరపడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. -
నీట్ 2020 అడ్మిట్ కార్డ్ విడుదల
సాక్షి, ఢిల్లీ : సెప్టెంబర్ 13న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ 2020)కి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం మధ్యాహ్నం అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ 2020 కి సంబంధించిన అడ్మిట్కార్డులను కూడా ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించినట్లుగానే జేఈఈ (మెయిన్స్) 2020 పరీక్షలు సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్ 2020 పరీక్ష సెప్టెంబరు 13న నిర్వహించనుంది. మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు పరీక్షలు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యతిరేకత మధ్యనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేసింది. పరీక్ష సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్టీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది. (చదవండి : షెడ్యూల్ ప్రకారమే నీట్, జేఈఈ) ఎన్టీఏ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి... ►విద్యార్థుల్లో అధిక శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి సెంటర్నే కేటాయించాలి. ►పరీక్ష సెంటర్కి వచ్చే విద్యార్థులు కచ్చితంగా ముఖానికి మాస్క్లు, చేతికి గ్లౌజ్లు ధరించాల్సి ఉంటుంది. ►వాటర్ బాటిల్, శానిటైజర్ కూడా వెంట తీసుకురావాలి. ►భౌతిక దూరం పాటించాలి. ►ఎగ్జామ్ సెంటర్లోకి కేవలం అడ్మిట్ కార్డుని మాత్రమే తీసుకురావాలి. ►కేటాయించిన స్లాట్ల ప్రకారం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. గుంపులుగా ఉండకూడదు. ►శరీర ఉష్ణోగ్రత 99.4 ఫారిన్హీట్ డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులకు ఐసోలేషన్ గదుల్లో పరీక్ష. ►ఐసోలేషన్ గదుల్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందుకోసం 15-20 నిమిషాల సమయం పట్టనుంది. ఆ లోపు వారి ఉష్ణోగ్రత తగ్గకపోతే.. ప్రత్యేక రూమ్లో వారికి పరీక్ష నిర్వహించనున్నారు. ►పరీక్ష హాల్లోకి వెళ్లేముందు ప్రతి ఒక్కరు చేతులను శుభ్రపరచుకోవాలి. ►పరీక్ష తరువాత ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాలి. ►పరీక్ష ముగిసిన వెంటనే మాస్క్, గ్లోవ్స్ని పరీక్ష సెంటర్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేయాలి. -
షెడ్యూల్ ప్రకారమే నీట్, జేఈఈ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(ఎన్ఈఈటీ–నీట్), సంయుక్త ప్రవేశ పరీక్ష (జేఈఈ) ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో వీటి నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే జేఈ ఈ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసింది. ఈ పరీక్షకు దాదాపు 8.6 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 6.5 లక్షల మంది అడ్మిట్కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీల్లో, జేఈఈ అడ్వాన్స్ పరీక్ష సెప్టెంబర్ 27న, నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న జరగనుంది. నీట్కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర గైడ్లైన్స్కు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ ఏర్పాట్లను చేయనున్నారు. ప్రతి విద్యార్థికి తాజా మాస్కులు, గ్లౌవ్స్ను అందిస్తారు. కరోనా నేపథ్యంలో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్షా కేంద్రం, పరీక్ష నిర్వహణ నగరం మార్పును కోరే అవకాశాన్ని, అదికూడా ఐదుసార్లు మార్చుకునే వెసులుబాటును ఎన్టీఏ కల్పించింది. కాగా జేఈఈకి దరఖాస్తు చేసుకున్న వారిలో 120 మంది, నీట్ అభ్యర్థుల్లో 95వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
జేఈఈ, నీట్ పరీక్షలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కరోనా భయాలతో అతి ముఖ్యమైన జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్ ఇయర్ను విద్యార్థులు కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది. (చదవండి: ఈ వీడియో చూసి ఐఏఎఫ్కు సెల్యూట్ చేయాల్సిందే) పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు వేసిన పిటిషన్ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ‘కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే. మరో ఏడాది కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు. ఇప్పుడు వైరస్ భయాలతో పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే ఏడాది కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చు. అప్పుడు కూడా వాయిదా వేస్తారా?’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. (చదవండి: జేఈఈ, నీట్ వాయిదా) -
జేఈఈ, నీట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్చార్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ నెలలో జేఈఈ మెయిన్, నీట్, వచ్చే నెలలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగాల్సి ఉండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్, నిపుణులతో గురువారం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కమిటీ తన నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈనెల 26న జరగాల్సిన నీట్ను సెప్టెంబర్ 13న నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వచ్చే నెల 23న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను సెప్టెంబర్ 27న నిర్వహిస్తామని వివరించారు. రద్దుకు అవకాశం లేనందునే.. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని 2005లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్రం పరీక్షలను వాయిదా వేసింది. కానీ రద్దు చేయలేదు. పోటీ అధికంగా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్ష లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని, ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ ప్రకారమే కేంద్రం పరీక్షల నిర్వహణ వైపే మొగ్గు చూపింది. జాతీయ ప్రవేశాలు ఆలస్యమే.. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ప్రవేశాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ఏటా నిర్వహిస్తుంటుంది. ఈసారి కూడా అలాగే నిర్వహించనుంది. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరిగితే ఫలితాలను ఆ తర్వాతి నాలుగైదు రోజులకు వెల్లడించే అవకాశం ఉంటుంది. అంటే అక్టోబర్లో ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉంటుంది. ఏడెనిమిది దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ను అక్టోబర్లో పూర్తి చేసినా నవంబర్లో తరగతులు ప్రారంభం అవుతాయి. అయితే అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే రెగ్యులర్ తరగతులు నిర్వహించే పరిస్థితి ఉండదు. అందుకే ఐదు ఐఐటీల డైరెక్టర్లతో కూడిన కమిటీ ఐఐటీల స్టాండింగ్ కౌన్సిల్కు ఇటీవల ఓ నివేదిక అందజేసింది. అందులో డిసెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేలా సిఫారసు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఆదుపులోకి వస్తే నవంబర్లో తరగతులు ప్రారంభం అవుతాయి. లేదంటే డిసెంబర్లోనే తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోనూ ఆగస్టులో సెట్స్! ఈ నెలలో జరగాల్సిన ఎంసెట్ సహా ఇతర సెట్స్ను ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ పరీక్షలను నిర్వహించేందుకు సెట్ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. కోర్టులో పిల్ పడటంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గి వాయిదా వేసింది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది చెప్పలేదు. దీంతో రాష్ట్రంలో ఇక ప్రవేశ పరీక్షలు ఉండవని, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపడతారని కొంత మంది విద్యార్థులు భావించారు. అయితే తాజాగా కేంద్రం జాతీయ స్థాయి పరీ„క్షలను రద్దు చేయకుండా వాయిదా మాత్రమే వేసింది. దీంతో దీంతో రాష్ట్రంలోనూ ప్రవేశ పరీక్షలు ఉంటాయన్న విషయం అర్థం అవుతోంది. ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర సెట్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఈనెల 27 నుంచి ఎంసెట్ ఉన్నందునా ఏపీ ప్రభుత్వం వాటిని చేపట్టి నిర్వహిస్తే అదే పద్ధతిలో రాష్ట్రంలో ఎంసెట్ సహా ఇతర సెట్స్ నిర్వహణ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర ఎంసెట్ జరగనుంది. సెప్టెంబర్లో ప్రవేశాలు.. రాష్ట్రంలో ఆగస్టులో ఎంసెట్, ఇతర సెట్స్ చేపట్టి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అవసరమైతే కోర్టులో పిటిషన్ వేసి పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని, ఏర్పాట్లపై అనుమానాలు ఉంటే కోర్టు అబ్జర్వర్ను కూడా నియమించి చూసుకునేలా కోర్టుకు విన్నవిస్తామని పేర్కొంటున్నారు. తద్వారా ఆగస్టులో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరికల్లా ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి, అప్పటి పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధన లేదా ఆన్లైన్ తరగతులు నిర్వహించే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. సర్టిఫికెట్లు ఆపకుండా ప్రత్యేక చర్యలు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ వంటి జాతీయ స్థాయి సంస్థల్లో రాష్ట్రం నుంచి సీట్లు లభించే విద్యార్థులు 5 నుంచి 8 వేలలోపు ఉంటారు. వారి కోసం రాష్ట్ర స్థాయిలో మొత్తం 80 వేల ప్రవేశాల ప్రక్రియను ఆపే పరిస్థితి వద్దని ఈసారి ఉన్నత విద్యా శాఖ ఆలోచనలు చేస్తోంది. అందుకే ఆగస్టులో పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్లో ప్రవేశాలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఒకవేళ రాష్ట్ర కాలేజీల్లో సీట్లు లభించి చేరిన విద్యార్థుల్లో ఎవరికైనా జాతీయ స్థాయి కాలేజీల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా వారు వెళ్లిపోయేలా తగిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర కాలేజీల్లో చేరిన విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపకుండా, జాతీయ స్థాయి కాలేజీలకు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. -
కరోనా దెబ్బతో కీలక ప్రవేశ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో కీలక ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జేఈఈ పరీక్ష జూలై 19-23 వరకు, నీట్ పరీక్ష జూలై 26న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు హెచ్చార్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను సెప్టెంబర్ 27న నిర్వహిస్తామని తెలిపారు. కాగా, మహమ్మారి కరోనా భయాలతో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు అందడంతో.. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని కేంద్ర మానవ వనరుల శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని కొందరు, వాటి నిర్వహణపై క్లారీటీ ఇవ్వాలని మరికొందరు మానవ వనరుల శాఖకు విన్నవించారు. ఈక్రమంలో పరిస్థితిని సమీక్షించి తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం ఓ కమిటీని నియమించారు. కమిటీ నివేదికను అనుసరించి పరీక్షలు వాయిదాకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్కు దాదాపు 9 లక్షల మంది, నీట్కు సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేశారు. -
రెండింటిలోనూ అమ్మాయిలే ఫస్ట్..
