NTR Stadium
-
హైదరాబాద్ : ముగిసిన బుక్ఫెయిర్.. ఆదివారం సందర్శకుల కిటకిట (ఫొటోలు)
-
హైదరాబాద్ : పుస్తక ప్రదర్శనలో సందర్శకుల కిటకిట (ఫొటోలు)
-
Hyderabad Book Fair: పుస్తకం పిలిచింది!
సాక్షి, హైదరబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం సందర్శకులతో పోటెత్తింది.సెలవురోజు కావడంతో పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యువత, విద్యార్థులు, పిల్లలతో స్టాళ్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా చిన్నారులు తమకిష్టమైన ఆంగ్ల కథలు, క్లాసిక్స్ పుస్తకాలను విరివిగా కొనుగోలు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది. పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది. ప్రదర్శన ప్రారంభమై నాలుగు రోజులైంది. రెండు రోజులుగా పుస్తక ప్రియుల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోందని నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కొత్త సంవత్సరం పుస్తక పఠనంతో ప్రారంభం కావాలనే ఆకాంక్షతో ఎక్కువ మంది తమకు నచి్చన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా వయోధికులే ఎక్కువగా పుస్తకాల పట్ల ఆసక్తి, అభిరుచి కలిగి ఉంటారనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ యువత పెద్ద సంఖ్యలో కనిపించడం విశేషం. రాజ్యాంగం 5 రకాలుగా.. భూమిపుత్ర, బహుజన పుస్తక ప్రచురణ సంస్థలకు చెందిన స్టాల్ నంబర్లు 203, 204లలో భారత రాజ్యాంగం గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పిల్లలు, పెద్దలు నచ్చేలా 5 రకాలుగా ముద్రించి ప్రదర్శనలో ఉంచారు. నేడు పుస్తక నడక.. పుస్తక పఠనంపై ప్రజల్లో ఆసక్తిని, అభిరుచిని, అవగాహనను పెంపొందించే లక్ష్యంతో సొమవారం పుస్తక నడక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. లోయర్ ట్యాంక్బండ్ నుంచి ఎనీ్టఆర్ స్టేడియం వరకు జరగనున్న ప్రదర్శనలో పాఠకులు, రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. -
హైదరాబాద్ : 37 వ జాతీయ బుక్ఫెయిర్ ప్రారంభం ..భారీ సంఖ్యలో సందర్శకులు (ఫొటోలు)
-
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
నేటి నుంచి కోటి దీపోత్సవం
లక్డీకాపూల్: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో శనివారం నుంచి కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే ఈ దీపోత్సవం ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, దేశంలోని పలువురు ముఖ్యులు పాల్గొంటారు.ప్రతిరోజు భక్తులు స్వయంగా విశేష పూజలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదని, ఎవరైనా రావచ్చని రచన టెలివిజన్ సంస్థ డైరెక్టర్ రఘు ఏలూరి తెలిపారు. దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు వంటి పూజాద్రవ్యాలతో పాటూ ప్రసాదాలను కూడా ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ సమేతంగా కోటి దీపోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు. -
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం (ఫొటోలు)
-
ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన పుస్తకాలు
శని, ఆదివారాలు రెండు రోజులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ‘గద్దరన్న యాదిలో’ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పసునూరి రవీందర్ అధ్యక్షత వహించనున్నారు. ప్రొఫెసర్ ఖాసీం, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, ఏపూరి సోమన్న, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, యశ్పాల్, మాస్టార్జీ తదితరులు పాల్గొంటారు. 11వ తేదీ ఆదివారం సాయంత్రం ‘నేటి బాలసాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై సదస్సు ఉంటుంది. మణికొండ వేదకుమార్, చొక్కాపు వెంకటరమణ, డా.సి.ఎ.ప్రసాద్, డా.విఆర్.శర్మ, అమరవాది నీరజ, దుర్గం బైతి, పెందోట వెంకటేశ్వర్లు పాల్గొంటారు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాలు కొలువుదీరాయి. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవానికి తరలివచ్చాయి. శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శనను ప్రముఖ రచయిత, ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్న పుస్తక మహోద్యమకారుడు పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పుస్తకమే మనిషిని పరిపూర్ణం చేస్తుందన్నారు. పుస్తక ప్రదర్శన వేదికకు, ప్రాంగణానికి ప్రజాగాయకుడు గద్దర్, ఆచార్య రవ్వా శ్రీహరిల పేర్లు పెట్టడం అభినందనీయమన్నారు. పుస్తకమే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని, పుస్తకాలు బాగా చదివిన వాళ్లే మహాత్ములయ్యారని చెప్పారు. తాను ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, పుస్తకమే ప్రపంచాన్ని ఏలుతోందన్నారు. అక్షరానికి మరణం లేదని చెప్పారు. పుస్తక ప్రదర్శన కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్రెడ్డి, కె.శ్రీనివాస్, సుధా భాస్కర్, ‘వీక్షణం’ వేణుగోపాల్, గద్దర్ కూతురు వెన్నెల తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు బుక్ఫెయిర్ ప్రాంగణంలో తెలంగాణ అమరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకల రుగ్మతలకు విరుగుడు పుస్తక పఠనమేనని పేర్కొన్నారు. విభిన్న రంగాలపై అరుదైన గ్రంథాలు బుక్ఫెయిర్లో ఈసారి 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. విభిన్న రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో పేరొందిన పలు ప్రచురణ సంస్థలు సరికొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాయి. రచయితలు తాము రాసిన పుస్తకాలను స్వయంగా విక్రయించేందుకు ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా ప్రదర్శన ప్రారంభమైన మొదటి రోజే వేలాది మంది పుస్తకప్రియులు, సందర్శకులు తరలి వచ్చారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం, ఆయుర్వేదం, హోమియో వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. మరోవైపు మాజీ ప్రధాని పీవీకి శుక్రవారం కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో పలువురు యువతీ యువకులు ఆయన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఆయన రాసిన పుస్తకాలు, ఆయనపై వెలువడినవి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. రైటర్స్ స్టాల్లో ‘రుద్ర ప్రయాగ చిరుతపులి’ వివిధ భాషల్లో ఇప్పటికే కోటికి పైగా అమ్ముడైన జిమ్కార్బెట్ రాసిన ‘ది మ్యాన్ ఈటింగ్ లియోపార్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్’ పుస్తకం తెలుగులో ‘రుద్ర ప్రయాగ చిరుతపులి’గా వెలువడింది. అనేక సంవత్సరాలుగా తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పుస్తకాన్ని 356– 360 స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. -
‘చదువరి చెంతకు పుస్తకం’.. ప్రారంభం కానున్న జాతియ పుస్తక ప్రదర్శన!
సాక్షి, సిటీబ్యూరో: పుస్తక ప్రియులకు పండగే. చదువరులకు ఇక వరమే. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి 10 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శన ఈసారి ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో రెండు నెలలు ఆలస్యమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ నెల 19 తేదీ వరకు కొనసాగనుంది. ‘చదువరి చెంతకు పుస్తకం’అనే లక్ష్యంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గత ఏడేళ్లుగా ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఏటా 6 నుంచి 7 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు ప్రదర్శనలో పాల్గొంటున్నారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలతో పాటు చరిత్ర, సామాజిక, తత్వ శాస్త్రాలు, విజ్ఞాన గ్రంథాలకు పాఠకాదరణ పెరిగింది. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కొన్ని ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలకు ఆదరణ పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. కోల్కతాలో గత జనవరిలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో సుమారు 29 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సైతం ప్రతి సంవత్సరం పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏటా లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. డిజిటల్ మీడియా వెల్లువలోనూ.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘సామాజిక చింతనకు, ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకొనేందుకు సాహిత్య అధ్యయనం ఒకటే మార్గం. సాహిత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నవాళ్లే గొప్ప విజేతలుగా నిలుస్తారు. అలాంటి అభిరుచి కలిగిన పాఠకులు కోట్లాది మంది ఉన్నారు’ అని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలు ఉద్ధృతంగా వెల్లువెత్తినా గత ఏడేళ్లుగా పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగడం, లక్షలాది పుస్తకాలు అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఎంతోమంది రచయితలు తమ సృజనాత్మకతకు పదును పెట్టుకుంటున్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనలో సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. పిల్లలకు ప్రత్యేక పోటీలు.. బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు ఉంటాయి. జానపద నృత్యాలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు, క్విజ్, మాట్లాడే బొమ్మ, పిల్లల గ్రంథాలయాల ఆవశ్యకతపై చర్చ, హస్తకళల వర్క్షాపు, గ్రూప్డ్యాన్స్, సోలోడ్యాన్స్, పాటలు, పద్యాలు, పెయింటింగ్, స్టోరీ టెల్టింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. ఇతరులకు ప్రవేశ రుసుము రూ.10. పుస్తక మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక, కళా రూపాలను ప్రదర్శించనున్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. -
హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (ఫొటోలు)
-
హైదరాబాద్ : కన్నుల పండుగగా ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ లో శ్రీవారి వైభవోత్సవాలు...!
-
Hyderabad Book Fair 2022: పుస్తకం పులకిస్తోంది..!
