NSUI
-
గుర్రంపై ఊరేగుతూ ప్రాణాలొదిలిన పెళ్లికొడుకు
ష్యోపూర్(ఎంపీ): పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్న ఓ పెళ్లికొడుకు హఠాన్మరణం అక్కడి వారందరినీ హుతాశులను చేసింది. మధ్యప్రదేశ్లోని ష్యోపూర్ జిల్లాలో పెళ్లివేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా గుర్రంపై ఊరేగుతూ శుక్రవారం రాత్రి వరుడు విగతజీవిగా మారిన వైనం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూన్స్వాడా గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రదీప్ జాట్ పెళ్లివేడుక శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా అక్కడి వేదికవైపు ప్రదీప్ పెళ్లికొడుకు దుస్తుల్లో గుర్రంపై బయల్దేరారు. ఇదే సమయంలో హఠాత్తుగా ముందుకు ఒరిగి అలాగే గుర్రంపై కూలబడిపోయారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ప్రదీప్ను జాగ్రత్తగా కిందకు దింపి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణం పోయిందని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్బీ గోయల్ ధృవీకరించారు. గుండెపోటు కారణంగా పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. పెళ్లికొడుకు ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)కి ష్యోపూర్ జిల్లా అధ్యక్షునిగా గతంలో పనిచేశారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
-
ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(డీయూఎస్యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఈ సంఘం గెలుచుకుంది. అదే సమయంలో, ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులను సాధించుకోవడం విశేషం. ప్రెసిడెంట్ పదవికి జరిగిన పోటీలో ఏబీవీపీకి చెందిన రిషబ్ చౌదరిపై ఎన్ఎస్యూఐ అభ్యర్థి రౌనక్ ఖత్రి 1,300కుపైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఎన్ఎస్యూఐ చివరిగా సారిగా 2017లో డీయూఎస్యూ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకుంది. ఫలితాలు వెల్లడవ్వగానే ఎన్ఎస్యూఐ పక్షం విద్యార్థులు తమ నేతలను భుజాలపై మోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్ ఆవరణలో లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం, డోళ్లు వాయించడంపై నిషేధం ఉంది. -
‘TSPSCని తక్షణమే ప్రక్షాళన చేయాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసిన దరిమిలా.. TSPSC బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్తామని బోర్డు ప్రకటించినప్పటికీ.. అభ్యర్థులు శాంతించడం లేదు. పరీక్షలో బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడం అనే కారణంతోనే రెండోసారి పరీక్షను రద్దు చేస్తూ.. తిరిగి నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. దీంతో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ బోర్డుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రూప్-1 రద్దు పై ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఉద్యోగాభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా పరీక్షలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో.. ముందస్తుగా ఓయూ దారులను మూసేశారు అధికారులు. డీకే అరుణ ఫైర్ TSPSC గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. ‘‘ప్రభుత్వానికి నిరోద్యోగ యువత పట్ల చిత్తశుద్ధి లేదు. మద్యం నోటిఫికేషన్పై ఉన్న శ్రద్ధ.. ఉద్యోగ నోటిఫికేషన్పై లేదు. బయోమెట్రిక్ విధానం పెడితే ఖర్చు అవుతుందని కక్కుర్తి పడడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మద్యం నోటిఫికేషన్ తప్ప.. ఏ నోటిఫికేషన్ సక్రమంగా జరగలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్.. పరీక్షలు నిర్వహించే విధానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. TSPSCని వెంటనే ప్రక్షాళన చేయాలి. చైర్మన్ ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి అని డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పందించాలి: NSUI వెంకట్ గ్రూప్ 1 రద్దు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎన్ఎస్యూఐ నేత బాల్మూరి వెంకట్ తెలిపారు. ‘‘ టీఎస్పీఎస్సీ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 లో, బయోమెట్రిక్ విధానం లేకపోవడం,అవకతవకలు జరిగాయని హైకోర్టు భావించి రద్దు చేసింది. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి. విద్యార్థులు మనోధైర్యం కోల్పోరాదు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు యధావిధిగా నిర్వహించాలి. అలా చేయకపోతే మంత్రులను అధికారులు ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతాం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తాం . గ్రూప్ 1 రద్దుతో ఆందోళన చేస్తున్న విద్యార్థులది న్యాయపోరాటం అని పేర్కొన్నారు వెంకట్. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లీకేజీ ఆరోపణలతో నేపథ్యంలో కిందటి ఏడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తొలిసారి రద్దయింది. ఈ ఏడాది జూన్ 11న రెండోసారి పరీక్ష జరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం.. హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ తాజాగా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. -
‘గ్రూప్-2’ ఆందోళన.. పలువురు అభ్యర్థులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. గ్రూప్-2 పరీక్షపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, అభ్యర్థులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, ఏడుగురు అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్-2 అభ్యర్ధుతలు, ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. వేలాదిగా తరలి వచ్చిన గ్రూప్-2 అభ్యర్థులు ఆఫీస్ ముందు బైఠాయించారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్కు తమకు సమయం లేదని చెబుతూ గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని విద్యార్థులు ఆందోళనను ఉద్రితం చేయగా, రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాని టీఎస్పీఎస్సీ చెబుతోంది. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీజేఎస్ మద్దతు తెలిపింది. కోదండరాం, దయాకర్, కాంగ్రెస్ నేతలు నిరనసలో పాల్గొన్నారు. అభ్యర్థుల స్గోగన్స్తో టీఎఎస్పీఎస్సీ పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. అంతేగాక ఇప్పటికే పలు పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. -
మంత్రి సబితా ఇంటి ముట్టడికి NSUI యత్నం
-
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి NSUI యత్నం
-
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం?!