సాక్షి, విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ (మెడికల్, డెంటల్) నీట్–2020లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యాంప్రసాద్ విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తో కలిసి ఆయన ఫలితాలు వెల్లడించారు. పీజీ మెడికల్ నీట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి 11,635 మంది హాజరుకాగా, 6,600 మంది అర్హత పొందారని తెలిపారు. పీజీ డెంటల్ (ఎండీఎస్)కు ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన 924 మందిలో 538 మంది అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరతామన్నారు. అనంతరం ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి తుది మెరిట్లిస్టు వెల్లడిస్తామన్నారు. ఇందుకు సంబంధించి వచ్చేవారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాగా, మెడికల్ కౌన్సెలింగ్లకు జీవో నెంబర్లు 550, 43 పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన దృష్ట్యా, కౌన్సెలింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని వీసీ తెలిపారు. కమిటీæ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. మెడికల్, డెంటల్ రెండింటిలోనూ అమ్మాయిలే ఫస్ట్ కాగా జాతీయ స్థాయిలో నీట్లో మెడికల్, డెంటల్ రెండు విభాగాల్లోనూ రాష్ట్రంలో అమ్మాయిలే మొదటి స్థానం సాధించారు. మెడికల్లో చప్పా ప్రవల్లిక (రోల్ నెం: 2066161932) 41వ ర్యాంకు కైవసం చేసుకుంది. పీజీ డెంటల్ నీట్లో మెలేటి వెంకటసౌమ్య (1955226759) రెండవ ర్యాంకు కైవసం చేసుకుంది. (చదవండి: సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం) -
‘నీట్’ క్వాలిఫై అయితేనే విదేశాల్లో ఎంబీబీఎస్
న్యూఢిల్లీ : విదేశాల్లో ఎంబీబీఎస్ తత్సమానమైన వైద్య విద్యా కోర్సుల్లో చేరదలచుకున్న అభ్యర్థులు కచ్చితంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్లో(నీట్) అర్హత సాధించాలని ఆరోగ్య శాఖ సహాయం మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మంగళవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. అలాగే రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే స్ర్కీనింగ్ టెస్ట్ నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే ప్రతి అభ్యర్థి ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ను పొందాల్సి ఉండేదన్నారు. 2018 మర్చిలో ఈ నిబంధనలను సవరించారని.. ప్రస్తుతం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే నీట్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని వివరించారు. నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పొందాల్సి అవసరం లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ప్రపంచంలోని 48 దేశాల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమానమైన మెడికల్ కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ అభ్యర్థులు 41,562 మంది ఉన్నట్టు వెల్లడించారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న వారి సంఖ్య 8,328గా ఉందన్నారు. భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఎంబీబీఎస్ చదువుతున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా, జార్జియా, కిర్గిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ మొదటి పది స్థానాల్లో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. విదేశాల్లో మెడిసిన్ చదవడానికి అనుమతి కోరుతూ 2019 జనవరి వరకు ఎంసీఐకి 4,558 దరఖాస్తులు అందయాని.. అందులో అత్యధికులు చైనాలో చదివేందుకే ఆసక్తి చూపారని పేర్కొన్నారు. 35 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ.. ఉజాలా పథకం కింద దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి గృహ వినియోగదారులకు 35 కోట్ల 16 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసినట్టు విద్యుత్ శాఖ సహాయ మంత్రి కేకే సింగ్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్ఈడీ బల్బులు నాణ్యతా నియంత్రణ ప్రమాణాలకు లోబడి ఉంటాయని చెప్పారు. దేశీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు సైతం ఎల్ఈడీ బల్బుల తయారీ విషయంలో ఈ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మార్కెట్లో ఉన్న తయారీదారులకు ఇప్పటివరకు 111 కోట్ల ఎల్ఈడీ బల్బులను విక్రయించినట్టు పేర్కొన్నారు. ఉజాలా పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్ఈడీ బల్బుల్లో విఫలమవుతున్న వాటి శాతం అతి తక్కువగా ఉన్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైందన్నారు. -
నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : నీట్–2019 ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) బుధవారం (జూన్ 12) విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా 15 శాతం ఆలిండియా కోటా/ డీమ్డ్/సెంట్రల్ యూనివర్సిటీలు/ ఈఎస్ఐ, ఏఎఫ్ఎంఎస్ (ఎంబీబీఎస్/బీడీఎస్) సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసీసీ ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకారం జూన్ 19 నుంచి మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 25న మధ్యాహ్నం 2 గంటల్లోగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత కౌన్సెలింగ్ దరఖాస్తు ప్రక్రియ 24 వరకు కొనసాగనుంది. అనంతరం జూన్ 25న ఛాయిస్ ఫిల్లింగ్, 26న సీట్ల కేటాయింపు చేపడతారు. జూన్ 27న మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. ఆగస్టు 20 నుంచి 26 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు జూన్ 28 నుంచి జూలై 3లోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్... ఇక రెండో విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థుల నుంచి జూలై 6 – 9 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 9న మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు అదేరోజు ఛాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం జూలై 10, 11 తేదీల్లో సీట్లు కేటాయించి.. 12న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. సీట్లు పొందినవారు జూలై 13 – 22 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చివరి విడత కౌన్సెలింగ్ చివరి విడతగా సెంట్రల్/ డీమ్డ్/ ఈఎస్ఐసీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలి. అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల్లోగా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17న సీట్లను కేటాయి స్తారు. 18న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటి స్తారు. ఆగస్టు 20 నుంచి 26 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. -
రోజుకు 8 గంటలు చదివా: టాపర్
జైపూర్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించడం పట్ల రాజస్థాన్ విద్యార్థి నలిన్ ఖండేల్వాల్ సంతోషం వ్యక్తం చేశాడు. రోజుకు ఎనిమిది గంటలు చదివానని చెప్పాడు. తన విజయానికి కారణమైన టీచర్లకు ధన్యవాదాలు తెలిపాడు. 720 గానూ 701 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు. బుధవారం విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన భవిక్ భన్సాల్ రెండో ర్యాంక్, ఉత్తరప్రదేశ్ విద్యార్థి అక్షత్ కౌశిక్ మూడో ర్యాంక్ దక్కించుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన నీట్లో సుమారు 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా ఓబీసీకి చెందిన 3.75 లక్షల విద్యార్థులు అర్హత సాధించారు. అన్రిజర్వుడు కేటగిరీ నుంచి 2.8 లక్షల మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎస్సీ విభాగం నుంచి దాదాపు లక్షమంది, ఎస్టీ కేటగిరి నుంచి 35 వేల మంది విద్యార్థులు అర్హత పొందారు. అక్రమాలకు పాల్పడిన నలుగురు విద్యార్థుల ఫలితాలను రద్దు చేశారు. మెరుగుపడిన తమిళనాడు గతేడాది నీట్ ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేసిన తమిళనాడు ఈసారి మెరుగుపడింది. 48.57 శాతం ఉత్తీర్ణత సాధించింది. గతేడాది 39.56 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు చేసింది. (చదవండి: నీట్ ఫలితాలు విడుదల) -
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కీలక నిర్ణయం..!
సాక్షి, వరంగల్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కులు తగ్గించింది. నీట్ కటాఫ్ మార్కులను కేంద్రం 6 పర్సెంటైల్ తగ్గించిన నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు. పీజీ వైద్య ప్రవేశాలకు కటాఫ్ మార్కులు తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో సీట్లభర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు గురువారంనోటిఫికేషన్ విడుదల చేసింది. మే 10 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మే13న ధృవపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, పీ.జీ.ఆర్.ఆర్.సీ.డి.ఈ లో ఏర్పాటు చేసిన సెంటర్కు హాజరు కావాలని వెల్లడించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in ను సంప్రదించాలని సూచించింది. పర్సంటైల్ తగ్గించిన కేంద్రం.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ 2019-20 ఏడాదికిగాను పీజీ కటాఫ్ మార్కులను 6 పర్సెంటైల్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనరల్ అభ్యర్థులు 44 పర్సంటైల్ 313 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి 34 పర్సెంటైల్ 270 మార్కులు, దివ్యాంగులకు 39 పర్సెంటైల్ 291 మార్కులుగా కటాఫ్ నిర్ణయించింది. -
రాష్ట్రంలో ప్రశాంతంగా ‘నీట్’