ఆదివారం సెలవు రోజు.. ఆ ప్రాంగణం కిటకిటలాడింది.. టికెట్ కౌంటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు.. టికెట్ పొంది లోనికి వెళ్లాలన్న ఆత్రుత వారిలో కనిపించింది.. ప్రదర్శన పూర్తయ్యాక ఎంతో సంతృప్తితో వెనుదిరిగారు. ఇది అవతార్ సినిమా థియేటర్ల ముందు సందడి కాదు. ఎన్టీయార్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆదివారం 70 వేల మంది ప్రదర్శనను తిలకించారన్నది నిర్వాహకుల మాట. సాక్షి, హైదరాబాద్: చేతిలో సెల్ఫోన్ తప్ప పుస్తకం పట్టరంటూ నేటి తరంపై పెదవి విరుపులు ఎన్నో.. కొత్త పుస్తకాలు అచ్చు వేయడం, అచ్చేసిన పుస్తక విక్రయాలు పలచగా ఉండటం రచయితలకు నీరసాన్నిస్తోంది. పేజీలు తిప్పుతూ, కుదురుగా ఓ చోట కూర్చుని పుస్తకాలు చదివే అలవాటు వేగంగా తగ్గిపోతోందని ఎంతోమంది పుస్తక ప్రియుల నిట్టూర్పులు నిత్యం వింటూంటాం.. ఇవన్నీ నిత్యసత్యాలే. కానీ ఓసారి నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలోకి వచ్చి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రాంగణాన్ని తిలకిస్తే మాత్రం పుస్తకానికి మళ్లీ మంచిరోజు వస్తోందా అన్న భావన కలగకమానదు. చిన్నారులు, యువకులు, నడి వయసు వారు, వృద్ధులు.. ఇలా తండోపతండాలుగా వచ్చి స్టాళ్లన్నీ కలియతిరిగి నచ్చిన పుస్తకాలను పట్టుకుని సంబరంగా వెళ్తున్నారు. కోల్కతా పుస్తక ప్రదర్శన తర్వాత జాతీయ స్థాయిలో అంత కీర్తిని మూటగట్టుకున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ 35వ ప్రదర్శన ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. నోట్ల రద్దు గందరగోళం ఉన్న తరుణంలో, కోవిడ్ భయాందోళనలు కొనసాగిన సమయంలోనూ సాగిన ఈ బుక్ ఫెయిర్ ఇప్పుడు.. పుస్తక ప్రియుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఇటు పుస్తకాలు, అటు చర్చాగోష్ఠులు, బయట జనం కోసం తినుబండారాల దుకాణాలు.. వెరసి ఆ ప్రాంతం జాతరను తలపిస్తోంది. అవీ ఇవీ.. ►ఈసారి పుస్తకప్రదర్శనలో 340 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాంతీయ, జాతీయ స్థాయి కేంద్రాలున్నాయి. ►ఆధ్యాత్మికం మొదలు ఆటల వరకు జానపదం మొదలు అంతర్జాతీయ విషయాల వరకు ఇలా అన్ని రంగాల పుస్తకాలు కొలువుదీరాయి. ►పోటీ పరీక్షలకు ఉపయోగపడే వాటితోపాటు కాలం తెలియకుండా కొత్త ప్రపంచంలో ఓలలాడించే నవలలు, కులమత సాహిత్యం, అట్లాసులు, పంచాంగాలు.. ఇలా సర్వం అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ►ఈసారి 8 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ ఇన్ని రాష్ట్రాల నుంచి రాలేదు. ►రచయితలు నేరుగా వారే తమ పుస్తకాలను పరిచయం చేసుకునేందుకు రైటర్స్ హాల్.. పేరుతో ప్రత్యేకంగా ఓ వేదిక ఏర్పాటు చేశారు. ►తెలుగు రచయితలకు రెండు స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో స్థానిక రచయితల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనకు రాలేకపోయిన జాతీయస్థాయి రచయితలు పలువురు వారి పుస్తకాలను పంపారు. వాటిని నిర్వాహకులే పుస్తక ప్రియుల ముందుంచి అమ్మిస్తున్నారు. ఆ డబ్బును రచయితలకు పంపుతామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ►తెలంగాణ సీఎం కేసీఆర్పై పలువురు రచయితలు రాసిన పుస్తకాల ప్రదర్శనకు ప్రత్యేకంగా ‘మన ముఖ్యమంత్రి స్టాల్’ఏర్పాటు చేశారు. ఇందులో 24 రచనలున్నాయి. బాల్య స్నేహితులతో కలిసి వచ్చి..: వెంకటేశ్వరరావు ఓ ప్రైవేటు కంపెనీలో విభాగాధిపతిగా పనిచేస్తున్న విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు తన బాల్యమిత్రులతో కలిసి ఈ ప్రదర్శనకు వచ్చారు. నలుగురు మిత్రులు ముందే కావాల్సిన పుస్తక జాబితాతో వచ్చి వాటికోసం స్టాళ్లలో వెతికారు. కోరుకున్నవే కాకుండా, గతంలో చాలా ప్రాంతాల్లో దొరకని పుస్తకాలు కూడా లభించటంతో కొని మురిసిపోయారు. ‘పద్యం ఉంటేనే పుస్తకం చదవాలన్న ఆసక్తి నాలో కలుగుతుంది. ఆధునిక కాలంలో అలనాటి సాహిత్యం మరుగునపడొద్దని ఏరికోరి ఆ పుస్తకాలు చదువుతాను. ఇప్పుడలాంటి ఎన్నో పాత రచనలు సమీకరించాను’అని వెంకటేశ్వరరావు సంబరంగా చెప్పారు. పెద్ద బాలశిక్షా సంబరపడుతోంది.. ‘పెడదారి పడుతున్న ఈ సమాజానికి సంస్కారం అబ్బాలంటే పెద్ద బాలశిక్ష చదివించాలి’ అంటూ ఓ సినీ పాత్ర గంభీరంగా చెబుతుంది. పెద్దబాలశిక్ష అంటూ ఓ పుస్తకం కూడా ఉంటుందా అంటూ ఈ తరం ఆశ్చర్యపోతుంది. కానీ ఈ పుస్తక ప్రదర్శనలో పెద్దబాల శిక్ష నిజంగా మురిసిపోతోంది. ‘‘మా స్టాల్లో రోజుకు 40కి తగ్గకుండా పెద్దబాలశిక్ష పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. ఇతర స్టాళ్లలోనూ వాటికి మంచి ఆదరణ ఉంది.’అని ఆనందంగా చెప్తున్నారు. – శ్యామల, అన్నపూర్ణ పబ్లిషర్స్ స్పందన గొప్పగా ఉంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ బుక్ఫెయిర్కు ఈసారి మరింత ఆదరణ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రచురణ కర్త లు వారి రచనలతో పుస్తకప్రియుల ముందుకొచ్చారు. నేరుగా వారితో మాట్లాడుతూ పుస్తకాలు విక్రయిస్తున్నారు. కానీ, రచయితలే నేరుగా కొనుగోలుదారులతో మాట్లాడుతుండటం, ఆయా పుస్తకాల ప్రత్యేకతలను చర్చాగోష్ఠుల్లో వివరిస్తుండటం కొత్త అనుభూతిని పంచుతోంది. ప్రదర్శనకు ఈ నాలుగు రోజుల్లో 3 లక్షల మందివచ్చి ఉంటారని అంచనా. – కోయ చంద్రమోహన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు -
హైదరాబాద్ లో 35వ నేషనల్ బుక్ ఫెయిర్
-
Hyderabad Book Fair : ఎన్టీఆర్ స్టేడియంలో పుసక్త ప్రియుల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ పుస్తకాల పండుగ.. నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం (ఫొటోలు)
-
Hyderabad Book Fair 2022: హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎప్పటి నుంచి అంటే?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రకాల సాహిత్యాన్ని ఏటా ఒక్కచోటకు తెచ్చే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన మరోసారి పుస్తకప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. కోవిడ్ దృష్ట్యా సందర్శకుల ఆదరణ పెద్దగా ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులు గతేడాది 260 స్టాళ్లనే ఏర్పాటు చేసినప్పటికీ పుస్తకప్రియులు భారీగా తరలిరావడంతో ప్రదర్శన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఈసారి 320 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తెలిపారు. అంచెలంచెలుగా... నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ ఇంగ్లిష్ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఇక్కడ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్గా వెలుగొందింది. అక్కడి పుస్తక విక్రేతలే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్ట్ నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలతో కలసి 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను తొలిసారి కేశవ మెమోరియల్ స్కూల్ మెదానంలో ఏర్పాటు చేసింది. ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్రోడ్ తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. కథలు, నవలలు, గల్పికలు, చరిత్ర గ్రంథాలదే పుస్తక ప్రదర్శనల తొలినాళ్లలో అగ్రస్థానం. సోవియెట్ సాహిత్యం కూడా పాఠకులను బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. అలాగే యోగా, ఆయుర్వేద, హోమియో వైద్య పుస్తకాలు సైతం బాగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల కాలంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది కూడా విభిన్న రంగాలకు చెందిన పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
Hyderabad Book Fair 2023: పుస్తకాల రుతువు
ఆ నల్లటి వరుస కట్టిన అక్షరాల వెంట అక్షువులతో వెంబడిస్తే గుత్తులుగా కాసిన మామిడి పండ్ల చెట్టు కింద అశ్వాన్ని వదిలి సేదతీరుతున్న రాకుమారుడు కనిపిస్తాడు. కొమ్మపై కూచున్న జంట పక్షులు ఏవో అతనికి తెలియాల్సిన రహస్యం మరికాసేపట్లో చెవిన ఊదుతాయి. నల్లటి వరుస కట్టిన ఆ పంక్తుల వెంట పరిగెడితే కొత్త పెళ్లికూతురిని శోభనం రాత్రి చంపడమే వ్రతంగా పెట్టుకున్న రాకుమారుడు ఆ పెళ్లికూతురు మొదలెట్టిన గొలుసు కథల్లో గుడ్లు తేలేసి వ్రతం మరిచి ‘ఆ తర్వాత?’ అనే ప్రశ్నతో జీవితాంతం బతుకు వెళ్లమార్చడం చూస్తాము. కాగితం మీద వరుస కట్టిన పంక్తులు రాముడు కానలకు వెళ్లాక కౌసల్య పడిన శోకమెట్టిదన్న ఆలోచనను ఇస్తాయి. బోధిచెట్టు కింద దేహాన్ని క్షోభ పెట్టుకుంటున్న సిద్ధార్థుని సాక్షాత్కారం కోసం వేచి చూడమంటాయి. కరకు పళ్లు దిగబడి కాలి విముక్తి కోసం ఘీంకారం చేస్తున్న గజేంద్రుని మోక్షానికి శంఖు చక్రాలు వదిలి శ్రీ మహావిష్ణువును పరిగెత్తమంటాయి. రామలింగడు ఈ పంక్తులు పలకడానికే అంబ ఇచ్చిన ఒక చేతి పాలు, మరో చేతి పెరుగును కలిపి గొంతులోకి ఒంపుకున్న వైనం చెబుతాయి. పుటలు కొన్ని శ్రీనాథుని పల్లకీ మోస్తాయి. పుటలు కొన్ని పేదవాడి తెల్లని నవ్వును మల్లెలుగా విరబూస్తాయి. పుటల నిండా వీరుని ధీరకంపనం... వనిత దీక్షా కంకణం... పసిపిల్లల కేరింతలు... యువతీ యువకుల సల్లాపాలు... కన్నీటి ఉప్పదనం... త్యాగపు శౌర్యము... భీరువు ఆక్రందన... ఆలోచనల అలజడి... తేజోమూర్తి జీవన సందేశము. ఒక దేశ ‘తలసరి ఆదాయం’ ఎలా గణిస్తారోగాని ఒక దేశ ‘తలసరి సంస్కారం’ సగటున ఆ దేశపౌరుడు చదివిన పుస్తకాల సంఖ్యను బట్టి అవి ఎలాంటి పుస్తకాలన్న నాణ్యతను బట్టి గణించాలి. ఆహార కొరత వస్తేనో, విదేశీ మారకద్రవ్యం అడుగంటితేనో, ద్రవ్యోల్బణం విజృంభిస్తేనో మాత్రమే ఆ దేశం ప్రమాదంలో పడినట్టు కాదు. ఏ దేశ ప్రజలైతే నిజంగా పుస్తకాలు చదవడం మానేస్తారో, ఇంట పుస్తకాల అల్మారా లేకుండా జీవిస్తారో, ‘పుస్తకమా అది ఏమి’ అని ఫోన్ స్క్రీన్లో తల కూరుస్తారో ఆ దేశం నిజంగా ప్రమాదంలో పడినట్టు! వస్తు ప్రపంచం కంటే పుస్తక ప్రపంచం మేలైనది. ఇంట టివి, ఫ్రిజ్జు, కారు, ఐఫోన్ ఎన్ని కొన్నా మరోటేదో కావాలన్న అత్యాశను, పేడలో పడవేసే పేరాశను కలిగిస్తాయి. పుస్తకాలు? నీ పాదాలకు లేపనం రాసి హిమానీనదాల వరకూ తీసుకెళతాయి. నీ చీకటి కవాటాలను తెరిచి వెలుతురు వాకిళ్ల ఎదుట నిలబెడతాయి. నీ మూఢవిశ్వాసాలకు నువ్వే నవ్వుకునేలా చేస్తాయి. చైతన్యాన్ని కలిగించి నీ నిజస్థితి మీద అంచనా కట్టిస్తాయి. ద్వేషంతో, హైన్యంతో, వ్యవస్థీకృత దుర్లక్షణాలతో బతకాలన్న నీ పట్టుదలను అవి హరిస్తాయి. పుస్తకాలు నిన్ను పెట్రోలు కొట్టించమనవు. ఫుడ్డు ఆర్డర్ పెట్టమనవు. విలాసాలు అమేజాన్ చేయమనవు. అవి కోరేదల్లా తెరిచి చదవమనే! రెండు రాష్ట్రాల్లో 9 కోట్ల తెలుగు జనాభా. ఏ పుస్తకమూ 500 కాపీలు అమ్ముడుపోదు. అంటే కోటికి 100 మంది కూడా పుస్తకాలు కొనరు. సినిమా హీరోల కొరకు టికెట్టు రికార్డు స్థాయిలో కొంటారు. ‘నెక్ట్స్ సినిమా ఏమిటి?’ అని అడుగుతారు. ‘నువ్వు చదివిన పుస్తకం చెప్పు’ అని ఏ హీరోనీ ఎవరూ అడగరు. శ్రీమంతురాలైన సుధామూర్తి తానే శ్రీమంతులుగా భావించే ఒకరి ఇంటికి వెళ్లిందట. ‘అబ్బబ్బ... ఆ ఇంట మణిమాణిక్యాలు వజ్రవైఢూర్యాలు.. బంగారు సింహాసనాలు... అమూల్య కళాకృతులు... ఒక్కటే లోపం. ఒక్క పుస్తకం కనపడలేదు’ అని రాసింది. ఇలాంటి పేదరికంలో ఉన్న శ్రీమంతులు మనలో ఎందరు? పూర్వం తెలుగు ఇళ్లల్లో తప్పనిసరిగా ఎక్కాల పుస్తకం ఉండేది. శతకాలు ఉండేవి. పెద్ద బాలశిక్ష అయినా కనిపించేది. ఒక చిన్న గూటిలో ఇవి కూడా లేని స్థితికి తెలుగుజాతి ఎగబాకింది 10 వేల మంది తెలుగు కవులు ఉన్నారు. పక్క కవి పుస్తకం కొనరు. 5 వేల మంది తెలుగు కథకులు ఉన్నారు. పక్క రచయిత సంకలనం కొనరు. పాఠకుల మీద వంక పెడుతుంటారు. మొదట వీరే పుస్తకాలు కొనరు. రచయిత అంటే ఎవరు? సీనియర్ పాఠకుడు! మంచి కవి కావాలన్నా, మంచి కథకుడు కావాలన్నా మొదట జీవితంలో పాల్గొనాలి అనుభవం కోసం. తర్వాత పుస్తకాలు చదవాలి సాధన కోసం. జీవన స్పర్శ, పుస్తకాల సంపర్కం లేని శుష్కకవులతో, కథకులతో నిండి ఉంది నేటి మెజారిటీ తెలుగు సమాజం. ఇక మన పాఠకులు ‘మా పిల్లలు తెలుగు చదవరు’... ‘మాకు ఈ కథలు, కవిత్వం పడవు’ అంటూ ఉంటారు. నీకు రోటి పచ్చడి ఇష్టమైతే కనీసం రోటి పచ్చళ్ల మీద వచ్చిన పుస్తకమైనా కొను. ఇంట పుస్తకంగా కనపడుతూ ఉంటుంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు హైదరాబాద్లో పుస్తకాల రుతువు. అంటే బుక్ ఎగ్జిబిషన్. వందలాది స్టాళ్ళు, వేలాది పుస్తకాలు, ఆవిష్కరణలు, ఉపన్యాసాలు, సాహితీకారుల దర్శనం, మిత్రుల కరచాలనం, చలిగాలుల్లో ఛాయ్తో చేసే కబుర్లు. తెలుగులో ఎందరో రచయితలు, కవులు, బుద్ధిజీవులు... ఈ బుక్ ఎగ్జిబిషన్కు తరలివచ్చే పాఠకుల మీద నమ్మకంతో కొత్త పుస్తకాలను విడుదల చేస్తున్నారు. పాత క్లాసిక్స్ను రీప్రింట్ చేస్తున్నారు. ‘ఈ పుస్తకాలు చదివి ఆనందించండి, ఆస్వాదించండి, ఆలోచించండి’ అని కొమ్ముబూర ఊది మరీ మొరపెట్టుకోనున్నారు. ఈ రుతువులో పాలుపంచుకోండి. పుస్తకాల చెట్టు నీడ ప్రతి ఇంటా పడుగాక! -
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు) -
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
Photos : ఎన్టీఆర్ స్టేడియంలో కనుల పండువగా శ్రీవారి వైభవోత్సవాలు..
