Reliance Group
-
రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న దర్శన్ మెహతా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రిలయన్స్ బ్రాండ్స్ వ్యాపారంలో భాగమైన ఆయన రిలయన్స్ గ్రూప్లో మెంటార్గా ఉండబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తదుపరి తరం నాయకులకు మెహతా మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్లో వ్యాపార అవకాశాలను విశ్లేషించడానికి, కొత్త వాటిని అన్వేషించడానికి కూడా ఆయన సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. మెహతా రిలయన్స్ బ్రాండ్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. రిలయన్స్ బ్రాండ్స్ మొదటి ఉద్యోగుల్లో మెహతా కీలక వ్యక్తిగా ఉన్నారు. 2007లో రిలయన్స్ బ్రాండ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన అరవింద్ బ్రాండ్స్ వంటి కంపెనీల్లో పని చేశారు. విలాసవంతమైన, ప్రీమియం విభాగాల్లో రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మెహతా కృషి చేశారు.ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్గడిచిన కొన్నేళ్లుగా రిలయన్స్ బ్రాండ్స్ అనేక గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బాలెన్సియాగా, జిమ్మీ చూ, బొట్టెగా వెనెటాతో సహా 90 కంటే ఎక్కువ బ్రాండ్లు రిలయన్స్ గ్రూప్తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ స్వదేశీ డిజైనర్ బ్రాండ్లను కూడా పరిచయం చేస్తోంది. మెహతా అనంతరం రిలయన్స్ బ్రాండ్కు కొత్త ఎండీని నియమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి రిలయన్స్ బ్రాండ్లను పర్యవేక్షిస్తూ సీనియర్ ఎగ్జిక్యూటివ్లుగా ఉన్న వికాస్ టాండన్, దినేష్ తలూజా, ప్రతీక్ మాథుర్, సుమీత్ యాదవ్లతో కోర్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
అనిల్ అంబానీ భారీ ప్లాన్..
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్ని (ఆర్జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్గా ఉపయోగపడనుంది.సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆర్కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ.. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ! -
అనిల్ అంబానీ కంపెనీలకు సెబీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన కంపెనీల్లో రుణ భారాన్ని తగ్గించుకుని తిరిగి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించారు. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ పవర్ అయితే ఇటీవల పూర్తిగా రుణరహితంగా మారింది. అయినప్పటికీ ఆయనకు కొన్ని కష్టాలు తప్పడం లేదు.కంపెనీ నుండి నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు డిమాండ్ నోటీసులు పంపింది. రూ. 154.50 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. గత ఆగస్టులో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ సంస్థలు విఫలమవడంతో తాజాగా డిమాండ్ నోటీసులు వచ్చాయి.15 రోజుల్లో చెల్లించాలిఈసారి 15 రోజుల్లోగా చెల్లించకపోతే ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేస్తామని సెబీ ఈ సంస్థలను హెచ్చరించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్), రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్జెన్ లిమిటెడ్ ఉన్నాయి.ఆరు వేర్వేరు నోటీసులలో ఈ ఆరు సంస్థలను ఒక్కొక్కటి రూ. 25.75 కోట్లు చెల్లించాలని మార్కెట్స్ నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఇందులో వడ్డీతోపాటు 15 రోజులకూ రికవరీ ఖర్చులను జోడించింది. బకాయిలు చెల్లించని పక్షంలో, మార్కెట్ రెగ్యులేటర్ ఈ సంస్థల స్థిర, చరాస్తులను అటాచ్ చేసి విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకు ఖాతాల అటాచ్మెంట్ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
పడిన కెరటం తప్పకలేస్తుంది. అలాగే పరాజయం పాలైన ప్రతిఒక్కరికీ తమదైన రోజు తప్పక వస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన అనిల్ అంబానీ వరుస వైఫల్యాలతో నష్టాలు, అప్పులతో చీకటి రోజులను చవిచూశారు. ఇప్పుడాయనకు మంచి రోజులు వచ్చాయి. ఒక్కో కంపెనీ అప్పుల ఊబిలోంచి బయట పడుతోంది. వ్యాపార సామ్రాజ్యం తిరిగి పుంజుకుంటోంది.టాప్ టెన్ సంపన్నుడుఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా 2008లో 42 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడిగా ఉండేవారు. తర్వాత ఆయన అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ రూ.24,000 కోట్ల విలువైన బాండ్లను చెల్లించలేక రిలయన్స్ క్యాపిటల్ 2021లో దివాళా తీసే వరకూ వచ్చేశారు.వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీని చూసి చాలా మంది ఇక ఆయన పుంజుకోలేడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఎన్ని వైఫల్యాలు ఎదురైనా దృఢనిశ్చయంతో ముందుకు సాగిన అనిల్ అంబానీ అద్భుతమైన పునరాగమనం చేస్తున్నారు.కలిసొచ్చిన సెప్టెంబర్ఈ ఏడాది సెప్టెంబర్ నెల రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి అనుకూలమైనదిగా మారుతోంది. ఎందుకంటే 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. రిలయన్స్ పవర్ భారీ ఆర్డర్ను అందుకుంది. దాని షేర్లను పెంచుకుంది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ రహితం దిశగా వేగంగా కదులుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నుండి అనుకూలమైన వార్తలను అందుకుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?