సాక్షి, అమరావతి : ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన ‘నీట్’ ప్రవేశ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం పూట పరీక్ష ఉండటంతో పరీక్ష రాసే విద్యార్థులు ఎండ వేడిమితో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అత్యంత గరిష్టంగా వేసవి ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో బయట ఎండలు, పరీక్ష రాసే రూముల్లో ఉక్కపోతతో పరీక్ష రాసిన మూడు గంటలపాటు విద్యార్థులు నానా యాతనపడ్డారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయలేదని.. మరికొన్నిచోట్ల మంచినీళ్లు కూడా సరిగా ఇవ్వలేకపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్లాలి అన్నదానిపై ముందే మార్గదర్శకాలు జారీచేసినా కొంతమంది అభ్యర్థులు రబ్బరు బ్యాండ్లు, ముక్కు పుడకలు, వాచీలు పెట్టుకుని మరీ వెళ్లడంతో అక్కడి సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడికక్కడే వాటిని తొలగించి పరీక్షా హాలులోకి వెళ్లారు. మరికొంతమంది విద్యార్థులు బూట్లు వేసుకుని, అమ్మాయిలు ఎత్తు చెప్పులు వేసుకుని వెళ్లగా వారిని లోపలకు అనుమతించకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకే విద్యార్థులను అనుమతించారు. పరీక్ష రాసే ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులతో ఆయా కేంద్రాల వద్ద వారి తల్లిదండ్రులూ పెద్ద సంఖ్యలో కనిపించారు. పరీక్ష జరిగిన మూడు గంటలూ వారు అక్కడే నిరీక్షించారు. కాగా, రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో పరీక్ష నిర్వహించారు. ఆదివారం జరిగిన నీట్ పరీక్షలో మన రాష్ట్రం నుంచి సుమారు 60 వేల మంది వరకూ పరీక్షకు హాజరై ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, గత కొన్ని నెలలుగా నీట్ ప్రవేశ పరీక్ష కోసం అహోరాత్రులు శ్రమించిన విద్యార్థులకు ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లయింది. రైలు ఆలస్యంతో 600 మంది ‘నీట్’కు దూరం శివాజీనగర (బెంగళూరు) : ఇదిలా ఉంటే.. రైలు ఆలస్యం కావడంతో వందలాది మంది నీట్ అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయిన సంఘటన ఆదివారం బెంగళూరులో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు రైల్వేశాఖపై భగ్గుమన్నారు. హుబ్లీ–మైసూరు మధ్య నడిచే హంపి ఎక్స్ప్రెస్ ఆదివారం ఉదయం 6.20 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సింది. అయితే, గుంతకల్లు రైల్వే డివిజన్లో డబ్లింగ్ పనుల కారణంగా రైలును మళ్లించారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా ఉ. 8.20 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సింది. కానీ, రైలు మ.2.30 గంటలకు చేరడంతో విద్యార్థులు లబోదిబోమన్నారు. సుమారు 600 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు. కాగా, రైలు ఆలస్యం కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర సీఎం కుమారస్వామి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్లకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా కేంద్రాన్ని కోరారు. -
గందరగోళం తగ్గింది.. ‘నీట్’గా ముగిసింది!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్లలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. కఠినమైన నిబంధనల కారణంగా అక్కడక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి నీట్లో అడిగిన ప్రశ్నలు సులువుగా ఉన్నాయని, గందరగోళం పెద్దగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈసారి అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశముందంటున్నారు. గతేడాది కెమిస్ట్రీ పేపర్ లో 5 ప్రశ్నలు గందరగోళంగా ఉండగా ఈసారి అటువంటి పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు. బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి గతంలో ఎన్సీఈఆర్టీలో లేనివి కనీసం నాలుగైదు ప్రశ్నలు వచ్చేవి. ఈసారి మాత్రం ఎన్సీఈఆర్టీ నుంచే వచ్చాయి. అయితే బాటనీలో మాత్రం క్రోమోజోమ్స్ కాన్సెప్ట్ మీద ఇచ్చిన ప్రశ్న సిలబస్లో లేదు. 98% మంది విద్యార్థులు దీనికి జవాబు రాసే అవకాశమే లేదని తెలుస్తోంది. మరో రెండు ప్రశ్నలు కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నాయి. వాటికి ఏది సరైన సమాధానమో విద్యార్థులకు అంతుబట్టలేదు. నీట్లో ఫిజిక్స్ కఠినంగా ఉంటుందన్న భావన ఉంటుంది. కానీ ఈసారి ఫిజిక్స్లోని 45 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు అత్యంత ఈజీగా ఉండేవి బేసిక్ మోడల్వి ఇచ్చారు. లెవల్ 3, 4స్థాయి ప్రశ్నలు కాకుండా లెవల్ 1 స్థాయి ప్రశ్నలు వచ్చాయి. దీనివల్ల చాలామంది ఫిజిక్స్లో మరిన్ని మార్కులు సాధించే అవకాశముంది. మిగిలినవాటిలో 15 ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, మరో ఐదు ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. అందులో ఒక ప్రశ్నకు సరైన సమాధానం విషయంలో కాస్త గందరగోళం ఉంది. మొత్తంగా ఈ ఏడాది నీట్ పేపర్లో 3 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని తేలినట్లు నిపుణులంటున్నారు. ఓవరాల్గా నీట్ పరీక్ష ఈజీగా ఉందని వివిధ కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లు విశ్లేషిస్తున్నారు. పైగా గతంలో తప్పులు దొర్లేవని.. ఈసారి అలాంటివి కనిపించలేదని తెలిపారు. అర్హత మార్కులు పెరిగే చాన్స్ ఈసారి నీట్ పరీక్ష సులువుగా ఉండటంతో అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు. గతేడాదితో పోలిస్తే 20–25 వరకు అర్హత మార్కులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 720 నీట్ మార్కులకు గాను, గతేడాది జనరల్ కేటగిరీలో అర్హత మార్కులు 105 ఉంది. ఈసారి 125 నుంచి 130 మార్కుల వరకు పెరిగే అవకాశముందని అంటున్నారు. అలాగే ఆలిండియా టాప్ వెయ్యి ర్యాంకులు సాధించిన విద్యార్థుల మార్కులు 650పైనే ఉండేది. అది కూడా ఈసారి పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్లోని కూకట్పల్లి శ్రీచైతన్య జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 75 వేల మంది వరకు పరీక్ష రాసి ఉంటారని ఆయన వివరించారు. ఫుల్ షర్ట్ను కట్ చేసి.. ఆభరణాలు ధరించుకోకూడదని.. పొడుగు చొక్కాలు వేసుకోవద్దని.. ఇలా అనేక కఠిన నిబంధనలను నీట్ నిర్వాహకులు ముందే చెప్పారు. అయినా కొన్నిచోట్ల అలా వచ్చిన వారిపై ఏమాత్రం కనికరం లేకుండా నిర్వాహకులు వ్యవహరించారు. వరంగల్ జిల్లాలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినా ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ఆ జిల్లాలో మొత్తం 5,695 మంది కోసం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,498 మంది (97%) హాజరయ్యారు. నీట్లో కఠినమైన నిబంధనలతో కొన్నిచోట్ల అపశ్రుతి దొర్లింది. ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకొచ్చిన విద్యార్థులను షర్ట్లను హాఫ్ హ్యాండ్స్గా కట్ చేశాకే పరీక్ష హాల్లోకి అనుమతించారు. అలాగే ముక్కు పుడకలు తొలగించాకే అమ్మాయిలను అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించినప్పటికీ..విద్యార్థులు నిర్దేశిత సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. హాల్టికెట్తో పాటు ఆధార్కార్డు ఉన్న వారిని అనుమతించారు. హైహీల్స్, వాచీలు, చెవి, ముక్కు పోగులు సహా ఇతర బంగారు ఆభరణాలను తీసివేయించారు. రెండు గంటల ముందే.. హైదరాబాద్లో నీట్పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష సమయం కంటే రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆదివారం కావడంతో నగరంలోనూ రోడ్లు ఖాళీగానే ఉన్నాయి. దీనికితోడు ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల్లో పోలీసుల ముందస్తు చర్యల కారణంగా విద్యార్థులు సరైన సమయంలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుపడింది. అయితే పరీక్షా కేంద్రాల వద్ద సరైన వసతుల్లేకపోవడంతో వీరితోపాటు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు ఇబ్బందులుపడాల్సి వచ్చింది. నగరంలో నీట్ పరీక్షకు 95శాతానికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరక్కపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 3,322మంది అభ్యర్థులకు గాను 3171మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు నీట్ సిటీ కోఆర్డినేటర్ పార్వతీరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షా కేంద్రాలకు తమ పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు సమీపంలోని చెట్ల కింద సేద తీరారు. అయితే.. నీట్ పరీక్ష వ్యవహారాలను రాష్ట్రానికి సంబంధించి ఎవరు పర్యవేక్షిస్తున్నారన్న సమాచారం లేదు. కేంద్రమే దీన్ని నిర్వహిస్తున్నందున రాష్ట్రస్థాయిలో సమాచారం ఇచ్చే నాథుడే లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. అర్హత సాధిస్తా ప్రణాళిక ప్రకారం చదువుకొని పరీక్ష బాగా రాశాను. నీట్ పరీక్షలో అర్హత సాధిస్తాననే నమ్మకం కలిగింది. పరీక్షా కేంద్రం వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో ఇబ్బందులు పడ్డాం.– దలువాయి సాయి సాకేత్, ఖమ్మం మంచి ర్యాంక్ వస్తుంది నీట్ పరీక్షను బాగానే రాశాను. మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా. సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో ఇబ్బందులు పడ్డాం. – నన్నక భార్గవ్, ఖమ్మం పేపర్ ఈజీగానే.. నీట్ పరీక్ష పేపర్ గత రెండేళ్ల కంటే చాలా సులువుగా ఉంది. పెద్దగా గందరగోళం కూడా లేదు. మొత్తంగా 3 ప్రశ్నలకు ఏది సరైన సమాధానమో అంతుబట్టడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా నీట్ ప్రశాంతంగా జరిగినట్లు సమాచారం ఉంది. – డి.శంకర్రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, కూకట్పల్లి, హైదరాబాద్ -
నేడే నీట్
-
దేశవ్యాప్తంగా నేడే ‘నీట్’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్’ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరగనుంది. సుమారు 70 వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. ఫొని తుపాను కారణం గా ఒడిశాలో నీట్ను వాయిదా వేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు వంద కేంద్రాల్లో పరీక్ష నిర్వ హిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో విద్యార్థులకు తెలుగులో పరీక్ష రాసే వీలు కల్పించారు. నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభ సమయానికి 2 గంటల ముందే కేంద్రాన్ని తెరుస్తారు. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. డ్రెస్కోడ్ మొదలు ఇతరత్రా అనేక నిబంధనలు విధించారు. ఇంటర్ గందరగోళం విద్యార్థులపై ప్రభావం... రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల వల్ల వేలాది మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ముఖ్యంగా బైపీసీ విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధం అవుతుండగా ఇంటర్లో వచ్చిన మార్కులు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో వారంతా ప్రవేశపరీక్షకు సిద్ధం కాలేదని తెలిసింది. కొన్నిచోట్ల నీట్ కోచింగ్ సెంటర్లకు మొదట్లో చేరిన వారిలో కొందరు ఇంటర్ ఫలితాల తర్వాత రాలేదని సమాచారం. కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం తల్లిదండ్రులకు ఫోన్లు చేసి నీట్కు ఇంటర్ వెయిటేజీ ఏమీ ఉండదని, తక్కువ మార్కులు వచ్చినా ఏమీ పరవాలేదని భరోసా కల్పించాయి. -
రేపే నీట్.. సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు తెలంగాణలో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రెండు గంటల ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని.. 1.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమయినా అనుమతి నిరాకరిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు భారతీయ విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఈఏడాది 80వేలమంది నీట్ పరీక్షకు హాజరవుతున్నారని నిర్వహకులు తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, బూట్లు, ఎత్తుమడిమల చెప్పులు, వాటర్ బాటిల్స్, ఫోన్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, విద్యార్థినులు గాజులు, గొలుసులు, ఆభరాణాలు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురావద్దని తెలిపారు. పరీక్షకు హాల్ టికెట్ తప్పనిసరి. అప్లికేషన్లో పొందుపరిచిన ఫోటో కాపీని తీసుకుని వెళ్లాలని, దానితో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరని విద్యా మండలి అధికారులు సూచించారు. -
