putta Madhu
-
పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం?
సాక్షి, పెద్దపల్లి: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ ప్రస్తుత ఛైర్మన్ పుట్టామధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఆయనపై అవిశ్వాసం పెట్టడానికి జెడ్పీటీసీలు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఉత్కంఠ నెలకొంది. జెడ్పీటీసీ సభ్యులు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. 2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి జడ్పీటీసీలు సిద్ధమవుతున్నారు. మెజార్టీ సభ్యుల అసమ్మతితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాగా, బుధవారం స్టాండింగ్కమిటీ సమావేశం ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ జడ్పీటీసీలు కాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అసంతృప్త జడ్పీటీసీలు వేర్వేరు చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గత నెల 28న జరగాల్సిన జడ్పీ జనరల్ బాడీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మెజారిటీ బీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాసానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. జిల్లాలోని 13 మంది జెడ్పీటీసీలకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇటీవలే బీఆర్ఎస్ను వీడిన పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెజారిటీ సభ్యుల అసమ్మతి నేపథ్యంలో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇదీ చదవండి: ముఖేష్ గౌడ్ కొడుకు దారెటు.? -
ఆయన తూర్పు.. ఈయన పడమర..! సెంటిమెంట్ కలిసొచ్చేదెవరికో..?
సాక్షి, పెద్దపల్లి: వారిద్దరూ రాజకీయాల్లో తూర్పుపడమరలు. ఒకరు కాంగ్రెస్ పార్టీ నేత అయితే.. మరొకరు బీఆర్ఎస్ నాయకుడు. కానీ వారిద్దరికీ సెంటిమెంట్ ముత్తారం కేంద్రంగా ఎన్నికల ప్రచారం షురూ చేయడం. వారే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. ఇటీవల బీఆర్ఎస్ టికెట్ ఖరారు కావడంతో పుట్ట మధు ముత్తారం కేంద్రంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. తూర్పువైపు ఉన్న మండలాల్లో తన పాదయాత్ర కొనసాగించి నియోజకవర్గం చుట్టివచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్యే శ్రీధర్బాబు సైతం ముత్తారం కేంద్రంగా భారీసభ నిర్వహించి పడమర దిశగా తన ప్రచారం మొదలు పెట్టారు. ఈ ఇద్దరు నేతలు ముత్తారం సెంటిమెంట్గా ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభించినా.. ఎవరికి కలిసివస్తుందోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. -
TS Election 2023: మూడు పార్టీలు కుట్ర పన్నుతున్నాయి.. : పుట్ట మధు
పెద్దపల్లి: పేద కుటుంబం నుంచి వచ్చిన తాను పేదల కష్టాలు తీర్చుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి తనపై కుట్ర చేస్తోందని, అయినా ప్రజల్లో తనపై విశ్వాసం ఉందని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఆయన బుధవారం మంథనికి రాగా.. కమాన్పూర్ మండలం గొల్లపల్లి నుంచి మంథని వరకు మంగళహారతులు, బైక్ర్యాలీతో స్వాగతం పలికారు. మంథని వద్ద భారీ గజమాలతో సన్మానించారు. అంబేద్కర్ కూడలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలోని కొందరు అసమ్మతివాదులతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు కసాయి కాంగ్రెస్ను నమ్మితే మోసపోతారని తెలిపారు. ఆత్మగౌరవం, పేదల ఆకలితీర్చేందుకు అనేకమంది అడవిబాట పడితే ఈ ప్రాంత నాయకత్వం కారణంగా వందలాది మంది నేలకొరిగారని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని, 2014 కంటే రెట్టింపు ఉత్సాహం కార్యకర్తలో కనిపిస్తోందని, వంద రోజులు తన కోసం కష్టపడితే ఐదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మధు తెలిపారు. జయశశంకర్భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కుశ్రీహర్షిణి, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్రావు, గొట్టిముక్కల సురేశ్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
ఢిల్లీలో పుట్టా మధు.. పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: సొంత పనుల కోసం ఢిల్లీకి వస్తే, బీజేపీలో చేరేందుకు వచ్చానంటూ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వదిలి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం బాధాకరమని.. తనకు వేరే పార్టీలో చేరాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో పుట్టా మధు మీడియాతో మాట్లాడుతూ, కింది స్థాయి నుంచి వచ్చిన తనకు సీఎం కేసీఆర్ గతంలో మంథని ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్గా అవకాశమిచ్చి పార్టీలో మంచి గౌరవమిస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో దుష్ప్రచారం చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరో కుట్ర పన్నారని ఆరోపించారు. మంథనిలో తనకు ఎలాంటి పోటీ లేదని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంథని నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏ నాయకుడైనా ఢిల్లీకి వస్తే వారి ప్రతిష్టను దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారని, ఢిల్లీ రావాలంటే భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. -
ఐదోసారికి కేటీఆర్ సిద్ధం.. వేములవాడ నుంచి బండి సంజయ్ బరిలోకి?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు. సింగరేణి కార్మికులదే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు. చదవండి: పార్టీకి గుడ్బై! గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు ద్విముఖ పోటీనే మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీధర్బాబుపై అసంతృప్తి మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం. పుట్టమధుపై ఆరోపణలు న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండుసార్లు పట్టం వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ వర్గీయుడికి టికెట్? ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం. 100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది. పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు! సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసారి కూడా కేకేనే సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన కకేకే మహేందర్రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గాన్ని ఎక్కువ కాలం పాలించిన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే తనపై కక్షగట్టి నిరాధారమైన ఆరోపణలతో రాష్ట్ర మీడియా తనపై కుట్రలు చేస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. మధుకర్ హత్య మొదలు.. చికోటి ప్రవీణ్ హవాలా వ్యవహారం వరకు ఎక్కడా తప్పు చేయలేదని, రాష్ట్ర మీడియా మాత్రం తన ప్రమేయం ఉన్నట్లుగా దుష్ప్రచారం చేస్తోందని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే మంథని ప్రధాన చౌరస్తాలో ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథనిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాగరాజును ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరే పించానని కోర్టులో కేసు వేశారని, అది నిలువలే దని, తర్వాత మధూకర్ ఆత్మహత్యకు తానే కారణమంటూ హైదరాబాద్, ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి రాద్దాంతం చేశారని, ఆ కేసు కోర్టులో ఉందని, దానిపై కథనాలు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. తాను అక్రమంగా రూ.900 కోట్లు సంపాదించినట్లు మీడియా ప్రచారం చేస్తుందని అందులో వాస్తవం లేదని, చికోటి వ్యవహారంలో మీడియా నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. (క్లిక్: మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..?) -
సంచలన వ్యాఖ్యలు.. డోర్ తెరిస్తే.. ‘దుద్దిళ్ల’ ‘కారు’ ఎక్కడం ఖాయం
సాక్షి, పెద్దపల్లి: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని, శ్రీధర్బాబు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. టీఆర్ఎస్లో చేరడానికి శ్రీధర్బాబు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ గేట్లు తెరవడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలను గ్రహించి చెంచాగిరీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో మధు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. (చదవండి: ఆయన ఏం డిసైడ్ అయ్యారు, వెళ్తారా.. ఉంటారా?) -
3 నెలలు: అనేక మలుపులు తిరిగిన దంపతుల హత్య కేసు
సాక్షి, మంథని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణి హత్య జరిగి నేటికి సరిగ్గా మూడు నెలలు గడిచింది. తాము చేపడుతున్న కార్యక్రమాలకు ఇబ్బంది సృష్టిస్తున్నారనే కోణంలో న్యాయవాద దంపతులను ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలోని మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై కొందరు పట్టపగలే కత్తులతో నరికి చంపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోగలిగారు. గ్రామ కక్షలతోనే తాము హత్యలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. అయితే ఈ హత్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు విన్నవించింది. హత్య జరిగిన సమయంలో కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులను కనిపెట్టడం పోలీసులకు సులువుగా మారింది. తనపై కత్తులతో దాడి చేసింది కుంట శ్రీను అని హత్యకు గురైన వామన్రావు వెల్లడించిన విషయం కూడా వీడియోలో రికార్డు అయింది. హత్య చేసిన అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపించారు. అయితే ఈ జంట హత్యలకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను సహకరించాడని పోలీసుల విచారణలో తేలింది. అప్పటినుంచే ఈ హత్యల్లో పుట్ట మధు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట హత్యల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు అనేక కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కేసు పలుమలుపులు తిరుగుతూ వస్తోంది. ఒక దశలో జెడ్పీ చైర్మన్ మధు మెడకు చుట్టుకుంటుందా..? అనే ప్రచారం కూడా జరిగింది. చార్జీషీటు నమోదు గడువు సమీపిస్తున్న సమయంలో వామన్రావు తండ్రి కిషన్రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదు అప్పట్లో సంచలనం రేపింది. అకస్మాత్తుగా జెడ్పీ చైర్మన్ అదృశ్యం కావడంతో కేసు మరింత జఠిలంగా మారింది. వారంరోజులపాటు మధు తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. పోలీసులు మధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మధుతోపాటు ఆయన భార్య పుట్ట శైలజ, మరికొందరిని కూడా విచారించారు. విచారణపై హైకోర్టు పర్యవేక్షణ న్యాయవాద దంపతుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని, ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ కేసుపై హైకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. జంట హత్యల కేసును తామే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని, విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసు విచారణ కోసం కరీంనగర్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఇటీవలే హైకోర్టుకు లేఖ రాసింది. చార్జీషీట్ సిద్ధం న్యాయవాద దంపతుల హత్య జరిగిన నేటికి 90 రోజులు కావస్తుండడంతో పోలీసులు కేసుకు సంబంధించిన చార్జీషీట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని కోణాల్లో విచారణ జరిపి పకడ్బందీగా చార్జిషీట్ను తయారు చేసినట్లు తెలిసింది. అందులో ఇంకా ఎవరైనా నిందితుల పేర్లను చేర్చుతారా..? లేదా ఇప్పటివరకు ఉన్నవారినే చూపిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం హత్యల్లో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో కోర్టులో చార్జీషీట్ సమర్పించే అవకాశం ఉంది. చదవండి: లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
Putta Madhu: 10 రోజుల అజ్ఞాతంపై నోరు విప్పిన పుట్టా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు న్యాయ వాది వామన్రావు దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సంబంధం లేనప్పుడు 10 రోజుల పాటు ఎందుకు పారిపోయారని ప్రశ్నించగా.. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లానని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కుంట శ్రీను, బిట్టు శ్రీను, ఇతరులు వారి వ్యక్తిగత కారణాల వల్లనే వామన్రావు దంపతులను హత్య చేసి ఉంటారని పేర్కొ న్నట్టు సమాచారం. దీంతో కేసు పురోగతి దిశగా పోలీసులకు ఆధారాలేమీ లభించలేదని తెలిసింది. మంగళవారం నాలుగో రోజు మధు దంపతులను గంటన్నరపాటు విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు. తామెప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేర్వేరు వాహనాల్లో వచ్చిన మధు, ఆయన భార్య శైలజను పోలీసులు వేర్వేరుగానే విచారించారు. ఈ కేసులో వీరి ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. 34 ఖాతాల పరిశీలన పూర్తి ఈ కేసుకు సంబంధించి పలువురి బ్యాంకు ఖాతాలను 4 రోజులుగా పరిశీలించిన పోలీసులు.. అనుమానాలకు తావిచ్చే స్థాయిలో లావాదేవీలు లేవని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 39 ఖాతాల ను పరిశీలించాల్సి ఉండగా.. ఇంకా 5 ఖాతాల సమాచారం రావలసి ఉందని ఓ అధికారి తెలిపారు. దీంతో మరో 3 రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లేందుకు అనుమతి పుట్ట మధును ఈనెల 8న ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి రామగుండం తీసుకువచ్చినట్లు ప్రకటించిన పోలీసులు.. సోమవా రం రాత్రి వరకు కమిషనరేట్లోనే ఉంచి విచారించారు. తర్వాత ఇంటికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత మంథని వచ్చిన మధుకు నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్శిణి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్రఘువీర్సింగ్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి వచ్చి కలిశారు. చదవండి: Etelaకు చెక్.. టీఆర్ఎస్ భావి నేతగా తెరపైకి కౌశిక్ రెడ్డి! -
పుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు!
-
Putta Madhu: పుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు!