సాక్షి, హైదరాబాద్: పేపర్ లీకేజీ ప్రకంపనలతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ జరిగిన కీలక భేటీలో.. కీలకనిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలువుల జాతర పేరుతో.. ఈ మధ్యకాలంలో మొత్తం వివిధ రకాల పరీక్షలకు సంబంధించి 26 నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. అయితే ఏఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడం, ఆపై సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండడంతో.. ఇప్పుడు కొన్ని పరీక్షలను రద్దు చేస్తూనే, దాదాపు అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలను మార్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. 20 పరీక్షలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇప్పటికే ఏడు పరీక్షలు జరగ్గా.. వాటి పేపర్లు మొత్తం! లీక్ అయినట్లు సిట్ దర్యాప్తు నివేదిక ద్వారా దాదాపుగా నిర్ధారణ చేసుకుంది కమిషన్. ఈ నేపథ్యంలో మొన్న ఏఈ పరీక్ష.. ఇవాళ గ్రూప్-1 ప్రిలిమ్స్తో పాటు మరో రెండు పరీక్షలను(ఏఈఈ, డీఏవో పరీక్షలు) సైతం రద్దు చేసి.. వాటిని తిరిగి నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే అయిపోయిన నాలుగు పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు సిద్ధం కాగా.. మరో మూడు పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అవే.. గ్రౌండ్ వాటర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు. ఈ క్రమంలో ఈ పరీక్షల కోసం ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్న పత్రాలతో పాటు.. రాబోయే రోజుల్లో జరగబోయే మిగతా పరీక్షల పత్రాలను సైతం మార్చాలని యోచిస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో.. టీఎస్పీఎస్సీ దాదాపు 20కి పైగా పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ వేసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో విమర్శలకు, అభ్యర్థుల అనుమానాలకు తావు లేకుండా.. ముందస్తు జాగ్రత్తగా.. ప్రశ్నాపత్రాలను తిరిగి రూపొందించాలని కమిషన్ భావిస్తోంది. పరీక్ష తేదీలను మార్చేసి, ఆలోపు కొత్త ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసి పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో పిటిషన్ ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఎన్ఎస్యూఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని పిటిషన్లో పేర్కొన్న ఆయన.. రాష్ట్ర పరిధిలోని సిట్తో కాకుండా సీబీఐగానీ, సిట్టింగ్ జడ్జితోగానీ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన పిటిషన్లో కోర్టును కోరారు. -
ఈటల ఇలాకాలో కేటీఆర్కు నిరసన సెగ.. చేనేత కార్మికుల నిలదీత
హన్మకొండ: ఈటల రాజేందర్ ఇలాక కమలాపూర్లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ముందు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. వీరిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి నిరసన తెలిపిన ఐదుగురు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కమ్యూనిటీ కాంప్లెక్స్ వద్ద మంత్రి కేటీఆర్ను చేనేత కార్మికులు నిలదీశారు. తమ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి స్పందనగా పద్మశాలీల అభివృద్ధికి ఏం చేశారో మోదీని అడగాలని కేటీఆర్ బదులిచ్చారు. దీంతో మోదీ మాకు తెల్వదు.. మీరే అభివృద్ధి చేయాలంటూ ఓ మహిళ సమాధానమిచ్చింది. పిల్లలతో భోజనం.. నిరసనలు ఎదురైన తన పర్యటను యథావిధిగా కొనసాగించారు కేటీఆర్. కమలాపుర్ ఎంజేపీ స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి ముచ్చటించారు. అనంతరం డ్రోన్ల ఉపయోగాల గురించి వివరించారు. 'డ్రోన్తో రైతుల పంటపొలాలపై పురుగుల మందు స్ప్రే చేయొచ్చు. డ్రోన్ అంటే కెమెరా కాదు.. మనుషులను తీసుకుకేళ్ళే వాహనం కూడా అవుతుంది. డ్రోన్తో అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. వీటితో గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధరించవచ్చు. ఎవరూ చొరబడకుండా చూడవచ్చు' అని కేటీఆర్ చెప్పారు. అలాగే చదువుకుని మీరంతా ఎమవుతారు? ఉద్యోగం చేస్తారా? అని విద్యార్థులను కేటీఆర్ ప్రశ్నించారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయవచ్చు లేదా 10 మందికి మీరే ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. అవకాశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పిల్లలను హైదరాబాద్లోని టీ-హబ్ టాస్క్కు తీసుకురావాలని కలెక్టర్, ప్రిన్సిపాల్లను కేటీఆర్ అదేశించారు. చదవండి: తెలంగాణ బడ్జెట్కి గవర్నర్ ఆమోదం -
విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
-
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఉద్రిక్తత
-
మాకు సంబంధం లేదు
-
Rahul Gandhi OU Visit: ఓయూలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ(మంగళవారం) ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓయూ సందర్శనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ నాయకులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్యూఐ నేతలు కొందరు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడంతో.. కౌంటర్గా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈపర్యటనలో భాగంగా.. ఈ నెల 7న హైదరాబాద్, తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థులతో ఆయన ముఖాముఖి చేపట్టాలనుకున్నారు. అయితే ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అందుకు అనుమతులు నిరాకరించింది. మరోవైపు అక్కడ విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓయూలోకి రాహుల్ గాంధీని అడుగుపెట్టనివ్వబోమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కూడా పోటీగా ఆందోళనలకు దిగుతోంది. ఇక హైకోర్టు సైతం రాహుల్ సభ నిర్వాహణ నిర్ణయాన్ని దాదాపుగా ఓయూకే వదిలేసింది. సంబంధిత వార్త: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు -
హుజూరాబాద్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీతో పాటు విపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అన్ని పార్టీలు స్థానికంగా పట్టు ఉన్న నేతలనే తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్లో బరిలో నిలవబోయే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ని తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. శనివారం ఏఐసీసీ బల్మూరి వెంకట్ పేరుని అధికారికంగా ప్రకటించింది. చదవండి: Huzurabad Bypoll: గెల్లుతో బల్మూరి ఢీ! -
ఎన్ఎస్యూఐ దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను వాయిదా వేయాలని కోరుతూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ శనివారం విరమించారు. వెంకట్ దీక్ష చేపట్టి మూడు రోజులు కావడంతో ఉదయం గాంధీభవన్లోని దీక్షా శిబిరానికి వచ్చిన వైద్యులు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని నిర్ధారించారు. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కు తెలియజేయడంతో మాజీ ఎంపీ వీహెచ్తో కలిసి ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి విషమించినందున దీక్ష విరమించాలని వెంకట్కు సూచించిన ఉత్తమ్, విద్యార్థుల పక్షాన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దీక్ష విరమణకు వెంకట్ అంగీకరించారు. మధ్యాహ్నం దీక్ష విరమించిన వెంకట్ను అంబులెన్స్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలి: ఉత్తమ్ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల కోసం దీక్ష చేపట్టిన వెంకట్ను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా జేఈఈ, నీట్ పరీక్షలను కూడా వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. చలో రాజ్భవన్తో ఉద్రిక్తత వెంకట్ ఆరోగ్యం క్షీణించడంతో ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యవర్గం ‘చలో రాజ్భవన్’ కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. దీంతో గాంధీభవన్ నుంచి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాజ్ భవన్కు బయలుదేరారు. కానీ పోలీసులు వారిని గాంధీభవన్ గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