‘ఫొని’ ఎఫెక్ట్.. నీట్ వాయిదా
భువనేశ్వర్: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను తుపాను కారణంగా ఒడిశాలో వాయిదా పడింది. ఫొని సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు హైయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్.సుబ్రహ్మణ్యం శనివారం వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం మే 5న నీట్ పరీక్షను జరగనుంది. ఒడిశాలో ఈ పరీక్షను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో వివిధ వర్సిటీల పరిధిలో జరిగే పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు సైక్లోన్ ఫొని కారణంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో నీట్ను వాయిదా వేయాలంటూ పలవురు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీనిని పరిశీలించిన సంబంధిత శాఖ.. సహాయక చర్యలను, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. భీకర గాలులు, సైక్లోన్ ఫొని తూర్పు తీర రాష్ట్రాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. మందుస్తు హెచ్చరికలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. 220కి పైగా రైళ్ల రద్దు ఒడిశాలో ముందు జాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్కతా–చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లను శనివారం వరకు రద్దు చేసినట్లు ఈస్టుకోస్టు రైల్వే అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్, కోల్కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాళ్లలో ఆహార పదార్థాలు, తాగునీటిని సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల వరకు ఉద్యోగులు సెలవులు పెట్టొద్దని కోరింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేస్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
రేపే నీట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష రేపు ఆదివారం జరగనుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్లలోని పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. పరీక్షకు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. 12 గంటల కల్లా పరీక్ష కేంద్రాల్లో ఉండటం తప్పనిసరని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక్కనిమిషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరించబడుతుందన్నారు. ఈ సారి తెలంగాణలో దాదాపు 80వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. నిబంధనలు బూట్లు, ఎత్తు మడిమల చెప్పులతో ప్రవేశ కేంద్రాల్లోకి అనుమతి నిషేధం. వాటర్ బాటిల్లు, తినుబండరాలు, స్టేషనరీ, ముద్రిత పత్రాలు, మొబైల్స్, కాల్క్యూలేటర్లు, గాజులు, గొలుసులు, చలువ కళ్ళద్దాలు, ఆభరణాలు ,టోపీలు, పర్సులు, షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రం తినుబండారాలు తెచ్చుకునేందుకు అనుమతి ఉంది. సంప్రదాయ దుస్తులు, పొట్టి చేతులతో కూడిన తేలిక పాటివస్త్రాలు ధరించి పరీక్షకు హాజరు కావాలని అధికారుల సూచన. హాల్ టికెట్ తప్పని సరిగా ఉండాలి. హాల్ టికెట్లో పొందుపరిచిన ఫోటో కాపీ ఒకటి తీసుకెళ్లాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి ఎదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగాతెచ్చుకోవాలి. పరీక్షకు ఒక రోజు ముందే అంటే శనివారమే తమ పరీక్ష కేంద్రాలను చూసుకుంటే మంచిదని భారతీయ విద్యా మండలి సూచించింది. -
మే 5న నీట్ పరీక్ష
-
5న ‘నీట్’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఈ నెల 5న జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. ఎవరికి ఎక్కడెక్కడ పరీక్ష కేంద్రం కేటాయించిందీ సంబంధిత విద్యార్థికి అందజేసిన అడ్మిట్ కార్డులో పొందుపరిచారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు, ఇతర కేంద్రం ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు నీట్ నిర్వహిస్తారు. అఖిల భారత స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో 15 శాతం సీట్లకు పోటీ పడి అడ్మిషన్ సాధించుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ సీట్లు పొందడానికి నీట్ ర్యాంకులే ఆధారం. అఖిల భారత ర్యాంకులతోపాటు, ఆయా రాష్ట్రాల్లో అర్హత పొందిన వివరాలను కూడా ప్రకటించనున్నారు. నీట్ పరీక్ష 180 ప్రశ్నలు, 720 మార్కులకు నిర్వహిస్తారు. మూడు గంటలపాటు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు తెలుగులోనూ పరీక్ష రాయడానికి వీలు కల్పించారు. తెలుగు ప్రశ్నపత్రం కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాసే విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నీట్ ఫలితాలను జూన్ 5న ప్రకటిస్తారు. నీట్ పరీక్షకు సంబంధించిన వివరాలను కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అరగంట ముందు వరకే అనుమతి... పరీక్ష హాజరుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం తాజాగా ప్రకటించింది. ఆ నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభ సమయానికి రెండు గంటల ముందే కేంద్రాన్ని తెరుస్తారు. అంటే 2 గంటలకు పరీక్ష అయితే, 12 గంటల నుంచే తెరిచి ఉంచుతారు. విద్యార్థులు తప్పనిసరిగా మధ్యాహ్నం 1.30 గంటలలోపుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. అందువల్ల విద్యార్థుల ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని ఆ సమయానికి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. 1.30 గంటల నుంచి 1.45 గంటల వరకు పరీక్ష హాలులో ముఖ్యమైన నియమ నిబంధనలను ఇన్విజిలేటర్ ప్రకటిస్తారు. అడ్మిట్కార్డును తనిఖీ చేస్తారు. 1.45 గంటలకు టెస్ట్ బుక్లెట్లను ఇస్తారు. 1.50 గంటల వరకు టెస్ట్ బుక్లెట్లో అవసరమైన సమాచారాన్ని విద్యార్థి రాయాల్సి ఉంటుంది. విద్యార్థి తన వెంట అడ్మిట్కార్డు, దానిపై ఒక పాస్పోర్టు సైజ్ ఫొటోను అతికించాలి. దీంతోపాటు మరో పాస్పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలి. 5 గంటలలోపు పరీక్ష మధ్యలోనే ముగించి వెళ్లడానికి అనుమతించరు. ప్రతీ ప్రశ్నకు నాలుగు మార్కులు. ఆభరణాలు ధరించకూడదు... పరీక్ష రాసే విద్యార్థులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలి. అలా పాటించకుండా అనుచితంగా ప్రవర్తిస్తే మరోసారి పరీక్ష రాయకుండా మూడేళ్లు డిబార్ చేస్తారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వారి పరీక్ష ఫలితాన్ని నిలిపేస్తారు. నీట్ రాసే విద్యార్థులు తప్పనిసరిగా అనుసరించాల్సిన విషయాలివి... - పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, క్యాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్స్, ఎరేజర్, ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్ తదితరమైన వాటిని అనుమతించరు. - మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్రాండ్ తదితరమైన వాటికి నో ఎంట్రీ. - వాలెట్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్, కళ్లద్దాలు తదితరమైన వాటిని తీసుకురావొద్దు. - వాచ్, రిస్ట్వాచ్, బ్రాస్లెట్, కెమెరాలు తేవొద్దు. - ఎటువంటి ఆభరణాలను ధరించకూడదు. - డ్రెస్కోడ్ పాటించాలి. హాఫ్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్తో కూడిన లైట్ క్లాత్స్ అనుమతించరు. ఒకవేళ ఆచార వ్యవహారాలుంటే అటువంటివారు ముందస్తుగా 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి వచ్చి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. వారిని పూర్తిగా తనిఖీ చేసి పరీక్షా హాల్లోకి పంపుతారు. - బూట్లు అనుమతించరు. స్లిప్పర్లు, శాండిళ్లు, తక్కువ హీల్స్ కలిగిన చెప్పులను మాత్రమే అనుమతిస్తారు. - యాక్ససరీస్, కమ్యూనికేషన్ డివైజెస్ తదితర వాటిని అనుమతించరు. - మంచినీళ్ల బాటిళ్లు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేదా స్నాక్స్లను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లనివ్వరు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి డయాబెటిస్తో బాధపడితే అటువంటి వారు ముందుగా సమాచారం ఇచ్చేట్లయితే వారికోసం షుగర్ మాత్రలు, అరటి, యాపిల్, నారింజ వంటి పళ్లను అనుమతిస్తారు. అలాగని ప్యాకింగ్లో ఉండే ఆహారాన్ని, చాక్లెట్లు, శాండ్విచ్లను అనుమతించరు. - ఒకవేళ ఎవరైనా పైన పేర్కొన్న నిషేధిత వస్తువులను పొరపాటున తీసుకొచ్చినా పరీక్ష కేంద్రం వద్ద వాటిని దాచుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవు. - పరీక్ష అనంతరం కౌన్సెలింగ్ తదితర వివరాల కోసం కోఠిలోని ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ)ను సంప్రదించాల్సి ఉంటుంది. -
‘నీట్’గా సీట్లు బ్లాక్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు పీజీ వైద్య సీట్ల భర్తీలో యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎన్ఆర్ఐ కోటాగా మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. 2019– 20 వైద్య విద్యాసంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ సీట్ల మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ శని, ఆదివారాల్లో జరగనున్న నేపథ్యంలో భారీగా సీట్లను బ్లాక్ చేసుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాయి! నీట్లో మంచి ర్యాంకులు సాధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో సీట్లు పొందిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రూ. లక్షల్లో నజరానాలు ఇచ్చి తమ కాలేజీల్లో చేరినట్లుగా చూపేందుకు పక్కాగా స్కెచ్ వేసుకున్నాయని తెలిసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో అప్పటికప్పుడే సీట్ల కేటాయింపు జరగాల్సి ఉండటం, ఈ సీట్లకు స్థానిక రిజర్వేషన్ ఉండకపోవడం, ‘నీట్’వల్ల దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా మేనేజ్మెంట్ సీట్లకు పోటీ పడే అవకాశం ఉండటంతో యాజమాన్యాలు వీటిని తమకు అనుకూలంగా మార్చుకోజూస్తున్నాయి. నీట్ ర్యాంకుల ఆధారంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే విడుదల చేసిన మెరిట్ జాబితాలో దాదాపు 50 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. వారంతా అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందిన వారేనని, ఇప్పటికే అఖిల భారత కౌన్సెలింగ్, వాళ్ల సొంత రాష్ట్రాల్లోని కౌన్సెలింగ్లో సీట్లు పొందారని చెబుతున్నారు. అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు పొంది మళ్లీ మన రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో పీజీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని కొందరు టాప్ ర్యాంకర్లు కూడా జాతీయస్థాయి కాలేజీల్లో చేరినా ఇక్కడ కూడా మేనేజ్మెంట్ కోటా సీట్లకు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇలా చేయడం వెనుక మతలబు ఏమిటని ఇతర వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేవలం సీటు బ్లాక్ చేసే ఎత్తుగడలో భాగంగా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆయా విద్యార్థులను రంగంలోకి దింపాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ చేయడం ద్వారా సీటుకు రూ. కోట్లు.. రాష్ట్రంలో మైనారిటీ కాలేజీలతో కలుపుకొని 11 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లుండగా మరో 50%మేనేజ్మెంట్ కోటా సీట్లున్నాయి. కన్వీనర్ కోటా సీట్లు ఇప్పటికే భర్తీ అవగా మేనేజ్మెంట్ కోటా కింద 500 సీట్లున్నాయి. ఈ కోటాలో మళ్లీ మూడు కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ–1లో సగం అంటే 250 సీట్లు ఉన్నాయి. వాటిలో ఫీజు ఏడాదికి రూ. 