-
ఆగిన ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్కో) ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది. కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఈ నెల 25న ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్లను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. ఈ నెల 17న మీడియాకు విడుదల చేసిన నోట్లో.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ లేక వీలు పడకపోవడంతో.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాం, ఆమెర్ అలీఖాన్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వీల్లేకుండా పోయింది. వాస్తవానికి వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం (29న) నాడే శాసనమండలికి వెళ్లారు. కానీ వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన చాంబర్లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు వారు సిద్ధమవుతున్న సమయంలో స్టేటస్కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నేడు బల్మూరి, మహేశ్కుమార్ల ప్రమాణం శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30కు శాసనమండలి చైర్మన్ చాంబర్లో బల్మూరి వెంకట్, మహేశ్కుమార్ గౌడ్లు మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని కోదండరాం, ఆమెర్ అలీఖాన్లు నిర్ణయించుకున్నారు. -
మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం
-
సీఎంగా రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
-
సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని, దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘మేం పాలకులం కాదు.. మేం సేవకులం.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా’’ అని రేవంత్ చెప్పారు. చదవండి: తెలంగాణ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసింది వీరే -
ఆరు గ్యారెంటీల ఫైల్ పై సంతకం చేసిన రేవంత్ రెడ్డి
-
మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం
-
ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..
-
మరో ఘనత.. సింగపూర్ అధ్యక్ష పీఠంపై భారతీయుడు
సింగపూర్: అంతర్జాతీయ రాజకీయాల్లో మరో భారతీయుడు పతాకశీర్షికలకెక్కారు. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న ఆర్థికవేత్త థర్మాన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన చైనా మూలాలున్న ఎంగ్కోంక్ సాంగ్( 15.72 శాతం ఓట్లు), తన్కిన్ లియాన్ (13.88 శాతం)లను వెనక్కి నెట్టేసి ఏకంగా 70.4 శాతం ఓట్లు సాధించి షణ్ముగరత్నం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అధ్యక్ష భవనం ఇస్టానాలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, భారతీయ మూలాలున్న జడ్జి సుందరేశ్ మీనన్ ఈయనతో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. బహుళ జాతుల, సమ్మిళిత సమాజాభివృద్ధికి కృషిచేస్తానని అధ్యక్ష హోదాలో షుణ్ముగరత్నం హామీ ఇచ్చారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం ఆరేళ్లపాటు అధ్యక్షునిగా పాలన కొనసాగిస్తారు. Tharman Shanmugaratnam was sworn in as Singapore's ninth President on Thursday, September 14, 2023. He was elected in the 2023 presidential election with 70.41% of the vote. Congrats!#Singapore #inauguration #presidentofsingapore #tharmanshanmugaratnam [📸 CNA/Jeremy Long] pic.twitter.com/7JtMOYGLLE — Bryan Toh (@bryan__toh) September 15, 2023 -
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్.. జస్టిస్ ధీరజ్సింగ్కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ప్రమాణం చేసిన అనంతరం.. బాధ్యతల పత్రాలపై సంతకం చేశారాయన. ఆపై సీఎం జగన్ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్సింగ్కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు,హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు బూడి ముత్యాలనాయుడు,తానేటి వనిత, అంబటి రాంబాబు, మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. అనంతరం హై టీ కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ నేపథ్యం.. జమ్మూకశ్మీర్కు చెందిన జస్టిస్ ధీరజ్సింగ్ది న్యాయమూర్తుల కుటుంబం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్సింగ్. న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్కు పేరుంది. ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కోటా నుంచి న్యాయమూర్తులెవ్వరూ లేరు. కాబట్టి.. ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఇకపై నంబర్ 2గా కొనసాగుతారు. త్వరలో ఆయన కూడా వేరే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం
-
Live: సిద్ధరామయ్య అనే నేను...