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో శోభాయమానంగా శ్రీవారి వైభవోత్సవాలు (ఫొటోలు)
-
Hyderabad: ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకగా వెంకన్న వైభవోత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్లో శ్రీవారి వైభవోత్సవాలు.. తరలివచ్చిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఎన్టిఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్టిఆర్ స్టేడియం ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేని వారికోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నగరానికి తరలిరావడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు ముప్పవరపు హర్షవర్ధన్, బి.సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలివీ.. ఎన్టీఆర్ స్టేడియంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే రోజు వారి పూజా కార్యక్రమాలు 11న ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కొలుపు, అర్చన, 7.30 నుంచి 8.15 వరకు నివేదన, 8.15 నుంచి 8.30 వరకు పాద పద్మారాదన, ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రెండో నివేదన, 9.30 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, వీధి ఉత్సవం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5.30 గంటల నుచి 6.30 వరకు, వీధి ఉత్సవం సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు, రాత్రి కైంకర్యం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు, ఏకాంత సేవ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. 15న... 15వ తేదీన ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కోలుపు, అర్చన 7.30 నుంచి 8.15, నివేదన 8.15 నుంచి 8.30 వరకు, పాదపద్మారాధన, ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, పుష్పయాగం, రెండవ నివేదన 10.30 నుంచి 11 గంటల వరకు, సర్వదర్శనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, సహస్రదీపాలంకరణ సేవ, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6.30నుంచి 8.30 వరకు తోమాల సేవ అర్చన, నివేధన రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ : ఈనెల 11 నుంచి 15 వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవాలు
-
గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం రెండు భవన్లూ వేదికలు కావాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం శాస్త్రీయంగా, సరైన పంథాలో చర్చలు జరగాలని ఆకాంక్షించారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ఆదివాసీ-బంజారా ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆదివాసీ- బంజారా ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో జీవో జారీ చేస్తామని వెల్లడించారు. దళిత బంధులాగే.. త్వరలోనే గిరిజన బంధు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. భూమి లేని గిరిజనులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్ ఇంకా మాట్లాడుతూ.. ‘సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. ఉమ్మడి ఏపీలో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్లే వర్తించాయి. రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడేళ్ల కిందట కేంద్రానికి పంపాం. ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నా. విభజన రాజకీయం మొదలు పెట్టిన హోంమంత్రిని అడుగుతున్నా. గిరిజన రిజర్వేషన్లను మీరు ఎందుకు తొక్కిపెడుతున్నారు. మోదీ పుట్టిన రోజున చేతులు జోడించి అడుగుతున్నా. రిజర్వేషన్లను రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడండి రిజర్వేషన్లు వెంటనే పెంచాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తోంది. మా న్యాయమైన హక్కునే మేం అడుగుతున్నాం. పోడు రైతలకు ఇచ్చేందుకు భూములు గుర్తించాం. పోడు భూములు రైతులకు ఇచ్చి రైతు బంధు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నా. గురుకులాల సంఖ్యను ఇంకా పెంచుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను కల్లోలానికి గురికానివొద్దు. మోదీ మా జీవోను గౌరవిస్తావా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావా’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. చదవండి: అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్.. -
Ganesh Chaturthi 2022: ఆకట్టుకుంటున్న పోర్టబుల్ పాండ్స్
సాక్షి, హైదరాబాద్: ఇదివరకు సహజసిద్ధమైన చెరువులు, కొలనుల్లో గణేశ్ నిమజ్జనాలు జరిగేవి. చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా విగ్రహాల నిమజ్జనం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేబిపాండ్స్ (నిమజ్జన కొలనులు) వినియోగిస్తున్నారు. ఈసారి కొత్తగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ప్లాస్టిక్ (ఎఫ్ఆర్సీ) పాండ్స్, నేలను తవ్వి తాత్కాలిక పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తాత్కాలిక పాండ్స్, ఎఫ్ఆర్సీ పాండ్స్ పనులు వడివడిగా జరుగుతున్నాయి. మూడో రోజు నుంచే.. బుధవారం వినాయకచవితి.. మూడోరోజు నుంచే చిన్నసైజు విగ్రహాల నిమజ్జనం జరగనుంది. వాటికోసమే ఉద్దేశించిన ఈ పాండ్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో ఎఫ్ఆర్సీ పాండ్స్ పోర్టబుల్వి. వీటిని ఎక్కడంటే అక్కడ.. ఎప్పుడంటే అప్పుడు ఏర్పాటు చేసే సౌలభ్యం ఉంది. ఇవి చూడ్డానికి ఆకర్షణీయంగానూ ఉండటంతో కాలనీల్లోని స్థానిక ప్రజలు వీటిని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. నగరంలోని అన్ని జోన్లలో ఈ పాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో రెండు పోర్టబుల్ పాండ్లు, ఒక తాత్కాలిక పాండ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మిగతా జోన్లలోనూ పనులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు,నాలుగున్నర అడుగుల లోతుతో ఈ పాండ్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ పాండ్స్లోకి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతారు. నిమజ్జనం కాగానే విగ్రహాలు, పూజా సామగ్రి వెంటనే తొలగించి వేరే చోటుకు తరలిస్తారు. నీరు పరిశుభ్రంగా ఉండేందుకు నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు తాజా నీరు నింపుతారని అధికారులు పేర్కొన్నారు. లోతు నాలుగున్నర అడుగులే అయినప్పటికీ, విగ్రహాలను అడ్డంగా పాండ్స్లోకి వేసి నిమజ్జనం చేయడం ద్వారా అంతకంటే పెద్ద విగ్రహాలు కూడా నిమజ్జనం చేయవచ్చని అధికారులు తెలిపారు. నిమజ్జనాలు ముగిసేంత వరకు వినియోగించే పోర్టబుల్ పాండ్స్ను అవసరాల కనుగుణంగా ఎక్కడంటే అక్కడ మాత్రమే కాకుండా వేసవిలో జీహెచ్ఎంసీ స్టేడియంలలో స్విమ్మింగ్ పూల్స్ గానూ వినియోగించుకునే అవకాశం ఉంది. -
హైదరాబాద్:: జాతీయ సంస్కృతీ మహోత్సవంలో సినీనటుడు చిరంజీవి (ఫొటోలు)
-
హైదరాబాద్: జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్లో కల్చరల్ ఫెస్టివల్.. హాజరుకానున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక ఉత్సవానికి భాగ్యనగరం మరోసారి వేదిక కానుంది. విభిన్న సంస్కృతులు, కళల సమాహారమైన నగరంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్కృతీ మహోత్సవాన్ని నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న ఉత్సవాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక, కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. విశిష్టమైన భారతీయ సంస్కృతిని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు జానపద, గిరిజన కళలు, నృత్యం, సంగీత ప్రదర్శనలను సమున్నతంగా ఆవిష్కరించనున్నారు. సుమారు వెయ్యి మంది కళాకారులు, పాకశాస్త్ర నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. (క్లిక్: చిమ్మచీకట్లో.. లాకర్ గదిలో.. 18 గంటలు) మొదటి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, మీనాక్షి లేఖి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు హాజరుకానున్నారు. (క్లిక్: పోలీసులకే పంచ్ వేసిన నెటిజన్) -
ఘన సంస్కృతిని ముందుతరాలకు అందిద్దాం
కవాడిగూడ: ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం చిరునామాగా ఉందని, ఈ సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిద్దామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో పది రోజులపాటు నిర్వహిస్తున్న హునార్ హాత్ ప్రదర్శనను ఆదివారం కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి జి.కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ, మన ప్రాచీన వారసత్వాన్ని హునార్ హాత్లో చూసుకోవచ్చని తెలిపారు. కరోనాతో చిన్న కళాకారులు బాగా నష్టపోయారని, వారికి ఆర్థిక సహాయం అందజేసేందుకు హునార్ హాత్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశంలోని 75 ప్రధాన నగరాల్లో హునార్ హాత్ను ఏర్పాటు చేశారని, ఈ ప్రదర్శనను హైదరాబాద్లోనూ ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రజలు దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ఆదుకోవాలని సూచించారు. ఆయారంగాల్లో గుర్తింపుపొందిన దేశవ్యాప్త కళాకారుల చేత ప్రదర్శనలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఏప్రిల్ 1, 2, 3 తేదీలలో ఎన్టీఆర్ స్టేడియంలో అఖిలభారత సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి నఖ్వీ మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతరం తొలిసారిగా ప్రధాని మోదీ నేతృత్యంలో చేతి వృత్తులు, కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు మిషన్ మోడ్పై కృషిచేయడం ప్రారంభించిందన్నారు. తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్తకళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ, రాజ్యసభ సభ్యుడు సురేష్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్రావు, స్థానిక కార్పొరేటర్ రచనశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: బుక్ ఫెయిర్కు పోటెత్తిన పాఠకులు
-
Hyd Book Fair: పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం..
సాక్షి, సిటీబ్యూరో: పుస్తకాల పండుగ మళ్లీ వచ్చేసింది. ఏటేటా చదువరుల మనసు దోచుకుంటూ కొలువుదీరే 34వ జాతీయ పుస్తకమహోత్సవం శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, తదితరులు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైవిధ్యభరితంగా.. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో పుస్తకం మరోసారి వేడుక చేసుకుంటోంది. వైవిధ్యభరితమైన అంశాలపైన రూపొందించిన పుస్తకాలతో పాఠక మహాశయులకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలు స్వయంగా తమ పుస్తకాలను విక్రయించేందుకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఒక స్టాల్ను ఏర్పాటు చేసింది. విభిన్న జీవన పార్శ్వాలను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలు ప్రదర్శనలో పుస్తకప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సామాజిక మాద్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా మొదటి రోజే సందర్శకులతో ఎన్టీఆర్ స్టేడియంలో సందడి నెలకొంది. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి. మరోసారి ‘చందమామ కథలు’ అనేక దశాబ్దాల పాటు తెలుగు పాఠకలోకాన్ని కట్టిపడేసిన చందమామ కథలు సంపుటాలుగా వెలువడ్డాయి. బాలల మనసు దోచుకొనే అద్భుతమైన కథలతో రూపొందించిన ఈ పుస్తకాలు మొత్తం 15 సంపుటాలుగా ముద్రించారు. 1950 నుంచి 2012 వరకు వచ్చిన కథలనన్నింటినీ ఈ సంపుటాల్లో నిక్షిప్తం చేశారు. విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ తదితర స్టాళ్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. విశాలాంధ్రకు చెందిన 10 నుంచి 13వ స్టాల్ వరకు ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. చలం సమగ్ర సాహిత్యం.. చలం రాసిన పుస్తకాలన్నింటినీ 22 సంపుటాలుగా ముద్రించారు. ప్రియదర్శిని ప్రచురణ సంస్థకు చెందిన స్టాల్ నెంబర్ 112 లో ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. మైదానం, దైవమిచి్చన భార్య, అమీనా, చలం మ్యూజింగ్స్, స్త్రీ వంటి అనేక గ్రంధాలతో ఆ నాటి నుంచి నేటి వరకు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చలం సాహిత్యం అంతా ఒక్క చోట లభించడం విశేషం. చిందు ఎల్లమ్మ వేదిక.. పుస్తక ప్రదర్శన వద్ద ఏర్పాటు చేసిన సాహిత్య వేదికకు ఈసారి యక్షగాన కళాకారిణి చిందు ఎల్లమ్మ వేదికగా నామకరణం చేశారు. అలాగే మొత్తం ప్రాంగణానికి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణు మాధవ్ పేరు పెట్టారు. ♦ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ కళారూపాలు, నృత్యప్రదర్శనలు నిర్వహిస్తారు. u యంగ్ రైటర్స్ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోవిడ్ కారణంగా పుస్తకాలను ఆవిష్కరించలేకపోయిన వారికి సముచిత ప్రోత్సాహం ఉంటుంది. ♦పుస్తకం పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు సదస్సులు, చర్చలు ఉంటాయి. ♦ఈ నెల 22వ తేదీన పర్యావరణంపైన ప్రత్యేక సాహిత్య సదస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చారిత్రక నేపథ్యం... హైదరాబాద్ లో 1980వ దశాబ్దంలో పుస్తక ప్రదర్శన మొదలైంది. కానీ పుస్తకాలను ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచన కూడా లేని రోజుల్లో అంటే 1948 నుంచి వట్టికోట ఆళ్వారుస్వామి తన ‘దేశోద్ధారక గ్రంథమాల’ సంస్థ ప్రచురించిన పుస్తకాలను పాఠకుల వద్దకు తీసుకెళ్లాడు. 1961వరకు ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించాడు. హైదరాబాద్ నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడ భాషలకు చెందిన పుస్తకాలు వచ్చాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ వంటి సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రదర్శనలో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రదర్శన ఆరంభం ఇలా.. ♦దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్టు ఆధ్వర్యంలో 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కేశవ మొమోరియల్ స్కూల్లో ప్రారంభించారు. ♦ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్రోడ్డు తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. ♦ఆ నాటి నుంచి నేటి వరకు కథలు, నవలలు, గల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే అగ్రస్థానం. శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్స్పియర్, సోమర్సెట్ మామ్, యద్దనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్రావు వంటి ప్రముఖుల రచనలు ఇప్పటికీ హాట్కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి. ♦‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావి తం చేస్తూనే ఉన్నాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ఖడ్గసృష్టి వంటి గ్రంథాలకు ఇప్పుడూ అదే ఆదరణ ఉంది. ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్ బుక్ ఫెయిర్ చాలా అద్భుతంగా ఉంది. చాలా పుస్తకాలు కొనుక్కోవాలని ఉంది. కానీ న్యూజిలాండ్కు తీసుకెళ్లడం కష్టంకదా. చందమామ కథల సంపుటాలు తీసుకున్నాం. ఇప్పటి పిల్లలకు ఆ పుస్తకాలు చాలా అవసరం. – శ్రీలత మగతల, అధ్యక్షురాలు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పాఠకులకు నచ్చిన పుస్తకాలున్నాయి ఈసారి 260కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశాం. సుమారు 2.5 లక్షల పుస్తకాలు అన్ని ప్రముఖ భాషలలో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి కావలసిన అద్భుతమైన మెటీరియల్ ఉంది. అలాగే ఎవరి అభిరుచికి తగిన పుస్తకాలను వారు కొనుక్కోవచ్చు. కవులు, రచయితల కోసం ఒక ప్రత్యేక స్టాల్ను కూడా ఏర్పాటు చేశాం. వారు అక్కడ స్వయంగా తమ పుస్తకాలను విక్రయించవచ్చు. – కోయ చంద్రమోహన్, బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి తెలుగు నవలల కోసం వచ్చాను తెలుగు నవలలపైన ఆసక్తితో వచ్చాను. తెలుగు భాషపైన పట్టు రావాలంటే సాహిత్యం చదవాలి కదా. ఈసారి చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. బుక్ఫెయిర్ వారికి కృతజ్ఞతలు. – లహరి, దిల్సుఖ్నగర్ బైక్రైడింగ్..బుక్ రీడింగ్ బైక్ రైడింగ్ నా హాబీ. బైక్ పై చాలా దూరం వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో రోజంతా ఒక పుస్తకం చదువుకొని వస్తాను. చాలా హాయిగా ఉంటుంది. అందుకే నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేద్దామని వచ్చాను. – విశ్వేశ్వర్, ఓల్డ్సిటీ -