24 లక్షలు. ఇక కేటగిరీ–2లో 30 శాతం లెక్కన 150 సీట్లున్నాయి. ఇక కేటగిరీ–3లో 20 శాతం కింద 100 సీట్లున్నాయి. కేటగిరీ–2 సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తారు. వాటి ఫీజు కేటగిరీ–1 ఫీజుకు మూడు రెట్లు ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 72 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. ఇక కేటగిరీ–3 కోటాను ఇన్స్టిట్యూషనల్ కోటా అంటారు. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వారి పిల్లలకు కేటాయించుకోవడానికి సంబంధించిన కోటా. వారి బంధువులకు కూడా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. వాటి ఫీజు కూడా కేటగిరీ–2 ఫీజుల మాదిరిగానే రూ. 72 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. ఇప్పుడు కేటగిరీ–1 సీట్లను బ్లాక్ చేయడం ద్వారా మేనేజ్మెంట్లు సీట్ల దందాకు తెరలేపాయి. కేటగిరీ–1 సీట్లలో చేరిన విద్యార్థులెవరైనా వాటిని వదులుకుంటే అవి ఆటోమేటిక్గా కేటగిరీ–2లోకి అంటే ఎన్ఆర్ఐ సీట్లుగా మారిపోతాయి. అలా మారిపోతే వాటి ఫీజు అధికారికంగానే రూ. 72 లక్షలు అవుతుంది. ఇక అనధికారికంగా డిమాండ్ను బట్టి రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు కూడా అమ్ముకునేలా యాజమాన్యాలు దందాకు సిద్ధమయ్యాయి. ఎలా బ్లాక్ చేస్తారంటే? పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేయడం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందిన మెరిట్ విద్యార్థులతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కుమ్మక్కయ్యాయని సమాచారం. ఈ కుమ్మక్కులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేరిన విద్యార్థులు కస్టోడియన్ సర్టిఫికెట్కు బదులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లనే వెరిఫికేషన్ కోసం తీసుకొస్తారు. అలా అక్కడ సీటు వచ్చిన విద్యార్థి ఇక్కడ కూడా కౌన్సిలింగ్లో పాల్గొంటారు. కాలేజీ యాజమాన్యంతో ముందే జరిగిన ఒప్పందం ప్రకారం ఇక్కడి కాలేజీల్లో వాళ్లు కేటగిరీ–1 సీటు కింద చేరతారు. అలాగే ఫీజు కింద రూ. 24 లక్షలు చెల్లించడంతోపాటు మిగిలిన ఏళ్లకు బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తారు. మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి అన్ని కేటగిరీల్లోని అన్ని విడతల కౌన్సిలింగ్లు అయిపోయాక ఈ విద్యార్థులు తమ సీటును వదులుకుంటారు. దీంతో కేటగిరీ–1 సీట్లు కేటగిరీ–2లోకి అంటే ఎన్ఆర్ఐ కోటాలోకి మారిపోతాయి. అయితే సీటును వదులుకుంటే తప్పనిసరిగా సంబంధిత విద్యార్థి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ. 5 లక్షల జరిమానా చెల్లించాలి. ఆ సొమ్మును సైతం కాలేజీ యాజమాన్యాలే విద్యార్థికి ఇవ్వడంతోపాటు మరో రూ. 4–5 లక్షలు ముట్టజెబుతాయి. ఆ తర్వాత ఆ సీట్లను ఎన్ఆర్ఐ కోటాలోకి మార్చుకొని డిమాండ్ను బట్టి రూ. కోటి నుంచి రూ. రెండు కోట్ల వరకు అమ్ముకుంటాయి. రూ. 200 కోట్ల దందాకు వ్యూహం! ప్రైవేటు మెడికల్ కాలేజీల దందాను ఆపడం ఎవరి తరం కాదని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలే అనధికారికంగా అంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చి ఇక్కడ చేరితే తాము ఎలా అడ్డుకోగలమని అంటున్నాయి. కేటగిరి–1లోని 250 సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థులతోపాటు మన రాష్ట్రంలోని టాప్ ర్యాంకర్ల ద్వారా కూడా ఇటువంటి దందా నిర్వహించేందుకు యాజమాన్యాలు వ్యూహం రచించాయి. కనీసం 75 నుంచి 100 కేటగిరీ–1 సీట్లను కేటగిరీ–2 సీట్లలోకి మార్చేందుకు పథకం రచించినట్లు తెలిసింది. కొన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు రాజకీయంగా పలుకుబడి ఉండటంతో అధికారులు కూడా నోరుమెదపడంలేదు. వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఈ దందా వల్ల పలు కాలేజీలు దాదాపు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకు అక్రమంగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందా వల్ల సహజంగా మెరిట్ ప్రకారం కేటగిరీ–1లో సీటు దక్కించుకోవాల్సిన విద్యార్థులు నష్టపోతున్నారు. గతేడాది దాదాపు 30 సీట్లు కేటగిరీ–1 నుంచి ఎన్ఆర్ఐ కేటగిరీలోకి మారినట్లు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి యాజమాన్యాలు 75 నుంచి 100 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఇదంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం. 50మందిలో మనోళ్లు ముగ్గురే.. ప్రైవేటు మెడికల్ కాలేజీలు మైండ్గేమ్ ఆడుతూ వ్యాపారం చేస్తున్నాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన మేనేజ్మెంట్ మెరిట్ లిస్టులోని టాప్–50 మందిలో 47 మంది కశ్మీర్, బిహార్, బెంగాల్ విద్యా ర్థులే ఉన్నారు. కేవలం ముగ్గురే మన రాష్ట్ర విద్యార్థులున్నారు. ఆ 47 మంది విద్యార్థులు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో కాలేజీల్లో చేరారు. మళ్లీ ఇక్కడ వారెందుకు దరఖాస్తు చేశారంటే యాజమాన్యాలు కుమ్మక్కైనట్లు అర్థమవుతోంది. దీనిపై ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు తీసుకోవాలి. – విజయేందర్, జూడా, తెలంగాణ అధ్యక్షుడు ఒక్క సీటు కూడా బ్లాక్ కానివ్వం... మేనేజ్మెంట్ కోటాలోని కేటగిరీ–1 సీటు కోసం దేశంలోని ఏ విద్యార్థైనా పోటీ పడొచ్చు. అయితే తమ సొంత రాష్ట్రాల్లోని ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీటు పొంది మళ్లీ ఇక్కడ సీట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని గతంలోనే మాకు ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ సీటు పొందిన వారు ఇప్పటికే అక్కడ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారు. మన దగ్గర సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ ఉన్న వారినే అనుమతిస్తాం. ఈ విషయమై కౌన్సెలింగ్ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా వెరిఫికేషన్కు అనుమతించం. ఈ నెల 22న ఆలిండియా కౌన్సెలింగ్లో సీటు పొందిన వారి జాబితా కూడా వస్తుంది. ఆ జాబితాలో మేనేజ్మెంట్లోని కేటగిరీ–1 మెరిట్ లిస్ట్లో పేర్లను పరిశీలిస్తాం. అక్కడా ఇక్కడా ఆ విద్యార్థులే ఉంటే ఆయా కాలేజీలకు ఫోన్ చేసి ఇక్కడ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని తెలియజేస్తాం. ఆ తర్వాతే సీట్లు కేటాయిస్తాం. ఒక్క సీటు కూడా బ్లాక్ అవకుండా చూస్తాం. ఈ విషయంలో రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. – డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం -
ఎంసెట్పై తర్జనభర్జన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్పై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గతేడాది నుంచి ఎంబీబీఎస్, డెంటల్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ద్వారా నీట్ నిర్వహిస్తోంది. రెండేళ్ల క్రితం వరకు నీట్లో రాష్ట్రాలు పాల్గొనడం ఆప్షన్గా ఉండేది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ను తప్పనిసరి చేశారు. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, డెంటల్ తదితర కోర్సుల సీట్లను నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం ఎంసెట్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఇంజనీరింగ్తోపాటు ఇతర ఉన్నత విద్యా కోర్సులన్నిటికీ ప్రవేశపరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ప్రస్తుతం ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎస్ఈఆర్లు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈతోపాటు ఇతర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు, రీసెర్చ్ ఫెలోషిప్ పరీక్షలన్నిటినీ ఎన్టీఏ ద్వారా నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఏ ప్రవేశపరీక్ష ర్యాంకులను పరిగణనలోకి తీసుకోవాలన్నదే ఈ ప్రతిపాదనల ఉద్దేశం. దీనిపై రాష్ట్రం తన అభిప్రాయాలను తెలియచేయాల్సి ఉంది. కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రం ఆమోదం తెలిపితే ఇక రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కోర్సుల సీట్లను కూడా ఎన్టీఏ ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. నీట్ తరహాలోనే ఎన్టీఏ ప్రవేశ పరీక్షలోనూ విద్యార్థులకు జాతీయ ర్యాంకులను, రాష్ట్ర ర్యాంకులను వేర్వేరుగా ప్రకటిస్తారని ఈ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి సెట్స్ అడ్మిషన్ల వర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఏకు అంగీకరిస్తే ఎంసెట్కు స్వస్తి పలుకుతారు. ప్రస్తుతం దీనిపైనే ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటికే నీట్తో మెడికల్ సీట్ల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుంచి జారిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షలనూ ఎన్టీఏ నిర్వహిస్తే ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీ అధికారం రాష్ట్రానికి లేకుండా పోతుందనే భావన ప్రభుత్వంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉన్నత విద్యామండలి వర్గాలు వివరించాయి. ఒకవేళ ఎన్టీఏ ప్రవేశపరీక్ష ద్వారా సీట్ల భర్తీకి రాష్ట్రం అంగీకరిస్తే వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ నిలిచిపోనుంది. గ్రేడింగ్ విధానంతో వెయిటేజీకి సమస్య ఎన్టీఏ ప్రవేశపరీక్షను కాదని ఎంసెట్ను నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎంసెట్ యథాతథంగా కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు ఎంసెట్ ర్యాంకుల ప్రకటనలో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఇంటర్మీడియెట్లో గతేడాది నుంచి మార్కుల విధానానికి బదులు గ్రేడింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థుల ఫలితాలను గ్రేడ్ల రూపంలోనే ప్రకటించనున్నారు. ఎంసెట్లో 25 శాతం మార్కుల వెయిటేజీ నిర్ణయించడానికి ఈ గ్రేడింగ్ల పద్ధతి సమస్యగా మారుతోంది. ఎంసెట్లో వెయిటేజీ కొనసాగించాలా? వద్దా అన్న చర్చ కూడా ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరిశీలనలో ఉందని మండలి అధికారులు వివరించారు. ఒకవేళ వెయిటేజీని కొనసాగించాలంటే ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి అభ్యర్థుల వారీగా మార్కులను వేరుగా తెప్పించాల్సి ఉంటుందని సెట్స్ ప్రవేశాల అధికారి ఒకరు వివరించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మా కోర్సుల్లో 1.38 లక్షల సీట్లు ఎంసెట్లో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మాడీ కోర్సులకు సంబంధించి మొత్తం 460 కాలేజీల్లో 1,38,367 సీట్లు ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా సీట్లు 96,857 ఉన్నాయి. ఇటీవల పూర్తయిన ఎంసెట్ కౌన్సెలింగ్లో కన్వీనర్ కోటా కింద 59,609 సీట్లు భర్తీ అవ్వగా ఇంకా 37,248 సీట్లు మిగిలిపోయాయి. -