పరీక్షలు వాయిదావేయాలని .. ఆమరణ నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. గాంధీభవన్లో ఎన్ఎస్యూఐ చేపట్టిన దీక్షాస్థలిని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. (నీట్-జేఈఈ వివాదం : అన్ని జాగ్రత్తలతో పరీక్షలు) రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యార్థుల కోసం ఎన్ఎస్యూఐ నిరాహార దీక్ష చేస్తుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈని పోస్ట్ పోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. విద్యార్థుల జీవితాలతో దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న టైంలో పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యకార్ భవన్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. -
ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి భవన్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టులో పిటీషన్ పెండింగ్లో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా పీపీఈ కిట్లు ధరించి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్ను ముట్టడించారు. పోలీసుల కళ్లు గప్పి కార్యకర్తలు క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం చెయ్యాల్సిన కరోనా టెస్టుల గురించి పట్టింపు లేని ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలపై కూడా పట్టింపు లేదని మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న కూడా ప్రభుత్వం తన నిరంకుశ మొండి వైఖరితో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టే రీతిలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ నేడు ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి నిర్వహించడం జరిగిందని వెంకట్ పేర్కొన్నారు. -
ఏబీవీపీ జాతీయాధ్యక్షుడిపై మహిళ ఫిర్యాదు
చెన్నై: పార్కింగ్ స్థలం వివాదంలో ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం తనను వేధిస్తున్నారంటూ 62 ఏళ్ల మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని.. వాడిన మాస్కులను, వేపాకులను తన ఇంటి ముందు పడేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, సీసీటీవీ వీడియోలను పోలీసులకు అందించారు. మహిళ బంధువు, అప్కమింగ్ కమెడియన్ బాలాజీ విజయరాఘవన్.. దీని గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివాదం గురించి మాట్లాడుతూ.. ‘షణ్ముగం మా ఆంటీ పర్మిషన్తో పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందుకు గాను 1500 రూపాయల అద్దె చెల్లించాల్సిందిగా మా ఆంటి షణ్ముగాన్ని కోరింది’ అని తెలిపాడు. (72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం) బాలాజీ మాట్లాడుతూ.. ‘దాంతో షణ్ముగం మా ఆంటీ ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడం.. వాడేసిన మాస్క్లను ఇంటి ముందు పడేయడం చేస్తున్నాడు. అతడి చర్యలతో విసిగిపోయిన మా ఆంటీ దీని గురించి అడంబక్కం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది’ అని తెలిపారు. షణ్ముగం, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగానే కాక కిల్పాక్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రాయపేట ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ హెడ్గా పని చేస్తున్నారు. (ప్రయాణికుల్లా వచ్చి...) ఈ అంశంపై డీఎంకే నాయకురాలు కనిమొళి ట్విటర్లో స్పందించారు. ‘మితవాద నాయకుల మీద ఫిర్యాదులు వస్తే.. పోలీసులు గుడ్డివాళ్లలాగా ప్రవర్తించడం రివాజుగా మారింది. సీఎంఓ తమిళనాడు తక్షణమే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాలి’ అని డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియో, ఫిర్యాదు అన్ని ఫేక్ అంటుంది ఏబీవీపీ. జాతీయ అధ్యక్షుడి పరువు తీయడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డది. ఫిర్యాదు చేసిన మహిళ వెనక ఎన్ఎస్యూఐ ఉందని ఆరోపించింది. -
గాడ్సే దేశాన్ని రక్షించారంటూ పోస్ట్
భోపాల్: రూ. 10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మను క్లోన్ చేసిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో సంబంధమున్న సిధి జిల్లాకు చెందిన శివమ్ శుక్లాగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను హీరోగా పేర్కొంటూ శుక్లా ఫేస్బుక్లో 'లాంగ్ లివ్ నాథురామ్ గాడ్సే' అంటూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. మే 19న గాడ్సే 111 వ జయంతిని పురస్కరించుకొని శివమ్ శుక్లా ఈ పోస్ట్ చేసినట్లు తెలిపారు. మరో పోస్ట్లో.. రఘుపతి రాఘవ రాజా రామ్, దేశ్ బచ్చా గే నాథూరాం' (నాథూరాం దేశాన్ని రక్షించారు) అని పేర్కొన్నారు. అదే పోస్ట్లో 'శుక్లా గాడ్సేను మహాత్మా' అని సంభోదించి.. 'పూజ్య పండిట్ నాథూరాం గాడ్సే అమర్ రహీన్' అంటూ పోస్ట్ చేశారు. ఇదే విషయంపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ (ఎన్ఎస్యూఐ) కాంగ్రెస్ విద్యార్థి విభాగం శుక్లాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శుక్లాను గుర్తించడానికి సైబర్ నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ.. సంబంధం లేని విషయాల్లో తమ పేరును తప్పుగా వాడుతున్నట్లు కాంగ్రెస్పై ఫిర్యాదు చేసింది. కాగా నవంబర్ 15, 1949న 'ఫాదర్ ఆఫ్ ది నేషన్'ను హతమార్చినందుకు గాడ్సేను అంబాలా జైలులో ఉరితీసిన సంగతి తెలిందే. చదవండి: గాడ్సేపై నాగబాబు వివాదాస్పద ట్వీట్ -
గోవా రాకుండా సల్మాన్పై నిషేధం!
గోవా: బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ అభిమాని పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గోవా ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సల్మాన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఆయన చెప్పకపోతే.. గోవా రాకుండా ఆయనపై నిషేధం విధించాలని సీఎం ప్రమోద్ సావంత్ను కోరింది. గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర సావైకర్ కూడా సల్మాన్ తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం మంగళవారం ఉదయం సల్మాన్ గోవా విమానాశ్రయం వచ్చారు. డిపార్చర్ గేటు నుంచి బయటకు వస్తుండగా ఆయన ముందు నిలబడి ఓ ఎయిర్పోర్టు ఉద్యోగి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. తనను ఏమాత్రం అడగకుండా సెల్ఫీలు దిగుతుండటంతో ఆగ్రహానికి లోనైన సల్మాన్ అతని ఫోన్ లాక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. -
మోదీ నియోజకవర్గంలో ఏబీవీపీకి షాక్..
వారణాసి : వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం నాలుగు సీట్లను కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ కైవసం చేసుకుంది. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్ఎస్యూఐకి చెందిన శివమ్ శుక్లా ఏబీవీపీ నాయకుడు హర్షిత్ పాండే మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే ఎన్ఎస్యూఐకి చెందిన చందన్ కుమార్ ఉపాధ్యక్షుడిగా, అవ్నీశ్ పాండే జనరల్ సెక్రటరీగా, రజనీకాంత్ దుబే లైబ్రెరియన్గా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి ప్రొఫెసర్ శైలేష్ కుమార్ ఫలితాలు ప్రకటించిన తరువాత.. యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజరామ్ శుక్లా.. వారిచేత సంస్కృతంలో ప్రమాణం చేయించారు. అలాగే వివాదాలకు దూరంగా ఉండేందుకు గెలిచిన అభ్యర్థులు క్యాంపస్లో ఊరేగింపు చేపట్టరాదని శుక్లా సూచించారు. అయితే గెలిచిన ఎన్ఎస్యూఐ నేతలు వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు పోలీసు భద్రత కల్పించారు. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 50.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఓటు వేయడం గమనార్హం. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం పరిధిలోని యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జేఎన్యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా ఏబీవీపీ ఒక్క సీటులో గెలుపొందని సంగతి తెలిసిందే. -