సాక్షి, పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మంథనిలోని తన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు అభిమానులు తరలివచ్చారు. కాగా పది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మే 8న రామగుండం పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామనరావు- నాగమణి దంపతుల హత్య కేసులో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మధుతో పాటు ఆయన భార్య శైలజను రెండు రోజుల పాటు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ కుమారుడు ఆకాశ్ను సైతం పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల విచారణ అనంతరం సోమవారం రాత్రి మధును వదిలేసిన పోలీసులు.. నేడు బ్యాంక్స్టేట్మెంట్లతో హాజరుకావాలని ఆదేశించారు. కాగా హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్రావు తండ్రి కిషన్రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధు, ఆయన కుటుంబసభ్యుల బ్యాంక్ స్టేట్మెంట్లపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంట్లు తీసుకున్నారు. చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
పుట్ట మధును మూడో రోజు విచారిస్తున్న పోలీసులు
-
Putta Madhu: అదే జరిగితే పెద్దపల్లి జెడ్పీ కుర్చీ ఎవరికో..?!
మంథని: న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పాత్రపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ పీఠంపై పలువురు కన్ను పడింది. మొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా తామంటే తాము అవుతామని ఊహల లోకంలో తేలినవారికి స్వయానా సీఎం కేసీఆర్ పుట్ట మధు పేరు ప్రస్తావించడంతో మిన్నకుండిపోయారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మధు పోలీసుల అదుపులో ఉండడంతో ఆయన పదవికి గండం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రస్తుతం పుట్ట మధును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే మధు చైర్మన్ పదవి ఊడుతుందని, ఆ స్థానంలో తాము సిద్ధంగా ఉన్నామని పలువురు జెడ్పీటీసీలు అధిష్టానం ఎదుట బారులు తీరినట్లు సమాచారం. వీరిలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మొదటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. అటు మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతుతో జెడ్పీ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు జిల్లాలోని మరో ముగ్గురు జెడ్పీటీసీలు సైతం చైర్మన్గిరి కోసం పోటీ పడుతున్నారు. పుట్ట మధును పోలీసులు విచారిస్తున్నా.. ఇప్పటివరకు ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయినా మధు పదవి ఎలాగైనా పోతుందనే ముందస్తు సమాచారంతో జెడ్పీటీసీలు చైర్మన్ గిరి కోసం పోటీ పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..! -
Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: యుద్ధంలో ఒక్క శత్రువును టార్గెట్ చేస్తే సరిపోదు.. అతని బలానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైన మిగతా శక్తులను కూడా దెబ్బకొట్టడమే రాజనీతి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్లోని హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్, పుట్ట మధుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న అధికారులకు స్థానచలనం తప్పడం లేదు. హుజూరాబాద్లో ఇప్పటికే ఏసీపీ, ఆర్డీవో, ఓ తహసీల్దార్తోపాటు నలుగురు ఎంపీడీవోలను బదిలీ చేశారు. తాజాగా పోలీస్ ఇన్స్పెక్టర్లను టార్గెట్ చేశారు. నియోజకవర్గం పరిధిలోని హుజురాబాద్టౌన్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్ సర్కిల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్లు జి.సదన్కుమార్, ఎ.రమేష్, సీహెచ్.విద్యాసాగర్కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కరీంనగర్ డీఐజీకి అటాచ్డ్ చేస్తూ నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో హుజూరాబాద్కు వి.శ్రీనివాస్ (సీసీఎస్–3), జమ్మికుంటకు కె.రామచంద్రారావు (ధర్మపురి), జమ్మికుంట రూరల్కు జె.సురేష్ (సీసీ ఎస్)ను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. హుజురాబాద్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాలలో ఉండడంతో అక్కడ సీఐ బదిలీ కాలేదు. ఈ నియోజకవర్గంలోని ఎస్సైల బదిలీలు కూడా సోమవారం జరిగే అవకాశం ఉందని సమాచారం. మారుతున్న రాజకీయాలు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో తెగతెంపులు చేసుకున్న రీతిలోనే టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు, నాయకులపై గురిపెట్టారు. ఇప్పటికే వీణవంక మండలం ఇప్పాలపల్లి పీఏసీఎస్లో 2015లో చోటు చేసుకున్న రూ.18.86 లక్షల అవకతవకలకు సంబంధించి ఈటల వర్గీయుడైన అప్పటి చైర్మన్ సాదవరెడ్డికి తాజాగా నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఈటల వర్గీయులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలను ఆయన వైపు వెళ్లకుండా చూసే పనిలో పడ్డారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్కు హుజూరాబాద్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో మంత్రి గంగుల హుజూరాబాద్లో మకాం వేసే అవకాశాలున్నాయి. ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంథని సర్కిల్లో పోలీసుల బదిలీలు ఈ క్రమంలోనే ఇక్కడి పోలీసులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వామన్రావు హత్యకు ముందు.. తరువాత జరిగిన పరిణామాల్లో మంథని సర్కిల్ పరిధిలోని పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విచారణను తిరగతోడడంలో భాగంగా మంథని సీఐ జి.మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్కు అటాచ్డ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇటీవలే మంథని సర్కిల్కు సీఐగా బదిలీపై రావడం గమనార్హం. అంతకుముందు వామన్రావు దంపతుల హత్య జరిగినప్పుడు సీఐగా ఉన్న మహేందర్ను బదిలీ చేసి మహేందర్రెడ్డిని తీసుకొచ్చారు. తాజాగా అదే సమయంలో మంథని సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలు అందరిని బదిలీ చేస్తూ రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. జంట హత్యలు జరిగిన రామగిరి పోలీస్స్టేషన్ ఎస్సై ఎ.మహేందర్ను బసంత్నగర్కు బదిలీ చేశారు. మహేందర్ పుట్ట మధు వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఆయన స్థానంలో రామగుండం ఎస్బీకి అటాచ్డ్ అయిన ఎస్సై కె.రవిప్రసాద్కు పోస్టింగ్ ఇచ్చారు. ముత్తారం మండల ఎస్సై సి.నరసింహారావును టాస్క్ఫోర్స్కు బదిలీ చేసి కాసిపేట (మంచిర్యాల జిల్లా) ఎస్సై బి. రాములును ముత్తారానికి పంపించారు. మంథని ఎస్సై ఓంకార్ను ములుగుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జూలపల్లి ఎస్సై పి.చంద్రకుమార్కు పోస్టింగ్ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లిన మహదేవ్పూర్, కాళేశ్వరం పరిధిలో కూడా బదిలీలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ బదిలీలన్నీ పదోన్నతులపై జరగడం గమనార్హం. మహదేవ్పూర్ సీఐ నర్సయ్య డీఎస్పీగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో రామగుండం టాస్క్ఫోర్స్ సీఐ తిలక్ నియమితులయ్యారు. కాళేశ్వరం, మహదేవ్పూర్ ఎస్సైలు సీఐలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. మంథనిలో రాజకీయ మార్పులు తప్పవా..? అలాగే మంథనిలో కూడా రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్కు చెందిన దుద్దిళ్ల శ్రీధర్బాబును టీఆర్ఎస్లోకి తీసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు సమాచారం. వామన్రావు దంపతుల హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మధుకు టీఆర్ఎస్లో అవకాశాలు తగ్గినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. మంథనిలో మధు కనుసన్నల్లోనే పోస్టింగులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పోస్టింగ్ల విషయంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్స్పెక్టర్లు మొదలుకొని నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారి ఎమ్మెల్యే ద్వారానే పోస్టింగ్ పొందే పరిస్థితి. అయితే మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ పోస్టింగ్లు, బదిలీలు అన్నీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. శ్రీధర్బాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడంతో టీఆర్ఎస్ ఇన్చార్జిగా మధు చెప్పిన వారికే పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతోంది. దీనిపై పలుమార్లు శ్రీధర్బాబు, కాంగ్రెస్ నేతలు విమర్శించడం తప్ప అడ్డుకోలేకపోయారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధుకు సంబంధం లేకుండా నియామకాలు చోటు చేసుకోవడం గమనార్హం. మంథనిలోనూ బదిలీల పర్వం మాజీ మంత్రి ఈటల రాజేందర్ వర్గీయుడు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన మంథని నియోజకవర్గంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్రావు దంపతులకు సంబంధించి వామన్రావు తండ్రి తాజాగా ఐజీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును రీఓపెన్ చేశారు. ఇందులో భాగంగా పుట్ట మధును విచారణ కోసం రామగుండం కమిషనరేట్కు తీసుకొచ్చిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. తాజాగా ఆయన సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజను కూడా విచారణ కోసం తీసుకొచ్చారు. ఇక మంథని నియోజకవర్గం పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీలపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. పుట్ట మధుతోపాటు మున్సిపల్ చైర్పర్సన్ శైలజకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న అధికారులను బదిలీ చేసి, కొత్త వారిని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై పోలీసుల ఆరా -
TRS Party: ‘గులాబీ’లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో నిశ్శబ్దంతోపాటు ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు కీలక నేతలకు సైతం అంతుచిక్కడంలేదు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అరెస్టు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, అవినీతి, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలపై కూడా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కీలక నేతలు సహా ఏ ఒక్కరూ నోరువిప్పడంలేదు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతోనే అప్రమత్తం గత ఏడాదిలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ కుదుపునకు లోనైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బీజేపీ దూకుడు పెంచడంతో సుమారు రెండు నెలలపాటు పరిస్థితులను మదింపు చేసిన కేసీఆర్ తన వ్యూహానికి పదును పెట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 7న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య ప్రజాప్రతినిదులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తాను సీఎంగా పదేళ్లు కొనసాగుతానని కుండబద్దలు కొట్టడంతోపాటు పార్టీ లైన్ దాటి మాట్లాడేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పార్టీ సంస్థాగత బలోపేతం కోసం సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు షెడ్యూలును ప్రకటించారు. ఎన్నికల అస్త్రంతో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దూకుడు పెంచిన బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తర్వాత జరిగిన ఇతర ఎన్నికలను అస్త్రంగా ప్రయోగించారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు బీజేపీ సిట్టింగ్ స్థానం ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్’ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పట్టభద్రుల కోటా ఎన్నికల ఫలితాల్లో బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టిన కేసీఆర్ సాగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కకుండా చేయడం ద్వారా టీఆర్ఎస్ శిబిరంలో మునుపటి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. శాసనసభలో ఇదివరకే కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనం కాగా, గత నెలలో టీడీపీ లెజిస్లేచర్ పార్టీ కూడా టీఆర్ఎస్లో విలీనమైంది. -
వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు
సాక్షి, కరీంనగర్ : వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పుట్ట మధు సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండవ రోజు పుట్ట మధును పలు అంశాలపై విచారించారు. హత్యకు ముందు రూ.2 కోట్లు విత్డ్రా విషయం సహా.. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణంపైనా ఆరా తీశారు. వామన్రావు తండ్రి కిషన్రావునూ విచారించారు. హత్యలో పుట్ట మధు, భార్య శైలజ ప్రమేయం ఉందని కిషన్రావు చెప్పారు. కాగా, ఈ జంటహత్యల కేసులో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను కీలకంగా ఉన్నారు. -
Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై పోలీసుల ఆరా
-
Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై ఆరా