జేఈఈ మెయిన్స్ రెండుసార్లు, నీట్ ఒకేసారి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ రెండుసార్లు, నీట్ ఒకేసారి నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. జేఈఈ మెయిన్స్, నీట్ తదితర పరీక్షల షెడ్యూలును మంగళవారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్–1 పరీక్షను జనవరి 31న, జేఈఈ మెయిన్–2 పరీక్షను ఏప్రిల్ 30న నిర్వహించనుంది. నీట్ (యూజీ)ను జూన్ 5న, యూజీసీ నెట్ పరీక్షను జనవరి 10న, సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలను ఫిబ్రవరి 10న నిర్వహించనున్నట్టు తెలిపింది. జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నట్టు జూలై 7న ప్రకటించినప్పటికీ.. నీట్ పరీక్షను మాత్రం ఒకేసారి నిర్వహించనున్నట్టు, అది కూడా ఆఫ్లైన్ (పెన్ను, పేపర్) ద్వారానే నిర్వహించనున్నట్టు వెల్లడించింది. గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది ఉండాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన వినతి మేరకు ఈ మార్పు చేసినట్టు తెలిపింది. ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలకు పూర్తి సంసిద్ధత కోసం దేశవ్యాప్తంగా టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్ సెంటర్లు ఉన్న పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలను గుర్తించి 2,697 కేంద్రాలను శని, ఆదివారాల్లో ప్రాక్టీసు చేసుకునేందుకు వీలుగా సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొంది. పూర్తి షెడ్యూలు ఇదీ.. పరీక్ష : జేఈఈ మెయిన్–1 పరీక్ష విధానం : కంప్యూటర్ ద్వారా రిజిస్ట్రేషన్ తేదీలు : 2018 సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ : 2018 డిసెంబర్ 17 పరీక్ష తేదీ : 2019 జనవరి 6 నుంచి 20 వరకు ఫలితాలు : 2019 జనవరి 31 పరీక్ష : జేఈఈ మెయిన్–2 పరీక్ష విధానం : కంప్యూటర్ ద్వారా రిజిస్ట్రేషన్ తేదీలు : 2019 ఫిబ్రవరి 8 నుంచి మార్చి 7 వరకు అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ : 2019 మార్చి 18 పరీక్ష తేదీ : 2019 ఏప్రిల్ 6 నుంచి 20 వరకు ఫలితాలు : 2019 ఏప్రిల్ 30 పరీక్ష: నీట్ (యూజీ) పరీక్ష విధానం: పెన్ను, పేపర్ ద్వారా రిజిస్ట్రేషన్ తేదీలు: 2018 నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్: 2019 ఏప్రిల్ 15 పరీక్ష తేదీ: 2019 మే 5 పరీక్షల ఫలితాలు: 2019 జూన్ 5 పరీక్ష: యూజీసీ–నెట్– 2018 డిసెంబర్ పరీక్ష విధానం: కంప్యూటర్ ద్వారా రిజిస్ట్రేషన్ తేదీలు: 2018 సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్: 2018 నవంబర్ 19 పరీక్ష తేదీ: 2018 డిసెంబర్ 9 నుంచి 23 వరకు ఫలితాలు: 2019 జనవరి 10 పరీక్ష: సీమ్యాట్, జీప్యాట్ పరీక్ష విధానం: కంప్యూటర్ ద్వారా రిజిస్ట్రేషన్ తేదీలు: 2018 నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్: 2019 జనవరి 7 పరీక్ష తేదీ: 2019 జనవరి 28 ఫలితాలు: 2019 ఫిబ్రవరి 10 -
‘అఖిల భారత కోటా’తో అవకాశాలు మెండు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లు పొందేందుకు తెలంగాణ విద్యార్థులకు భారీగా అవకాశాలు పెరిగాయి. నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించడం, అఖిల భారత కోటాలో పోటీ పడేందుకు వీలు కలగడంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లలో పాగా వేసేందుకు మార్గం ఏర్పడిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 150 సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లే ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా చూస్తే వెయ్యికి పైగా సీట్లున్నాయి. గతంలో తెలంగాణలో ఉన్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ సీట్లకే దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండేది. అయితే గతేడాది నుంచి నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించడంతో పరిస్థితి మారింది. అంతేకాదు రాష్ట్రంలోని సీట్లు కూడా అఖిల భారత కోటాలోకి వెళ్లాయి. ఎంబీబీఎస్ సీట్లలో కేవలం 15 శాతమే అఖిల భారత కోటాలోకి ప్రభుత్వ సీట్లు వెళ్లగా, సూపర్ స్పెషాలిటీ సీట్లు నూటికి నూరు శాతం వెళ్లడం గమనార్హం. పైగా ప్రైవేటు కాలేజీల సీట్లు కూడా అఖిల భారత కోటాలోకి వెళ్లాయి. అంటే దేశంలోని సూపర్ స్పెషాలిటీ సీట్లన్నీ కూడా దేశవ్యాప్తంగా జరిగే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. రిజర్వేషన్లు కూడా ఉండవు. రాష్ట్ర కోటా కూడా లేదు. అంటే దేశంలోని అన్ని సీట్లల్లోనూ రాష్ట్ర విద్యార్థులు పోటీ పడటానికి వీలు కలిగిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి వెబ్ కౌన్సెలింగ్.. సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల కోసం నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఆయా కోర్సుల్లో చేరేందుకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వెబ్ కౌన్సెలింగ్లో సీటు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను లాక్ చేసుకునేందుకు ఐదో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఆరో తేదీన సీటు కేటాయింపు జరుగుతుంది. వాటి ఫలితాలను ఏడో తేదీన ప్రకటిస్తారు. సీటు పొందిన విద్యార్థులు అదే నెల 8 నుంచి 13 వరకు కేటాయించిన కాలేజీల్లో చేరడానికి గడువు విధించారు. ఇక రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల 16 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు తమకు వచ్చిన సీటును 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ చేసుకోవాలి. 20వ తేదీన సీటు కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. 21వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. 22 నుంచి 27వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరేందుకు గడువు విధించారు. ఇదిలావుండగా గతేడాది దేశవ్యాప్తంగా అనేక కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ సీట్లు మిగిలిపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. గతేడాది రెండు సార్లు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. సీట్లు మిగిలిపోవడంతో వాటిని తిరిగి భర్తీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ఈసారి ఎలా ఉంటుందో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. -
తమిళ విద్యార్థులకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాన్ని తప్పుపడుతు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సుప్రీంకోర్టు పిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎ ఎస్ బాంబ్డే, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ పద్దతిలో విద్యార్థులకు మార్కులు ఇవ్వలేమని, ఇరువురు సమావేశమై సమస్యను పరిష్కారించాలని న్యాయస్థానం పేర్కొంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్ఈ తీరును తప్పు పట్టింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సీబీఎస్ఈను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
‘నీట్’గా అమ్మకానికి పెట్టేశారు!
ఇటీవల ఫేస్బుక్ వినియోగదారుల డేటా లీకై ఎన్నికలను ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నీట్ అభ్యర్థుల డేటా లీకేజీ కోచింగ్ సెంటర్లకు కల్పతరువుగా మారుతోంది. దాదాపు రెండున్నర లక్షల మంది నీట్ అభ్యర్థుల డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా వైద్య, దంత వైద్య కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) గత మేలో జరిగింది. జూన్ 4న ఫలితాలొచ్చా యి. మొత్తం 13 లక్షల మంది నీట్ పరీక్ష రాశా రు. అందులో 2.5 లక్షల మంది డేటాను ఓ వెబ్సైట్ అమ్మకానికి పెట్టింది. దీంతో మన దేశంలో సమాచార గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. నీట్ డేటాబేస్లో విద్యార్థి పేరు, నీట్లో వారికొచ్చిన స్కోర్, ర్యాంకు, చిరునామా, పుట్టిన తేదీ, సెల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ ఇలా అన్నీ ఉన్నాయి. సరైనదో కాదో ఎలా తెలుస్తుంది ? వెబ్సైట్ ఓపెన్ చేయగానే మచ్చుకి ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల డేటా అందులో కనిపిస్తుంది. డేటా కొనుగోలు చేయాలనుకునే వారు అభ్యర్థు ల సమాచారం సరైందో కాదో ఫోన్ ద్వారా సం ప్రదించి తెలుసుకోవచ్చు. సరైన సమాచారమే ఇస్తున్నారన్న నమ్మకం కుదిరితే 2 లక్షల మంది డేటాకు 2.4 లక్షలు చెల్లించాలి. డేటా కొనుగోలు చేసే వాళ్లకి ఈ వెబ్సైట్ మరిన్ని ఆఫర్లు ఇస్తోంది. విద్యార్థుల్ని ఆకర్షించడానికి ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు కూడా పంపిస్తామంటోంది. విద్యార్థుల నుంచే వివిధ మార్గాల్లో ఈ డేటాను సేకరిస్తున్నారు. ఫేస్బుక్లో కెరీర్ కౌన్సిలర్స్కి సంబంధించి యాడ్స్ కనిపిస్తే విద్యార్థులే తమకు ఎక్కడ సీటు వస్తుందో అన్న ఆతృతతో వివరాలన్నీ ఇస్తున్నారు. వాటిని సేకరించిన కొందరు డేటా బ్రోకర్లు ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. అలాగే కొన్ని సంస్థలు పాఠశాలల్లో విద్యార్థులకు మాక్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు తమ వివరాలన్నీ అందించాల్సి ఉంటుంది. అలా సేకరించిన డేటానే అమ్మకానికి పెడుతున్నారు. ఎవరు కొంటారు? విద్యార్థుల డేటా లీకేజీ వ్యవహారం రెండు మూడేళ్లుగా చర్చనీయాంశమవుతోంది. 2017లో ఎంబీఏ ఎంట్రన్స్ రాసిన 15 లక్షల మంది విద్యార్థుల డేటా ఆన్లైన్లో అమ్ముడుపోయింది. అప్ప ట్లో కొన్ని వెబ్సైట్లు విద్యార్థుల డేటాను అమ్మకానికి పెట్టాయి. నీట్లో సరైన స్కోర్ రాని వారి ఫోన్ నంబర్లను తీసుకొని ఆ విద్యార్థుల వెంటబడుతున్నాయి కొన్ని కోచింగ్ సెంటర్లు. తమ వద్ద చేరితే వచ్చే ఏడాది సీటు గ్యారెంటీ అంటూ మభ్యపెడుతున్నాయి. ‘నీట్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి రోజూ నాకు నాలుగైదు కాల్స్ వస్తున్నాయి. ప్రత్యేకమైన కోర్సులు చేయాలంటే మా కాలేజీలో చేరండంటూ పదే పదే కాల్స్ చేస్తున్నారు’అంటూ యూపీకి చెందిన ఒక అభ్యర్థి చెప్పారు. చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2008 సరిగ్గా వినియోగంలో లేదని అంటున్నారు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల వరకు డేటా బ్రోకర్ సంస్థలున్నాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా బహిరంగంగానే డేటా వెల్లడిస్తున్న ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కోటి వరకు ఉన్నాయి. డేటా లీకేజ్ అవాస్తవం ఈ డేటా లీకేజీ అంతా అవాస్తమని నీట్–యూజీ 2018 డైరెక్టర్ డాక్టర్ సాన్యమ్ భరద్వాజ్ చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలు, యూట్యూబ్ చానెల్స్లో వీడియోలు చూసి లీకేజ్ ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. సీబీఎస్ఈ పకడ్బందీ గా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘నీట్’ లో జీరో.. అయినా ఎంబీబీఎస్ సీటు..!