అసెంబ్లీ ముట్టడికి ఎన్ఎస్యూఐ యత్నం
సాక్షి, హైదరాబాద్:ఇంటర్ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వ తప్పిదం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవడంలో సర్కార్ విఫలమైందంటూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఫలితాల వెల్లడిలో తప్పులకు కారణమైన వారిపై చర్యల విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని ఎదురుచూశామని, కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. -
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఎన్ఎస్యూఐ
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందుకు నిరసనగా శనివారం ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ వెంకట్ బలమూరి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై అసెంబ్లీలో క్లారిటీ వస్తుందేమోనని చివరి రోజు వరకు వేచి చూశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే అసెంబ్లీ ముట్టడి నిర్వహించామని పేర్కొన్నారు. రీ కరెక్షన్, రీ వాల్యుయేషన్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మాట మార్చి వారు ఎలాంటి ఫీజులు చెల్లించలేదని ఆరోపణలు చేస్తుంది. కాగా, విద్యార్థులు చెల్లించిన ఫీజులు మొత్తం రూ. కోటిదాకా ఉన్నట్లు మేము ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని ఆయన తెలిపారు. ఎలాగూ ప్రభుత్వం చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైంది, కనీసం విద్యార్థులు చెల్లించిన ఫీజులకు అదనంగా రూ. 2 లేదా 3 కోట్లు జత చేసి వారి కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ఫలితాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఎన్ఎస్యూఐ పోరాటం కొనసాగుతుందని వెంకట్ వెల్లడించారు. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవితోపాటు మరో రెండు పదవులు కైవసం చేసుకుంది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఏబీవీపీకి చెందిన అశ్విత్ దాహియ ఎన్ఎస్యూఐ అభ్యర్థి చెత్న త్యాగిపై 19వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాల ఎన్నికలు పరిశీలిస్తే ఇదే అత్యధిక మెజార్టీ అని ఏబీవీపీ జాతీయ మీడియా కన్వీనర్ మోనికా చౌదరి తెలిపారు. మహిళా సాధికారత కోసం ‘మిషన్ సాహసి’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏబీవీపీకి చెందిన ప్రదీప్ తన్వార్ ఉపాధ్యక్షుడిగా, శివాంగి ఖర్వాల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఆ సంస్థ మద్దతుదారులు భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఒక సెక్రటరీ పదవిని గెలుచుకుంది. ఆ సంస్థ అభ్యర్థి అశిష్ లంబా ఏబీవీపీ అభ్యర్థి యోగి రతీపై విజయం సాధించారు. రామ్జాస్ కాలేజ్లో అల్లర్లు జరిగినపుడు యోగి అధ్యక్షుడిగా ఉన్నారని, అల్లర్లకు తాము వ్యతిరేకమని ఈ తీర్పుతో విద్యార్థులు స్పష్టం చేశారని ఎన్ఎస్యూఐ తెలిపింది. గురువారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో 39.90 శాతం ఓటింగ్ నమోదైంది. గత సంవత్సరం ఓటింగ్ శాతం (44.46)తో పోలిస్తే ఇది దాదాపు నాలుగు శాతం తక్కువ. మొత్తం నాలుగు స్థానాలకు 16 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో నలుగురు మహిళా అభ్యర్థులున్నారు. 1.3లక్షల మంది ఓటర్లున్నారు. వామపక్ష పార్టీల మద్దతు సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఒక్క సీటూ గెలవలేకపోయింది. గతంతో పోలిస్తే తమ ఓటింగ్ శాతం పెరిగినందుకు ఆ సంస్థ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. -
మెడలో చెప్పుల దండ.. ముఖంపై నలుపు రంగు
న్యూఢిల్లీ: రెండు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల మధ్య విబేధాలు ఓ విపరీతానికి దారి తీశాయి. అనుమతి లేకుండా యూనివర్సిటీ ఆవరణలో సావర్కర్ విగ్రహం ప్రతిష్టించారంటూ.. దాని మెడలో చెప్పుల దండ వేయడమే కాక.. విగ్రహం ముఖానికి నలుపు రంగు పూశారు. ఈ సంఘటన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఢిల్లీ యూనివర్సిటీలోని కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ.. హిందు మహాసభ అధ్యక్షుడైన వీర్ సావర్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించింది. అనుమతి లేకపోయినా యూనివర్సిటీ ప్రాంగణంలో విగ్రహాన్ని పెట్టారన్న కారణంతో.. చెప్పుల దండ వేసి, ముఖానికి నలుపు రంగు పూసింది. మంగళవారం ఉదయం వర్సిటీలోని ఏబీవీపీ అధ్యక్షుడు శక్తి సింగ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటు అనుమతి కోసం ఢిల్లీ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చుట్టూ తాను చాలాసార్లు తిరిగానని.. కానీ ఎవరూ పట్టించుకోలేదని శక్తి సింగ్ తెలిపాడు. ఇక చేసేదేమీ లేక.. తామే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సావర్కర్ వంటి వ్యక్తుల విగ్రహాలు యువతకు స్ఫూర్తినిస్తాయని.. అందుకే ఏర్పాటు చేశామని అన్నారు. అయితే ఎన్ఎస్యూఐ దీన్ని అంగీకరించడం లేదు. చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహనీయుల సరసన.. సావర్కర్ విగ్రహాన్ని పెట్టడం సరికాదని ఎన్ఎస్యూఐ వాదిస్తోంది. ముగ్గురి విగ్రహాలు ఒకేచోట కలిపి పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అంతేకాక 24గంటల్లోగా విగ్రహాన్ని తొలగించకపోతే వర్సిటీ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కానీ ఈలోపే విగ్రహానికి చెప్పుల దండ వేసి, నలుపు రంగు పూయడం గమనార్హం. -
‘టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ), యువజన కాం గ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష ప్రారంభమైంది. గురువారం ఉదయం రెండు విభాగాల రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, అనిల్కుమార్యాదవ్లతోపాటు పలువురు నేతలు గాంధీభవన్ వేదికగా దీక్షకు కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్చైర్మన్ కోదండరెడ్డి ఈ దీక్షను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోమన్నారు. ప్రభు త్వం ఆందోళనలు జరగకుండా నిర్బంధాలు విధిస్తోందని విమర్శించారు. విద్యార్థుల చావుల కోసమేనా?: వెంకట్ ఇంటర్బోర్డు చేసిన తప్పులపై ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా పట్టించుకోలేదని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. విద్యార్థుల చావుల కోసమే తెలంగాణ సాధించుకున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించా రు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఉన్నతశిఖరాలను అధిరోహించాలనుకునే విద్యార్థుల కలలు కల్లలయ్యేం దుకు ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. దీక్షకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, సతీశ్ మాదిగ సంఘీభావం తెలిపారు. దొంగల చేతికే తాళం ఇస్తారా: రేవంత్ ఇంటర్ బోర్డు ఫలితాల్లో తప్పు చేసిన గ్లోబరీనా సంస్థకే మళ్లీ రీవెరిఫికేషన్ బాధ్యతలు ఇవ్వడం దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్టుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విమర్శించారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డులో అక్రమాలు జరిగాయని నిరూపిం చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పారు. -