Hyderabad: 18 నుంచి 27 వరకు బుక్ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: పుస్తకం రెక్కలల్లార్చుకొని చదువరి చెంతకు తిరిగి వచ్చేస్తోంది. లక్షలాది మంది సాహితీ ప్రియుల మదిని దోచుకోనుంది. ఈ నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 34వ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈసారి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ సన్నాహాలు చేపట్టింది. ఏటా సుమారు 330 నుంచి 350 స్టాళ్లతో జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఈ ఏడాది వీటి సంఖ్యను తగ్గించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు అనుగుణంగా 250 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బహుభాషల్లో.. ► అన్ని రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ హైదరాబాద్ ఏటేటా పుస్తకానికి బ్రహ్మరథం పడుతూనే ఉంది. ► విభిన్న జీవన రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయి. కథ, కవి త్వం, నవల, చరిత్ర వంటి సాహిత్యమే కాకుండా బాలల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వెలుడిన విశ్లేషణ గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్ పాఠ్యపుస్తకాలు వంటి వాటికీ పాఠకాదరణ లభిస్తోంది. (చదవండి: కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!) ప్రదర్శన వేళలు ఇలా.. ► మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు. ► శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు. జాగ్రత్తలు పాటించాలి ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలి. కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి మాత్రమే ప్రదర్శనకు రావాలి. భౌతిక దూరం పాటించాలి. – కోయ చంద్రమోహన్, బుక్ఫెయిర్ కమిటీ -
వైభవంగా కోటి దీపోత్సవం
-
ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
-
సీఏఏ, ఎన్నార్సీ వద్దే వద్దు
సాక్షి,హైదరాబాద్/కవాడిగూడ/ముషీరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనకారులు కదం తొక్కారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని ముక్త కంఠంతో నినదించారు. ఈ ర్యాలీ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ను తలపించింది. ఎంబీటీ, తెహ్రీక్, ముస్లిం షబ్బాన్, జమాతే ఇస్లామీ, జామియతే ఉలేమా, జమాతే ఇస్లామీ, ఆహెలే హదీస్, తామిరే మిల్లత్తో పాటు పలు ప్రజా, దళిత, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు, సామాజిక, ధారి్మక, స్వచ్ఛంద సంస్థలతో కూడిన 48 సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపునిచి్చన విషయం తెలిసిందే. ఈ మేరకు లక్షలాది మంది ముస్లిం లు, నిరసనకారులు ‘మిలియన్ మార్చ్’లో పాల్గొనేందుకు హైదరాబాద్లోని ఇందిరాపార్కుకు తరలివచ్చారు. నగరం నలుమూలల నుంచి కుటుంబసభ్యులతో సహా తరలిరావడంతో ఇందిరాపార్కు పరిసరప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. ఓ చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ప్లకార్డులను పట్టుకొని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, ధర్నా చౌక్, లోయర్ ట్యాంక్బండ్లోని కట్టమైసమ్మ దేవాలయం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, తదితర ప్రాంతాలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనకారులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. మహిళలు, చిన్నారులు సైతం అధిక సంఖ్యలో హాజరై ఆందోళనలో భాగస్వాములయ్యారు. అంచనాలకు మించిన జనం.. పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మాత్రమే నిరసన సభ జరుపుకొనేందుకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ, ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలిరావడంతో అటు ఆర్టీసీ క్రాస్రోడ్స్ నుంచి ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు నలువైపులా జనంతో నిండిపోయింది. మధ్యాహ్నం 3 గంటలు దాటే సరికి తెలుగు తల్లి ప్లైఓవర్, లోయర్ట్యాంకు బండ్ కిక్కిరిసింది. దీంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ట్రాఫిక్ చక్రబంధంలో వాహనదారులు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, హోటల్ మారియట్, ఆర్టీసీ క్రాస్రోడ్డు, హిమాయత్నగర్, నారాయణగూడ, లిబర్టీ, బషీర్బాగ్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లోని వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. జనాలతో రోడ్లన్నీ జనసంద్రంగా మారడంతో వాహనదారులు, బస్సులు ముందుకు, వెనక్కి కదలలేని పరిస్థితి. మరికొన్ని వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించడంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమైంది.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇది పార్లమెంటులో నెగ్గడం దేశచరిత్రలో దౌర్భాగ్యకరమని పలువురు ప్రజా సంఘాల నేతలు, ముస్లిం సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఈ బిల్లును తీసుకురావడం తీవ్ర విషాదకరమని మండిపడ్డారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ఈ బిల్లు విఘాతం కలిగించేలా ఉందని ఆరోపించారు. సభలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అజీజ్బాషా, జేఏసీ కనీ్వనర్ ముస్తాక్ మాలిక్, ప్రొ.విశ్వేశ్వర్రావు, జస్టిస్ చంద్రకుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, అమ్జాదుల్లా ఖాన్, షబ్బీర్ అలీ, మౌలానా నసీరుద్దీన్, ఫిరోజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సీఏఏను కేంద్రం ఉపసంహరించుకునేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ బిల్లు మతంపై ఆధారపడిన బిల్లు అని, సుప్రీంకోర్టులో ఈ బిల్లు నిలబడదని జోస్యం చెప్పారు. ‘హిందువు అయితే ఎన్నార్సీలో పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు.. కానీ ముస్లిం అయితే పౌరసత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది దారుణమైన మతపరమైన వివక్ష’అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం హిట్లర్ చట్టాల కన్నా దారుణమైందని తీవ్రంగా దుయ్యబట్టారు. -
ఇంకొన్ని రోజులు ఉంటే బాగుటుంది..
-
విజేత ఉంటే విజయం మీ వెంటే!
-
బుక్ఫెయిర్లో ఆ స్టాల్స్ ఎంతో ప్రత్యేకం!
-
‘ఫోన్లు కాదు పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి’
-
‘ప్రేమ ఎప్పుడు ఒంటరిగా ఉండదు’
-
అందుకే స్ర్తీవాద రచనలు చేస్తాను!
-
ఈ ఏడాది ఆ పుస్తకాలే ఎక్కువగా అమ్ముడయ్యాయి!
-
బుక్ ఫెయిర్కు తరలివచ్చిన పిల్లలు,పెద్దలు
-
బుక్ ఫెయిర్ను ప్రారంభించిన గవర్నర్
-
మృగాలుగా మారుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ మధ్య మనసుకు చాలా బాధ కలిగించే అంశాలు చూస్తున్నాం. మానవ ప్రవృత్తి మరిచి కొందరు మృగాలుగా మారుతున్నారు. ప్రవచనాలు సద్గుణాలు, భక్తిభావాన్ని పెంపొందిస్తాయి’అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావు భాగవత సప్తాహం ప్రవచనాల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘భగవంతుని గురించి చెప్పేవాళ్లు, వినేవాళ్లు చాలా మంది ఉంటారు. భగవంతుని గురించి చదివినా, విన్నా, చెప్పినా పుణ్యం వస్తుందని అందరి విశ్వాసం. మాకు కోరికలు ఉన్నా కొన్ని నెరవేరవు. అందుకే మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకుని వచ్చా. నేను దైవాన్ని పూర్తిగా విశ్వసించే వ్యక్తిని. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోను. ఎవరికీ భయపడను. పూర్తిగా భక్తి ప్రపత్తితో చేసే పనులు సమాజానికి, లోక కల్యాణానికి ఉపయోగపడతాయి’అని కేసీఆర్ అన్నారు. అన్నపూర్ణ వంటి డొక్కా సీతమ్మ లాంటి ఉదాత్తమైన లక్షణం కొందరికైనా అలవడాలని ఆకాంక్షించారు. కలడు కలడందురు అన్ని దిశల, సిరికింజెప్పడు.. వంటి పద్యాలను చదువుతూ గజేంద్రమోక్షం, ద్రౌపదీ వస్త్రాపహ రణం వంటి ఘట్టాలను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వర్రావు మానవ జాతికి దొరికిన మణిపూసగా సీఎం అభివర్ణించారు. -
23 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
పంజగుట్ట: ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)ను ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) లో నిర్వహించనున్నటు హెచ్బీఎఫ్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుక్ ఫెయిర్ వివరాలను ఆయన వెల్లడించారు. ఈసారి ప్రదర్శనలో 330 స్టాళ్లు ఉంటాయని, దేశ విదేశాలకు చెందిన పబ్లిషర్స్ పాల్గొంటారన్నారు. సెలవు దినాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు, పనిదినాల్లో మధ్యాహ్నం 2:30 నుంచి 8:30 వరకు ఫెయిర్ జరుగుతుందని తెలిపారు. ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులకు ప్రవేశం ఉచితమన్నారు. పిల్లలకు బాలమేళ కార్యక్రమంలో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్, మిమిక్రీ, చిత్రలేఖనం, ఒక్క నిమిషం తెలుగు, బాల కవి సమ్మెళనం, మ్యూజిక్ మసాల, బృంద నృత్య పోటీలు, పాటల పోటీలు (సోలో), వ్యాసరచన, కథలు చెప్పడం, రాయడం, వినూత్న కళాప్రదర్శన, సైన్స్తో మనం, మాట్లాడే బొమ్మ వర్క్షాప్ ఇలా ప్రతిరోజు పోటీలు నిర్వహిస్తామన్నారు. -
కన్నులపండువగా కోటి దీపోత్సవం
-
వైభవంగా కొనసాగుతున్న కోటిదీపోత్సవం
-
3 నుంచి భక్తిటీవీ కోటిదీపోత్సవం
సాక్షి, హైదరాబాద్ : ఏటా నిర్వహించే భక్తిటీవీ కోటిదీపోత్సవానికి నగరం ముస్తాబవుతోంది. ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ వేడుక జరుగుతుందని నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30కు కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది. ‘పూరీ శంకరాచార్య జగద్గురు నిశ్చలానంద సరస్వతి స్వామి, ఉడుపి పెజావర్ పీఠాధిపతి విశ్వేశరతీర్థ, బాబా రామ్దేవ్, గణపతి సచ్చిదానంద, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్స్వామి, విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర’ వంటి ప్రసిద్ధ గురువులు చేతులమీదుగా పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు వంటి విఖ్యాత ప్రవచనకర్తలు విచ్చేయనున్నట్టు వివరించారు. భక్తులే స్వయంగా విశేష పూజలు చేసే విధంగా కార్యక్రమాలు జరగుతాయని, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఉంటాయని పేర్కొన్నారు. కోటిదీపోత్సవం ప్రత్యేకత.. కార్తికమాసం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటికాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహభాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంలో మునకలు వేయిస్తాయి. భక్తిటీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటిదీపోత్సవం ఈ ఏడాది హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబరు 3 నుంచి 18వ తేదీవరకు జరగనుంది. శుభారంభం.. లక్షదీపోత్సవం 2012లో లక్ష దీపాల అంకురార్పణతో ఈ మహాదీపయజ్ఞం ప్రారంభమైంది. 2013 నుంచి ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. భక్తిటీవీ అధినేత నరేంద్ర చౌదరి సంకల్పంతో ఏడు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఈ సంప్రదాయం కార్తికంలో అందరినీ పలకరిస్తూనే ఉంది. ఆశేష భక్తజనుల మనసుల్లో చెరగని ముద్రవేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం.. ఎనిమిదోసారి అంగరంగవైభవంగా జరగనుంది. భువిపై కైలాసం బొందితో కైలాసాన్ని చూడకపోవచ్చుకానీ.. కోటిదీపోత్సవ వేదికను చూస్తే ఆ లోటు తీరుతుంది. ఈ వేడుకకు విచ్చేసే ప్రతీఒక్కరినీ కళ్లార్పకుండా చేసేది ప్రధాన వేదిక. ఎత్తైన హిమగిరులు.. జలపాతాలు.. యోగముద్రలో సదాశివుడు.. శిఖరాలపై మహాదేవుని విభిన్నమూర్తులు.. శివలింగాలు వెరసి... అది కైలాస ప్రతిరూపం కాదు.. కైలాసమే అనిపించకమానదు. అటువంటి మహావేదిక 2019 కోటిదీపోత్సవ వేడుక కోసం సిద్ధమవుతోంది. శంఖారావం మొదలు కార్యక్రమం సమాప్తమయ్యేంతవరకు మహాకైలాస వేదికే కోటిదీపోత్సవ రంగస్థలి. ఈ వేదికపైనే వేదమంత్రఘోష ప్రతిధ్వనిస్తుంది. ఈ వేదికపైనే నియమ నిష్ఠాగరిష్ఠులైన జగద్గురువులు వేంచేస్తారు. ఈ వేదికపైనే సకలదేవతలూ కల్యాణోత్సవాలను జరిపించుకుంటారు. ఈ వేదికపైనే కోటిదీపాల యజ్ఞానికి నాందిగా తొలి దీపం వెలుగుతుంది. ఈ వేదికపైనే దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరిస్తారు. కోటిదీపోత్సవ వేదిక అంటే అది కళ్లముందు కనిపించే కైలాసం. మహాదేవుని సమక్షంలో కోటిదీపోత్సవం జరిగే దివ్యస్థలం. జగద్గురువుల అనుగ్రహభాషణం కోటిదీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తారు. ఆశీర్వచనపూర్వకంగా అనుగ్రహభాషణం చేస్తారు. ఇటువంటి అద్భుత పర్వానికి ఈ ఏడాది సైతం ప్రసిద్ధ పీఠాధిపతులు, జగద్గురువులు తరలివస్తున్నారు. వారి చేతులమీదుగానే తొలి దీపారాధన జరగుతుంది. పూరీ శంకరాచార్య జగద్గురు శ్రీనిశ్చలానందసరస్వతి, ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీవిశ్వేశ తీర్థస్వామీజీ , బాబా రామ్దేవ్, శ్రీగణపతి సచ్చిదానందస్వామీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీరవిశంకర్ గురూజీ వంటి ప్రసిద్ధ గురువులతో పాటు.. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు విచ్చేయనున్నారు. గురు సమక్షంలో జరిగే దీపారాధన మరింత పుణ్యప్రదమని కార్తిక పురాణ వచనం. అందుకే నియమనిష్ఠాగరిష్టులైన కాషాయాంబరధారుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో పాల్గొనడం కోటి జన్మల పుణ్యఫలం. సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, లబ్దప్రతిష్టులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఈ వేడుకలో ఆనందంగా పాల్గొంటారు. జన్మజన్మల పుణ్యఫలం కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. కూర్చున్నచోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్రకలశాభిషేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు. రుద్రాక్షలతో పూజించవచ్చు. పసుపుకొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు. గ్రహదోషాలు తొలగేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు. శ్రీవేంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు. ఇలా ఒకటేమిటి ఇలాంటి ఎన్నో పూజలు ఈ ఏడాది కోటిదీపోత్సవ ప్రత్యేకం. పరిణయం.. బ్రహ్మోత్సవం దేవతల కల్యాణాన్ని చేయించినా.. వీక్షించినా మహాపుణ్యప్రదమని అంటారు. ఈ రెండు అదృష్టాలు భక్తిటీవీ కోటిదీపోత్సవంలో కలుగుతాయి. ఈ వేడుకలో పాల్గొనే భక్తులందరి చేత స్వయంగా సంకల్పం చెప్పించి.. కనులపండువగా సకల దేవతల కల్యాణోత్సవాలు చేయిస్తారు. ఈ ఏడాది తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల, ఒంటిమిట్ట, మధురై తదితర క్షేత్రాల నుంచి 3 వేంచేసిన ఉత్సవమూర్తులకు కనులపండువగా కల్యాణోత్సవం జరగనుంది. కల్యాణ ప్రసాదం కూడా అందించడం కోటిదీపోత్సవ ప్రత్యేకత. కల్యాణోత్సవ మూర్తులు వివిధ వాహనాలను అధిష్టించి ప్రాంగణంలో ఊరేగుతుంటే ఆ వేడుకను వీక్షించే భక్తులు తన్మయులవుతారు. సకల దేవతలకూ ఒకే ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే చూసే భక్తులకు అంతకుమించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది. అనిర్వచనీయం.. అత్యద్భుతం ఉత్సవంలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథమహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్లుగా ఉంటుందా దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని. కోటిదీప కాంతుల నడుమ జరిగే లింగోద్భవం ఓ అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చే సమయంలో కైలాస ప్రాంగణంలో ఓంకారంతో మార్మోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు. నటరాజుకు కళాంజలి తాండవప్రియుడైన శివునికి కళానీరాజనం అర్పించే మహాద్భుత ఉత్సవమిది. అందెల రవళులు ఘల్లుఘల్లుమంటాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలకే కాదు.. జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, ఒడిస్సీ, మణిపురి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీపోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. -
పుస్తక కొలువు
-
కోటి దీపోత్సవం
-
పది రోజుల పండుగ !
సాక్షి, హైదరాబాద్: సాహిత్య, సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగరం మరోసారి వేదికైంది. ‘హైదరాబాద్ ఫెస్ట్’పేరుతో మొట్టమొదటిసారి శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో వైవిధ్యభరితమైన జానపద కళారూపాలు, సాహిత్య సభలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, ఆటపాటలు, వినోదభరిత కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఈ నెల 13 (శుక్రవారం) నుంచి 22 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు, సెలవు రోజుల్లో ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ మహోత్సవాలను నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితం. 15 వేదికలపై ప్రతిరోజు 25 కార్యక్రమాల చొప్పున ఈ 10 రోజుల్లో సుమారు 250 కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ఫెస్ట్ కార్యదర్శి చంద్రమోహన్ ‘సాక్షి’తో చెప్పారు. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్ను అందరూ విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం ఈ ఫెస్ట్ను మంత్రి ఈటల రాజేందర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఫెస్ట్గౌరవ అధ్యక్షుడు చుక్కా రామయ్య ప్రారంభిస్తారని తెలిపారు. కాగా హైదరాబాద్ ఫెస్ట్ను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో ఎయిర్ బెలూన్ను ఆవిష్కరించారు. సకల కళలకు పట్టం స్ఫూర్తి ప్రోగ్రెసివ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఫెస్ట్లో చిరుతల భజన, శాస్త్రీయ నృత్యం, డప్పు నృత్యం, రేలా డ్యాన్స్, సోలో సాంగ్, కదంబం, బ్యాలే డ్యాన్స్, డోలు కోయలు, ఫోక్ డ్యాన్స్ తదితర అనేక కళారూపాలను ప్రదర్శిస్తారు. సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, ఎల్బీ శ్రీరాం, అల్లాడి శ్రీధర్, సుద్దాల అశోక్తేజ, నరేశ్, శ్రీకాంత్, శంకర్ తదితరులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. పిల్లల కోసం బాలోత్సవ్ వేసవి సెలవుల్లో చిన్నారులు తమ సృజనకు పదును పెట్టుకొనే అనేక ప్రక్రియలను, కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. కవిత్వం రాయడం, భావవ్యక్తీకరణ, పద్యపఠనం, కథలు చెప్పడం, రాయడం, విశ్లేషించడం వంటి అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పిల్లల పాటలు, బృందగానాలు, అభ్యుదయ, జానపద, లలిత గీతాలు, నాటకాల పోటీలు నిర్వహిస్తారు. బొమ్మలు వేయడం, బొమ్మలను తయారు చేయడం, ఉర్దూ భాషలోశిక్షణ వంటి కార్యక్రమాలను ఈ బాలోత్సవ్లో నిర్వహిస్తారు. స్టీఫెన్ హాకింగ్ హబ్ పిల్లల మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలను నివృత్తి చేసేవిధంగా స్టీఫెన్ హాకింగ్ హబ్ పేరిట మనో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ ఫెస్ట్లో ప్రత్యేకంగా నిలవనుంది. గత మూడు దశాబ్దాలుగా పిల్లల్లో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించేందుకు కృషి చేస్తోన్న జనవిజ్ఞాన వేదిక ఈ హబ్ను నిర్వహించనుంది. హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ పుస్తక ప్రదర్శనకు కూడా హెదరాబాద్ ఫెస్ట్ పట్టం కట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తదితర రాష్ట్రాలకు చెందిన పుస్తక సంస్థలు, 80 స్టాళ్లతో ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ఫెస్ట్లో మఖ్దూం మొహియుద్దీన్ వేదికపై ప్రతిరోజు వివిధ సాహిత్య అంశాలపై చర్చలు, సదస్సులు ఉంటాయి. కవి సమ్మేళనం కూడా ఉంటుంది. మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు ఈ వేడుకల్లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 14 నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. రాజకీయ నాయకత్వంలో మహిళలు అన్న అంశంపై నిర్వహించే సదస్సులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం పాల్గొంటారు. అలాగే 15న ప్రసారసాధనాలు–మహిళలు, 16న ప్రత్యామ్నాయ సంస్కృతి, 17న స్త్రీలు–పిల్లలపై సైబర్ నేరాలు, 18న మహిళలు–ఆరోగ్యం అన్న అంశంపైన సదస్సులు, చర్చలు నిర్వహిస్తారు. -
ఏప్రిల్ 12 నుంచి హైదరాబాద్ ఫెస్ట్-2018
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఫెస్ట్-2018ను ఏప్రిల్ 12 నుంచి 22వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల నరసింహరెడ్డి, కె చంద్రమోహన్లు తెలిపారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్ట్ గ్యాలరీ, సైన్స్ ఫెయిర్, ఫిల్మ్ ఫెస్టివల్, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఫెస్ట్కు హాజరయ్యేవారిని ఆకట్టుకునేలా ప్రతిరోజు కళా ప్రదర్శనలు, ప్రముఖుల కవితలు, ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసేలా సైన్స్ ఎగ్జిబిషన్ చేపడుతున్నట్టు ఫెస్ట్ నిర్వహకులు తెలిపారు. అంతే కాకుండా విద్యార్థులకు కథలు, కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. హైదరాబాద్ చరిత్ర ప్రతిబింబించే అంశాలతో పాటు, తెలంగాణ కళలను ప్రోత్సహించే దిశగా ఫెస్ట్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఐదు లక్షల మందికి పైగా ఫెస్ట్కు హాజరవుతారని, ప్రజలు దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ముత్యమంతా మురిపెమే!
సాక్షి, సిటీబ్యూరో: ‘కొత్త రాష్ట్రంలో కళల వికాసం.. కళాకారుల అభ్యున్నతే మా ధ్యేయం’.. ప్రభుత్వం తరచూ చెప్పే మాటలివి. తెలంగాణ ప్రభుత్వంలో కళలకు పెద్దపీట వేస్తామని రోజూ ఎక్కడోచోట సీఎం కేసీఆర్ చెబుతునే ఉన్నారు. కానీ సీఎం ప్రకటించిన సాంస్కృతిక చిహ్నల నిర్మాణం ఆచరణలో ఒక్క అడుగు పడలేదు. నగరంలో కళా సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇలాంటి చోట తెలంగాణ సర్కారు ఏర్పడ్డాక ప్రభుత్వ ముద్రగా చెప్పుకునేందుకు ‘రవీంద్రభారతిని ముత్యపు చిప్ప ఆకృతి’లో నిర్మిస్తామన్నారు. ధర్నాచౌక్ను ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతంలో కళాభారతి నిర్మించి తీరుతామని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇంతవరకు వాటికి అతీగతీ లేదు. రవీంద్రభారతి ఆకృతి మారేనా.. భాగ్యనగరానికి ‘సిటీ ఆఫ్ పెరల్స్’(ముత్యాల నగరం)గా పేరు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రవీంద్రభారతిని అద్భుతంగా మారుస్తానని చెప్పారు. భవాన్ని పూర్తిగా ‘ముత్యపు చిప్ప’ ఆకృతిలో నిర్మించాలని, లేకుంటే ప్రస్తుత కట్టడాన్ని అలాగే ఉంచి పై ఆకృతిని మాత్రం ముత్యపు చిప్పలా నిర్మించి తీరాలని సంకల్పించానని చెప్పారు. ఈ ప్రకటన వినగానే కళాభిమానులు, సాహితీ ప్రియులు మురిసిపోయారు. కానీ సీఎం హామీ ఇచ్చి మూడేళ్లు దాటింది. ముత్యపు చిప్ప చిహ్నం స్వప్నంగా మారింది. ఇది సాధ్యం కాదకున్నారేమో.. ముఖ్యమంత్రి రవీంద్రభారతి పునరుద్ధరణ కోసం రూ.3 కోట్లు కేటాయించారు. ‘‘ముత్యపు చిప్ప ఆకృతిలో రవీంద్రభారతి అన్నప్పుడు మళ్లీ పునరుద్ధరణ ఏంటని పలువురు అప్పట్లో విమర్శలకు దిగారు. అయినా రూ.2.7 కోట్లు ఖర్చుతో ఇటీవల రవీంద్రభారతి పునరుద్ధరించారు. ఈ పనులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహించింది. పనులు పూర్తి చేసి మూడు నెలలు తరగకుండానే రవీంద్రభారతిలోని 42 కుర్చీలు దెబ్బతిన్నాయి. ఈ ఐదేళ్ల పదవీ కాలంలో సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవడం కష్టమని కళాకారులు వాపోతున్నారు’’. కోర్టు చిక్కుల్లో కళాభారతి... సీఎం కేసీఆర్ పేర్కొన్న రెండో సాంస్కృతిక చిహ్నం కళాభారతి. రూ.300 కోట్లతో ధర్నా చౌక్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అద్భుత కళాభారతి నిర్మాణం 14 ఎకరాల్లో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆరు ఎకరాల్లో భవనాలు నిర్మించి మిగతా అంతా పార్కింగ్కు ఉంచుతామన్నారు. సాంస్కృతిక – సాహిత్య ప్రక్రియల అకాడమీలు అందులోనే ఉంటాయన్నారు. 200 నుంచి 3 వేల మంది వరకు వేర్వేరు ఆడిటోరియాలు కళాభారతిలో అంతర్భాగంగా ఉంటాయని తెలిపారు. ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ ఆర్కిటెక్ట్గా వ్యవహరించి కళాభారతి నమూనాను కూడా విడుదల చేశారు. ఇంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ‘‘ఎన్టీఆర్ స్టేడియం స్థలంలో కళాభారతి నిర్మాణం చేపట్ట వద్దని వాకర్స్ క్లబ్ వారు కోర్టు వెళ్లడంతో ఇప్పుడిది చిక్కుల్లో ఇరుక్కుంది. ప్రస్తుత ప్రభుత్వ హయంలో కోర్టు చిక్కులు తొలగే అవకాశం లేదని సాంస్కృతిక శాఖ అధికారులే చెబుతుండడం గమనార్హం. సీఎం కేసీఆర్ హామీలైన ఈ రెండు సాంస్కృతిక చిహ్నల విషయంపై భవిష్యత్తు చర్యలేంటన్న దానిపై భాషా సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులు నోరు విప్పడం లేదు’’. -
పుస్తకం.. ఓ మంచి దోస్త్
సాక్షి, హైదరాబాద్: మనిషికి పుస్తకానికి మించిన దోస్తులు ఉండరని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ 31వ జాతీయ పుస్తక మహోత్సవం ఆదివారం ముగిసింది. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని శాసిస్తున్నా.. పుస్తకాలను మాత్రం శాసించలేకపోతోందని అన్నారు. పుస్తకం అనేది ఒక చిరంజీవి అని, సీఎం కేసీఆర్ పుస్తకప్రియుడని, పుస్తకం కేసీఆర్ను నడిపిస్తుంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలను నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందని, సాహిత్యం రుణాన్ని తీర్చుకోలేమన్నారు. భావితరాలకు పుస్తక విజ్ఞానాన్ని అం దించాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి పుస్తకానికి చేరువ చేయాలని సీపీఎం నేత బీవీ రాఘవులు సూచించారు. ఆఖరి రోజు కిటకిట.. 11 రోజులపాటు నిర్వహించిన ఈ పుస్తక ప్రదర్శనను సుమారు 9 లక్షల మంది పుస్తకప్రియులు సందర్శించారు. ఆదివారం ఆఖరిరోజు కావడంతో కిటకిటలాడింది. నచ్చిన పుస్తకం కోసం నగరవాసులు అన్వేషిం చారు. ఈ ఏడాది సుమారు 133 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనేక అంతర్జాతీయ, జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. పిల్లల కోసమే 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు, నేటితరం యువతీ యువకుల్లో, పిల్లల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ కమిటీ 12 సాహిత్య సమాలోచనలను నిర్వహించింది. వేడుకల్లో భాగంగా పలువురు రచయితలు రాసిన 65 పుస్తకాలను ఆవి ష్కరించారు. పుస్తక ప్రదర్శనలో పిల్లల కోసం ప్రత్యేకంగా 25 కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధి చంద్రమోహన్ తెలిపారు. వైవిధ్యాన్ని చాటుకున్న స్టాళ్లు.. పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లు వైవిధ్యాన్ని చాటుకున్నాయి. ఆధ్యాత్మికం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యక్తిత్వవికాసం, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు వంటి పుస్తకాలతో పాటు తెలుగు సాహిత్యం, కథలు, నవలలు, విశ్లేషణాత్మక గ్రంథాలకు చక్కటి ఆదరణ లభించింది. మేనేజ్మెంట్, కెరీర్ రంగానికి సంబంధించిన పుస్తకాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు ఆధ్యాత్మిక గ్రంథాలు పెద్ద ఎత్తున అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు. -
బుక్ ఎగ్జిబిషన్కు సందర్శకుల వెల్లువ
-
పుస్తకం..ప్రపంచాన్ని మార్చే ఆయుధం
సాక్షి, హైదరాబాద్ : సమాజ స్వరూపం మారడానికి అక్షరమే పునాదని మంత్రి జగదీశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలోని భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కనులపండువగా ప్రారంభమైంది. జగదీశ్వర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అక్షరం పుట్టిన తర్వాతే అనూహ్యమైన మార్పులు వచ్చాయని, పుస్తకమే ప్రపంచ గమనాన్ని మార్చే ఆయుధమని ఈ సందర్భంగా జగదీశ్వర్రెడ్డి అన్నారు. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని ఏ వైరస్ అయినా చిటికెలో మాయం చేస్తుందని, పుస్తకంలోని అక్షరాలను ఏ వైరస్ కూడా అడ్డుకోలేదన్నారు. పుస్తకం లేని జీవితానికి పరిపూర్ణత రాదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పుస్తకంతోనే ప్రపంచంలో గొప్ప పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. పుస్తకం మంచి స్నేహితుడని, పుస్తక పఠనం మనిషిని తలెత్తుకొని బతికేలా చేస్తుందని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. పుస్తకం మనిషికి విలువలతో కూడిన జీవితాన్ని అందిస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ నెల 28 వరకు జరిగే బుక్ ఫెయిర్ విజయవంతం కావాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆకాంక్షించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తక పఠనం.. ప్రగతికి సోపానం
సాక్షి, హైదరాబాద్: 31వ జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల 18 నుంచి 28 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరనుంది. ఇందులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. ఈ ఏడాది 333 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 50కి పైగా జాతీయ స్థాయి పబ్లిషర్స్, 25 పిల్లల పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. బాలల సాహి త్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం తదితర రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర, గ్రంథాలపై పాఠకులు ఎంతో మక్కువ చూపుతున్నారని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధి కోయ చంద్రమోహన్ ‘సాక్షి’తో చెప్పారు. డాక్టర్ సినారె వేదిక, వట్టికోట ప్రాంగణం భరత నాట్యం, కూచిపూడి, స్టోరీ టెల్లింగ్ వంటి కార్యక్రమాలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన కళారూపాలను ప్రదర్శిస్తారు. 10 రోజుల పాటు పెద్ద సంఖ్యలో పుస్తక ఆవిష్కరణలు, ప్రత్యేక సదస్సులు ఉంటాయి. ఈ ఏడాది హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికకు డాక్టర్ సి.నారాయణరెడ్డి వేదికగా నామకరణం చేయనున్నా రు. మొత్తం ప్రాంగణానికి వట్టికోట ఆళ్వార్ స్వామి పేరుపెట్టనున్నారు. పుస్తక ఆవిష్కరణలు, సదస్సులు జరిగే వేదికకు సామల సదాశివ సాహి త్య ప్రాంగణంగా, వేదికకు బోయ జంగయ్య వేదికగా నామకరణం చేయనున్నారు. ప్రదర్శనకు ఆహ్వానం పలికే రెండు స్వాగత తోరణాలకు ప్రముఖ రచయితలు, పాత్రికేయులు అయిన అలిశెట్టి ప్రభాకర్, అరుణ్సాగర్ పేరు పెట్టనున్నారు. ప్రధాన ద్వారానికి తొలి తెలుగు రచ యిత్రి భండారు అచ్చమాంబ పేరు ఖరారు చేశా రు. గురువారం ప్రారంభం కానున్న ఈ పుస్తక మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచేందుకు స్టోరీ టెల్లింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు వంటివి నిర్వహిస్తున్నారు. కొత్తగా ‘బుక్ హంట్’ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలకు రెండు పుస్తకాల పేర్లు చెబుతారు. వాటిని వెతికి ఇచ్చిన వారికి పుస్తక బహుమతులను అందిస్తారు. ప్రతి రోజూ మధ్యా హ్నం 2:30 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శన కొనసాగుతుం దని హైదరాబాద్ బుక్ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు జూలూ రు గౌరీశంకర్ తెలిపారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు తమ స్కూల్ గుర్తింపు కార్డులు చూపిం చి ఉచితంగా ప్రదర్శనలో పాల్గొనవచ్చన్నారు. సాధారణ సందర్శకులు రూ.5 ప్రవేశ రుసుము చెల్లించాలన్నారు. -
గొప్ప చరిత్రల సృష్టికి అక్షరమే పునాది
ఆర్థిక మంత్రి ఈటల వ్యాఖ్య ప్రారంభమైన 30వ హైదరాబాద్ బుక్ఫెయిర్ హైదరాబాద్: ‘కదిలేది.. కదిలించేది... పెను తుపాను సృష్టించేది అక్షరమే’అన్న చెరబండ రాజు మాటలు నిత్య సత్యమేనని, ప్రపంచంలో ఎన్నో గొప్ప చరిత్రల సృష్టికి పునాది అక్షరమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. గురువారం తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన 30వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ నేడు ప్రపంచంలో డిజిటల్ పరిజ్ఞానం వేగవంతంగా ముందుకు వస్తున్నప్ప టికీ పుస్తకాల ప్రాధాన్యం మాత్రం తగ్గలేదన్నారు. ప్రపంచానికి గొప్ప సాహితీవేత్తలను అందించిన ఘనత తెలంగాణాదే అన్నారు. భవిష్యత్ తరాలకు చరిత్రలను అందించేది పుస్తకమే అన్నారు. పుస్తకాలే తెలంగాణ పునాదులుగా పనిచేశాయన్నారు. పుస్తకాలే జ్ఞాన దేవాలయాలు: రాములు సమాజంలో పుస్తకాలే జ్ఞాన దేవాలయాలని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రధానంగా దోహదపడేది పుస్తకమే అన్నారు. పుస్తకం అనేది జ్ఞాన నిధి.. రేపటి భవిష్యత్ నిర్మాణానికి పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఏడీజీ హెడ్ ఆఫ్ పబ్లికేషన్ డాక్టర్ సాధన గౌడ్, ఎమ్మెల్యే పుట్ట మధు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రాజు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్ఫెయిర్ కార్యదర్శి కె.చంద్రమోహన్, కన్వీనర్ ఎస్.మధు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే.. బంగారు తెలంగాణ: లక్ష్మణ్ సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఆచరణలో సాధ్యమవు తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. పుస్తకాలే మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు దోహద పడుతాయన్నారు. అనేక సంచార జాతుల బతుకులను, జీవన విధానాలను పుస్తక రూపంలో అందించాలని కోరారు. ఎన్టీఆర్ స్టేడియం మైదానాన్ని ఇతర నిర్మాణాలకు తావివ్వకుండా క్రీడా మైదానంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. -
క్రీడా నైపుణ్యం వెలికి తీసెందుకు పోటీలు దోహదం.
గుడివాడ : క్రీడాకారులలో ఉన్న నైపుణ్యం వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని మున్సిపల్ చైర్మన్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఖేలో ఇండియా జిల్లా ఖోఖో బాలబాలికల అండర్ 14, అండర్ 17 విభాగాల పోటీల టోర్నమెంట్ను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 13 నియోజక వర్గాలకు చెందిన బాలబాలికలు ఈ పోటీలకు రావటం అభినందనీయమన్నారు. సభకు జిల్లా డీఎస్డీఓ సీరాజుద్దీన్ అధ్యక్షత వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.1500 ద్వితీయ బహుమతిగా వెయ్యి రూపాయలు, మూడో బహుమతిగా రూ.500 వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. మొదటి రోజు అండర్ 14 విభాగం మంగళవారం అండర్ 17 విభాగాల వారికి ఈ పోటీలు జరుగుతామని వివరించారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ చోరగుడి రవికాంత్, ఎంపీడీవో కె.జ్యోతి, ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మడకా ప్రసాద్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కోటిదీపోత్సవం
-
ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరియాలి
ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నగరంలో కన్నుల పండువగా వేంకటేశ్వర వైభవోత్సవాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 12 వరకు వేడుకలు సాక్షి, హైదరాబాద్: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి భాగ్యనగరానికి రావడం మన అదృష్టమని, ఆయనను దర్శించుకునేందుకు నగరవాసులకు ఇది చక్కటి అవకాశమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వారు చక్కటి ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారని, పరిపుష్టంగా, ఉత్కృష్టంగా సాగే ఈ వేడుకలతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. టీటీడీ, హిందూధర్మ ప్రచార పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించిన ‘శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవములు-2016’ అంకురార్పణకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీసమేతంగా పాలుపంచుకున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆరు రోజుల పాటు జరుగను న్న ఈ వేడుకలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మందిరం, గుడి గోపురం, ఆలయ ప్రాంగణం, శ్రీలక్ష్మీ, భూదేవీ సమేతుడై కొలువుదీరిన ఏడుకొండలవాడి విగ్రహం భక్తజనసందోహాన్ని మంత్రముగ్ధులను చేశాయి. వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసిన హర్ష టయోటా అధినేత హర్షవర్ధన్, ఆయన మిత్రబృందాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత సంస్కృతి మహోన్నతమైంది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మానవాళికి శాంతి, సుఖం, సౌభాగ్యం కలగడం కోసం యజ్ఞాలు, యాగాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందని చెప్పారు. ప్రజల్లో ధర్మ అనురక్తి పెరగడం కోసం, మనసుకు శాంతిని, సంకల్ప బలాన్ని అందజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. సీఎం కేసీఆర్ మానవాళి శాంతి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇటీవలే అయుత చండీయాగం చేశారని ఆయన గుర్తు చేశారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు మహోన్నతమైనవని, యావత్తు మానవాళి సంక్షేమం కోసం పాటుపడడం ఈ సంస్కృతి గొప్పతనమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేంద్రభారతి ప్రవచనములు ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూ ర్తి, ఈవో సాంబశివరావు, టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి హైదరాబాద్ లో ఎగ్జిబిషన్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలకు విస్తృత స్థాయిలో మార్కెటింగ్ కల్పించే ఉద్దేశంతో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన - 2016 నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ డైరక్టర్ శైలజా రామయ్యర్ వెల్లడించారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన జనవరి 18వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్లో శైలజా విలేకరులతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి 68 చేనేత సహకార సంఘాలు, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల హ్యాండ్లూమ్ సొసైటీలు రూపొందించిన వందకు పైగా వైవిధ్యమైన చేనేత ఉత్పత్తులను ఈ వస్త్ర ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. త ఏడాది జనవరిలో నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శన ద్వారా రూ. రెండు కోట్ల మేర లావాదేవీలు నిర్వహించామని.. అదే ఈ ఏడాది రూ.2.50 కోట్ల మేర అమ్మకాలు జరిగే అవకాశం వుందని శైలజా రామయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో నాలుగు ప్రత్యేక చేనేత ప్రదర్శనలు, జిల్లా స్థాయిలో పది వస్త్ర ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారైన అధునాతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను ఒకే వేదికపై అందుబాటులోకి తేవడమే జాతీయ వస్త్ర ప్రదర్శన ప్రధాన ఉద్దేశమన్నారు. గతంలో చేనేతతో పాటు ఇతర ఉత్పత్తులు కూడా ప్రదర్శించారని.. కాగా ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కేవలం చేనేత మగ్గాలపై తయారైన వాటినే మాత్రమే ఈ ప్రదర్శనకు అనుమతిస్తామన్నారు. -
పుస్తక ప్రియుల సందడి
-
‘పవన్ కల్యాణ్ హటావో’ పుస్తక రచయితకు పోలీస్ భద్రత
సాక్షి, హైదరాబాద్: ‘పవన్ కల్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్కు ప్రభుత్వం పోలీస్ భద్రతను కల్పించింది. శుక్రవారం నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్లో స్టాల్ నంబర్ 306లో ఆయన రాసిన పుస్తకాన్ని విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్తో పాటు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు. తనకు పోలీస్ భద్రత కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శ్రీనివాస్కు భద్రత కల్పించాల్సిందిగా హోం మంత్రి నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. పవన్కల్యాణ్ రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చాక వివిధ సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరును ఈ పుస్తకంలో వివరించానని శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు. -
అయుతం.. అద్భుతం!
