Prank video
-
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్స్ట్రాగామ్లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిరుమల ప్రాంక్ వీడియోపై స్పందించిన ప్రియాంక, శివ
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్, ప్రయాంక ఇద్దరూ తిరుమలకు వెళ్లారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్లోడ్ చేశారు. అయితే, అది భక్తులను భయాందోళలకు గురి చేసేలా ఉండటంతో చాలామంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.'మేము షేర్ చేసిన వీడియోపై చాలామంది శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. మేము తెలియకనే ఈ తప్పు చేశాం. మీ మనోభావాలను గాయపరిచినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాము. ఉద్దేశపూర్వకంగా అయితే వీడియో చేయలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేశాం. అయితే, ఇలా అవుతుంది అని మేము ఏమాత్రం ఊహించలేదు. ఇంతమందిని ఈ వీడియో హర్ట్ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను మేము తక్కువ చేయాలని అనుకోలేదు. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు మేము చేయం. తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మరోసారి ఈ తప్పు జరగదు.' అని వారు ఒక వీడియోతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో
-
తిరుమల కొండ మీద ప్రాంక్ వీడియోలు..
-
శ్రీవారి భక్తులపై ప్రాంక్ వీడియో..
-
తిరుమల క్యూలైన్లో ప్రాంక్ వీడియో.. టీటీడీ సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమలలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, వీడియో అంశాన్ని భక్తులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.కాగా, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుమల లోపల ప్రాంక్ వీడియో కోసం.. నారాయణగిరి షెడ్స్లోని క్యూలో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కలరింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేచారు. దీంతో, వెంటనే సదరు యూట్యూబర్ కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు తీశాడు. ఇదంతా మరో యువకుడు వీడియో తీశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య .. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. • తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియోలు ! #TTFVasan @APPOLICE100 @TTDevasthanams pic.twitter.com/vxJxCwmqMm— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) July 11, 2024 ఇదిలా ఉండగా.. తిరుమల ఆలయంలో క్యూ లైన్లలోకి వెళ్లాలంటే సిబ్బంది ఎన్నో రకాలుగా చెకింగ్స్ చేసి పంపిస్తారు. భక్తుల వద్ద మొబైల్ ఫోన్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారు. కాగా, ఈ వీడియో చేసిన యువకులు ఆలయంలోకి ఫోన్ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది. -
ప్రాణాలు తీసిన ప్రాంక్.. ఫ్రెండ్ను ఫూల్ చేయబోయి విద్యార్ధి మృతి
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రాంక్ల హవా బాగా నడుస్తోంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వారికి ఏదైనా విషయం గురించి చెప్పి భయపెట్టడం.. తరువాత అదంతా ప్రాంక్ అని చెప్పడం ఫ్యాషన్గా మారింది. అయితే కొన్ని సార్లు ఈ చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు చేసిన తన స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇండోర్లోని మల్హర్గంజ్లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్ధి సోమవారం ఏప్రిల్స్ ఫూల్స్డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్పై నిల్చొని మెడకు తాడు బిగించి తను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటనను చూసిన వెంటనే స్నేహితుడు.. అభిషేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు. చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు గమనిక: దయచేసి ఎవరూ ఇలాంటి ప్రాంక్లు ప్రయత్నించవద్దు. చిన్న చిన్న సరదాలకు పోయి.. నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు -
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
అమ్మాయిగా మారి షాకిచ్చిన సీరియల్ హీరో.. ప్రియురాలి కోసమే!
బిగ్బాస్ రియాల్టీ షో ఏడో సీజన్ ప్రారంభమైంది. 14 మంది హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే వీరిలో ఎక్కువ వరకు సీరియల్ నటీనటులే ఉండడం గమనార్హం. వాళ్లంతా పక్కా ప్లాన్తో హౌస్లోకి వచ్చారు. హౌస్లో వాళ్లు ఆడే ఆటకు తగ్గట్లు బయట ప్రమోషన్స్ కూడా ఉండాలని ముందే ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇది ప్రతీ సీజన్లో కంటెస్టెంట్స్ చేసే పనే. అయితే ఈ సారి మాత్రం ప్రమోషన్స్ కాస్త వెరైటీగా అనిపిస్తున్నాయి. బిగ్బాస్లోకి వెళ్లే ముందే వైరల్ అయ్యే వీడియోలను కొన్నింటిని షూట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా బయటకు వదులుతున్నారు. తాజాగా బిగ్బాస్-7 తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియుడితో కలిసి ఫ్రాంక్ వీడియో 'జానకి కలగనలేదు'సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ప్రియాంక జైన్. అంతకు ముందు పలు సినిమాలలో నటించింది. కానీ ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తను కెరీర్ గాడిన పడింది. వరుసగా సీరియల్స్తో స్టార్ నటిగా గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడం కోసమే బిగ్బాస్లోకి వెళ్లింది. అంతకు ముందు ఆమె ప్రియుడు, మౌనరాగం సీరియల్ హీరో శివ కుమార్తో కలిసి ఓ ప్రాంక్ వీడియో చేసింది. అందులో శివకుమార్ లేడి గెటప్లో కనిపించడం గమనార్హం. ప్రియాంక కోసమే తన గెడ్డం తీసేసి అమ్మాయి గెటప్ వేశానని శివకుమార్ చెప్పారు. (చదవండి: నాగార్జునకు రైతు బిడ్డ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) వీడియోలో ఏం ఉంది? ప్రియాంకకు తెలియకుండా ఓ మేకప్ ఆర్టిస్టును పిలుచుకొని అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు శివకుమార్. అనంతరం జానకి కలగనలేదు సీరియల్ నటుడితో కలిసి ప్రియాంక ఇంటికి వెళ్లాడు. తనని తాను ఇందుమతిగా పరిచయం చేసుకొని ఇంట్లోకి వెళ్లాడు. అయితే గెటప్ అయితే మారింది కానీ.. గొంతు మాత్రం అలానే ఉండడంతో ప్రియాంక ముందుగానే అతన్ని పసిగట్టింది. అయినప్పటికీ అతనికి ఆ విషయం చెప్పలేదు. కాసేపయ్యాక నేను ఎప్పుడో గుర్తుపట్టానని చెప్పడంతో శివ కుమార్ తెల్లముఖం వేశాడు. తాను ఫ్రాంక్ చేద్దామనుకుంటే.. ప్రియాంకనే తనను ఫ్రాంక్ చేసిందని శివ చెప్పుకొచ్చాడు. ఎలా గుర్తుపట్టింది? శివ కుమార్ లేడీ గెటప్ అయితే వేసుకున్నాడు కానీ.. చేతికి ఉన్న ఉంగరాలు, రాఖీ తీసేయ్యలేదు. అలాగే గొంతు మార్చి మాట్లాడడంలోనూ విఫలం అయ్యాడు. దీంతో పరిచయం చేసుకున్న కాసేపటికే ప్రియాంక గుర్తుపట్టేసింది. అయితే ఆ విషయం అతనికి చెప్పకుండా.. చివర్లో చెప్పి షాకిచ్చింది. ప్రియాంక బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత ఈ వీడియోని వదిలారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. -
ప్రాంక్ వీడియో.. తెలియక గర్ల్ఫ్రెండ్ ఎంత పని చేసిందంటే!
కరోనా మహమ్మారి అడ్డుకట్టకు కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు దైనిక జీవితంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో గడపడంతో అందరూ టీవీలు, స్మార్ట్ఫోన్లకు అత్తుకుపోయారు. ఈ క్రమంలో సోషల్మీడియాలో చూసే వారి సంఖ్య ఒక్కసారిగా ఎగబాకింది. దీంతో టిక్టాక్ వీడియోలు, షార్ట్ ఫిలింలు, ప్రాంక్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూ కొందరిని ఓవర్నైట్ సెలబ్రిటీలను చేసిన ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి ప్రాంక్ వీడియోలు చేస్తున్న క్రమంలో ప్లాన్ బెడిసి కొట్టి ఇబ్బందలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రాంక్ వీడియోకు ప్లాన్ చేసిన ఓ బాయ్ఫ్రెండ్కు అలాంటి చేదు అనుభవమే ఎదరైంది. అయ్యో.. అక్కడ తగిలిందే ఇటీవల నెట్టింట ప్రాంక్ వీడియోల హవా పెరుగుతోంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల, సన్నిహితుల మీద వీటిని చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సరిగ్గా జరిగితే, ఫన్ వస్తుంది కానీ అది ఏ చిన్న తప్పు జరిగినా మర్చిపోలేని ఘటనగా మారుతుంది. ప్రస్తుతం నెట్టింట్లో దర్శనమిస్తున్న ఓ వీడియోలో.. అందులో ఓ యువకుడు తన గర్ల్ఫ్రెండ్పై ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేస్తాడు. అందుకోసం అతను తన హుడిని రెగ్యులర్గా కాకుండా ఛాతీ వైపు నుంచి ధరిస్తాడు. అతను గోడకు ఆనుకుని నిలబడి తన ముఖాన్ని హూడీతో కప్పుకుని గోడవైపు మొహం పెట్టుకుని నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడి వచ్చిన అతని గర్ల్ఫ్రెండ్ అతని వెనుక నుంచి గట్టిగా కొడుతుంది. అయితే అది వాస్తవానికి అతని ప్రైవేట్ భాగం కావడంతో నొప్పికి అక్కడే కిందపడిపోతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాపం మనోడు అనుకున్నది ఒకటైతే, అక్కడి జరిగింది మరొకటి అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్త అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Reels Parivaar (@reels_parivaar) -
నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్
ప్రస్తుతం బుల్లితెర, టీవీ స్టార్స్ సీరియల్స్తో పాటు సోషల్ మీడియాలోనూ అలరిస్తున్నారు. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే నటి అంజలి, మహేశ్వరి, శ్రీవాణి, బిగ్బాస్ నటి హిమజ, అషురెడ్డితో పాటు పలువురు నటీనటులు సొంతంగా యూట్యూబ్ చానల్ రన్ చేస్తున్నారు. తరచూ హోంటూర్, డైలీ రోటిన్ వీడియోస్తోపాటు డిఫరెంట్ కంటెంట్తో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తమ కో-స్టార్స్కి ప్రాంక్ చేసి ఆటపట్టించి ఏడిపిస్తుంటారు. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే తాజాగా టీవీ నటి మేఘన లోకేశ్ కూడా తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. రీసెంట్గా యూట్యూబ్ చానల్ను ఓపెన్ చేసిన ఆమె తాజాగా తన కో-స్టార్స్, ఫ్రెండ్ని ప్రాంక్కాల్తో చెమటలు పెట్టించింది. నాకు ఎవ్వరూ లేరు అంటూ మేఘన ఈ వీడియో షేర్ చేసింది. ఇక సీరియల్ షూటింగ్స్తో ఫుల్ బిజీగా ఉండే మేఘనా ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. బోర్ కొట్టడంతో ఫ్రెండ్స్కి ప్రాంక్ కాల్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బిగ్బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి.. వరుడు అతనే ఈ క్రమంలో తన ఫ్రెండ్స్, నటి స్వర్ణకి కాల్ చేసి ‘ఇంట్లో ఎవరూ లేరు. నీరసంగా అనిపిస్తోంది. చచ్చిపోతానేమో’ అని అమాయకంగా మాట్లాడింది. దీంతో నటి స్వర్ణ తెగ కంగారు పడిపోయింది. ఇప్పుడే వచ్చేస్తా.. కాల్ కట్ చేయొద్దని భయపడిపోయింది. చివర్లో.. ఇది ప్రాంక్ అని మేఘన చెప్పడంతో ఆమె రిలాక్స్ అయ్యింది. అయినప్పటికీ మేఘన చేసిన పనికి ఆమెకు భయంతో చెమటలు పట్టాయి. అంతేకాదు ఒక్కసారిగా ఆమె కన్నీరు పెట్టుకుంది. చివరికి నేను బాగానే ఉన్నాను అంటూ వీడియో కాల్ చేసి మాట్లాడింది మేఘన. -