మా విద్య–మా హక్కు పేరుతో పోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) జాతీయ కార్యదర్శి రుచిగుప్తా వ్యాఖ్యానించారు. విద్యార్థులు చనిపోతున్నా ఇంటర్ ఫలితాల వ్యవహారంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశా రు. బుధవారం గాంధీభవన్లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులెవ రూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థుల పక్షాన తాము పోరాటం చేస్తామన్నారు. మా విద్య– మా హక్కు పేరుతో విద్యార్థుల పక్షాన పోరాడుతామని, పరీక్షల విధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఉద్యమిస్తామని వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
నిరసన : పోలీసుల బూట్లు తుడిచేందుకు యత్నం
సాక్షి, హైదరాబాద్ : అధికారంలోకి రాగానే రెండున్నర కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ మాట తప్పిందని స్టూడెంట్స్ యూనియన్ ఎన్ఎస్యూఐ విమర్శలు గుప్పించింది. అయిదేళ్ల పాలనాకాలంలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రధాని మోదీ చేపట్టిన చర్యలు శూన్యమని ఆరోపించింది. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ..ధర్నా చౌక్లో బుధవారం షూ పాలిష్ చేసి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులకు సైతం షూ పాలిష్ చేసేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎన్ఎస్యూఐ నాయకులు వెల్లడించారు. -
ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా నీరజ్ కుందన్
న్యూఢిల్లీ: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) నూతన అధ్యక్షుడిగా నీరజ్ కుందన్ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ నియమించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ అధ్యక్షబాధ్యతల నుంచి గత ఏడాది అక్టోబర్లో వైదొలగిన సంగతి తెల్సిందే. గతంలో ఎన్ఎస్యూఐ జమ్మూ కశ్మీర్ చీఫ్గా పనిచేసిన కుందన్ రెండేళ్ల క్రితం ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి అయ్యారు. ఎలాంటి రాజకీయ వారసత్వంలేని కుందన్ విద్యార్థి కార్యకర్తగా రాజకీయజీవితం ప్రారంభించారు. -
‘ఆపరేషన్ ఎన్ఎస్యూఐ’
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ ఎన్ఎస్యూఐ’పేరుతో రాబోయే ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లను ఆకర్షించే కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టనుంది. పార్టీకి అనుబం«ధంగా ఉన్న భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు యువతను ఆకర్షించేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త ఓటర్లకు దగ్గరయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కొత్త ఓటర్లను పార్టీవైపు తిప్పుకోవాలని, అందులో భాగంగా రాష్ట్రంలో కూడా పకడ్బందీ ప్రణాళిక తో ముందుకెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఇచ్చిన సూచనల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి త్వరలోనే కార్యాచరణ రూపొందించనున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాతో గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్గాంధీ కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. నేరుగా సంబంధాలు జరపండి విద్యార్థులను పార్టీ వైపు ఆకర్షించేందుకు పార్టీ నేతలే నేరుగా వారితో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని రాహుల్ గాంధీ పార్టీకి సూచించినట్లు ఉత్తమ్, కుంతియాలు వెల్లడించారు. ఎన్ఎస్యూఐని మరింత విస్తృతం చేసి విద్యాసంస్థల్లో చేరే సమయంలో విద్యార్థులకు అండగా ఉండటం, ఉద్యోగాల నియామకాలు, ఆ ప్రక్రియలో అవకతవకలు లేకుండా చేసేందుకు పోరాటాలు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 25% యువతకు అవకాశం కల్పించడం, బ్లాక్స్థాయిలో యూత్క్లబ్లను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను రూపొందించుకోవాలని తెలిపారు. విద్యారంగానికి నిధుల కేటాయింపులు పెరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, బెటర్ ఇండియా (బెహతర్ భారత్) నిర్మాణానికి పిలుపునిచ్చి అందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వెయ్యిమందికి పైగా విద్యార్థులున్న కళాశాలలను ఎంపిక చేసుకుని వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని, పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విద్యా సంబంధ అంశాలపై కరపత్రాలు పంపిణీ చేయించాలని, రన్ ఫర్ బెటర్ ఇండియా, బెటర్ ఇండియా ఫెస్టివల్స్ లాంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ విద్యార్థి, యువత ను చైతన్యపరిచేలా షార్ట్ ఫిల్మ్లు రూపొం దిం చాలని సూచించారు. రాహుల్ సూచనల మేరకు త్వరలోనే ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రాష్ట్రస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టు సమాచారం. -
ఎన్ఎస్యూఐకి మార్గదర్శక మండలి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐకి మార్గదర్శనం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. పార్టీ సీనియర్ నాయకులతో ఓ మండలిని ఏర్పాటుచేశారు. రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, మానిక్ టాగోర్లు అ మండలిలో ఉన్నారు. ‘ఐవైసీ, ఎన్ఎస్యూఐ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఈ మార్గదర్శక మండలి భర్తీచేస్తుంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ చీఫ్, ఎన్ఎస్యూఐ ఏఐసీసీ ఇన్చార్జిలు ఈ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. మండలితోపాటుగా 37 మంది కార్యదర్శులతో యూత్ కాంగ్రెస్ను కూడా రాహుల్ విస్తరించారు. అమరీష్ రంజన్ పాండేను యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించారు. -
డూసూ ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) విజయకేతనం ఎగురవేసింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. ఇక ఏబీవీపీ కేవలం కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు దక్కించుకుంది. కాగా డూసూ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. -
విద్యార్థులు ఉద్యమించాలి- ఉత్తమ్
హైదరాబాద్: పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని సాధించుకోవడానికి విద్యార్థులే ఉద్యమించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి మంగళవారం పిలుపు ఇచ్చారు. ఎన్ఎస్యూఐ ముఖ్య నేతలతో గాంధీభవన్లో ఉత్తమ్కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రీయింబర్సుమెంటు అందకపోవడంతో నష్టపోతున్న విద్యార్థులను అందరినీ కలిసి దరఖాస్తులను తీసుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థి నుంచి తీసుకున్న దరఖాస్తును ప్రభుత్వానికి అందించాల్సి ఉందన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
గుంటూరు (పట్నంబజారు) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నూనె పవన్తేజ పార్టీలో చేరారు. గుంటూరు నగరానికి చెందిన పవన్తేజ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. నగర, జిల్లా ఎన్ఎస్యూఐ విభాగాల్లో పనిచేశారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో గురువారం నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పవన్తేజకు జగన్ కండువా కప్పి స్వాగతం పలికారు. పవన్తేజ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కషి చేస్తానన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టత కోసం పాటుపడతానని చెప్పారు. విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేపడతామని తెలిపారు. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికలలో ఏబీవీపీ హవా