న్యూఢిల్లీ : నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో సున్నా, నెగెటీవ్ మార్కులు వచ్చినా దాదాపు 400 మందికి ఎంబీబీఎస్ సీట్లు రావడం ఆందరిని ఆశ్చర్యానికి గురుచేస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో జిరో మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ కాలేజిల్లో అడ్మిషన్ లభించడం గమనార్హం. నీట్లో పాస్ అయిన 1990 మందికి 2017లో వైద్య కళాశాల్లలో అడ్మిషన్ లభించింది. వీరిలో 530 మందికి ఫిజిక్స్, కెమెస్ట్రీ, రెండింటిలో కలిపి సింగిల్ డిజిట్, సున్న, నెగిటివ్ మార్కులు మాత్రమే వచ్చాయి. వీరిలో 507 మంది ప్రైవేటు మెడికల్ కళాశాల్లలో అడ్మిషన్ పొందారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర సబ్జెక్టులకు నీట్లో ప్రత్యేకంగా కటాఫ్ లేదు. ఒక్కో పేపర్లో కనీసం ఇన్ని మార్కులు రావాలన్న నిబంధన కూడా లేదు. దీంతో చాలా మందికి జీరో మార్కులు వచ్చినా కూడా సీటు లభించింది. గతంతో ప్రతి సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు రావాలనే నిబంధన ఉండేది. కానీ ఫిబ్రవరి 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఈ నిబంధనలను మారుస్తూ మొత్తం 50 శాతం వస్తే సరిపోతుందని నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం నీట్ను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది. ఇకపై వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్), జేఈఈ(మెయిన్స్), జాతీయ అర్హత పరీక్ష(నెట్) లాంటి పరీక్షలను ఇకపై సీబీఎస్ఈకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుందని హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. నీట్ను ఫిబ్రవరి, మే నెలల్లో జేఈఈ–మెయిన్స్ను జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. -
అ‘మృత’..మిగిల్చె కడుపుకోత
తమ కుమార్తెను ఉన్నతంగా చూడాలనుకున్నారు. ఆమె చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా డాక్టర్ను చేయాలనుకున్నారు. ఆమెను మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నీట్ లాంగ్టెర్మ్ కోచింగ్ నిమిత్తం విశాఖలోని ఓ కోచింగ్ సెంటర్లో చేర్చారు. దురదృష్టం. ఏమైందో ఏమో... ఆమె శనివారం ఉదయం తానుంటున్న గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటన ఆ కుటుంబంలోనే కాదు... గుమ్మలక్ష్మీపురం గ్రామంలోనూ విషాదం నింపింది. పెదవాల్తేరు(విశాఖ తూర్పు): అమృతా ఎంత పనిచేశావమ్మా.. నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా.. మాకెందుకు చెప్పలేదు.. ఎవరైనా ఇలా చేస్తారా.. మాకెందుకు దూరం అయ్యావమ్మా.. నిన్ను డాక్టర్ చేద్దామనుకుంటే శవంలా మారిపోయావా.. అంటూ ఆత్మహత్యకు పాల్పడిన నీట్ విద్యార్థిని అమృత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. ఆశీలుమెట్ట వద్ద ఉన్న గ్రావిటీ ఐఐటీ–మెడికల్ అకాడమీలో నీట్ లాంగ్టెర్మ్ కోచింగ్ విద్యార్థిని అమృత(17) శనివారం ఉదయం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిల్లల బంగారు భవిష్యత్ కోసం హాస్టల్లో చేర్పించి చదివిస్తే వారు ఇలా బలవన్మరణాలకు పాల్పడి తల్లిదండ్రులకు అంతులేని కడుపుకోత మిగుల్చుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన మర్రి సాంబమూర్తి వ్యవసాయం చేస్తూ ఎస్బీఐ అటెండర్గా పనిచేస్తున్నారు. ఈయన భార్య సుధారాణి అంగన్వాడీ కార్యకర్త. వీరికి అమృత, ఆదర్శ సంతానం. అమృతను ఈ నెల 9న గ్రావిటీ అకాడమీలో నీట్లో లాంగ్టర్మ్ శిక్షణ కోసం చేర్పించారు. ఆమె శనివారం ఉదయం స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు మేట్రిన్ హరితకు సమాచారం అందజేశారు. ఆమె మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి చూడగా అప్పటికే అమృత మరణించింది. ఈమె అన్నయ్య ఆదర్శ్ గాజువాకలోని విశాఖ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్నాడు. సంఘటన స్థలాన్ని మూడో పట్టణ సీఐ ఇమ్మానియేల్రాజు, ఎస్ఐలు సతీష్, డి.రేణుక పరిశీలించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ జీవనం అలవాటే.. అమృతకు హాస్టల్ వాతావరణం కొత్తేమీ కాదని ఆమె అన్నయ్య ఆదర్శ్ తెలిపాడు. ఆమె 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టల్లో ఉంటూ చదువుకుంది. తరువాత పార్వతీపురంలో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. ప్రస్తుతం నీట్లో లాంగ్టెర్మ్ కోచింగ్ కోసం జాయిన్ అయింది. అమృత రాసిన డైరీని బట్టి నీట్లో మెరుగైన ర్యాంక్ సాధించలేనోమోనన్న బెంగతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డైరీలో ఏముంది? హాస్టల్లో చేరిన అమృత మూడు రోజుల పాటు ముభావంగా ఉందని సహచర విద్యార్థులు చెబుతున్నారు. తరగతి గదిలో పలుమార్లు ఏడ్చినట్టు కూడా చెప్పారు. అమృత రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘కోచింగ్ మొదటి రోజు సూపర్గా జరిగింది. కానీ, ఒక సబ్జెక్టు అర్థం కాలేదు. అందుకే ఏడ్చేశాను. రోజువారీ కోచింగ్ బాగానే ఉంది. ఏడుస్తూనే జువాలజీ క్లాసు విన్నాను. చాలా బాగా అర్థమైంది. నైట్ స్టడీలో ఫిజిక్స్ ఫార్ములాలు కూడా నేర్చుకున్నాను. నా క్లాసులో చాలా మంది టాపర్స్ ఉన్నారు. అందుకే కొంచెం భయంగా ఉంది. రెండో రోజు క్లాసులో జువాలజీ అర్థం కాలేదు’అంటూ డైరీలో ఆమె రాసుకుంది. పోలీసులు రాకముందే తలుపులు విరగ్గొట్టొచ్చు ఏదైనా హాస్టల్లో దురదృష్టవశాత్తూ ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసిన వెంటనే పోలీసుల కోసం ఎదురు చూడకుండా తలుపులు విరగ్గొట్టవచ్చు. కొన ఊపిరితో ఉంటే సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే వారు బతికే అవకాశం ఉంది. కానీ చాలామంది తలుపులు విరగ్గొడితే వారిపై కేసులు పెడతారేమోనన్న అనవసర భయాందోళనతో తలుపుల జోలికి వెళ్లడం లేదు. ఆశీలుమెట్ట హాస్టల్లో కూడా ఇలాగే జరిగింది. పోలీసులు వచ్చి తలుపులు విరగొట్టాల్సి వచ్చింది. – ఇమ్మానియేల్రాజు, సీఐ, మూడో పట్టణ పోలీస్స్టేషన్, విశాఖ తలుపు విరగ్గొట్టి ఉంటే.. గదిలోకి వెళ్లిన అమృత దుస్తులు మార్చుకుంటుందన్న ఉద్దేశంతోనే మిగతా విద్యార్థినులు కొందరు స్నానాలకు, మరికొందరు బ్రష్ చేయడానికి వెళ్లిపోయారు. కానీ ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు విద్యార్థినులు కిటికీలోంచి చూడగా చున్నీతో ఉరిపోసుకుని ఉండడం చూసి సిబ్బందికి, మేట్రిన్ హరితకు సమాచారమిచ్చారు. హాస్టల్ సిబ్బంది ముందుగానే తలుపు విరగ్గొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిబ్బంది మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్ఐ సతీష్, కొందరు కానిస్టేబుళ్లు వచ్చి తలుపు విరగ్గొట్టి చూసి అమృత చనిపోయిందని నిర్ధారించారు. గుమ్మలక్ష్మీపురంలో విషాదఛాయలు గుమ్మలక్ష్మీపురం(కురుపాం): అమృత ఆత్మహత్యతో గుమ్మలక్ష్మీపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. అమృత ఇంటర్ పార్వతీపురంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోవడంతో ఆమెను లాంగ్ టెర్మ్ కోచింగ్ నిమిత్తం విశాఖలోని మూడు రోజుల క్రితమే చేర్పించారు. ఇంతలోనే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కన్నీటిపర్యంతమౌతున్నారు. ఆమె స్వగ్రామంలో అందరితో కలివిడిగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో షాక్కు గురయ్యామని వీరంతా చెప్తున్నారు. ఆత్మహత్యపై విచారణకు డిమాండ్ ద్వారకానగర్(విశాఖ దక్షిణ): గ్రావిటీ అకాడమీలో అమృత అనే విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ కళాశాల అధినేత, మంత్రి నారాయణ బంధువులు కావడంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. అమృత ఆత్మహత్యకు కారణమైన బాధ్యులను శిక్షించాలన్నారు. గ్రావిటీ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కల్యాణ జగదీష్ ప్రసాద్, అనిల్, జీవన్, జోజో, నీబీన్, శ్యామ్, చినబాబు, లీలాకృష్ణ, హరి పాల్గొన్నారు. -
ఎంత పని చేశావమ్మా....