ప్రతిష్టాత్మక క్రతువుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం ♦ అంగరంగ వైభవంగా జరగనున్న అయుత చండీయాగం ♦ 30 ఎకరాల్లో ఏర్పాట్లు.. రూ.20 కోట్లపైనే వ్యయం ♦ దాదాపు 4 వేల మంది బ్రాహ్మణులు ♦ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పండితులు ♦ యజ్ఞగుండాలకు దాదాపు 12 టన్నుల నైవేద్యం ♦ నిత్యం కుంకుమార్చనలు, నవగ్రహ జపాలు, అభిషేకాలు ♦ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, పలువురు సీఎంలకు ఆహ్వానం ♦ హాజరయ్యేందుకు ప్రణబ్ ముఖర్జీ సంసిద్ధత ♦ నిత్యం 30 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా.. ♦ అందరికీ భోజన ఏర్పాట్లు ♦ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహణ సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, విమర్శల హోరు ఎగిసినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లటమే ఆయన ప్రత్యేకత! గతంలో ఉద్యమ నేతగా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదే పంథా! ఇదే కోవలోనే ఇప్పుడు ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా అయుత చండీయాగానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ నేలపై చండీయాగం అనగానే వెంటనే గుర్తుకొచ్చేపేరు కేసీఆర్. ఉద్యమ నేతగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా మానసిక దృఢత్వానికి ఆయన దైవాన్ని కూడా నమ్ముకుంటారనే పేరుంది. ఈ కోవలోనే ఆయన చండీ అమ్మవారిని ఆరాధించటం ఆనవాయితీగా చేసుకున్నారు. నవ చండీయాగం, శత చండీయాగం, సహస్ర చండీయాగం.. ఇలా వివిధ సందర్భాల్లో ఆయన ఆరు పర్యాయాలు ఈ యాగాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి హోదాలో మరోసారి చండీయాగానికి సిద్ధపడ్డారు. ఈసారి చాలా అరుదుగా నిర్వహించే అయుత చండీయాగాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అమ్మవారి యాగాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ‘అయుతం’ అంటే పదివేలు. చండీ సప్తశతీ స్తోత్రాలను పదివేల మార్లు పారాయణం చేస్తూ తర్పణాలు వదలటమే ఈ అయుత చండీయాగం. ఉద్యమ సమయం నాటి మొక్కు గతంలో టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ ప్రాంగణం సహా వివిధ ప్రాంతాల్లో చండీయాగాలు నిర్వహించిన కేసీఆర్ ఈ ప్రతిష్టాత్మక అయుత చండీయాగానికి మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ దీనికోసం 30 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో కేవలం యాగశాలకే 5 ఎకరాలు కేటాయించారు. డిసెంబరు 23 నుంచి 27 వరకు ఈ యాగం జరగనుంది. దీనికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీని కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు రానున్నందున యాగానికి హాజరయ్యేందుకు రాష్ట్రప్రతి ప్రణబ్ అంగీకరించినట్టు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలను కూడా ఆయన ఆహ్వానించనున్నారు. గవర్నర్ నరసింహన్ను మంగళవారమే ఆహ్వానించారు. కేసీఆర్ దీన్ని పూర్తిగా సొంత కార్యక్రమంగానే నిర్వహించనున్నారు. ఇందుకు దాదాపు రూ.20 కోట్ల వరకు వ్యయం చేస్తున్నట్టు సమాచారం. దశాబ్దాల కోరిక ‘తెలంగాణ’ కల సాకారమైనందున ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారని, ఉద్యమ సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునే క్రమంలోనే నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ యాగం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దీన్ని కవర్ చేసేందుకు జాతీయ మీడియా కూడా ఎర్రవల్లికి రాబోతుండటం విశేషం. యజ్ఞ విశేషాలివీ.. ► ఈ యజ్ఞంలో పాలుపంచుకునే రుత్విక్కులు, ఇతర బ్రాహ్మణులు ఉప్పు, కారం అతి తక్కువగా ఉండే భోజనాన్నే స్వీకరిస్తారు. సాధారణ ఉప్పుకు బదులు సైంధ వ లవణాన్ని స్వల్ప మోతాదులో వంటల్లో వాడతారు. అందుకే వీరి కోసం ప్రత్యేకంగా వంటలు సిద్ధం చేయనున్నారు. ► చండీయాగంలో శృంగేరీ విధానం ప్రత్యేకం. అందుకే అయుత చండీయాగాన్ని శృంగేరీ శ్రీ భారతీతీర్థస్వామి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్వామి శిష్యులైన కరీంనగర్ వాస్తవ్యులు పురాణం మహేశ్వర శర్మకు యజ్ఞ బాధ్యతలు అప్పగించారు. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పౌరాణికులు హాజరవుతున్నారు. వీరందరికీ అదే ప్రాంగణంలో ప్రత్యేక బస ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం వేల మంది యాగాన్ని తిలకించేందుకు వస్తారని అంచనా వేస్తున్నందున ప్రతిరోజూ 30 వేల మందికి సరిపడేలా భోజన ఏర్పాట్లు చేయనున్నారు. ► యాగం కోసం ఐదెకరాల సువిశాల స్థలంలో వంద హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గుండం వద్ద 11 మంది రుత్విక్కులు కూర్చుని పారాయణం చేస్తారు. ► నిత్యం కుంకుమార్చనలు, సువాసినీ పూజలు, నవగ్రహ జపాలు, మహారుద్ర పురచ్ఛరణ అభిషేకాలు, ప్రవచనాలు, సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తారు. ► వేద పండితులు పాలకుర్తి నృసింహారామ సిద్ధాంతి, పట్లూరి మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాప్రేలతో పాటు ఇతర పండితులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ► ప్రముఖులు రానున్నందున వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గాల్లో కొత్తగా రోడ్లను నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సుందరంగా మారుస్తున్నారు. చాలా అరుదుగా.. నవ, శత, సహస్ర చండీయాగాలు ని ర్వహించటం సాధారణమే అయినా... అ యుత చండీయాగాలను చాలా అరుదుగా నిర్వహిస్తుంటారు. గతంలో శ్రీ శృంగేరీ శారదాపీఠంలో 2011లో భారతీతీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో, 2014లో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పరిపూర్ణానందస్వామి నిర్వహణలో 12 రోజుల పాటు అతిరుద్ర సహిత అయుత చండీయాగం నిర్వహించారు. గత మార్చిలో మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేటలోని శ్రీ దుర్గాభవానీ క్షేత్రంలో శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో జరిగింది. -
6 ఎకరాల్లోనే కళాభారతి నిర్మిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన 14 ఎకరాల స్థలంలో కేవలం ఆరు ఎకరాలను మాత్రమే కళాభారతి నిర్మాణం కోసం ఉపయోగిస్తామని, మిగిలిన స్థలాన్ని వాకర్స్, పార్కింగ్, పచ్చదనం, ఇతర అవసరాల కోసం వదిలేస్తామని జీహెచ్ఎంసీ సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో 10 ఎకరాల స్థలం ఉందని, ఇందులో 9 ఎకరాల స్థలంలో పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉంటుందని తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపి తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన 14 ఎకరాల భూమిని తెలంగాణ కళాభారతి నిర్మాణంకు సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ గత నెల 23న పురపాలకశాఖ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్కు చెందిన ఎ.సుధాకర్ యాదవ్ ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మా తపనంతా పిల్లల గురించే...
క్రీడా మైదానాలు ఉండడం లేదని హైకోర్టు ఆవేదన శివాజీపార్కు లేకుంటే గవాస్కర్, సచిన్ గొప్ప క్రికెటర్లు అయ్యేవారా? ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణంపై కోర్టు వ్యాఖ్య పిల్లలు ఆడుకోవడానికి ఎంత స్థలం కేటాయిస్తారో చెప్పండి టీ సర్కార్కు హైకోర్టు ఆదేశం.. విచారణ 20కి వాయిదా హైదరాబాద్: ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్న హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణం చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తోందని అనలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ తపన ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న ప్రజల గురించి కాదని, పిల్లల గురించేనని స్పష్టం చేసింది. నగరీకరణ నేపథ్యంలో చిన్నారులు ఆడుకోవడానికి సరైన మైదానాలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ముంబైలో శివాజీ పార్కు లేకుంటే గవాస్కర్, సచిన్ గొప్ప క్రికెటర్లు అయ్యేవారా.. వారు ప్రపంచస్థాయి క్రీడాకారులు అయ్యారంటే అది ఆ మైదానం ఘనతే. చిన్నప్పుడు నేను కూడా అక్కడే ఆడుకున్నా. హైదరాబాద్లోనూ క్రీడామైదానాలు ఉండి తీరాలి.’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే వ్యాఖ్యానించారు. స్టేడియంలో కళాభారతి నిర్మాణం పోను పిల్లలు ఆడుకునేందుకు ఎంత స్థలం కేటాయిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. స్టేడియం పక్కనే ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిం చింది. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి. భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన 14 ఎకరాల భూమిని కళాభారతి నిర్మాణం కోసం సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ గత నెల 23న పురపాలకశాఖ జారీ చేసిన జీవో 73ను సవాలు చేస్తూ ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ డాక్టర్ ఎ.సుధాకర్ యాదవ్ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం తాజాగా మంగళవారం దీనిని మరోసారి విచారించింది. 14 ఎకరాల భూమిలో ఎంత విస్తీర్ణంలో కళాభారతి నిర్మిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. 6 ఎకరాల్లో కళాభారతి నిర్మాణం జరుగుతుందని, మిగిలిన స్థలాన్ని వదిలేస్తామని, దానిని వాకర్లు వాడుకోవచ్చని రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ తపన మంచిదే. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలన్న భావనతో ఉన్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కళాభారతిని నిర్మిస్తున్నట్లు చెబుతోంది. ఇందులో తప్పేమీ లేదు. కాని మైదానాలు లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటో ఆలోచించాలి..’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ, ఎన్టీఆర్ స్టేడియం పక్కనే కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందని.. అందులోని విద్యార్థులు సైతం ఎన్టీఆర్ స్టేడియంలోనే ఆడుకుంటారని తెలి పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఆ కాలేజ్ స్థలాన్ని కూడా పిల్లలు ఆడుకునేందుకు అందుబాటులోకి తెస్తే బాగుంటుంది కదా.. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించండని ఏజీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహా రంలో తాము కోరిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. -
సేవ్ ఎన్టీఆర్ స్టేడియం..సేవ్ ఇందిరాపార్క్
మారేడ్పల్లి (హైదరాబాద్) : సేవ్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ అనే నినాదాలతో లోక్సత్తా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఈస్ట్మారేడుపల్లిలోని తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు మిస్డ్కాల్, పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్కుల స్థానంలో తెలంగాణ భవన్, వినాయక్సాగర్ను నిర్మించాలని తలపెట్టటం సరికాదని అన్నారు. వాటిని వేరేచోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు తమతో కలసి పాల్గొనదలచిన వారు 8688047100 నంబర్కు మిస్ట్ కాల్ చేయాలని, లేదంటే పోస్టు కార్డు ద్వారా కేసీఆర్కు నిరసన లేఖలు రాయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆయన మిస్డ్ కాల్ బ్యానర్ ఆవిష్కరించి, పోస్టు కార్డు రాస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. -