ప్రాంక్ పేరిట వెకిలి పని.. పోలీసుల రియాక్షన్
నలుగురికి ఇబ్బంది కలిగించకుండా.. నవ్వించేదే ప్రాంక్ అంటే. అలాంటిది.. ప్రాంక్ పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడే వాళ్లనే ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం. అభ్యంతకరంగా ఉండే కంటెంట్తోనూ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో వాళ్లను అనుసరించే వాళ్ల సంఖ్య సైతం పెరిగిపోతోంది. తాజాగా కేరళలో ప్రాంక్ పేరిట ఇద్దరు యువకులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. బైక్ మీద వెళ్తునే.. జోరువానలో అర్థనగ్నంగా స్నానం చేశారు. పైగా స్నానానికి సోప్ను సైతం ఉపయోగించారు. సిగ్నల్స్ దగ్గర కూడా వాళ్ల వెకిలి చేష్టలు కొనసాగాయి. అయితే.. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. యువకులను భరణిక్కవుకు చెందిన అజ్మల్, బాదుషాలుగా గుర్తించి.. కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన నేరానికి కేసు నమోదు చేసి.. ఐదువేల రూపాయల జరిమానా విధించారు. తాము నవంబర్ 1న సాయంత్రం ఓ స్పోర్ట్స్ ఈవెంట్కు హాజరై వస్తున్నామని, వాన కురుస్తుండడంతో సరదా కోసం అలా ప్రాంక్ వీడియో చేశామని ఇద్దరు యువకులు వెల్లడించారు. -
నాతోనే ప్రాంకా.. ఐస్క్రీం వ్యాపారికి షాక్ ఇచ్చిన బుడ్డోడు.. వీడియో వైరల్
టర్కీలో ఐస్క్రీం వ్యాపారస్థులు కస్టమర్లను భలే ఆటపట్టిస్తుంటారు. కోను చేతిలో పెట్టినట్టే పెట్టి టక్కున వెనక్కి లాగేసుకుంటారు. నోరూరించే ఐస్క్రీం తిందామని వెళ్లిన వారికి ఫ్రస్టేషన్ వచ్చే వరకు ప్రాంక్ చేస్తూనే ఉంటారు. చివరకు కస్టమర్లకు నీరసం వచ్చే టైంలో ఐస్క్రీం చేతిలో పెడతారు. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూశాం. కానీ ఓ బుడ్డోడు ఇలానే ప్రాంక్ చేద్దామనుకున్న ఓ టర్కీ ఐస్క్రీం వ్యాపారస్థుడికి షాక్ ఇచ్చాడు. ప్రాంక్ చేద్దామనుకుంటే చుక్కలు చూపించాడు. ఐస్క్రీం కోను చేతిలో పెట్టి వెనక్కి లాగేసుకుందాం అనే లోపే.. ఈ బుడ్డోడు ఐస్క్రీం ఇచ్చే కర్రను చేతితో బిగ్గరగా పట్టుకున్నాడు. అంతేకాదు ఐస్క్రీం వెండర్ చేతిపై కొట్టాడు. బాల భీముడిలా ఉన్న పిల్లాడి బలం ముందు ఆ వెండర్ నిలబడలేకపోయాడు. ఐస్క్రీం స్టిక్ వెనక్కి తీసుకునేందుకు వంగి వంగి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. చివరకు బుడ్డోడు హీరోలా తన ఐస్క్రీం తీసుకొని హాయిగా తినుకుంటూ వెళ్లాడు. అక్కడున్న వారంతా బుడ్డోడి చర్యను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. View this post on Instagram A post shared by Dinesh Kumar (@black_dancer_dinesh) ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. బుడ్డోడిని అనేక మంది మెచ్చుకుంటున్నారు. ప్రాంక్ చేద్దామనుకుంటే షాక్ ఇచ్చాడు.. చిన్నోడు మామూలోడు కాదు అని కొనియాడారు. చదవండి: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్ -
బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చోటుచేసుకోవడం సహజం. తోటి ఆటగాళ్లను, కోచ్ను ఫ్రాంక్ చేస్తే పర్లేదు. కానీ మైదానంలో గంభీరంగా నిలబడే అంపైర్ను కూడా ఫ్రాంక్ చేయడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ చేయాల్సింది మరిచి అంపైర్ ప్యాంట్ను లాగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన లంకాషైర్ క్రికెట్ లీగ్లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రిస్టన్ క్రికెట్ క్లబ్లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్అప్కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్ లాగాడు. ఇదంతా గమినించిన తోటి ఆటగాళ్లు అక్కడేం జరుగుతుందో ఒక్కక్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత బౌలర్ నవ్వుతూ అంపైర్కు క్షమాపణ చెబుతూ.. ''ఇట్స్ ప్రాంక్'' అని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. కాగా ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందించారు. ''ఆ బౌలర్ ప్రాంక్ చేయడం ఏమో గాని అంపైర్ ప్యాంటు లాగి పరువు మొత్తం తీశాడు''.. ''ఇంకా నయం ప్యాంటు ఒక్కటే లాగాడు.. దాంతో పాటు చెడ్డీ కూడా వచ్చి ఉంటే''.. ''ఎంత ఘోరం జరిగిపోయింది'' అంటూ కామెంట్స్ చేశారు. @ThatsSoVillage the funniest/most village thing to happen at @Rishtoncc Lancashire this weekend. 😂😂😂 pic.twitter.com/oF2qWeZbXk — Tino Hallerenko (@tinohalleron) August 27, 2022 చదవండి: నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే? Asia Cup IND Vs PAK: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్మ్యాన్ -
ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి
Heroine Krithi Shetty Crying In Live Interview: 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్తో నటించిన 'ది వారియర్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కాకుండా సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ సరసన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది. కాగా తాజాగా తమిళనాట జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఇంటర్వ్యూలో ఏడ్చేసింది బేబమ్మ. చదవండి: బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇంటర్వ్యూ జరుగుతుండగా ఇద్దరు యాంకర్లు కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఒకరికొకరు పోటీ పడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్ మరో యాంకర్ను కొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని బేబమ్మ భయపడిపోయింది. అయితే ఆ తర్వాత అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. దానికి ఎవరైన హార్డ్గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝗞𝗿𝗶𝘁𝗵𝗶 𝗦𝗵𝗲𝘁𝘁𝘆 🔵 (@krithi.shetty_shines) -
20 యూట్యూబ్ ఛానెల్స్పై ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి
-
20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కల్యాణి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్పై కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా పెట్టడంతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి వీరిద్దరు కొట్టుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు సైతం వచ్చాయి. చదవండి: పార్టీలో మెరిసిన రష్మిక, ఎందుకలా ఫీలవుతోందని ట్రోలింగ్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
వీడియోలు చేయి డబ్బులిస్తా అన్నాడు, చెంప పగలకొట్టాను : కరాటే కల్యాణి
యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు నెట్టింట హాట్టాపిక్గా మారింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరువురు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. వీడియోల పేరుతో శ్రీకాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, గతంలోనూ అమ్మాయిలను వేధించాడని ఆరోపించింది. 'బిగ్బాస్లో ఛాన్స్ ఇప్పిస్తా, యూట్యూబ్ స్టార్స్ని చేస్తా అని అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను.. నాతో కలిసి అడల్ట్ కంటెంట్ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చి చెంప పగలకొట్టాను. మహిళలతో ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఛానెల్ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి' అని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. -
కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు
యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేశారు. యూసుఫ్గూడలోని ఓ బస్తీ జరిగిన గొడవల ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదరింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ శ్రీకాంత్ ఫేస్బుక్లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా అతడు కరాటే కల్యాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా పేరు శ్రీకాంత్రెడ్డి. మీకు తెలుసు కదా నేను వీడియోలు చేస్తుంటాను. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల మధ్య కరాటే కల్యాణి గారు మా ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అన్నారు. దీనికి నేను నువ్వు బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను’ అని అన్నాడు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ తర్వాత ‘నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని అని చెప్పాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తాను ఏ తప్పు చేయలేదని, కేవలం వినోదం కోసమే వీడియోలు చేస్తుంటున్నానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అలాగే కరాటే కల్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. -
యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి
సాక్షి, అమీర్పేట: యూ ట్యూబర్ శ్రీకాంత్రెడ్డిపై నటి కల్యాణి పడాల (కరాటే కల్యాణి) దాడికి పాల్పడింది. యూసుఫ్గూడ బస్తీలో ఉంటున్న శ్రీకాంత్రెడ్డి ఇంటివద్దకు అనుచరులతో కలిసి వచ్చిన కల్యాణి డబ్బులు డిమాండ్ చేయగా నిరాకరించడంతో నలుగురు కలిసి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫ్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. యూ ట్యూబర్ శ్రీకాంత్రెడ్డి ఇంటి వద్దకు అర్ధరాత్రి కరాటే కల్యాణి మరో నలుగురితో కలిసి వచ్చింది. ఇంట్లో భోజనం చేస్తుండగా గట్టిగా అరుస్తూ కిందకు రావాలని గొడవ చేయడంతో శ్రీకాంత్రెడ్డి కిందకు వచ్చాడు. ఫ్రాంక్ సాకుతో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని బెదిరించింది. రూ.లక్ష ఇస్తే వెళ్లిపోతామంది. ఆమె వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అందుకు నిరాకరించడంతో కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఫ్రాంక్ పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు మహిళలు చెప్పడంతో శ్రీకాంత్రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్తే శ్రీకాంత్రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నాలుగు నెలల చిన్నారితో పాటు తనపై దాడి చేశాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్టైం రికార్డు) -
డోంట్ బీ ప్రాంక్..సరదా కాస్త సీరియస్ ఇష్యూగా..
సాక్షి, హైదరాబాద్, హిమాయత్నగర్: అది జడ్చర్ల బస్టాండ్. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కొందరు యువకులు ప్రత్యక్షమై భిక్షాటన పేరిట ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. డబ్బులు అడుక్కుంటూ మహిళల పాదాల మీద పడ్డారు. వీరి ప్రవర్తన శృతి మించడంతో ప్రయాణికుల్లో సహనం నశించి వారిని పట్టుకుని చితకబాదారు. దాంతో యువకులు ఇదంతా ప్రాంక్ అని రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. దీంతో మరింత అసహనానికి గురైన ప్రయాణికులు వారిని పోలీసులకు అప్పగించబోయారు. అయితే వారు కాళ్లావేళ్లా పడి బతిమాలాడడంతో వదిలేశారు. ఒకటి కాదు రెండూ కాదు ప్రాంక్ వీడియోల పేరిట పలువురు చెలరేగిపోతున్న సంఘటనలు నగరం చుట్టుపక్కల తరచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదంతో మరోసారి ఈ ప్రాంక్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. . ప్రాంక్...యాక్... ఇలాంటి వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో అనేక మంది యూ ట్యూబర్స్ ప్రాంక్ బాట పడుతున్నారు. వీరిలో కొందరు పరిధిలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టని ప్రాంక్ వీడియోలు చేస్తుండగా మరికొందరు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. ఓ లేడీ యూట్యూబర్ తాను చేసే ఓ గేమ్షో కోసం జనాల మధ్య వీడియోస్ చేస్తుంది. మెట్రో రైలులో కింద కూర్చుని కర్చీఫ్ వేసుకుని అడుక్కోవడం మొదలుకుని మెట్రో రైలులో వీరి టీమ్కు చెందిన అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం, ఇతరులను ముద్దు అడగడం వంటివీ చేయిస్తోంది. ఫిర్యాదు చేస్తే చర్యలు... ప్రాంక్ వీడియోల పేరుతో పబ్లిక్ ప్రదేశాలు సహా ఎక్కడా అశ్లీలం, అభ్యంతరకరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇటీవల ఇలాంటి వీడియోలు యూట్యూబ్లోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రాంక్స్ వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రై మ్ ఏసీపీ -
హీరో విశ్వక్ సేన్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
Complaint Of Hero Vishwak Sen: ప్రమోషన్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హ్యుమర్ రైట్ కౌన్సిల్(హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం ‘ఆశోకవనంలో అర్జుణ కల్యాణం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్తో సూసైడ్ ప్రయత్నం చేసుకునే విధంగా ప్రాంక్ వీడియో చేయించింది చిత్ర బృందం. చదవండి: ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ కుమార్ హీరో విశ్వక్ సేన్, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్కు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్ ప్లేస్లో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. చదవండి: ‘హిట్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా మే 6న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమానితో అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్
హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’.విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కోసం చేయించిన ప్రాంక్ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ఫిలింనగర్ రోడ్డులో వెళుతుంటే ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారి ఆలోచించాలా అంటూ చిత్ర యూనిట్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా బాగుంటే ఆడుతుంది. లేకపోతే ఆడియెన్స్ చూడరు. ఇలాంటి జిమ్మిక్కులు వర్కవుట్ కావని ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రాంక్ పేరుతో పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. https://t.co/VXk5VSKO4y#VishwakSen and His Fan Hulchal On #Road | #AshokaVanamLoArjunaKalyanam | Filmylooks #Tollywood — MrB Celeb News (@mrbcelebnews) May 1, 2022 -
హీరోయిన్ బాత్రూమ్లోకి చొరబడ్డ ఫ్యాన్.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు
Sonakshi Sinha Fan Threatens Her In The Khatra Khatra Show: సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి అశేష అభిమానులన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా తన అభిమాని నుంచి వింత అనుభవాన్ని చవిచూసింది సోనాక్షి. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హాకు తన ఫ్యాన్ ఒకరు తనను పెళ్లి చేసుకోమ్మని, లేకుంటే తన గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వెరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్లో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్ రూమ్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా' అని చెబుతాడు. చదవండి: నాలుగో తరగతిలో లైంగిక వేధింపులు.. ఆ దెబ్బతో మళ్లీ చూడలేదు తర్వాత సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.' అని అంటాడు. తర్వాత అక్కడ పరిస్థితులు అంతాగా బాగాలేనట్లు కనిపించింది. అద్దంపై లిపిస్ట్క్తో 'ఐ లవ్ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని సోనాక్షితో ఆ అభిమాని చెబుతాడు. ఇదంతా అర్థంకానీ సోనాక్షి అదేం వద్దూ అని చేతులతో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో ఆవేశానికి లైనైనా ఆ అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా తన జేబులో నుంచి కత్తి తీసి 'నువ్ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను' అని సోనాక్షిని బెదిరిస్తాడు. దీంతో షాక్కు గురైన సోనాక్షి కేకలు వేయడంతో వీడియో ముగుస్తుంది. చదవండి: జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ? అయితే ఈ వీడియో అంతా 'ది ఖత్రా ఖత్రా' షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్ చేశారని తెలుస్తోంది. ఈ షోలో భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ స్పెషల్ హోస్ట్గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్ ఇక్బాల్తో కలిసి డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో నటించనుంది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) చదవండి: నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్ -
ప్రాంక్ వీడియో.. చితకబాదిన ప్రయాణికులు
జడ్చర్ల: ప్రాంక్ వీడియోకోసం భిక్షాటన చేస్తూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి యువకులు దెబ్బలు తిన్న ఘటన జడ్చర్ల కొత్త బస్టాండ్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. జడ్చర్ల కొత్త బస్టాండ్లో మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా కొందరు యువకులు ప్రయాణికుల దగ్గరకు వచ్చి భిక్షాటనతో హడావుడి చేశాడు. డబ్బులు ఇవ్వని వారి పాదాలను పట్టుకున్నారు. మహిళల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రవర్తన హద్దు మీరడంతో అక్కడున్న ప్రయాణికులు వారిని పట్టుకుని చితక బాదారు. దీంతో తాము ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని, ఈ సన్నివేశాలను తమ మిత్రులు రహస్యంగా చిత్రీకరిస్తున్నారని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో సదరు యువకులు ప్రయాణికులకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. (చదవండి: యాప్స్తోనే లక్ష్మీపతి నెట్వర్క్) -
అంపైర్ను ఫ్రాంక్ చేసిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
Rishab Pant Prank On Umpire Anil Chaudary.. ఐపీఎల్ 2021లో కేకేఆర్తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్ అనిల్ చౌదరీని ఫ్రాంక్ చేయడం వైరల్గా మారింది. కేకేఆర్ బ్యాటింగ్ సమయంలో అశ్విన్ బంతిని పరిశీలిస్తుండగా.. అనిల్ చౌదరీ బాల్ బాక్స్ను పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పంత్ అనిల్ చౌదరీ వెనక్కి వెళ్లి.. అతనికి తెలియకుండా కుడి మోచేతిని టికిల్ చేశాడు. వెంటనే అనిల్ తిరిగి చూడగా అక్కడ ఎవరు కనిపించలేదు. దీంతో పంత్ నేనే అంటూ అంపైర్కు చెప్పడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. ఈ వీడియోపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. చదవండి: Rahul Tripathi: ' సిక్స్ కొడతానని ఊహించలేదు' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్మన్ గిల్ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం 24 year old kiddopic.twitter.com/LFvvWBx3UA — Ryan (@RyanIke4) October 13, 2021 -
భర్తతో ప్రాంక్ చేసిన సన్నీ లియోన్.. వీడియో వైరల్
బాలీవుడ్ నటి సన్నీ లియోన్కి ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. జిస్మ్తో హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అయితే తాజాగా ఆమె తన భర్త డేనియల్ వెబర్తో చేసిన ఫ్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. సన్నీ తాళ్లతో కలిపి కట్టిన సీసాలను రెండు చేతుల్లో పట్టుకోమని చెప్పింది. అనంతరం బుక్స్, దానిపై పిండి బుట్టను పెట్టింది. అంత అయిపోయాకా కూడా ఇంకా ఏదో పెడుతున్నట్లు నటించిన ఈ భామ కత్తెరతో తాళ్లను కత్తిరించింది. దీంతో పిండి మొత్తం డేనియల్ ముఖంపై పడింది. దీంతో నువ్వు చాలా స్ట్రాంగ్ అంటూ సన్నీ పగలబడిన నవ్విన ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా వైరల్ అయ్యింది. కాగా సన్నీ అండ్ ఫన్నీ అంటూ ఎంతోమంది ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
ప్రాంక్ చేసి భార్యను బెదరగొట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..
Rohit Sharma Pranks Wife Ritika: టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో సరదాగా గడుపుతాడన్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్.. తన భార్య రితిక సజ్దేను ప్రాంక్ చేసి భయపెట్టిన వీడియో ఒకటి సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను రోహిత్ స్వయంగా చిత్రీకరించి తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో రోహిత్.. అద్దం ముందు నిల్చోని తన పిడికిలిలో ఓ చాక్లెట్ను ఉంచుకుంటాడు. అక్కడి నుంచి మరో రూంలో ఉన్న భార్య రితిక వద్దకు వెళ్తాడు. పిడికిలిలో ఏముందో చూడాలంటూ భార్యను కోరతాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) అందులో ఏదో భయపెట్టే వస్తువు ఉంటుందని భావించిన రితిక.. పిడికిలిని ఓపెన్ చేసేందుకు భయపడింది. రోహిత్ ఎంత అడిగినా రితిక పిడికిలిని ఓపెన్ చేయకపోవడంతో.. హిట్మ్యాన్ సస్పెన్స్ను తెరదించుతాడు. అందులో చాక్లెట్ను చూసిన రితిక.. తెగ నవ్వుకుంటుంది. ఈ సరదా వీడియోను రోహిత్.. అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2021 కోసం రోహిత్.. ఫ్యామిలీతో కలిసి యూఏఈలో ఉన్నాడు. రోహిత్ సారధ్యంలో ముంబై జట్టు ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 5 మాత్రమే నెగ్గి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. నేడు ముంబై జట్టు కీలకమైన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడుతుంది. చదవండి: Sushil Kumar Bail Petetion: క్రూరంగా హింసించి చంపారు.. బెయిల్ ఇవ్వకండి -
రోడ్డుపై చెంపదెబ్బలు కొట్టుకున్న యువతీ,యువకుడు.. కారణం ఏంటంటే..
న్యూఢిల్లీ: సాధారణంగా యువతీ, యువకులు సరదాగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రాంక్ వీడియోలు చాలావరకు ఫన్నీగా సాగినప్పటికీ...కొన్నిసార్లు మాత్రం వివాదాస్పదమవుతాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసిందే. తాజాగా, సరదాకోసం చేసిన ఒక ప్రాంక్ వీడియో యువతీ, యువకులు కొట్టుకోవడం వరకు వచ్చింది. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన ఢిల్లీలోని కానాట్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక పార్కులో.. సదరు యువతి సరదాగా ప్రాంక్ వీడియో చేస్తుంది. దీనిలో భాగంగా శీతల పానీయాలను రోడ్డుపై వెళ్తున్న యువకులపై వేసింది. ఈ క్రమంలో ఒక యువకుడిపై, సదరు యువతి శీతల పానీయాన్ని వేసింది. దీంతో అతను షాక్కు గురయ్యాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ యువకుడిని, యువతి నోటికొచ్చినట్లు తిట్టింది. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఆ యువతి, యువకుడిని చెంపదెబ్బకొట్టింది. తొలుత యువకుడికి నోటమాట రాలేదు. ఆ తర్వాత అతను కూడా యువతిని లాగిపెట్టి కొట్టాడు. ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున గుమిగూడారు. వారిద్దరి గోడవను కొందరు వేడుకలాగా చూస్తున్నారు. మరికొందరు వారి గోడవను కూడా సెల్ఫీవీడియో తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘భలే.. సరైన సమాధానం ఇచ్చావు..’,‘ ఆడవళ్లే కదా.. ఏది చేసిన చెల్లుతుంది అనుకోవద్దు..’,‘ మీ.. ప్రాంక్ వీడియోలకు ఒక దండం..’, ‘ఒక వ్యక్తిని కించపర్చకూడదు..’‘ఇది.. స్ర్కిప్ట్ చేసిన వీడియో మాదిరిగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, గతంలో లక్నోలో ఒక యువతి నడిరోడ్డుపై ఒక క్యాబ్డ్రైవర్పై చేయిచేసుకున్న సంఘటన పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలసిందే. చదవండి: అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు! -
రైలులో ప్రాంక్ వీడియో: జైలు పాలైన ప్రాంక్ స్టార్
మాస్కో: స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగింది. ఈ సమయంలో ఫోన్ వినియోగదారులకు వినోదం అందించేందుకు తమకు తోచినట్టు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ప్రాంక్ (నటన) వీడియోలు ఒక ఆదాయ పెట్టుబడిగా మారాయి. చిత్రవిచిత్ర ప్రాంక్ వీడియోలు తీసి నెటిజన్ల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కరోనా బాధితుడి మాదిరి దగ్గుతూ.. తుమ్ముతూ ఒక్కసారిగా రైలులో కింద పడిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ముందే కరోనా భయంతో వణుకుతుంటే ఆ యువకుడు దగ్గుతూ.. తూలుతూ పడిపోవడంతో భయాందోళనకు గురయిన ప్రయాణికులు రైలును ఆపేసి పరుగులు పెట్టారు. కొద్దిసేపటికి ఆ యువకుడు లేచి ‘ఇది ప్రాంక్ వీడియో.. ప్రాంక్ వీడియో’ అనడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సీక్రెట్ కెమెరా (సీసీ)లో రికార్డవడంతో పరిశీలించిన అధికారులు అతడిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అతడికి రెండేళ్లు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన రష్యాలోని మాస్కోలో జరిగింది. మాస్కోలో మెట్రో రైలును ప్రాంక్స్టార్గా గుర్తింపు పొందిన కరమతుల్లో డిహబోరోవ్ ఎక్కాడు. రైలు మొదలైన కొద్దిసేపటికి ఓ బోగిలోకి వెళ్లి పై విధంగా చేశాడు. 2020 ఫిబ్రవరిలో ఈ ఘటన చేయగా జనాలను భయబ్రాంతులకు గురి చేయడంపై ఆ దేశ పోలీసులు డిహబోరోవ్పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై కోర్టు తీర్పు ఇచ్చింది. డిహబోరోవ్కు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిద్దరికీ న్యాయస్థానం శిక్ష విధించింది. Когда пранк вышел из-под контроля! В Москве задержали шутника, разыгравшего в метро приступ коронавируса. Полиция попросила Черемушкинский суд столицы арестовать молодого человека. pic.twitter.com/fmT17RUijQ — ВЕСТИ (@vesti_news) February 10, 2020 -
పెళ్లి కుమార్తెను చూసి పడి పడి నవ్విన వరుడు
వివాహం జరగబోయే ఇల్లు ఎంత సండిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంధువుల హడావుడి, బావ మరదళ్ల సరసాలు.. మనవలు, మనవరాళ్ల అల్లరితో సరదగా సాగిపోతుంటుంది. ఇక పెళ్లింట్లో ప్రాంక్ చేస్తే ఆ మాజానే వేరు. జీవితాంతం ఆ సరదా సన్నివేశం అలా గుర్తుండిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజనులు కడుపుబ్బ నవ్వించారు.. బెస్ట్ఫ్రెండ్కి.. బెస్ట్ గిఫ్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రఫి పినెడా రోజాస్ అనే యూజర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో పెళ్లి కుమారుడు గోడవైపు తిరిగి వధువు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. ఇంతలో పెళ్లి దుస్తులు ధరించి.. అందంగా ముస్తాబైన వధువు అక్కడకు వస్తుంది. వెనక్కి తిరిగిన పెళ్లి కుమారుడు... వధువు మేలి ముసుగు తొలగించి.. ఆమె ముఖం చూసి ఒక్కసారిగా షాకవుతాడు. ఆ వెంటనే తేరుకుని పడి పడి నవ్వుతాడు. అతడు అంతలా నవ్వడానికి కారణం ఏంటంటే పెళ్లి కుమార్తె గెటప్లో వచ్చింది అమ్మాయి కాదు.. అబ్బాయి. వరుడి బెస్ట్ ఫ్రెండ్ అతడిని ఆటపట్టించడం కోసం ఇలా పెళ్లి కుమార్తెలా తయారయి వచ్చి.. విజయవంతంగా ప్రాంక్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చదవండి: గడ్డకట్టే చలిలో.. బికినీ ధరించి బాల్కనీలో View this post on Instagram A post shared by Raphi Pineda Rojas🤍 (@raphirojas) -
వైరల్ వీడియో: భర్త చెంప పగలగొట్టిన నటి
-
వైరల్: భర్త చెంప పగలగొట్టిన నటి
బుల్లితెర సెలబ్రిటీ అనిత తన భర్త రోహిత్ రెడ్డిని ఓ ఆటాడుకుంది. జస్ట్ ప్రాంక్ అని చెప్తూ భర్త చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది. ఈ వీడియోలో అనిత తన భర్తను కుర్చీలో కూర్చోబెట్టింది. అతడి వెనకాల నిలబడిన ఆమె తన చేతిలో ఓ దారాన్ని పట్టుకున్నట్లు నటించింది. దాన్ని అతడి చెవిలో నుంచి తీసినట్లు యాక్ట్ చేసింది. ఇంతలో ఫడేలుమని చెంప మీద ఒక్కటిచ్చింది. దీంతో షాకైన భర్త తనను ఏమీ అనలేక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. భార్యలకు ఈ మ్యాజిక్ ట్రిక్ తప్పకుండా నచ్చుతుందన్న అనిత 'ఈ ట్రిక్ను తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి' అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే తనను ఇలా ఆడేసుకున్న భార్యను ఊరుకునేది లేదంటున్నాడు రోహిత్. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. ఇక అనిత తన భర్తను ఈ రకంగా ఆటపట్టించడం చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పాపం, రోహిత్ ముఖం మాడిపోయిందని అంటున్నారు. అతడు ఎలా రివేంజ్ తీసుకుంటాడా అని ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. 'నువ్వు నేను', 'శ్రీరామ్', 'నేనున్నాను' వంటి చిత్రాల్లో నటించిన అనిత 2013లో రోహిత్ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక వివాహం అనంతరం బాలీవుడ్లో పాగా వేసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. చదవండి: బాలీవుడ్లో హీరోయిన్ ప్రణీతకు చేదు అనుభవం! ఒంటిపై తేనెటీగలతో హీరోయిన్ ఫోటో షూట్.. వీడియో వైరల్ -
ఫేస్బుక్ లైవ్లో ఫ్రెండ్స్ను ఏప్రిల్ ఫూల్స్ చేయబోయి..
తిరువనంతపురం: ఏప్రిల్ 1వ తేదీని ఏప్రిల్ ఫూల్ డేగా భావిస్తారు. ఆ రోజు తమ వారిని కొంత ఫూల్ను చేద్దామని ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వింత వింత చేష్టలు చేస్తారు. అవి కొందరికి కోపం తెప్పిస్తాయి. మరికొన్ని తీవ్ర పరిస్థితులకు దారి తీస్తాయి. తాజాగా ఓ విద్యార్థి తన స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫేస్బుక్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లైవ్ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించి మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళ అలప్పుజ జిల్లాలోని తళవాడి పప్రాంతంలోని కిలిరోర్లో సిద్ధార్థ్ అజయ్ (17) తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివసిస్తున్నాడు. ఏప్రిల్ 1వ తేదీ సందర్భంగా గురువారం రాత్రి భోజనం అనంతరం తన గదిలోకి వెళ్లాడు. తన స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేద్దామని భావించి ఓ ప్రాంక్గా ఆత్మహత్య చేసుకున్నట్లు నటిద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా ఫేస్బుక్ లైవ్ ఆన్ చేశాడు. బెడ్ షీట్తో ఫ్యాన్కు ఉరేసుకున్నట్లు నటిద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ఆ బెడ్ షీట్ అతడికి బిగుతుగా బిగించుకుపోయి అతడికి ఊపిరాడకుండాపోయింది. అయితే కుమారుడిని పిలుద్దామని గదిలోకి వెళ్లిన తల్లి నిర్ఘాంతపోయింది. కుమారుడు ఫ్యాన్కు వేలాడుతుండడంతో కంగారుపడింది. వెంటనే కుటుంబసభ్యుల సహాయంతో అజయ్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అజయ్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఇంకా ఫేస్బుక్ లైవ్ కొనసాగుతుండడం గమనార్హం. -
సచిన్ చేసిన పనికి ఒక్కసారిగా జడుసుకున్నారు
-
సచిన్ చేసిన పనికి ఒక్కసారిగా జడుసుకున్నారు
ముంబై: కరోనా విజృంభణ వల్ల ఆటగాళ్లకు ప్రతి రోజు ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో.. కోవిడ్ టెస్ట్ కూడా అంతే ముఖ్యమైనది. వారి జీవితంలో ప్రతి రోజు కోవిడ్ పరీక్ష తప్పని సరి అయ్యింది. ఈ క్రమంలో కరోనా టెస్ట్ చేస్తుండగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన ప్రాంక్ వీడియో వైరలవుతోంది. ప్రస్తుతం సచిన్ రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్ కోసం రాయ్పూర్లో ఉన్నాడు. ప్రొటోకాల్ ప్రకారం సచిన్కు కోవిడ్ టెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు వైద్య సిబ్బంది. ఈ క్రమంలో సచిన్ తనకు కరోనా టెస్ట్ చేయడానికి వచ్చిన మెడికల్ టీమ్తో ప్రాంక్ చేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మెడికల్ సిబ్బంది ఒకరు సచిన్ ముక్కు నుంచి స్వాబ్ తీసుకుంటుండగా.. నొప్పితో బాధపడినట్లు నటించాడు. దాంతో శాంపిల్స్ తీసుకుంటున్న వ్యక్తి కంగారు పడ్డాడు. స్వాబ్ కలెక్ట్ చేయడం పూర్తయిన తర్వాత సచిన్ వెంటనే తుమ్మాడు. దాంతో అక్కడున్న వారు కంగారు పడ్డారు. అది చూసిన సచిన్ తాను ఊరికే నటించానని.. వారిని నవ్వించేందుకే ఇలా చేశానని తెలిపాడు. ఆ తర్వాత సచిన్ నోటి నుంచి శాంపిల్స్ సేకరించారు వైద్య సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియోని సచిన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. ‘‘200 టెస్టులు ఆడాను.. 277 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను.. వైద్య సిబ్బందిని చీరప్ చేయడం కోసం ఇలా చిన్న ప్రాంక్ చేశాను. ఓ మంచి కారణం కోసం మేం ఈ సిరీస్ ఆడుతున్నాం. ఈ క్రమంలో మా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ.. మాకు సాయం చేసస్తోన్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు’’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలువుతోంది. రోడ్ సేఫ్టీ సిరీస్లో భాగంగా మంగళవారం ఇండియా లెజెండ్స్, ఇంగ్లండ్ లెజెండ్స్తో తల పడనుంది. గతేడాది ప్రారంభం అయిన రోడ్ సేఫ్టీ సిరీస్ కరోనా కారణంగా ఆగి పోయింది. అయితే తాజాగా ఈ నెల ఐదో తారీఖు నుంచి గతేడాది ఎక్కడైతే ఆగిపోయిందో మళ్లీ అ్కడి నుంచే సిరీస్ పునఃప్రారంభం అయ్యింది. చదవండి: వయసు పెరిగినా పదును మాత్రం తగ్గలేదు మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా! -
ప్రాంక్ అంటూ 300 అశ్లీల వీడియోలు..
ముంబై: సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారి తొక్కారు ముగ్గురు యువకులు. అశ్లీల ప్రాంక్ వీడియోలు చిత్రీకరిస్తూ కోట్లు ఆర్జించారు. దీనిపై కొందరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ముకేష్ గుప్త(29), జితేంద్ర గుప్త(25), కుమార్ సవ్(23) యూట్యూబ్ ఛానళ్లకు కంటెంట్ అందించేవారు. దీంతోపాటు సొంతంగా 17యూట్యూబ్ ఛానళ్లను నడిపేవారు. ఇవన్నీ కూడా పోర్న్కు సంబంధించినవే. ఈ ఛానళ్లకు 20 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాగా, ఒక మహిళతోపాటు, ముగ్గురు మైనర్ బాలికలు ప్రాంక్ వీడియో చేస్తే కావల్సినంత డబ్బులిస్తామని ఆఫర్ చేశారు. అంతటితో ఆగకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించి, వారి ప్రైవేట్పార్ట్స్ను తాకాలని చూశారు. ఈ ఘటనతో భయపడిపోయిన బాధితురాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 ల్యాప్టాప్లు, 4 మొబైల్ ఫోన్లు, ఒక కెమెరా స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోక్సో, అశ్లీల నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితులు లాక్ డౌన్ సమయంలో 300ల వరకు అశ్లీల వీడియోలు వారి యూట్యూబ్ ఛానళ్లలో అప్లోడ్ చేసి రూ.2కోట్ల వరకు ఆర్జించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ముఖేష్ విద్యార్థులకు చదువు చెప్పేవాడని, అతని దగ్గరకు వచ్చే విద్యార్థులకు ఈ వీడియోలతో ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ఇంట్లో రాక్షసులు: చంపి గుండెని కోసి కూర వండాడు’ -
ప్రాంక్ వీడియోలంటూ.. లైంగిక వేధింపులు
ముంబై: కరోనా వైరస్ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నకిలీ వార్తలు, ప్రాంక్ వీడియోలు వ్యాపింపచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య పెరుగుతోంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ముఖేశ్ గుప్తా 2008లో పదో తరగతి టాపర్. అతను విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని చెప్పి.. మైనర్ బాలికల శరీరాలను తాకుతూ, అసభ్యకమైన కామెంట్లు చేస్తూ వీడియోలు తీశాడు. ఆ ప్రాంక్ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. సుమారు 17 యూట్యూబ్ చానెళ్లు, ఫేస్బుక్ అకౌంట్లలో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలను అప్లోడ్ చేసి సూమారు రూ. 2 కోట్లు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాంక్ వీడియో తీస్తున్న సమయంలో తమతో అసభ్యంగా మాట్లాడుతూ, లైంగికంగా వేధించాడని కొంతమంది యవతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా నిందితుడు ముఖేశ్ అప్లోడ్ చేసిన ప్రాంక్ వీడియోలను తొలగించాలని యూట్యూబ్ను కోరినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబారే తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కారుతో బీభత్సం.. -
గడ్డకట్టే చలిలో.. బికినీ ధరించి బాల్కనీలో
మాస్కో: ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత మనుషుల్లో అసాధరణ ధోరణులు కూడా ఎక్కువయ్యాయి. రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని భావించి చేసే పనులు ప్రాణాల మీదకు తేస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రష్యాలో చోటు చేసుకుంది. య్యూట్యూబర్ ఒకరు 1300 డాలర్లకు ఆశపడి చేసిన బుర్రతక్కువ పని వల్ల గర్భవతి అయిన అతడి గర్ల్ఫ్రెండ్ మరణించింది. వివరాలు.. ఒక యూజర్ ప్రాంక్ వీడియో చేస్తే 1300 డాలర్లు ఇస్తాననడంతో స్టాస్ రిఫ్లే(30) అనే యూట్యూబర్ లైవ్ స్ట్రీమ్లో భాగంగా తన గర్ల్ఫ్రెండ్ వాలెంటినా గ్రిగోరీవా మీద ప్రాంక్ వీడియో చేయాలని భావించాడు. ఇక దానిలో భాగంగా స్టాస్, గర్భవతి అయిన వాలెంటినాను బాల్కనీలో ఉంచి తాళం వేశాడు. బయట విపరీతమైన చలి... మంచు కురుస్తుంది. దారుణం ఏంటంటే ప్రాంక్ వీడియో కోసం వాలెంటినా బికినీ వేసుకుని బాల్కనీలో నిల్చుని ఉంది. దాదాపు 15 నిమిషాల పాటు గట్టకట్టుకుపోయే చలిలో ఉండటంతో వాలెంటినా మరణించింది. చలికి తట్టుకోలేక మధ్యలో డోర్ కొట్టింది కానీ స్టాస్ తలుపు తీయలేదు. దాంతో ఆమె రక్తం గడ్డకట్టుపోయి.. శ్వాస తీసుకోవడానికి కుదరక.. కడుపులో బిడ్డతో సహా మరణించింది. (గుడ్డు పగిలింది: రివేంజ్ అదిరింది) 15 నిమిషాల తర్వాత స్టాస్ ఆమెని ఇంటి లోపలికి తీసుకెళ్లి బ్లాంకెట్ కప్పాడు. కానీ అప్పటికే ఆమె మరణించింది. వాలెంటీనాను లోపలకి తీసుకువచ్చిన స్టాస్ ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ‘వాల్య నీకు ఏమైంది.. ఎందుకు ఇలా చలనం లేకుండా పడి ఉన్నావ్.. దేవుడా నువ్వు మరణించావా ఏంటీ.. గైస్ ఆమె నాడి కోట్టుకోవడం లేదు.. శ్వాస తీసుకోవడం లేదు.. శరీరం పాలిపోయింది’ అంటూ అరవడం వీడియోలో వినిపించింది. స్టాస్ ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికే వాలెంటినా మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ మొత్తం తతంగం లైవ్ స్ట్రీమ్ కావడంతో పోలీసులు స్టాస్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని యూట్యూబ్ డిలీట్ చేయడమే కాక ఇలాంటి దారుణాలకు పాల్పడటం నేరం అంటూ హెచ్చరించింది. -
వైరల్ వీడియో: ఏంటీ ‘పులి’తోనే ఆటలా?!
బ్యాంకాక్: యూట్యూబ్లో ఫ్రాంక్ వీడియోలు చాలా కామన్. అబద్ధాన్ని నిజమని నమ్మించి, చివర్లో అసలు విషయం చెప్పగానే ప్రతి ఒక్కరూ ఫూల్ అవ్వాల్సిందే. ట్రెండింగ్లో నిలవాలంటే చాలా మంది వీటినే మార్గంగా ఎంచుకుంటారు. అయితే, థాయ్లాండ్కి చెందిన ఓ యువకుడు మాత్రం ఈ ఫ్రాంక్ వీడియోలను కాస్త విభిన్నంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మనుషుల మీద ఫ్రాంక్ చేయడంలో పెద్దగా ఆసక్తేం లేదనుకున్నాడో ఏమో గానీ, జంతువుల మీద ఫోకస్ చేశాడు. నిజానికి, పెద్దపులి బొమ్మ అయినా సరే, సడన్గా దాన్ని చూసినప్పుడు మనలో చాలా మందికి భయం వేస్తుంది కదా..! మరి చిన్న చిన్న జంతువులు ఎలా స్పందిస్తున్నాయనేది తెలుసుకోవాలని అతడికి ఆసక్తి కలిగింది. దీంతో ఓ పులి బొమ్మను తీసుకువెళ్లి కోతులు, కుక్కలు, పిల్లుల ముందు ప్రదర్శించాడు. ఒక్కోసారి తానే పులి ముఖాన్ని పోలిన మాస్కు ధరించి వాటి దగ్గరికి వెళ్లాడు. వీటిలో చాలా వరకు జంతువులు ‘పులి’ని చూసి భయపడగా, మరికొన్ని మాత్రం దానిని ఎదిరించేందుకు సిద్ధమయ్యాయి. మీదికి ఎగబడి రక్కడానికి ప్రయత్నం చేశాయి. ఫన్నీగా ఉన్న ఈ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫేక్ టైగర్ ఫ్రాంక్ వీడియోలను ‘‘ ఏంజెల్ నాగ’’ అనే యూట్యూబ్ ఛానల్లో మనం చూడవచ్చు. ఫన్నీగా ఉన్న ఈ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: బేబీకి పాకడం నేర్పిస్తున్న పెంపుడు కుక్క) అంతేగాకుండా ఈ యూజర్ షేర్ చేసిన మరో వీడియోకి కేవలం ఒక్క రోజులోనే రెండు మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఇక వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘పట్టణంలో ఉండే జంతువులకు పులులు ఎలా ఉంటాయో కూడా తెలుసా’’ అని కొందరు ఆశ్చర్యపోతే, ఇంకొంత మంది ట్రైనింగ్ చేసిన జంతువులను ఈ వీడియోల కోసం వాడుకున్నారని కామెంట్ చేశారు. ఏదేమైనా వీడియోలు మాత్రం అద్భుతంగా ఉన్నాయని, చివర్లో సదరు యువకుడు, జంతువులకు తిండి పెట్టడం మాత్రం అభినందనీయమంటూ ప్రశంసలు కురిపించారు. (చదవండి: వీల్ ఛైర్లో ఉన్నా డ్యాన్స్ అదరగొట్టింది!) -
గుడ్డు పగిలింది: రివేంజ్ అదిరింది
న్యూఢిల్లీ: గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా తిరిగొస్తుందో అంతే వేగంగా ఓ యువతి తనను ప్రాంక్ చేసిన వ్యక్తిని చెడుగుడు ఆడేసుకుంది. చర్యకు ప్రతిచర్యగా అతను చేసిన పనికి వడ్డీతో సహా తిరిగిచ్చేసింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తి సరదాగా గేమ్ ఆడుదామని యువతిని అడిగాడు. అందుకు ఆమె సరేనంది. ఆటంటే యువకుడు బాల్స్ తీసి యువతి వైపు విసిరేస్తాడు. ఆమె వాటిని తలతో నెట్టుతూ కింద గ్లాస్లో పడేయాలి. అలా ఆట మొదలైంది.. అతడు ఒకటి, రెండూ బంతులు వేశాడు. ఆమె ఏ ఒక్కటీ గ్లాసులో పడేయలేకపోయింది. ఇంకా తీక్షణంగా ఆడటం మొదలుపెట్టింది. (ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు) ఇంతలో ఆ కొంటె యువకుడు బంతికి బదులు కోడి గుడ్డు విసిరాడు. అది నేరుగా వచ్చి ఆమె తలపై పలిగింది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న సదరు యువతి చేతికందిన వస్తువునల్లా అతడిపైకి బాణాల్లా విసిరేస్తూ తన ప్రతాపం చూపించింది. ఈ వీడియోను క్వారంటైన్ లైఫ్ పేరిట భారత వ్యాపారవేత్త హర్ష గొయాంక శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ భార్య ప్రతీకారానికి లైకులు, బలైన భర్తకు జాలి చూపిస్తూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'భారతీయులు మాత్రం దీన్ని ప్రయత్నించకండి, ఇలా చేస్తే కనీసం మనకు తిండి కూడా పెట్టరు' అంటూ ఓ నెటిజన్ చమత్కరించాడు. 'క్వారంటైన్ సమయంలో నేను చూసిన బెస్ట్ వీడియో' ఇది అంటూ మరొకరు కామెంట్ చేశారు. (చచ్చిన వ్యక్తి కోసం మూడు నెలలుగా..) -
ప్రాంక్ వీడియో: తిక్క కుదిరింది
-
‘బుద్ధుందా.. లాక్డౌన్లో ఇలాంటి పిచ్చి వేషాలా?’
ప్రాంక్లు చేయడం.. వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టి వ్యూస్ పొందడం చాలా మందికి అలవాటు. సాధారణ రోజుల్లో వేరు.. కానీ లాక్డౌన్ కాలంలో ప్రాంక్లు చేస్తే జనాల స్పందన ఎంత సీరియస్గా ఉంటుందో ఇది చదివితే అర్థం అవుతుంది. వివరాలు.. అమెరికాకు చెందిన జోష్ పాప్కిన్(23) అనే వ్యక్తికి ప్రాంక్స్టార్గా ఎంతో పేరు. రకరకాల ప్రాంక్ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిత్రం అతడు రెండు ప్రాంక్ వీడియోలు విడుదల చేశాడు. వీటిలో ఒక వీడియో పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(లాక్డౌన్లో సాహసాలు చేస్తున్న చై-సామ్) ఈ వీడియోలో పాప్కిన్ ఓ మెట్రో రైలులో ప్రయాణిస్తుంటాడు. ఇంతలో ఉన్నట్టుండి తన చేతిలోని పాల డబ్బాను జార విడుస్తాడు. అక్కడంతా గందరగోళంగా తయారవ్వడంతో ఆ బోగిలో ఉన్న ప్రయాణికులంతా అక్కడ నుంచి లేచి వెళ్లిపోతారు. ఆ తర్వాత పాప్కిన్ బోగిని శుభ్రం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోను చూసిన జనాలు ‘నీకు బుద్ధుందా.. లాక్డౌన్ వేళ ఇలాంటి పిచ్చి వేషాలు అవసరమా.. ప్రచారం కోసం మరి ఇంతలా దిగజారాలా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
యువతుల్ని వేధించిన 'డ్రీమ్ బాయ్'
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ చానళ్లకు పరిమితమైన ప్రాంక్ వీడియోల విష సంస్కృతి యూట్యూబ్ చానళ్ల పుణ్యమా అని నగరానికీ పాకింది. ప్రాంక్ పేరుతో కొందరు హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. ఆడవాళ్లను వేధింపులకు గురిచేస్తున్నారు. ‘నేను సింగిల్ అండి... నాకు ఓ హగ్ ఇస్తారా? అంటూ ప్రాంక్ పేరిట వీడియో రూపొందించిన ‘డ్రీమ్ బాయ్ జయసూర్య’ అనే యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు రమావత్ సురేష్..తన చానల్లో వీడియోను పోస్టు చేశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువతులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులుదర్యాప్తు చేపట్టారు. ఈ తరహా కేసు నమోదు కావడం నగరంలో ఇదే తొలిసారి. సురేష్ గత కొన్నాళ్లుగా డ్రీమ్ బాయ్ జయసూర్య పేరుతో ఓ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే దీని కేంద్రంగా ఆన్లైన్ గేమ్స్కు సంబంధించిన లింకులు ఏర్పాటు చేయడం, బెట్టింగ్స్కు అవసనరమైన లింకులు పొందుపరచడం, వీటిని వినియోగించుకోవడానికి నిర్ణీత మొత్తం సబ్స్క్రిప్షన్ కట్టించుకోవడం వంటివి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. దీనికితోడు తన చానల్ పాపులారిటీ పెంచుకోవడానికి ప్రాంక్ వీడియోలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒంటిపై షార్ట్..పైన టవల్ కట్టుకుని ఓ పబ్లిక్ ప్లేసులో సంచరిస్తూ యువతుల్ని వేధించాడు. సినిమా చూస్తారా? అంటూ వారిని ప్రశ్నిస్తూ హఠాత్తుగా తన టవల్ తీసేసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా రూపొందించిన ప్రాంక్ వీడియోను గత ఏడాది ద్వితీయార్థంలో తన యూట్యూబ్ చానల్లో పెట్టాడు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సైబర్ స్పేస్ పోలీసింగ్ ద్వారా ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరిలో రమావత్ సురేష్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఇతడు రూపొందించిన వీడియో ఇప్పడు కేసు నమోదుకు కారణమైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో సంచరించిన ఇతగాడు నేను సింగిల్ అండి... ఓ హగ్ ఇస్తారా? అంటూ యువతులు, విద్యార్థినుల్ని అడుగుతూ వీడియో రికార్డు చేశాడు. దాదాపు పది నిమిషాల నిడివితో ఉన్న దీన్ని తన యూట్యూబ్ చానల్ డ్రీమ్బాయ్ జయసూర్యలో పొందుపరిచాడు. ప్రతి సీన్ను వెనుక బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్, మ్యూజిక్ ఏర్పాటు చేశాడు. దీన్ని ఇప్పటి వరకు 12 లక్షల మంది వీక్షించారు. ప్రతి సీన్ ముగిసిన తర్వాత ఇది ప్రాంక్ వీడియో అంటూ వారికి చెబుతూ..అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పండి అంటూ సూచించాడు. అయితే ఇద్దరు యువతుల విషయంలో మాత్రం వారికి ఇలా చెప్పలేదు. యూ ట్యూబ్ చానల్లో ఉన్న ఆ వీడియో ఇటీవల ఈ ఇద్దరు యువతుల దృష్టికి వచ్చింది. తమ అనుమతి లేకుండా రూపొందించిన వీడియోను చానల్లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగర సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
‘కరోనా’పై ప్రాంక్.. ఐదేళ్లు జైలు శిక్ష
మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై ప్రాంక్ వీడియో చేసి ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. సరదా కోసం చేసిన పనికి ఐదేళ్లు జైలు శిక్ష పడింది. ఈ ఘటన రష్యాలోని మాస్కో అండర్గ్రౌండ్ మెట్రో రైలులో ఈ నెల 8న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తజకిస్తాన్కు చెందిన కరోమాత్ ఝబరావ్ అనే ఓ యువకుడు, అతడి స్నేహితులు ఈ నెల(ఫిబ్రవరి) 2న మాస్కో రైల్లో ఒక ప్రాంక్ వీడియో తీయాలని అనుకున్నారు. ఈ సందర్భంగా కరోమాత్ కరోనా వైరస్ సోకినట్లుగా రైల్లో కిందపడిపోయి భయపెడతానని తెలిపాడు. (చదవండి : ఇకపై కరోనా అని పిలవకూడదు..!) చెప్పినట్లే మాస్క్ ధరించి రైలు ఎక్కిన కరోమాత్ కొద్ది సేపటికి కిందపడి గిల గిల కొట్టుకున్నాడు. వెంటనే అతని స్నేహితులు వచ్చి కరోనా వైరస్ సోకిందంటూ పరుగులు తీశారు. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను దక్కించుకునేందుకు అతడి నుంచి దూరంగా పరిగెట్టారు. కొద్దిసేపటి తర్వాత కరోమాత్ తనకు వైరస్ లేదని, భయపడొద్దని ప్రయాణికులకు తెలిపాడు. ఈ వీడియోను కరోమత్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన పోలీసులు ఈ నెల 8న కరోమత్, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. మెట్రో రైలులో ప్రయాణికులకు భయాందోళనలు కలిగించినందుకు కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించాలని ఆదేశించింది. ఈ ఘటనపై యువకుడి తరపు లాయర్ మాట్లాడుతూ.. ఆ ప్రాంక్ వీడియో ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందని అతడు భావించలేదని తెలిపారు. అతడు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేశాడని, కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో బయటకు వచ్చినప్పుడు ఫేస్ మాస్కులు ధరించకపోతే ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఈ ప్రాంక్ చేశాడన్నారు. -
రోడ్డుపై దెయ్యాలు.. పోలీసుల రంగప్రవేశం
-
రోడ్డుపై దెయ్యాలు.. పోలీసుల రంగప్రవేశం
బెంగళూరు: దెయ్యాల్లాగా వేషాలు వేసుకుని ప్రాంక్ వీడియో చేసిన యువకులకు దెబ్బకు దేవుడు గుర్తొచ్చిన ఘటన బెంగళూరులో జరిగింది. పక్కవాళ్లను భయపెట్టి పాపులారిటీ సంపాదించుకుందాం అనుకున్నవాళ్లు చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి వార్తల్లో నిలిచారు. వివరాలు.. కుకీ పీడియా అనే యూట్యూబ్ చానెల్ నిర్వాహకులు ఓ ప్రాంక్ వీడియో చేద్దామని భావించారు. ఇందుకోసం షరీఫ్నగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రాంక్ వీడియో కోసం.. ఏడుగురు.. దెయ్యాల్లా వేషాలు వేసుకుని సోమవారం అర్థరాత్రి రోడ్లమీదకు వచ్చారు. వీరిని చూసిన ప్రయాణికుల్లో కొంతమంది భయంతో జడుసుకున్నారు. అయితే దెయ్యాల ముసుగులో ఉన్నది మనుషులేనన్న విషయం తెలుసుకున్నాక అక్కడి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాంక్ వీడియోల పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తులు శాన్ మాలిక్, నవీద్, మహమ్మద్ సాజిల్, సకీబ్, సైద్ నబిల్, యుసిఫ్ అహ్మద్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులుగా పేర్కొన్నారు. జనాల్లో ఫేమస్ కావడానికి ఇలాంటి పనులు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే వారు క్షమాపణలు కోరినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోక తప్పలేదు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంది. ప్రాంక్ పేరిట ప్రజలను ఇబ్బందులకు గరిచేయడంతో పాటు, ఒకేసారి ఇంత మంది కలిసి రోడ్లపై హల్చల్ చేయడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆ యువకుల కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు వారిని బెయిల్పై వదిలేశారు. -
‘వీడిని తాకట్టు పెట్టుకోండి; రేటు ఎంత?’
ఫ్లోరిడా : ‘నాకు ఉన్న ఆస్తి వీడు. వయస్సు ఏడున్నర నెలలు. వీడిని మీరెలాగనైనా ఉపయోగించుకోవచ్చు. చెప్పండి ఎంతకు తాకట్టు పెట్టుకుంటారు. వీడి విలువ ఎంత’ అంటూ ఓ వ్యక్తి తన కుమారుడి గురించి షాపు వాళ్లతో బేరసారాలకు దిగాడు. ఇది గమనించిన ఓ షాపు యజమాని పోలీసులకు సమాచారమివ్వడంతో తాను ప్రాంక్ వీడియో రూపొందించేందుకే ఇలా చేశానంటూ తాపీగా సమాధానమిచ్చాడు. ఈ ఘటన ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్లో చోటుచేసుకుంది. వివరాలు... ఫ్లోరిడాకు చెందిన రిచర్డ్ స్లోకమ్ సింగిల్ పేరెంట్. అతడికి నెలల వయస్సు గల బాబు ఉన్నాడు. సరదాగా వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటు ఉన్న రిచర్డ్ ఓ రోజు కొడుకు వెంటేసుకుని ఓ షాపులోకి వెళ్లాడు. బాబు ఎంత విలువ చేస్తాడంటూ షాపు ఓనరును అడగటంతో అతడు అవాక్కయ్యాడు. అయితే తాను సరదాగా అన్నానని వెళ్లొస్తా అంటూ రిచర్డ్ షాపు నుంచి బయటికి వచ్చాడు. రిచర్డ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని అతడి వెనకే వెళ్లగా.. మిగతా వాళ్లను కూడా ఇలాగే అడగటం గమనించాడు. దీంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ క్రమంలో షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రిచర్డ్ కోసం పోలీసులు వెదకడం ప్రారంభించారు. అతడి గురించి వాకబు చేసేందుకు ఈ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగుతిన్న రిచర్డ్ వెంటనే పోలీసు స్టేషనుకు పరిగెత్తాడు. తాను ప్రాంక్ వీడియో కోసమే ఇలా చేశానంటూ వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో అతడి గురించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు విడిచిపెట్టారు. ఈ విషయం గురించి షాపు యజమాని మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడే వారికి సరైన శిక్ష విధిస్తేనే.. కుదురుగా ఉంటారంటూ రిచర్డ్ తీరుపై మండిపడ్డాడు. తాను ఇలాంటి విషయాలను తేలికగా తీసుకోలేనని, అందుకే పోలీసులకు ఫోన్ చేశానని చెప్పుకొచ్చాడు. -
నడిరోడ్డుపై బిత్తిరి వేషాలు.. వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రాంక్ వీడియోల పేరిట నడిరోడ్లపై హల్ చల్ చేస్తున్న ఇద్దరు యువకులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ‘డేర్ సిరీస్’ పేరిట వినయ్ కుయ్యా, డేర్స్టార్ గోపాల్ అనే ఇద్దరు యువకులు గత కొంత కాలంగా వీడియోలు చేస్తుస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ల చేష్టలపై ఫిర్యాదులు అందటంతో చర్యలు తీసుకునేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. బిజీ సమయాల్లో ట్రాఫిక్లోకి చేరి నడిరోడ్లపై పడుకోవటం.. తినటం, కార్లపైకి ఎక్కి హల్ చల్ చేయటం.. వీటితోపాటు పలు సరదా వీడియోలను షూట్ చేసి వినయ్ తన యూట్యూబ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తున్నాడు. అయితే వాళ్ల బిత్తిరి చర్యలతో ప్రయాణికులకు విఘాతం కలిగించటమే కాకుండా.. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని కొందరు వాహనదారులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అంతేకాదు వీళ్ల వ్యవహారాన్ని పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈ విషయంపై ఫిర్యాదు అందిన మాట వాస్తవం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని ట్రాఫిక్ సెల్ అధికారి రాజా వెంకట్రెడ్డి తెలిపారు. సినిమాల్లో చేస్తే తప్పులేదా?... ‘నేనో క్రియేటివ్ డైరెక్టర్ని. ఇలాంటి వీడియోలు షూట్ చేయటమే నా పని. ఎవరికీ ఇబ్బందులు కలగకుండానే వీడియోలు చేస్తున్నాం. ప్రమాదాలు జరిగిన దాఖలాలు కూడా లేవు. తాగుబోతులు, బిచ్చగాళ్లు న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్లను పట్టించుకోకుండా.. మమల్ని అడ్డుకుంటామనటం సరైంది కాదు. సినిమాల్లో హీరోలు చొక్కాలు విప్పటం, పరుష పదజాలం వాడినప్పుడు.. మేం చేసే వీడియోలకు అభ్యంతరం ఏంటి? పైగా అవెర్నెస్కు సంబంధించిన వీడియోలే మేం ఎక్కువగా షూట్ చేశాం. వాటికి మంచి స్పందన కూడా లభించింది’ అని వినయ్ చెబుతున్నాడు. -
విమానంలో ధావన్ కొంటె పని.!
మొహాలి : ఈ సీజన్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్న సన్రైజర్స్ ఆటగాళ్లు మైదానంలో ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆఫ్ది ఫీల్డ్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రయాణ సమయాల్లో సహచర ఆటగాళ్లతో జోకులు పేల్చుకుంటూ.. వినూత్నంగా ఫొటోలకు ఫోజులిస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సన్రైజర్స్హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ విమానంలో చేసిన ఓ కొంటె పని నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ధావన్.. గాఢంగా నిద్రపోతున్న సహచర ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, రషీద్ఖాన్లను ఆటపట్టించాడు. ఓ పేపర్ను గుండ్రంగా చుట్టి దానితో ఈ ఆటగాళ్ల ముక్కుల్లో పెడుతూ.. వారిని నిద్ర చెడగొట్టాడు. తొలుత ఏం జరుగుతుందో అర్థం కానీ ఈ ఆటగాళ్లు తేరుకొని ఇది గబ్బర్ పనేనని లైట్ తీసుకున్నారు. అయితే ఈ సమయంలో ఇతర ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు. సొంత మైదానంలో రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ను ఓడించిన సన్రైజర్స్.. కోల్కతా నైట్రైడర్స్ను వారి మైదానంలోనే చిత్తుచేసింది. నాలుగో మ్యాచ్ను ఏప్రిల్ 19 (గురువారం)న కింగ్స్ పంజాబ్తో మోహాలీలో ఆడనుంది. -
విమానంలో ధావన్ హల్చల్ ..
-
కూతురి ప్రేమకథ.. తండ్రి సర్ప్రైజ్
స్నేహితులను, దగ్గరివాళ్లను సర్ప్రైజ్ చేయడానికి అప్పుడప్పుడు చిలిపి చేష్టలతో వారిని ఆటపట్టిస్తుంటాము. అవి జీవితాంతం మధుర ఙ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. బ్లిస్, అలీసా అనే యువ జంట ప్రస్తుతం తమ ఆల్బమ్లో అలాంటి ఙ్ఞాపకాలను భద్రంగా దాచుకునేందుకు సిద్ధమయ్యారు. అవేమిటో తెలుసుకోవాలంటే వారి కథేంటో తెలుసుకోవాల్సిందే. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం అని భావించిన లెవీ బ్లిస్ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పే కంటే ముందే ఆమె తండ్రిని కలిసి విషయం చెప్పేశాడు. అబ్బాయి ప్రవర్తన నచ్చడంతో పెళ్లికి ఓకే చెప్పేశాడు అమ్మాయి అలీసా బారన్ తండ్రి. ఆయన కొంచెం సరదా మనిషి కావడంతో కాబోయే అల్లుడిని ఓ ఆట ఆడుకుందాం అనుకున్నాడు. కూతురికి కూడా స్వీట్ షాక్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని భావించాడు. అలీసాను సర్ప్రైజ్ చేసేందుకు ఆమెను ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు బ్లిస్. మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను వ్యక్త పరిచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇరువురి కుటుంబాలు వీరిని గమనిస్తూనే ఉన్నాయి. సరిగ్గా అలీసా తన నిర్ణయాన్ని చెప్పే సమయంలో బ్లిస్ వెనుకగా నిల్చుని ఉన్న ఆమె తండ్రి ‘సే నో(వద్దని చెప్పు)’ అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. దీంతో అలీసాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతలోనే ఇరువురి కుటుంబాలు వచ్చి వారిని ఆశీర్వదించడంతో బ్లిస్ నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు. తమ ప్రేమ కథకు ఇలా శుభం కార్డు పడటంతో అలీసా ఆనందంలో మునిగితేలుతోంది. తన తండ్రి కేవలం ఆటపట్టించడానికే అలా చేశారని, నిజానికి ఆయనకు బ్లిస్ అంటే చాలా ఇష్టమని అలీసా మురిసిపోతోంది. వీరి ప్రేమ కథ ఇప్పుడు ట్విటర్లో ట్రెండింగ్ అవుతోంది. My dad had other ideas.. 😂 pic.twitter.com/SDUMFjyqiq — *AB*_13 (@allison_barron) March 25, 2018 -
విశాల్ ఐటీ దాడుల వీడియో.. అసలు నిజం
సాక్షి, చెన్నై : కోలీవుడ్ హీరో విశాల్ ఇళ్లు, కార్యాలయాలపై గత నెలలో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో విశాల్ పన్నులు ఎగ్గొట్టాడంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) తనిఖీలు చేసినట్లు వాటి సారాంశం. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విడుదలైన ఓ వీడియో వైరల్ అవుతోంది. విశాల్ డబ్బును ఐటీ అధికారులు లెక్కిస్తున్నట్లు.. ఆయన్ని ప్రశ్నిస్తున్నట్లు అందులో ఉంది. అది తన కష్టార్జితమని విశాల్ చెబుతుంటే.. అధికారులు మాత్రం లెక్కల్లో లేని సోమ్మని చెప్పటం... కెమెరా ఆఫ్ చెయ్యండంటూ అధికారులను వేడుకోవటం... అన్నింటికి మించి రెండు వేల నోట్ల కట్టల ముందు విశాల్ ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అసలు వీడియో అంటూ చక్కర్లు కొట్టింది. అయితే వీడియో పూర్తిగా చూసినోళ్లకే అందులో అసలు విషయం అర్థమౌతోంది. అంత సీరియస్ డిస్కషన్ నడుస్తుండగా.. మధ్యలో సీనియర్ నటుడు అర్జున్ అక్కడికి వచ్చారు. ఓ పక్క సీన్ కోసం డైరెక్టర్ వెయిట్ చేస్తుంటే ఏంటయ్యా? ఇదంతా అని విశాల్ను అర్జున్ ప్రశ్నించగా.. అందరి ఘోల్లున నవ్వుకున్నారు. రెండు వేల నోట్ల మధ్య అన్నీ తెల్ల కాగితాలే చూపిస్తూ అర్జున్ సరదాగా అక్కడున్న స్టాఫ్పై చిర్రుబుర్రు లాటం బట్టి ఇదంతా ఓ ప్రాంక్ వీడియో అని చెప్పకనే చెబుతోంది. మెర్సల్ సినిమాకు మద్దతు ప్రకటించిన మరుసటి రోజే దాడుల వార్తలు రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కక్ష్య సాధింపు చర్యకు దిగుతోందని అని పలువురు విశాల్కు మద్ధతుగా నిలిచారు. ఇప్పుడు ఇలా ఓ చిత్ర షూటింగ్ సన్నివేశాన్ని ఆ సందర్భానికి అనుగుణంగా మలుచుకున్న విశాల్.. సెన్సాఫ్ హ్యుమర్కి అభిమానులు హాట్సాఫ్ చెబుతున్నారు. Unseen Footage of IT Raid @ Vishal.. #ITRaidatVishal pic.twitter.com/ozSAOfpEaX — Ramesh Bala (@rameshlaus) 15 November 2017 -
వైరల్ : దాగుడు మూతలు ఆడుతుంటే...
-
వైరల్ : దాగుడు మూతలు ఆడుతుంటే...
బీజింగ్ : ఫ్రాంక్ వీడియోల పేరిట చేసే విన్యాసాలు ఒక్కోసారి వికటించి విషాదాలుగా మారిన ఉదంతాలు అనేకం. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కొందరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే చైనా అనుహి ప్రొవిన్స్లో ఓ చిన్నారి సరదాగా చేసిన ప్రయత్నం ఆమెకు నరకం.. అధికారులకు కాసేపు చుక్కలు చూపించింది. సుజౌ నగరం లింగ్బి కౌంటీలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఆ ఆరేళ్ల బాలిక చదువుతోంది. ఈ క్రమంలో స్నేహితులతో సరదాగా దాగుడు మూతలు ఆడుకుంటూ పక్కనే ఉన్న ఓ సందులోకి దూరింది. అయితే రెండు భవనాలకు చెందిన ఇరుకైన సందు కావటంతో ఆమె తల అందులో ఇరుక్కుపోయి రోదించసాగింది. ఆమె ఏడుపులు విన్న స్కూల్ యాజమాన్యం అత్యవసర సిబ్బందికి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందజేసింది. తొలుత గోడ బద్ధలు కొట్టి ఆమెను బయటికి తీసేందుకు అధికారులు యత్నించగా.. అవతల ఉన్న మరోగోడ ఆమెపై కూలి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చివరకు గోడకు అయిల్ లాంటి పదర్థాన్ని పూసి ఓ కాగితంతో రుద్ది ఆమె తలను నెమ్మదిగా వేరు చేసి బయటకు తీశారు. ఆ వీడియోను మీరూ చూడండి. -
వైరల్.. భయపెట్టాలని ట్రై చేస్తే...
-
వైరల్.. భయపెట్టాలని ట్రై చేస్తే...
సాక్షి : దారిన పోయే ప్రయాణికులను భయపెడదామనుకున్న అతని ప్రయత్నం బెడసి కొట్టింది. కాస్తుంటే ప్రాణాలు పోయి ఉండేవే. కానీ, అతని ఆయుష్షు గట్టిది కావటంతో చిన్న గాయం కూడా కాకుండా తప్పించుకున్నాడు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. హలోవీన్ పేరిట తరచూ అక్కడ పార్టీలు సాధారణంగా జరుగుతుంటాయి. వాటిల్లో దెయ్యాల వేషధారణలో తిరుగుతూ వేడుకలు చేసుకుంటుంటారు. అయితే అదే గెటప్ లో ఫ్రాంక్ వీడియో చేయాలని ఓ వ్యక్తి భావించాడు. ఘౌలీష్ బందీ మాదిరి వేషం వేసుకుని కాళ్లు, చేతులు కట్టేసుకుని ముందుకు వెళ్తుంటే.. జాంబీ నర్స్ గెటప్ లో ఉన్న ఓ మహిళ వెనకాల అతన్ని పట్టుకుని లాగుతుంటుంది. ఇలా దారిన కార్లలో వెళ్లే వారిని భయపెట్టడం అతను చేస్తున్నాడు. ఇంతలో ఓ కారు రావటం.. ఆ తాడు తెగిపోవటం.. అతను కింద పడిపోవటం జరిగిపోయాయి. కాస్తుంటే అతని తలపై కారు వెనకాల చక్రం ఎక్కేదే. కానీ, అతని టైం బాగుండి అది జరగలేదు. ఏ ప్రాంతంలో ఏ తేదీలో జరిగిందో స్పష్టత లేకపోయినా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. -
జడపట్టి లాగడంతో విగ్గు ఊడి..!
-
జడపట్టి లాగడంతో విగ్గు ఊడి..!
ఈ మధ్య ప్రాంక్ వీడియోలు ఆన్లైన్లో పెట్టి క్లిక్లు తెచ్చుకోవడం యువతకు బాగా అలవాటైంది. అయితే, నిజజీవితంలో సరదా సన్నివేశాలను సృష్టించి.. వాటిని కెమెరాలో బంధించాలన్న ప్రయత్నం అన్నిసార్లు సజావుగా సాగకపోవచ్చు. 'పెళ్లిచూపులు' సినిమాలోలాగా కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసికొట్టే.. తీసినవారే బాధితులు అయ్యే అవకాశముంటుంది. కొందరు టీనేజ్ కుర్రాళ్లు ఇలాగే తమ స్కూల్లో ప్రాంక్ వీడియో తీయాలనుకున్నారు. క్యాంటీన్లో అమ్మాయిల వెనుక కూర్చిలో కూర్చొని వారి పిలకజడలను పట్టుకొని లాగారు. ఇద్దరు అమ్మాయిల జట్టు గట్టిగానే ఉంది. కానీ మూడో అమ్మాయి జుట్టే విగ్ కావడంతో అది ఊడివచ్చింది. అంతే ఆ నల్ల అమ్మాయి కోపం కట్టలు తెగింది. ఈడ్చి ఒక్కటి ఇచ్చింది. జుట్టు పీకినవాడు దెబ్బకు అడ్డం పడ్డాడు. ఇప్పుడు ప్రాంక్ వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్ వేయండి! -
ఎస్కలేటర్పై అమ్మాయి చేయిని తాకితే..!
-
ఎస్కలేటర్పై అమ్మాయి చేయిని తాకితే..!
రద్దీ ప్రదేశాల్లో మనుషులు ఒకరినొకరు తాకడం, తగలడం సాధారణంగా జరిగే విషయమే. కానీ ఓ అగంతకుడు ఉద్దేశపూర్వకంగా ఎదురుగా వస్తున్న వ్యక్తుల చేతులను తాకితే ఎలా ఉంటుంది? ఎస్కలేటర్లో ఓ అమ్మాయి అబ్బాయిల చేతులను కావాలని తాకితే.. వారు ఏమనుకుంటారు.. అదేవిధంగా ఓ వ్యక్తి అమ్మాయిలను చేతులను తాకుతూపోతే వారి స్పందన ఎలా ఉంటుంది. అవును చాలా చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కరి ఒక్కోరకంగా ఉంటుంది. ఓ వ్యక్తి కావాలనే అమ్మాయిల చేతులను తాకితే.. చాలామంది చిత్రంగా చూశారు. కొంతమంది గందరగోళానికి లోనయ్యారు. అతనికేమైనా పిచ్చా అన్నట్టు కొందరు యువతులు పరికించి చూశారు. వారి వెంట ఉన్న మగవారైతే ఏకంగా గొడవకు సిద్ధమయ్యారు. ఇక, ఓ అమ్మాయి అబ్బాయిల చేతులను తాకినప్పుడు మాత్రం చాలామంది ఒకింత ఆనందంగా.. కొంత సందిగ్థంగా స్పందించారు. కొంతమంది ఇదేం పద్ధతి కాదండి అంటూ 'రాముడు మంచి బాలుడు' టైప్లో చెప్పారు. చాలాచాలా చిత్రమైన ఇలాంటి హవభావాలకు, విచిత్రమైన స్పందనలకు తాజాగా యూట్యూబ్లో పెట్టిన ఓ ప్రాంక్ వీడియో వేదికగా మారింది. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన లవ్ రుద్రాక్ష, ఖుషీ తాజాగా ఓ ప్రాంక్ వీడియోను పెట్టారు. ఓ షాపింగ్ మాల్లో ఎస్కలేటర్లో ఉన్న వ్యక్తుల చేతులను తాకడం ద్వారా వారు ఎలా స్పందిస్తారన్నది చిత్రీకరించి యూట్యూబ్లో పెట్టారు. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షలమందికి పైగా చూశారు. అయితే, పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ప్రాంక్ వీడియోలు ఎన్నో ఇప్పటికే వచ్చేశాయి.