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ వర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలలో ఏబీవీపీ యూనియన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. విద్యార్థి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలతో పాటు కార్యదర్శి సీటును ఏబీవీపీ కైవసం చేసుకోగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సంయుక్త కార్యదర్శి సీటు మాత్రమే దక్కించుకోగలిగింది. దీంతో రేండేళ్ల తర్వాత ఎన్ఎస్యూఐకి ఒక్క పదవి దక్కింది. వర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలతో ఏబీవీపీ ప్రచారం చేసిందని ఆరోపణలున్నాయి. ఏబీవీపీ యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి ప్రియాంక చౌరీ తన పేరు కలిసొచ్చేలా ప్రియాంక పోస్టర్లతో వర్సిటీలో ప్రచారం నిర్వహించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. -
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు
♦ అధిక ఫీజుల నియంత్రించని ప్రభుత్వం ♦ ఉద్యోగాల భర్తీలో జాప్యం ♦ ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు తాండూరు: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దని ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యల సాధన కోసం హైదరాబాద్లోని గాంధీభవన్ నుంచి గత నెల 27వ తేదీన ఎన్ఎస్యూఐ చేపట్టిన బస్సు యాత్ర గురువారం ఉదయం తాండూరుకు చేరుకున్నది. పట్టణంలోని విలియంమూన్ చౌరస్తా వద్ద సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్చారి ఆధ్వర్యంలో యాత్రకు విద్యార్థులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి లారీ పార్కింగ్, ఇందిరాచౌక్ల మీదుగా బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌక్ వరకు డప్పు వాయిద్యాలతో ఎన్ఎస్యూఐ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎన్ఐఎస్యూ తెలంగాణ ఇన్ఛార్జి ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్చారిలు మాట్లాడుతూ ఉపకార వేతనాలు, ఫీజు రీఎయింబర్స్మెంట్ చెల్లించకుండా కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కై అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఎంసెట్ పరీక్షల నిర్వహణలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సిమెంట్ కర్మాగారాల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీ.మహేందర్రెడ్డి చొరవ చూపాలన్నారు. అస్తవ్యవస్త విధానలతో ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తుందని నాయకులు ఆరోపించారు. ఊపకార వేతనాలు, ఫీజు రీఎయింబర్స్మెంట్తోపాటు తదితర విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అపూ(నయీం), మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్లీడర్ సునీత, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సునీల్, నాయకులు రియాజ్, శివ, క్రాంతి, అశోక్, నరేందర్, శ్యామ్, రఘు, అంకిత్, అనిల్, ప్రవీణ్, గయాజ్,చందు, మధు తదితరులు పాల్గొన్నారు. -
హుజురాబాద్ తరలిన ఎన్ఎస్యూఐ నాయకులు
జమ్మికుంట రూరల్ : ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన చలో క్యాంపన్ యాత్ర శనివారం హుజురాబాద్కు చేరుకోగా జమ్మికుంట నాయకుడు మహ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తరలివెళ్లిన వారిలో నాయకులు శ్యాం, సర్వర్, ఫయాజ్, శివ, సన్ని, పరశురామ్, సాయికృష్ణ, రమేశ్ తదితరులున్నారు. -
రూ.30కే లీటర్ పెట్రోల్
ఇంధన ధర పెంపుపై ఎన్ఎస్యూఐ వినూత్న నిరసన బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచడాన్ని వ్యతిరేకిస్త్తు ఎన్ఎస్యూఐ బుధవారం వినూత్నంగా ఆందోళన చేపట్టింది. ఈమేరకు నగరంలోని మౌర్య హోటల్ సర్కిల్లోని గూడంగడిలో ఆ సంఘం రాష్ట్రధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో నిరసనకారులు రూ.30కే లీటర్ పెట్రోల్ విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికి బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లను పెంచుతోందని మంజునాథ్ మండిపడ్డారు. వెంటనే ధరలనుతగ్గించాలని డిమాండ్ చేసారు. ఎన్ఎస్యూఐకి మద్దతుగా రాజాజీనగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ,నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. -
'అక్రమ ఫీజులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఎన్ఎస్యూఐ నూతన కార్యవర్గ సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేసిన ఆయన.. పాఠశాలల్లో అక్రమ ఫీజులను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మెడికల్ కళాశాలల్లో, డ్రీమ్డ్ యూనివర్సిటీల్లో మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు అమలు చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. కార్పోరేట్ కళాశాలల అక్రమాస్తులపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రఘువీరా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రనకై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రీయ విద్యా సంస్థలను వెంటనే ప్రారంభించాలని ఆయన ప్రభత్వాన్ని కోరారు. -
'ఓటరు జాబితా ప్రచురణ గడువు పెంచాలి'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించిన ఓటరు జాబితా తుది ప్రచురణ గడువు పెంచాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనేతలతో శనివారం గాంధీభవన్లో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఈ సమావేశం వివరాలను సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి మీడియాకు వివరిస్తూ, ఓటరు లిస్టును మరోసారి పరిశీ లించి, తుది జాబితాను సిద్ధం చేయడానికి ఇచ్చిన సమయాన్ని పెంచాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు ఈసీకి లేఖరాస్తారని వెల్లడించారు. కాగా, అంబేడ్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈనెల 12న పీసీసీ నిర్వహించనున్న కార్యక్రమాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ 46వ ఆవిర్భావ దినోత్సవం శనివారం గాంధీభవన్లో జరిగింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. -
రోహిత్ మృతిపై ఎన్ఎస్యూఐ ఆందోళన
న్యూ ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రోహిత్ మృతిని నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. భారీగా గుమికూడిన విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఈ గలాటాలో ఓ విద్యార్థి సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఉత్కంఠ పోరు మధ్య విశ్వవిద్యాలయం
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎన్నికల పోరు మొదలైంది. మొత్తం 50మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రెండు క్యాంపస్లకు విద్యార్థి నాయకుల ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ), బీజేపీకి చెందిన స్టూడెంట్ విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ప్రధాన పోటీదారులుగా నిలవగా చత్ర యువ సంఘర్ష్ సమితి (సీవైఎస్ఎస్) పేరుతో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ఆద్మీపార్టీ తన తరుపున విద్యార్థి విభాగ అభ్యర్థులను నిలిపింది. కాగా, వర్సిటీ ఆఫీస్ బేరర్ పోస్టులకోసం 35మంది అభ్యర్థులు బరిలో ఉండగా తొమ్మిది మంది అధ్యక్ష పదవి కోసం, ఎనిమిదిమంది ఉపాధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఈ వర్సిటీకి కింద మొత్తం మొత్తం 42 కాలేజీలు ఉండగా.. ఎన్నికల నిర్వహణకు 127 పోలింగ్ బూత్లు ఏర్పాటుచేశారు. మొత్తం 1,35,298మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. -
ప్రత్యేక హోదా కోసం పోరాటం