సాక్షి, పెద్దపల్లి: న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. లాయర్ల హత్య జరగడానికి ముందు పుట్టా మధు రూ. 2 కోట్లు డ్రా చేసిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య కేసు ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ జైల్లో ఉండగా గుంజపడుగులో నిందితుడి ఇంటి నిర్మాణం శరవేగంగా సాగడంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. అదేవిధంగా పుట్టా మధు అనుచరులు సత్యనారాయణ, సతీష్ పోలీసుల అదుపులో ఉన్నారు. గతంలో న్యాయవాద దంపతులు పుట్టా మధు దంపతులపై కోర్టులో కేసులు వేసిన విషయం తెలిసిందే. న్యాయవాది దంపతుల హత్య కేసులో పుట్టా శైలజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక నాలుగు రాష్ట్రాల్లో 4 వాహనాలను మారుస్తూ పట్టా మధు 6 ఫోన్లు మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: Putta Madhu: అత్యంత పకడ్బందీగా అజ్ఞాతం చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
Putta Madhu: భీమవరం ఎపిసోడ్లో నిజమెంత?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. తన ఆచూకీ పోలీసులకు చిక్కకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించాడు. నిన్నమొన్నటి వరకు ఎక్కడా సెల్ఫోన్ వాడలేదు, కుటుంబ సభ్యులు, అనుచరులను ఫోన్లో సంప్రదించలేదు. సొంత వాహనం వాడలేదు. హోటళ్లు, లాడ్జిలలో కాకుండా తెలిసిన వారి వద్దే తలదాచుకున్నాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో తిరిగాడనే అనుమానాలున్నా, ఎక్కడా సొంత ఏటీఎం కార్డు కూడా వాడలేదంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించాడో అర్థమవుతోంది. మధుకు ఆప్తుడైన కర్ణాటకకు చెందిన ఓ మిత్రుడికి ఏపీలోని రావులపాలెంలో ఉన్నవారితో సంబంధాలు ఉన్నాయని, ఆ పరిచయాల ఆధారంగా మధు భీమవరంలో ఆశ్రయం పొందినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మధు ఆచూకీ కనిపెట్టాలని మధుకు దగ్గరగా ఉండే ఓ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు ఆదేశించారని, ఆ అధికారి సూచనల మేరకు ఇటీవల కుటుంబ సభ్యులు మధును సంప్రదించగా.. ఆ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భీమవరంలో అతని జాడను కనిపెట్టారని చెబుతున్నారు. సుపారీ టేపులపై రెండున్నరేళ్ల తర్వాత కేసు! వామన్రావు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఒకరైన కుంట శ్రీను పేరుతో, 2018 ఎన్నికలకు ముందు మధు పేరును ప్రస్తావిస్తూ ఓ హత్యకు సంబంధించి జరిగిన సుపారీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హత్యకు డీల్ రూ.60 లక్షలకు కుదిరింది. రెండున్నరేళ్ల తర్వాత, వామన్రావు హత్య అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, ఇటీవల వాయిస్ టెస్టుకు అను మతి కోరుతూ మంథని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇన్ని రోజులు కుంటశ్రీను ఎవరితో సుపారీ మాట్లాడాడు? అసలు ఆ గొంతు ఎవరిది? అన్న విషయాన్ని తేల్చకపోవడం గమనార్హం. చదవండి: లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’ -
సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ల జంట హత్యల కేసు చివరికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మెడకు చుట్టుకుంటోంది. కేసు చార్జిషీటు దాఖలు చేసే సమయంలో గన్మెన్లను వదిలి వారం రోజులపాటు అదృశ్యం కావడంతో ఆయన ప్రమేయంపై పోలీసులు ఆరా తీసే పరిస్థితి తలెత్తింది. లాయర్ల హత్యకేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీను జైలులో ఉండగా.. అతని ఇంటి నిర్మాణానికి పుట్ట మధు సహకరిస్తున్నట్లు వామన్రావు తండ్రి కిషన్రావు ఫిర్యాదు చేశారు. వాటితోపాటు మరిన్ని అనుమానాస్పద అంశాలు జెడ్పీ చైర్మన్ మధుకు తలనొప్పిగా మారుతున్నాయి. వారం రోజుల క్రితం అదృశ్యమైన మధును శుక్రవారం రాత్రి ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ.. వామన్రావు హత్య కేసులో ఆయన ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. హత్య కేసు విచారణాధికారి అడిషనల్ డీసీపీ అశోక్కుమార్, ఓఎస్డీ శరత్చంద్రపవర్, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ వేర్వేరుగా విచారించారు. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైది. రూ, 2 కోట్లు సుపారీ నిజమేనా..? హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్రావు తండ్రి కిషన్రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖనే పుట్ట మధుపై ఎంక్వైరీకి కారణమైంది. వామన్రావు దంపతుల హత్యకు రూ.2 కోట్లు డీల్ మాట్లాడిందెవరు? బిట్టు శ్రీనుకు కొత్త కారు కొనిచ్చింది ఎవరు? కుంట శ్రీను ఇంటికి ఎవరు డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలను ఏ బ్యాంకు నుంచి తెచ్చారు? విత్డ్రా చేసిందెవరు? తదితర కోణాలపై రామగుండం పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరగడానికి ముందు నుంచి తరువాత చోటు చేసుకున్న పరిణామాల వరకు పుట్ట మధు ఎవరెవరితో మాట్లాడారో కాల్డేటా కూడా తీసుకుని విచారిస్తున్నారు. చార్జిషీటు దాఖలుకు సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో కోర్టుకు సమాధానం చెప్పుకొనేందుకు.. వామన్రావును అంతమొందించడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే కోణంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం. వారం రోజులు ఎందుకు అదృశ్యం..? జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వారం రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ కోసం గన్మెన్లుగా వచ్చిన నలుగురు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రభుత్వ కారును వదిలేసి ఎందుకు అదృశ్యం కావలసి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారని సమాచారం. పోలీసుల కళ్లు కప్పి మహారాష్ట్ర, హైదరాబాద్, భీమవరం ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగానే మధు గాయబ్ అయ్యాడా? ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదృశ్యంపై గోప్యత ఎందుకు? గత నెల 29న రాత్రి హైదరాబాద్ నుంచి ఓ పోలీస్ అధికారి నుంచి ఫోన్ కాల్ రావడంతో అదేరోజు రాత్రి పుట్ట మధు అదృశ్యమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మధు అదృశ్యమైన తరువాత మరుసటి రోజు ఉదయం గన్మెన్లు ఈ విషయాన్ని ఏఆర్ విభాగం చీఫ్కు తెలియజేయడం, ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. గన్మెన్లు తమ ఆయుధాలను సరెండర్ చేసి, ఏఆర్కు అటాచ్డ్ అయ్యారు. ఆ వెంటనే రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మధు, ఆయన డ్రైవర్ సెల్ టవర్ సిగ్నల్స్ మేరకు మహారాష్ట్ర వెళ్లారు. ఈనెల 1న మహారాష్ట్రలోని వని పట్టణంలో మధు సోదరుని నివాసానికి వెళ్లి విచారణ జరపగా, మధు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. అదే సమయంలో ఈటల రాజేందర్ వ్యవహారం తెరపైకి రావడంతో హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. మధు కోసం జిల్లాకు చెందిన ఓ మంత్రి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు రోజుల క్రితం సదరు మంత్రికి ‘సాక్షి’ ఫోన్ చేయగా, మధు హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పడం గమనార్హం. సాక్షి కథనాలతో అప్రమత్తమైన పోలీసులు ‘భీమవరం’ నుంచి అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు. ‘సాక్షి’ వరుస కథనాల సంచలనం పుట్ట మధు అదృశ్యమైన విషయంపై ఈనెల 6న ‘సాక్షి’ దినపత్రికలో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పటివరకు పుకారుగా ప్రచారంలో ఉన్న ఈ అంశాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజు 7న ‘అజ్ఞాతంలోనే మధు’ శీర్షికతో వారం రోజులుగా వీడని సస్పెన్స్ను హైలైట్ చేస్తూ కథనం ప్రచురించింది. మధు ఎక్కడికి వెళ్లలేదని, గన్మెన్ ఆయనతోనే ఉన్నారని, మిస్సింగ్ ఫిర్యాదులు ఏవీ అందలేదని రామగుండం పోలీస్ కమిషనర్ ఇచ్చిన వివరణతోపాటు జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించడం జరిగింది. అదే సమయంలో తన భర్త ఆచూకీ తెలపాలని మధు సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ మంత్రి ప్రశాంత్రెడ్డిని కలిసిన వివరాలను ప్రచురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు పుట్ట మధును అదుపులోకి తీసుకున్న విషయాన్ని మీడియాకు వెల్లడించాలని నిర్ణయించారు. అదే సమయంలో శుక్రవారం పుట్ట శైలజ ‘సాక్షి’తో మాట్లాడుతూ పుట్ట మధు హైదరాబాద్లోనే ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు 8న ‘అజ్ఞాతంలోకి పోలేదట..’ శీర్షికతో మరో కథనం ప్రచురితమైంది. చివరికి పుట్ట తమ అదుపులో ఉన్న విషయాన్ని పోలీసులు వెల్లడించక తప్పలేదు. -
లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’
సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసుకొచ్చారు. వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘నా కొడుకు, కోడల్ని కత్తులతో పొడిచిన తరువాత పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో వారికి సకాలంలో వైద్య సేవలు అందలేదు. దీనికి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కారణమని నాకు అనుమానం. మొదట ప్రైవేటు అంబులెన్స్ వచ్చినప్పటికీ దాన్ని కాదని 108 వాహనం వచ్చే దాకా కావాలనే ఆలస్యం చేశారు. ఆస్పత్రికి చేరిన తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న వామన్రావుకు వైద్య సేవలు సకాలంలో అంది ఉంటే కొద్ది రోజులైనా బతికేవాడు’ అని తెలిపారు. ‘పుట్ట మధుకు, ఈటలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నా కుమారుడికి వైద్య సేవలు అందలేదు. పంచనామా పోస్టుమార్టం రిపోర్టు విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. పెద్దపల్లి ప్రజాప్రతినిధి కూడా ఆసుపత్రికి వచ్చిన వామన్రావుకు మందులు ఇవ్వవద్దని చెప్పారు. నిందితులందరికీ చట్ట పరంగా శిక్షలు పడతాయనే విశ్వాసం ఉంది. మధు, ఆయన భార్య శైలజ, రామగిరికి చెందిన సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు ఏప్రిల్ 16న ఐజీ నాగిరెడ్డికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపా. హత్యకు రెక్కీ నిర్వహించడం, అందులో పాల్గొన్న వ్యక్తి పేరును ఇతర వివరాలు తెలియజేశా. వీరందరినీ విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. న్యాయం జరగకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తా’ అని తెలిపారు. చదవండి: వామన్రావు దంపతుల హత్య కేసుపై సర్కారు ఫోకస్ -
పోలీసుల అదుపులో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
-
పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?
సాక్షి, పెద్దపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ కేసు విచారణకై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టును కోరింది. కరీంనగర్ జిల్లాలోని ఒక కోర్టును కేసు విచారణకు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దపల్లికి చెందిన గట్టు వామన్రావు-నాగమణి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్(44), శివందుల చిరంజీవి(35), బిట్టు శ్రీను తదితరులను అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. ఇక ఈ కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించిన నేపథ్యంలో, పుట్ట మధు, ఆయన భార్య శైలజ తదితరులకు కూడా ఇందులో ప్రమేయం ఉందని వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు వరంగల్ ఐజీకి ఇదివరకే రాశారు. ఇదిలా ఉండగా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో.. గత వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు ఆచూకీ లభించడం, వామనరావు హత్య కేసులో ఆయనను విచారించడం వంటి పరిణామాలు నేడు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు సైతం ఈ కేసుపై దృష్టి సారించడం గమనార్హం. దీంతో, పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హత్య వెనుక ఉన్నది వాళ్లే: కిషన్రావు హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసు నేపథ్యంలో మృతుడు గట్టు వామన్రావు తండ్రి కిషన్రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి గతంలో లేఖ రాశారు. పట్టపగలే తన కొడుకు, కోడలును దారుణంగా హతమార్చారని, నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు.. ‘‘హత్య వెనుక పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయన భార్య శైలజ, కమన్ పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ఉన్నారు. ఈ హత్యలకు గ్రామ కక్షలు, దేవాలయ విషయం కారణం కాదు. నిందితులతో ప్రమాదం పొంచి ఉందని జనవరి 28న రామగుండం పోలీస్ కమిషనర్, మంథని పోలీసులకు ఫిర్యాదు చేశాం. పుట్ట మధు ఎమ్మెల్యే గా ఓడిపోయినప్పటి నుంచి నా కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాదు, ఈ హత్యలో స్థానిక నేతలు,అధికారుల తో పాటు పెద్ద తలకాయల పాత్ర ఉంది. జైలులో ఉన్న కుంట శ్రీనివాస్ గుంజపడుగులో నిర్మించే నూతన గృహం ఎవరు నిర్మిస్తున్నారు, డబ్బులు ఎవరు ఇస్తున్నారు. జైల్లో ఉన్న నిందితులతో గ్రామానికి చెందిన వారితో పాటు ఇతరులు కలిసిన విషయంలో విచారణ చేయాలి. లక్కేపురం విజయ బాస్కర్, గట్టు విజయ్ కుమార్ ఆయన కుమారుడు వినయ్, ఆటోడ్రైవర్ వేలాది రఘురాం కాల్ డాటా ను పరిశీలించాలి. నా కొడుకు ఆరోజు మంథనికి వస్తున్న విషయం ఎవరికి తెలియదు. కేవలం గ్రామ సర్పంచ్ రాజు మాత్రమే తెలుసు. నా కొడుకు, కోడలు హత్య తర్వాత సర్పంచ్ ఇప్పటి వరకు మమ్మల్ని పరామర్శించలేదు. నిందితుడు కుంట శ్రీను తమ్ముడు కుంట రాజు(సర్పంచ్)తో పాటు హత్య పథకంలో కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ప్రైవేటు అంబులెన్స్ లో వైద్యం అందించలేదు, హత్యకు కారకులైన వారికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి’’అని ఆయన లేఖలో పేర్కొన్నారు. చదవండి: Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్! -
Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్!
