Queen Elizabeth II
-
క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను.. వెరీ ఇంట్రెస్టింగ్!
బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II పెళ్లి నాటి గౌను వెనుక చాల పెద్ద కథ ఉంది. ఆమె 1947 నవంబర్ 20న ప్రిన్స్ ఫిలిప్ని వివాహం చేసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. దీంతో బ్రిటన్ దేశం ప్రజలు పొదుపు పాటించేలా గట్టి చర్యలు తీసుకుంది. అంటే ఆ సమయంలో ఎలాంటి ఫంక్షన్లకు విలాసవతంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. ఇది బ్రిటన్ రాజ వంశానికి కూడా వర్తిస్తుందట. ఎందుకుంటే యథా రాజా తథా ప్రజాః అన్న ఆర్యోక్తి రీత్యా బ్రిటన్ రాజవంశానికి కూడా పొదుపు పాటించక తప్పలేదు. దీంతో అదే టైంలో రాణి ఎలిజబెత్ II వివాహం జరగనుండటంతో ఆమె దుస్తుల ఖర్చుల కోసం ఆ రాజవంశం ఎలా పొదుపు పాటించిందో వింటే ఆశ్చర్యపోతారు.దివంగత క్వీన్ ఎలిజబెత్ II వివాహం వెస్ట్మిన్స్టర్ అబ్బేలో ఘనంగా జరిగింది. రాణి వివాహ గౌనులో అత్యద్భుతంగా కనిపించింది. అక్కడకు విచ్చేసిన అతిధులందరి చూపులను ఆకర్షించింది. ఆమె గౌనుని బ్రిటన్ రాజ వంశానికి చెందిన ప్రముఖ ప్యాషన్ డిజైనర్ డచెస్ శాటిన్ రూపొందించారు. దీన్ని చక్కటి పూలు, ముత్యాలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అతని డిజైన్కి అనుగుణంగా వివాహ వెడ్డింగ్ హాలు పెయింటింగ్ను కూడా తీర్చిదిద్దారు. ఆ గౌనుపై దాదాపు 10 వేలకు పైగా ముత్యాలను వినియోగించారు. సుమారు 14 అడుగుల పొడవుతో ఎంబ్రాడరీ డిజైన్తో తీర్చిదిద్దారు. అయితే ఈ డిజైనన్ని పెళ్లికి మూడు నెలల ముందుగా ఆమోదించింది రాజకుటుంబం. అందువల్ల ఆ డిజైన్కి అనుగుణంగా వెడ్డింగ్ డెకరేషన్ని ఏర్పాటు చేశారు. దీని ధర వచ్చేసి ఆ రోజుల్లే దాదపు రూ. 25 లక్షల ధర పైనే పలికిందట. అయితే రెండో ప్రపంచ యుద్ధం దృష్ట్యా పొదుపుకి పెద్ద పీట వేస్తూ బ్రిటన్ దేశం ఇచ్చిన రేషన్ కూపన్లను వినియోగించుకుని విలాసవంతంగా డబ్బులు వెచ్చించకుండా జాగ్రత్త పడిందట రాజ కుటుంబం. యుధ్దం కారణంగా బ్రిటన్ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఆహారం, బట్టలు, సబ్బులు వంటి కొన్ని వాటిని రేషన్ చేసింది. దీంతో రాజకుటుంబం ఆ రేషన్ని ఉపయోగించుకునే మన రాణి ఎలిబబెత్ పెళ్లి గౌనుని కొనుగోలు చేసిందట. తాము రాజవంశస్తులమనే దర్పం చూపక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది బ్రిటన్ రాజ కుటుంబం. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
బ్రిటన్ రాణి సైతం చాక్లెట్ టేస్ట్కీ ఫిదా..!
చాక్లెట్లంటే చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమో మనందరికి తెలిసిందే. అలాంటి చాక్లెట్ల టేస్ట్కి బ్రిటన్ రాణి క్వీన్ఎలిజబెత్ కూడా ఫిదా అయ్యిపోయేవారట. ఆమె తన స్నాక్స్ టైంలో చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనట. రాజదర్పానికి తగ్గట్టుగా ఆమె అత్యంత ఖరీదైన చాక్లెట్లనే ఇష్టపడేవారట. అవి అంటే ఆమెకు మహాప్రీతి అని బకింగ్హామ్ ప్యాలెస్ చెఫ్ చెబుతున్నారు. అంతేగాదు ఆయన క్వీన్ ఇష్టపడే చాక్లెట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.దివంగత క్వీన్ ఎలిజబెత్ II చాలా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంభించేవారు. ఆమె మంచి ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధిగాంచిన రాణి కూడా. అయితే క్వీన్ ఎలిజబెత్కి సైతం చాక్లెట్లంటే ఇష్టమని ఆ రాజకుటుంబానికి సేవలందించిన చెఫ్ డారెన్ మెక్గ్రాడీ చెబుతున్నారు. ఆమె డార్క్ చాక్లెట్లు మాత్రమే ఇష్టంగా తినేవారని అన్నారు. పాలతో తయారు చేసిన చాక్లెట్లను ఇష్టపడేవారు కారట. డార్క్ చాక్లెట్తో మిక్స్ చేసి ఉండే పుదీనా బెండిక్స్ ఫాండెట్లను ఇష్టంగా తినేవారట. ఈ చాక్లెట్ బాక్స్ ఒక్కోటినే రూ. 544లు పలుకుతుందట. ఆమె రోజులో ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం, సాయం సమయంలో టీ.. ఆపై రాత్రి భోజనంగా జీవనశైలి ఉంటుందట. ఆమె గనుక రోజుని ఎర్ల్ గ్రే టీ విత్ బిస్కెట్స్తో ప్రారంభిస్తే..కచ్చితంగా రోజంతా డిఫరెంట్ చాక్లెట్లను ఆస్వాదించేవారని చెప్పుకొచ్చారు మెక్గ్రాడీ. అలాగే అత్యంత లగ్జరియస్ చాక్లేటియర్ చార్బొన్నెల్ చాక్లెట్ని అమితంగా ఇష్టపడేవారని అన్నారు. దీని ఖరీదు ఏకంగా రూ. 30 వేలు పైనే ఉంటుందట. ఇక్కడ రాణి గారు ఇష్టపడే బెండిక్స్, చార్బొన్నెల్ బ్రాండ్లు రెండు బ్రిటన్కి చెందిన ఫేమస్ బ్రాండ్లే కావడం విశేషం. ఇక డైట్ పరంగా క్వీన్ ఎలిజబెత్ సమతుల్య ఆహారాన్నే తీసుకునేవారని చెఫ్ మెక్గ్రాడి చెబుతున్నారు. ఆమె చాక్లెట్ పరిమాణం కంటే నాణ్యతపైనే దృష్టి పెట్టి తీసుకునేవారని అన్నారు. ఆరోగ్యం పట్ల ఉన్న ఈ నిబద్ధతే క్వీన్ ఎలిజబెత్ సుదీర్ఘకాల జీవన రహస్యం కాబోలు..!.(చదవండి: వెదురు బ్రష్లు ఎప్పుడైనా చూశారా..?) -
ఏఐ చాట్బాట్ సలహాతో బ్రిటన్ రాణిని చంపడానికి వెళ్ళాడు.. చివరికి ఏం జరిగిందంటే?
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. ఒక మనిషిని చంపడానికి ప్రేరేపించేంత అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ రాణి 'క్వీన్ ఎలిజబెత్ II'ని చంపడానికి ప్రయత్నించిన 21 ఏళ్ల 'జస్వంత్ సింగ్ చైల్' రాజద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. అయితే రాణిని చంపడానికి ప్రేరేపించింది ఏఐ చాట్బాట్ అంటే వినటానికి కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజమే అని నిపుణులు చెబుతున్నారు. జస్వంత్ సింగ్ చైల్ రిప్లికా అనే యాప్ ద్వారా రోజూ చాటింగ్ చేసేవాడు. దీనికి సరాయ్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. నిజానికి ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చేస్తున్న చాలా అద్భుతాల్లో ఇదొకటి చెప్పాలి. రిప్లికా యాప్ ద్వారా వినియోగదారుడు మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, వర్చువల్ ఫ్రెండ్గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి తమకు నచ్చిన రూపం (ఆడ & మగ) కూడా ఇవ్వవచ్చు. ఇందులో ప్రో వెర్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సెల్ఫీలు దిగటం వంటి సన్నిహిత కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. సరాయ్ పేరుతో.. ఇక అసలు విషయానికి వస్తే.. జస్వంత్ సింగ్ చైల్ ఇలాంటి తరహా చాట్బాట్ ద్వారా ఏకంగా 5వేలు కంటే ఎక్కువ మెసేజులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో జస్వంత్ చేయాలన్న పనులకు, తప్పులకు కూడా సరాయ్ వత్తాసు పలికినట్లు సమాచారం. చైల్ను అరెస్టు చేసిన తర్వాత అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కానీ నేరానికి పాల్పడటంతో అతనికి 9 జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికంటే ముందు చికిత్స కోసం బ్రాడ్మూర్ హై-సెక్యూరిటీ హాస్పిటల్కి తరలించారు. ఈ సంఘటన 2021లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా 2022లో ఎలిజబెత్ II అనారోగ్య కారణాలతో మరణించించారు ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్వాలా..!! రిప్లికా వంటి యాప్స్ వ్యక్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వారిని అసాంఘీక కార్యకలాపాలకు ప్రేరేపించడానికి అది సహకరిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఎందుకంటే వినియోగదారుడు ఏం చెప్పినా దానికి ఏకిభవిస్తూ ప్రోత్సహిస్తుంది. దీంతో వారు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి బానిసైన జస్వంత్ సింగ్ చైల్.. సరాయ్ (ఏఐ చాట్బాట్) అవతార్ రూపంలో ఉన్న దేవదూతగా భావించినట్లు సమాచారం. -
క్వీన్ ఎలిజబెత్ హ్యాండ్బ్యాగ్ వెనక ఇంత రహస్యముందా?
హ్యాండ్బ్యాగ్... మహిళల జీవితంలో ఓ భాగం. ఇటీవల మరణించిన బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్–2 సైతం నిత్యం హ్యాండ్బ్యాగ్ను క్యారీ చేసేవారు. 1950 నుంచి 2022వరకు ఆమె ఫొటోలను గమనిస్తే.. అన్నింట్లో ఆమె బ్లాక్ లానర్ హ్యాండ్బ్యాగ్ను ధరించే కనిపిస్తారు. బ్లాక్ బ్యాగ్ మాత్రమే ఎందుకు వాడేవారు? ఫ్యాషన్ స్టేట్మెంట్గానా? అంటే కానేకాదు. అంతకుమించి. బ్యాగ్ ద్వారా తన సిబ్బందికి రహస్య సమాచారాన్ని చేరవేసేవారామె. బ్యాగ్ ప్రతి కదలిక, పొజిషన్ను బట్టి డిఫరెంట్ మెసేజ్ను పంపించేవారు. ఎలా అంటే... ►ఆమె ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎడమ చేతిపై బ్యాగ్ను కుడిచేతికి మార్చారంటే.. ఆ సంభాషణను ముగించాలి అనుకుంటున్నారని అర్థం. ► చేతిలోని బ్యాగ్ను కింద పెట్టారంటే... తాను అసౌకర్యంగా ఫీలవుతున్నానని, వెంటనే ఆ వ్యక్తిని బయటికి పంపించేయాలని సూచన. ► భోజనం చేసేటప్పుడు ఆ బ్యాగ్ను టేబుల్ మీద పెట్టారంటే.. ఐదు నిమిషాల్లో భోజనం ముగించేయాలి అనుకున్నారన్నట్టు. ►అలాంటి కీలకమైన పాత్రపోషించే బ్యాగ్ ఉంటేనే ఆమె కంఫర్టబుల్గా ఫీలయ్యేవారు. ►ఆ చివరకు సెప్టెంబర్ 6న ప్రధానిగా లిజ్ట్రస్ బాధ్యతలు తీసుకునేరోజు సైతం బాల్మోరల్ క్యాజిల్లో జరిగిన కార్యక్రమంలో సైతం క్వీన్ బ్లాక్ హ్యాండ్బ్యాగ్ ధరించి ఉన్నారు. ►ఆఇంతకూ ఆ బ్యాగ్లో ఏముండేవో తెలుసా? సాధారణ మహిళల బ్యాగుల్లో ఉన్నట్టే... చిన్న అద్దం, లిప్స్టిక్, కొన్ని మింట్ బిల్లలు, ఒక జత రీడింగ్ గ్లాసెస్. -
‘ఆమె ఎవరసలు?’.. రాణి అంత్యక్రియల కవరేజ్పై ఫైర్
లండన్: బ్రిటిష్ ప్రధాన మంత్రిని గుర్తుపట్టలేకపోయింది ఓ ఆస్ట్రేలియా టీవీ ఛానెల్. సోమవారం జరిగిన క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాణి అంత్యక్రియల ఈవెంట్ను కవరేజ్ చేసే టైంలో ఆస్ట్రేలియాకు చెందిన చానెల్-9.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ను గుర్తు పట్టలేకపోయింది. టీవీ ప్రజెంటర్స్ ట్రేసీ గ్రిమ్షా, పీటర్ ఓవర్టన్లు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ సమయంలో.. తన భర్త హ్యూ ఓలీరేతో వెస్ట్మిన్స్టర్ అబేకు వచ్చారు లిజ్ ట్రస్. కారు నుంచి బయటకు వచ్చిన లిజ్ ట్రస్ను ఉద్దేశించి గ్రిమ్ షా..‘ఎవరామె?’ అంది. ‘గుర్తుపట్టడం కష్టంగా ఉంది. బహుశా మైనర్రాయల్స్(రాజకుటుంబంలో తక్కువ ప్రాధాన్యత ఉన్న సభ్యులు) కావొచ్చు. నాకు తెలియడం లేదు అని ఓవర్టన్ అన్నారు. ‘స్థానిక వేషధారణలోనే వస్తున్నారు కదా. బహుశా అక్కడి ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్లేమో. దురదృష్టవశాత్తూ.. ప్రతీ ఒక్కరినీ మనం గుర్తించడం కష్టం’ అంటూ గ్రిమ్షా బదులిచ్చారు. అయితే.. I present, for your viewing pleasure, footage of Liz Truss getting out of a car, and Australian media being like, “Who the fuck is that?” Perfect.pic.twitter.com/dxNhdolvtK — Fancy Brenda 🏳️🌈🏳️⚧️ (they/them) (@SpillerOfTea) September 19, 2022 వెంటనే వాళ్లు తమ తప్పిదాన్ని తెలుసుకున్నట్లున్నారు. ఓవర్టన్ స్పందిస్తూ.. ఆ మిస్టరీ గెస్ట్ ఎవరో కాదు యూకే ప్రధాని లిజ్ ట్రస్ అంటూ చెప్పారు. అయితే అప్పటికే ఆ తప్పిదాన్ని పట్టేసిన కొందరు స్పందన మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా టీవీ హోస్ట్లు యూకే ప్రధానిని ‘మైనర్రాయల్స్’గా సంభోదించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు బ్రిటన్ ప్రజలు. ఆస్ట్రేలియా చానెల్కు ఆమాత్రం లిజ్ ట్రస్ తెలీదా అంటూ మండిపడుతున్నారు. బోరిస్ జాన్సన్ తదనంతరం.. బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్ను ఓడించి ఎన్నికయ్యారు లిజ్ ట్రస్. సెప్టెంబర్ 6వ తేదీన ఆమె బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టగా.. అనంతరం రెండు రోజులకే క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఇదీ చదవండి: యూకేలో ఆలయాలపై దాడులు... భారత్ ఖండన -
భారమైన హృదయాలతో... రాణికి వీడ్కోలు
లండన్: అసంఖ్యాక అభిమానుల అశ్రు నివాళుల నడుమ బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. కార్యక్రమం ఆసాంతం పూర్తి ప్రభుత్వ లాంఛనాల నడుమ సాగింది. రాచ కుటుంబీకుల అంతిమయాత్రకు ఉపయోగించే ప్రత్యేక వాహనంలో రాణి పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటలకు వెస్ట్మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్మినిస్టర్ అబేకు తరలించారు. రాజు చార్లెస్–3తో పాటు ఆయన తోబుట్టువులు, కొడుకులు, కోడళ్లు, మనవడు, మనవరాలు, ఇతర రాజకుటుంబీకులు వెంట నడిచారు. అబేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులతో పాటు 2,000 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు చివరిసారిగా నివాళులర్పించారు. నేపథ్యంలో విషాద సంగీతం వినిపిస్తుండగా గంటకు పైగా ప్రార్థనలు కొనసాగాయి. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తదితరులంతా బైబిల్ వాక్యాలు పఠించారు. ఈ సందర్భంగా రాణికి నివాళిగా బ్రిటన్వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వెస్ట్మినిస్టర్ డీన్ తదితరులు శోక సందేశం వినిపించారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేస్తానంటూ రాణి తన 21వ పుట్టినరోజున చేసిన ప్రతిజ్ఞను ఆసాంతం నిలబెట్టుకున్నారంటూ కొనియాడారు. అనంతరం ఎలిజబెత్–2 వివాహ, పట్టాభిషేక వేడుకలకు వేదికగా నిలిచిన వెస్ట్మినిస్టర్ అబే నుంచే ఆమె అంతిమయాత్ర మొదలైంది. చారిత్రక లండన్ వీధుల గుండా భారంగా సాగింది. ఈ సందర్భంగా ఇరువైపులా అభిమానులు అసంఖ్యాకంగా బారులు తీరారు. తమ అభిమాన రాణికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. రాణికి తుది నివాళులర్పిస్తున్నరాష్ట్రపతి ముర్ము, పలు దేశాధినేతలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై లక్షలాది మంది అంతిమయాత్రను వీక్షిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 96 ఏళ్లు జీవించిన రాణికి నివాళిగా లండన్లోని చారిత్రక బిగ్బెన్ గడియారం నిమిషానికోసారి చొప్పున 96 సార్లు మోగింది. హైడ్ పార్కులో రాయల్ గన్ సెల్యూట్ నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం రాణి పార్థివ దేహాన్ని జాతీయ గీతాలాపన నడుమ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని చారిత్రక విండ్సర్ కోటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. శవపేటికపై ఉంచిన రాజ చిహ్నాలైన కిరీటం తదితరాలను తొలగించారు. సంప్రదాయ ప్రార్థనల అనంతరం సెయింట్ జార్జి చాపెల్కు తరలించారు. రాజ కుటుంబీకుల సమక్షంలో రాణి తల్లిదండ్రులు, భర్త, సోదరి సమాధుల పక్కనే ఖననం చేశారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణి పవిత్రాత్మ పరలోకంలోని ప్రభువును చేరాలంటూ బైబిల్ వాక్యాల పఠనం తర్వాత మరోసారి జాతీయ గీతాలాపనతో అంత్యక్రియలు ముగిశాయి. క్వీన్ విక్టోరియా మెమొరియల్ మార్గం గుండా సాగుతున్న రాణి అంతిమయాత్ర ఇదీ చదవండి: బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం -
ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?
ఎలిజెబెత్ రాణి మృతి, వారసుడిగా కింగ్ ఛార్లెస్ ప్రవేశం అనేవి మరోసారి గ్రేట్ బ్రిటన్ గురించి మనం తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా చేశాయి. యూరప్ తీర ప్రాంతంలోని ఒక చిన్న దీవి అయిన బ్రిటన్ రాజకీయాధికారం క్షీణిస్తూ, ఆర్థిక వ్యవస్థ కుంగిపోతూ ఉండ వచ్చుగాక... కానీ ఇప్పటికీ పెర్త్, ఫీనిక్స్, ముంబై, మాసే లేదా కేప్ టౌన్, కోపెన్హాగన్ వంటి సుదూర ప్రాంతాల్లోని ప్రజలను కూడా కట్టిపడేస్తూ ఈ రోజుకీ ఆకర్షిస్తూనే ఉంది. ఇది ఏకకాలంలో ప్రహస నంగానూ, బ్రిటన్ ప్రభావానికి తిరుగులేని సూచికగానూ ఉంటోందని చెప్పవచ్చు. రాణి తన సామ్రాజ్యాన్ని కోల్పోయారు. ఆమె అర్థవంతమైన శక్తిగా లేరు. కానీ ఆమె ప్రపంచం దృష్టిని ఇప్పటికీ తనవైపు తిప్పుకోగలరు. కాబట్టి ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న ఈ రాజదండాన్ని కలిగిన ద్వీపం లక్షణాలు ఏమిటి? మొట్టమొదటి లక్షణం నిస్సందేహంగా దాని రాచరికమే అని చెప్పాలి. ఈజిప్ట్ రాజు ఫారూఖ్ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు, ఓ సుప్రసిద్ధమైన మాట చెప్పారు: ఏదో ఒక రోజు ప్రపంచంలో అయిదుగురు చక్రవర్తులు మాత్రమే ఉంటారనీ, వారు స్పేడ్, క్లబ్, హార్ట్స్, డైమండ్స్తోపాటు ఇంగ్లండ్ చక్రవర్తి అనీ అన్నారు. తొలి నాలుగు పేకాటలో ముఖ్యమైన ముక్కలు అని తెలిసిందే. ఈ ప్రపంచం బ్రిటిష్ రాచరికాన్ని విశిష్టమైనదిగా పరిగణి స్తుందనే సత్యాన్ని ఈజిప్టు రాజు పేర్కొన్నారు. బ్రిటన్ రాచరికానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే నా వద్ద కచ్చితమైన సమాధానం లేదు. కానీ ‘నెట్ఫ్లిక్స్’లో ‘ది క్రౌన్’ వెబ్ సిరీస్కి ఉన్న ప్రజాదరణే దానికి రుజువుగా నిలుస్తుంది. బహుశా బ్రిటన్ ప్రదర్శనా సామర్థ్యం, దాని పురాతన సంప్రదాయాలు, ఆచారాలను ఆ సిరీస్ చక్కగా చూపించింది కాబోలు. అవి మనం కోల్పోయిన, మర్చి పోయిన ప్రపంచాన్ని మనకు గుర్తు చేస్తాయి. లేదా బహుశా రాజులు, రాణులు ఆకర్షణీయంగా మనలో శృంగార భావనలను వెలిగించి ఉండవచ్చు. కానీ, డచ్, స్కాండినే వియన్ లేదా జపనీస్ రాచరికం మనల్ని ఉద్వేగపర్చని కాలంలో బ్రిటిష్ రాచరికం పట్ల మనం ఇంత ఆసక్తి ఎందుకు చూపుతున్నట్లు? వాస్తవం ఏమిటంటే బ్రిటిష్ రాచరికాన్నే కాదు... ఎలిజెబెత్ రాణిని ప్రజలు ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తుండటమే. బ్రిటిష్ రాణి చనిపోయినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బ్రిటిష్ ప్రజలను ఉద్దేశించి ప్రసం గించారు. ‘‘మీకు ఆమె ‘మీ రాణి’గా ఉండేవారు. మాకు మాత్రం ఆమె ‘రాణి’గా(‘ద క్వీన్’– రాణి అంటే ఆమె మాత్రమే గుర్తొస్తుంది అన్న అర్థంలో) ఉండేవారు అన్నారాయన. బ్రిటిష్ రాణి గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇలా మాట్లాడటమే అద్భుతమైన విషయం. మెక్రాన్ చాలా నిజాయతీగా ఆ మాటలన్నారు. దానికి ఫ్రాన్స్లో ఎవరూ ఆయన్ని తప్పుపట్టలేదు. ఇక రెండో లక్షణం ఏమిటంటే, బ్రిటన్ తన భాష ద్వారా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించింది. చాలామందికి ఇంగ్లిష్ అందరూ ఆకాంక్షించే ఒక భాష మాత్రమే కాదు, అది సెకండ్ లాంగ్వేజిగా అందరూ ప్రాధాన్యం ఇచ్చే భాషగా ఉంటోంది. అది బ్రిటిష్ సామ్రాజ్యం కారణంగానా? సరిగ్గా ఉచ్చరించకపోయినా అమెరికా ఆ భాషను పంచు కుంటున్నందునా? లేదా ఏ ఇతర భాషకూ లేని గుణాలు ఇంగ్లిష్కి ఉండటం మూలంగానా? ఇది కూడా నాకు తెలీదు. కానీ షేక్స్పియర్ని ప్రపంచమంతా సుప్రసిద్ధుడైన రచయితగా ఎందుకు గుర్తి స్తోంది అనే అంశాన్ని ఇంగ్లిష్ భాషలోని పటుత్వం, దాని సమ్మోహన శక్తి స్పష్టంగా చెబుతాయి. డాంటే, హోమర్, పుష్కిన్, కాళిదాసు వంటి మహా రచయితలు, కవుల గురించి మీరు ఆలోచించవచ్చు. కానీ ‘గాయక కవి’ అని మనం పిలుచుకునే షేక్స్పియర్ ముందు వీరంతా తేలిపోతారు. బ్రిటన్ ప్రభావం బీబీసీ అంత అతి విస్తృతమైన ప్రభావంతో ఎందుకుందో మూడో కారణం కూడా చెబుతాను. సీఎన్ఎన్ అంత వనరులు బీబీసీకి లేకపోవచ్చు. బ్రిటిష్ ప్రజలే దాన్ని విమర్శిస్తూ ఉండవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వాలే బీబీసీని మూసివేయాలని తరచుగా ప్రయత్నించాయి. కానీ బయటి ప్రపంచంలో సమగ్రత, నిర్దిష్టత రీత్యా బీబీసీకి ఎనలేని గుర్తింపు ఉంది. 1984లో తన మాతృమూర్తి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారన్న విషయాన్ని ఆమె ప్రభుత్వమే రాజీవ్గాంధీకి తెలియ జేసినప్పటికీ, దాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆయన బీబీసీని చూశారు. (క్లిక్ చేయండి: మన నిశ్శబ్దం చేసిన గాయం) బ్రిటిష్ ఆకర్షణ శక్తిని వివరించడానికి నేను మరో కారణాన్ని జత చేస్తాను. అదేమిటంటే బ్రిటిష్ వారి హాస్య చతురత. అది కేవలం సున్నితమైంది మాత్రమే కాదు, దాన్ని తక్కువ చేసి చెప్పలేం. మరోలా చెప్పాలంటే బ్రిటిష్ హాస్యచతురత తనను చూసి తానే నవ్వుకుంటుంది. బ్రిటిష్ జోక్స్కి తరచుగా రాచకుటుంబమే బలవుతూ ఉంటుంది. ప్రత్యేకించి అందరికంటే ఎక్కువగా ప్రిన్స్ చార్లెస్ కూజా చెవులు, విపరీతమైన అభిరుచులు, చాదస్తపు పద్ధతులపై మరింత ఎక్కువగా జోకులు ఉండేవి. అదే భారతదేశంలో అయితే ప్రధానమంత్రిపై లేక రాష్ట్రపతిపై మీరు పేరడీలు కడితే మీ మీద రాజద్రోహ ఆరోపణలు తప్పవు. హాస్యం లోనే ప్రజాదరణ, దాంతోపాటు అభిమానం కూడా పుట్టుకొస్తాయని బ్రిటిష్ వారు గుర్తించారు మరి. ‘ఎస్, ప్రైమ్ మినిస్టర్’, ‘ది టూ రోనీస్’ వంటి కామెడీ షోలు, లేదా ఇంకా వెనక్కువెళ్లి ‘లారెల్ అండ్ హార్డీ’లను తల్చుకోండి. బ్రిటిష్ వారి హాస్య చతురత తక్కిన ప్రపం చాన్నే నవ్వించింది అంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండ లేరు. ఫ్రెంచ్ ప్రజలు, జర్మన్లు, ఆస్ట్రేలియన్లు లేదా అమెరికన్ల గురించి మీరు ఇలా చెప్పలేరు. (క్లిక్ చేయండి: ప్రజాస్వామ్యంలో రాజరికమా?) విక్టోరియా మహారాణిని మననం చేసుకోవడం ద్వారా నన్ను ఇక సెలవు తీసుకోనివ్వండి. పైకి గంభీరంగా కనిపించే విక్టోరియా రాణికి హాస్యపు నరం లోపించింది. ఎప్పుడూ ఆమె ఉల్లాస రహితంగా, వినోదం అంటే పట్టని వ్యక్తిగా ఉండేవారు. ‘మేం నవ్వడం లేదు’ అనే జాలిగొలిపే పదబంధాన్ని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాను అనే విషయం కూడా విక్టోరియా బహుశా గుర్తించకపోయి ఉండ వచ్చు. ఈ పదబంధం ఇవాళ వ్యంగ్య ప్రధాన చతురతకు మారుపేరుగా ఉంటోది మరి! - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
వెస్ట్మిన్స్టర్ హాల్లోనే రాణి శవపేటిక ఎందుకంటే..
వెస్ట్మిన్స్టర్ హాల్ తలుపులు మూసుకుపోయాయి. భారత కాలమానం ప్రకారం.. వేకువఝామున నాలుగు గంటల సమయంలో క్యూ లైన్లను అనుమతించడం ఆపేశారు. అంటే.. సుదీర్ఘకాలం యునైటెడ్ కింగ్డమ్ను పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 అంతిమయాత్రలో కీలక ఘట్టం ముగిసిందన్నమాట. ఇక మిగిలింది అంత్యక్రియలే.. బ్రిటన్ సార్వభౌమాధికారులకు, గత.. ప్రస్తుత రాణి కాన్సోర్ట్లకు ఇచ్చే గౌరవం ఇదంతా. వెస్ట్మినిస్టర్ హాల్కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. పార్లమెంటరీ ఎస్టేట్లో అత్యంత పురాతనమైన బిల్డింగ్ ఇది. ► అత్యంత సువిశాలమైన భవనం మాత్రమే కాదు.. మిరుమిట్లు గొలిపే డిజైన్లతో గోడలు, అద్దాలు, పైకప్పు.. ఆకర్షనీయంగా ఉంటుంది. ► గతంలో కోర్టులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను సైతం ఇందులో నిర్వహించేవాళ్లు. ► 1910లో కింగ్ ఎడ్వర్డ్-7 మరణాంతరం ఆయన భౌతికాయాన్ని వెస్ట్మిన్స్టర్ హాల్లో ప్రజాసందర్శనార్థం ఉంచారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ► ఇంతకు ముందు.. 2002, మార్చి 30వ తేదీన క్వీన్ ఎలిజబెత్(క్వీన్ ఎలిజబెత్-2 తల్లి) మరణించగా.. అంత్యక్రియలకు పదిరోజుల ముందు నుంచి వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉంచారు. ► ఇప్పుడు.. గత బుధవారం నుంచి క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాన్ని ప్రజా సందర్శనార్థం ఉంచారు. ► థేమ్స్ నది ఒడ్డున్న కిలోమీటర్ల మేర బారులు తీరి నిల్చున్నారు ఆమె అభిమానులు. రాణి గౌరవార్థం ప్రముఖులు సైతం ఒపికగా క్యూలో వచ్చారు. ► రాణి అంత్యక్రియల కార్యక్రమాన్ని బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న 125 సినిమా థియేటర్లు ప్రసారం చేయనున్నాయి. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఆమెకు నివాళులర్పించారు. ► క్వీన్ ఎలిజబెత్-2 మృతదేహాంతో ఉన్న శవపేటికను వెస్ట్మిన్స్టర్ అబేను తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో వెస్ట్మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► అక్కడ 2000 మంది అతిథులు(అందులో 500 మంది ప్రపంచ నేతలు) ఉంటారు. ► అబే నుంచి సెయింట్ జార్జిస్ చాపెల్ వద్ద క్రతువు కోసం రాణి శవపేటికను తరలిస్తారు. అక్కడ 800 మంది అతిథులకు స్థానం ఉంటుంది. ► కింగ్ జార్జి- మెమోరియల్ చాపెల్ వద్ద.. రాణి శవపేటికను ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి చెంతకు బ్రిటన్ రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యుల సమక్షంలో చేరుస్తారు. ► చివర్లో శవపేటిక వెంట రాజు, రాణి, రాజవంశీయులు మాత్రమే ఉంటారు. సాయంత్రం శవపేటికను.. రాయల్ వాల్ట్లోకి దించుతారు. అక్కడ విండ్సర్ డీన్ కీర్తన ఉంటుంది. కాంటెర్బరీ ఆర్చిబిషప్ దీవెనలు, జాతీయ గీతాలాపతో అంత్యక్రియల కార్యక్రమం లాంఛనంగా(ప్రభుత్వ) ముగుస్తుంది. అయితే.. ఆపై విండ్సర్ డీన్ ఆధ్వర్యంలో రాజవంశీయులకు మాత్రమే పరిమితమైన తుది అంత్యక్రియల ప్రక్రియతో మొత్తం కార్యక్రమం ముగుస్తుంది. రాజవంశంలో రాజు/రాణిలకు దాదాపుగా ఇదే తరహాలో అంత్యక్రియలు జరుగుతుంటాయి. -
మహారాణికి ప్రపంచ నేతల నివాళులు (ఫొటోలు)
-
క్వీన్ ఎలిజబెత్ మా అమ్మలాంటిది: బైడెన్ భావోద్వేగం
వాషింగ్టన్ డీసీ: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అంతా సిద్ధం అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారమే బ్రిటన్కు చేరుకుని రాణి శవపేటిక వద్ద నివాళి అర్పించారు. రాజకుటుంబానికి నివాళులర్పించే క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారాయన. క్వీన్ ఎలిజబెత్-2 తన తల్లితో సమానం అంటూ వ్యాఖ్యానించారాయన. అంతా బాగుందా? నేనేమైనా సాయం చేయగలానా? మీకేం కావాలి? అంటూ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారాయన. అంతేకాదు.. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి అంటూ ఒక తల్లిలా వెన్నుతట్టి ముందుకు ప్రొత్సహించేవారని గుర్తుచేసుకున్నారాయన. బ్రిటన్ నూతన రాజు, క్వీన్ ఎలిజబెత్-2 తనయుడు కింగ్ ఛార్లెస్-3కి ధైర్యం చెప్పిన బైడెన్.. యావత్ బ్రిటన్ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 70 ఏళ్ల ఆమె పాలనలో ప్రపంచం మొత్తం ఆమె ఔనత్యాన్ని కళ్లారా వీక్షించిందని, ఆమెతో గడిపిన సరదా క్షణాలు మరువలేనివని, ఆ సమయంలో ఆమెను చూస్తే తన తల్లి గుర్తుకు వచ్చారంటూ భావోద్వేగ ప్రకటనను వైట్హౌజ్ ద్వారా విడుదల చేయించారు బైడన్. రాణి అంత్యక్రియల షెడ్యూల్ ► సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే రాణికి సందర్శకుల నివాళి కొనసాగుతుంది. ► ఆపై.. తుది నివాళుల కోసం దేశాధినేతలు, ప్రముఖుల రాక మొదలవుతుంది. ► 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్మినిస్టర్ హాల్ నుంచి అధికార లాంఛనాలతో సమీపంలోని.. వెస్ట్మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12.15కు చారిత్రక లండన్ వీధుల గుండా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది. ► శవపేటిక విండ్సర్ కోటకు చేరుకుంటుంది. ► అక్కడి సెయింట్ జార్జ్ చాపెల్లో గతేడాది మరణించిన భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. ► వెస్ట్మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాయంత్రానికల్లా కార్యక్రమం పూర్తవుతుంది. అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ► 10 వేల మంది పై చిలుకు పోలీసులు, వేలాది మంది సైనిక తదితర సిబ్బందితో లండన్లో బందోబస్తు ఏర్పాట్లు కనీవినీ ఎరగనంతటి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు ఒక్క సెంట్రల్ లండన్లోనే ఏకంగా 36 కిలోమీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ► అంత్యక్రియల సందర్భంగా సోమవారం కనీసం 10 లక్షల మంది లండన్కు వస్తారని ఒక అంచనా. -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్హాం ప్యాలెస్లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అధికారిక అంత్యక్రియలు సోమవారం(19వ తేదీన) జరుగనున్నాయి. రాణి మృతదేహాన్ని లండన్ వెస్ట్మినిస్టర్ హాల్లో సోమవారం ఉదయం 6.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరరం.. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. ఇందులో భాగంగానే.. భారత ప్రభుత్వం తరఫున బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం లండన్ చేరుకున్నారు. President Droupadi Murmu arrives in London to attend the State Funeral of Her Majesty Queen Elizabeth II. pic.twitter.com/T6zWlJGkYB — President of India (@rashtrapatibhvn) September 17, 2022 ఇక, రాణి అంత్యక్రియల కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్, రష్యా, బెలారస్ దేశాల నేతలు మాత్రం హాజరు కావడం లేదు. వారికి రాజ కుటుంబం ఆహ్వానం పంపించలేదు. -
రాణి తుది వీడ్కోలు.. ఆహ్వానం లేనిది వీళ్లకే!
లండన్: రాణి ఎలిజబెత్-2 మృతదేహం లండన్ వెస్ట్మినిస్టర్ హాల్లో ఉంది. సోమవారం(19న) ఉదయం 6.30 గంటల వరకు ఉంటుందని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. అయితే.. రాణి అంత్యక్రియలకు అధికారిక ఆహ్వానం అందనిది ఎవరికో తెలుసా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు. అవును.. ఉక్రెయిన్పై దురాక్రమణ నేపథ్యంలో ఆయనపై యూకే కూడా ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ విధించింది. అందుకే ఆయనకు క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు ఆహ్వానం అందించలేదు. అయితే రష్యా నుంచి ఏ ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై ఆ దేశ విదేశాంగ శాఖ నొచ్చుకుంది. ఈ చర్య అనైతికమంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక సిరియా, వెనిజులా, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్కు అసలు ఆహ్వానం పంపలేదు. బెలారస్, మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్కు ఆహ్వానం పంపించలేదు యూకే. అలాగే కొన్ని చిన్నచిన్న దేశాలనూ కూడా మినహాయించింది. నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ పాలనలోని ఉత్తరకొరియా, నికారాగువా, ఇరాన్ల నుంచి దౌత్యవేత్త స్థాయి వాళ్లకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేసింది. భర్త సమాధి పక్కనే.. ఇక సోమవారం జరగబోయే అంత్యక్రియల కార్యక్రమం.. బ్రిటన్ వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించడంతో ముగుస్తుంది. అనంతరం రాణి పార్ధివ దేహం ఉంచిన శవపేటికను వెస్ట్మినిస్టర్ అబేకు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు వెస్ట్మినిస్టర్ అబే తలుపులు తెరుస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు 500 మంది హాజరవుతారు. రాణి శవపేటికను వెస్ట్ మినిస్టర్ అబే నుంచి విండ్సర్ క్యాజిల్ సమీపంలోని సెయింట్ జార్జ్ చాపెల్ వద్ద జరిగే కార్యక్రమం కోసం తరలిస్తారు. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు రాయల్ వాల్ట్లోకి శవపేటికను దించుతారు. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెర్బరీ జస్టిన్ ఆశీర్వచనాల మధ్య అక్కడ చేరిన వారంతా ‘గాడ్ సేవ్ ది కింగ్’గీతాన్ని ఆలపిస్తారు. రాత్రి 7.30 గంటలకు జరిగే కార్యక్రమంలో భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. ఇదీ చదవండి: చావు నుంచి మళ్లీ పుట్టుక వైపు! -
వెస్ట్మినిస్టర్ హాల్కు రాణి పార్థీవదేహం (ఫొటోలు)
-
బ్రిటన్ రాణి అంత్యక్రియలకు హాజరుకానున్న ద్రౌపది ముర్ము
సాక్షి,న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరఫున రాణికి నివాళులు అర్పించనున్నారు. సెప్టెంబర్ 17-19 వరకు ముర్ము పర్యటన ఉంటుంది. ఎలిజబెత్ 2 అంత్యక్రియలు వెబ్మిన్స్టర్ అబ్బేలో సోమవారం(సెప్టెంబరు 19న) జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచదేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 96 ఏళ్ల బ్రిటన్ రాణి సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సెప్టెంబర్ 12 ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయానికి వెళ్లి భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. రాణి మృతి పట్ల భారత్ సెప్టెంబర్ 11న సంతాప దినం నిర్వహించింది. చదవండి: పంజాబ్లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్ -
ఐ హేట్ దిస్.. బ్రిటన్ రాజు చార్లెస్ చికాకు
డబ్లిన్: బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ కోసం సంతాపాన్ని తెలియజేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో.. ఉత్తర ఐర్లాండ్ను సందర్శించిన చార్లెస్.. ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే.. బెల్ఫాస్ట్ సమీపంలోని హిల్స్బరో క్యాజిల్(కోట)కు చేరుకున్న ఆయన.. సందర్శకుల పుస్తకంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఛార్లెస్ తన చేతిలోని పెన్ను లీక్ కావడంతో నిరాశతో చెందారు. ‘‘ఓహ్ గాడ్ ఐ హేట్ దిస్ (పెన్)!’’ అంటూ చార్లెస్ లేచి నిలబడి చేతిని తుడుచుకుంటూ ఆ పెన్నును తన భార్య, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాకు అందజేశాడు. ఆపై ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడాయన. I LOVE this pic.twitter.com/cL1KpFA5gI — Rupert Myers (@RupertMyers) September 13, 2022 ఇదిలా ఉంటే.. చార్లెస్ రాజుగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఛార్లెస్ చాలా సరదాగా ఉంటారు. కానీ, ఆయనకు షార్ట్టెంపర్. అదీ ఇదీ కావాలని అడుగుతుంటారు కూడా’’ అని వెల్లడించారు. నాలుగేళ్ల వయసులో ఛార్లెస్ ఇదిలా ఉంటే.. శనివారం లండన్లో పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు, టేబుల్పై ఉన్న పెన్ హోల్డర్ అడ్డుతగలడంతో విసుగు చెందిన చార్లెస్.. సహాయకులకు సహాయం చేయమని సైగ చేయడం, తన అసహనాన్ని ప్రదర్శించడం తెలిసే ఉంటుంది. స్వతహాగానే ఆయన ప్రవర్తన అలా ఉంటుందని కొందరు అంటుంటే.. 73 ఏళ్ల ఛార్లెస్ వయసురిత్యా అలా ప్రవర్తించి ఉంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్ శవపేటిక బకింగ్హామ్ ప్యాలెస్కు చేరుకుంది. video courtesy: Daily Mail -
Queen Elizabeth 2: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్సోర్ కాస్టిల్కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు. అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది. ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి మొదట టిక్టాక్లో షేర్ చేశాడు. ఆ తర్వాత అది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by MEMEZAR • Comedy and Culture (@memezar) 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న హ్యారీ, మేఘన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2021 మార్చి నుంచి వీరు రాజకుటుంబానికి దూరంగా అమెరికాలోని నివసిస్తున్నారు. రాణి మరణానికి ముందు అనుకోకుండా వారు బ్రిటన్లోనే ఉన్నారు. దీంతో కుటంబసభ్యులతో వెళ్లి రాణికి నివాళులు అర్పించారు. రాణి మరణంతో హ్యారీ, మేఘన్ మళ్లీ రాజకుటుంబానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్ -
బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం(సెప్టెంబర్ 8న) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె అదే రోజు చనిపోతుందని ముందుగానే ఊహించాడు ఓ వ్యక్తి. ఈ ఏడాది జులైలోనే అతను ఈమేరకు ట్వీట్ చేశాడు. లోగన్ స్మిత్(@logan_smith526) అనే పేరుతో ఉన్న ఇతని ట్విట్టర్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్కు అత్యధిక కాలం మహారాణిగా ఉన్నవారు సెప్టెంబర్ 8, 2022న మరణిస్తారు అని అతను ట్వీట్లో పేర్కొన్నాడు. రాణి మరణించిన క్షణాల్లోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లోగన్ స్మిత్ ట్వీట్ను వేలమంది రీట్వీట్ చేశారు. అయితే అతడు తన ట్వీట్లో రాణి మరణించే తేదీతో పాటు కొత్త రాజు ఎప్పుడు చనిపోతాడనే విషయాన్ని కూడా చెప్పడం బ్రిటన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కింగ్ చార్లెస్ 2026 మార్చి 28న మరణిస్తారని అతడు అంచనావేయడమే ఇందుకు కారణం. ఈ ట్వీట్ను ట్విట్టర్లో ఎక్కువమంది రీట్వీట్ చేస్తుండటంతో లోగన్ స్మిత్ తన ఖాతాను ప్రైవేటుగా మార్చుకున్నాడు. దీంతో అతని పాత ట్వీట్లు సాధారణ యూజర్లకు కన్పించడంలేదు. అయితే పాత ట్వీట్ స్క్రీన్ షాట్లనే చాలా మంది యూజర్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. మరికొందరు లోగన్ స్మిత్ ప్రెడిక్షన్ చూసి షాక్కు గురవుతున్నారు. ఓ యూజర్ అయితే లోగన్ నువ్వు జాగ్రత్త.. బ్రిటిష్ ప్రజలు నీకోసం వస్తారు అని హెచ్చరించాడు. మరో యూజర్ స్పందిస్తూ ఇప్పటికే రాణి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాం, అలా చెప్పొద్దు అని రాసుకొచ్చాడు. మరొక యూజర్ స్పందిస్తూ.. కింగ్ చార్లెస్ 2026లో చనిపోతారనే అంచనా కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో నిర్ణయించేది ఆ భగవంతుడే అని రాసుకొచ్చాడు. ఎలిజబెత్ 2 మరణానంతరం ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ 3 వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
రాణి బొమ్మతో ఉన్న కరెన్సీ నోట్ల మార్పు! విలువెంతంటే..
లండన్: బ్రిటిష్ కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్-2 బొమ్మ ఇంతకాలం ఒక హుందాగా ఉండిపోయింది. నోట్లే కాదు.. నాణేలు, పోస్టల్ స్టాంపులుగా యూకేవ్యాప్తంగా అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. పాస్పోర్ట్, ఇతర డాక్యుమెంట్లలోనూ రాజముద్ర కనిపించేంది. అయితే.. ఆమె మరణంతో ఇప్పుడు పరిస్థితి ఏంటన్న దానిపై అక్కడ జనాల్లో ఒక గందరగోళం నెలకొంది. కరెన్సీ నోట్లపై ఇక నుంచి ఆమె చిత్రాన్ని ముద్రిస్తారా? రద్దు చేస్తారా? చేస్తే తమ దగ్గరున్న కరెన్సీ మాటేంటని ఆరాలు తీస్తున్నారు. ఈ తరుణంలో.. యూకే కేంద్ర బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ సమాధానం ఇచ్చింది. బ్యాంక్ నోట్లతో పాటు రాణి ముఖచిత్రం ఉన్న కాయిన్లు ప్రస్తుతానికి చెల్లుతాయని స్పష్టత ఇచ్చింది. అంతేకాదు.. సంతాప దినాలు ముగిశాక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బ్యాంక్, నోట్ల విషయంలో మరో ప్రకటన చేయనుంది. అయితే ప్రస్తుతానికి కరెన్సీ చెల్లుబాటు అయినా.. కరెన్సీ నోటుపై రాణి చిత్రాన్ని తప్పనిసరిగా మార్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. నేషన్స్ బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్స్, రాయల్ మింట్ నుంచి కాయిన్స్ ముద్ర అవుతాయి అక్కడ. ఇంగ్లాండ్లో బ్యాంక్ నోట్లపై చిత్రం ప్రచురితమన మొదటి రాణిగా ఎలిజబెత్కు గుర్తింపు దక్కింది. కానీ స్కాటిష్,నార్త్ ఐరిష్ బ్యాంకు నోట్లపై మాత్రం ఆ రాణి బొమ్మ ఉండదు. ఆమె వారసుడిగా రాజ్యాధికారం దక్కించుకున్న రాజు ఛార్లెస్-3 చిత్రాలను కరెన్సీ నోట్లు, కాయిన్లపై భర్తీ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ముందు ఇప్పుడు పెద్ద పనే ఉంది. రాజు బొమ్మతో ఉన్న నోట్లు, కాయిన్లు ముద్రించాల్సి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్. యూకే వ్యాప్తంగా రాణి చిత్రం ఉన్న దాదాపు 95 బిలియన్ అమెరికన్ డాలర్లు(ఒక బిలియన్ డాలర్లు అంటే.. ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైనే విలువ)తో కూడిన కరెన్సీనోట్లు, 29 బిలియన్ల నాణేలు ఉన్నట్లు యూకే కేంద్ర బ్యాంక్ చెబుతోంది. రాణి బొమ్మలతో ఉన్న నోట్లు, కాయిన్లు క్రమక్రమంగా కనుమరుగై.. రాజు బొమ్మతో కొత్తగా రానున్నాయి. రాజు బొమ్మతో ఎలాగంటే.. కింగ్ ఛార్లెస్-3 బొమ్మతో ఉన్న కాయిన్లు, కరెన్సీ నోట్లపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. కరెన్సీ నోట్ల సంగతి మాటేమోగానీ.. నాణేలపై రాజవంశస్తుల బొమ్మల్ని 17వ శతాబ్దం నుంచి ముద్రిస్తున్నారు. కింగ్ ఛార్లెస్-2 హయాం నుంచి ఇది మొదలైంది. సాధారణంగా.. ఒక తరం వాళ్ల బొమ్మను కుడి వైపు, మరో తరంవాళ్లను ఎడమవైపు ముద్రిస్తూ వస్తున్నారు. ఎలిజబెత్ రాణి బొమ్మ కాయిన్లకు కుడివైపు ఉండేది. కాబట్టి, ఛార్లెస్ బొమ్మను ఎడమవైపే ముద్రించడం ఖాయమైంది. ఇక పాస్పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు పని చేసినా.. అందులో రాణికి సంబంధించిన ప్రస్తావన బదులు, రాజుకు సంబంధించిందిగా మారనుంది. ఇదీ చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం
లండన్: బ్రిటన్ రాజు హోదాలో కింగ్ ఛార్లెస్–3 పార్లమెంట్లో తొలి ప్రసంగం చేశారు. సోమవారం లండన్లోని వెస్ట్మినిస్టర్ హాల్లో ఉభయ సభల సభ్యులనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘‘దివికేగిన ప్రియమైన మాతృమూర్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం. ప్రజాసేవకు అంకితమైన రాణి ఎలిజబెత్ బాటలో నడుస్తూ రాజ్యాంగబద్ధ అత్యున్నత పాలనా ప్రమాణాలను కొనసాగిస్తా. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన బ్రిటన్ పార్లమెంట్లో క్వీన్ ఎలిజబెత్ సేవను మరోసారి స్మరించుకుందాం. దేవుడి, మీ పరిపూర్ణ సహకారంతో నా బాధ్యతలు నిర్వరిస్తా’’ అని అన్నారు. అస్తమయం చెందిన రాణి ఎలిజబెత్–2కు ఎంపీలు సహా దాదాపు 900 మంది ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు, రాణి పార్థివదేహాన్ని మంగళవారం స్కాట్లాండ్ నుంచి లండన్కు వాయు మార్గంలో తీసుకురానున్నారు. ఇదీ చదవండి: చనిపోయే ముందు వాళ్లకు రాణి గ్రీటింగ్స్!! -
బ్రిటన్ రాణి చనిపోయే ముందు వాళ్లకు స్పెషల్ గ్రీటింగ్స్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహబంధంలో 60 ఏళ్ల పూర్తి చేసుకున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్రీటింగ్స్ పంపారు. వీటిపై ఆమె స్వయంగా సంతకం చేశారు. ఈ అరుదైన కార్డు తమకు కూడా అందిందని ఓ వృద్ధ జంట వెల్లడించింది. రాణి సంతకం చేసిన గ్రీటింగ్ కార్డు అందుకున్న అతికొద్ది మందిలో తామూ ఉండటంపై ఆనందం వ్యక్తం చేసింది. ఈ భార్యాభర్తల పేర్లు ట్రికియా పోంట్, రాయ్. సెప్టెంబర్ 8న వీరి 60వ వివాహ వార్షికోత్సవం. రాణి ఎలిజబెత్ 2 కూడా అదే రోజు మరణించారు. అయితే అంతకుముందే ఆమె ఈ ఏడాది డైమండ్ వెడ్డింగ్ యానివర్సరీ(60వ పెళ్లిరోజు) జరుపుకుంటున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు పంపారు. ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ 3 నుంచి కూడా వీరికి లేఖలు అందే అవకాశం ఉంది. సుర్రేకు చెందిన ఈ వృద్ధ దంపతులు రాణి నుంచి అందిన గ్రీటింగ్ కార్డు చూసి మురిసిపోయారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ లెటర్ ఓపెన్ చేసిన అనంతరం వేడుక చేసుకునేందుకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం బయటకు లంచ్కు వెళ్లారు. అయితే ఇంటికి తిరిగివచ్చేసరికి రాణి మరణవార్త తెలిసి షాక్కు గురయ్యారు. 80ఏళ్లు పైబడిన ఈ వృద్ధ జంట.. రాణి తమకు పంపిన లేఖను నిధిలా దాచుకుంటామన్నారు. ప్రపంచంలోని అతికొద్ది మందికి మాత్రమే రాణి సంతకం చేసిన లేఖలు అందాయని, అందుకే ఇది తమకు ఎంతో విలువైనదని చెప్పారు. రాణికి తాము పెద్ద అభిమానులమని, దేశానికే ఆమె స్పూర్తిదాయకం అని కొనియాడారు. చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా? -
క్వీన్ ఎలిజబెత్-2 రహస్య లేఖ! తెరిచేది ఎప్పుడంటే..
సిడ్నీ: క్వీన్ ఎలిజబెత్-2 స్వదస్తూరితో రాసిన ఓ లేఖ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ లేఖను ఇంతవరకు ఎవరూ చదివింది లేదు. అలాగే.. భద్రంగా ఓ చోట ఉండిపోయింది. మరి రాణి చనిపోయింది కదా!. అది అలాగే రహస్యంగా ఉండిపోవాల్సిందేనా?.. 1986 నంబర్లో సిడ్నీ(ఆస్ట్రేలియా) ప్రజలను ఉద్దేశించి.. క్వీన్ ఎలిజబెత్-2 ఓ లేఖ రాశారు. దానిని సిడ్నీలోని ఓ చారిత్రక భవనం వ్యాలెట్లో భద్రంగా దాచారు. అయితే.. అందులో ఏముందనే విషయం అది రాసిన రాణివారికి తప్పా ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఆమె మరణించడంతో ఆ లెటర్ను బయటకు తీయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయితే ఆ లెటర్ను తెరుస్తారట. అది ఇంకా 63 ఏళ్ల తర్వాత. అంటే.. 2085లో. సిడ్నీ లార్డ్ మేయర్ను ఉద్దేశిస్తూ.. ఎలిజబెత్ రాణి 2 ఆ లేఖను ‘‘2085వ సంవత్సరంలో ఓ మంచి ముహూర్తాన ఆ లేఖను తెరవండి అంటూ ఎలిజబెత్ రాణి సంతకం చేశారు. దీంతో ఆమె కోరిక మేరకు అప్పటివరకు గ్లాస్ బాక్స్లో ఉన్న ఆ లేఖను అలాగే ఉంచాలని సిడ్నీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో క్వీన్ ఎలిజబెత్-2కు ప్రత్యేక అనుబంధం ఉంది. పదహారుసార్లు ఆమె ఆ దేశాన్ని సందర్శించారు. 1901లో ఆస్ట్రేలియా స్వాతంత్రం ప్రకటించుకుంది. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగారు. 1999లో ఆమెను ఆ దేశ అధినేతగా తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కానీ, అది వీగిపోయింది. ఇదీ చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువెంతంటే.. -
ఎడింబర్గ్కు రాణి భౌతికకాయం.. రాకుమారుల ఐక్యత!
లండన్: రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్హౌస్ ప్యాలెస్కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. శవపేటికతో కూడిన వాహన కాన్వాయ్ వారి నివాళుల మధ్య ఆరు గంటల పాటు ప్రయాణించి ఎడింబర్గ్ చేరింది. రాణి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం దాకా ఎడింబర్గ్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్కు తరలిస్తారు. వెస్ట్మినిస్టర్ ప్యాలెస్లో నాలుగు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం 19న అంత్యక్రియలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. రాకుమారుల ‘ఐక్యత’ విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్మినిస్టర్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు. ఇదీ చదవండి: కడసారి చూపునకు కూడా రానివ్వలేదా? -
బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా?
లండన్: రాజవంశస్థులు అంటేనే కోట్ల ఆస్తులకు వారసులు. అత్యంత సంపన్నులు. మరి బ్రిటన్ రాజకుటుంబం అంటే ఈ లెక్కలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ, రాజకుటుంబం నికర ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు మొత్తం ఈ ఫొటోలో చూడండి. నూతన రాజముద్రిక రాజకిరీటం, దానికింద సీఆర్ అంటూ పొడి అక్షరాలతో కింగ్ చార్లెస్–3 నూతన రాజముద్రిక రూపుదిద్దుకుంది. సీ అంటే చార్లెస్, ఆర్ అంటే రెక్స్ (లాటిన్లో రాజు) అని అర్థం. రాజుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన టై మీద ఆయన దీన్ని తొలిసారిగా ధరించారు. చార్లెస్ పాలన సాగినంత కాలం బ్రిటన్తో పాటు ఇతర కామన్వెల్త్ దేశాల కరెన్సీ నోట్లు, నాణాలు, పాస్పోర్టులు, సైనిక దుస్తులు, అధికారిక స్టాంపులు తదితరాలన్నింటి మీదా ఇకపై ఈ ముద్రే కన్పించనుంది. ఎలిజబెత్ హయాంలో రాజముద్రికపై ఈఆర్ (ఎలిజబెత్ రెజీనా) అని ఉండేది. సవరణ బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల గ్రాఫ్లో కార్న్వాల్ ఎస్టేట్ విలువ 1,300 కోట్ల డాలర్లు, బకింగ్హాం ప్యాలెస్ విలువ 4,900 కోట్ల డాలర్లు అని పొరపాటుగా వచ్చింది. వాటిని 130 కోట్ల డాలర్లు, 490 కోట్ల డాలర్లుగా చదువుకోగలరు. చదవండి: బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా? -
Amarnath Vasireddy: దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి సాయపడింది వారే! ఇక..
ఏ రాజ్యంలో , ఏ దేశంలో రాజులు ప్రజలకు మేలుచేసిండ్రు ... ? ఒక ప్రఖ్యాతి పొందిన పాట ! నిజమే ! ఏ జాతి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం ? నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం ... శ్రీ శ్రీ .. రాజులకు , బ్రిటిష్ వలస పాలనకు ఒక మౌలిక తేడా ఉంది. ఒక రాజు ఎంత క్రూరుడైనా, అధిక పన్నులు వేసి ప్రజల రక్తాన్ని జుర్రినా , ఆ డబ్బు తన విలాసాలకు తగలెట్టినా ఆ డబ్బు ఇక్కడే వుండేది. ఆ రాజు గారి విలాసాల వల్ల కనీసం కొంతమందికి ఉపాధి వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే సర్కులేట్ అయ్యేది. బ్రిటిష్ పాలనలో మన సంపద వారి దేశానికి తరలి వెళ్ళిపోయింది. మహానుభావుడు గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆన్ ఇండియా గా పేరొందిన దాదాభాయ్ నౌరోజి తన "పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా" అనే గ్రంధం లో "డ్రైన్ అఫ్ వెల్త్ "అంటే సంపద జుర్రుడు లేదా సంపద వలస సిద్ధాంతం లో దీన్ని వివరించాడు . అందరు స్వతంత్ర సమర యోధులకు ఈ గ్రంధం మార్గదర్శి అయ్యింది. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వారు తమ దేశానికి తరలించిన సంపద విలువ సుమారుగా రెండు వేల అయిదువందల లక్షల కోట్లు (ఇరవై అయిదు ట్రిలియన్ పౌండ్లు) బ్రిటిష్ వారి కారణంగా కృత్రిమ అంటే మానవ ప్రేరేపిత కరువులు వచ్చాయి. బ్రిటిష్ పాలనకు ముందు ఆకలితో కరువుతో పెద్దగా చనిపోయిన దాఖలాలు లేవు. బ్రిటిష్ వారి కాలం లో కరువుతో ఆకలితో చనిపోయిన వారు సంఖ్య మూడు కోట్లు. పెద్దామె చనిపోతే అయ్యో పాపం అనడం తప్పుకాదు. ఇంగ్లాండ్ వెళ్లి ఉద్యోగం చెయ్యడం తప్పుకాదు. బతుకు తెరువు కోసం, మెరుగైన జీవనం కోసం వలసలు సహజం. అప్పుడు వారు చేసిన దానికి ఇప్పుడు కక్ష తీర్చుకోండి అని చెప్పడం లేదు. చరిత్రనే మరచి లేదా పిల్లి మొగ్గల పుస్తకాలూ చదివి బ్రిటిష్ వారివల్లే మనం డెవలప్ అయ్యాము. మనకు ఉపాధి వచ్చినది అంటే.. మీ అవగాహన, మీ ఇష్టం . తెలియక పొతే అడగండి. ఎన్ని గంటలైనా చెబుతాను. కానీ నాకు తెలిసిందే సర్వం అని మన సమర యోధుల త్యాగఫలాలను అవహేళన చేసేలా మాట్లాడం అన్యాయం. ఇలాంటి బ్యాచ్ బ్రిటిష్ కాలంలో కూడా ఉండేది. దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి వారే సాయపడింది. అది కాకుండా ఇంకో బ్యాచ్ ఉండేది.. మనదైతే కంపు కొడుతుంది. తెల్లటి బ్రిటిష్ దొరల మలం సువాసనలు వెదజల్లుతుంది అని నమ్మే వారు. ఇది జోక్ కాదు. నిజం. ఇలాంటి కంపు బ్యాచ్తో మాట్లాడే ఓపికే నాకు లేదు. - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు చదవండి: Amarnath Vasireddy: కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ -
బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్ కాస్టిల్లో జరిగిన విషయాలపై బ్రిటీష్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచురించింది. ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తన చిన్న కూమారుడు హ్యారీకి ఓ విషయం తేల్చిచెప్పినట్లు పేర్కొంది. ఎలిజబెత్ను చివరి క్షణాల్లో చూసేందుకు హ్యారీ తన భార్య మెర్కెల్ను తీసుకురావద్దని చార్లెస్ చెప్పారని వెల్లడించింది. 'మహారాణి చనిపోయే ముందు అతి తక్కువ మంది దగ్గరి బంధువులే పరిమిత సంఖ్యలో ఆమెతో పాటు ఉంటున్నారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో మెర్కెల్ను ఇక్కడకు తీసుకురావడం సరికాదు. అందుకే ఆమెను తీసుకురావొద్దు' అని ప్రిన్స్ చార్లెస్ తన కుమారుడు హ్యారితో చెప్పినట్లు ది సన్, స్కై న్యూస్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ కారణంతోనే గురువారం ఎలిజబెత్ చనిపోవడానికి ముందు హ్యారీనే బల్మోరల్ క్యాస్టిల్కు చివరగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరణాంతరం శుక్రవారం రోజు క్యాస్టిల్ను వీడిన తొలి వ్యక్తి కూడా హ్యారీనే అని సమాచారం. దీంతో బ్రిటన్ రాజకుటుంబంలో వివాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నానమ్మతో అన్యోన్యంగా.. గతంలో ఎలిజబెత్ ఆమె మనవడు హ్యారీల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2016లో బరాక్ ఒబామా, మిచేలీ ఒబామా దివ్యాంగుల కోసం ఇన్విక్టస్ గేమ్స్ కాంపిటీషన్ను ప్రారంభించినప్పుడు ఎలిజబెత్, హ్యారీల రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ గేమ్స్కు హ్యారీనే ప్రమోటర్గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు.. అయితే అమెరికాకు చెందిన మేఘన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హ్యారికి రాజకుటుంబంతో సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ దంపతులు 2021 మార్చిలో ఓప్రా విన్ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేఘన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకుటుంబంలో తాను జాతివివక్షను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అది భరించలేక తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అంతేకాదు తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ ఏ రంగులో ఉంటాడా? అని రాజకుటుంబంలో చర్చించుకునేవారని తెలిపారు. మేఘన్ తల్లి నల్లజాతీయురాలు కాగా.. తండ్రి శ్వేతజాతీయుడు. అప్పటి నుంచి మరింత దూరం ఈ ఇంటర్వ్యూ అనంతరం రాజకుటుంబంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బకింగ్హామ్ ప్యాలెస్ వీటిని తోసిపుచ్చింది. మేఘన్ ఆరోపణలు ఆందోళన కల్గించాయని పేర్కొంది. అప్పటినుంచి హ్యారీ దంపతులకు రాజకుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఇద్దరూ ఆమెరికాలో నివాసముంటున్నారు. తమకు రాజకుటుంబం హోదా వద్దని ప్రకటించారు. అయితే తల్లి మృతి అనంతరం కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ తన మొదటి ప్రసంగంలో హ్యారీ, మేఘన్ల గురించి ప్రస్తావించారు. విదేశాలో నివసిస్తున్న ఈ ఇద్దరిపై కూడా తనకు ప్రేమ ఉందని పేర్కొన్నారు. అయితే ఎలిజబెత్-2 మరణానికి ముందు హ్యారీ బ్రిటన్లోనే ఉన్నారు. అయితే ఇది యాదృచ్చికమే అని బ్రిటీష్ మీడియా సంస్థలు తెలిపాయి. చదవండి: తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టిన మహిళ -
తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టిన మహిళ
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3. అయితే రాణికి నివాళులు అర్పించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్లిన జెన్నీ అస్సిమినోయిస్ అనే మహిళ బాధతో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో జెన్నీ దీనిపై వివరణ ఇచ్చారు. కింగ్ చార్లెస్కు ముద్దుపెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని జెన్నీ చెప్పారు. ఆయనను చాలా దగ్గరనుంచి నుంచి చూసి నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ముద్దు పెడతానని కింగ్ చార్లెస్ను అడిగానని, అందుకు ఆయన అనుమతి ఇచ్చాకే కిస్ చేసినట్లు వెల్లడించారు. కింగ్ చార్లెస్ను చూడటమే గాక, ముద్దు పెట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఛాన్స్ ఎప్పటికీ రాదని.. కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టే అవకాశం జీవితంలో ఎప్పటికీ రాదని తన మనసుకు అనిపించిందని జెన్నీ చెప్పారు. రాజకుటుంబీకులు అంటే తనకు ఎంతో ఇష్టమని, వాళ్లను ఎల్లవేళలా గమనిస్తూనే ఉన్నట్లు జెన్నీ పేర్కొన్నారు. అంతేకాదు వాళ్ల చిన్నప్పటి నుంచి ఫోటోలు కొని పెట్టుకున్నట్లు వివరించారు. తన దివంగత భర్త గ్రీస్ దేశానికి చెందినవాడని, కింగ్ చార్లెస్ తండ్రి ప్రిన్స్ ఫిలిప్ది కూడా గ్రీసే అని సిప్రస్కు చెందిన జెన్నీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అందుకే కింగ్ చార్లెస్తో పాటు రాజవంశస్థులు తనకు దగ్గరివాళ్లలా కన్పిస్తారని పేర్కొన్నారు. జెన్నీ ముద్దుపెట్టిన అనంతరం చిరునవ్వుతో అలాగే ముందుకుసాగారు కింగ్ చార్లెస్. తన తల్లికి నివాళులు అర్పించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్కు వచ్చిన వేలాది మందికి కరచాలనం ఇచ్చారు. ఈ క్రమంలోనే మరో మహిళ కూడా కింగ్ చార్లెస్ చేతిపై ముద్దుపెట్టింది. చదవండి: బకింగ్హమ్ ప్యాలెస్పై జంట ఇంద్రధనుస్సులు -
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘వెళ్లే వివరాలు ఇంకా తెలియవు. కానీ నేను తప్పకుండా వెళ్తాను’ అని శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. రాణి ఎలిజబెత్ అంత్యక్రియల తేదీ ఇప్పటి వరకు నిర్ణయించలేదు. అయితే సెప్టెంబర్ 19న లండన్లోని వెస్ట్మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఒహియోలోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బిడెన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలిజబెత్ కుమారుడు, ప్రస్తుత బ్రిటన్ కింగ్ చార్లెస్-3 తనకు తెలుసని అన్నారు. కానీ ఆయనకు ఎలాంటి కాల్ చేయలేదన్నారు. కాగా బ్రిటన్ను 70 ఏళ్లపాటు పాలించిన రాణి ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఏడు రోజుల వరకూ రాజ కుటుంబం సంతాప దినాలు పాటిస్తుందని బకింగ్హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే, అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. ఎలిజబెత్ మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. ఇక ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు. -
బకింగ్హమ్ ప్యాలెస్పై జంట ఇంద్రధనుస్సులు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణాన్ని అధికారికంగా ప్రకటించిన కొన్ని నిమిషాలకే లండన్లోని బకింగ్హమ్ ప్యాలెస్పై జంట ఇంద్రధనుస్సులు కనిపించడం నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. రాణి మరణవార్త తెలియగానే ప్రజలు పెద్ద ఎత్తున ప్యాలెస్ వద్దకు చేరుకొని ‘గాడ్ సేవ్ ద క్వీన్’అంటూ జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారికి ఆకాశంలో రెండు ఇంద్రధనుస్సులు కనిపించడంతో వాటిని రాణి ఎలిజబెత్–2, ఆమె భర్త ఫిలిప్కు ప్రతీకగా ప్రజలు భావించారు. రాణి, రాజు తిరిగి ఆకాశంలో కలుసుకున్నారంటూ చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం -
బ్రిటన్ పాస్పోర్టులు చెల్లుతాయా? ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణంతో ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. తమ పాస్పోర్టులు అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే.. యూకే పాస్పోర్టుల మొదటి పేజీపై ‘‘శ్రీమత్ మహారాణికి చెందిన విదేశాంగ మంత్రిగా ఇందుమూలముగా సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా.. ఎవరైతే దీన్ని (పాస్పోర్టు) కలిగి ఉన్నారో ఆ వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా... ఆ వ్యక్తికి అవసరమైన మేర సాయాన్ని, భద్రతను కలి్పంచాలి’’అని రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు రాణి మరణం నేపథ్యంలో తమ పాస్పోర్టులు ఇంకా చెల్లుతాయా లేక వాటిని మార్చుకోవాలా? అని బ్రిటన్కు చెందిన నెటిజన్లు అడుగుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు పాస్పోర్టులను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. గడువు ముగిసిన పాస్పోర్టులను పునరుద్ధరించుకొనేటప్పుడు రాజు చార్లెస్–3 పేరును అందులో చేరుస్తామని అధికార వర్గాలు ప్రజలకు భరోసా ఇస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాణి ఎలిజబెత్–2కు మాత్రం పాస్పోర్టు లేదు. ఎందుకంటే.. తన పేరిటే పాస్పోర్టులు జారీ అవుతున్నందున తాను కూడా పాస్పోర్టు కలిగి ఉండటం అర్థరహితమని ఎలిజబెత్–2 భావించారట. అయితే ఆమె మినహా బ్రిటన్ రాజకుటుంబంలోని ప్రతి ఒక్కరికీ.. అంటే దివంగత భర్త ప్రిన్స్ ఫిలిప్ సహా అందరికీ పాస్పోర్టు ఉండేది. ఆమె మరణం నేపథ్యంలో పాస్పోర్టులనే కాదు.. దేశ కరెన్సీ, స్టాంపులపై ‘రాణి’అనే పదం బదులు రాజు అనే పదాన్ని చేర్చాల్సి ఉంది. అలాగే యూకే జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద క్వీన్’ను ‘గాడ్ సేవ్ ద కింగ్’గా మార్చాల్సి ఉంది. చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం -
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం
70 ఏళ్లపాటు బ్రిటన్ను ఏలిన రాణి ఎలిజబెత్–2కు హైదరాబాద్ మహానగరంతో అనుబంధం ఉంది. చారిత్రక భాగ్యనగరాన్ని ఆమె ఒకసారి సందర్శించి ముగ్ధులయ్యారు. వందల ఏళ్ల నాటి చారి్మనార్, గోల్కొండ కట్టడాలు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎలిజబెత్–2 తన పాలనా కాలంలో మూడుసార్లు భారత్కు వచ్చారు. అందులో భాగంగా 1983 నవంబర్ 20న ఆమె హైదరాబాద్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చికి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఆమె నానమ్మకు నానమ్మ అయిన విక్టోరియా మహారాణి తన సొంత డబ్బుతో ఈ చర్చిని కట్టించారు. అందుకే ఎలిజబెత్–2 ప్రత్యేకంగా ట్రినిటీకి విచ్చేశారు. ట్రినిటీ చర్చిని క్వీన్స్ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఆ సందర్భంగానే ఆమె రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్, గోల్కొండ కుతుబ్షాహీ టూంబ్స్, చార్మినార్, తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎలిజబెత్–2తోపాటు ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ కూడా ఆమె వెంట ఉన్నారు. అప్పుడు ఆర్కియాలజిస్ట్గా విధులు నిర్వహించిన ఎంఎ ఖయ్యూం వారి వెంట ఉండి నగరంలోని చారిత్రక ప్రదేశాలను పరిచయం చేశారు. చదవండి: ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్ను గిఫ్గ్గా ఇచ్చిన నిజాం నవాబు -
Queen Elizabeth II: అరుదైన వ్యక్తిత్వం
‘రవి అస్తమించని సామ్రాజ్యం’ తన ప్రాభవం క్రమేపీ కోల్పోతూ, కొడిగడుతున్న తరుణంలో బ్రిటిష్ పట్టపు రాణిగా వచ్చిన రాణి ఎలిజబెత్–2 గురువారం రాత్రి కన్నుమూశారు. బ్రిటన్తో పాటు మరో 14 దేశాలకు లాంఛనప్రాయపు రాజ్యాంగాధినేత హోదాలో అయితేనేమి, పూర్వపు బ్రిటిష్ వలస దేశాలతో కూడిన కామన్వెల్త్ అధినేత హోదాలో అయితేనేమి... ఈ ఏడు దశాబ్దాలూ ఆమె తనదైన ముద్రవేశారు. ఎలిజబెత్–2 సింహాసనం అధిష్ఠించేనాటికి అదే యూరప్ ఖండంలోని అనేక దేశాలు హింసాత్మకంగానో, సామరస్యపూర్వక మార్గంలోనో రాచరిక వ్యవస్థల్ని పూర్తిగా వదుల్చుకుని ప్రజాస్వామ్య రిపబ్లిక్లుగా అవతరిస్తున్నాయి. బ్రిటన్ గురించే చెప్పాలంటే అంతకు రెండున్నర శతాబ్దాల పూర్వమే అది ప్రజాస్వామ్య ఫలాలను రుచిచూడటం ప్రారంభించింది. అయినా బ్రిటన్ ప్రజాజీవన రంగం ఈనాటికీ రాచరిక వ్యవస్థతోనే పెనవేసుకుని ఉండటం, బకింగ్హామ్ రాజప్రాసాద పరిణామాలు ఈనాటికీ అక్కడి పౌరుల్లో ఆసక్తిదాయకం కావడం ఆ సమాజ తీరుతెన్నుల్ని పట్టిచూపుతుంది. ఇందుకు రాణిగా ఎలిజబెత్–2 నిర్వహించిన పాత్ర కూడా తక్కువేమీ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడటం, తమ పరిధులు, పరిమితులు గుర్తెరిగి మసులుకోవడం వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా శోభనిస్తుంది. రాణి ఎలిజబెత్ ఆ పని చేశారు కాబట్టే పెద్దగా వివాదాలు ముసురుకోలేదు. తనదైన ఆ శైలే 70 ఏళ్లపాటు ఆమెను అవిచ్ఛిన్నంగా నిలబెట్టింది. దేశానికి రాచరికం ఎందుకన్న ప్రశ్న తలెత్తకుండా చేసింది. రాజ్యాధినేతగా ఆమె ప్రతి వారం ప్రధానితో, విదేశాంగ మంత్రి తదితరులతో సంభాషించటం ఆనవాయితీ. ఇంటా బయటా జరిగే పరిణామాలను తెలుసుకోవటం, సలహాలివ్వటం రివాజు. ఆమె రాణి అయ్యేనాటికి విన్స్టన్ చర్చిల్ దేశ ప్రధాని. అప్పటికే రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ అన్నివిధాలా దెబ్బతిని, తన వలస రాజ్యాల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహం పర్యవసానంగా ఒక్కో దేశంనుంచే నిష్క్రమించకతప్పని దుస్థితిలో పడింది. ఆమె వచ్చాక సైతం అది కొనసాగింది. తన తాతలకాలం లోనే రాజ కుటుంబీకులకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండే దశ అంతరించి సమానత్వ భావన వచ్చింది. ఇక 1956 నాటి సూయెజ్ కాల్వ సంక్షోభం బ్రిటన్ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలో తన వాస్తవ స్థానమేమిటో చూపింది. సామ్రాజ్యంగా వెలుగులీనిన బ్రిటన్ యూరోప్ యూనియన్ (ఈయూ)లో ఒక భాగస్వామిగా మారడం... ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా అదే ఈయూ నుంచి రెండేళ్లక్రితం బయటకు రావడం వంటి పరిణామాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. స్కాట్లాండ్లో స్వాతంత్య్ర కాంక్ష క్రమేపీ పెరిగి ఒక దశలో ఆ ప్రాంతం విడిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వాలూ, వాటి అస్థిరతా సరేసరి. వీటన్నిటినీ చూస్తూ, దశాబ్దాల తన అనుభవంతో ప్రభుత్వంలో ఉండేవారికి ఎప్పటికప్పుడు సలహాలిస్తూ ఆమె తన ప్రభావాన్ని చూపగలిగారు. అదే సమయంలో అనవసర జోక్యం చేసుకుంటున్నారన్న అపప్రథ రాకుండా చూసుకున్నారు. అందుకే బ్రిటన్ రాచరికానికి ఇప్పటికీ ప్రాసంగికత అడుగంటకపోవటం వెనక ఆమె వ్యక్తిగత ముద్రను కాదనలేం. ‘రాచరిక వ్యవస్థలోకి తొంగి చూడనంత కాలం దానిపై పూజ్యభావన ఉంటుంది. ఒక్కసారి అలా చూశాక మరి దాన్ని కీర్తించడం అసాధ్యం. అందుకే ఆ మార్మికతను అట్లే కొనసాగనీయండి’ అన్నాడు రాజ్యాంగ నిపుణుడు వాల్టర్ బాజెట్ ఒక సందర్భంలో వ్యంగ్యంగా. అలా చూస్తే బకింగ్ హామ్ రాజప్రాసాదంలో దిగ్భ్రాంతిపరిచేవి ఎన్నో కనబడతాయి. 1992లో ఒకేసారి ఆమె సంతానం లోని ముగ్గురు విడాకులు తీసుకోవటం బ్రిటన్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయారు. ఆ మాటకొస్తే తాను రాణి అయిన కొద్దికాలానికే తన సోదరి ఒక సాధారణ వ్యక్తితో సాన్నిహిత్యం నెరపడం, మీడియాలో అది చిలవలు పలవలుగా రావడం, చివరికామె అతన్ని పెళ్లాడి, ఆ తర్వాత కొద్దికాలానికే విడాకులు తీసుకోవటం వంటి పరిణామాలు రాజకుటుంబీకుల్ని ఊపిరాడని స్థితిలో పడేశాయి. ఎందుకంటే రాణిగా ఆమె చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్కు సుప్రీం గవర్నర్. సంప్రదాయానికి అత్యంత విలువ నిచ్చే సమాజం దృష్టిలో ఇవన్నీ ‘జరగకూడని ఘోరాలు’. ఇక యువరాణి లేడీ డయానా స్పెన్సర్ విషయంలో ఆమె తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నారు. కోడలిగా సంప్రదాయ పాత్రలో ఒదిగి, ప్రచారానికి దూరంగా ఉండాల్సిన డయానా ప్రముఖురాలిగా మారడం రాజప్రాసాదంలో ఎవరికీ నచ్చలేదంటారు. డయానాను ఆమె అత్తగా ఆరళ్లు పెట్టారని ఆరోపణ లొచ్చాయి. దానికి తగ్గట్టే 1995లో ప్రిన్స్ చార్లెస్తో విడిపోయిన డయానా మరో రెండేళ్లకు పారిస్లో దుర్మరణం పాలైనప్పుడు మొదట్లో రాణి నుంచి స్పందన లేదు. చివరకు ప్రజాభిప్రాయానికి ఆమె తలొగ్గక తప్పలేదు. నాలుగురోజులు ఆలస్యమైనా విషాద సూచకంగా రాజప్రాసాదంపై ఉన్న యూనియన్ జాక్ను అవనతం చేయమని ఆదేశించవలసి వచ్చింది. ఇక భిన్న సందర్భాల్లో రాజ్యాధినేతగా అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల అధినేతలకూ, సీనియర్ సైనికాధికారులకూ నైట్హుడ్, ఆనరరీ నైట్ కమాండర్ వంటి భుజకీర్తులు తగిలించడం విమర్శలకు తావిచ్చింది. వీరంతా వియత్నాం, పాలస్తీనా, ఇరాక్ తదితరచోట్ల రక్తపుటేర్లు పారించారన్న ఆరోపణలు ఎదు ర్కొన్నవారు. ఏదేమైనా ఎలిజెబెత్లా సంయమనంతో మెలగటం, ఆ ఒరవడిని కొనసాగించటం కుమారుడు చార్లెస్కు సంక్లిష్టమైనదే. ఆయన ఆ బాధ్యత ఎలా నెరవేరుస్తారో బ్రిటన్ గమనిస్తూనే ఉంటుంది. -
యాభై ఏళ్ల తర్వాత.. ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్కు అంత్యక్రియలు
లండన్: బ్రిటన్లో దాదాపు అర్థ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలను రాజరిక సంప్రదాయంలో కాకుండా.. ప్రభుత్వా లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1965లో మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ఈ గౌరవాన్ని పొందిన చివరి నేత. సుదీర్ఘకాలం రాణిగా పనిచేసిన క్వీన్ ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐతే ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్క్యారేజీపై క్వీన్ ఎలిజబెత్ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వెస్ట్మిన్స్టర్ అబ్బే లేదంటే సెయింట్ పాల్స్ కేథడ్రల్ వరకు ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు సందర్శనార్ధం రాణి భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్మినిస్టర్ హాల్లో ఉంటుంది. ఆ తదనంతరం దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు. ఐతే బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 జ్ఞాపకార్థం డెత్ గన్సెల్యూట్ సందర్భంగా శుక్రవారం యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల్లో ఫిరంగా కాల్పలు నిర్వహించారు బ్రిటన్ అధికారులు. ఇలా ప్రతి ఏడాది 96 రౌండ్ల గన్ షాట్లతో క్విన్ ఎలిజబెత్కి గౌరవ వందనం ఇవ్వాలని బ్రిటన్ అధికారలు నిర్ణయించారు. ఈ మేరకు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ కోట, నార్తర్న్ ఐర్లాండ్లోని హిల్స్బరో కోట, వేల్స్లోని కార్డిఫ్ కోట నుంచి కాల్పులు నిర్వహించారు. (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్) -
క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్ 2 బ్రిటన్ రాణిగా సుదీర్ఘకాలం కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఐతే ఆమె గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మేరకు వేసవి విడిది కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం తుది శ్వాస విడిచారు. దీంతో రాచ కుటుంబికులు, యావత్తు యునైటైడ్ కింగ్డమ్ ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ దేశ ప్రజల ఆమె సుదీర్ఘపాలనను గుర్తు చేసుకోవడమే కాకుండా వారి ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా సుదీర్ఘకాలం రాణిగా అత్యున్నత హోదాలో కొనసాగిన క్వీన్ ఎలిజబెత్2 గౌరవార్థం ఒక రోజు దేశం మొత్తం సంతాపదినంగా పాటించాలని శుక్రవారం నిర్ణయించింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 11న సంతాప దినంగా పాటించాలని ప్రకటించింది. యావత్ భారతదేశం ఆరోజుని సంతాపదినంగా పాటించడమే కాకుండా భవనాలన్నింటిపై జాతీయ జెండ మాస్ట్లో ఎగురవేసి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ రోజుల ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. (చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....) -
బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బల్మరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే బ్రిటన్ రాణి వాడిపడేసి ఒక టీబ్యాగ్ గురించి ఒక కథనం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాజ కుటుంబికులుకు సంబంధించిన వస్తువులు బయటకు రావడం అనేది అసాథ్యం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ వారు ఉపయోగించే వస్తువులు గురించి బయట వ్యక్తులకు తెలిసి ఉండే అవకాశమే అరుదు. అలాంటిది ఆమె వాడిపడేసి టీ బ్యాగ్ ఏంటీ? అది నిజంగా ఆమె ఉపయోగించినదేనా అనే సందేహాలు రావడం సహజమే. కానీ ఔను! ఇది నిజం అని చెప్పే ఆధారాలను కూడా పొందుపరిచారు. అసలేం జరిగిందంటే....70 ఏళ్లు సుదీర్ఘ పాలనతో రికార్డు సృష్టించిన క్విన్ ఎలిజబెత్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక బ్రిటన్ ప్రజలు ఆమె పాలనను గుర్తు చేసుకుంటూ ఆమె ఉపయోగించని వస్తువులను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ టీ బ్యాగ్ గురించి ఒక కథనం బయటపడింది. 1998లో విండ్సర్ కాజిల్ అనే వ్యక్తి దీన్ని అక్రమంగా బయటకు తరలించినట్లు సమాచారం. ఇది దివగంత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రెజీనా బ్రిటానియా టీ బ్యాగ్గా నివేదిక పేర్కొంది. ఇది ఇప్పుడు 'ఈబే' అనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆన్లైన్ విక్రయాల జాబితాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వస్తువు ఆన్లైన్లో సుమారు రూ. 9 లక్షలకు విక్రయించబడింది. ఈ టీ బ్యాగ్ని యూఎస్కి చెందిన జార్జియా కొనుగోలు చేశారు. ఈ టీబ్యాగ్కి 'రాయల్ ఆర్ట్ఫాక్ట్'తో పాటు 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికేట్స్ ఆఫ్ అథెంటిసిటీ' జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ ఉందని చెప్పారు. ఇది నిస్సందేహంగా బ్రిటన్ రాణి వినియోగించిన టీ బ్యాగేనని జార్జియా చెబుతున్నారు. అలానే గతంలో 1985లో గ్రేట్ వెస్ట్రన్ రైల్వే 150వ వార్షికోత్సవం సందర్భంగా క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ సంతకాలతో కూడిన ఒక పుస్తకం దాదాపు రూ. 19 లక్షలకు విక్రయించబడినట్లు ఈబే కామర్స్ సంస్థ పేర్కొంది. (చదవండి: ఎలిజబెత్ 2 వివాహానికి ఖరీదైన్ డైమెండ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇచ్చిన నిజాం నవాబు) -
ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్ను గిఫ్గ్గా ఇచ్చిన నిజాం నవాబు
క్వీన్ ఎలిజబెత్2.. పేరుకు తగ్గట్టే జీవితాంతం మహారాణిలా బతికారు. 75 ఏళ్లపాటు బ్రిటన్ రాణిగా ఉన్న ఎలిజబెత్.. సుదీర్ఘకాలం ఆ హోదాలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబెత్కు భారత్తో ఎంతో అనుబంధం ఉంది. భారత్ను 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిషర్లు.. దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించిన అయిదేళ్ల తర్వాత క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా ఎంపికయ్యారు. 1952లో బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించారు. రాణి అయ్యాక ఆమె మూడుసార్లు భారత్ను సందర్శించారు. 1961లో తొలిసారి భారత్ను సందర్శించగా.. 1983, 1997లోనూ క్వీన్ ఎలిజబెత్ భారత్లో పర్యటించారు. క్విన్ ఎలిజబెత్ వివాహానికి హైదరాబాద్ నిజాం నవాబు తన హోదాకు తగ్గట్టు అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. 1947లో క్వీన్ ఎలిజబెత్ వివాహం జరగగా.. 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినమ్ నెక్లెస్ సెట్ను అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యువరాణిగా గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రిన్సెస్ ఎలిజబెత్ తన వివాహ కానుకను స్వయంగా ఎంచుకోవాలని నిజాం లండన్కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్ ప్రతినిధులను ఆమె వద్దకు పంపించాడు. దీంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది. చదవండి: King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) తన 70 ఏళ్ల పాలనలో ఎంతో మంది నుంచి ఎన్నో విలువైన వస్తువులను, అభరణాలను కానుకగా స్వీకరించినప్పటికీ.. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్’ తయారు చేసిన 300 వజ్రాలతో పొదిగిన ప్లాటినం నెక్లెస్ సెట్ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ దగ్గరున్న అత్యంత ప్రసిద్ధ ఆభరణాలలో ఒకటి. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ప్రస్తుతం దీని విలువ 66 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుందని అంచనా. రాణి నెక్లెస్ ధరించి దగిన ఫోటోలను ది రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్స్టాగ్రామ్లో జూలై 21న పోస్ట్ చేశారు. ఇందులో క్వీన్ ఎలిజబెత్ 1952 ఫిబ్రవరిలో బ్రిటన్ రాణి హోదా స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత తీసిన ఫోటో ఉంది. ఈ నెక్లెస్ను ఎలిజబెత్ తన మనవడి భార్యకు అప్పుగా కూడా ఇచ్చారు. ఆమె దానిని 2014లో నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో, 2019లో డిప్లొమాటిక్ కార్ప్స్ రిసెప్షన్లో ధరించింది. -
King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే
లండన్: బ్రిటన్ను సుధీర్ఘకాలం పాలించిన మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచారు. 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం అందుకున్న ఎలిజబెత్ 70 ఏళ్లకు పైగా ఆ హోదాలో కొనసాగారు. ఇక ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా అవతరించనున్నారు. చార్లెస్కు అధికారికంగా పట్టాభిషేకం చేసేందుకు కొన్ని నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. రాణి ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ (73) బ్రిటన్కు కొత్త రాజు కానున్నారు. చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్హామ్ ప్యాలెస్లో జన్మించారు. ఎలిజబెత్ నలుగురు సంతానంలో చార్లెస్ పెద్దవారు. 1981లో డయానాను వివాహమాడిన చార్లెస్ దంపతులకు ఇద్దరు కుమారులు.. ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ. వ్యక్తిగత కారణాలతో చార్లెస్ డయానా దంపతులు 1992లో విడిపోయారు. అనంతరం 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్.. కెమెల్లా పార్కర్ను రెండో వివాహం చేసుకున్నారు. మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన చార్లెస్.. కింగ్ చార్లెస్-3గా వ్యవహరించనున్నారు. అలాగే 14 కామన్వెల్త్ దేశాలకూ రాజుగా కూడా ఉంటారు. బ్రిటన్ కొత్త రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు పాస్పోర్టు లేకుండా విహారం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III పాస్పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లగలరు. లైసెన్స్ లేకుండా ప్రయాణించగలరు. రాజకుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరి ఆయనకి పాస్పోర్టు అవసరం లేదు. బ్రిటన్ రాజు ఎక్కడా, ఎలాంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా ప్రయణించగలడు. వారికి అవసరమైన సహాయాన్ని, రక్షణ అందిస్తూ బ్రిటన్ రాజు పేరు మీద ప్రత్యేక డాక్యుమెంట్ జారీ చేస్తారు. ఈ కారణంతో బ్రిటన్లో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయగల ఏకైక వ్యక్తి రాజు మాత్రమే. రెండు పుట్టినరోజులు చార్లెస్ తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 రెండు పుట్టినరోజులు జరుపుకుంటారు. ఆమె అసలు పుట్టిన రోజుఏప్రిల్ 21. దీనిని ప్రైవేట్గా జరుపుకుంటారు. అయితే వేసవి వాతావరణం అవుట్డోర్ పరేడ్స్(బహిరంగ కవాతులకు) అనుకూలంగా ఉంటుందని జూన్ నెలలోని రెండో మంగళవారాన్ని రాణి అధికారిక బహిరంగ వేడుకగా నిర్వహిస్తారు. ఇక చార్లెస్ పుట్టినరోజు కూడా శీతాకాలం ప్రారంభమయ్యే నవంబర్ 14న ఉండటంతో అతని బర్త్డేను కూడా వేసవి నెలలో 2అధికారిక పుట్టినరోజు’గా జరిపే అవకాశం ఉంది. ఈ బహిరంగ వేడుకల్లో 1,400 కంటే ఎక్కువ మంది సైనికులు, 200 గుర్రాలు, 400 మంది సంగీతకారులు పాల్గొంటారు. సెంట్రల్ లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి రాజ కుటుంబ సభ్యులు చూస్తుండగా రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లై-పాస్ట్తో ఈ వేడుక కార్యక్రమాలను ముగిస్తుంది. నో ఓటింగ్ బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు ఓటింగ్లో పాల్గొనరు. అలాగే ఎన్నికల్లో పోటీచేయరు. దేశాధినేతగా, అతను రాజకీయ వ్యవహారాల్లో ఖచ్చితంగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరు పార్లమెంటరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. పార్లమెంటు నుంచి వచ్చే చట్టాలకు ఆమోదముద్ర వేస్తారు. అదే విధంగా ప్రధానమంత్రితో వారానికోసారి సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రజలకే కాదు బ్రిటీష్ చక్రవర్తి ప్రజలను మాత్రమే పరిపాలించరు. 12వ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్, వేల్స్ అంతటా బహిరంగ జలాల్లోని మూగ హంసలు చక్రవర్తి ఆస్తిగా పరిగణించబడుతున్నాయి. వీటితోపాటు బ్రిటీష్ జలాల్లోని స్టర్జన్(ఒక రకం చేప), డాల్ఫిన్లు, తిమింగలాలకు కూడా రాయల్ ప్రత్యేకాధికారం వర్తిస్తుంది. అధికారిక రచయిత బ్రిటన్ చక్రవర్తి కోసం పద్యాలను రచించేందుకు ప్రతి 10 సంవత్సరాలకు ఆస్థాన కవిని నియమిస్తారు. ఈ సంప్రదాయం 17వ శతాబ్దం నుంచి వస్తోంది. 2009లో కరోల్ ఆన్ డఫీ రచయితగా నామినేట్ అయిన మొదటి మహిళగా నిలిచారు. ఆమె 2011లో ప్రిన్స్ విలియం వివాహం, 2013లో క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేక 60వ వార్షికోత్సవం, 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కోసం పద్యాలను కంపోజ్ చేశారు. రాయల్ వారెంట్ చక్రవర్తికి వస్తువులు సరఫరా చేసే., సేవలను అందించే కంపెనీలకు రాయల్ వారెంట్ జారీ చేస్తారు. ఈ వారెంట్ వారికి గొప్ప గౌరవాన్ని అందించడమే కాకుండా అమ్మకాల ప్రోత్సాహనికి ఉపయోగపడుతుంది. వారెంట్ పొందిన కంపెనీలు తమ వస్తువులపై రాజ ఆయుధాలను ఉపయోగించేందుకు అధికారం కలిగి ఉంటాయి. బర్బెర్రీ, క్యాడ్బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్లు రాయల్ వారెంట్ ఉన్న కంపెనీలలో ఉన్నాయి. -సాక్షి, వెబ్డెస్క్ -
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇకలేరు
లండన్: బ్రిటన్ను సుదీర్ఘకాలం, 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్–2(96) ఇకలేరు. వేసవి విరామం కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. రాణి ఆరోగ్యం విషమించిందనే వార్తల నేపథ్యంలో సన్నిహిత రాజకుటుంబీకులంతా ఉదయమే బల్మోరల్కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో లండన్ వాసులు, పర్యాటకులు బకింగ్హామ్ ప్యాలెస్ వద్దకు చేరుకుంటున్నారు. 1952లో 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. ఆమె ఆరోగ్యం గత ఏడాది అక్టోబర్ నుంచి క్షీణిస్తూ వస్తోంది. వయో సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దైనందిన కార్యకలాపాలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. ప్రయాణాలను బాగా తగ్గించుకున్నారు. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ నియామకాన్ని కూడా ఆమె ఇటీవల బల్మోరల్ నుంచే చేపట్టారు. ప్రభుత్వ సీనియర్ సలహాదారులతో బుధవారం వర్చువల్గా రాణి పాల్గొనాల్సిన ప్రీవీ కౌన్సిల్ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడటంతో ఆమె ఆరోగ్య పరిస్థితులపై అనుమానాలు మొదలయ్యాయి. రాణి ఆరోగ్యాన్ని వైద్యుల బృందం దగ్గరుండి పరిశీలిస్తోందని బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించడం ఇందుకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాణి సన్నిహిత కుటుంబ సభ్యులు బల్మోరల్ కోటకు చేరుకున్నారు. కుమారుడు ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు, కూతురు ప్రిన్సెస్ అన్నె, మనవడు ప్రిన్స్ విలియమ్, యూకేలోనే ఉన్న ప్రిన్స్ హ్యారీ దంపతులు కూడా బల్మోరల్ వెళ్లారు. బీబీసీ ఇతర కార్యక్రమాలను రద్దు చేసి, రాణి గురించిన అప్డేట్స్ను అందిస్తోంది. రాణి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే పార్లమెంట్లో ఇంధన బిల్లులపై జరుగుతున్న చర్చను హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సే హోలె నిలిపివేశారు. ఎలిజబెత్–2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా, 14 కామన్వెల్త్ దేశాల అధినేతగా సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తారు. తీవ్ర వేదన చెందుతున్నాం: చార్లెస్ రాజకుటుంబం తరఫున నూతన రాజు చార్లెస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నా ప్రియమైన తల్లి, హర్ మెజెస్టీ ది క్వీన్ మరణం నాకు, నా కుటుంబ సభ్యులందరికీ తీవ్ర వేదన కలిగిస్తోంది. ఆమె మరణంపై మేము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం’ అని తెలిపారు. దిగ్భ్రాంతికి గురయ్యాం: లిజ్ ట్రస్ రాణి ఎలిజబెత్ మృతితో యూకేతోపాటు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందని నూతన ప్రధాని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆమె కృషి వల్లనే నేడు బ్రిటన్ గొప్పదేశంగా ఎదిగింది. ఆమె అంకితభావం మనందరికీ ఆదర్శం’ అని పేర్కొన్నారు. 10వ రోజున అంత్యక్రియలు ► ఎలిజబెత్–2 రాణి మరణంతో ‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జి’ పేరిట తదనంతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ► నూతన రాజుగా ప్రిన్స్ చార్లెస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ► యూకేలో జాతీయ పతాకాలను అవనతం చేశారు. ► పార్లమెంట్ వ్యవహారాలను 10 రోజులపాటు రద్దు చేశారు. జాతీయ సంతాప దినాలను ప్రకటిస్తారు. ► రాణి భౌతికకాయాన్ని బకింగ్హామ్ ప్యాలెస్లోని థ్రోన్ రూమ్కు తరలిస్తారు. ఐదు రోజులపాటు అక్కడే ఉంచుతారు. ► ఆ తర్వాత వెస్ట్మినిస్టర్ హాల్కు చేరుస్తారు. అక్కడ 3 రోజులపాటు ఉంచుతారు. ► రాణికి నివాళులర్పించడానికి రోజుకు 23 గంటలపాటు సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ► పదో రోజున లండన్లోని వెస్ట్మినిస్టర్ అబ్బే చర్చిలో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ సంతాపం.. క్వీన్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాణి మృతి బాధాకరమని, మన కాలంలో ఆమె ఒక దృఢమైన నేతగా గుర్తుండిపోతారని చెప్పారు. మాతృదేశం బ్రిటన్కు స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించారని కొనియాడారు. ప్రజా జీవితంలో గౌరవ, మర్యాదలతో మెలిగారని, తనపై ఆమె చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. 2015, 2018లో ఎలిజబెత్ రాణితో జరిగిన తన సమావేశాలను గుర్తుచేసుకున్నారు. మరణం పట్ల సంతాపం ప్రకటించారు. I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC — Narendra Modi (@narendramodi) September 8, 2022 -
పగ్గాలు చేపట్టిన లిజ్
లండన్: హోరాహోరి పోరులో నెగ్గి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ ట్రస్ (47)ను బ్రిటన్ ప్రధానిగా రాణి ఎలిజబెత్2 లాంఛనంగా నియమించారు. ట్రస్ మంగళవారం స్కాట్లండ్ వెళ్లి అక్కడి బాల్మోరల్ క్యాజిల్లో వేసవి విడిదిలో సేదదీరుతున్న 96 ఏళ్ల రాణితో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాణి ఆమెను ఆహ్వానించారు. అంతకుముందు తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ (58) రాణికి తన రాజీనామా సమర్పించారు. కొత్త ప్రధానిని ప్రభుత్వ ఏర్పాటుకు రాణి ఆహ్వానించే ప్రక్రియ లండన్లోని బకింగ్హం ప్యాలెస్లో జరగడం ఆనవాయితీ. కానీ వృద్ధాప్యంతో రాణి ప్రయాణాలు బాగా తగ్గించుకున్నారు. దాంతో తొలిసారిగా వేదిక బాల్మోరల్ క్యాజిల్కు మారింది. ఎలిజబెత్2 హయాంలో ట్రస్ 15వ ప్రధాని కావడం విశేషం! 1952లో విన్స్టన్ చర్చిల్ తొలిసారి ఆమె ద్వారా ప్రధానిగా నియమితుడయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న అనంతరం ట్రస్ లండన్ తిరిగి వచ్చారు. ప్రధానిగా తొలి ప్రసంగం అనంతరం తన కేబినెట్ను ఆమె ప్రకటించనున్నారు. భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయెల్లా బెవర్మన్ను హోం మంత్రిగా ట్రస్ ఎంచుకున్నారు. ప్రధాని పీఠం కోసం ట్రస్తో చివరిదాకా హోరాహోరీ పోరాడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ మాత్రం ఆమె కేబినెట్లో చేరబోనని దాదాపుగా స్పష్టం చేశారు. రాజీనామాకు ముందు జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ‘ఆట మధ్యలో నిబంధనలు మర్చేయడం ద్వారా’ సహచర పార్టీ నేతలే తనను బలవంతంగా సాగనంపారంటూ ఆక్రోశించారు. తనను తాను అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసిన బూస్టర్ రాకెట్గా అభివర్ణించుకున్నారు. మున్ముందు కూడా అవసరాన్ని బట్టి తళుక్కుమని మెరుస్తుంటానని చమత్కరించారు. ట్రస్కు పూర్తి మద్దతు ప్రకటించారు. -
Lidia Thorpe: పిడికిలి ఎత్తి.. రాణిగారి పరువు తీసింది!
వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. చాలా దేశాల వలే ఎన్నో ఘోరమైన గాయాలను ఓర్చుకుంది ఆ దేశం. విముక్తి కోసం వేల మంది వీరుల త్యాగాలతో రక్తపుటేరు ప్రవహించింది ఆ గడ్డపై. ఫలితంగా పేరుకు స్వాతంత్రం వచ్చినా.. గణతంత్రంగా మారే అవకాశం ఇంకా దక్కలేదు వాళ్లకు. అందుకే నిరసన గళాన్ని వినిపించేందుకు తన ప్రమాణ కార్యక్రమానికి వేదికగా చేసుకుంది ఆస్ట్రేలియా సెనేటర్ లిడియా థోర్ప్. విక్టోరియా ప్రావిన్స్ నుంచి ఆస్ట్రేలియన్ గ్రీన్స్ పార్టీ తరపున సెనేటర్గా ఎన్నికైంది లిడియా థోర్ప్(48). చట్ట సభకు ఎంపికైన అబ్ఒరిజినల్ ఆస్ట్రేలియన్గానూ ఆమె మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సోమవారం చట్టసభ్యురాలిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంది. వాస్తవానికి గత వారం నూతన సెనేటర్లు అందరూ ప్రమాణం చేయగా.. ఈమె మాత్రం కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. దీంతో సోమవారం ఆమె ఒక్కరితోనే ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ సమయంలో చదవాల్సిన ప్రింటెడ్ కార్డును ముందు ఉంచి లిడియా.. ‘సార్వభౌమాధికారం’ అని కాకుండా.. ‘వలసదారు’ అంటూ క్వీన్ ఎలిజబెత్ 2ను సంభోధించింది. దీంతో సభలో ఉన్న తోటి చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నది మాత్రమే చదవాలని, లేకుంటే ప్రమాణం చెల్లదని ఆమెకు సూచించారు. అయితే ఆమె మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఓ చూపు చూసింది. ఈలోపు లేబర్ పార్టీ సభ్యురాలు, చాంబర్ ప్రెసిడెంట్ సూ లైన్స్ జోక్యం చేసుకుని.. ప్రమాణం మళ్లీ చేయాలని, ప్రింటెడ్ కార్డు మీద ఏం ఉంటే అదే చదవాలని కోరింది. దీంతో ఈసారి అన్యమనస్కంగా, కాస్త వెటకారం ప్రదర్శిస్తూ ప్రమాణం చేసిందామె. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. క్వీన్ ఎలిజబెత్-2ను సెనేటర్ లిడియా థోర్ప్ ఘోరంగా అవమానించిందన్నది పలువురి వాదన. అయితే ఆమె మాత్రం తన చేష్టలను సమర్థించుకుంటోంది. అంతేకాదు మిగతా చట్ట సభ్యులకు లేని దమ్ము ఆమెకు మాత్రమే ఉందంటూ పలువురు పౌరులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. Lidia Thorpe, a Djab Wurrung and Gunnai Gunditjmara senator with Australia's Green Party, called the country's symbolic head of state, Queen Elizabeth II, a colonizer while taking her oath of office pic.twitter.com/phS9lUcsDp— NowThis (@nowthisnews) August 2, 2022 క్వీన్ఎలిజబెత్-2 తమకు సార్వభౌమాధికారం ఎప్పుడూ ఇవ్వలేదని, అందుకే తాను ఆ పదం వాడలేదని స్పష్టం చేసింది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా రాజరికానికి కట్టుబడి ఉండడం ఆస్ట్రేలియా ప్రజలు చేసుకున్న ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని చెప్తోంది ఆమె. ► వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. వేల మంది అబ్ఒరిజినల్(అక్కడి తెగలు) ఆస్ట్రేలియన్లను దారుణంగా హతమార్చారు. చాలావరకు తెగలను వేరే చోటుకు బలవంతంగా వెల్లగొట్టారు. ► 1901లో ఆస్ట్రేలియాకు స్వాతంత్రం ప్రకటించారు. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగుతున్నారు. ► 1999లో రాణి సర్వాధికారాలను తొలగించాలంటూ ఆస్ట్రేలియన్ పౌరులు ఓటేశారు. ఆ సమయంలో తొలగింపు హక్కు చట్ట సభ్యులకు ఉంటుందని, ప్రజలకు ఉండదనే చర్చ నడిచింది. ► ప్రజలంతా తమ దేశం రిపబ్లిక్గానే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, రాజ్యాధినేతను ఎలా ఎన్నుకోవడం అనే విషయంలోనే అసలు సమస్య తలెత్తుతోంది. ► మొన్నటి ఎన్నికల్లో ఆంటోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ‘మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్’గా ఆయన ప్రకటించుకున్నారు. ► అయితే రాజరికపు ఆస్ట్రేలియా.. పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా మారేందుకు మరో రెఫరెండమ్ జరగాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. -
Queen Elizabeth II: మహారాణి రాయల్ డ్యూటీస్ కుదింపు
లండన్: ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ అనుభవించనంత వైభవాన్ని బ్రిటీష్ సామ్రాజ్యపు మహారాణి క్వీన్ ఎలిజబెత్. ఎంతలా అంటే.. బ్రిటన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. రాజకుటుంబ వార్షిక నివేదికలో రాణి రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన విషయాన్ని పేర్కొన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. రాజకుటుంబం తరపున తప్పనిసరిగా ఆమె హాజరు కావాల్సిన కార్యక్రమాలకు ఇక నుంచి ఆమె దూరంగా ఉండనున్నారు. ఎలిజబెత్ రాణి విధులను సర్దుబాటు చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. క్వీన్ ఎలిజబెత్ వయసు 96 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలో ఆమె కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆమె కోసం నిర్వహించిన ప్లాటినం జుబిలీ వేడుకులకు కూడా... వయసు ఇబ్బందుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు. సెయింట్ పాల్ కేథడ్రల్ లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ సర్వీసుకు కూడా ఆమె హాజరు కాలేదు. వయసు పెరిగిన నేపథ్యంలో, రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె విధులను కుదించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి ఈవెంట్ కు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనప్పటికీ... తన హృదయం ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటుందని ఎలిజబెత్ రాణి ఇటీవల తెలిపారు. తన కుటుంబ సహకారంతో తన శక్తి మేరకు మీకు సేవ చేస్తానని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. -
డాక్టర్ పి రఘురామ్కు బ్రిటిష్ ఎంపైర్ ఓబీఈ అవార్డు
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ రెండో అత్యున్నత ర్యాంకింగ్ అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్–2021’ను ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ పి.రఘురామ్ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. లండన్ దగ్గర్లోని విండ్సర్ క్యాసిల్లో జరిగిన వేడుకలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ చార్లెస్ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత్లో రొమ్ము కేన్సర్ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు రఘురామ్ ఈ అవార్డును పొందారు.కిమ్స్ఆస్పత్రిలోని సహో ద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భార తీయ శస్త్ర చికిత్స డాక్టర్లకు ఈ అవార్డును అంకి తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రఘురామ్ అత్యంత చిన్నవయసులో 2015లో పద్మశ్రీని, 2016లో బీసీ రాయ్ నేషనల్ అవార్డును అప్ప టి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. -
బ్రిటన్ లో ప్లాటినం జూబ్లీ వేడుకలు
-
రిపబ్లిక్గా అవతరించిన బార్బడోస్
శాన్జువాన్(పోర్టోరికో): కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్ గణతంత్ర దేశం(రిపబ్లిక్)గా అవతరించింది. వలస పాలన తాలుకూ ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి బ్రిటిష్ రాణి ఎలిజెబెత్–2ని తొలగించింది. దాదాపు 300 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత 1966లో బార్బడోస్కు స్వాతంత్య్రం వచ్చింది. రిపబ్లిక్గా ప్రకటించుకునే దిశగా బార్బడోస్ రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. గత నెలలో దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిని పార్లమెంట్ మూడింట రెండొంతుల మెజారిటీతో ఎన్నుకుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 55 ఏళ్లవుతున్న సందర్భంగా బార్బడోస్ గవర్నర్ జనరల్ సాండ్రా మాసన్(72) మంగళవారం దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. పాలనా విషయాల్లో ఆమె ప్రధానమంత్రి మియా మోట్లేకు సహకరిస్తారు. దేశ రాజధాని బ్రిడ్జిటౌన్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలకు ప్రిన్స్ చార్లెస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. 100 మందికి పైగా కళాకారులతో తీరప్రాంత రాజధాని నగరం బ్రిడ్జిటౌన్లో అంగరంగ వైభవంగా సంగీత కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఎలిజెబెత్–2ను రాణిగా గుర్తించకున్నా కామన్వెల్త్ కూటమిలో బార్బడోస్ కొనసాగనుంది. లండన్లోని ప్రీవీ కౌన్సిల్ బదులు ఇకపై ట్రినిడాడ్ కేంద్రంగా పనిచేసే కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ను అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించనుంది. మూడు లక్షల జనాభా కలిగిన ఈ దేశ ప్రధాన ఆదాయవనరు పర్యాటక రంగం. సుమారు 3 లక్షల జనాభా ఉన్న బార్బడోస్లో అత్యధికులు బ్రిటిష్ పాలకులు చెరకు తోటల్లో పనిచేసేందుకు బానిసలుగా తీసుకువచ్చిన ఆఫ్రికా సంతతి వారే. కరీబియన్ దీవుల్లో భాగమైన గుయానా, డొమినికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో 1970లలోనే రిపబ్లిక్లుగా మారినా బార్బడోస్ మాత్రం ఆ హోదా తాజాగా పొందింది. -
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఫోన్ ఎవరిదంటే..
Queen Elizabeth II Uses Phone And Facebook: ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సమస్య ‘స్మార్ట్ఫోన్ డాటా థ్రెట్’. ఫోన్ ఎంతటి అప్డేట్ వెర్షన్ అయినప్పటికీ.. డాటాను చోరీ చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు హ్యాకర్లు. ఈ క్రమంలో బిలియనీర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా తమ చేత వాటం ప్రదర్శిస్తున్నారు. అయితే.. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మాత్రం ఈ విషయంలో మినహాయింపు కలిగి ఉన్నారట! ఈ భూమ్మీద అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్ను క్వీన్ ఎలిజబెత్ II వాడుతున్నారట!. బకింగ్హమ్ ప్యాలెస్లో క్వీన్ ఛాంబర్లో ఇప్పటికీ సంప్రదాయ ల్యాండ్ లైన్ ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ దేశాల నేతలు ఫోన్ చేసినా ఆమె ఆ ఫోన్తో మాత్రమే మాట్లాడతారు. అలాంటిది రాజవంశంలో మొట్టమొదటిసారి పాలించే ఓ వ్యక్తి.. వ్యక్తిగతంగా ఫోన్ ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. న్యూస్ ఏజెన్సీ స్ఫుతినిక్ ప్రకారం.. క్వీన్ ఎలిజబెత్ II ఉపయోగించే మొబైల్ హైసెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉందట. బ్రిటిష్ నిఘా విభాగం ఎం16 రూపొందించిన ఈ వ్యవస్థ హ్యాకర్లకు చిక్కదని, పైగా ఆ ఫోన్లో ఫేస్బుక్ సైతం ఆమె ఉపయోగిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది. ఇక ఫేస్బుక్ మెసేజ్లు ఇంకా ఎన్క్రిప్షన్కు(సెండర్- రీడర్ మాత్రమే చూడగలిగే సెక్యూరిటీ) నోచుకోని విషయం తెలిసిందే. యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లపైనే పట్టొచ్చని ఫేస్బుక్ ప్రకటించుకుంది కూడా. కానీ, ఎలిజబెత్ రాణి వాడుతున్న ఫోన్లో మాత్రం ఎం16 రూపొందించిన యాంటీ హ్యాకర్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉందని, అందువల్ల ఆ ఫోన్లో ఉండే ఫేస్బుక్ మాత్రమే కాదు.. ఫోన్లోని ఇతర డాటా మొత్తం చాలా భద్రంగా ఉంటుందని యూకేపాడ్కాస్ట్ ఓ కథనంలో వెల్లడించింది. ఇంతకీ ఫోన్ కంపెనీ ఏంటంటే.. శాంసంగ్. కెమెరాతో కూడిన ఈ అల్ట్రా స్లిమ్ ఫోన్ను ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్గా పేర్కొంటున్నారు. ఈ ఫోన్ను చూసుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు మనుషులు ఉన్నారట! వాళ్లు ఎప్పుడూ ఆ ఫోన్ ఛార్జ్ డౌన్ కాకుండా చూసుకుంటారట. అంతేకాదు ఆ ఫోన్లో ఆమె ఇద్దరితో ఎక్కువగా ఛాటింగ్ చేస్తోందని(ప్రైవసీ వల్ల వివరాలు వెల్లడించలేదు), ఆమె స్పందించనప్పుడు ఆమె ఫోన్ను హ్యాండిల్ చేసే వీలు ఇద్దరికి మాత్రమే ఉందని(ఒకరు ఆమె కూతురు యువరాణి అన్నె, రాణి మేనేజర్ జాన్ వారెన్) స్పుత్నిక్ సారాంశం. సీక్రెట్ ఫేస్బుక్ అకౌంట్ అమెరికా మెటా (ఒకప్పుడు ఫేస్బుక్) అందించే ఫేస్బుక్ మీద యూకేలో వ్యతిరేకత ఉంటుందన్నది తెలిసిందే. కానీ, బ్రిటన్ రాణి ఫోన్లో ఒక రహస్య ఫేస్బుక్ అకౌంట్ ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇందులో ఆమె ఎక్కువగా వీడియోస్ చూస్తూ సమయం గడుపుతున్నారట. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్.. అదీ 95 ఏళ్ల బ్రిటన్ మహరాణి వాడుతున్నారనే స్టింగ్ ఆపరేషన్ కథనాలు టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇప్పుడు. కరోనా పరిస్థితుల తర్వాత వీడియో కాల్స్ ఉద్దేశంతో ఆమె ఈ ఫోన్ను వాడుతున్నారని తెలుస్తోంది. -
బ్రిటన్ రాణి తొలిసారి అలా కనిపించడంతో.. షాక్లో ప్రజలు
లండన్: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2కు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే ఆసక్తి యూకే ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరికి ఉంటుంది. మరి ఆమే ఏం పడుచు పిల్ల కూడా కాదు. బ్రిటన్ రాణి వయసు ప్రస్తుతం 95 సంవత్సరాలు. ఈ ఏజ్లోనూ రాణివారు ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంటారు. బహుశా ఈ విషయమే ప్రజలకు ఆసక్తి రేకెత్తిస్తుంటుంది. చదవండి: బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...! సాధారణంగా ఇప్పటివరకు ఎలిజబెత్ రాణి బయట ఎక్కడ కనిపించినా ఎవరి సాయం లేకుండా స్వతహాగా నడుస్తూ ఉంటారు. అయితే తొలిసారి ఎలిజబెత్ తన చేతిలో కర్ర పట్టుకొని బయటకు వచ్చారు. మంగళవారం లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో చర్చిలో సమావేశానికి హాజరైన ఎలిజబెత్ కర్ర సాయంతో నడుస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కారు.ఘీ 95 ఏళ్ల చక్రవర్తి ఆమె కుమార్తె ప్రిన్సెస్ అన్నేతో కలిసి నల్ల కర్ర పట్టుకుని కారు నుంచి బయటకు దిగారు. చదవండి: ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి. అయితే బ్రటిన్ రాణి కర్ర పట్టుకొని నడవడం చాలా అరుదు కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2004లో మోకాలి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చివరిసారిగా ఆమె కర్రను పట్టుకొని కనిపించారు. అయితే ప్రస్తుతం ఎలిజబెత్ ఇలా ఎందుకు కర్రను ఉపయోగించాల్సి వచ్చిందో ఆమె కార్యాలయం కారణం వెల్లడించలేదు. -
‘ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను మరో 90 ఏళ్లు తెరవకూడదు’
లండన్: బ్రిటీష్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు చెందిన వీలునామాను మరో 90 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాలంటూ గురువారం లండన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్వీన్ ఎలిజబెత్ హుందాతనానికి సూచకంగా ఆ వీలునామాను తెరవరాదు అని హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో 99 ఏళ్ల వయసులో ప్రిన్స్ ఫిలిప్ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాచరిక కుటుంబంలో ఎవరైనా సీనియర్ సభ్యులు మరణిస్తే, వారికి చెందిన వీలునామాపై హైకోర్టులో ఉన్న ఫ్యామిలీ డివిజన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని శతాబ్ధాల నుంచి ఈ ఆచారం కొనసాగుతున్నది. (చదవండి: ప్రిన్స్ ఫిలిప్ బర్త్డేకి మామిడి పండ్లు) ప్రస్తుతం ఫ్యామిలీ డివిజన్ కోర్టు అధ్యక్షుడిగా ఉన్న సర్ ఆండ్రూ మెక్ ఫార్లేన్ .. ప్రిన్స్ ఫిలిప్ వీలునామాపై తీర్పును ప్రకటించారు. ఫిలిప్ వీలునామాను సీలు చేసి, 90 ఏళ్లు తర్వాత దాన్ని తెరవాలంటూ మెక్ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. అంతేకాక కోర్టు ఫైల్లో ఉంచే నిమిత్తం వీలునామా కాపీని కూడా తీయడానికి వీలులేదని తెలిపారు. ఇక ప్రిన్స్ ఫిలిప్ తన వీలునామాలో ఏం రాశారో ఎవరికీ తెలియదని జడ్జి తెలిపారు. చదవండి: బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...! -
బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...!
లండన్: బ్రిటన్లో రాజ వంశంపై ప్రజలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. రాజవంశానికి సంబంధించిన ఏవార్తైనా ప్రజల్లో ఆసక్తి రేకిత్తిస్తుంది. అలాంటిది ఏకంగా మహారాణి మరణానికి సంబంధించిన వార్తైతే దానికి ఉండే ప్రాముఖ్యమే వేరు! రాణిగారి అంతిమశ్వాస నుంచి అధికారికంగా సమాధి చేసేవరకు ఒకపెద్ద మహాయజ్ఞంలాగా నిర్వహిస్తారు. మహారాణి క్వీన్ ఎలిజబెత్–2 మరణించిన అనంతరం తీసుకొనే చర్యల వివరాలు శుక్రవారం లీకయ్యాయి. రాణి మరణించిన వెంటనే ఆరంభమయ్యే ఈ కార్యకలాపాలను ‘‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్’’గా పిలుస్తారని పొలిటికో వార్తా సంస్థ వెల్లడించింది. రాణి మరణించిన రోజును అధికారికంగా ‘డీ డే’గా పిలుస్తారని, ఆమె మరణించిన రోజును జాతి సంతాపదినంగా ప్రధాని ప్రకటిస్తారని, సెలవు కూడా ఇస్తారని తెలిపింది. (చదవండి: మాయ‘లేడి’: చాటింగ్తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్) రికార్డు పాలన బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న రాణిగా ఎలిజబెత్2 రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమెకు 95 సంవత్సరాల వయసు. ఆమె తుది శ్వాస విడిచిన అనంతరం పదిరోజుల పాటు పారి్థవ కాయాన్ని అలాగే ఉంచుతారు. ఈ పదిరోజులు ఆమె వారసుడు ప్రిన్స్ ఛార్లెస్ బ్రిటన్ మొత్తం పర్యటించి రాణి మరణ వార్తను పౌరులకు వెల్లడిస్తారు. అనంతరం ఆమెను సమాధి చేసే కార్యక్రమం షురూ అవుతుంది. మరణానంతరం ఆమె భౌతిక కాయాన్ని మూడు రోజుల పాటు హౌస్ ఆఫ్ పార్లమెంట్లో సందర్శకుల కోసం ఉంచుతారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు లండన్కు వస్తారని, దీంతో ట్రాఫిక్ జామ్లు, ఆహార కరువు ఏర్పడతాయన్న అంచనాలు లీకైన పత్రాల్లో ఉన్నాయి. సందర్శనార్ధం వచ్చేవారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ ఏర్పాట్లను సైతం ఇందులో పొందుపరిచారు. ఈ లీకు పత్రాలపై స్పందించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి. (చదవండి: TSRTC-Sajjanar: ఆర్టీసీ ఉద్యోగులకు 1నే జీతాలు!) -
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
-
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ 99 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నూరవ పుట్టిన రోజు వేడుకని మరో రెండు నెలల్లో చేసుకోవాల్సిన డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ రాణితో 73 ఏళ్ల సహచర్యాన్ని వీడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రాణి తరఫున బంకింగ్çహామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘విండ్సర్ కేజల్లో శుక్రవారం ఉదయం డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ ప్రశాంతంగా కన్ను మూశారు. బాధాతప్తమైన హృదయంతో రాణి తన భర్త మరణవార్తని ప్రపంచానికి వెల్లడించారు’’అని ఆ ప్రకటన పేర్కొంది. జూన్ 10న ఫిలిప్ శతవసంత వేడుకల్ని వైభవంగా నిర్వహించడానికి రాజకుటుంబం ఏర్పాట్లు చేస్తూ ఉన్న సమయంలో ఆయన మరణ వార్త వినడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇటీవల ఆయన గుండెకు శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిలిప్ మరణవార్త తెలుసుకోగానే ప్రపంచం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఎంతో మంది యువత జీవితాల్లో ఆయన స్ఫూర్తిని నింపారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని తరాల వారి ప్రేమాభిమానాలను ఆయన చూరగొన్నారని కొనియాడారు. ప్రిన్స్ మరణవార్త విని విండ్సర్ కేజల్కి జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గేటు బయటే పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్నారు. ఫిలిప్, ఎలిజెబెత్ దంపతులకు ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ నలుగురు పిల్లలు. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు, 10 మంది మునిమనవలు ఉన్నారు. మోదీ సంతాపం ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మిలటరీలో అద్భుతమైన కెరీర్తో పాటు, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. భారత్ పర్యటన వివాదాస్పదం రాణి ఎలిజెబెత్తో కలిసి ఫిలిప్ మూడుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 1961, 1983, 1997లో ఆయన భారత్ని సందర్శించారు. 1961లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఫిలిప్ పులిని వేటాడడం వివాదాస్పదమైంది. జైపూర్ రాజ దంపతులతో కలిసి రాణి ఎలిజెబెత్, ఫిలిప్ వారి దగ్గర చనిపోయి పడి ఉన్న పులి ఫోటో అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. పర్యావరణ, జంతు ప్రేమికుడిగా అప్పటికే ఆయనకు ఒక గుర్తింపు ఉంది. వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ యూకే అధ్యక్షుడిగా ఆయన ఆ ఏడాది నియమితులు కావడంతో పులిని కాల్చడం వివాదాన్ని రేపింది. అయితే ఆ తర్వాత ఆయన పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు. రాణికి కొండంత అండ గ్రీకు వంశంలో పుట్టిన ఫిలిప్.. యువరాణి ఎలిజెబెత్ను పెళ్లాడడానికి తన రాచరిక హోదాలన్నీ వదులకున్నారు. ఆమె బ్రిటన్ సింహాసనం ఎక్కాక నీడలా వెన్నంటే ఉంటూ పాలనలో పూర్తిగా సహకరించారు. బ్రిటన్లో రాజ్యాంగబద్ధమైన హోదా ఏమీ లేకపోయినా రాణి పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో రాణి వెనకాలే అడుగులో అడుగులు వేసుకుంటూ నడిచినప్పటికీ బ్రిటన్ రాచకుటుంబంలో ప్రతీ చోటా ఆయన ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. రాజకుటుంబంలో ఆయన మాటే శాసనంగా మారింది. అందుకే రాణి ఎలిజెబెత్ తమ 50వ వివాహ వేడుకల్లో ‘‘నా భర్తే నాకు కొండంత బలం’’అంటూ తన ప్రేమని బహిరంగంగానే చాటుకున్నారు. భార్య చాటు భర్తలా మిగిలిపోకూడదని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి సామాజిక సేవలోనే ఎక్కువ భాగం గడిపారు. ఎన్నో చారిటీలను నడిపారు. యువతరం బాగుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుందని నమ్మిన ఫిలిప్ వారిని అన్ని విధాలుగా సంస్కరించాలని చూసేవారు. రాజకుటుంబంలో బూజుపట్టిన సంప్రదాయాల్ని విడనాడి ఆధునీకరణ విధానాలను ప్రవేశపెట్టాలని చూశారు కానీ అవి కుదరలేదు. ప్రిన్స్ ఫిలిప్ గొప్ప సాహసి. బ్రిటన్ నేవీ కమాండర్గా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ నౌకలో సేవలందించారు. ఫిలిప్ది ముక్కు సూటి మనస్తత్వం. మనసులో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు. ఆ మనస్తత్వమే ఆయనను చాలా సార్లు ఇబ్బందుల్లో పడేసింది. గ్రీకు వీరుడు, ఎలిజెబెత్ రాకుమారుడు ► జూన్ 10,1921: గ్రీకు రాజ కుటుంబంలో జననం ► 1939: బ్రిటిష్ రాయల్ నేవీలో కమాండర్గా ఉద్యోగం ► 1942: మొదటి లెఫ్ట్నెంట్గా అపాయింట్మెంట్ ► 1947: యువరాణి ఎలిజెబెత్ను పెళ్లాడడం కోసం గ్రీక్ డానిష్ రాయల్ టైటిల్స్ని వదులుకున్నారు ► నవంబర్ 20, 1947: ఎలిజెబెత్తో వివాహం ► 1951: నేవీ కెరీర్ను వదులుకొని ఎలిజెబెత్కు అండదండలు ► 2017: ప్రజా జీవితం నుంచి పదవీ విరమణ ► 2019: కారు ప్రమాదానికి లోనుకావడంతో డ్రైవింగ్ను వదిలేశారు, ఇదే ఏడాది ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ► ఫిబ్రవరి 17 2021: ఆస్పత్రిలో చేరిక ► మార్చి 4 2021 : గుండెకు విజయవంతంగా చికిత్స ► మార్చి 16 2021 : ఆస్పత్రి నుంచి ప్యాలెస్కి ► ఏప్రిల్ 9: ప్రశాంతంగా తుది శ్వాస -
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూశారు. ఈ మేరకు బకింగ్ హ్యామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. విండ్సర్ కాజిల్ లో శుక్రవారం ఫిలిప్ తుదిశ్వాస విడిచారని తెలిపింది. ఈ విషయాన్ని గురించి రాయల్ ఫ్యామిలీలోని ఇతర సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేయాలని ప్రకటించింది. కాగా ప్రిన్స్ ఫిలిప్ 1921, జూన్ 10న కార్ఫు ద్వీపంలో జన్మించారు. 1947 లో యువరాణి ఎలిజబెత్ను వివాహం చేసుకున్నారు. ప్రిన్స్ ఫిలిప్,రాణి దంపతులకు నలుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవరాళ్ళు 10 మంది మునిమనవళ్లు ఉన్నారు. -
‘అక్షత మూర్తి.. క్వీన్ ఎలిజబెత్ కన్నా రిచ్’
లండన్: ఇటీవల బ్రిటన్ ఆర్థికమంత్రిగా నియమితులైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ (39) ఆర్థిక వ్యవహారల పారదర్శకతపై పలు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. గార్డియన్ ప్రకారం రిషి సునక్ భార్య, అతడి కుటుంబ సభ్యులు పలు కంపెనీల్లో మల్టీమిలియన్ పౌండ్ల విలువజేసే షేర్హోల్డింగ్స్, డైరెక్టర్షిప్స్ కలిగి ఉన్నారని.. కానీ వాటి గురించి ఆయన అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. ఇక గార్డియన్ ప్రచురించిన మరో ప్రత్యేక కథనం ప్రకారం రిషి సునక్ భార్య అక్షత మూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. ఆ కంపెనీలో అక్షత పేరు మీద 430 మిలియన్ పౌండ్లు విలువ చేసే షేర్లు ఉన్నాయి. దీని ప్రకారం చూసుకుంటే.. ఆమె బ్రిటన్లో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలుస్తారు. ఆమె క్వీన్ ఎలిజబెత్ కన్నా ధనవంతురాలిగా ఉండనున్నట్లు గార్డియన్ తెలిపింది. ( నాకలాంటి కోరికేదీ లేదు : రిషి సునక్ ) ఇక బ్రిటన్ మంత్రివర్గ నియమావళి ప్రకారం సునక్ తనకు సంబంధించిన ఆర్థిక విషయాలను ప్రజలకు వెల్లడించడం అతడి బాధ్యత. మినిస్టీరియల్ రిజిస్టర్ ప్రకారం మంత్రులు తమ కుటుంబం ఆధీనంలో ఉన్న ఆస్తుల గురించి అంటే తోబుట్టువులు, తల్లిదండ్రులు, భార్య, అత్యమామల పేర్ల మీద ఉన్న ఆస్తుల గురించి వెల్లడించడం తప్పనిసరి. అయితే సునక్ మాత్రం అతడి భార్య మినహా ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులను వెల్లడించలేదు. అంతేకాక తాను ఓ చిన్న యూకే ఆధారిత వెంచరల్ క్యాపిటల్ కంపెనీకి యాజమానిగా మాత్రమే ప్రకటించుకున్నారు. దాంతో ప్రస్తుతం రిషి సునక్ ఆర్థిక వ్యవహారాల గురించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. -
కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను
లండన్: అమ్మవ్వడంలో ఉండే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిస్తేనే తమ జీవితానికి ఓ అర్థం అని భావించే ఆడవారు కొకొల్లలు. బిడ్డను కనడం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. అలానే కడుపులోని ప్రాణి బయటకు రాకముందే కన్నుమూస్తే.. ఆ బాధ వర్ణణాతీతం. అనుభవించడం తప్ప మాటల్లో చెప్పడం కష్టం. ఈ క్రమంలో డచెస్ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సంచలన విషయాలు వెల్లడించారు. రెండవ సారి గర్భవతి అయ్యాక తనకు అబార్షన్ అయ్యిందని.. పుట్టకముందే ఓ బిడ్డను పొగొట్టుకున్నానని తెలిపారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో మాట్లాడటం ఇదే ప్రథమం. దాంతో ప్రస్తుతం మేఘన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. (చదవండి: ‘ప్రపంచం మొత్తం మీద నా మీదే ఎక్కువ ట్రోలింగ్’) మేఘన్ మార్కెల్ న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లడించారు. విషాదం గురించి మాట్లాడుతూ.. ‘మొదటి బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించాను రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపు బాధపడ్డాను. బిడ్డను కొల్పోవడం అంటే భరించలేని బాధను మోయడం. ఎందరో అనుభవిస్తారు.. కొందరు మాత్రమే బయటకు వెల్లడిస్తారు. గుండెని పిండే ఈ వార్త నాకు తెలిసినప్పడు నేను ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాను.. నా భర్త నా పక్కనే ఉన్నాడు. కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను. ఆ తర్వాత నేను, నా భర్త నాలానే అబార్షన్ అయ్యి బిడ్డను కోల్పోయిన కొందరిని కలుసుకున్నాము. బాధలో తేడా లేదు. కానీ వీరిలో కొందరు తమకు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడ్డారు. ఒంటరిగా బాధను భరించారు’ అని తెలిపారు. ఇక ఈ ఆర్టికల్లో మేఘన్ అనేక సన్నిహిత వివరాలను వెల్లడించారు. మేఘన్, హ్యారీ దంపతులకు కుమారుడు ఆర్చీ ఉన్నారు. (చదవండి: అభద్రతకు గురైన మేఘన్ మార్కెల్) బ్రిటీష్ రాజకుటుంబంలోని సీనియర్ సభ్యుల వ్యవహార శైలికి భిన్నంగా మేఘన్ వ్యక్తిగత వివరాలు తెలిపారు. ఇక 68 ఏళ్ల పాలనాకాలంలో క్వీన్ ఎలిజబెత్ ఎన్నడు ఏ మీడియా సమావేశంలో కూడా తన వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయలేదు. ఇక హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియం, అతడి భార్య కేట్ ఇప్పటి వరకు ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ప్రతిసారీ పుట్టిన బిడ్డతో కలిసి దంపతులు మీడియాకు ఫోజులిచ్చేవారు. విలియం-కేట్ దంపతులు కూడా తమ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. -
నిరాడంబరంగా బ్రిటన్ ప్రిన్సెస్ వివాహం
లండన్ : ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్ బీట్రెస్(31) వివాహం శుక్రవారం ఓ వ్యాపారవేత్తతో జరిగింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మనవరాలు అయిన బ్రీట్రెస్ ఇటలీకి చెందిన మాపెల్లి మొజ్జిని(37) పెళ్లి చేసుకున్నారు. కరోనా వైరస్ కరాణంగా వీరి వివాహం నిరాడంబరంగా జరిగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధృవీకరించాయి. ('క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై దిగులుగా ఉంది') అయితే ప్రిన్సెస్ బ్రీట్రెస్, మాపెల్లిల పెళ్లి మొదటగా మే 29న లండన్లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీరి వివాహం వాయిదా పడింది. అనంతరం జూలై 17న శుక్రవారం ఉదయం 11 గంటలకు విండ్సర్లోని రాయల్ లాడ్జ్లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద వీరి వివాహం జరిగినట్లు రాజ కుటుంబం ఓ ప్రకటలో తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.(ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే) -
రాజకుటుంబ వీరాభిమాని ‘కోహినూర్’ మృతి
ముంబై: బ్రిటన్ రాజవంశానికి వీరాభిమాని, బ్రిటానియా&కో రెస్టారెంట్ ఓనర్ అయిన బోమన్ కోహినూర్(93) బుధవారం మృతి చెందాడు. గుండెపోటుతో నిన్న సాయంత్రం 4.45గంటలకు కన్ను మూసినట్లు పార్సీ జనరల్ ఆస్పత్రి అధికారి తెలిపారు. బ్రిటానియా రెస్టారెంట్ ఓనర్గా కొద్ది మందికి మాత్రమే తెలిసిన బోమన్ కోహినూర్.. 2016లో ఆకస్మాత్తుగా దేశం అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో ఇండియా-భూటాన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ప్రిన్స్ విలియమ్స్ దంపతులు ప్రత్యేకంగా ముంబై వెళ్లి బోమన్ని కలుసుకున్నారు. ఈ సంఘటనతో బోమన్కు ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. బోమన్ కోహినూర్ తండ్రి 1923లో ముంబైలో బ్రిటానియా&కో రెస్టారెంట్ను ప్రారంభించాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కోహినూర్ జీవితం ఆ రెస్టారెంట్కు అంకితమయ్యింది. చిన్ననాటి నుంచి కోహినూర్ బ్రిటన్ రాజవంశం పట్ల వల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నాడు. ఎంతలా అంటే బోమన్ రెస్టారెంట్లోకి అడుగుపెట్టిన వారికి ముందుగా క్వీన్ ఎలిజబెత్ II, మహాత్మగాంధీ నిలువెత్తు ఫోటోలు దర్శనమిస్తాయి. అంతేకాక కోహినూర్ ప్రతి ఏడాది క్వీన్ ఎలిజబెత్ IIకు ప్రత్యేక సందర్భాల్లో ఉత్తరాలు రాస్తుంటాడు. రాజ ప్రసాదం నుంచి క్వీన్ ప్రతినిధులు ఆమె తరఫున ప్రత్యుత్తరం కూడా పంపుతారు. కోహినూర్కు రాజ కుటుంబం అంటే ఎంత అభిమానం అంటే.. తన మనవరాలికి ఏకంగా ప్రిన్స్ విలియమ్స్ తల్లి డయానా పేరు పెట్టాడు. కోహినూర్ మరణం పట్ల నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రియమైన బొంబాయి వాసి ఇక లేరని తెలిసి బాధగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. -
బ్రిటన్ చేరుకున్న ట్రంప్
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా సోమవారం లండన్ చేరుకున్నారు. బకింగ్హామ్ ప్యాలెస్లో బ్రిటన్ రాణి ఎలిజబెత్–2ను ఆయన సతీసమేతంగా కలుసుకున్నారు.అనంతరం ప్రిన్స్ చార్లెస్ను కూడా ట్రంప్ కలిశారు. త్వరలో పదవి నుంచి దిగిపోబోతున్న బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యి, చైనా సంస్థ హువావే వివాదం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా, తన పాత శత్రువు, లండన్ మేయర్ సాదిక్ ఖాన్పై ట్రంప్ లండన్లో దిగగానే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. -
బయటికొచ్చిన ఫొటో!
అరుదైన ఫొటోలు ఎవరికి దగ్గర ఉంటాయి? బహుశా అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర. క్వీన్ ఎలిజబెత్ఐఐ ‘రాజమాత’ అయితే అవనీయండి. మొదట మాత్రం ఆమె గ్రాండ్మదర్. ఆవిడ గది నిండా అరుదైన ఫొటోలే. మనవళ్ల చిన్నప్పటివీ, మనవళ్లు పెద్దయ్యాక తీసినవి.. ఇప్పటికింకా తీస్తూనే ఉన్నవీ! గది గోడలపైన, టేబుల్ మీద.. నిద్ర లేవగానే.. (‘నానమ్మా’ అంటూ వాళ్లొచ్చి గుడ్మాణింగ్ చెప్పేలోపే..) వాళ్లను కళ్లారా చూసుకుని ఉల్లాసంగా కళ్లు నులుముకునేందుకు క్వీన్ ఎలిజబెత్ ముచ్చటగా ఎంపిక చేసుకుని పెట్టుకున్న ఫొటోలు అవి. అవన్నీ మీడియాకు రావు. బ్రిటన్లో అంతపెద్ద మీడియా ఉంటుంది కదా, అయినా కూడా రావు. క్వీన్ ఎలిజబెత్ పర్సనల్ కలెక్షన్ అవి. రాజమాతకు చిన్న మనవడు ప్రిన్స్ హ్యారీ అంటే ఇష్టం. ప్రతి సందర్భంలోనూ ఆ సంగతి బయటపడుతూనే ఉంటుంది. హ్యారీ నవ్వు ముఖంలో అతడి తల్లి డయానా స్వర్గకాంతిలా ప్రతిఫలిస్తూ అత్తగారిని పలకరిస్తూ ఉంటుందేమో! అలాగని పెద్ద మనవడంటే ఇష్టం లేకుండా ఉంటుందా? చిన్నవాళ్లకు ప్రతి ఇల్లూ కట్టే ‘పట్టమే’ ఇది. రాజమాత కూడా చిన్న మనవడిపై తమ మురిపాన్ని ఫొటో రూపంలో ఫ్రేమ్ కట్టించి, ఆ ఫ్రేమ్ని టేబుల్ ల్యాంప్కు ఆన్చి, ఎదురుగా పెట్టుకున్నారు. అందులో హ్యారీ ఒక్కడే లేడు. పక్కనే అతడి భార్య మేఘన్ మార్కెల్ ఉన్నారు! లేత నీలం రంగు డ్రెస్లో ఉన్న మేఘన్, నీలం రంగు సూట్లో ఉన్న హ్యారీని అతడి ఛాతీ మీద చేయి వేసి బాగా దగ్గరగా అనుకుని నిలుచున్నారు. మీడియాలో ఎక్కడా కనిపించని ఫొటో అది! ఆ ఫొటోను ఎక్కడ తీశారో తలియడం లేదు కానీ, బహుశా అది ఎంగేజ్మెంట్ టైమ్లోనిది కావచ్చని బ్రిటన్ నుంచి వెలువడే ‘హెల్లో’ మ్యాగజీన్ అంచనా వేస్తోంది. అయినా లోకం చూడని ఈ ఫొటో ఎలా బయటికి వచ్చింది? ఎలాగంటే.. ఆ పత్రిక నిండా డేగకళ్ల రిపోర్టర్లే! బుధవారంనాడు రాజమాతతో మాట్లాడేందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ జార్జి బ్రాండిస్ ఆమె అధికార నివాసానికి వెళ్లినప్పుడు ఆయనతో పాటు లోపలికి వెళ్లిన ఫొటోగ్రాఫర్ వాళ్లిద్దరినీ ఫొటో తీసే సందర్భాన్ని వాళ్లిద్దరి మధ్యలోంచి గదిలో టేబుల్ మీద కనిపిస్తున్న హ్యారీ, మేఘన్ల ఫొటోను ఫొటో తీసే అవకాశంగా మలుచుకున్నాడు. అదిప్పుడు నెవర్– బిఫోర్–సీన్ ఫొటోగా లోకమంతా రౌండ్లు కొడుతోంది. -
రాణీగారు... మీ సొంతసొమ్ము ఉంది కదా!
బకింగ్హామ్ ప్యాలెస్ మరమ్మతుల కోసం ప్రజల సొమ్ము వాడొద్దు లండన్: ‘ప్రజల సొమ్ముతో కాకుండా మీ సొంత డబ్బుతో రాజభవనానికి మరమ్మతులు చేయించుకోండి’ ఇది బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2కు ఆన్లైన్లో వెల్లువెత్తుతున్న విన్నపం. క్వీన్ ఎలిజబెత్ నివసించే బకింగ్హామ్ ప్యాలెస్ను నవీకరించడానికి 370 మిలియన్ పౌండ్లు (రూ. 3109 కోట్లు) ఖర్చు అవ్వనున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో ఈ ప్యాలెస్ నవీకరణకు అయ్యే ఖర్చును రాణీ సొంత ఆస్తుల నుంచి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తూ 38డిగ్రీస్ క్యాంపెయిన్ వెబ్సైట్లో ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్కు మద్దతుగా ఇప్పటికే 88వేలకు పైగా సంతకాలు లభించాయి. ఇంకా సంతకాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఈ చారిత్రక భవనం కోసం పన్నుంచెల్లింపుదారుల సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేయడకూడదని ఈ పిటిషన్ కోరింది. రాణికి వ్యక్తిగతంగా 340 మిలియన్ పౌండ్ల సంపద ఉందని, అంతేకాకుండా సండ్రింగ్హామ్ హౌస్, బాల్మోరల్ కాజల్ ఉన్నాయని, కాబట్టి ఈ ఖర్చును ఆమెనే భరించాలని పిటిషన్ కోరింది. ‘ దేశంలో గృహ సంక్షోభం నెలకొని ఉంది. ప్రభుత్వ పొదుపుచర్యల కారణంగా ఎన్నో సంక్షేమ సేవలు ఆగిపోయాయి. ఇప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్ మరమ్మతుల కోసం ప్రజలు మరింత కష్టాలు పడాలని రాజకుటుంబం కోరుతోంది. రాణికి అపారమైన సంపద ఉంది. అయినా ఇలా చేయడం గర్హనీయం’ అని యూకే చాన్స్లర్ను ఉద్దేశించి పిటిషన్లో పేర్కొన్నారు. -
మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు
లండన్ : బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్వీన్ ఎలిజబెత్ అతిథి సత్కారం ఇచ్చారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోదీ గౌరవార్థం శుక్రవారం బకింగ్ హ్యామ్ ప్యాలెస్లో క్వీన్ ఎలిజబెత్..ఆయనకు విందు ఇచ్చారు. అనంతరం వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు సుమారు 60 వేల మందిపైగా ఎన్నారైలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు చేరుకున్నారు. అనంతరం మోదీ బ్రిటన్ ప్రధాని కామెరూన్ తో భేటీ అవుతారు. ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా మోదీ ఉత్తర లండన్ లో అంబేద్కర్ మెమోరియల్ ను, 12వ శతాబ్దపు తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. -
మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు
లండన్: క్వీన్ ఎలిజబెత్ తో విందు, వెంబ్లే స్టేడియంలో ప్రసంగం, బ్రిటీష్ పాలకులతో భేటీలు... ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన షెడ్యూల్. భారత ప్రధాని హోదాలో వచ్చే నెల తొలిసారి బ్రిటన్ పర్యటనకు మోదీ వెళుతున్నారు. నవంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో ఆయన పర్యటిస్తారు. మోదీతో కలిసి ప్రధాన కార్యక్రమాలన్నిట్లోనూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పాల్గొననున్నారు. నరేంద్ర మోదీ గౌరవార్థం నవంబర్ 13న బకింగ్ హ్యామ్ ప్యాలెస్ లో క్వీన్ ఎలిజబెత్ విందు ఇవ్వనున్నారు. వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు 60 వేల మందిపైగా ఎన్నారైలు హాజరువుతారని భావిస్తున్నారు. తర్వాత కామెరూన్ తో భేటీ అవుతారు. సమయం ఉంటే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. నవంబర్ 14న ఉత్తర లండన్ లో అంబేద్కర్ మెమోరియల్ ను, 12వ శతాబ్దపు తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. -
మన ఇంజినీర్ అమ్మాయికి రాణి ఆహ్వానం
లండన్: భారతీయ సంతతి యువ ఇంజినీర్ యువతికి ఊహించని ఆహ్వానం అందింది. తన ప్యాలెస్ కు ఓసారి వచ్చి పోవాలంటూ ఏకంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 రోమా అగర్వాల్(29) కు ఆహ్వానం పలికింది. లండన్ లోని షార్ద్ అనే ప్రాంతంలో యూరప్ లోనే అత్యంత ఎత్తయిన భవన నిర్మాణంలో ఇంజినీర్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా వారికోసం ఏర్పాటుచేసిన విందు కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఎలిజబెత్ ప్రత్యేక ఆహ్వానం పలికారు. దీంతో ఆమె తన సహచర ఇంజినీర్లతో కలిసి అత్యంత విలాసవంతమైన బ్రిటన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా ఎంఎస్ అగర్వాల్ స్పందిస్తూ మహిళా ఇంజినీర్లపై ఎంతో కాలంగా ఉన్న ఛాందసమైన ఆలోచన తప్పని, యువతులు దీనిని ఆహ్లాదభరితంగా తీసుకొని కెరీర్ మలుచుకొని ఇంజినీర్లుగా రాణించాలని సూచించారు. -
రాణిగారి రేసుగుర్రం శరీరంలో నిషేధిత డ్రగ్స్
లండన్: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 పెంపుడు గుర్రం శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్టు వైద్య పరీక్షలో వెల్లడైంది. దీని శరీరంలో నిషేధిత మార్ఫిన్ ఉన్నట్టు పరీక్ష ద్వారా నిర్థాణయిందని బకింగ్హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కలుషిత ఆహారం ద్వారా నిషేధిత పదార్థం దాని శరంలోకి ప్రవేశించివుండొచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని బ్రిటీష్ హార్స్ రేసింగ్ అథారిటీకి రాణి ఎలిజబెత్ తెలిపారని గార్డియన్ పత్రిక వెల్లడించింది. మారీ పేరుతో పిలుచుకునే ఈ గుర్రం వయసు ఐదేళ్లు. ఈ గుర్రం గేడాది ప్రతిష్టాత్మక గోల్డ్ కప్ గెల్చింది. మైఖేల్ స్టౌట్ దీనికి శిక్షణనిస్తున్నారు. రాణి ఎలిజబెత్ 2 దగ్గరవున్న ఐదు పెంపుడు గుర్రాల్లో ఇది ఒకటి. అయితే గుర్రం శరీరంలోని నిషేధిత పదార్థం ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని రాజకుటుంబం తెలిపింది. -
బర్త్ డే గిఫ్ట్గా హెలికాప్టర్
లండన్: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 తన మనువడు ప్రిన్స్ విలియమ్ పుట్టిన రోజు కానుకగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు. ఎలిజబెత్ దాదాపు 80 కోట్ల రూపాయిల విలువైన హెలికెప్టర్ను విలియమ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నారు. విలియమ్ ఆదివారం 33వ ఏట అడుగుపెట్టనున్నారు. అన్నట్టు విలియమ్ ఆర్ఏఎఫ్ హెలికెప్టర్ ఫైలట్. ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్టన్ దంపతులకు ఆగస్టా ఎ 109 ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అధికారిక కార్యక్రమాలకు దీన్ని ఉపయోగిస్తుంటారు. కాగా విలియమ్ ఆగస్టాను నడపగలరా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.