కల్లూరు (రూరల్) : ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు నాగమధు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ నుంచి రాజ్విహార్ సెంటర్ వరకు ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. అనంతరం నిరసన ప్రదర్శనతో మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాగమధు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే కేంద్ర మంత్రులను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఖాశీం, నగర అధ్యక్షుడు ప్రదీప్, ఎస్టీబీసీ కళాశాల అధ్యక్షుడు మహేంద్ర, హరీష్, ప్రకాశ్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదాపై ఆందోళనలు ఉద్ధృతం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్పై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హబీబుల్లా తెలిపారు. మంగళవారం స్థానిక వడ్డెగేరిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్ట విభజన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా కల్పించడం కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్, ఉపాధ్యక్షులు జమృత్ సుల్తానా, కోశాధికారి రియాజ్ అహ్మద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అడ్వకేట్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
'మన్మోహన్ వద్ద ప్రధాని పాఠాలు'
-
మన్మోహన్ వద్ద ప్రధాని పాఠాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఒక కొత్త అంశాన్ని చర్చకు లేవనెత్తారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలవడాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ మన్మోహన్ సింగ్ నుంచి నరేంద్రమోదీ దేశంలోని ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు.బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారుతుండటంతో దాదాపు గంటపాటు తమ మాజీ ప్రధానితో భేటీ అయ్యి పాఠాలు నేర్చుకున్నారని చెప్పారు. ఢిల్లీలో ఎన్ఎస్యూఐ కన్వెన్షన్లో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్పై విరుచుకుపడ్డారు. ఎవరు చెప్పినా వినే డీఎన్ఏ కాంగ్రెస్ పార్టీకి ఉందని కానీ, ఆరెస్సెస్ చెప్పిందే ఎవరైనా వినాలని చెప్పే లక్షణం మాత్రం బీజేపీకి ఉందని విమర్శించారు. ఆరెస్సెస్ సిద్ధాంతాలను ప్రజలపై రుద్దాలని మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ విదేశాలు తిరుగుతారు కానీ, రైతుల సమస్యలు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగోలియా వెళ్లేందుకు ఆయనకు సమయం ఉంటుందికానీ, రైతుల ఇంటికి వచ్చి వారిని పరామర్శించేందుకు ఆయనకు తీరిక లేకుండా పోయిందని చెప్పారు. కొత్తగా ఏర్పాటయిన బీజేపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని, అన్ని వర్గాలను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఏడాది కావొస్తున్నా.. ఇంకా నల్లధనం వెలికి తీయలేకపోయారని విమర్శించారు. మేకిన్ ఇండియా పనిచేయట్లేదని ఆయన విమర్శించారు. ఇది పెద్ద వైఫల్యంగానే మారిపోతుందని జోస్యం చెప్పారు. నల్లధనం మీద విచారణ ఎంతవరకు వచ్చిందని, అసలు ఏడాదిలో తెప్పిస్తానన్న నల్ల ధనం ఏదని ప్రశ్నించారు. ఎన్ఎస్యూఐ వర్గాలు ఆరెస్సెస్తో పోరాడి తీరాలని ఉద్బోధించారు. కాగా, రాహుల్ వి పరిపక్వత లేని మాటలని బీజేపీ కొట్టిపారేసింది. అసలు మోదీ, మన్మోహన్ సింగ్ ఎందుకు భేటీ అయ్యారో తెలుసా అని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ ఎందుకు వెళ్లారో తెలుసా.. యూపీఏ హయాంలో జరిగిన కోల్ స్కాం, 2జీ స్కాంల వివరాలన్నింటినీ చెప్పడానికే వెళ్లి ఉంటారన్న ఆందోళనతోనే రాహుల్ ఇలా తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ప్రతినిధి మండిపడ్డారు. -
విద్యార్థులు వాచ్డాగ్స్ పాత్ర పోషించాలి
ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఘనంగా ఎన్ఎస్యూఐ వ్యవస్థాపక దినోత్సవం విజయవాడ సెంట్రల్ : రాజకీయాలపై విద్యార్థులు వాచ్డాగ్స్ పాత్ర పోషించాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్ఎస్యూఐ 44వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం ఆంధ్రరత్న భవన్లో ఘనంగా జరిగింది. తొలుత ఎన్ఎస్యూఐ జెండాను రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రాజకీయాలు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. ఎన్నికల్లో టికెట్ తెచ్చుకునే దగ్గర నుంచి గెలుపు వరకు డబ్బే శాసిస్తోందని, ఈ పరిణామం ప్రమాదకరమన్నారు. దీన్ని మార్చే శక్తి విద్యార్థులకే ఉందని తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా విద్యార్థులు కీలకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశారు. గడిచిన 20 ఏళ్లుగా విద్యార్థులు సామాజిక బాధ్యత నుంచి తప్పుకొంటున్నారని, కార్పొరేట్ విద్యావిధానంలో చదవడం, మార్కులు సాధించడంతోనే విద్యార్థులు కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకుంటే యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ చేపట్టి మహోద్యమాన్ని చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని, పోలవరం పూర్తయితే రాష్ట్రం సుభిక్షం అవుతుందని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ కళాశాలలను మూసివేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, గుంటూరు జిల్లాలో 17 హాస్టళ్లను మూసివేయాలనే ప్రతిపాదన చేసిందని రఘువీరారెడ్డి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమల్లోకి తెచ్చాక ఎందరో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారని తెలిపారు. హాస్టళ్లు, కళాశాలల మూసివేతపై విద్యార్థులు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పరసా రాజీవ్ రతన్, పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు కడియాల బుచ్చిబాబు, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
‘డూసూ’.. ధూంధాం..!
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ల ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. పోటీలో ఉన్న అన్ని విద్యార్థి యూనియన్లు ప్రచార కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. ఈ నెల 12 వ తేదీ ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డీయూఎస్యూ) ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతున్నట్లు డీయూ ప్రధాన ఎన్నికల అధికారి డీఎస్ రావత్ తెలిపారు. విద్యార్థి ఎన్నికల్లో దేశంలోనే మొదటిసారి ఈవీఎంలను వాడుతున్నట్లు ఆయన వివరించారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద వీలైనన్ని ఎక్కువగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దీంతో పాటు ఎన్నికల ప్రక్రియను రికార్డ్ చేసేందుకు ప్రైవేట్ వీడియోగ్రాఫర్లను సైతం నియమిస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా, ఎన్నికల పోటీచేస్తున్న వివిధ విద్యార్థి సంఘాలు గత శుక్రవారమే ఆయా పోస్టులకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) తమ సంఘం తరఫున మోతీలాల్ నెహ్రూ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తుషార్ను అధ్యక్ష పదవికి, లా కళాశాల విద్యార్థిని మోనా చౌదరిని ఉపాధ్యక్ష పదవికి, ఆర్ట్స్కు చెందిన అమిత్ సింగ్ తిమ్మా, అభిషేక్ చౌదరీలను కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు తమ అభ్యర్థులుగా ప్రకటించింది. అలాగే బుద్ధిస్ట్ స్టడీస్ విద్యార్థులైన మోహిత్ నగర్, పర్వేష్ మాలిక్లను తమ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రకటించింది. కాగా, పర్వీష్ మాలిక్ అభ్యర్థిత్వంపై అధికారులతోపాటు ఇతర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వర్సిటీలో జరిగిన ఒక గొడవలో మరో 14 మందితోపాటు పర్వీష్పై కేసు నమోదైంది. దానిపై అతడికి షోకాజ్ నోటీస్ కూడా అందిందని, ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట అతడి అభ్యర్థిత్వంపై తగిన నిర్ణయం తీసుకుంటామని రావత్ తెలిపారు. అలాగే ఏఆర్ఎస్డీ కళాశాల విద్యార్థి కనిక షెకావత్ను కార్యదర్శి పదవికి, జాకీర్ హుస్సేన్ కళాశాల విద్యార్థి అశుతోష్ మాథుర్ను సంయుక్త కార్యదర్శి పదవికి రంగంలోకి దించింది. తమ ఉద్యమం వల్లే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేశారని ఏబీవీపీ ప్రచారం చేసుకుంటోంది. అలాగే, డీయూలో ప్రధాన నాలుగు సీట్లను తామే గెలుచుకుంటామని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చాహల్ ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు తగిన వసతి కల్పించాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా హిందూ కళాశాలలో చదువుతున్న మధురిమ కుందును అధ్యక్ష బరిలో, దయాళ్ సింగ్ కళాశాల విద్యార్థి అమన్ నవాజ్ను ఉపాధ్యక్ష బరిలో దించుతున్నట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) తెలిపింది. అలాగే కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు అమన్ గౌతమ్, విక్రమాదిత్యలను రంగంలోకి దింపింది. ఇంతకుముందు డూసూ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ మధ్యే పోటీ నెలకొనేదని, ఈసారి ఆ పరిస్థితి మారుతుందని ఏఐఎస్ఏ ప్రతినిధి సన్నీకుమార్ వ్యాఖ్యానించాడు. కాగా, ఈసారి విద్యార్థి సంఘాల ఎన్నికల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్ఓ), అరుణాచల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఎస్ఎఫ్) కలిసి లెఫ్ట్ స్టూడెంట్స్ ఫ్రంట్(ఎల్ఎస్ఎఫ్)గా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ కూటమి తరఫున విక్రమ్ సింగ్, ప్రశాంత్ ముఖర్జీ, శ్రేయ, దీపక్ షా బరిలో ఉన్నారు. ఈ ఏడాదే కొత్తగా ఏర్పడిన విద్యార్థి సంఘం చాణక్య పరిషత్ తరఫున ఆదిత్య పాండే, షహ్రాజ్, దివ్యాంశు ప్రియం, అంతరిక్ష్ రాణా లను రంగంలోకి దింపింది. ఇదిలా ఉండగా, డూసూ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3వ తేదీనే ముగిసింది. ఒక విద్యార్థి దరఖాస్తు రద్దు చేశామని, మరో 115 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని రావత్ తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత అధ్యక్ష పదవికి ఏడుగురు, ఉపాధ్యక్షుడి పదవికి ఆరుగురు, కార్యదర్శికి ఎనిమిది మంది, సంయుక్త కార్యదర్శి పదవికి ఏడుగురు బరిలో మిగిలారు. 12వ తేదీన రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, 13వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమిటీ ప్రకటించింది. గత ఏడాది డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ ప్రధాన పోస్టుల్లో మూడింటిని గెలుచుకుని విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఒక్క కార్యదర్శి పదవిని మాత్రం ఎన్ఎస్యూఐ కైవశం చేసుకోగలిగింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్, బీజేపీ నేత విజయ్ గోయల్ తదితరుల రాజకీయ జీవితం వర్సిటీ నుంచే ప్రారంభమైంది. -
ఇరానీ నివాసం వద్ద ఎన్ఎస్యూఐ నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ బుధవారం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నివాసం ఎదుట ధర్నా చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో నిరాహార దీక్షకు దిగిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు మంగళవారం రాత్రి ఖాళీ చేయించారు. దాంతో వారు ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి మోహిత్ శర్మ నాయకత్వంలో బుధవారం ఉదయం మంత్రి ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఉదయం 9.30 గంటలకు అక్కడకు చేరుకున్న కార్యకర్తలు ఓ గంటసేపు నినాదాలు చేశారు. ఓ వైపు విద్యార్థులు, మరోవైపు అధ్యాపక సంస్థలు వరుసగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ నాలుగేళ్ల కోర్సుపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవడం లేదని, దీనిని బట్టి డీయూ వైస్ చాన్సలర్, బీజేపీ కుమ్మక్కైనట్టు తెలుస్తోందని శర్మ ఆరోపించారు. నాలుగేళ్ల కోర్సును రద్దు చేసేంత వరకూ తమ ఆందోళన విరమించబోమని ఎన్ఎస్యూఐ జాతీయ ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే అన్నారు. నార్త్ క్యాంపస్లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను మంగళవారం రాత్రి 11 గంటలకు పోలీసులు ఖాళీ చేయించారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసు అధికారులు విద్యార్థులను బలవంతంగా నిరాహార దీక్షా స్థలి నుంచి తొలగించారని, నాలుగేళ్ల కోర్సు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ పట్టుబట్టడంతో ఢిల్లీ యూనివర్సిటీ యంత్రాంగం పోలీసులను రంగంలోకి దింపిందని ఎన్ఎస్యూఐ పేర్కొంది. ఆరు రోజులుగా నిరశన దీక్షలో ఉన్న ఏడుగురు విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించింది. నాలుగేళ్ల కోర్సును రద్దు చేస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చాలని విద్యార్థి సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్మృతి ఇరానీ ఏబీవీపీ విద్యార్థుల బృందానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
ఏఎన్యూలో ఫ్రీడమ్ ఫెస్ట్ ప్రారంభం
ఏఎన్యూ, న్యూస్లైన్ అవకాశాలు లేని సమాజంలో యువతకు మరిన్ని అవకాశాలు కల్పనకు స్వేచ్ఛ ఫౌండేషన్ దోహదం చేస్తుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. యూనివర్సిటీ స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరుగనున్న ‘ఫ్రీడం ఫెస్ట్’ శుక్రవారం వర్సిటీలో ప్రారంభమయింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి ఫెస్ట్లు దోహదం చేస్తాయన్నారు. ఫ్రీడం ఫెస్ట్ను ప్రారంభించిన స్వేచ్ఛ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డి.భువన్కృష్ణ మాట్లాడుతూ ప్రముఖ సాప్ట్వేర్ నిపుణుడు ఆరోన్ స్వార్ట్జ్ జ్ఞాపకార్ధం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఢిల్లీ సైన్స్ ఫోరమ్ ముఖ్య కార్యదర్శి, ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు ప్రబీర్ పుర్కాయస్థ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందు తరాలు సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమాజ అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు అందించేందుకు యువకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రీడం ఫెస్ట్ లాంటి కార్యక్రమాల ద్వారా ఆధునిక పరిజ్ఞానంపై మరింత చర్చ జరగాలన్నారు. కార్యక్రమంలో స్వేచ్ఛ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రమేష్, దక్షిణ, ఉత్తర కోస్తాల ప్రతినిధులు ప్రమోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు ఏఎన్యూలో ఫ్రీడం ఫెస్ట్కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఇంజినీరింగ్ విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ఘడ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి 70 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో ప్రదర్శనలిచ్చారు. ఈ ఫెస్ట్లో ప్రాజెక్ట్ ఎక్స్పో, పేపర్ ప్రెజెంటేషన్, క్రియేటివ్ ఆర్ట్స్, పోస్టర్ ప్రజంటేషన్, కోడ్ డబ్బింగ్, ప్రోగ్రామింగ్, బిగ్డేటా, బ్లెండర్ త్రీడీ యానిమేషన్ తదితర అంశాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. -
లోక్పాల్పై ఎన్ఎస్యూఐ సంబరాలు
-
లోక్పాల్పై ఎన్ఎస్యూఐ సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం లోక్పాల్ బిల్లులు ఆమోదించడంపై నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో దేశంలోంచి అవినీ తిని పారద్రోలేందుకు అవసరమైన మరిన్ని చట్టాలను చేయాలంటూ జంతర్మంతర్ వద్ద సోమవా రం నిర్వహించిన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్ర్రాల నుంచి తరలివచ్చిన వందలాదిమంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలతో జంతర్మంతర్ నిండిపోయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగించారు. ఎన్నోఏళ్లు గా పెండింగ్లో ఉన్న లోక్పాల్ బిల్లు ఆమోదంలో కాంగ్రెస్పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పాత్ర ఉందని వారు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.