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ‘అమృతా ఎంత పనిచేశావమ్మా.. నీకెంత కష్టం వచ్చిందమ్మా.. మాకెందుకు చెప్పలేదు.. ఎవరైనా ఇలా చేస్తారా.. మాకెందుకు దూరం అయ్యావమ్మా.. నిన్ను డాక్టర్ చేద్దామనుకుంటే శవంలా మారిపోయావా..’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన నీట్ విద్యార్థిని అమృత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. ఆశీలుమెట్ట వద్ద ఉన్న గ్రావిటీ ఐఐటీ–మెడికల్ అకాడమీలో నీట్ లాంగ్టెర్మ్ కోచింగ్ విద్యార్థిని అమృత(17) శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన మర్రి సాంబమూర్తి వ్యవసాయం చేస్తూ ఎస్బీఐ మెసెంజర్గా పనిచేస్తున్నారు. ఈయన భార్య సుధారాణి అంగన్వాడీ కార్యకర్త. వీరికి అమృత, ఆదర్శ సంతానం. అమృతను ఈ నెల 9న గ్రావిటీ అకాడమీలో నీట్లో లాంగ్టర్మ్ శిక్షణ కోసం చేర్పించారు. ఆమె శనివారం ఉదయం స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు మేట్రిన్ హరితకు సమాచారం అందజేశారు. ఆమె మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి చూడగా అప్పటికే అమృత మరణించింది. ఈమె అన్నయ్య ఆదర్శ్ గాజువాకలోని విశాఖ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్నాడు. సంఘటన స్థలాన్ని మూడో పట్టణ సీఐ ఇమ్మానియేల్రాజు, ఎస్ఐలు సతీష్, డి.రేణుక పరిశీలించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ జీవనం అలవాటే.. అమృతకు హాస్టల్ వాతావరణం కొత్తేమీ కాదని ఆమె అన్నయ్య ఆదర్శ్ తెలిపాడు. ఆమె 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టల్లో ఉంటూ చదువుకుంది. తరువాత పార్వతీపురంలో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. ప్రస్తుతం నీట్లో లాంగ్టెర్మ్ కోచింగ్ కోసం జాయిన్ అయింది. అమృత రాసిన డైరీని బట్టి నీట్లో మెరుగైన ర్యాంక్ సాధించలేనోమోనన్న బెంగతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తలుపు విరగ్గొట్టి ఉంటే.. గదిలోకి వెళ్లిన అమృత దుస్తులు మార్చుకుంటుందన్న ఉద్దేశంతోనే మిగతా విద్యార్థినులు కొందరు స్నానాలకు, మరికొందరు బ్రష్ చేయడానికి వెళ్లిపోయారు. కానీ ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు విద్యార్థినులు కిటికీలోంచి చూడగా చున్నీతో ఉరివేసుకుని ఉండడం చూసి సిబ్బందికి, మేట్రిన్ హరితకు సమాచారమిచ్చారు. హాస్టల్ సిబ్బంది ముందుగానే తలుపు విరగ్గొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిబ్బంది మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్ఐ సతీష్, కొందరు కానిస్టేబుళ్లు వచ్చి తలుపు విరగ్గొట్టి చూసి అమృత చనిపోయిందని నిర్ధారించారు. పోలీసులు రాకముందే తలుపులు విరగ్గొట్టొచ్చు ఏదైనా హాస్టల్లో దురదృష్టవశాత్తూ ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసిన వెంటనే పోలీసుల కోసం ఎదురు చూడకుండా తలుపులు విరగ్గొట్టవచ్చు. కొన ఊపిరితో ఉంటే సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే వారు బతికే అవకాశం ఉంది. కానీ చాలామంది తలుపులు విరగ్గొడితే వారిపై కేసులు పెడతారేమోనన్న అనవసర భయాందోళనతో తలుపుల జోలికి వెళ్లడం లేదు. ఆశీలుమెట్ట హాస్టల్లో కూడా ఇలాగే జరిగింది. పోలీసులు వచ్చి తలుపులు విరగొట్టాల్సి వచ్చింది. – ఇమ్మానియేల్రాజు, సీఐ, మూడో పట్టణ పోలీస్స్టేషన్, విశాఖ డైరీ స్వాధీనం హాస్టల్లో చేరిన అమృత మూడు రోజుల పాటు ముభావంగా ఉందని సహచర విద్యార్థులు చెబుతున్నారు. తరగతి గదిలో పలుమార్లు ఏడ్చినట్టు కూడా చెప్పారు. అమృత రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘కోచింగ్ మొదటి రోజు సూపర్గా జరిగింది. కానీ, ఒక సబ్జెక్టు అర్థం కాలేదు. అందుకే ఏడ్చేశాను. రోజువారీ కోచింగ్ బాగానే ఉంది. ఏడుస్తూనే జువాలజీ క్లాసు విన్నాను. చాలా బాగా అర్థమైంది. నైట్ స్టడీలో ఫిజిక్స్ ఫార్ములాలు కూడా నేర్చుకున్నాను. నా క్లాసులో చాలా మంది టాపర్స్ ఉన్నారు. అందుకే కొంచెం భయంగా ఉంది. రెండో రోజు క్లాసులో జువాలజీ అర్థం కాలేదు’ అంటూ డైరీలో ఆమె రాసుకుంది. -
ఎంసెట్ ఇక కనుమరుగేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1983లో మొదలైన ఎంసెట్ ప్రస్థానానికి ఇక తెరపడనుందా? దీనికి విద్యా శాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ప్రవేశాలను జాతీయ స్థాయి నీట్ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం.. ఇకపై జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశాలను జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అది ఆచరణలోకి వస్తే రాష్ట్రంలో 35 ఏళ్ల పాటు నిర్వహించిన ఎంసెట్ అంతర్థానం కానుంది. ఇటీవల జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (ఎన్టీఏ) ఏర్పాటు చేసి నీట్, జేఈఈని ఏటా రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇంజనీరింగ్ కోర్సు ల్లో ప్రవేశాలను కూడా జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చేసిన ప్రతిపాదనలకు ఇదివరకే ఆమోదం తెలిపింది. త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. వీలైతే 2019–20 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చే అవకాశముంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, హరియాణా, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లోని మరో 9 వర్సిటీలు జేఈఈ మెయి న్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. పరీక్ష మెరిట్ ప్రధానం జేఈఈ మెయిన్లో ఇంటర్మీడియట్ మార్కులకు ఇస్తూ వస్తున్న 40 శాతం వెయిటేజీని 2016లోనే కేంద్రం రద్దు చేసింది. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాలు చేపడుతోంది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్లోనూ అంతే. కానీ ఎంసెట్లో మాత్రం ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఎంసెట్లో ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థుల ఇంటర్మీడియట్ చదువులు సాగుతుండటంతో 2007–08 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రొఫెసర్ నీరదారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఎంసెట్ ర్యాంకుల ప్రాధాన్యాన్ని తగ్గించి, ఇంటర్ ప్రాధాన్యం పెంచేందుకు ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని, దాన్ని క్రమంగా పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసు మేరకే 2009 నుంచి ఇంటర్ మార్కులకు ఎంసెట్లో 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. అయితే ఎంసెట్ను తొలగిస్తే వెయిటేజీకి అవకాశమే ఉండదు. నీట్, జేఈఈవైపే రాష్ట్ర విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం అమల్లోకి వస్తే రాష్ట్ర విద్యార్థులంతా జేఈఈ, నీట్వైపే వెళ్లాల్సి వస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియో, యునానీ, ఆయుర్వేద, యోగా, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు 2017–18 నుంచి నీట్ ద్వారానే జరగనుండగా, బీఈ/బీటెక్ వంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు 2019–20 నుంచి జేఈఈ మెయిన్ ద్వారానే జరిగే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరీక్షలకు హాజరయ్యే 2.5 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి మెడికల్ కోర్సులకు లక్ష మంది వరకు, ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు 1.5 లక్షల మంది సిద్ధమవుతున్నారు. ఎంటెక్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కూడా జేఈఈ ద్వారానే చేపట్టే అవకాశముంది. అగ్రికల్చర్ కోర్సులకు ప్రత్యేక పరీక్ష! ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు మినహా మిగతా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించే అవకాశముంది. ఇన్నాళ్లూ ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులతో పాటు బీఫార్మసీ, బీటెక్ బయో టెక్నాలజీ (బైపీసీ), ఫార్మా–డి (బైపీసీ), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, బీఎఫ్ఎస్సీ, బీటెక్ (ఎఫ్ఎస్టీ), బీఎస్సీ (సీఏ, బీఎం) వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించారు. ఇంజనీరింగ్ ప్రవేశాలను జేఈఈ మెయిన్ ద్వారా చేపట్టే అవకాశం ఉండటంతో మిగతా కోర్సుల్లో ప్రవేశాలను ప్రత్యేక పరీక్ష పరీక్ష ద్వారానే చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు తామే ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవాలని గతంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు యోచించారు. ఎంసెట్ రద్దయితే మాత్రం వారు ప్రత్యేక పరీక్షవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. -
నీట్, జేఈఈ ఏటా రెండుసార్లు
న్యూఢిల్లీ: తరచూ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కేంద్రం భారీ సంస్కరణలకు తెర లేపింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్), జేఈఈ(మెయిన్స్), జాతీయ అర్హత పరీక్ష(నెట్) లాంటి పరీక్షలను ఇకపై సీబీఎస్ఈకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. నీట్, ఐఐటీ జేఈఈ–మెయిన్స్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. నీట్ను ఫిబ్రవరి, మే నెలల్లో, జేఈఈ–మెయిన్స్ను జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. విద్యార్థి ఈ పరీక్షలను రెండుసార్లు రాసినా, ఉత్తమ స్కోరునే ప్రవేశాల సమయం లో పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కసారి హాజరైనా సరిపోతుంది. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్)ల నిర్వహణ బాధ్యతను కూడా ఎన్టీఏకే అప్పగించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకుని, పారదర్శకంగా, సమర్థంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పోటీ పరీక్షలు నిర్వహించేందుకే కొత్త విధానం అమల్లోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా పరీక్షలకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించారు. నెట్తో ప్రారంభం.. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయాలంటే అర్హత సాధించాల్సిన నెట్ పరీక్షతో(డిసెంబర్లో) ఎన్టీఏ పని ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్ నిర్వహణను ఎన్టీఏకు అప్పగించినా, అడ్వాన్స్డ్ మాత్రం యథావిధిగా ఐఐటీల ఆధ్వర్యంలోనే జరుగుతుందని జవదేకర్ వెల్లడించారు. పైన పేర్కొన్న అన్ని పరీక్షలకు సిలబస్, ఫీజు, భాష, ప్రశ్నలు అడిగే తీరు మారవని స్పష్టం చేశారు. టైం టేబుల్ను ఎప్పటికప్పుడు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 4–5 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, పరీక్షకు ఎప్పుడు హాజరుకావాలో విద్యార్థే నిర్ణయించుకోవచ్చని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి అధునాతన ఎన్క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. ఎన్టీఏ విధానంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ఎంతో అనుకూలమని, ఆగస్టు మూడో వారం నుంచి విద్యార్థులు అధీకృత కంప్యూటర్ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా సాధన చేయొచ్చని జవదేకర్ తెలిపారు. పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో అలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఉచిత సాధన కేంద్రాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఎన్టీఏ అంటే... దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏని ఏర్పాటుచేయాలని 2017–18 బడ్జెట్లో ప్రతిపాదించారు. దానికి కేంద్ర కేబినెట్ గతేడాది నవంబర్ 10న ఆమోదం తెలిపింది. ఎన్టీఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తుంది. ప్రముఖ విద్యావేత్తను ఎన్టీఏకు డైరెక్టర్ జనరల్/సీఈఓగా మానవ వనరుల శాఖ నియమిస్తుంది. నిపుణులు, విద్యావేత్తల నేతృత్వంలోని 9 వేర్వేరు విభాగాలు సీఈఓకి సహాయకారిగా ఉంటాయి.యూజీసీ, ఎంసీఐ, ఐఐటీ సభ్యులతో పాలక మండలిని ఏర్పాటుచేస్తారు. కేంద్రం ఎన్టీఏకు తొలుత రూ.25 కోట్ల ఏకకాల గ్రాంటు కేటాయిస్తుంది. తరువాత ఆ సంస్థే సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఏకు డైరెక్టర్ జనరల్గా వినీత్ జోషి కొనసాగుతున్నారు. -
ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్, జేఈఈ పరీక్ష
-
నీట్, జేఈఈలపై కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో కీలక పరీక్షలుగా పేరొందిన నీట్, జేఈఈ, యూజీసీ నెట్, సీమ్యాట్లను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ప్రకటించారు. విద్యారంగంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా పలు సంస్కరణలు తీసుకొస్తామని గతంలోనే కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇకపై ఈ పరీక్షలన్నింటిని సీబీఎస్ఈ స్థానంలో ఎన్టీఏ నిర్వహిస్తుందని జవదేకర్ పేర్కొన్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మే నెలల్లో నీట్, జనవరి, ఏప్రిల్ నెలల్లో జేఈఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు రెండు సార్లు నీట్ పరీక్షను రాస్తే వచ్చే బెస్ట్ స్కోర్ను అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఏడాదిలో ఒక ప్రయత్నంలో సీటు సాధించలేకపోయిన వారు వెంటనే మరో ప్రయత్నం చేయడం ద్వారా విజయం సాధించే అవకాశం కలుగుతుంది.