కళాభారతి డిజైన్కు సీఎం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మించతలపెట్టిన ‘తెలంగాణ కళాభారతి’ డిజైన్కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణ చరిత్రను స్ఫురణకు తెచ్చేలా... వారసత్వ కట్టడాలకు అద్దం పట్టేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కళాభారతి కోసం డిజైన్ రూపొందించారు. 14 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ కట్టడానికి కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం పౌర సంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిలో 4 ఆడిటోరియాలను నిర్మిస్తారు. వాటిలో 500, 1,000, 1,500 మందికి సరిపడే మినీ, మీడియం ఆడిటోరియాలతో పాటు 3,000 మంది పట్టే పెద్ద ఆడిటోరియం కూడా ఉంటుంది. 125 ఇన్టూ 125 చదరపు మీ టర్ల వైశాల్యంలో లక్షా ఇరవై ఐదు వేల చదరపు అడుగుల మేర కళాభారతిని నిర్మిస్తారు. అందమైన ప్రాంగణం.. సకల సౌకర్యాలు కళాభారతి ప్రాంగణంలో ఆహ్లాదాన్ని కలి గించే పచ్చిక బయళ్లు, నీటి కొలనులు, ఫౌంటేన్లను నిర్మిస్తారు. రెండు వైపులా పెద్ద గేట్లు, తూర్పు వైపున ఆర్చ్తో కూడిన ప్రధాన గేటు ఉంటుంది. కళాభారతిలో అంతర్భాగంగానే అత్యాధునిక థియేటర్, ప్రివ్యూ థియేటర్, కళాకారుల శిక్షణ- రిహార్సల్స్ కోసం ప్రత్యేక హాళ్లు, లైబ్రరీ, ఆర్ట్ మ్యూజియం గ్యాలరీ, పెయింటింగ్ గ్యాలరీ, శిల్పాకృతుల గ్యాలరీ, వీఐపీ లాంజ్, మీడియా లాంజ్లు ఉంటాయి. 25, 50, 100 మందితో సదస్సులు నిర్వహించుకోవడానికి 3 సెమినార్ హాళ్లు, డార్మిటరీ సౌకర్యం, అతిథి గృహాలు, మూడు రెస్టారెంట్లు, 40 గదులు, 10 సూట్లు, 1,000 మంది పట్టే ఫుడ్ కోర్టు ఉంటాయి. లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ వంటి విభాగాల నిర్వహణ కోసం కార్యాలయాల నిర్మాణం కూడా ఇందులోనే ఏర్పాటు చేయనున్నారు. -
సంక్రాంతి సందడి
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను మంగళవారం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలు దువ్వుతున్న పందెం కోళ్లతో స్పీకర్ కోడెల, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చిత్రంలో జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, మంత్రి రావెల, నన్నపనేని రాజకుమారి, కలెక్టర్, జేసీ తదితరులు సాక్షి, గుంటూరు : జిల్లా కేంద్రం గుంటూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మంగళ వారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలు ఆహూతులను అలరించాయి. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అధ్యక్షత వహించారు. స్పీకర్ కోడెల మాట్లాడుతూ, సంక్రాం తిని అందరి పండుగగా అభివర్ణించారు. ఠవ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆశీస్సులతో 1.31 కోట్ల మందికి సంక్రాంతి కానుకగా చంద్రన్న సరుకులు పంపించామన్నారు. ఎక్కువ దిగుబడి సాధించిన రైతులకు చంద్రన్న పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి రావెల కిషోర్బాబు మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాలు సంతోషంతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రన్న కానుకను పంపించారని పేర్కొన్నారు. కలెక్టర్ కాంతిలాల్దండే మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబం పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో 12.79 లక్షల రేషన్కార్డులకు చంద్రన్న సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు చక్కని స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మద్దాలి గిరితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆకట్టుకున్న స్టాల్స్ ... సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. పశువుల అందాల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మత్స్యశాఖ ఏర్పాటు చేసిన చేపల ప్రదర్శన, ఉద్యానవన శాఖ పండ్ల ప్రదర్శన, నెడ్క్యాప్ సౌరవిద్యుత్ పరికరాలు, ఐసీడీఎస్ పిండి వంటలు, కోడి పుంజుల ప్రదర్శన కబడ్డీ పోటీలు, రంగవల్లులు, బొమ్మల కొలువు, వేడుకలు తిలకించేందుకు వచ్చిన ప్రతిఒక్కరినీ అబ్బురపరిచాయి. రైతులకు పురస్కారాలు గుంటూరు స్పోర్ట్స్ : సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డులను పి.రామ కృష్ణ, (మండేపూడి అమరావతి మండలం) మేకల లక్ష్మీనారాయణ (రావెల, తాడికొండమండలం), ముత్తవరపు సిద్ధార్థ వెంకటరామయ్యలకు అందజేశారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులు వ్యవసాయ శాఖ-ముదావత్ సోమలనాయక్, పెద్ది నరసింహారావు, గుత్తికొండ రామాంజనేయులు, మాదాల సురేంద్ర, జాష్టి హరిబాబు. పశు సంవర్ధక శాఖ- కొలసాని రమణమూర్తి, కుంట వెంకటకోటయ్య, చేకూరి జార్జిబాబు. ఉద్యానవన శాఖ-1- పొన్నెకంటి శ్రీరాంబాబు. ఉద్యానవన శాఖ-2- మేక దివాకర్ చౌదరి. పట్టు పరిశ్రమల శాఖ- పారా వెంకటేశ్వర్లు. మత్స్యశాఖ- పెనుమచ్చు నాగరాజు, మంతెన కరుణరాజు. విద్యుత్శాఖ- ముద్దులూరి చంద్రశేఖర్. సూక్ష్మ నీటి పథకం- నెక్కంటి కృష్ణప్రసాద్లకు సంక్రాంతి పురస్కారాలను అందజేశారు. ఉత్తమ అధికారులుగా వ్యవసాయ శాఖకు చెందిన పి.రామాంజనేయులు, ఎన్.సరళ, వి.బుష్లు. పశు సంవర్ధక శాఖ- కె.చంద్రశేఖర్రెడ్డి, మత్స్యశాఖ - ఎ.వి.రాఘవరెడ్డిలు. బ్యాంకింగ్ రంగం- కె.శ్రీనివాసులు, జె.ఆంజనేయులు చంద్రన్న పురస్కారాలు అందుకున్నారు. -
ముస్లీంరిజర్వేషన్లపై మండిపడ్డ VHP నేత
-
మహా సంగమం
-
వైభవంగా ముగిసిన పుస్తకాల జాతర
కాలాలె న్ని మారినా ‘‘పుస్తకం’’ మాత్రం చిరంజీవిగా వ ర్ధిల్లుతూనే ఉంటుందని హైదరాబాద్లో జరిగిన పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. డిసెంబర్ 17 నుంచి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ పుస్తక ప్రదర్శన నగరంపై చెరిగిపోని ముద్రవేసింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ప్రజలు పాల్గొన్న అతిపెద్ద పండుగగా ఇది నిలిచింది. వైద్యులు రోగుల దగ్గరకు వెళ్లాల ని ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నార్మెన్ బెతూన్ పిలుపు నిస్తే పాఠకుల దగ్గరకు పుస్తకాన్ని తీసుకుపోవాలని, నెత్తిన పుస్తకా లు పెట్టుకొని మోసినవాడు ‘‘ప్రజల మనిషి’’ వట్టికోట ఆళ్వా రుస్వామి. ప్రజల కోసం జన హితం కోరి మాటలు కట్టిన కవి కాళోజీ నారాయణరావు ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ఫెయిర్ 2014 అత్యంత ఘనంగా జరిగింది. మున్నెన్నడూలేని విధంగా లక్షలాది మంది పుస్తక ప్రియులు ఈ బుక్ఫెయిర్లో పాల్గొన్నారు. పుస్తకాలు చదవటం తగ్గిందని చెబుతున్న ఈ డిజిటల్ యుగంలో పుస్తక ప్రియులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన డం అపూర్వం. కాలాలెన్నిమారినా ‘‘పుస్తకం’’ మాత్రం చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉందని ఈ పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అతి పెద్ద పుస్తకాల పండుగగా ఈ ఏడాది బుక్ఫెయిర్ నిలు స్తుంది. ఈ పుస్తక ప్రదర్శనకు అపూర్వ ఆదరణ లభించ టమేగాక లక్షలాది పుస్తకాల విక్రయం కూడా జరిగింది. హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగే వినాయక చవితి, దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగల్లాగా ఈ పుస్తకాల పండుగ వైభవంగా జరిగింది. పండుగలకు కొత్త బట్టలు కుట్టించుకున్నట్లుగా ఈ పుస్తకాల పండుగలో పాల్గొని కొత్త పుస్తకాలను కొనుక్కునిపోయారు. అన్ని దినపత్రికల సంపాదకులు, అన్ని రాజకీయ పార్టీల నాయ కులు, తెలంగాణ పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకు లు, విద్యార్థులు, సబ్బండ వర్ణాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్న అతిపెద్ద పండుగగా ఇది నిలిచింది. ఈ పుస్తక ప్రదర్శనలో యువతరం ప్రాతి నిధ్యం బాగా పెరగడం వల్ల ఈ పండుగకు కొత్త అందం వచ్చినట్లయింది. డిసెంబర్ 17 నుంచి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ పుస్తక ప్రదర్శన నగరంపై చెరిగి పోని ముద్ర వేసింది. ఇప్పటి వరకు 28 పుస్తక ప్రదర్శ నలు జరిగాయి. ఇన్నేళ్లకాలంలో ఈ స్థాయిలో జనం పోటెత్తి రావటం మాత్రం ఈసారేనని పలువురు పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శన విజయవంతం వెనుక ప్రచార ప్రసార సాధనాల పాత్ర మరువలేనిది. బుక్ ఫెయిర్ సందర్భంగా పలు రంగాలకు చెందిన వారు విలువైన సందేశాలు ఇచ్చారు. తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ఎగిసిన కలాలు తమ గొంతు విప్పి ఆ ప్రాంగణంలో కవి సమ్మేళనమయ్యాయి. గోరటి వెంకన్న, సుద్ధాల అశోక్తేజ, దేశపతి శ్రీనివాస్, జయరాజ్లు తమ కంఠాలు విప్పి సాహిత్య సాంస్కృతిక సౌరభాలను వెదజ ల్లారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్, అల్లం నారా యణ, దిలీప్రెడ్డి, టంకశాల అశోక్, వీరయ్య, ఎం.వి.ఆర్. శాస్త్ర పుస్తక ప్రదర్శనలో అక్షరాయుధాలను లిఖించారు. రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, టి.హరీష్రావులు పుస్తక ప్రదర్శనకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు. న్యాయాధిపతులు చంద్రకుమార్, జింబోలు ఆ సభల్లో పాల్గొని పుస్తక పఠనంపై తీర్పులిచ్చారు. మెరిసే అక్షరాల వెనుక కష్టజీవులున్నారని వరవరరావు ఉద్యమాక్షరాలను చదివారు. సిధారెడ్డి, జూకంటి, జయధీర్, ఎస్.వి, నాళే శ్వరం, జగన్రెడ్డి, నిఖిలేశ్వర్, సుంకిరెడ్డిల దగ్గర నుంచి పులిపాటి గురుస్వామి వరకు ఎందరెందరో కవులూ, రచ యితలు ఆ ప్రాంగణాన్ని తమ కలాలతో కదంతొక్కారు. రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, కోదండరామ్లు పుస్తక ప్రపం చాన్ని గూర్చి సందేశాలిచ్చారు. సుమారు 4లక్షల మంది పుస్తక ప్రియులు పాల్గొన్న ఈ పుస్తక ప్రదర్శనను కనీసం 20 రోజులుగా నిర్వహిం చాలని పలువురు కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈ బుక్ఫెయిర్కు సంపూర్ణ సహకారం లభించిం ది. వచ్చే ఏడాది హైదరాబాద్లో వరల్డ్ బుక్ఫెయిర్ నిర్వ హిస్తామని, పుస్తకాలను పాఠకుల దగ్గరకు తీసుకుపోయే ప్రక్రియలో భాగంగా ప్రతి జిల్లాలో ఈ బుక్ఫెయిర్ను నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వచ్చే ఏడాది పుస్తకాల పండుగ కోసం అందరం ఎదురు చూద్దాం. పుస్తకం వర్థిల్లాలి. జ్ఞాన సమాజం జిందాబాద్. (వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు) -
పుస్తక ప్రియుల కిటకిట
బుక్ ఫెయిర్కు పుస్తక ప్రియులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో ఎన్టీయార్ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రదర్శనకు జంట నగరాల నుంచి సందర్శకులుతరలివచ్చారు. స్టాల్స్ అన్నీ కిటకిటలాడాయి. చిన్నా పెద్దా అందరూ సందడి చేశారు. కవాడిగూడ: పుస్తకాలు లేని ఇల్లు.. కిటికీలు లేని గదులతో సమానం. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు మన పెద్దలు. కొనాల్సిన పుస్తకాలు అపరిమితం. డబ్బులు మాత్రం పరిమితం. అయితే ఓ ప్లాన్ ప్రకారం బుక్ఫెయిర్లో షాపింగ్ చేస్తే మంచి పుస్తకాలు కొనుక్కోవడంతోపాటు మనం అనుకున్న దానికన్నా ఒకటి రెండు ఎక్కువ కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంది. హైదరాబాద్ మహానగరంలో గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్న బుక్ ఫెయిర్కు ఈసారీ పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగరం నలు మూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడం, సందర్శన వేళలు ఎక్కువగా ఉండడంతో పలు ప్రాంతాలనుంచి పుస్తకప్రియులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద భారీ క్యూ కన్పించింది. కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చి వారికికావాల్సిన పుస్తకాలు కొనుగోలు చేశారు. పుస్తక ప్రదర్శనను తిలకించేవారు, పుస్తకాలను కొనుగోలు చేసుకునే వారు, చాలా కాలంగా ఫలానా పుస్తకాన్నే కొనాలనుకునే వారు ప్రదర్శనకు విశేషంగా విచ్చేస్తున్నారు. ‘ప్లానింగ్’ ఉంటే మంచి పుస్తకాలు కొనొచ్చు... ప్రదర్శనలో కళ్లముందు దర్శనమిచ్చే ప్రతి పుస్తకంలో మనకు ఉపయోగపడే జ్ఞానం ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన పరిజ్ఞానం ఉంటుంది. మనలోని మానసిక పరిణితి స్థాయిని పెంచే విషయాలూ ఉంటాయి. వీటన్నింటినీ కొనుగోలు చేయాలంటే జేబు నిండా ఆర్థిక వనరు ఉండాలి. మన వద్ద జేబులో ఉన్న డబ్బులతో మనకు కన్పించే మంచి పుస్తకాలే ఖశ్చితంగా కొంటాము. కానీ, కొంచెం ముందుకెళ్లాక.. ఇంకా మంచి పుస్తకాలు, మన మనసుకు నచ్చిన, మనం ఎప్పటి నుంచో కొనాలని ఎదురు చూస్తున్న పుస్తకాలూ తారసపడొచ్చు. అప్పుడు కొంత బాధనిపిస్తుంది. ఇదంతా పుస్తకాల కొనుగోలు పట్ల సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వల్లే అని చెప్పవచ్చు. ఇందుకు కొన్ని సూత్రాలు పాటిస్తే ముందుగా మనం అనుకున్న బడ్జెట్లోనే మనకు ప్రీతిపాత్రమైన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. బుక్ఫెయిర్లో మొత్తం 317 స్టాల్స్ ఉన్నాయి. ముందుగా స్టాల్స్ మొత్తాన్నీ ఒక రౌండ్ వేయాలి స్టాల్స్ను రౌండ్ వేస్తున్నప్పుడే మనకు నచ్చిన పుస్తకాలను, వాటి ధరలను, ఆ స్టాల్ నంబర్ ఒక కాగితంపై నోట్ చేసుకోవాలి.