-
Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసు కొచ్చారు. వామన్రావు తండ్రి కిషన్రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేశారు. దీనిపై రామగుండం పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తొలుత ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. అలాగే పోలీసులు మధు అదృశ్యాన్ని ధ్రువీకరించకపోవడం, టీఆర్ఎస్ నేతల రాయబారాలు, మధు సతీమణి శైలజ స్పందన తదితర విషయాలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో శనివారం మధును అదుపులోకి తీసుకున్ననట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో చిక్కని మధు వామన్రావు తండ్రి కిషన్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును తిరిగి తవ్వుతున్నారనే విషయం గత నెల 29న పుట్ట మధుకు తెలిసింది. దాంతో అదేరోజు రాత్రి ఆయన గన్మేన్లు లేకుండా, ప్రభుత్వ కారును ఇంట్లోనే వదిలేసి తన భార్య, మునిసిపల్ చైర్పర్సన్ శైలజ కారులో అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు మధు ‘గాయబ్’అయ్యారనే విషయాన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు ప్రారంభించారు. వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించి ఎట్టకేలకు మధు ఆచూకీ కనుకొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా వని పట్టణంలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని ఈనెల 1న అక్కడి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అయితే మధు అక్కడ పోలీసులకు చిక్కలేదు. ఈ మేరకు మరాఠీ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అదే సమయంలో ఈటల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన మధు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని భీమవరం వెళ్లి ఉంటారనేది ఓ కథనం.. కాగా మధు హైదరాబాద్లోనే ఉండి తన భార్య సహకారంతో ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారని, అదే సమయంలో పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటారనేది మరో కథనం. అయితే హైదరాబాద్లో పట్టుకున్నట్లు కాకుండా ఆంధ్రప్రదేశ్లోని భీమవరం వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు సీన్ క్రియేట్ చేశారని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి భీమవరం వెళ్లి, శనివారం ఉదయాన్నే మధును అదుపులోకి తీసుకొని, మధ్యాహ్నానికల్లా జెట్ స్పీడ్లో రామగుండం తీసుకొచ్చి విచారణ ప్రారంభించడం ఈ సందేహానికి తావిస్తోంది. హైదరాబాద్లో ఉంటే ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే భీమవరం ఎపిసోడ్కు తెరతీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిషన్రావు ఫిర్యాదుతోనే దర్యాప్తు వేగం ఈ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులకు పుట్ట మధు రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారని, ప్రధాన నిందితుడు కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, దీని వెనకాల జెడ్పీ చైర్మన్ ఉన్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వామన్రావు తండ్రి కిషన్రావు ఈనెల 16న ఐజీ నాగిరెడ్డికి పిర్యాదు చేశారు. ఈ కేసును హైకోర్టు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న క్రమంలో కిషన్రావు ఫిర్యాదుపై ఐజీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎ–1 కుంట శ్రీను ఇంటి నిర్మాణం వెనక ఎవరెవరున్నారనే కోణంలో కూడా విచారణ జరిపారు. హత్య కోసం రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారా? అంతమొత్తం ఎక్కడ నుంచి వచ్చింది..? దీని వల్ల ఎవరికి ప్రయోజనం అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పుట్ట మధు అదృశ్యం కావడంతో కేసు మలుపు తిరిగింది. హత్యల కేసులో పాత్ర తేల్చేందుకే.. హైకోర్టు లాయర్ల హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం తేల్చేందుకు శనివారం ఆయన్ను ఇక్కడికి తీసుకువచ్చాం. ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో విచా రణ కొనసాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితుని ఇంటి పనులు వేగవంతం కావడం, వారం రోజుల పాటు మధు ఎందుకు అదృశ్యం అయ్యారు? తదితర వివరాలు విచారణలో తెలుస్తాయి. కిషన్రావు ద్వారా కూడా ఆధారాలు సేకరిస్తాం. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. – వి.సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ దొరకని ‘పెద్దల’ అపాయింట్మెంట్ టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. పుట్ట మధు మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చాడు. ఈ కేసు నుంచి బయటకు తీసుకురావాలని ఆయన జిల్లాకు చెందిన ఓ మంత్రి సాయం కోరాడు. అయితే ఆయన టీఆర్ఎస్ పెద్దలతో మాట్లాడి పుట్ట మధుకు అపాయింట్మెంట్ ఇప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో పరిస్థితి మారింది. మధు సతీమణి పుట్ట శైలజ సీన్లోకి వచ్చి సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్కు వెళ్లినా వీలు కాలేదు. దీంతో మరో మంత్రిని కలిసి సాయం కోరారు. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతున్న క్రమంలోనే పోలీసులు మధును అదుపులోకి తీసుకొని రామగుండం తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. చదవండి: Putta Madhu: వారం రోజులుగా వీడని సస్పెన్స్.. అసలేం జరిగింది? -
Putta Madhu: వారం రోజులుగా వీడని సస్పెన్స్.. అసలేం జరిగింది?
‘పుట్ట మధు వెంట నలుగురు గన్మెన్లు ఉన్నారు. ఆయన గన్మెన్లకు చెప్పకుండా వెళ్లాడనే సమాచారం ఏం లేదు. గన్మెన్ గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ మధు కనిపించడం లేదని ఫిర్యాదు చేయలేదు. ప్రజాప్రతినిధిగా ఆయన దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. గన్మెన్లు ఆయన వెంటే ఉంటారు.’ – ‘సాక్షి’తో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ‘నా భర్త పుట్ట మధు ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాం. మాకు అవకాశం దొరకడం లేదు. మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిస్తే ఆరోగ్యం బాగాలేదన్నారు. మీరైనా సీఎంకు తెలియజేయండి’ – మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కొడుకు, కోడలితో కలిసి మధు భార్య, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే ‘గాయబ్’ అయిన పుట్ట మధు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, ఆయన ఎక్కడికి వెళ్లలేదని పోలీసులు చెపుతున్నారు. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన మంథనిలో ఏం జరుగుతోందో కూడా పోలీసులకు తెలియకుండా ఉంది. నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లతో పుట్ట మధుకు రక్షణ కల్పిస్తున్న రామగుండం పోలీసులు ఇంత జరుగుతున్నా.. మధు ఎక్కడికి వెళ్లలేదని, దేశంలోనే ఉన్నారని చెబుతూ వచ్చారు. ఆయనకు రక్షణగా గన్మెన్లు కూడా వెంటే ఉన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ స్వయంగా ‘సాక్షి’తో చెప్పారు. రామగుండం ఏఆర్ ఏసీపీ సుందర్రావు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్ని పుకార్లు షికార్లు చేసినా.. పోలీసులు చెపుతున్న దానిని బట్టి పుట్ట మధు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన బంధువుల దగ్గరో.. సన్నిహితుల వద్దో ఉంటారని భావించవచ్చు. అయితే ‘సాక్షి’లో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనం తరువాతే ఈ అదృశ్యం విషయంలో కదలిక మొదలైంది. పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ, కుమారుడు, కోడలు నేరుగా హైదరాబాద్లోని ప్రగతి భవన్కు వెళ్లి సీఎంను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సీఎం అందుబాటులో లేకపోవడంతో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డిని కలిసి తన భర్త ఆచూకీ కోసం తాము పడుతున్న బాధను సీఎంకు తెలియజేయాలని కోరినట్లు సమాచారం. వీడని సస్పెన్స్ ఎపిసోడ్.. సుమారు వారం రోజుల క్రితం పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిన విషయాన్ని సాక్షాత్తూ టీఆర్ఎస్ నేతలే ధ్రువీకరిస్తున్నారు. అడ్వకేట్ వామన్రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారని సమాచారం. హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పిన మధు.. తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని మంథనిలోనే వదిలి, ఆయన భార్య శైలజ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. మ«ధు వాహనం ప్రస్తుతం ఆయన మామ ఇంట్లో పార్కింగ్ చేసి ఉంది. మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం. ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని ‘వని’ పట్టణంలో పుట్ట మధు సోదరుడు, మరో బంధువు ఇంట్లో అక్కడి జిల్లా పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి విచారణ జరిపినట్లు ఆ రాష్ట్రంలోని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. కాగా.. మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను ఆసిఫాబాద్లోని వాంకిడి వద్ద పట్టుకొని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధు మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయితే.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారం ఉంది. కానీ.. పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. గన్మెన్లు ఎక్కడ..? పుట్ట మధు వెంటే గన్మెన్లు ఉన్నారని ఏఆర్ ఏసీపీతోపాటు రామగుండం పోలీస్ కమిషనర్ చెపుతుండగా.. పుట్ట మధు ఎక్కడున్నారనే విషయంలో ఇంత కథ ఎందుకు జరుగుతుందనేది ప్రశ్నగా మిగిలింది. నలుగురు గన్మెన్లు మధుతో ఉంటే ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా.. వారం రోజులుగా గన్మెన్ల ఆచూకీ పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు కనుక్కోలేదా అని తెలియకుండా ఉంది. పుట్ట శైలజ తన భర్త ఆచూకీ చెప్పాలని ప్రభుత్వ పెద్దలను కలిసి కోరుతున్న వేళ ఇప్పటికీ గన్మెన్లు మధు వెంటే ఉన్నారని పోలీస్ కమిషనర్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు చెప్తున్నారంటే.. వారి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో ప్రభుత్వానికే తెలియాలి. ప్రస్తుతం పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన పుట్ట మధు వ్యవహారంలో నిజాలను బహిర్గత పరచాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. మంత్రి కొప్పులతో టచ్లో.. అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో టచ్లో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన పుట్ట మధు టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వామన్రావు హత్య కేసుతోపాటు ఈటల రాజేందర్ వ్యవహారంలో కూడా తన ప్రమేయం లేదని సీఎం కేసీఆర్కు చెప్పించేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఇద్దరు ఈ విషయాన్ని “సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. కాగా గురువారం పుట్ట మధు భార్య శైలజ, ఆమె కుమారుడు, కోడలితో కలిసి హైదరాబాద్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలువగా, తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన సూచన మేరకు వెనుదిరిగినట్లు సమాచారం. అదే క్రమంలో ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్ను కలిసి తన భర్త మధు ఆచూకీ ఐదు రోజులుగా దొరకడం లేదని.. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరారు. కాగా.. ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన తరువాత ‘కేసీఆర్ వెంటే మేమూ.. మా నాయకుడు పుట్ట మధు’ అని మంథని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం మంథనిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంథని టీఆర్ఎస్లో చీలికకు కొందరు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..? -
లభించని పుట్ట మధు ఆచూకీ
-
Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఐదు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే ఆయన అదృశ్యం కావడం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈటలకు సన్నిహితుడిగా పేరున్న పుట్ట మధు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని ఎందుకు కనిపించకుండా పోయారనేది హాట్ టాపిక్ అయింది. ఈటల ఎపిసోడ్ వెలుగులోకి రాకముందే.. అడ్వకేట్ దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని, హత్య కోసం రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారనే పుకార్లు షికారు చేశాయి. ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెరపైకి రాగా.. అనూహ్యంగా మధు అదృశ్యమయ్యారు. ఐదు రోజులుగా ఆయన ఫోన్లోనూ అందుబాటులో లేరు. గన్మెన్లు మధు వెంటే ఉన్నారా..? ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని అదృశ్యం అయిన పుట్ట మధు వెంట రక్షణ కోసం నలుగురు గన్మెన్లు ఉంటారు. మంథని నుంచి గన్మెన్లకు కూడా చెప్పకుండా మధు అదృశ్యం అయినట్లు మంథనిలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ధ్రువీకరించలేదు. ‘జెడ్పీ చైర్మన్ మధు వెంటే గన్మెన్లు ఉన్నారు. మధు అదృశ్యమైనట్లు గన్మెన్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫిర్యాదు రాలేదు’ అని ‘సాక్షి’కి తెలిపారు. గన్మెన్ల ఫోన్లు పనిచేస్తున్నాయని మాత్రం చెప్పిన సీపీ మధు ఎక్కడున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ‘ప్రజాప్రతినిధులు పనుల మీద దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. వారితోపాటు వారి రక్షణ కోసం గన్మెన్లు కూడా వెళతారు. ఆ వివరాలేవీ గన్మెన్లు మాకు రిపోర్టు చేయరు’ అని సీపీ సత్యనారాయణ వివరించారు. హంతకులను అరెస్టు చేసినట్లు అసెంబ్లీలో చెప్పిన సీఎం వామన్రావు దంపతుల హత్య వ్యక్తిగత కక్షలతో జరిగిందే తప్ప రాజకీయ కోణంలో కాదని, తమ పార్టీ వారికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. కేసులో దోషులను కూడా అరెస్టు చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే.. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ హత్యకేసులో నిందితుడు కావడంతో మంథనిలో పుకార్లు ఆగలేదు. తాజాగా వామన్రావు హత్యకు రూ.2 కోట్ల సుపారీ అందించారని, ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఒకరిద్దరిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. నిందితుల్లో ఒకరు అప్రూవల్గా మారారని.. చాలా విషయాలు వెల్లడించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మధు కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది. ఒకట్రెండు రోజుల్లో ఫోన్ ఆన్ అవుతుందన్న ముఖ్య నేత పుట్ట మధు ఎక్కడికీ పోలేదని, హైదరాబాద్లోనే ఉన్నారని టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేత ‘సాక్షి’తో చెప్పారు. ఐదు రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్ అవడం వ్యక్తిగతమని చెప్పిన ఆయన.. ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తారని అన్నారు. అయితే.. మధు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లినట్లు చర్చ జరుగుతుండగా.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటలతో తనకేమీ సంబంధం లేదనే విషయాన్ని హైకమాండ్కు చెప్పాలని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చదవండి: ఈటల ఎమ్మెల్యే పదవిపై తొలగని ఉత్కంఠ Etela Rajender: సరైన సమయంలో సరైన నిర్ణయం -
లాయర్ దంపతుల హత్య: మే 17లోగా చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణి హత్య కేసులో మే 17 నాటికి 90 రోజులు పూర్తవుతుందని, ఆ లోగా అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. న్యాయవాద దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా గత ఫిబ్రవరిలో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని వివరిస్తూ ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదిక సమర్పిం చారు. ఈ కేసులో 32 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించామని, వారిలో 26 మంది వాంగ్మూలాలను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని, మిగిలినవారి వాంగ్మూలాలను త్వరలో నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని వివరించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని.. ఆ నివేదిక వచ్చేందుకు నాలుగు వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 17న హత్య జరిగిన నేపథ్యంలో మే 17 నాటికి 90 రోజులు అవుతుందని, 17లోగా సమగ్రంగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఇస్తే.. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని గట్టు వామన్రావు తండ్రి కిషన్రావు తరఫు న్యాయవాది విజయభాస్కర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. నివేదికపై హైకోర్టు సంతృప్తి.. దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసుల నివేదిక సంతృప్తికరంగా ఉందని, దర్యాప్తు తీరుతెన్నులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేలా చూడాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణలోగా దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. చదవండి: బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు -
బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఫోన్లో మాట్లాడేందుకు ఆమె తన మొబైల్ ఇచ్చారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు కాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణిల హత్య కేసు నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును గత నెల 19వ తేదీన మంథని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ బిట్టు శ్రీనుతో మాట్లాడిన మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ.. తన ఫోన్ ద్వారా శ్రీనును వేరే వ్యక్తితో మాట్లాడించినట్లు బందోబస్తుకు వచి్చన రామగుం డం ఆర్ఎస్సై అజ్మీరా ప్రవీణ్ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు రక్షణగా వచ్చిన కానిస్టేబుళ్లు, కోర్టు పీసీ ఫోన్లో మాట్లాడకూడదని వారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ వెళ్లే దారిలో మరోసారి వచి్చన పుట్ట శైలజ ఓ మహిళతో వీడియోకాల్ మాట్లాడించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో వివరించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన పుట్ట శైలజపై చర్య తీసుకోవాలని కోరారు. కోర్టు ఆవరణలో ఈ సంఘటన జరగడంతో మేజిస్ట్రేట్ అనుమతితో మంథని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మార్చి 26న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు విషయాన్ని మంథని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. పుట్ట శైలజ నిందితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించారని వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు సైతం పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అప్పటికే కేసు నమోదైనా, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం) -
న్యాయవాద దంపతుల హత్యపై సీన్ రీ కన్స్ట్రక్షన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. రామగుండం డీసీపీ (అడ్మిన్) ఎన్.అశోక్కుమార్ ఆ«ధ్వర్యంలో బుధవారం నిందితులతో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయించారు. పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు నుంచి వామన్రావు దంపతులు బయలుదేరిన సమయంలో నిందితులు ఎక్కడ ఉన్నారు..? ఎలా వెళ్లారు..? మంథని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూలే విగ్రహం, కోర్టు, ప్రధాన చౌరస్తా, పాత పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులను రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. హత్యకు పాల్పడిన రోజు వాహనాలను ఎక్కడ నిలిపివేశారు.. న్యాయవాద దంపతుల వాహనాన్ని ఎక్కడ దాట వేశారు.. తెలంగాణ చౌరస్తా వద్ద వాహనాలు ప్రయాణించిన తీరును పరిశీలించారు. కాల్డేటా విశ్లేషణ హత్య జరిగిన రోజు నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శ్రీను సెల్ఫోన్ల నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనే విషయంపై కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. వారి నుంచి కాల్ వచ్చిన ప్రతి ఒక్కరినీ రామగుండం కమిషనరేట్కు పిలిపించుకుని వాళ్ల స్టేట్మెంట్ను రికార్డు చేసుకుంటున్నారు. వారు ఎందుకు కాల్ చేశారు..ఈ హత్యలతో ఇతరులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. దీంతో సాధారణంగా నిందితుల నుంచి కాల్స్ వచ్చిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, పోలీసు కస్టడీలోకి తీసుకున్న ముగ్గురు ప్రధాన నిందితుల సమయం గురువారంతో ముగియనుంది. బిట్టు నోరు మెదిపేనా..! జంట హత్యలకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు తుల్సెగారి శ్రీనివాస్ ఉరఫ్ బిట్టు శ్రీను నోరు తెరిస్తే మరిన్ని నిజాలు వెల్లడి కానున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం రూ.30 వేల ఆదాయం కోల్పోయాననే కక్షతో ఈ దారుణానికి పూనుకున్నారా..? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతుండటంతో ఆ దిశగా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఐదో నిందితుడి అరెస్టులో జాప్యం న్యాయవాద దంపతులు కోర్టు నుంచి బయలు దేరే సమాచారం ఐదో నిందితుడు లచ్చయ్య ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే.. ఇతడిని అదుపులోకి తీసుకొని వారం గడిచినా అరెస్టు చూపించడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు
సాక్షి, కరీంనగర్: మంథని నియోజకవర్గానికి 70 ఏళ్ల తర్వాత ఓ గరీబ్ బిడ్డ ఎమ్మెల్యే అయితే అగ్రవర్గాలు తట్టుకోలేదని, ఇప్పుడు జెడ్పీ చైర్మన్ అయ్యాక మరింత బురదజల్లుతున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పేర్కొన్నారు. ‘నేను వజ్రం లాంటి వాడిని.. మోసగాడిని కాదు’అంటూ వ్యాఖ్యానించారు. మంథనిలో శనివారం జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. తనను కేసులో ఇరికించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఇందుకు మీడియా తోడైందని ధ్వజమెత్తారు. తనను కొంద రు మీడియా మిత్రులు సంప్రదించగా ‘పోలీసుల విచారణ జరుగుతోంది. మా మండల పార్టీ అధ్యక్షుడి పేరు చనిపోయిన అతడు చెప్పాడు. ఏమైందో పోలీసులు తేలుస్తారు. విచారణ అనంతరమే స్పందిస్తా’ అని చెప్పగా.. మొహం చాటేసినట్లు ఓ టీవీ చానల్ ప్రసారం చేసిందని మండిపడ్డారు. ‘నేను నియోజకవర్గంలోనే తిరుగుతుంటే హైదరాబాద్ పరారైనట్లు వార్తలు వేస్తున్నారు. వారికేమైనా మెదడుందా? నేను ఇక్కడే ఉన్న. నిన్న మంత్రి వచ్చిండంటే పెద్దపల్లికి పోయి వచ్చిన’ అని ధ్వజమెత్తారు. ‘హైదరాబాద్లో కూర్చొని వార్తలు రాస్తున్నారా? పోలీస్ వాళ్లను పక్కన బెట్టి మీరే ఎంక్వైరీ చేస్తారా?’అంటూ వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్, కేటీఆర్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, వారు తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు ఎందుకు కక్షగట్టాయో అర్థం కావట్లేదని చెప్పారు. తనపై దుష్ప్రచారం చేసేందుకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు కొందరిని కొనుగోలు చేశాడంటూ విమర్శించారు. పోలీసుల విచారణ జరుగుతున్నప్పుడే మీడియా సమాంతర విచారణ చేస్తున్నారని ఆరోపించారు. ‘నన్ను లోపల వేయించేందుకు మీడియా ఆరాటపడుతోంది. మీరే ఓ దరఖాస్తు పెట్టి ఆ పని చేయండి’ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నిత్యం ప్రజా సంక్షేమ, పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతుంటే నాపై, నా కుటుంబంపై ఎందుకు విషం కక్కుతున్నారంటూ మీడియాపై నిప్పులు చెరిగారు. పోలీసుల విచారణ పూర్తయ్యాక హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినా తనపై విషం చిమ్మిన పత్రికలు, చానల్స్ వ్యవహరంపై ఆధారాలతో మాట్లాడుతాన ని ‘నేను ఎన్నడూ రౌడీయిజం చేయలేదు. నువ్వు, నీ తమ్ముడు చేశారు’అంటూ శ్రీధర్బాబు, శ్రీనుబాబులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఆ హత్యల కేసులో ఎంతటివారున్నా వదలం) (దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య) -
న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు
-
న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్య ఉదంతపై పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్రావు హత్య కేసులో తనను ఇరికించేందుకు కుట్రపన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి శ్రీధర్బాబు తనపై అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా తనపై విద్వేషపూరిత వార్తలను ప్రచురిస్తోందని, కేసు దర్యాప్తు చేస్తోంది పోలీసులా..? లేక మీడియానా అని ప్రశ్నించారు. శనివారం మంథనిలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమలో పాల్గొన్న పుట్ట మధుకర్.. తొలిసారి వామన్రావు దంపతుల హత్యపై స్పందించారు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. హత్య అనంతరం తాను పారిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోరానని, దానికి సీఎం నిరాకరించారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కొంతమంది తన వ్యతిరేకులు పుట్ట మధును ఎప్పుడెప్పుడు అరెస్టు చేస్తారని ఎదురుచూస్తున్నారని అన్నారు. పేద బిడ్డ జడ్పీ చైర్మన్ అయితే సహించలేక పోతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. పోలీసు విచారణ తర్వాత వాస్తవాలతో హైదరాబాద్లో మీడియా ముందుకు వస్తానని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న పత్రికలు, టీవీల గురించి కూడా చెప్తానని అన్నారు. తాను రౌడీయిజం చేస్తున్నట్లు శ్రీధర్బాబు ప్రచారం చేస్తున్నారని, అసలు దొంగలు వారేనని విమర్శించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులు కుంట శ్రీనివాస్ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పుట్టమధ మేనల్లుడు బిట్టు శ్రీనును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్కు సమకూర్చాడు. ఈ క్రమంలోనే పుట్టమధు పాత్రపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మేనల్లుడు హత్య కేసులో ఇరుక్కోవడంతో విమర్శల తాకిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. లాయర్ దంపతుల హత్య.. రెండు గంటల్లోనే స్కెచ్ -
పెద్దపల్లి: పోలీసుల అదుపులో బిట్టు శ్రీను
-
పోలీసుల అదుపులో పుట్ట మధు మేనల్లుడు
సాక్షి, పెద్దపల్లి: న్యాయవాద జంట గట్టు వామన్రావు- పీవీ నాగమణి హత్య కేసులో బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో అతడిని విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిట్టు శ్రీను కూడా పట్టుబడటంతో నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడు. వామనరావు దంపతుల హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్కు సమకూర్చాడు. ఈ క్రమంలో శ్రీను కారు డ్రైవర్ చిరంజీవితో కలిసి శ్రీనివాస్ నడిరోడ్డుపైనే అడ్వకేట్ జంటపై హత్యాకాండకు తెగబడ్డాడు. ఇక సొంత గ్రామం గుంజపడుగులో మృతులతో నిందితులకు నెలకొన్న గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణాన్ని వామన్రావు అడ్డుకోవడం, అదే విధంగా ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కారణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. చదవండి: పెద్దపల్లి హత్యలు: సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్ చదవండి: కారు, కత్తులు సమకూర్చింది అతడే! -
భూమి లభించనందునే పంపిణీ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: సాగుకు యోగ్యమైన భూమి లభించనందునే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూపంపిణీ పక్రి య నెమ్మదిగా సాగుతోందని రాష్ట్ర మం త్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇప్పటి వర కు ఈ పథకం కింద రాష్ట్రంలో 15వేల ఎకరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. శనివారం శాసనసభ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లా డారు.దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. మంథని ఘటనపై కాంగ్రెస్ది రాద్ధాంతం.. మంథనిలో కొందరు వ్యక్తుల నడుమ చోటు చేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ పార్టీ రెండు నెలలుగా ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నలభై ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులకోసం చేసిందేమీ లేదన్నారు. చలో మల్లారం పేరిట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునివ్వడాన్ని కొప్పుల ప్రశ్నిస్తూ, ఒక గ్రామంలో జరిగిన ఘటనను టీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయాలో అర్థం కాక తమ పార్టీపై అనవసర రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. రంగయ్య అనే వ్యక్తి మరణానికి సంబంధించి మంథనిలో ఇద్దరు వ్యక్తుల నడుమ జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో పెట్టి చూపుతోందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి వారి మాటలు విని కాంగ్రెస్ నేతలు దళితుల కోసం పోరాటం అంటూ హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. -
రాజుకున్న రాజకీయ వేడి
సాక్షి, వరంగల్: వారిద్దరు అధికారి పార్టీ నాయకులు.. కానీ ఒకరంటే ఒకరికి పడదని ఆరోపణలు బయటకు పొక్కుతున్నాయి. వారి మధ్య సయోధ్య కుదురడం లేదనే తెలిసింది. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మ న్ పుట్ట మధుకర్, కాళేశ్వరాలయ మాజీ చైర్మ న్ బొమ్మెర వెంకటేశం మధ్య వైరం తీవ్రస్థాయికి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోమారు వరించిన అదృష్టం.. కాళేశ్వరాలయ పాలక మండలి గడువు ముగియండతో కొత్త పాలకవర్గం నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేటకు చెందిన బొమ్మెర వెంకటేశం సీఎం కేసీఆర్కు బాల్యమిత్రుడు కావడంతో రెండోసారి కూడా అవకాశం కల్పించారు. అయితే స్థానికంగా ఉన్న నాయకులను కాదని స్థానికేతరుడికి వరుసగా రెండుసార్లు అవకాశాలు కల్పించారని పుట్ట మధుకర్ మనోవేదనకు గురైనట్లు తెలిసింది. క్రితం సారి కూడా పుట్ట మధు మంథని నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన అనుచరుడికి కాళేశ్వరాలయ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని ఆశించారు. కానీ కేసీఆర్ స్నేహితుడి రూపంలో భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో మధుకర్ అనుచరుడు కాటారంకు చెందిన లచ్చిరెడ్డికి ఆలయ చైర్మన్ పదవి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ల మధ్య దూరం పెరుగుతూ వస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. తన అనుచరుడిని కాదని ఇతర జిల్లాకు చెందిన వ్యక్తికి పదవి కట్టబెట్టడంతో పుట్ట మధుకర్ అప్పటి చైర్మన్ వెంకటేశంపై విముఖతతో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నేటి కార్యక్రమం వాయిదా.. నేటి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్కుమార్తో పాటు రాష్ట్ర ముఖ్యులకు కాబోయే చైర్మన్ బొమ్మెర వెంకటేశం ఆహ్వానాలు పంపారు. హంగుఆర్భాటాలతో ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇదంతా జరుగుతున్నా టీఆర్ఎస్ మంథ«ని నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్కు ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని పాలకమండలి కనీసం ఫోన్ ద్వారాకూడా తెలుపలేదు. ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే వద్దకు ఈఓ మారుతి, డైరెక్టర్ల బృందంతో కలిసి వెంకటేశం వెళ్లారు. ఆయన నివాసంలో వెంకటేశం ఒంటెత్తు పోకడపైన మధుకర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంత సేపు తన ఆలయం నిర్వహణ బాధ్యతలు సరిగా చేపట్టలేదని తన నియోజకర్గంలో కూడా చైర్మన్ పదవికి అర్హులు ఉన్నట్లు ఆయనతో బాహాటంగానే పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. తమకు ముందస్తుగా ఆహ్వానం లేనందున ఇతర కార్యక్రమాలు ఉండడంతో జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్తో కలిసి మరో తేదీని నిర్ణయిస్తామని తెలిపి పంపారు. ప్రమాణ స్వీకారం వాయిదా వేయాలని ఈఓ, డైరెక్టర్లకు సూచించారు. ఆదిలోనే అడ్డంకులు ప్రమాణ స్వీకారం ఈనెల 14న సోమవారం ఉదయం 10.12గంటలకు చేయాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పాలకమండలికి ఆదిలోనే అడ్డంకులు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య వైరం ఒక్కసారిగా బయటకు పొక్కింది. దీనిపై మండలంతో పాటు మంథని నియోజకవర్గం స్థాయిలో చర్చ సాగుతోంది. కాగా పాలకమండలిలో 15 మంది డైరెక్టర్లు ఉండగా 13మంది డైరెక్టర్లు పుట్ట మధుకర్కు చెందివారు కాగా కాబోయే చైర్మన్ వెంకటేశం మాత్రమే సీఎం అనుచరుడిగా బరిలో ఉన్నారు. మరొక్కరు ఎక్స్అపీషియో మెంబర్గా అర్చకుడిని తీసుకోనున్నారు. కాగా కాళేశ్వరాలయంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. -
ఒకే వేదికపై శ్రీధర్బాబు.. పుట్ట మధు
సాక్షి, మంథని : వారిద్దరూ రాజకీయ శత్రువులు. ఎక్కడ ఎదురుపడినా ఎడమొహం.. పెడమెహమే ఉంటుంది. అయితే బుధవారం మంథనిలో సింగరేణి సంస్థ ఆర్జీ– 3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్తో పాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, జెడ్పీ చైర్పర్సన్ పుట్టమధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక బొక్కలవాగు కరకట్టలపై మొక్కలు నాటారు. అనంతరం హరితహారంపై సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుట్టమధు, శ్రీధర్బాబు ఒకే వేదికపై కూర్చున్నారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఇరు పార్టీల కార్యకర్తలు ఇద్దరు నేతలకు మద్దతుగా పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సింగరేణి అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రొటోకాల్ లేదని, సింగరేణి అధికారులపై ఒత్తిడిచేశారని జిల్లా పరిషత్ చైర్మన్ కౌంటర్ ఇచ్చారు. అనంతరం జిల్లాపరిషత్ పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. మొత్తంమీద కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో కార్యకర్తలు.. పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
కొలువుదీరిన కొత్త జెడ్పీ
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పరిషత్ పాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. నూతనంగా ఎంపిక చేసిన జిల్లాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేదర్, కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారీ సమక్షంలో కమాన్పూర్ జెడ్పీటీసీ పుట్టమధుతో కలెక్టర్ శ్రీదేవసేన జెడ్పీ చైర్మన్గా ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మధు ప్రమాణం చేశారు. అనంతరం వైస్ చైర్పర్సన్ మండిగ రేణుకతో కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత 9 మంది జెడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. జెడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు.. పెద్దపల్లిలోని రైల్వేస్టేషన్ సమీపంలోని నూతన జిల్లాపరిషత్ కార్యాలయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మొదట ప్రారంభించారు. అనంతరం జోడ్పీ చైర్మన్, వైస్చైర్పర్సన్తోపాటు 9 మంది సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు పుట్టమధును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రుల సమక్షంలో జెడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించి కుర్చీలో కూర్చున్నారు. అనంతరం నాయకులు కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ రాకేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, పోలీస్హౌసింగ్బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, ఆర్డీవో ఉపేందర్రెడ్డి సీఈవో వినోద్కుమార్, పంచాయితీ అధికారి సుదర్శన్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి మేలు చేసే నాయకుడు.. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి జెడ్పీ చైర్మన్ పుట్టమధు సమాజానికి మేలు చేసే నాయకుడిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావడానికి భూసేకరణ సమయంలో ఎమ్మెల్యేగా పుట్టమధు పాత్రను గుర్తు చేశారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా కేసీఆర్ గుర్తించి అవకాశం కల్పించారన్నారు. స్వచ్ఛ జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈసందర్భంగా ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రంలో అన్నింటి కంటే ముందు పెద్దపల్లి జిల్లా స్వచ్ఛ జిల్లాగా ఏర్పాటవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉంటే అవకాశాలెన్నో..ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజల మధ్య ఉన్న నాయకులకు అవకాశాలు ఎదురుగా వస్తాయని పుట్టమధు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అదే స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే శాసనసభ్యులుగా, జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యారన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలమైంది.. ఈదశంకర్రెడ్డి, ఐడీసీ చైర్మన్ 1952లో మొదలైన పంచాయతీరాజ్ చట్టం వివిధ కోణాల్లో బలోపేతం చేశారన్నారు. గాంధీజయంతి రోజు ఆరంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థలో 30 లక్షల మంది ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి అన్నారు. మూడంచెల విధానంతో దేశంలో 2,34,674 గ్రామపంచాయతీలు, సమితులు, మండలాలు, జిల్లా పరిషత్లు ప్రజలకు సేవలందిస్తున్నయన్నారు. ఇలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ వ్యవస్థకు మరింత పదును పెట్టారన్నారు. కార్యక్రమంలో చిరుమల్ల రాకేశ్, జెడ్పీ వైస్చైర్మన్ మండిగ రేణుక, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్సింగ్, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, జిల్లాలోని జెడ్పీపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్లు.. జెడ్పీ చైర్మన్ పుట్టమధు తనకు అమ్మ నాన్నలు ఎలా ఉంటారో తెలియదు.. బాల్యంలోనే వారిని కోల్పోయిన నాకు ప్రజలే అమ్మానాన్న, దేవుళ్లు అని జెడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పుట్టమధు మాట్లాడారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను పేదరికాన్ని చూశానన్నారు. అన్న య్య సహకారంతో పెరిగి పెద్దయ్యాను. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చేరి జెండా మోసి ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా జనం ఆదరణతో ఎన్నికయ్యానని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ముందు వరుసలో ఉంటానని తెలిపారు. పెద్దపల్లి జిల్లాను ప్రగతిపథంలో నడిపించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశం, జనం దీవెనలతో వచ్చిన పదవిని ప్రజాసేవకే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. -
ఆనందంలో చిందేసిన ఎంపీ, ఎమ్మెల్యే..
పెద్దపల్లి : జిల్లా జెడ్పీ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎన్నిక కావడంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. దీంతో జిల్లాలోని పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సంబరాల్లో సందడి చేశారు. ఎన్నిక అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వెంటేశ్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు ఆనందోత్సహంలో మునిగిపోయారు. వాహనంపై నుంచే కాలు కదుపుతూ చిన్నగా చిందేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుట్ట మధు ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు పేరును ఖరారు చేశారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడంతో.. పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
సమర్థులను పోటీకి దించండి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్ధులను పోటీకి దించండని నేతలను కోరారు. గ్రామస్థాయిలో వంద శాతం టీఆర్ఎస్ పార్టీ బలోపేతమవ్వాలని తెలిపారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళణ తీసుకొని వస్తున్నామని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు ధర్నాలు చేసినా పట్టించుకోవద్దని సూచించారు. జీహెచ్ఎంసీలో కూడా ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇంచార్జులను నియమించారు. ఈ ఎన్నికల బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ప్రధాన కార్యదర్శులకు కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీని, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా పుట్టా మధును ప్రకటించారు. -
మంథని: అసెంబ్లీ అభ్యర్థులకు కాస్త ఊరట
సాక్షి, మంథని: సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మొదలు.. పోలింగ్ వరకు తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన మంథని అసెంబ్లీ అభ్యర్థులకు కాస్త ఊరట లభించింది. నెల రోజుల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ముఖ్యులకు తమ సమయాన్ని వెచ్చించారు. ఎన్నిక ముగిసి ఫలితాలకు సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాస్త సేద తీరారు. కుటుంబసభ్యులు, మిత్రులు, పార్టీ శ్రేణులతో ఓటింగ్ సరళిపై చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్బాబు మంథని సమీపంలోని ఎస్ఎల్బీ గార్డెన్లో నియోజకవర్గంలోని ఆయా గ్రామాలవారీగా పార్టీ శ్రేణులతో పోలింగ్ సరళి, ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందనే దానిపై సమాలోచనలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో బిజీగా గడిపారు. అభిమానులు, పార్టీ శ్రేణులు పుట్ట మధును అభినందిస్తూ గజమాల వేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయడంతో మధు వెళ్లిపోయారు. కాగా ప్రజలు తమకే మద్దతు తెలిపారనే ధీమాను ఎవరికి వారు వ్యక్తం చేస్తున్నారు. -
కూటమి మాటలు నమ్మొద్దు
సాక్షి, రామగిరి/మంథని : మాయమాటలు చెబుతూ మభ్యపెట్టేందుకు వస్తున్న మహాకూటమి నాయకులను నిమ్మితే మనల్ని నట్టేట ముంచుతారని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు పేర్కొన్నారు. చందనాపూర్, ఎస్సీకాలనీ, పెద్దంపేట, పస్నూరు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మండల అధ్యక్షుడు పూదరి సత్యనారాయణగౌడ్, అధికార ప్రతినిధి కొంరయ్యగౌడ్, ఎంపీటీసీ ఎలువాక ఓదెలు, నాయకులు దాసరి రాయలింగు, బేతి కుమార్, ఇజ్జగిరి రాజు, గద్దల శంకర్, మేదరవేన కుమార్, రొడ్డ శ్రీనివాస్, పొన్నం సదానందం, శ్యాం(లడ్డా), వేగోళపు మల్లయ్య, ఆసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నాల్గున్నర సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వాకర్స్ను కలిశారు. పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన యువత ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వారితో మాట్లాడారు. యోగా సాధన చేస్తున్నవారిని కలిసి ఓటు అభ్యర్థించారు, ఏగోళపు శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా.. మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్?
సాక్షి, వరంగల్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ములుగు, మంథని, మణుగూరు ఏరియాల్లో నేతలే టార్గెట్గా మావోయిస్ట్ యాక్షన్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ములుగులో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ మెంబర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమపై జరిపిన దాడి తరహాలో మరో దాడికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి, రెక్కీకి టీమ్ వచ్చినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి చందూలాల్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, ఇతర టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా మూడు యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒకరు పోలీసులకు చిక్కడంతో మిగతా వారికోసం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యాక్షన్ టీమ్ సభ్యుడు చిక్కడంతో నేతలకు ప్రమాదం తప్పింది. మావోయిస్టుల టార్గెట్స్ని పోలీసులు అప్రమత్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో గులాబీ నేతలకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు. -
అభ్యర్థుల దూకుడు..!
సాక్షి, మంథని : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారానికి 8 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంను ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నెల రోజుల కిందే అభ్యర్థులను ప్రకటించడంతో మంథని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. శుభకార్యాలు, అశుభ కార్యక్రమాల పేరిట ప్రజలను పలకరించారు. రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ప్రధానంగా నెలకొనడంతో ఇద్దరు పత్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా గ్రామాల్లో ప్రచార రథాలను దింపారు. ఓటర్లను ఆకర్షించేలా పాటలు, ప్రత్యర్థుల వైఫల్యాలు, తమ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచార రథాల్లో దూసుకుపోతున్నారు. మహిళలు, యువకులతో ప్రత్యేక సమావేశాలు, చేరికలను ఓవైపు చేస్తూనే ఇంటించా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం, రాత్రి సమావేశాలు నిర్వహిస్తూ పొద్దంతా గ్రామాల్లోనే ప్రచారం చేస్తున్నారు. గతం కంటే భిన్నం.. నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు గతం కంటే భిన్నంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొనడంతో అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అభ్యర్థులే కాకుండా వారి బంధువులు, కూతుళ్లు, కుమారులు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈనెల 30న మంథనిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, వచ్చేనెల 1 లేదా 2న సినీ నటి విజయశాంతి, ప్రజా గాయకుడు గద్దర్తోపాటు ఇతర నాయకుల పర్యటనలు సైతం ఉండండంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తూర్పు మండలాల్లో రెండు రోజులుగా ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
అభివృద్ధిని విస్మరించారు
పెద్దపల్లి : మంథని నియోజకవర్గాన్ని అరవై సంవత్సరాలు పాలించిన నాయకులు అభివృద్ధిని విస్మరించడంతో వెనుకబాటును ఎదుర్కొంటుందని టీఆర్ఎస్ మంథని అసెంబ్లీ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. ఆదివారం మండలం ఎగ్లాస్పూర్, నెల్లిపల్లి,గుంజపడుగు, ఉప్పట్లతో పాటు మంథని మున్సిపాలిటీలో వ్యాపార కూడలిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మా పాలనలో అభివృద్ధి చేసామని మాజీ మంత్రి శ్రీధర్బాబు పదే పదే చెబుతున్నారని, ఒక్క పని కూడూ చేయకుండా తాము అభివృద్ధి్ద చే శామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా వారికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేసానన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిప్రజలకు సేవచేసామన్నారు. మరోసారి అవకాశం మరింత అధ్భుతంగా అభివృద్ధి్ద చూపిస్తామన్నారు. ఎంపీపీ ఏగోళపు కమల, మండల కో–ఆప్షన్ సభ్యుడు యాకూబ్,మండల పార్టీ అధ్యక్షుడు కొండ శంకర్, పట్టణ శాఖ అధ్యక్షుడు అరెపల్లి కుమార్,మంథని మాజీ సర్పంచ్ పుట్ట శైలజ, నాయకులు ఏగోళపు శంకర్తో పాటు తదితరులు ఉన్నారు. పల్లీలు విక్రయిస్తూ... పెద్దపల్లి జిల్లా మంథని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చికెన్ మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో పల్లీలు విక్రయించారు. కటింగ్ షాపులో కటింగ్ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్లో చేరిక కమాన్పూర్: మండలంలోని గుండారం గ్రామ మాజీ సర్పంచ్ పిడుగు నర్సయ్య ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. నర్సయ్య టీడీపీ ప్రభుత్వ హయంలో సర్పంచ్గా కొనసాగారు. పార్టీలో చేరిన పిడుగు నర్సయ్యకు పుట్ట మధు కండువవేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పిన్రెడ్డి కిషన్రెడ్డి, గుండారం తాజా మాజీ సర్పంచ్ ఆకుల గట్టయ్యలతో పాటు తదితరులున్నారు. -
అవకాశమిస్తే సేవకునిగా పనిచేస్తా...
రామగిరి(మంథని) : ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో మరో అవకాశం ఇస్తే ప్రజా సంక్షేమానికి సేవకుడిలా పనిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. సెంటినరీకాలనీ రాణి రుద్రమాదేవి స్టేడియంలో గురువారం తెల్లవారు జామున వాకర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. మండలాధ్యక్షుడు పూదరి సత్యనారాయణ, ఎంపీటీసీ ఆశాకుమారి, నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరికలు రామగిరి: టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. ఇనగంటి రామారావు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ ఓపీపీ1 సీహెచ్పీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 50 మంది పుట్టమధు సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మండలాధ్యక్షుడు పూదరి సత్యనారాయణ, కిషన్రెడ్డి, ఎంపీటీసీ ఆశాకుమారి నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఇంటింటీ ప్రచారం కమాన్పూర్: మండలంలోని పెంచికల్పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధును గెలిపించాలని కోరుతూ గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పుట్ట మధు కోడలు కుషాలీ ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి తన మామ పుట్ట మధును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్రెడ్డి కిషన్రెడ్డి, ఇనగంటి భాస్కర్రావు, రామారావు, గడుప కృష్ణమూర్తి, కూర విజయ, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి చూసే టీఆర్ఎస్లో చేరికలు
ముత్తారం: 4సంవత్సరాల్లో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల కిష్టయ్య, వీరేందర్తోపాటు 20 మంది కాంగ్రెస్ నాయకులు ఆదివారం మధు సమక్షంలో కండువా కప్పుకున్నారు. ముత్తారం గ్రామానికి చెందిన శ్రీరామా యూత్ సభ్యులు 20 మంది టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సంజీవ్రెడ్డి ఆధ్వర్యంలో మధు సమక్షంలో చేరారు. ఎంపీపీ అత్తె చంద్రమౌళి, మండల అధ్యక్షుడు కిషన్రెడ్డి, మాజీ సర్పంచ్ నూనె కూమార్, చెల్కల అశోక్, నాయకులు భాను, తిత్తుల శ్రీనివాస్, దాసరి చంద్రమౌళి, సత్తన్న తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించండి... రామగిరి: 4సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి చేశానని, మరోసారి ఓటేసి ఆశీర్వదిస్తే అభివృద్ధిలో నియోజకవర్గ రూపురేఖలే మార్చేసేలా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు. మస్త్యాల, సింగిరెడ్డిపల్లి గ్రామాల్లో మాజీ ఎంపీ వివేక్తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. వివేక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో గొప్పవన్నారు. ఎంపీటీసీలు ఎలువాక ఓదెలు, బాకం రాజేశం, మాజీ సర్పంచ్ సుంకరి మాధవిమహేశ్, మండల అధ్యక్షుడు పూదరి సత్యనారాయణగౌడ్, అధికార ప్రతినిధి కొంరయ్య పాల్గొన్నారు. -
పుట్ట మధును మరోసారి ఆశీర్వదించండి
మంథని: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు జెడ్పీటీసీ సభ్యడు గోనె శ్రీనివాస్రావు ఆద్వర్యంలో మండలంలోని తాడిచర్ల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పుట్ట మధు నియోజకవర్గ పరధిలోని ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధును భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. మండలంలోని పెదతూండ్ల ఎస్సీ కాలనీకి చెందిన యూత్, మహిళ సభ్యులు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట మధు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాజోద్ధిన్, యూత్ అధ్యక్షుడు బాలాజీ, నాయకులు శీలం లక్ష్మయ్య, మెతుకు సమ్మయ్య, అనిపెద్ది రాంబాబు, తిరుపతిరావు, బొంతల రాజు, మల్లేష్, రఘుపతి, ఇనుముల సతీష్, సారయ్య, రాజు, సదానందం, సురేష్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు. కాటారం: మండలంలోని జాదారావుపేటలో ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత నాలుగున్నరెళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో గూర్చి గ్రామస్థులకు వివరించారు. గతంలో ఈ ప్రాంతాన్ని ఏకదాటిగా పాలించిన కాంగ్రెస్ నాయకులు ప్రజల కష్టాలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన బిడ్డగా పుట్ట మధు ఎమ్మెల్యేగా 2014లో గెలిచాక స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మొసలి కన్నీరు, మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ తుల్సెగారి శంకరయ్య, నాయకులు నరివెద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి.. మహదేవపూర్:మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బగూడెం, టస్సర్కాలనీ, ఇస్లాంపుర కాలనీల్లో ఆదివారం ఇంటింటా ప్రచారం చేస్తూ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్దించారు. ఈ పచ్రార కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి బాపు, కాటారం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు అలీంఖాన్, సమ్మిరెడ్డి, డివిజన్ సమస్వయ కమిటీ సభ్యులు బాలా జీరావు, పెండ్యాల మనోహర్, కార్యకర్తలు శ్రీహ రి, ప్రకాశ్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. గెలుపు ఖాయం.. మహదేవపూర్: మంథనిలో పుట్ట మధు గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు బెల్లంకొండ నర్సింగరావు అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన మండల కేంద్రంలోని పూర్వపు స్నేహితులు, సన్నిహితులతో కలసి ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధు పట్ల ప్రజాధరణ పెరిగిందని, మండలంలో 60శాతం ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బహూమానంగా ఇవ్వాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీపతి బాపు, నాయకులు దాబాడే బాలాజీరావు, శ్రీనివాసరావు, మోహన్రెడ్డి, ప్రకాశ్, ప్రభాకర్, సంజీవరెడ్డి, ప్రవీణ్, రమణయ్య, పద్మ, రవీందర్, సమ్మయ్యలు ఉన్నారు. -
ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావ్
హైదరాబాద్: నా మీద కేసులు ఉన్నాయని చెబుతున్నావ్..అవి నువ్వు(పుట్టా మధు), నీ అనుచరులు పెట్టిన కేసులేనని మంథని మాజీ ఉప సర్పంచ్, పుట్టా మధు బాధితుడు సతీష్ ఆరోపించారు. హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో సతీష్ విలేకరులతో మాట్లాడుతూ..అడవిలో ఉన్న ఎమ్మెల్యే అంటున్నావ్..ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావ్ అని పుట్టా మధుని సతీష్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాను పుట్టా మధుపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. మధు మీద ఫిర్యాదు చేసి 3 నెలలు అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని అడిగారు. మంథనిలో ఉన్న మీడియాను తన కనుసన్నల్లో మేనేజ్ చేస్తున్నారని..అందుకే హైదరాబాద్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే తనకు పుట్టా మధుతో ప్రాణ హాని ఉందన్నారు. అందుకే హైదరాబాద్లో తలదాచుకుంటున్నట్లు వెల్లడించారు. బీసీ ఎమ్మెల్యే ముసుగులో ఎంతో మందిని అణచివేశారని ఆరోపించారు. పుట్టా మధుపై 6 కేసులు నమోదయ్యాయని, ప్రజలందరూ చూస్తుండగానే ఎస్ఐపై కండువా వేశారని, అది తప్పుకాదా అని ప్రశ్నించారు. గుండా నాగరాజు కేసులో పుట్టా మధు ముమ్మాటికీ నిందితుడేనని, గుండా బలిదానం వల్లే పుట్టా మధు ఎమ్మెల్యే అయ్యాడని చెప్పారు. అప్పటి స్థానిక ఎస్ఐ వల్ల కేసు నుంచి పుట్టా మధు తప్పించుకున్నాడని, అదే ఎస్ఐ ఇప్పుడు మంథని సీఐగా ఉన్నాడని వెల్లడించారు. పుట్టా మధు చెబుతున్నట్లు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పుట్టా మధుకు రూ.900 కోట్ల ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు. తన వెనక మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారన్నది అవాస్తవమన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతికి లైసెన్స్ ఇస్తుందని విమర్శించారు. -
శ్రీధర్బాబు కుట్రలు సాగవు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేత శ్రీధర్బాబు ఎన్నికల సమయంలో తనపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని మంథని టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. రూ. తొమ్మిది వందల కోట్లు సంపాదించానని ఆరోపణలు చేస్తున్నారని, ఎవరైనా రూ.రెండు కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని అన్నారు. తనపై కేసులు ఉంటే శ్రీధర్బాబు మంత్రిగా ఉన్నప్పుడు వదిలి పెట్టేవారా.. అని ప్రశ్నించారు. మంగళవారమిక్కడి తెలంగాణభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆధారాలు లేకుండా హైదరాబాద్లో నాపై ఫిర్యాదులు చేస్తే మీడియా ఇంత హైలైట్ చేస్తుందని అనుకోలేదు. ఇది బాధాకరం. గుండా నాగరాజు హత్య కేసులో బిల్లా రమణారెడ్డి ముద్దాయి. ముద్దాయికి సాక్ష్యం చెప్పే అర్హత ఉంటుందా? నేను ఆ కేసులోనే లేను. ఆ కేసు కొలిక్కి వచ్చినందుకే నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మీడియా నాపై ఇంత కక్ష ఎందుకు కట్టిందో అర్థం కావడం లేదు. మంథని కేంద్రంగా కొన్ని ముఠాలు ఏర్పడ్డాయి. నన్ను బద్నామ్ చేయడమే వాటి పని. నా మీద ఓడిపోయిన కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు నన్ను బద్నామ్ చేసేందుకు ఆ ముఠాలకు బాధ్యత అప్పజెప్పారు. శ్రీధర్బాబు మళ్లీ ఓడిపోతాననే భయంతో ఇలాంటి వాటిని ప్రేరేపిస్తున్నారు. నా ఆస్తులపైనా రాద్ధాంతం చేస్తున్నారు. హైదరాబాద్లో సినీనటుడు శ్రీహరి ఇంటి పక్కన కోట్ల రూపాయల విలువైన ప్లాట్ ఉందని ఏమీ తెలుసుకోకుండానే మీడియా ప్రచురించింది, ప్రసారం చేసింది. పూరిగుడిసెలో పుట్టి ఎమ్మెల్యే అయిన నాలాంటి వాడికి కోట్ల రూపాయల ప్లాట్ సంపాదించడం సాధ్యమవుతుందా... ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు వందల కోట్లు సంపాదించానని అంటున్నారు. అదే నిజమైతే ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా.. పేదలు ఎమ్మెల్యేలు కాకూడదా? దొంగలు ఫిర్యాదు చేస్తే ఏమీ తెలుసుకోకుండా మీడియా ప్రాధాన్యతనివ్వడం సమంజసమా? శ్రీధర్బాబు రచిస్తున్న నాటకాల్లో భాగంగానే నాపై కుట్ర జరుగుతోంది. నాపై వస్తున్న అసత్య ఆరోపణలకు సంబంధించి ఇకనైనా మీడియా వివరణ తీసుకుని ప్రచురించాలి. ఇలాంటి అసత్య వార్తలను నిలిపివేయాలని కోరుతున్నాను’ అని అన్నారు. -
పుట్ట మధుపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : మంథని టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బాధితుడు రామన్నరెడ్డి సోమవారం తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి తన గోడును వినిపించారు. పుట్ట మధు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, తనకు రక్షణ కల్పించాలని డీజీపీని అభ్యర్థించారు. 2013లో టీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ ముందు ఆత్మహత్య చేసుకున్న గుండా నాగరాజు కేసులో సాక్ష్యం చెప్పొద్దంటూ పుట్ట మధు తనను బెదిరిస్తున్నారని రామన్నరెడ్డి డీజీపీకి తెలియజేశారు. 2014 ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే టిక్కెట్ పుట్ట మదుకు ఇవ్వాలంటూ గుండా నాగరాజు అనే కార్యకర్త టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, నాగరాజు ఆత్మహత్య చేసుకోవడానికి రూ. 50వేలు ఇచ్చి ప్రేరేపించింది పుట్ట మధునేనని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బాధితుడు డీజీపీకి సమర్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కాల్డేటాతో సహా, చనిపోయిన నాగరాజు ఇచ్చిన వాంగ్మూల ప్రతులను డీజీపీకి రామన్న అందజేశారు. నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా పోలీసులు పుట్ట మధును నిందితుడిగా చేర్చకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కాపాడుతున్నారని బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. -
పుట్టా మధుకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధు తన కుమారుడి వివాహ వేడుకల నిమిత్తం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ల్యాబొరేటరీ భవనాల్ని కూల్చివేయడంపై హైకోర్టు స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే మధుతోపాటు ప్రతివాదులైన ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్ బోర్డు డైరెక్టర్, జిల్లా కలెక్టర్, వరంగల్లోని ఆర్జేడీ, మంథని మున్సిపల్ కమిషనర్, పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇతరులకు నోటీసులు జారీ చేసింది. కుమారుడి వివాహ విందు నిర్వహించేందుకు అడ్డుగా ఉన్నాయని మంథని జూనియర్ కాలేజీలోని భవనాల్ని రాజకీయ హోదాను అడ్డం పెట్టుకుని మధు కూల్చివేయించారని ఆ కాలేజీ పూర్వపు విద్యార్థి ఇనుముల సతీశ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం విచారించింది. ప్రతివాదులు వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. -
వివాదంలో టీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే
-
పెద్దపల్లి సభలో బాహాబాహీ..
-
పెద్దపల్లి సభలో బాహాబాహీ..
మాజీ మంత్రి శ్రీధర్బాబు వర్సెస్ ఎమ్మెల్యే పుట్ట మధు - ప్రాజెక్టుపై అభిప్రాయ సేకరణ సందర్భంగా దాడి పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్: కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై తలపెట్టిన అభిప్రాయ సేకరణలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ మంత్రి శ్రీధర్బాబు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. పెద్దపల్లిలో బుధవారం పర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు తలపెట్టిన అభిప్రా య సేకరణ రసాభాసగా ముగిసింది. ఇరువర్గాల మధ్య దాడిలో ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి. మాజీ మంత్రి అనుచరులు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం గొడవకు దారితీసింది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడి అడ్డుకుంటున్న వారిని అరెస్టు చేసి అభిప్రాయ సేకరణ కానిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పట్ల శ్రీనివాస్ మైక్ అందుకొని ప్రాజెక్టుకు వ్యతిరే కంగా ప్రసంగించారు. శ్రీనుపై టీఆర్ఎస్ నాయకులు పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి దిగారు. దీనిని వ్యతిరేకించే క్రమంలో మంథనికి చెందిన క్రాంతి, కొత్త శ్రీనివాస్లపై కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు కుర్చీలు విసిరేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను నిలువరించారు. సమావేశానికి హాజరైన శ్రీధర్బాబు సహా కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేసి పెద్దపల్లి పోలీస్స్టేషన్కు తరలిం చారు. ఆహారం తీసుకునేందుకు కూడా అనుమ తించడం లేదని స్టేషన్ ముందు బైఠాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జై: ఇన్చార్జి కలెక్టర్ పెద్దపల్లిలో కాలుష్య మండలి ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న 25 మందిలో 23 మంది కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడారని ఇన్చార్జి కలెక్టర్ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణ జరగాలని అంటే.. 150 కి.మీ దూరంలోని కాళేశ్వరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు కోసం అక్కడి భూనిర్వాసితులతో అభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరించా రని శ్రీధర్బాబు విమర్శించారు. -
పేదలకు చదువు భారం దించాం
► రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంథని: గ్రామీణ ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులపై చదువు భారం పడకుండా తమ ప్రభుత్వం కొత్త కళాశాలలు, వసతి గృహాలను ఏర్పాటుచేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంథని, కమాన్ పూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. మంథనిలో రూ.3 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వసతి గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదివిన వ్యక్తి హోంగార్డు కోసం, ఎంబీఏ చదివినవారు చిన్న ఉద్యోగం కోసం పోటీపడడం చూస్తే బాధేసిందన్నారు. అలాంటి కష్టాలను తీర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మారుమూల గిరిజన తడాల్లో గుడిసెల్లో విద్యార్థులు గొప్పగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే హాస్టళ్లలో సన్నబియ్యం పెడుతూ పేద విద్యార్థుల కడుపు నింపున్నామన్నారు. మంథని బొక్కలవాగుపై రివర్ ప్లాంటు మంథని బొక్కలవాగుపై రివర్ ప్లాంట్ నిర్మిస్తామని తెలిపారు. ఇటీవల నర్మదానదిని సందర్శించామని, అక్కడి మాదిరిగా మంథని బొక్కలవాగును అభివృద్ధి చేసి వేలాది మంది పర్యాటకులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఎన్ని కోట్ల నిధులైనా కేటాయిస్తానని హామీఇచ్చారు. ఒకనాడు హింసను, దుఖాన్ని అనుభవించిన ప్రాంతమని, వారి కష్టాలను తీర్చుతామని తెలిపారు. ఆపద వస్తే నేనున్నానని భరోసా కల్పించేవారే ప్రజాప్రతినిధి అని, అలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంథని నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని చెప్పారు. రూ.4.10కోట్లు స్వశక్తి రుణాలు, కోటి రూపాయల స్త్రీనిధి రుణాల చెక్కును అందజేశారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ అంజయ్య, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, మంథని, ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, జెడ్పీటీసీలు మూల సరోజన, రాజిరెడ్డి, శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్ పాల్గొన్నారు. కరెంట్ కష్టాలు తీర్చడానికే సబ్స్టేన్ నిర్మాణం కమాన్ పూర్: లోవోలే్టజీ కరెంట్ కష్టాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ సంకల్పంతో సబ్స్టేన్ ల నిర్మాణాలు చేపడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వ్యవసాయరంగానికి నిరంతరంగా పగలు తొమ్మిదిగంటల విద్యుత్ సరఫరా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. కమాన్ పూర్ మండలం గుండారంలో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేన్ బీటీ రోడ్డులను ప్రారంభించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలను తీర్చడానికి కృషిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే పుట్ట మధు, ఎంపీపీ ఇనగంటి ప్రేమతల, ఏఎంసీ చైర్మన్ పీట్ల మంజూల. పీఏసీఎస్ చైర్మన్లు బాద్రపు మల్లేష్, మల్క రామస్వామి పాల్గొన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే పుట్టా మధు
-
‘పుట్ట మధుపై పోలీసులను ఆశ్రయించండి’
సాక్షి, హైదరాబాద్: తనపై ఉన్న క్రిమినల్ కేసులను కరీంనగర్ జిల్లా మంథని అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించకుంటే... దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుడైన అక్కడి స్వ తంత్ర అభ్యర్థి సి.సునీల్కుమార్కు హైకోర్టు సూచించింది. ఈ విషయంలో ప్రస్తుతం అంతకుమించి ఆదేశాలు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా ఆధ్వర్యంలో ధర్మాసనం మంగళవారం తేల్చిచెప్పింది. -
ధన్వాడలో ఉద్రిక్తత
కాటారం, న్యూస్లైన్: ఎన్నికల వేళ గ్రామాలు రణరంగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామమైన కాటారం మండలం ధన్వాడలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పుట్ట మధు సమక్షంలో టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, ఓయూ జేఏసీ నాయకులు, కళాకారుల బృందం ఆదివారం ధన్వాడకు చేరుకుంది. గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై దాడికి దిగినట్లు టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శ్రీధర్బాబు స్వగ్రామం ఇక్కడకు ఇతర పార్టీల నాయకులు రావొద్దు అంటూ వారిని గ్రామం నుంచి బయటకు పంపించినట్లు చెప్పారు. ఈవిషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధన్వాడకు చేరుకున్నారు. అదే స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సైతం అక్కడికి వచ్చాయి. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం పుట్ట మధు ధన్వాడకు చేరుకుని పార్టీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చల్ల వెంకటరెడ్డి, రాజీర్తో పాటు సుమారు 30 మందికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఓటమి భయంతోనే దాడులు: మధు రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు ఆరోపించారు. చేరికల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై విరక్తి చెంది టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీని, తనను ఆదరిస్తున్న వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. దాడి విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బొమ్మ మల్లారెడ్డి, చిలుముల శ్రీనివాస్, నాయిని శ్రీనివాస్, ఊదరి లక్ష్మణ్, పుట్ట ముఖేశ్, సర్పంచ్ మందల లక్ష్మారెడ్డి, సురేశ్, ఊదరి సత్యం ఉన్నారు.