-
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణంస్వీకారం
-
నేడు కర్ణాటక కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం
-
AP: ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
-
ఏపీ స్థానిక సంస్థల కోటా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పిపికె.రామాచార్యులు నూతన ఎమ్మెల్సీల పేర్లను వరుస క్రమంలో పిలవగా శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుండి ఎన్నికైన పి.రామసుబ్బా రెడ్డి,నెల్లూరు స్థానిక సంస్థల నుండి మేరిగ(Meriga) మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుండి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుండి కుడిపూడి సూర్యనారాయణ రావు,శ్రీకాకుళం స్థానిక సంస్థల నుండి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుండి సుబ్రహ్మణ్యం సిఫాయి, కర్నూల్ స్థానిక సంస్థల నుండి డా.ఎ. మధుసూదన్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు,రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు,రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామాత్యులు మేరుగు నాగార్జున,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట శాసన సభ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు,రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు,ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి,మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్,ఎంఎల్ఏ వరప్రసాద్,పలువురు ఎంఎల్సిలు పాల్గొన్నారు.ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి ఓఎస్డి సత్యానారాయణ రావు,శాసన మండలి ఉప కార్యదర్శి విజయ రాజు ఇంకా పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్.. -
మేఘాలయ సీఎంగా మరోసారి సంగ్మా.. ఈనెల 7న ప్రమాణస్వీకారం!
షిల్లాంగ్: మేఘాలయాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు. గురువారం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 60 స్థానాలకు మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ని ఆయన పార్టీ అందులేకపోయింది. కానీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 32 సభ్యుల బలముందని సంగ్మా తెలిపారు. ఎవరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎన్పీపీకి బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. కాగా.. కాన్రాడ్ సంగ్మా మేఘాయల గవర్నర్ ఫాగు చౌహాన్ను కలిసి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈనెల 7న ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, ఎన్పీపీ ఈసారి విడిపోయి ఒంటరిగా పోటి చేశాయి. బీజేపీ తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో సంగ్మా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. 2018 కంటే ఏడు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్కు చెరో ఐదు సీట్లు వచ్చాయి. ఎన్పీపీ మాజీ మిత్రపక్షం యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ 11 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. త్రిపురలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్లో కూడా బీజేపీ కూటమే విజయం సాధించింది. మేఘాలయలో కూడా ఎన్పీపీకే ఆ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఈ ప్రభుత్వంలో కూడా భాగం కానుంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
ఏపీ కొత్త గవర్నర్ గా ఇవాళ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
-
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా జసిందా ఆర్డెర్న్ గత వారం ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజిలాండ్ గవర్నర్-జనరల్ సిండి కిరో, కొద్దిమంది స్నేహితులు, సహచరుల సమక్షంలో క్రిస్ హిప్కిన్స్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్టి సారిస్తానని 44 ఏళ్ల హిప్ కిన్స్ ఈ సందర్భంగా వాగ్ధానం చేశారు. 2008లో తొలిసారి పార్లమెంట్కు ఎన్నికైన ఆయన 2020లో కోవిడ్–19, పోలీస్శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కాగా జనవరి 19న తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్ అందరిని షాక్కు గురిచేశారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్ పార్టీ సమావేశంలో వెల్లడించారు. కరోనా సంక్షోభం, మైనార్టీ ఊచకోత, ప్రకృతి వైపరీత్యాలు సవాల్ ఏదైనా ఆ సమయంలో ఆమె చూపించిన సంయమనం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ప్రధానమంత్రి పదవికి జకిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. అనంతరం ఆ పదవికి అధికార లేబర్ పార్టీ నుంచి ఎంపీ హిప్కిన్స్ ఒక్కరే నామినేషన్ వేశారు. జనవరి 22న ప్రతినిధుల సభ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు న్యూజిల్యాండ్ సార్వత్రిక ఎన్నికలకు 9 నెలల కంటే తక్కువ సమయం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తాం.. బీజేపీ తీవ్ర అభ్యంతరం -
Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్నాథ్సింగ్, యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్ ఆచార్య దేవవ్రత్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇదీ చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు -
సామాన్యుడికే పెద్దపీట: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల సేవే తన తొలి ప్రాథమ్యమని భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (62) పేర్కొన్నారు. ‘‘టెక్నాలజీ కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణకే అగ్రతాంబూలమిస్తా’’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. మంగళవారం సీజేఐగా రిటైరైన జస్టిస్ యు.యు.లలిత్ నుంచి జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. దైవసాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పురి, కిరణ్ రిజుజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భార్య కల్పనా దాస్తో కలిసి నూతన సీజేఐ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించడం గొప్ప అవకాశం, బాధ్యత అని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా చేతల్లో చూపిస్తానని బదులిచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబరు 10 దాకా రెండేళ్లపాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16వ సీజేఐగా చేసిన ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉండటం విశేషం. అత్యధిక కాలం సీజేఐగా ఉన్న రికార్డు ఆయనదే. తర్వాత 44 ఏళ్లకు ఆయన కుమారుడు చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి కుమారులిద్దరూ సీజేఐ కావడం దేశంలో ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రచూడ్ను ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలంటూ వారిద్దరూ ట్వీట్ చేశారు. జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్) అనంతరం ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం, డాక్టరేట్ ఇన్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎస్జేడీ) చేశారు. ఆయన ప్రస్థానం 1998లో బాంబే హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా మొదలైంది. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. అదే ఏడాది అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. 2013 నుంచి మూడేళ్లపాటు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. చరిత్రాత్మక తీర్పులు అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమలకు రుతుక్రమ మహిళల ప్రవేశం, అవివాహితలకూ 24 వారాల దాకా అబార్షన్ హక్కు తదితర కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్, కమాండ్పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన సారథ్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇటీవల జస్టిస్ యు.యు.లలిత్ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం సభ్యుల అభిప్రాయాల సేకరణకు సర్క్యులేషన్లు జారీ చేసే పద్ధతిని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. అసమ్మతిని స్వాగతిస్తారు అసమ్మతిని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా జస్టిస్ చంద్రచూడ్ అభివర్ణిస్తుంటారు. ఆధార్ చెల్లుబాటును ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించిన తీరు చాలాకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఆధార్ చెల్లుతుందంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో మిగతా నలుగురు వెలువరించిన తీర్పుతో తీవ్రంగా విభేదించారు. యునిక్ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియను డిజిటైజ్ చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తి అని, ఏ అంశం మీదైనా స్పష్టమైన భావాలు కలిగి ఉంటారని, వాటిని అంతే సూటిగా వ్యక్తీకరిస్తారని పేరు. తొలి రోజు ఇలా... బుధవారం బాధ్యతలు స్వీకరించాక మధ్యాహ్న వేళ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులోని సీజేఐ కోర్టు గదిలోకి ప్రవేశించారు. ‘‘ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా బహుశా నా కెరీర్లో తొలిసారి ఆలస్యంగా విధులకు వచ్చాను. మళ్లీ ఇలా జరగదనుకుంటున్నా. ఇంతసేపూ లాయర్లు తదితరులందరినీ వేచిచూసేలా చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా’’ అన్నారు. వాదనలు, కేసుల నిర్వహణల్లో లాయర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా చూస్తానన్నారు. భవిష్యత్తులో కూడా బార్ సహకారం కొనసాగాలని కోరారు. సహచర న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కలిసి విచారణలు ప్రారంభించారు. సమాజ్వాదీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అనర్హత కేసు సహా తొలి రోజు సీజేఐ ధర్మాసనం ముందు 30 ప్రస్తావనలు జరిగాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితర న్యాయవాదులు సీజేఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఫలవతంగా సాగాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. దేశ చరిత్రలో తండ్రీకొడుకులిద్దరూ.. -
తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం
-
రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి ప్రమాణస్వీకారం
-
నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికైన నలుగురు సభ్యులు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్.రమణ (కరీంనగర్), పట్నం మహేందర్రెడ్డి (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్నగర్), డాక్టర్ వి.యాదవరెడ్డి (మెదక్)లతో ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ తన చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎల్.రమణ ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు తరలివచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్ తదితరులు నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. నూతన ఎమ్మెల్సీలకు వేముల ప్రశాంత్రెడ్డి రూల్స్ బుక్, గుర్తింపు కార్డు అందజేశారు. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పట్నం మహేందర్రెడ్డి మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కోటాలో మండలికి ఎన్నికైన మరో ఐదుగురు సభ్యులు దండె విఠల్ (ఆదిలాబాద్), టి.భానుప్రసాద్ (కరీంనగర్), పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి (వరంగల్), శంభీపూర్ రాజు (రంగారెడ్డి), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ) ఫిబ్రవరి మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కసిరెడ్డి. -
AP: ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్ చేత శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు శుక్రవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టిలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి తనకు మండలి సభ్యత్వం ఇవ్వడమే నిదర్శనమని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి సముచిత స్ధానం కల్పించే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. అనంతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలపడుతుందని అన్నారు. కష్టానికి నష్టానికి ఓర్చుకున్న వ్యక్తి అనంత ఉదయ భాస్కర్ తెలిపారు. సీఎం జగన్ అనంతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement