rajanagaram
-
తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..
తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
-
దద్దరిల్లిన రాజానగరం
-
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
-
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
-
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
-
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
-
కలవచర్ల గ్రామంలో పార్ను ప్రారంభించిన మంత్రి అమరనాథ్
-
ఇంటింటికి గోదావరి
-
రాజమండ్రి కాతేరు చంద్రబాబు సభలో గందరగోళం
-
సాధికార యాత్రకు జననీరాజనం
-
బూరుగుపూడిలో ‘సామాజిక’ ప్రభంజనం
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో సామాజిక నినాదం మార్మోగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అశేష సంఖ్యలో హాజరైన జనం బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘జై జగన్.. జైజై జగన్’ నినాదాలతో రహదారి దద్దరిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో దోసకాయలపల్లి నుంచి బూరుగుపూడి వద్ద సభా ప్రాంగణం వరకూ పెద్దఎత్తున బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మేళతాళాలు, పూలజల్లులు, జేజేలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన లబ్ధిని గుర్తుచేసేలా మంత్రులు, నేతలు సాగించిన ప్రసంగాలు వింటూ.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్లీ జగన్కే పట్టం కడతామని నినదించారు. ఈ సభలో హోంమంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వెల్లివెరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. పిల్లల చదువులకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కలను నిజంచేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న పేదరికం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆరు శాతానికి తగ్గింది. సామాన్యుల నేత : ఎంపీ సురేష్ సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల నాయకుడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, వ్యవసాయం పండుగ కావాలన్నా మళ్లీ జగనే సీఎం కావాలి. ఆయన పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోంది. సంక్షేమం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసి సామాన్యుల నేతగా ఖ్యాతి గడించారు. పేదలు మరింత బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలి. అన్ని వర్గాలూ ప్రభుత్వంలో భాగస్వాములే : మంత్రి జోగి రమేష్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు అందరూ భాగస్వాములే. రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చి గౌరవించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో నాలుగు స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, చైర్మన్ స్థానాలిచ్చారు. సామాజిక న్యాయ నిర్ణేత జగన్ : పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ హామీలన్నీ అమలుచేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుంది. జగన్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమైంది. అలాంటి నేతను తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలి. 175 ఎందుకు ఇవ్వకూడదు? : అలీ మంచి చేసే నేతను ప్రజలు అభిమానిస్తారు. అందుకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్కు ఘన విజయం చేకూర్చడం. ‘వై నాట్ 175’ అని సీఎం ప్రతి సమావేశంలో చెబుతుంటారు. ప్రజలకు మంచి చేస్తున్న ఆయన అడిగిన సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ అభివృద్ధి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం రాజానగరం అభివృద్ధి, సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి రూ.1,152 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1,145 కోట్లు వెచ్చించాం. 20 వేల మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేశాం. రూ.104 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. రూ.217 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నాంది పలికాం. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడేందుకు రూ.91 కోట్లతో తొర్రిగెడ్డ కాలువపై రివర్స్ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టు నిర్మించనున్నాం. -
East Godavari: జైత్రయాత్రలా సామాజిక బస్సు యాత్ర
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. 42వ రోజు బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర సాగింది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. ఊసరవెల్లి చంద్రబాబు: మంత్రి మేరుగ నాగార్జున ఊసరవెల్లి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు. రాజ్యాంగబద్ధమైన అవకాశాలు రాకుండా చేశారు. చంద్రబాబు హయాంలో బీసీ ఎస్సీలపై అనేక దాడులు పాల్పడ్డారు. కులం, మతం, వర్గం, పార్టీ తారతమ్యం లేకుండా అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. పేదల పిల్లలకు కార్పొరేట్ విద్య చదివించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వమిది. పేదలకు 31 లక్షలు ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్కే జనం పట్టం: మంత్రి తానేటి వనిత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సీఎం జగన్ హయాంలో సామాజిక న్యాయం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించి పేదరికాన్ని దూరం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు బురద జల్లుతున్నారు. పిల్లలకు అందించే ట్యాబులపై కూడా బురద జల్లుతున్నారు. జగనన్న అందిస్తున్న పాలనలో కంటెంట్ ఉంది.. అందుకే ఆయన కటౌట్తో సాధికార బస్సు యాత్రలు చేయగలుగుతున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్కే జనం పట్టం కడతారు ఇది ప్రజలు గ్రహించాలి: ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు కావాలా.. ప్రేమను పంచుతున్న జగన్ కావాలా అన్న విషయాన్ని జనం తెలుసుకోవాలి. మరో ఐదేళ్లు జగనన్నకు అవకాశం ఇస్తే విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు అద్భుతంగా రూపొందుతాయి. -
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్కు హాజరైన సీఎం జగన్ (ఫోటోలు)
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్కు హాజరైన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్కు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చదవండి: ‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్దే’ -
ఎనిమిదేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రీ ఎంట్రీ
సాక్షి, తూర్పుగోదావరి(రాజానగరం): ‘కథ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షక్షులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాంతార’, ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ‘కార్తికేయ –2’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. పరమ మూఢభక్తితో కూడిన కథాంశంతో తీసిన చిత్రాలను కూడా ఈ రోజు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే వారు ఎప్పుడూ ఒకే మూసలో ఉండే చిత్రాలను కాకుండా కొత్తదనం ఉన్న చిత్రాలనే ఆదరిస్తారని అర్థమవుతోంది’ అంటున్నారు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. తూర్పు గోదావరి జిల్లాలోని కొంకుదురుకు చెందిన ఈయన రాజానగరంలో శుక్రవారంఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 2014లో యమలీల–2 సినిమా తీసి, విరామం తీసుకున్న ఆయన తాజాగా మెగాఫోన్ పట్టారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడిగా ఎనిమిదేళ్ల విరామం తరువాత ఇస్తున్న రీ ఎంట్రీ గురించి వివరించారు. ప్రశ్న: రాజేంద్రుడు–గజేంద్రుడు, మాయలోడు, వినోదం, మావిచిగురు, యమలీల, శుభలగ్నం వంటి అనేక సూపర్ హిట్లు ఇచ్చిన మీరు చాలా కాలంగా సినిమాలు తీయడం లేదు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? జవాబు: ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ అనే చిత్రాన్ని తీస్తున్నాను. దాదాపుగా షూటింగ్ పార్టు అంతా పూర్తయింది. జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో సహాయ్లరగర్, మృణాళిని హీరో హీరోయిన్లు కాగా ఆర్గానిక్ మామగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. అలాగే మీనా, సునీల్, అజయ్ఘోష్, సూర్య, హేమ ఇలా అనేకమంది తారాగణం ఉన్నారు. గతంలో నేను తీసిన చిత్రాలలో కనిపించే కుటుంబ నేపథ్య వాతావరణంతోపాటు హాస్యరసం, కష్టాలు, కన్నీళ్లు, చక్కటి సంగీతంతో కూడిన వినోదం.. అన్నీ ఉంటాయి. ప్రశ్న: ఎనిమిదేళ్ల అనంతరం ఈ సినిమా తీయడానికి కారణం? జవాబు: కాలంతోపాటు ప్రేక్షకుల ఆదరణలో వస్తున్న మార్పులను గమనిస్తున్న నేను ఖాళీగా కుర్చోవడం ఎందుకని ఒక కథ తయారు చేశా. దానికి స్క్రీన్ప్లే, మాటలు కూడా రాసిన తరువాత రూ. 10 కోట్ల వ్యయంతో ఈ సినిమాను తీశాను. క్లైమాక్స్లో కూడా నవ్వులు కురిపించే చిత్రంగా వచ్చింది. గతంలో మాయలోడు, వినోదం సినిమాలు వచ్చాయి. వాటిని మరింపిచే రీతిలో ఈ సినిమా ఉంటుంది. దీనిలో వ్యక్తుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, పగలు, ప్రతీకారాలు, అన్నీ మిళితమై ఉంటాయి. ప్రతి అంశంలోను కామెడీ ఉంటుంది. ప్రశ్న: మీ సినిమాలో సందేశం ఏమైనా ఉంటుందా? జవాబు: ‘ప్రేమను ప్రేమతోనే కలుపుకోవాలి గాని, పగలు, ప్రతీకారాలతో కాదనే’ సందేశంతో ఈ సినిమాను రూపొందించాం. ప్రేమించడం చేతనైన వాడికి కష్టం తెలియదు, పగతో రగిలిపోయేవాడికి సుఖం దొరకదు, ఇది జగమెరిగిన సత్యం. ప్రశ్న: తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటి? జవాబు: తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడిక్కెడికో పరుగులు పెడుతోంది. ఆనందమే, కానీ బడ్జెట్ విషయంలో కాస్త కంట్రోలు ఉంటే బాగుంటుంది. కథ డిమాండ్ని బట్టి వ్యయం ఉండాలిగాని, గొప్పగా చెప్పుకునేందుకు కాలాన్ని, డబ్బును వృథా చేయకూడదు. వృథా చేస్తే డబ్బు సంపాదించుకోవచ్చునేమోగాని, కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. ప్రశ్న: దర్శకుడిగా కెరీర్ కొనసాగిస్తారా? జవాబు: కొంతకాలం పాటు సినిమాలు తీయడం కొనసాగిస్తాను. ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటే.... -
ప్రారంభమైన మొబైల్ థియేటర్
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలకు సమీపాన హెబిటేట్ రెస్టారెంట్ పక్కన ఏర్పాటు చేసిన మొబైల్ థియేటర్ ప్రారంభమైంది. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సోమవారం దీనిని ప్రారంభించారు. ‘పిక్చర్ టైమ్’ సంస్థ ఏర్పాటు చేసిన ఈ థియేటర్ గ్రామీణ ప్రాంతాల వారికి ఐమాక్స్లో సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులలో ఒకరైన చైతన్య తెలిపారు. ఇన్ఫ్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ (గాలి నింపిన టెంట్)తో తయారైన ఈ థియేటర్ అన్ని వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకుంటుందన్నారు. 35 ఎంఎం స్క్రీన్తో, 120 సిటింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్కి ఏడాది పాటు అనుమతులున్నాయని, ఈనెల 29న విడుదలయ్యే ఆచార్య సినిమాతో రెగ్యులర్ షోలు వేస్తామని చెప్పారు. ఆన్లైన్తోపాటు బుకింగ్ కౌంటర్లోను లభించే టికెట్లు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లభిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జీఎస్ఎల్ ప్రతినిధులు డాక్టర్ గన్ని సందీప్, డాక్టర్ జి. తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జనబాట కార్యక్రమం
-
హత్యల మిస్టరీ వీడింది.. తాగి తందనాలాడుతుంటే తిడుతోందని..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం, సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితులను అరెస్టు చేశామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగీ తెలిపారు. మినీ వ్యాన్ డ్రైవర్ హత్య కేసులో ముగ్గురిని, వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, నిందితుల్లో ఇద్దరు బాల నేరస్తులున్నారని వివరించారు. తన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వేలిముద్రే పట్టించింది పిఠాపురానికి చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ ఒగ్గు నాగేంద్ర (32) ఈ నెల 26న తాడేపల్లిగూడెం వెళ్లి కమలా ఫలాల లోడు వేసుకుని తిరిగి వెళుతున్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నన్నయ యూనివర్సిటీ సమీపానికి వచ్చేసరికి ఆ వ్యాన్ను రాజమహేంద్రవరం శంభూనగర్కు చెందిన మద్ది వెంకట సాయి (వెంకట్), కడియం మండలం వేమగిరికి చెందిన తూము ముత్యాలు, ఓ బాల నేరస్తుడు కలిసి ఆపారు. నాగేంద్రను బెదిరించి డబ్బులు, సెల్ఫోన్ లాక్కొనేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో ముద్దాయిలు చాకులతో అతడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచి పరారయ్యారు. జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందాడు. ఈ కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్ క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఓ నిందితుడి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ముద్దాయిలను ఆదివారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నాగేంద్రను హత్య చేసిన తరువాత నిందితులు విశాఖకు పారిపోయారు. తిరిగి వస్తూ కత్తిపూడిలో ఓ స్కూటర్ దొంగిలించారు. వారి నుంచి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటర్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల్లో మద్ది వెంకట సాయిపై చోరీ కేసులతో పాటు సస్పెక్ట్ షీటు కూడా ఉంది. అలాగే తూము ముత్యాలుపై ఒక కేసు, బాల నేరస్తుడిపై రెండు కేసులు ఉన్నాయి. ఈ కేసును చాకచక్యంగా విచారించి, నిందితులను అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుభాష్, క్లూస్ టీం ఎస్సై ప్రవీణ్, ఎస్సైలు ఎండీ జుబేర్, సుధాకర్, హెడ్ కానిస్టేబుళ్లు రమణ, ఎం.ప్రసాద్, కానిస్టేబుళ్లు బి.విజయకుమార్, కె.పవన్కుమార్, సూరిబాబు, ఆర్వీ రమణ, ఎన్.రాంబాబులను ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. చదవండి: (ఊరి చివర పాడుబడిన బావిలో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య) తాగి తందనాలాడుతుంటే తిడుతోందని.. సీతానగరం మండలం వంగలపూడిలో ఈ నెల 24న జరిగిన కోదేళ్ల నాగమ్మ అలియాస్ చింతాలమ్మ (72) హత్య కేసు మిస్టరీని కూడా పోలీసులు ఛేదించారు. నాగమ్మ మృతదేహంపై గాయాలుండటంతో ఆమె బంధువు కొండయ్య ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో విచారించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇచ్చిన ముఖ్య సమాచారం ఆధారంగా వంగలపూడికే చెందిన యువకుడు ఇండుగుమిల్లి నవీన్ను, ఓ బాల నేరస్తుడిని వీఆర్వో ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించారు. ప్రతి రోజూ మద్యం తాగి ఊళ్లో బలాదూర్గా తిరుగుతున్న వీరిని నాగమ్మ తరచూ అసభ్య పదజాలంతో తిట్టేది. ఈ నెల 24న పుట్టిన రోజు సందర్భంగా మద్యం తాగి వస్తున్న వారిద్దరినీ చూసిన నాగమ్మ తీవ్రమైన పదజాలంతో దూషించింది. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలని నిందితులిద్దరూ నిర్ణయించుకున్నారు. వెంటనే నాగమ్మ ఇంట్లోకి వెళ్లి చెంబుతో ఆమె ముఖంపై కొట్టారు. ఆమె ఇంట్లోనే ఉన్న గునపంతో ఆమె ఛాతి మీద బాది హతమార్చారు. నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. వృద్ధురాలి హత్యకు వారు ఉపయోగించిన చెంబు, గునపం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో ప్రతిభ చూపిన కోరుకొండ ఇన్స్పెక్టర్ పీఈ పవన్కుమార్రెడ్డి, సీతానగరం ఎస్సై కె.శుభశేఖర్, కానిస్టేబుళ్లు పి.రాము, ఎస్.ప్రసాద్, సీహెచ్ గోవిందు, బి.వెంకటేష్లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. విలేకర్ల సమావేశంలో శాంతిభద్రతల ఏఎస్పీ లతామాధురి, నార్త్జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. చదవండి: (భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!) -
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న కరోనా
రాజానగరం: కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాలను కకావికలం చేస్తోంది. కొన్ని కుటుంబాలపై కక్ష కడుతోంది. లాలాచెరువు హెచ్బీ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు 10 రోజుల వ్యవధిలో కరోనా వైరస్తో మృతిచెందడం కాలనీవాసులను తీవ్రంగా కలచివేస్తుంది. రాజమహేంద్రవరంలో నటరాజు, శివజ్యోతి థియేటర్లకు మేనేజర్గా పనిచేస్తున్న జీవీవీఎస్శర్మ అనే నటరాజశర్మ (75) కరోనా వైరస్తో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగిన శర్మ పిల్లలు ముగ్గురికి వివాహాలు చేశారు. ఈ సంతానంలో 10 రోజుల క్రితం పెద్దమ్మాయి (45), ఐదు రోజుల క్రితం చిన్నమ్మాయి (32), కరోనా వైరస్తో చికిత్స పొందుతూనే మరణించారు. ప్రస్తుతం శర్మ భార్య హోమ్క్వారంటైన్లో ఉన్నారు. వేదమాత బ్రహ్మణ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన అయ్యప్పస్వామి మాల దీక్ష ధరించి, 36 సంవత్సరాల నుంచి శబరిమలై వెళ్లి వస్తూ, గురుస్వామిగా పేరొందారు. నటరాజ థియేటర్ మేనేజర్గా ఉండటంతో అంతా నటరాజశర్మ అని పిలిచేవారు. శర్మ మరణం పట్ల మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు మెట్ల ఏసుపాదం తదితరులు విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు. చదవండి: అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు అమ్మకు కేక్ కొనాలని వెళ్తూ.. -
చుట్టేసెయ్ చుట్టేసెయ్.. భూమి..
సాక్షి, రాజానగరం: ప్రఖ్యాత రచయిత రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘లోక సంచారి’ అతడికి స్ఫూర్తి. మాతృదేశాన్ని చుట్టి రావాలన్నది అతడి సంకల్పం. తన 25వ ఏట ప్రారంభమైన అతడి సంచారం ఎనిమిదేళ్లుగా 17 వేల కిలోమీటర్లు కొనసాగింది. ఇంకా సాగుతూనే ఉంది. తన ద్విచక్ర వాహనాలైన బుల్లెట్, లేదా బైక్పై పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు తదితర ప్రఖ్యాత స్థలాలను అతడు చుట్టి వచ్చాడు. తాజాగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర రాజధాని హంపీ నగరాన్ని సందర్శించి వచ్చాడు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన జీవితాశయమని చెప్తాడు రాజానగరం మండలం దివాన్చెరువుకు చెందిన 33 ఏళ్ల పెన్నాడ మోహన్. బీఎస్సీ చదివిన అతడు ఉద్యోగం కోసం చూడకుండా వ్యాపారం వైపు అడుగులు వేశాడు. భార్య, ఇద్దరు కుమారులున్న మోహన్.. ‘సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్’ అన్న మహాకవి మాటలను ఉన్నంతలో ఆచరించేందుకు ‘లియో ఫౌండేషన్’ ప్రారంభించాడు. దివాన్చెరువులో జాతీయ రహదారిని ఆనుకుని ఒక సెల్ఫోన్ షాపు నిర్వహిస్తున్న ఆయన ఎనిమిదేళ్లుగా ఏటా దేశంలోని ఏదో ఒక ముఖ్య ప్రదేశానికి వెళ్లి వస్తుంటాడు. తన యాత్రలను ద్విచక్ర వాహనాలపైనే సాగిస్తూ రాత్రి వేళ గుడారం వేసుకుని తలదాచుకుంటాడు. కొన్నిచోట్ల స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభించేదని చెప్తాడు. ఈ యాత్రానుభవాలతో పుస్తకం తీసుకువస్తా.. తాను చూసిన ప్రకృతి అందాలను, సంస్కృతులను భావితరాలకు తెలియజేసేందుకు మోహన్ కొన్ని పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాడు. వాటిలో ‘నేను చూసిన డొక్కా సీతమ్మ’, ‘ఆ రాత్రి నేను కాదేమో’, ‘తలుపులు లేని ఊరు స్యాలియా’ వంటివి బాగా పాఠకాదరణ పొందాయి. ఎనిమిదేళ్లు సాగిన యాత్రపై ‘ప్రయాణంలో నా జీవితం’ అనే పుస్తకాన్ని కూడా తీసుకువస్తానంటున్నాడు. ఇంతవరకూ తన యాత్రలకు కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని, అదే స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహిస్తానంటున్నాడు మోహన్. -
దోచుకొని దాచుకున్న మీరా విమర్శించేది?
సాక్షి, కోరుకొండ (రాజానగరం): గత టీడీపీ ప్రభుత్వంలో దొరికినంత దోచుకొని దాచుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్కు జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కోరుకొండ శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కళావేదిక పై ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ చేస్తున్న అసత్య ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఒక్కరికి ఓటు వేస్తే ముగ్గురం నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తామని ఆనాడే చెప్పామన్నారు. మా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని నన్ను నా పిల్లలు దేవతగా కొలుస్తారని, నా మాటను శాసనంగా భావిస్తారని అన్నారు. తన కుటుంబంపై వెంకటేష్ తరుచూ ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఇసుక, మట్టి దోచుకోవడం, ధనార్జనే థ్యేయంగా పనిచేయడంతోనే టీడీపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీకు ప్రజలు గుణపాఠం చెప్పార న్నారు. మీరు గాలివాటున రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. గతంలో మీ సతీమణి అన్నపూర్ణకు టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిపోయారని, మరోసారి ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకుండా మీరు ఎలా లాక్కున్నారో అందరికి తెలుసు అన్నారు. స్వచ్ఛ కోరుకొండ కార్యక్రమంలో గ్రామ వలంటీర్లు పాల్గొంటున్నారని దానిని మాజీ ఎమ్మెల్యే రాజకీయం చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర, వనం–మనం కార్యక్రమంలో ప్రభుత్వాధికారులను, విద్యార్థులను ఎలా ఉపయోగించుకున్నారో మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక దోపిడీ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులపై మీ ప్రోత్సాహంతోనే దాడిచేసిన సంఘటన అందరికీ తెలిసిందేనని అన్నారు. కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతిని ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తీసుకువచ్చారన్నారు. దానిని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, లేకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల నాయకులు తిరుమలశెట్టి సత్యనారాయణ, నక్కా రాంబాబు, బొరుసు బద్రి, తాడి హరిశ్చంద్రప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి తాడితోట (రాజమహేంద్రవరం ) : వైద్య విధానపరిషత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిని సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతానన్నారు. ఈ సంఘం వైఎస్సార్ సీపీ టీయూసీకి అనుబంధంగా పని చేస్తుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికకు వైఎస్సార్ సీపీ టీయూసీ తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జి మస్తానప్ప ఎన్నికల పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. -
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల దుర్మరణం
‘నాతిచరామి’ అంటూ పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను మరువ లేదేమోనన్నట్టుగా.. ఆ దంపతులు.. ఒకరికొకరు తోడుగా మృత్యు కౌగిట్లోకి ఒదిగిపోయారు. రాజానగరం శివారు శ్రీరామనగర్లో బంధువుల ఇంట ఓ ఫంక్షన్కు వెళ్లిన తోకాడకు చెందిన దంపతులు రాయుడు నరసింహమూర్తి, సత్యవతి.. తిరుగు పయనంలో.. ఆ ఫంక్షన్ జరిగిన ఇంటికి సమీపంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బంధువులంటే అతడికి వల్లమానిన అభిమానం. ఎవరింట ఏ కార్యక్రమం జరిగినా.. తప్పనిసరిగా హాజరై అందరితో సరదాగా ఉండే అతడంటే వారందరికీ కూడా ఎంతో అభిమానం. అదేవిధంగా శ్రీరామనగర్లో బంధువుల ఇంట నిర్వహించిన ఫంక్షన్కు భార్య, కుమారుడితో వచ్చి తిరిగి వెళుతుంటే.. ఆ ఇంటి సమీపంలోనే ప్రమాదానికి గురై భార్యతో సహా చని పోయాడు. విషయం తెలుసుకున్న పంక్షన్లోని వారందరూ పరుగున వెళ్లి విగతజీవులుగా పడి ఉన్న భార్యాభర్తలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సాక్షి, తూర్పుగోదావరి: రాజానగరం శివారు శ్రీరామనగర్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. మండలంలోని తోకాడకు చెందిన రాయుడు నరసింహమూర్తి (55), అతని భార్య సత్యవతి (50) కుమారుడు గోవిందుతో కలసి మోటారు బైకుపై శ్రీరామనగర్లోని బంధువుల ఇంట జరిగే ఒక ఫంక్షన్కు వచ్చారు. ఫంక్షన్ ముగిశాక తిరుగు పయనమై డివైడర్ దాటి అవతల వైపువెళుతుండగా బైక్పై ఉన్న వీరిని.. జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకు నడుపుతున్న కుమారుడు గోవిందుతోపాటు వెనుక కూర్చున్న భార్యాభర్తలు ఎగిరి పడ్డారు. డివైడర్పై వర్షపు నీరు పోయేందుకు నిర్మించిన సీసీ బోదెల అంచులకు భార్యాభర్తల తలలు బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. గోవిందు మాత్రం డివైడర్పై గడ్డితో ఉన్న మట్టిపై పడటంతో కాలు, చెయ్యి విరిగింది. వెంటనే అతడిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు చిన్నతనంలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరిలో పెద్దవాడికి, అమ్మాయికి వివాహాలను వారు చేశారు. గాయపడిన కుమారుడు గోవిందు అవివాహితుడు. సంఘటన స్థలంలో ప్రమాదం జరిగిన తీరును రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సమయం మించిపోవడంతో సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. -
పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి..
సాక్షి, రాజానగరం(తూర్పు గోదావరి) : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జాతీయ రహదారి పై లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దివాన్చెరువుకు చెందిన బలభద్ర వీరభద్రరావు అనే చిన్నబ్బు (55) అనారోగ్యంతో రాజమహేంద్రవరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన ఇయ్యపురాలిని పరామర్శించేందుకు భార్య, మనుమడితో కలసి బైకు పై వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ముందు వెళుతున్న లారీని వెనుక వస్తున్న మరో లారీ అధిగమించే ప్రయత్నంలో రహదారి పక్క నుంచి వెళుతున్న చిన్నబ్బు బైకును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అతడి భార్య, మనుమడు రహదారికి ఎడమ వైపు పడిపోగా, చిన్నబ్బు కుడివైపునకు పడటంతో లారీ అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కట్టుకున్న భర్త మృత్యువాత పడడంతో చిన్నబ్బు భార్య సూర్యలక్ష్మి సొమ్మసిల్లి పోయారు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరభద్రరావు -
తరిమి కొట్టి.. చెట్టుకు కట్టి..
సాక్షి, రాజానగరం(పశ్చిమ గోదావరి): భూవివాదంలో ఓ వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటనతో రాజంపేటవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మునికూడలికి చెందిన చిడిపి నాగభూషణానికి తన చిన్నాన్న చిడిపి నాగయ్యతో తొమ్మిది సెంట్ల భూవివాదం కొంతకాలంగా నడుస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు తన చిన్నాన్న కుమారుడు చిడిపి నాగేశ్వరావు(స్టాలిన్) మునికూడలి పంచాయతీ పరిధిలోని రాజంపేటలో ఉన్న భూమిని దున్నుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న స్టాలిన్, తన కుమారుడు తరుణ్లతోపాటుగా ఇనుగంటివారిపేటకు చెందిన నలుగురు యువకులు క్రికెట్ బ్యాట్లు, స్టంప్లతో నాగభూషణంపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు రాజంపేట గ్రామంలోకి పరుగులు తీశాడు. నీలవేణి అనే మహిళకు తన వద్ద ఉన్న బ్యాగ్ను ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పగా, అప్పటికే దాడి చేస్తున్న వారు చేరుకోవడంతో భయభ్రాంతులకు గురై ఆమె తిరిగి బ్యాగ్ను నాగభూషణానికి అందించింది. నాగభూషణం నుంచి బ్యాగ్ను తీసుకుని కొడుతూ ఈడ్చుకుని వెళ్లి పొలం వద్ద ఉన్న కొబ్బరి చెట్టుకు కట్టేశారు. విషయం తెలిసిన నాగభూషణం కుమారుడు రాజు 100కు కాల్ చేయడంతో స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, కానిస్టేబుల్ ప్రసాద్ వెళ్లి చెట్టుకు కట్టి ఉన్న నాగభూషణాన్ని విడిపించారు. బ్యాగ్లో పొలం దస్తావేజులు, రెండు బ్యాంక్ చెక్బుక్లతోపాటుగా పాస్బుక్లు, ప్రాజెక్ట్కు సంబంధించిన పత్రాలు, రూ.45 వేలు ఉన్నాయని భాదితుడు నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కోరుకొండ సీఐ పవన్కుమార్ రెడ్డి, ఎస్సై డి ఆనంద్ కుమార్ విచారించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆనంద్ కుమార్ తెలిపారు. -
పగలే.. ‘జల’జలా..
సాక్షి, రాజానగరం (తూర్పు గోదావరి): గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే మెట్ట రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ, తొలి సంతకం చేశారు. ఆ తరువాత వ్యవసాయం గురించి, రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన నాథుడే లేడు. రోజుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారనే పేరే కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో కొంతమంది రైతులు మోటార్లు ఆన్ చేసేందుకు పొలాలకు వెళ్లి, పాము కాట్లకు గురై మృత్యువాత పడిన సంఘటనలున్నాయి. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలు ప్రాంతాల్లోని రైతులు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. ఆ సందర్భంగా తాను అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ మోటార్లకు పగటి సమయంలోనే రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి అయిన ఆయన.. ఆ హామీ నిలబెట్టుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనివలన పూర్తి మెట్ట ప్రాంతంగా ఉన్న రాజానగరం నియోజకవర్గంలోని రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోంది. ప్రస్తుతానికి సాంకేతిక ఇబ్బందులు లేనిచోట జగన్ ప్రభుత్వం పగటి పూటే రోజుకు 9 గంటలు విద్యుత్ అందిస్తూండగా, అవకాశం లేనిచోట అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో 8,250 వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 1,51,965 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోరుకొండలో సాంకేతిక అవరోధాలు కోరుకొండ మండలంలో సుమారు 2,300 వ్యవసాయ విద్యుత్ మోటార్లున్నాయి. వీటి ద్వారా 28,750 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఇక్కడ కూడా వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు పండిస్తూంటారు. ఏటిపట్టుకు, మెట్ట ప్రాంతానికి మధ్యన ఉన్న ఈ మండలంలోని రైతులు సాగునీటికి ఎక్కువగా బోర్ల పైనే ఆధారపడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇక్కడ పంటలు పండుతాయి. లేకుంటే బోర్లున్న ప్రాంతాల్లోనే సాగు జరుగుతూంటుంది. మండలంలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ప్రకటించినవిధంగా వ్యవసాయ మోటార్లకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించలేకపోతున్నారు. సాంకేతికపరమైన సమస్యలున్నందున, వాటిని నివారించే వరకూ ఇది సాధ్యం కాదని ఏఈ రవికుమార్ తెలిపారు. అందుకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. సీతానగరం మండలంలో వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, అరటి, కూరగాయలు సాగు చేస్తూంటారు. గోదావరి చెంతనే ఉన్న ఈ మండలానికి భూగర్భ జలాలతో పాటు తొర్రిగెడ్డ, కాటవరం ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు అందుతుంది. మండలంలో మొత్తం 1,236 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఉచిత విద్యుత్ పథకం అమలులోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో బోర్ల సంఖ్య పెరగడంతో ఆ మేరకు సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. జగన్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా పురుషోత్తపట్నం, ముగ్గళ్ల సబ్స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ మోటార్లకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 820 వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే విద్యుత్ సరఫరా అవుతోంది. మిర్తిపాడు సబ్స్టేషన్ పరిధిలో సాంకేతిక అవరోధాలు ఉండడంతో ప్రస్తుతం ఈ విధానం అమలుకు నోచుకోవడం లేదు. అడ్డంకులను అధిగమించే ప్రయత్నంలో ఉన్నామని ఏఈ త్రిమూర్తులు తెలిపారు. పాతాళగంగే ప్రధానాధారం పూర్తి మెట్ట ప్రాంతంగా ఉన్న రాజానగరం మండలంలో సాగుకు భూగర్భ జలాలే ఆధారం. ప్రతి సీజన్లోనూ బోర్లున్న రైతులు జిల్లాలో అందరికంటే ముందుగా వరి సాగుకు శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో కోతలు కూడా ముందుగానే చేపడుతూంటారు. మండలంలో సుమారు 4,700 వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా 86,950 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మండలంలోని రాజానగరం, సంపత్నగరం గ్రామాల్లో ఉన్న సబ్స్టేషన్ల ద్వారా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. సంపత్నగరం ఏఈ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపత్నగరం సబ్స్టేషన్ పరిధిలోని దివాన్చెరువు సబ్స్టేషన్ ద్వారా 13 మోటార్లకు ఈ నెల 17 నుంచి పగటి పూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే కొండగుంటూరు సబ్స్టేషన్ ద్వారా కొండగుంటూరు, నామవరం, కడియం మండలం జేగురుపాడు ఆవల్లో 94 మోటార్లకు విద్యుత్ అందిస్తున్నామన్నారు. సంపత్నగరం సబ్స్టేషన్ ద్వారా నామవరం, జి.యర్రంపాలెం, పాతతుంగపాడు, కొండగుంటూరుపాకలులోని 480 మోటార్లకు 9 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వివిధ ఫీడర్ల ద్వారా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాజానగరం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఇది అమలు జరగడం లేదని ఏఈ సుబ్రహ్మణ్యం చెప్పారు. తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనందున ప్రస్తుతం ఇవ్వలేకపోతున్నామన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
రానున్న ఎన్నికలే టీడీపీకి ఆఖరువి
రాజానగరం : రానున్న ఎన్నికలే టీడీపీకి ఆఖరి ఎన్నికలు అవుతాయని, ఆ పై ఆ పార్టీని ఓటర్లు బంగాళాఖాతంలో కలిపేస్తారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో నిర్వహిస్తున్న రిలే దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి, దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేనిపోని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఈ నాలుగేళ్లలో హామీలను తీర్చకపోగా, విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తన విదేశీ పర్యటనలు, విలాస భవనాలతో మరింత లోటులో పడవేశారని విమర్శించారు. కేంద్రం నుంచి లోటును భర్తీ చేసే విధంగా నిధులు తెచ్చుకోవడంలోనూ, పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను సాధించుటలోనూ పూర్తిగా విఫలమయ్యారన్నారు. అటువంటి వ్యక్తి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలనూ గెలుచుకుని ఢిల్లీలో చక్రం తిప్పేస్తామంటూ పగటి కలలు కంటున్నారన్నారు. కొంగ జపాలు ఎవరి కోసం గట్టు మీద ఉండి చెరువులో చేపల కోసం జపం చేసే కొంగల మాదిరిగానే చంద్రబాబు దీక్షను భావించవలసి వస్తుందన్నారు. నిన్న ప్రధాన మంత్రి దీక్ష చేస్తే, 20న చంద్రబాబు దీక్ష చేస్తానంటుంటే ఇటువంటి అసమర్థులనా మనం పాలకులుగా ఎన్నుకుంది అని ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. నీవు దొంగంటే నీవే దొంగంటూ ఇద్దరు దొందూ దొందే కాబట్టే ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. ఇటువంటి కొంగ జపాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. బంద్ని విజయవంతం చేయండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా పాలకులు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుతూ సోమవారం జరుపతలపెట్టిన రాష్ట్ర బంద్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతుతో చేపట్టిన ఈ బంద్లో అధికార పార్టీ కూడా కలిసి ప్రత్యేక హోదా పోరులో ప్రజలకు బాసటగా నిలవాలని సూచించారు. ప్రత్యేక హోదా రాకూడదునుకునే వారే బంద్కి దూరంగా ఉంటారన్నారు. -
ప్రియుడే యముడు..
♦ కోలమూరులో యువతి హత్య కేసును శోధించిన పోలీసులు ♦ ప్రధాన నిందితుడు రాజస్థాన్ వాసి ∙ఆర్థికపరమైన ఇబ్బందులే కారణం రాజానగరం : ప్రేమ పేరుతో ఆ యువతీయువకులు దగ్గరయ్యారు. సహజీవనం చేస్తున్నారు. అయితే ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా ఆ యువకుడు యువతిని హత్యచేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని బావిలో పడేసి తప్పించుకుందామనుకున్నాడు. పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధి కోలమూరులో జరిగిన ఈ సంఘటనలో అరెస్టయిన ముద్దాయిల వివరాలను బుధవారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి స్థానిక పోలీసు స్టేషన్ వద్ద విలేకర్లకు వెల్లడించారు. సిద్ధాంతిలా వచ్చి.. రాజస్థాన్కి చెందిన 29 ఏళ్ల యువకుడు మూడేళ్ల క్రితం సిద్ధాంతి మాదిరిగా తయారై కోలమూరు వచ్చాడు. అక్కడ చుండ్రు సత్యనారాయణ దంపతులతో పరిచయం పెంచుకుని, వారికి అబ్బాయిలు లేకపోవడంతో వారికి కొడుకుగా మారి, వారి ఇంటి పేరు, అడ్రసుతో ఆధార్ కార్డును పొందాడు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకుగా భావించిన ఆ దంపతులు అతడు చెప్పిన విక్రమాదిత్య పేరును నమ్మి ముద్దుగా ఆదిత్య అని పిలుచుకుంటున్నారు. సిద్ధాంతి వేషాన్ని తీసేసి స్థానికంగా దొరికే చిల్లరమల్లర పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న ఆదిత్య రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రంపచోడవరానికి చెందిన పళ్లాల పద్మ(25)కు చేసిన రాంగ్ కాల్తో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, అది క్రమేపీ ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల క్రితం కోలమూరులోనే ఒక ఇల్లు తీసుకుని సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆమె ఆరు నెలల క్రితం ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది. ఆర్థికపరమైన తగాదాతో చంపేశాడు సహజీవనం సాగిస్తున్న ఆదిత్య, పద్మల మధ్య తరచూ ఆర్థికపరమైన సమస్యలు వస్తుండేవి. ఈ క్రమంలో పద్మ అభద్రతాభానికిలోనై పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చేది. దీంతో ఆమె తన చెప్పుచేతల్లో ఉండడం లేదని భావించిన ఆదిత్య ఈనెల 10న అదే ప్రాంతంలోని బొమ్మన కాలనీకి ఆమెతో సహా మరో ఇంటికి మకాం మార్చాడు. అయినా వారి మధ్య ఆర్థికపరమైన గొడవలు తొలగిపోలేదు. ఈనెల 16వ తేదీ సాయంత్రం కూడా అదేవిధంగా గొడవ పడిన సమయంలో ఆదిత్య కోపంతో పద్మను కొట్టడం, ఆమె సృహ తప్పిపడిపోవడం, వెంటనే ఆమె మెడలో ఉన్న చున్నీని తీసి, గొంతుకు బిగించాడు. చనిపోయిందని గ్రహించి, తన తండ్రిగా ఉన్న చుండ్రు సత్యనారాయణ సహయంతో ఆ మృతదేహాన్ని ఒక గోనె సంచెలో కట్టి, బొమ్మన కాలనీలోని పోతురాజు బావిలో విరిగిపోయిన సిమెంటు దిమ్మలు కట్టి పడేశాడు. ఐదు రోజులకు (ఈనెల 21) ఆ సంచె పైకి తేలడంతోపాటు దుర్వాసన రావడంతో వీఆర్వో నిర్మలకుమారి ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి, బావిలో సంచిలో కట్టి పడవేసిన యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. గుర్తు తెలియని యువతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో పరారీలో ఉన్న నిందితులు ఆదిత్య, సత్యనారాయణలను బుధవారం అరెస్టు చేసి, కోర్టు హాజరుపరిచామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఆదిత్య పుట్టపూర్వోత్తరాలపై ఆరా.. ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న విక్రమాదిత్య రాజస్థాన్ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలు, చుండ్రు సత్యనారాయణ దంపతులను తల్లిదండ్రులుగా చెప్పుకుంటూ వారి అబ్బాయిగానే ఆధార్ కార్డుతోపాటు ఇతర సదుపాయాలు పొందడంలో ఉన్న మతలబుపై ఆరా తీస్తున్నామని అర్బన్ జిల్లా ఎస్పీ తెలిపారు. రాజస్థాన్కు తమ సిబ్బందిని పంపిస్తామన్నారు. ఈ కేసును శోధించి, నిందితులను పట్టుకోవడంలో అత్యంత చురుకుగా వ్యవహరించిన డీఎస్సీ కె.రమేష్బాబు, సీఐ వరప్రసాద్, రాజానగరం పోలీసులను ఆమె అభినందించారు. -
రూ. 46 లక్షల పాతనోట్లు స్వాధీనం
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం రహదారిపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 46 లక్షల రద్దైన పెద్దనోట్లతో పాటు 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. -
గైట్కి ఉచిత బస్సు సదుపాయం
రాజానగరం : గైట్ కళాశాలలో శుక్రవారం జరగనున్న ఏపీ పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తమ కళాశాల ద్వారా ఉచిత బస్సు సదుపాయం కల్పించామని గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్కాంప్లెక్స్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్టికెట్ చూపించి, బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. గైట్ కేంద్రంలో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. -
వెల్లువెత్తిన ప్రజాగ్రహం
ఇంటి పన్నుల భారీ పెంపుపై రాజానగరం నియోజకవర్గంలో నిరసనలు పంచాయతీల వద్ద నిరాహార దీక్షలు ప్రజల బాగు పట్టని ప్రభుత్వమంటూ విమర్శలు రాజానగరం : భారీగా పెంచిన ఇంటి పన్నుల విధానాన్ని నిరసిస్తూ రాజానగరం నియోజకవర్గంలోని 62 పంచాయతీల వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షలు చేపట్టారు. కోరుకొండ మండలంలో ఆ పార్టీ నియోజకవర్గ కోఆరి్డనేటర్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజానగరం మండలంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సీతానగరం మండలంలో యువనాయకుడు జక్కంపూడి గణేష్ పర్యవేక్షించారు. వారితోపాటు పెద్దాపురం, రాజమహేంద్రవరం రూరల్ కోఆరి్డనేటర్లు తోట సుబ్బారావునాయుడు, ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సభ్యుడు అయ్యప్పచౌదరి, మైనార్టీ సెల్ ప్రతినిధి నాయీభాయ్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి, నాసా రాంజీలు నిరాహార దీక్షా శిబిరాలను సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇంటి పన్నులను ఒకేసారి భారీగా పెంచడాన్ని వారు తీవ్ర తప్పిదంగా పేర్కొన్నారు. లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ సర్పంచ్ మెట్ల ఏసుపాదం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రారంభించి, నియోజకవర్గంలో ఇంటి పన్నుల పెంపుపై ప్రజా నిరసనలకు శ్రీకారం చుట్టారు. అనంతరం దివా¯ŒSచెరువులో దేశాల శ్రీను, శ్రీకృష్ణపట్నంలో మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, భూపాలపట్నంలో సొసైటీ అధ్యక్షుడు పేపకాయల విష్ణుమూర్తి, తోకాడ, ఫరిజ లి్లపేటలలో ఆయా గ్రామాల సర్పంచ్లు ఉండమట్ల రాజబాబు, గండి నానిబాబు, సంపత్నగరంలో ఎంపీటీసీ సభ్యుడు లంక అమ్మిరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు అనదాసు సాయిరామ్, జక్కంపూడి జగపతి, వాడ్రేవు శ్రీనివాసకుమార్ ముక్కినాడ, వెలుగుబందలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. గాదరాడలో మండల రైతు కన్వీనర్ తోరాటి శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలెం నాగవిష్ణుల ఆధ్వర్యంలో పంచాయతీకి సమీపంలో నిలువెత్తు గొయ్యి తీసి దానిలో నిలబడి నిరసనను తెలియజేశారు. జంబూపట్నంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, సర్పంచ్ నాగ సత్తిబాబు, ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. సీతానగరంలో మండల కన్వీనర్ డాక్టర్ బాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎంపీటీసీ సభ్యుడు కోండ్రపు ముత్యాలు, పురుషోత్తపట్నంలో రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చలమల్ల సుజీరాజు, ఎంపీటీసీ సభ్యుడు చలమల రమాదేవి, కూనవరంలో సర్పంచ్ అబ్బులు, ఎంపీటీసీ సభ్యుడు ఏసు, ముగ్గళ్లలో సర్పంచ్ కుమారుడు బొమ్ముల రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గెడ్డం కృష్ణ, మండల సేవాదళ్ అధ్యక్షుడు ఆళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జరిగాయి. కోరుకొండలో పార్టీ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబులు జిల్లా కార్యదర్శి చింతపల్లి చంద్ర, రాష్ట్ర యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొరుసు భద్రి, మండల అధికార ప్రతినిధులు గరగ మధు, వాకా నరసింహరావు, తదితరులు ర్యాలీ చేసి, తహసీల్దారు, ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేశారు. నాడు ప్రజారంజకం – నేడు దారి దోపిడీ రాష్ట్రంలో ప్రజలు గత 13 సంవత్సరాల కాలంలో రెండు రకాల ప్రభుత్వాలను చూశారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ఒకటి ప్రజారంజకమైనది అయితే, రెండోది దారి దోపిడీ ప్రభుత్వమని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేవన్నారు. రుణమాఫీతోపాటు ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శ సీఎంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రజారంజకమైన పాలనతో నేటికీ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొందారన్నారు. అయితే నేడు అధికారంలో ఉన్న చంద్రబాబుకు రాజధాని, సొంతింటి నిర్మాణాలు, కుమారుడికి రాజ్యాధికారం కట్టబెట్టడం వంటి పనులు తప్ప ప్రజాసంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. దారిదోపిడీ మాదిరిగా ప్రజలపై పన్నుల భారం వేస్తూ ధనార్జనే ధ్యేయంగా పాలన చేస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజలపై మోపిన ఇంటి పన్నుల భారం గ్రేటర్ హైదరాబాదులో కూడా లేదన్నారు. పూరి గుడిసెకు కూడా ఇక్కడ రూ.వెయ్యి పైబడి ఇంటి పన్ను ఉంటే అక్కడ పక్కా ఇంటికి కూడా అంతటి పన్ను ఉండదన్నారు. ఈ కారణంగానే ప్రజలు తిరుగుబాటు ప్రకటించారని, ఇది ప్రారం¿¶ ం మాత్రమేనని, ఉపేక్షిస్తే ప్రభుత్వ పునాదులు కూడా కదలక తప్పదని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
నన్నయ పూర్వసాహిత్యంపై పరిశోధన అవసరం
సినీగేయ రచయిత సిరివెన్నెల ‘ఆదికవి’ ప్రారంభమైన ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన’ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : తెలుగు సాహిత్యంపై ఆదికవి నన్నయకు ముందు కాలంపై కూడా పరిశోధనలు జరపవలసిన అవసరం ఉందని సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. నన్నయ కాలం నాటికే తెలుగు భాష ఎంతో పరిణతి చెంది మహాభారతం వంటి హృద్యకావ్యం రాసే స్థాయికి చేరుకుందంటే అప్పటికి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు భాష ఆవిర్భవించి ఉండవచ్చన్నారు.æ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన – నన్నయ నుండి నేటి వరకు’ అనే అంశంపై రెండు రోజులు జరిగే జాతీయ సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత ఆయన కుమారుడు, సినీ సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మతో కలిసి యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆదికవి నన్నయ విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. మన ఆచార్య సాంప్రదాయాల కంటే సాహిత్యమే ఎంతో విశిష్టమైనదిగా పేర్కొన్నారు. వివిధ భాషలు, ప్రాంతాలతో మిళితమైన భారతదేశంలో నాగరికత, జాతీయత పరిఢవిల్లుతున్నాయన్నారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారిలో ఆప్యాయత, అనురాగాలు దర్శనమిస్తాయంటే అందుకు భాషాభిమానమే కారణమన్నారు. నన్నయ పూర్వసాహిత్యంపై త్వరలో సదస్సు నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయ సదస్సు తరహాలోనే సిరివెన్నెల సూచించి నట్టు నన్నయకు ముందు తెలుగు సాహిత్యం, భాష పరిస్థితులపై త్వరలోనే మరొక సదస్సు నిర్వహిస్తామన్నారు. సినీగేయ రచయితగా తెలుగు భాషలోని మాధుర్యాన్ని సిరివెన్నెల తన పాటల ద్వారా లోకానికి తెలియజేస్తున్నారని అభినందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాణి సదాశివమూర్తి, కేంద్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు జి.అరుణకుమారి, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు ఎస్.రఘునాథశర్మ, తెలుగు యూనివర్సిటీ డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ తెలుగు భాష గొప్పదనం, పరిశోధన అంశాలను వివరించారు. ప్రత్యేకంగా ముద్రించిన సాహిత్య సమాలోచన పత్రికను ఆవిష్కరించారు. డీ¯ŒS ఆచార్య ఎస్.టేకి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, తెలుగు శాఖ సమన్వయకర్త తలారి వాసు, సదస్సు డైరెక్టరు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, సహాయ ఆచార్యులు డాక్టర్ కేవీఎ¯ŒSడీ వరప్రసాద్, డాక్టర్ లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు. విశ్వనాథని మించిన కవి ఉండబోరు తెలుగు సాహిత్యానికి విశ్వకవి విశ్వనాథ çసత్యనారాయణను మించిన కవి లభ్యమవుతారని తాను భావించడం లేదని సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన –నన్నయ నుండి నేటి వరకు’ అనే అంశంపై ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గురువారం ప్రారంభమైన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంపై ఆదికవి నన్నయ పేరిట ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఒక అదృష్టంగా భావిస్తానన్నారు. కాగా నన్నయకు పూర్వం గురించి కూడా పరిశీలన చేయవలసి ఉందన్నారు. సాహిత్యం కంటే నాటకం ఉత్కృష్టమైనదంటూ తెలుగు భాషాభివృది్ధకి సాంకేతికతను కూడా జోడించాలని సూచించారు. సినీ పరిశ్రమ ఒక ధర్మబద్ధమైన వ్యాపారం, బాధ్యతయుతమైన మాధ్యమంగా పేర్కొన్నారు. ప్రజల ప్రతిస్పందన కనిపించేది చలనచిత్రసీమలోనేనన్నారు. అయితే «ఇటీవల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. టీవీల ప్రభావం అనడానికి లేదని, ప్రతి వ్యక్తీ బిజీ లైఫ్తో సినిమాకు మూడు గంటల సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాడన్నారు. నిజానికి మన సమాజంలో గొప్ప ఆలోచనాధోరణి ఉందని, ఇక్కడ సాహిత్యం ఎలా ఉండాలి, ఎటువంటి దాన్ని ఆదరిస్తారు అనే ప్రశ్న ఎప్పుడు జవాబు దొరకనిదిగానే మిగిలిపోతుందని అన్నారు. -
1,258 కిలోల గంజాయి స్వాధీనం
కంటైనర్లో తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు రాజానగరం : జాతీయ రహదారిపై భారీస్థాయిలో తరలిస్తున్న గంజాయిని రాజానగరం సీఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలో లభ్యమైన గంజాయి కంటే రెట్టింపు పరిమాణంలో కంటైనర్ ద్వారా రవాణా జరగడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. అందరూ శివరాత్రి సంబరాల్లో ఉండగా గంజాయి రవాణాదారులు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ జిల్లా పోలీసులు రాజానగరం పోలీసుల సహకారంతో మాటువేసి సూర్యారావుపేట వద్ద వాహనాలను తనిఖీ చేశారు. కంటైనర్లో వెళ్తున్న వ్యాన్లో ఉన్న 1,258 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.63 లక్షలు ఉంటుందని అంచనా. ఈ వాహనంలో 74 గన్నీ బ్యాగుల్లో నింపిన గంజాయితోపాటు ఇద్దరు నిందితుల నుంచి రూ.69,800 నగుదు, బుల్లెట్ వాహనం, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వ్యవధిలో.. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత..నిందితులు అరెస్టు..ఇలా ప్రతికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గంజాయి రవాణా మాత్రం కొంచెం కూడా ఆగడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు విశాఖపట్నం ఏరియా నుంచి భారీగా తరలిపోతున్న గంజాయి అప్పుడప్పుడు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఏరియాలోనే పట్టుబడుతుండడం విశేషం. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికంటే జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ గంజాయి రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనే విషయాన్ని సంబంధిత అధికారులు ఆరా తీయాల్సి ఉంది. గతంలో మాటెలావున్నా కొత్త సంవత్సరం (2017) ప్రారంభమై ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈ ప్రాంతం మీదుగా రవాణా అవుతున్న సుమారు రూ.36 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారంటే రవాణా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రవాణాలో సరికొత్త పద్ధతులు గంజాయిని రవాణా చేయడంలో నిందితులు ఏమాత్రం భయపడడం లేదనేది వాస్తవం. గతంలో కారు డిక్కీల్లోను, పాత టైర్లలోను ఎవరికీ కనిపించకుండా తరలించేందుకు ప్రయత్నించేవారు. ఇటీవల సాధారణ సరుకులు మాదిరిగానే వ్యాన్, లారీలలో ధాన్యం బస్తాల వేసుకున్నట్టుగా గంజాయిని తీసుకు పోతున్నారు. ఇప్పుడు ఏకంగా కంటైనర్లను కూడా వారు వినియోగించే వరకు వెళ్లారు. గంజాయి రవాణా జరిగే సమయంలో ముందు కొంతమంది వ్యక్తులు ఫైలెట్లుగా బైకులు, చిన్నకారుల్లో ప్రయాణించడం, వెనుక గంజాయితో కూడిన వాహనాలు వెళ్లడం.. సినీ ఫక్కీలో గంజాయి రవాణా జరుగుతోంది. చెక్ పోస్టులను కూడా దాటుకుని రవాణా అవుతుందంటే చిన్న విషయం కాదు. ఈ కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో గాని, రవాణాకు సిద్ధమవుతున్న వ్యక్తుల్లోగానీ ఏమాత్రం భయం కనిపించకపోవడం విచిత్రం. ఇందుకుగల కారణాలేమిటి. వారి వెనుక ఉన్న బలం ఎవరనే విషయమై పోలీసులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. -
468 కిలోల గంజాయి స్వాధీనం
రాజానగరం : జాతీయ రహదారి మీదుగా తరలిస్తున్న గంజాయిని రాజానగరం పోలీసులు పట్టుకుని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పు మండల డీఎస్పీ రమేష్బాబు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి సూచనల మేరకు జాతీయ రహదారిపై రాజానగరం సీఐ శంకర్నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో గంజాయి పట్టుబడిందన్నారు. జీఎస్ఎల్ పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న వ్యా¯ŒSలో ఉన్న 468 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ రూ. 23 లక్షల 40 వేలు ఉంటుందన్నారు. వ్యా¯ŒSతోపాటు ఆరు సెల్ఫోన్లు రూ.4550 నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తనిఖీల్లో ముగ్గురు నిందితులు పట్టుబడగా మరో ముగ్గురు పరారయ్యారు. విశాఖపట్నం జిల్లా రావికమాతం మండలం, దొండపూడికి చెందిన చందక రాము, పినపాల లోవరాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం, కాకిలేరుకు చెందిన ఇంటి శ్రీనివాసరావు పట్టుబడ్డారన్నారు. వీరిని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. పరారైన వారు విశాఖపట్నం జిల్లా వజ్రగడకు చెందిన సూర్రెడ్డి గోవిందు, దొండపూడికి చెందిన గుడి దొరబాబు, మిరియాలకు చెందిన మస్తా¯ŒSబాషాలుగాపేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ వివరించారు. -
వైద్య కళాశాలకు పార్థివ దేహం వితరణ
రాజానగరం : పశ్చిమ గోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, త్యాజంపూడికి చెందిన ఏలేటి రామారావు (69) పార్థివ దేహాన్ని ఆయన కుమార్తెలు అరుణ, కల్పన స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాలకు వితరణగా అందజేశారు. సోమవారం మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ శర్మను కలుసుకుని తన తండ్రి పార్థీవ శరీరంతోపాటు దానపత్రాన్ని అందజేశారు. గుండెపోటుతో ఆదివారం తన స్వగృహంలోనే ఆయన మరణించారన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రామారావు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో అభ్యుదయ వాదిగా మారి, వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు సాంస్కృతిక రంగాన్ని వేదికగా చేసుకున్నారు. నాటక రచయితగా, దర్శకుడిగా అనేక ప్రదర్శనలిచ్చారు. ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు, ఇల్లాలు, అమ్మోరు తదితర సినీమాలకు సహాయ దర్శకుడిగా చేస్తూ పలు సినీమాలకు సంభాషణలు రాశారు. మరణానంతరం తన శరీరం వైద్య విద్యార్థుల పరిశీలనకు ఉపయోగపడాలనే ఆయన ఆశయం మేరకు పార్థివ దేహాన్ని న్ని వైద్య కళాశాలకు అందజేశామని రామారావు కుమార్తెలు తెలిపారు. -
డాక్టర్ తరపట్లకు జాతీయ సాహితీ పురస్కారం
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఆచార్యునిగా పనిచేస్తున్న డాక్టర్ తరపట్ల సత్యనారాయణ అందిస్తున్న సాహితీ సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జాబిలి మాసపత్రిక జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జాబిలి తృతీయ వార్షికోత్సవంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్, మాజీ ఉపకులపతి ఆచార్య కె.ఇనాక్, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ, జాబిలి వ్యవస్థాపకుడు జయచంద్ర చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ‘భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి, జానపద విజ్ఞాన పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తూ కళలను కాపాడండి, కళాకారులను బతికించండి’ అనే నినాదంతో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, శతకవి సమ్మేళనాలు, పరిశోధనా శిబిరాల నిర్వహణ, పుస్తక రచన డాక్టర్ సత్యనారాయణకు ఈ çపురస్కారాన్ని తెచ్చిపెట్టాయి. ఇలాంటి పురస్కారాలు కవి, రచయితలకు కర్తవ్యాన్ని గుర్తు చేయడంతోపాటు బాధ్యతను మరింతగా పెంచుతాయని డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆ చా ర్య ఎ.నరసింహారావు, పలువురు అధ్యాపకులు సత్యనారాయణభినందించారు. -
యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : సమాజం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహనీయుడు, త్యాగశీలి స్వామి వివేకానందుడని ఆదికవి నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. నాటికి, నేటికి, ఏనాటికైనా ఆయన యువతకు సూర్ఫి ప్రదాతగా నిలుస్తారన్నారు. సాంస్కృతిక సేవా సంస్థ ఫిలాంత్రోఫిక్ సొసైటీ, నన్నయ వర్సిటీలు సంయుక్తంగా సోమవారం ఇక్కడ నిర్వహించిన యువజనోత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారతీయుల తోజోమయుడు, అఖండంగా ప్రకాశించే సూర్యుని వంటి వాడు వివేకానందుడని ప్రముఖ న్యాయవాది చింతా పద్మారావు అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఆధ్యాత్మికవేత్తని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాష్ట్రంలో సామాజిక సేవలందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలను గుర్తించి, వారికి ‘హుమానిటేరియ¯ŒS ఆఫ్ ఇండియా’ అవార్డులను అందజేసి, గౌరవించారు. ఫిలాంత్రోఫిక్ సొసైటీ ప్రతినిధి అద్దంకి రాజాయోనా, నన్నయ వర్సిటీ అధ్యాకులు ఎస్.టేకి, ఎ.మట్టారెడ్డి, విజయనిర్మల, నిట్టల కిరణ్చంద్ర, ఎం.భాస్కరరావు, జానకీరావు, కేవీఎ¯ŒSడీ వరప్రసాద్ పాల్గొన్నారు. -
ఫ్లెడ్లైట్ల వెలుగులో కోడి పందాలు
ఆకస్మాత్తు దాడుల్లో పట్టుబడిన 17 మంది పందెగాళ్లు సమాచారమిస్తే జూదాలను అడ్డుకుంటామన్న పోలీసులు రాజానగరం : కోర్టులు ఆదేశించినా, పోలీసులు చర్యలు చేపట్టినా సంక్రాంతి ప్రత్యేక సంబరం కోడి పందేలు నిరాటంకంగా సాగుతున్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతమైన రాజానగరం మండలం, దివా¯ŒSచెరువు శివారు శ్రీరామపురంలో కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు ఆకస్మికదాడులు చేశారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్, ఏజీఎస్ పార్టీలు స్థానిక పోలీసులతో కలిసి శనివారం అర్థరాత్రి నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పి.నారాయణరావు ఆదివారం ఇక్కడ విలేకరులకు వివరించారు. 17 మంది అరెస్టు.. కోర్టు తీర్పును అతిక్రమిస్తూ, జీవహింసను ప్రేరేపించేలా శ్రీరామపురంలోని సంగిశెట్టి బుజ్జికి చెందిన తోటలో కోడి పందేలు ఆడుతున్న 17 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి ఏడు కోడిపుంజులు, 22 కోడి కత్తులు, 14 సెల్ఫోన్లు, రూ. 84,150 లు నగదు, ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనపర్చుకున్నామన్నారు. దొరికిన ఏడు కోళ్ల కాళ్లకు కత్తులు కట్టిఉన్నాయన్నారు. అరెస్టయిన కొత్తపల్లి సుజనారావు, పామర్తి రాంబాబు, అంకం వీరబాబు, రాగల ప్రసాద్, రౌతుల వెంకటేష్, ఒగ్గేస లోవరాజు, ఉర్రింకల కృష్ణ, కస్తూరి మణికంఠ, అడపా ప్రకాష్, సంగుల సత్తిబాబు, మారిశెట్టి వెంకటేశ్వర్రావు, వల్లూరి పోతురాజు, ఎం. లోవరాజు, సంగిశెట్టి బుజ్జి, సీహెచ్. శ్రీనివాస్, అసర నానిరత్నం, నల్లమోలు దుర్గారావు శ్రీరామపురం, దివా¯ŒSచెరువు, పిండింగొయ్యిలకు చెందిన వారన్నారు. ఏపీజీ యాక్ట్ సెక్ష¯ŒS11, ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రూయాల్టీ యాక్ట్ 1960 ప్రకారం అరెస్టు చేసిన వీరిని కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు. వీరిపై హిస్టరీ షీట్ ఓపె¯ŒS చేస్తామన్నారు. కాగా వీరి పందాల వల్ల గాయాలై రక్తం కారుతున్న కోళ్లకు పశువైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తామన్నారు. సమాచారమిస్తే గోప్యంగా ఉంచుతాం సంక్రాంతి సంబరాలలో కోడి పందాలను నిర్మూలించడంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ నారాయణరావు విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్తో కోడి పందాలు ఆడుతుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వీటితోపాటు పేకాట, గుండాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియజేయవచ్చన్నారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ ఫో¯ŒS నంబరు 9440796502, స్పెషల్ బ్రాంచ్ ఫో¯ŒS నంబర్లు 0883–2427166, 0883–2427155లకు తెలియజేయవచ్చన్నారు. -
కుమారుడు మాట వినలేదని తండ్రి ఆత్మహత్య
రాజానగరం : కొడుకు తన మాట వినలేదన్న కోపంతో ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన బొడ్డుపాటి కృష్ణ అనే రాధాకృష్ణ (38) తాపీ పని చేస్తుంటాడు. రాజానగరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడిని తనతోపాటు కూలీకి రమ్మన్నాడు. ‘నేను చదువుకోవాలి నాన్నా.. పనికి రాలేను’ అని ఆ బాలుడు బదులివ్వడంతో తన మాట లెక్కచేయడం లేదనే కోపంతో ఆ కన్న తండ్రి ‘నేను లేకపోతే తెలుస్తుందిరా, నేనంటే ఏంటో’ అంటూ గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కోపంతో ఇంటి నుంచి వెళ్లిన కృష్ణ రాజానగరం చేరుకుని ‘కొడుకు నా మాట వినడం లేదు, నేను మందు తాగేస్తున్నా’నంటూ రాత్రి 9 గంటల సమయంలో మల్లేపల్లిలో తనకు పని ఇచ్చే తాపీ మేస్త్రి రాంబాబుకి ఫో¯ŒS చేసి చెప్పాడు. మందు అంటే మద్యం అనుకుని తేలిగ్గా తీసుకున్న రాంబాబు కొద్దిసేపటికి అనుమానం వచ్చి తిరిగి ఫో¯ŒS చేస్తే స్విచ్చాఫ్ అంటూ సమాధానం వచ్చింది. దానితో విషయాన్ని అతని భార్య, పిల్లలకు తెలియజేశాడు. రాత్రంతా అతని ఆచూకీ కోసం గాలించారు. కాని ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం ఉదయం రాజానగరంలోని నరేంద్రపురం జంక్ష¯ŒS వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో కృష్ణ కోసం గాలిస్తున్న అతని బంధువులు కూడా అక్కడకు రావడంతో ఆ మృతదేహాన్ని కృష్ణదిగా గుర్తించారు. పురుగుల మందు తాగి మరణించినట్టుగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గాశ్రీనివాసరావు తెలిపారు. మృతునికి భార్య, 15, 12 ఏళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి: జిల్లాలోని రాజానగరం మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు దివాన్ చెరువు వద్ద ఆగి ఉన్న కంటైనర్ ను ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
చెట్టును ఢీకొట్టిన ట్రాలీ
క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్ పోలీసు స్టేషన్కు ఫోన్ చేసినా స్పందన నిల్ అరగంట తరువాత వచ్చిన 108 ఈ లోగా రక్షణ చర్యల్లోకి దిగిన ‘సాక్షి’ సిబ్బంది సెక్యూరిటీలోనే ప్రాథమిక చికిత్సలు అనంతరం ఆసుపత్రికి తరలింపు రాజానగరం : విధులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు విధులు ముగించుకొని బయటకు వస్తున్న ‘సాక్షి’ సిబ్బందికి ఏడీబీ రోడ్డుపై పెద్ద శబ్ధం వినిపించింది. ముద్రణా కార్యాలయానికి కూతవేటు దూరంలో ఏదో ప్రమాదం జరిగిందని భావించిన సిబ్బంది వెంటనే స్పందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కటిక చీకట్లో సెల్ఫోన్ టార్చ్ వెలుగులో లారీ ప్రమాదానికి గురైందని గుర్తించారు. తునాతునకలైనా లారీ క్యాబిన్లో ఇరుక్కున క్లీనర్ ఆర్తనాదాలు విని సెల్ఫోన్ టార్చ్ వెలుగులోనే అక్కడకు చేరుకుని క్లీనర్ని బయటకు తీశారు. కాకినాడ పోర్టు నుంచి వస్తున్న గ్రానైట్ను రవాణా చేసే ట్రాలీ ఏడీబీ రోడ్డుపై మలుపుతిరుగుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ట్రాలీ క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ఇదే సమయంలో విధులు ముగించుకుని ‘సాక్షి’ ముద్రణాకార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఎడిటోరియల్ స్టాఫ్, మరికొందరు ఇతర విభాగాల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతంలో కరెంటు తీగలు కూడా తెగిపడి వేళాడుతుండటాన్ని గమనించి ముందుగా విద్యుత్ శాఖ ఇంజనీర్కి సమాచారం ఇచ్చారు. దానితో వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఆ శాఖ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రమాదానికి గురైన ట్రాలీ వద్దకు వెళ్లి క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్ రాజును, డ్రైవర్ కొమరయ్యను బయటకు తీశారు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడినా క్లీనర్కి మాత్రం తలకు బలమైన గాయాలై రక్తం కారుతుండటంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్పందించని పోలీసులు సంఘటనా స్థలంలో చెట్టును ఢీ కొన్న ట్రాలీ నుంచి క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్, డ్రైవర్లను బయటకు తీసేందుకు ‘సాక్షి’ సిబ్బంది తీవ్రంగా కష్టపడవలసి వచ్చింది. ఈ సమయంలో ప్రమాదం గురించి పోలీసులకు తెలియజేసేందుకు పోలీసు స్టేషనుకు ఎన్నిమార్లు ఫోన్ చేసినా అవతలి నుంచి రెస్పాండ్ లేదు. చివరకు ప్రాణాపాయస్థితిలో ఉన్న క్లీనర్, డైవర్లను బయటకు తీసి, వారి ప్రాణాలను కాపాడారు. అయితే ఈ ప్రమాదం గురించి సోమవారం ఉదయం తెలుసుకున్న సీఐ శంకర్నాయక్ దృష్టికి ఫోన్ విషయాన్ని తీసుకువెళ్లగా కొన్ని రోజులుగా పోలీసు స్టేషనులో ఫోన్ పనిచేయడం లేదన్నారు. తాను బందోబస్తు డ్యూటీలో ఉన్నానన్నారు. ప్రమాదాల నెలవు ఈ మలుపు ఏడీబీ రోడ్డు పై ‘సాక్షి’ ముద్రణా కార్యాలయానికి సమీపంలో ఉన్న మలుపు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టును కాకినాడ వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఢీ కొన్న సంఘటన మాదిరిగానే ఈ ప్రాంతంలో రెండేళ్లలో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఎక్కువగా మలుపులో వేగాన్ని నియంత్రించలేక ప్రమాదానికి గురైన వాహానాలే ఉన్నాయి. ఈ మలుపునకు అటునిటు సాఫీగా ఉంటే రహదారి ఒక్కసారిగా మలుపు తిరగడంతోపాటు ఆ మలుపును దగ్గరకు వచ్చే వరకు గమనించే వీలు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ కారణంగా నాలుగు లేన్ల రహదారిగా ఈ రోడ్డును విస్తరించే అవకాశాలున్నందున కనీసం ఆ సమయంలోనైనా ఇక్కడ ఉన్న మలుపును ప్రమాదాలకు తావులేకుండా సరిచేయాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. -
అనూర్ అభివృద్ధికి రూ. 45.28 కోట్లు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ (అనూర్) అభివృద్ధికి రూ. 45 కోట్ల 28 లక్షలు ప్రభుత్వం కేటాయించినట్టు ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ నిధుల నుంచి సై¯Œ్స కళాశాల భవనానికి రూ. 10.74 కోట్లు, ఆరŠట్స్ అండ్ కామర్స్ కళాశాల భవనానికి రూ. 10 కోట్లు, ఉమె¯Œ్స హాస్టల్ భవనానికి రూ. 6.46 కోట్లు, సై¯Œ్స విద్యార్థుల హాస్టల్ భవనానికి రూ. ఐదు కోట్లు, రోడ్లకు రూ. 7.50 కోట్లు, ప్రహరీ, గేటు ఏర్పాటుకు రూ. 3.58 కోట్లు, మంచినీటి పథకాలకు రూ. ఒక కోటి, ఇంటర్నెట్, కంప్యూటర్, వైఫై సౌకర్యాల కల్పనకు రూ. ఒక కోటి కేటాయించారన్నారు. దీంతో యూనివర్సిటీ మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఆటో ఎక్కిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
రాజానగరం (తూర్పుగోదావరి) : పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికుల ఆటో ఎక్కగా.. ఆటో డ్రైవర్ దారి మరల్చి ఇద్దరు విద్యార్థినులను ఎటో తీసుకెళ్లిపోయాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. తూర్పుగానునగూడెం వైపు వెళ్లాల్సిన ఆటో డ్రైవర్ ఇద్దరు బాలికలు ఆటో ఎక్కాక.. పెద్దాపురం వైపు తీసుకెళ్లాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
తిరుమలకు సైకిల్యాత్ర
బాలాయపల్లి : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన వేంకటేశ్వరస్వామి భక్తులు తిరుమలకు సైకిల్యాత్ర చేపట్టారు. ఆదివారం మండలంలోని వెంకటరెడ్డి గ్రామం వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని 20 ఏళ్ల నుంచి 215 మంది తిరుమలకు సైకిల్ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈసారి రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని ఈనెల 9వ తేదీన తేది సైకిల్ యాత్ర ప్రారంభించామని చెప్పారు. -
రేపు యోగా కోర్సులకు కౌన్సెలింగ్
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ద్వారా యోగా పీజీ డిప్లమో కోర్సు చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కానవరంలోని రాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ కోర్సును అందిస్తున్నామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. కౌన్సెలింగ్కి వచ్చే అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్లో పేర్కొన్న విధంగా అన్నిరకాల ధృవీకరణ పత్రాలను, ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకుని ఉదయం 10 గంటలకల్లా వర్సిటీకి చేరుకోవాలన్నారు. -
జీఎస్ఎల్లో ప్రారంభమైన ఫెలోషిప్ వర్క్షాప్
రాజానగరం : ఉదరకోశ, జీర్ణాశయ, పేగులకు సంబంధించిన వ్యాధులకు సర్జరీలు చేసే వైద్యులకు అందజేసే ఫెలోషిప్ వర్క్షాప్ స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాలలో శుక్రవారం ప్రారంభమైంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఎదురయ్యే సంక్లిష్టతలు, నివారణలు, సులువులు, రిస్కులు, సవాళ్లు తదితర 15 అంశాలపై అనుభవజ్ఞులైన వైద్యులు సోదాహరణంగా వివరించారు. ఫెలోషిప్ ఇన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గాస్ట్రో, ఎండో సర్జన్స్ ఇచ్చే ఈ ఫెలోషిప్ నిర్వహణకు ఏపీలో మొదటిసారిగా జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రులను అసోసియేషన్ ఎంపిక చేసిందని ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ సమీర్ రంజన్ తెలిపారు. సర్జన్ల వృత్తి నైపుణ్యాలను మదింపు చేయడానికి పరిపూర్ణమైన వైద్యవిజ్ఞాన సదుపాయాలు, వసతులు ఉండాలి. అటువంటి సౌకర్యాలు ఉన్నందునే జీఎస్ఎల్ని ఎంపికచేశారన్నారు. అసోసియేషన్, జీఎస్ఎల్ వైద్య కళాశాల సర్జరీ విభాగం, సిములేటర్ లేబొరేటరీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వర్క్షాపు మొదటి రోజు నిరంతర వైద్య విద్య(సీఎంఈ) కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ లకు చెందిన సుమారు 90 మంది సర్జన్లు పాల్గొన్నారు. రెండో రోజు ఫెలోషిప్ టెస్ట్ జరగనుందని, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎగ్జామినర్లుగా వ్యవహరిస్తారన్నారు. మూడో రోజు సీనియర్ వైద్యులు చేసే శస్త్ర చికిత్సలను మిగిలిన సర్జన్లు లైవ్లో చూస్తూ అనుమానాలను నివృత్తి చేసుకుంటా వారితో చర్చిస్తారని లేబొరేటరీ ఇన్చార్జ్ డాక్టర్ ఆకృతి తెలిపారు. జిల్లాకు చెందిన వైద ్య విద్య అధ్యాపకులు డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ దిలీప్సోరెన్, డాక్టర్ సుష్మ, డాక్టర్ భాస్కరచౌదరి, హైదరాబాద్కి చెందిన డాక్టర్ కోన లక్ష్మి, న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ మీనాక్షిశ ర్మ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక ్టర్ వైవి శర్మ, సూపరింటెండెంట్ డాక్టర్ టి. సత్యనారాయణ పాల్గొన్నారు. -
సల్లాపాల్ని వీడియో తీసుకున్న దంపతులు
రాజానగరం : సరదాగా తమ సరాగాలను సెల్ ఫోన్లో వీడియో తీసుకున్న ఒక జంట ఆ వీడియో మార్కెట్లో దర్శనమివ్వడంతో సిగ్గుతో చితికిపోయింది. కాగా అందుకు కారకులైన ముగ్గురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరుకు చెందిన ఒక వ్యక్తికి నల్లమందు సందులో బంగారు కొట్టు ఉంది. అతని వద్ద గాడాలకు చెందిన కర్రి బ్రహ్మాజీ పని చేస్తుండేవాడు. బంగారు కొట్టు యజమాని తన భార్యతో సరాగాలను పదిలం చేసుకోవాలన్న సరదా సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ విషయం పసిగట్టిన బ్రహ్మాజీ రెండు నెలల క్రితం యజమాని ఇంటికి వెళ్లి ఆ సెల్ ఫోన్ని కాజేశాడు. కాగా ఇటీవల ఆ ఫోన్లోని వారి సరాగాల దృశ్యాలు మార్కెట్టో కొన్నిచోట్ల ప్రత్యక్షం కావడంతో సిగ్గుతో కుంగిపోయిన ఆ దంపతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు బ్రహ్మజీతోపాటు అతని స్నేహితులు సురేష్, కిట్టులను బాధ్యులుగా గుర్తించారు. సెల్ ఫోన్ని అపహరించి, వాటిలో దృశ్యాలను తామే బయటపెట్టామంటూ వారు అంగీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై షరీప్ తెలిపారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా) : రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో దామర నవీన్(19) అనే బీ.టెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తన రూంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి నవీన్ ఓ రూంలో ఉంటూ చదువుకుంటున్నాడు. కాగా మంగళవారం కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రం కాలేజీ నుంచి రూమ్కి వచ్చిన స్నేహితులు తలుపు కొడితే తీయకపోయేసరికి బద్దలు కొట్టారు. రూంలో నవీన్ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడంతో బిత్తరపోయారు. నవీన్ మండలంలోని గోదావరి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఓ సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో ‘మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లైక్ యూ’ అని మాత్రమే రాసి ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
బురదకాలువకు గండి: గ్రామం జలమయం
-
బురదకాలువకు గండి: గ్రామం జలమయం
రాజానగరం (తూర్పుగోదావరి) : బురద కాలువకు గండి పడటంతో ఓ గ్రామం జలమయం అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని కోరుకొండ గ్రామంలో ప్రవహించే బురుద కాలువకు గండిపడింది. దీంతో గ్రామంలోని ఇళ్లు మునిగిపోయాయి. దీంతో దాదాపు ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
11 నెలల బాలుడి అపహరణ
రాజనగరం (తూర్పుగోదావరి జిల్లా) : ఇంట్లో ఉన్న 11 నెలల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలంలోని శ్రీరామ్నగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన నూకరాజు, సువర్ణ దంపతులకు 11 నెలల బాలుడు సంతానం. అయితే గురువారం బాలుడి తల్లి నీటి కోసం వెళ్లిన సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు బాలుడిని ఎత్తుకెళ్లారు. దీంతో దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఏళేశ్వరం నుంచి వలస వచ్చిన నూకరాజు దంపతులు శ్రీరామ్నగర్ కాలనీలో నివాసముంటూ కూలీ పనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
‘చాగల్నాడు’ ఉన్నా.. చేను బీడే
రాజానగరం : జిల్లాలో మెట్ట ప్రాంత పొలాలకు గోదావరి నీటిని అందించి, సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో గండి పడుతోంది. ఏడు మండలాల్లో వేలాది ఎకరాలకు నీరందించాల్సిన చాగల్నాడు ఎత్తిపోతల పథకం ఏనాడూ లక్ష్యం మేరకు ఉపయోగపడలేదు. ఏటా ఖరీఫ్లో మాత్రమే నీరిచ్చే పథకం ఆ సీజన్ అవసరాలనైనా సకాలంలో తీర్చిన దాఖలా లేదు. రైతులు ఎలాగోలా తంటాలు పడి నారుమడులు పోసుకుని, నాట్లు వేసుకున్నాక చేలు మూనతిరిగే దశలో మాత్రమే పథకం నుంచి నీరు అందుతోం ది. అంతేకాదు.. 2002లో ప్రారంభమైన నా టి నుంచి ఇప్పటి వరకూ నిర్దేశించిన ఏడు మండలాల్లో మూడింటికి ఒక్క ఎకరానికీ నీరివ్వలేదు. దీన్ని నమ్ముకుని నాట్లు వేసి నష్టపోయే కన్నా.. బీడుగా విడిచిపెడితేనే మేలని రైతులు అనుకునే పరిస్థితి దాపురించింది. పథకంలోని మూడు పంప్హౌస్లలో మోటార్లు ఎన్నడో పాడవగా గతంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. ఎన్నికల సమయంలో పథకానికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని, పాడైన మోటార్ల స్థానే కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు దాని గురించి నోరు మెదపడం లేదు. చాగల్నాడు పథకంలో కాతేరు, కోలమూరు, పాలచర్లలలో పంప్హౌస్లున్నారుు. గోదావరి నుంచి నీటిని సుమారు 48 మీటర్ల ఎత్తుకు ఈ మూడు పంప్హౌస్ల నుంచి అంచెలంచెలుగా ఎత్తిపోస్తూ ప్రధాన కాలువకు సరఫరా చేస్తుంటారు. ఒక్కో పంప్హౌస్లో మూడు చొప్పున మూడింటిలో తొమ్మిది మోటార్లు ఏర్పాటుచేశారు. ప్రతి పంప్హౌస్లో రెండు మోటార్లతో నీటిని తోడుతూ, ఒక మోటార్ను అట్టి పెడతారు. గతంలో తొమ్మిది మోటార్లూ పాడవగా ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజానగరం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరం నుంచి మూడో పంప్హౌస్ ఉన్న పాలచర్ల వరకు పాదయాత్ర చేశారు. దాంతో ఒక్కో పంప్ హౌస్లో ఒక్కో మోటారుకు అరకొర మరమ్మతులు చేసి, గత రెండేళ్లుగా తూతూమంత్రంగా పథకాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పెందుర్తి అధికారపక్షం ఎమ్మెల్యేగానే కాక శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. పాడైన మోటార్ల స్థానే కొత్తవి ఏర్పాటు చేరుుంచాల్సిన బాధ్య త ఆయనపై ఉందని రైతులంటున్నారు. ఇదీ ఆయకట్టు.. ఈ ఎత్తిపోతలతో చాగల్నాడు ప్రాంతంలోని రాజమండ్రి రూరల్ మండలంలో 1,151, కోరుకొండలో 1,666, రాజానగరంలో 8,875, రంగంపేటలో 13,548, బిక్కవోలులో 4,975, అనపర్తిలో 2,439, మండపేటలో 1,654 ఎకరాల కు నీటిని అందించవలసి ఉంది. కానీ రాజమండ్రి రూరల్లో 200, కోరుకొండలో 300, రాజానగరంలో ఏడు వేలు, రంగంపేటలో 2,500 ఎకరాలకు మాత్రమే అందిచగలుగుతున్నారు. ఈ ఏడాది అది కూడా జరగలేదు. బిక్కవోలు, అనపర్తి, మండపేట మండలాల్లో పిల్లకాలువలను ఏర్పాటు చేసినా వాటిలోకి ఏనాడు నీరు వచ్చిన జాడ లేదు. సిబ్బందీ అంతంత మాత్రమే.. ఈ పథకం సమర్థంగా అమలు జరగకపోవడానికి సిబ్బంది కొరత కూడా ఒక కారణం. పథకం ప్రారంభంలో 58 సిబ్బంది ఉండగా ప్రస్తుతం 10 మందే పనిచేస్తున్నారు. మిగి లిన వారిని ఇతర పథకాలకు బదలాయిం చారు. సంబంధిత ఇంజనీర్ను దీనిపై వివర ణ కోరగా సిబ్బంది లేకపోవడమే మో టా ర్లు త్వరగా పాడవడానికి ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం ఈ పథకానికి ఏవిధమైన నిధులూ మంజూరు కాలేదని, సింగిల్ మో టార్లతోనే ఖరీఫ్కి నీళ్లు ఇస్తామని చెప్పారు. -
అక్రమాలకు రాచబాట..లంక మేట
రాజానగరం :గోదావరిలో ఇసుక తవ్వకాలపై ఆంక్షలున్నా సీతానగరం మండలంలో అవి చిరుఅల పాటి చెయ్యవు. ఈ ప్రాంతం నుంని నిత్యం వందలాది ఆవహనాల్లో ఇసుక జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు విశాఖ, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు కూడా యధేచ్ఛగా తరలిపోతోంది. నిత్యం లక్షలాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న ఈ ఇసుక మాఫియాను నిరోధించడం అటుంచి ఇసుకను తరలించే వాహనాల తాకిడికి రోడ్లు పాడైనా, ప్రజల కళ్లలో ఇసుక కొట్టినా పట్టించుకునే వారే లేరు. ‘దొంగ ఇసుక’ తెచ్చే కష్టాలను భరించలేని ప్రజలు ఆందోళనలు చేపట్టినా ప్రయోజనం ఉండటం లేదు. అధికార, ప్రతిపక్షాలు ఏకపక్షంగా సాగిస్తున్న ఈ ఇసుక దందాను నిరోధించవలసిన అధికారులు ముడుపులు మెక్కి మిన్నకుంటున్నారు. మండలంలో పురుషోత్తపట్నం, వంగలపూడి, రామచంద్రాపురం, సీతానగరం, ముగ్గళ్ల, ఇనగంటివారిపేట, వెదుళ్లపల్లి, ుునికూడలి, కాటవరం, బొబ్బిలిలంక, ములకల్లంక, శింగవరం, ర ఘుదేవపురంల లోని లంక భూముల్లో కొందరు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఆ భూముల్లో వేసిన ఇసుక మేటలని తొలగించే నెపంతో ఇసుక తరలింపునకు అనుమతులు పొందుతున్నారు. ఇసుక మేటల్ని తొలగిస్తే పం టలు బాగా పండుతాయన్న వ్యవసాయశా ఖ మాట అనుమతులకు సాకుగా మారు తోంది. తమ పట్టా భూముల్లో ఇసుక తీత కు అనుమతులు పొందుతున్న రైతుల నుం చి గుత్తేదార్లు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు చెల్లించి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగిస్తున్నారు. ఈ అనుమతుల మాటునే అనుమతులు పొందని భూముల నుంచి, గోదావరి గర్భం నుంచి ఇసుకను తవ్వేస్తూ కోట్లు గడిస్తున్నారు. మండలంలోని ఏటిపట్టు గ్రామాలన్నీ ఇసుక రవాణాకు నెలవులుగా మారడంతో రోజుకు వెయ్యి నుంచి 2000 లారీల ఇసుక రవాణా జరుగుతోంది. విశాఖ, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు కూడా ఇసుక తరలిపోతోంది. లారీల వరకు ఇసుకను చేరవేసేందుకు కొందరు అప్పటికప్పుడు మినీవ్యాన్లు కొనుగోలు చేశారంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. పల్లెల్లో రేగుతున్న వర్గచిచ్చు... వివిధ గ్రామాల్లో ఇసుక రవాణాతో లబ్ధి పొందుతున్న వారు, దానివల్ల ఇబ్బందులు పడుతున్న వారు వర్గాలుగా చీలి ఘర్షణ పడుతున్నారు. ములకల్లంక, బొబ్బిలిలంక వాసుల మధ్య శుక్రవారం వివాదం తలెత్తింది. ‘లంకభూముల్లోని బొండు మట్టి (గోదారి ఇసుక)ని తరలిస్తుంటే మీకేంటి అభ్యంతరమని ఒక వర్గం, ఇసుక తరలింపుతో రోడ్లు పాడవుతున్నాయని మరోవర్గం వాదనకు దిగారు. టెంట్లు వేసి ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసు కేసులు నామమాత్రమే.. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇటీవల కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే విమర్శలను తప్పించుకునేందుకు నామమాత్రంగానే ఈ కేసులు నమోదు చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక ర్యాంపును అధికారులు తనిఖీలు చేసి, అనధికారికంగా ఉన్న ఇసుక నిల్వలను స్వాధీనపర్చుకోవడం, వాటికి పోలీసు పహారా ఏర్పాటు చేయడం కూడా నాటకంలో భాగమేనంటున్నారు. ఒక్కోసారి పట్టుబడిన వారికి రూ.వెయ్యి నామమాత్రపు జరిమానా వేసి వదిలేస్తున్నారని అంటున్నారు. అదేమంటే రాజకీయ ఒత్తిడులంటున్నారని విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం ఎంపీడీఓ, తహసీల్దారు, పోలీసు, గనులశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు వేసింది. అయినా అధికార పార్టీ పెద్దల అండదండలతో ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. అధికారులకు మామూళ్లు అందడంతో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మా మూళ్లు ముట్టని సందర్భాల్లో ఇసుక రవాణాను అడ్డుకుంటున్నట్టు హడావిడి చేస్తున్నారని, అవతలి వ్యక్తులు చేతులు తడపగానే చేతులు ముడుచుకుంటున్నారు. ఆందోళనలు అరణ్యరోదనలే.. ఇసుక రవాణాతో శింగవరం సమీపంలో ఏటిగట్టుతోపాటు, సీతానగరంలో ప్రధాన రహదారి పూర్తిగా పాడైంది. ఇసుక లారీలు, ట్రా క్టర్లు ప్రయాణికుల కళ్లల్లో దుమ్ము కొడుతూ, ఇసుకెత్తి పోస్తున్నాయి. డ్రైవర్లు వాహనాలను జోరుగా నడపడంతో దుమ్ములేచి వెనుక వచ్చే వాహనాల ప్రయాణానికి ఇబ్బందిగా మారుతోంది. ఇసుక వాహనాలతో ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయినాఅధికారులకు చీమ కుట్టినట్టుండటం లేదని, తాము చేసే ఆందోళనలు అరణ్యరోదనగానే మిగిలి పోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. -
అలసత్వంపై ఆగ్రహం
లాలాచెరువు (రాజానగరం), న్యూస్లైన్ :ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సంబంధిత సిబ్బందిని హెచ్చరించారు. రాజానగరం, రాజమం డ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్లలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆమె పరిశీలించారు. లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, హుకుంపేట, బొప్పన సావిత్రమ్మ హైస్కూల్, దానవాయిపేటలోని నివేదిత కిశోర్ తెలుగు మీడియం స్కూళ్లలోని పోలింగ్ బూత్ల వద్ద జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. లాలాచెరువులో ఓటర్ల నమోదు ప్రక్రియ పోలింగ్ బూత్ల వద్ద కాక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించడంపై అక్కడి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజానగరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఉదయం 11.30 గంటల వరకు బూత్ లెవెల్ అధికారితోపాటు ఇతర సిబ్బంది ఎవ్వరు లేకపోవడాన్ని గమనించారు. ఇదే విధంగా చాలా చోట్ల బూత్ స్థాయి అధికారులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. లాలాచెరువు బూత్ లెవెల్ అధికారిని, ఆర్ఐని సస్పెండ్ చేయాలని అక్కడే ఉన్న రాజమం డ్రి ఆర్డీఓ నాన్రాజును ఆదేశించారు. విధులకు రాని వారికి కూడా వెంటనే మెమోలు జారీ చేయమని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించే సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాజానగరం ఆర్వోపై కమిషన్కు ఫిర్యాదు.. రాజానగరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. అలాగే అనపర్తి, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ను ధిక్కరించవద్దని, యంత్రాంగం నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. రోడ్లపై ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీలు లేకుండా తొలగించాలన్నారు. ఈ విషయమై మరింత శ్రద్ధ వహించాలని రాజానగరం తహశీల్దారుకు సూచించారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్.మార్కండేయులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కోటగుమ్మం(రాజమండ్రి) : ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో ఆదివారం ఓటరు నమోదును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దానవాయిపేలోని నివేదిత కిశోర్ విహార్ తెలుగు మీడియం స్కూల్లో నిర్వహిస్తున్న ఓటరు నమోదును తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజానగరం ఓటరు నమోదు కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజానగరం రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనపర్తి, రాజమండ్రి అర్బన్ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని అన్నారు. రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ పి. మార్కెండేయులు, రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి వర్దనపు నాన్రాజ్, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
నేటి నుంచి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు
దివాన్చెరువు (రాజానగరం), న్యూస్లైన్ : ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్ కాస్ట్) ఆధ్వర్యంలో 21వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ) రాష్ట్ర స్థాయి పోటీలు ఆది, సోమవారాల్లో దివాన్చె రువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్లో జరుగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముంబైకి చెందిన హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ సుధాకర్ సి. అగార్కర్ రానున్నారని సభ్య కార్యదర్శి వై. నగేష్కుమార్ శనివారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల నుండి 250 మంది బాల శాస్త్రవేత్తలు పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో 1769 ప్రాజెక్టులను బాలలు ప్రదర్శించగా, వాటిలో 112 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీటిలో 17 ప్రాజెక్టులను ఎంపిక చేసి 27 నుండి 31వ తేదీ వరకు భోపాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. -
కన్నవారికి కడుపుకోత
రాజానగరం/సీతానగరం/ పెరవలి (పశ్చిమ గోదావరి), న్యూస్లైన్ : స్నేహితులతో కలిసి అన్నవరం పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తానంటే సరేనన్న వారి తల్లిదండ్రులకు తీరని శోకమే మిగిలింది. సీతానగరం మండలం బొబ్బిల్లంక-మిర్తిపాడు వద్ద తొర్రిగడ్డ కాలువలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. మృతులను పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారి పాలేనికి చెందిన దిడ్ల సందీప్(19); తూర్పు గోదావరి జిల్లా కడియపులంకకు చెందిన పాటంశెట్టి రామయ్య (19), సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన పిండి వీరజయకృష్ణ(19)గా గుర్తించారు. డ్రైవర్ లేకుండా.. ఈ ముగ్గురు విద్యార్థులూ రాజమండ్రి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. దసరా సెలవులు కావడంతో ఈ నెల 11న అన్నవరం వెళ్లాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు నల్లాకులవారిపాలెంలోని తన ఇంటి నుంచి దిడ్ల సందీప్ అద్దె టాక్సీలో బయలుదేరాడు. కారు సొంతంగా నడుపుతూ రాజమండ్రిలోని నారాయణ కాలేజి హాస్టల్ వద్దకు వెళ్లాడు. అక్కడ తన స్నేహితులైన రామయ్య, జయకృష్ణలను ఎక్కించుకుని బయలుదేరాడు. రఘుదేవపురంలోని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నామని జయకృష్ణ చెప్పాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు బొబ్బిల్లంక సమీపంలో ఓ బైక్ను ఢీకొంది. దీంతో ఆందోళన చెందిన వీరు రాజమండ్రి-సీతానగరం ప్రధాన రోడ్డులో కాకుండా అడ్డదారిలో రఘుదేవపురం పయనమయ్యారు. మార్గమధ్యంలో శిథిలమైన వంతెన వద్ద కారు ప్రమాదానికి గురైంది. పై-లీన్ తుపాను కారణంగా కాలువ ఉధృతంగా ఉండడంతో కారు కొట్టుకుపోయింది. కారు నుంచి వారి మృతదేహాలు సుమారు అర కిలోమీటరు దూరం కొట్టుకుపోయాయి. మత్స్యకారుల వలతో వెలుగులోకి.. బొబ్బిల్లంక సమీపంలోని తొర్రిగడ్డ కాలువలో నిత్యం చేపలు పట్టే మత్స్యకారుల వలకు ఆదివారం కారు చిక్కుకోవడంతో ఈ ప్రమాద విషయం వెలుగు చూసింది. కాలువలో బయటపడ్డ కారులో ఈ మృతదేహాలను కనుగొన్న స్థానికులు.. సీతానగరం పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ జి.మురళీకృష్ణ, సీఐ వైవీ రమణ తమ సిబ్బంది, స్థానికుల సహకారంతో కారును బయటకు లాగి, మృతదేహాలను వెలికితీశారు. కారు ఉన్న ప్రదేశానికి అర కిలోమీటరు దూరంలో తొర్రిగడ్డ స్లూయిజ్ వద్ద ఈ ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. నంబరును బట్టి కారును పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రైవేట్ టాక్సీగా గుర్తించారు. దానిని సందీప్ అద్దెకు తీసుకున్నట్టు తెలిసిందని, కారులో ఉన్న నారాయణ కాలేజికి సంబంధించిన పేపర్లను బట్టి వారు ఆ కాలేజి విద్యార్థులుగా గుర్తించామని సీఐ వైవీ రమణ తెలిపారు. వారం రోజులు పైగా కాలువ నీటిలో నానిపోయి, కుళ్లిపోయిన ఆ మృతదేహాలను చూసి స్థానికులు సైతం తల్లడిల్లిపోయారు. అన్నవరం వెళ్లి వస్తామంటూ బయలు దేరిన ఈ ముగ్గురూ మరణంలో కూడా స్నేహాన్ని వీడలేదంటూ సహ విద్యార్థులు క న్నీటి పర్యంతమయ్యారు. అన్నవరం వెళ్తున్నానని.. కడియం : మండలంలోని బుర్రిలంకకు చెందిన పాటంశెట్టి రామయ్య కుటుంబం వ్యాపారం నిమిత్తం కడియం శ్రీనగర్ కాలనీలో అద్దెకుంటున్నారు. 11న కాలేజి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన రామయ్య అదే రోజు సాయంత్రం ఇద్దరు స్నేహితులతో పాటు అన్నవరం వెళుతున్నట్టు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అప్పటి నుంచి సెల్ఫోన్ పనిచేయకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో కడియం పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే రామయ్య తండ్రి శ్రీనివాసు, తల్లి కుమారి, బంధువులంతా సంఘటన స్థలానికి తరలివెళ్లారు. శ్రీనివాసరావుకు రామయ్యతో పాటు టెన్త్ చదువుతున్న చిన్న కుమారుడు అఖిలేష్ ఉన్నాడు. సందీప్ తండ్రి మిలట్రీలో ఉద్యోగం చేస్తూ మరణించగా, మిలట్రీ కోటాలో తల్లి సారమ్మకు గ్యాస్ ఏజెన్సీ మంజూరైంది. పెరవలిలో రెండేళ్ల క్రితం ఏజెన్సీని ఏర్పాటు చేశారు. సారమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భోజనానికి వెళ్తున్నానని చెప్పిన కుమారుడు మరణించడంతో రఘుదేవపురంలో జయకృష్ణ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.