అనిల్ అంబానీకి పెద్ద ఊరటగా కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చేసిన అంచనా ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్పై బకాయిలను క్లెయిమ్ చేయాలని రాష్ట్ర పన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టిందని వార్తా సంస్థ తాజాగా నివేదించింది.అనిల్ అంబానీ నెట్వర్త్తన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీల పురోగతితో అనిల్ అంబానీ నెట్వర్త్ కూడా పుంజుకుంటోంది. నిధుల చేరిక ఫలితంగా ఇటీవలి ఫైలింగ్ల ప్రకారం.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ రూ. 9,000 కోట్ల నుండి రూ. 12,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా 2023 ఫిబ్రవరిలో నివేదించినదాని ప్రకారం.. అనిల్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 20,000 కోట్లు. -
హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పుల భారం భారీగా తగ్గింది. గ్రూప్లోని రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారింది. అలాగే మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన రుణాన్ని 87 శాతం తగ్గించుకుంది.ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర రుణదాతల బకాయిలను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసింది. మొత్తం బాకీ తీర్చేందుకు ఒక్క ఎల్ఐసీకే రూ.600 కోట్లు చెల్లించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్, ప్రెస్ స్టేట్మెంట్లలో రిలయన్స్ ఇన్ఫ్రా తమ స్వతంత్ర బాహ్య రుణం రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తత్ఫలితంగా కంపెనీ నికర విలువ రూ. 9,041 కోట్ల వద్ద నిలిచింది.ఈ వార్తలు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ధర బుధవారం 20 శాతం పెరిగింది. రూ.47.12 పెంపుతో రూ.282.73 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 18 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.11189 కోట్లకు చేరుకుంది. ఇక ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రూ. 385 కోట్లతో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి ఆ కంపెనీతో వన్-టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ సెటిల్మెంట్ సెప్టెంబర్ 30లోపు పూర్తికానున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!అలాగే ఎడిల్వీస్కు చెల్లించాల్సిన మరో రూ.235 కోట్ల అప్పును కూడా రిలయన్స్ ఇన్ఫ్రా సెటిల్ చేసుకుంది. ఇందులో భాగంగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని తర్వాత రెండు కంపెనీలు పరస్పర మధ్యవర్తిత్వ దావాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. -
అనిల్ అంబానీ కంపెనీలు.. వ్యాపార సామ్రాజ్యం ఇదే..
అంబానీ సోదరులు అనగానే అందరికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీయే గుర్తొస్తారు. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన అనిల్ అంబానీ (Anil Ambani ) గురించి, ఆయనకున్న కంపెనీలు, వ్యాపార సామ్రాజ్యం గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది.ఎప్పుడూ నష్టాలతో వార్తల్లో నిలిచే అనిల్ అంబానీ ఇటీవల రిలయన్స్ పవర్తో బలమైన పునరాగమనం చేశారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది. రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని తీర్చేసింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్, పవర్ జనరేషన్ వంటి రంగాల్లో వైవిధ్యమైన వ్యాపారాలను కలిగి ఉంది. 2006లో రిలయన్స్ గ్రూప్ విడిపోయిన తర్వాత ఈ గ్రూప్ ఏర్పాటైంది. 2002 జూలై 6న ధీరూభాయ్ అంబానీ మరణించిన తరువాత, అప్పటి 15 బిలియన్ డాలర్ల సమ్మేళనం ఇద్దరు సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య విడిపోయింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ ఇవే..» రిలయన్స్ కమ్యూనికేషన్స్: మార్కెట్ క్యాప్ రూ.335 కోట్లు. షేరు 52 వారాల కదలిక రూ.2.49 గరిష్టాన్ని, రూ.1.01 కనిష్టాన్ని సూచిస్తుంది. షేరు ప్రస్తుత ధర రూ.1.93.» రిలయన్స్ హోమ్ ఫైనాన్స్: మార్కెట్ క్యాప్ రూ.132 కోట్లు. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.4.05గా ఉంది. 52 వారాల కదలిక రూ .5.80 గరిష్టాన్ని, రూ .1.70 కనిష్టాన్ని సూచిస్తుంది.» రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: మార్కెట్ క్యాప్ రూ.4,876 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ప్రస్తుత ధర రూ.202.99. షేరు 52 వారాల కదలికలు రూ.308 గరిష్టాన్ని, రూ.134 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.» రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్: మార్కెట్ క్యాప్ రూ.155 కోట్లు. కంపెనీ నౌకా నిర్మాణంలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.2.3గా ఉంది.» రిలయన్స్ పవర్: మార్కెట్ క్యాప్ రూ.4,520 కోట్లు. రిలయన్స్ పవర్ ప్రస్తుత ధర రూ.31.08గా ఉంది. షేరు 52 వారాల కదలికలు రూ.34.45 గరిష్టాన్ని, రూ.13.80 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు! -
భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..?
అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రధానంగా కరెంట్ అవసరాలు కూడా పెరుగుతాయి. ఇండియా 2027 నాటికి దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల ఎనానమీ మార్కును తాకనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు పారిశ్రామిక రంగం ఎంతో చేయూతనందిస్తుంది. అయితే దానికి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. దాంతోపాటు దాదాపు అన్ని రంగాల్లో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ దాని తయారీకి ప్రభుత్వాలు, యంత్రాంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. సమర్థంగా కరెంట్ తయారు చేసి వినియోగించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో అణు విద్యుత్కే పెద్దపీట వేస్తున్నారు. అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అణు విద్యుదుత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. అణు విద్యుత్ వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు. ప్రస్తుతం చూస్తే, దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 2% కంటే తక్కువగానే ఉంది. అందుకే తొలిసారిగా ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెబుతున్నారు. దేశ విద్యుత్తు ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42% కాగా, దీనిని 2030 కల్లా 50 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ కంపెనీలతో చర్చలు అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల వల్లే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, వేదాంతా, టాటా పవర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది. ఒక్కో సంస్థ సుమారు రూ.44,000 కోట్ల (5.30 బిలియన్ డాలర్లు) వరకు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఏడాదికాలంగా ఈ సంస్థలతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. 1.300 మెగావాట్ల సామర్థ్యం పెరిగే అవకాశం.. ప్రస్తుతం దేశంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్లాంట్లను ఎన్పీసీఐఎల్ నిర్వహిస్తోంది. మరో 1,300 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెడితే, 2040 కల్లా 11,000 మెగావాట్ల మేర అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని అంచనా. -
అపార వనరులు.. యువ నాయకుడు: ముఖేష్ అంబానీ
(విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి, ప్రతినిధి): దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడుల సదస్సుకు ఎన్నడూ హాజరు కాని రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈ సదస్సు కోసం 5 గంటలకు పైగా సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించడమే కాకుండా రాష్ట్రంలోని అపార వనరులు, సీఎం వైఎస్ జగన్ పాలన దక్షత, యువ నాయకత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. అపార వనరులు కలిగి ఉండటం ఒక వరమని, ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ను నెలకొల్పనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. జీఐఎస్ సదస్సులో ముఖేష్ అంబానీ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే... బ్లూ ఎకానమీ (సముద్ర వాణిజ్యం)లో సాగరమంత అవకాశాలను కల్పిస్తూ రాష్ట్రం స్వాగత ద్వారాలు తెరిచింది. రెన్యువబుల్ ఓషన్ ఎనర్జీ, సముద్ర ఖనిజాలు, మెరైన్ బయోటెక్నాలజీ రంగాల్లో చాలా అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా, ఎంత వేగంగా విస్తరిస్తోందో అదేవిధంగా సీఎం వైఎస్ జగన్ యువ నాయకత్వం, దార్శనికతతో వృద్ధి రేటు, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన రాష్ట్ర యువత, అధికారులకు శుభాకాంక్షలు. నూతన భారత దేశ వృద్ధిలో ఏపీ ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం ఇక్కడ యువత, వ్యాపారవేత్తల్లో ధృడంగా కనిపిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్లోని అపార అవకాశాలను గుర్తించి చమురు, గ్యాస్ రంగంలో 2002లో అడుగుపెట్టాం. రూ.1,50,000 కోట్లకుపైగా పెట్టుబడులను కేజీ డి–6 అసెట్స్పై పెట్టాం. భవిష్యత్తులో దేశ సహజవాయువు ఉత్పత్తిలో 30% కేజీ డి–6 నుంచే వస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంత కీలకమో చెప్పేందుకు ఇదే నిదర్శనం. జియో సేవలకు సంబంధించి రాష్ట్రంలో టెలికాం విస్తరణ కోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 98 శాతం 4జీ నెట్వర్క్ కవర్ చేసింది. ఇప్పుడు ట్రూ 5జీ సేవలను 2023 చివరి నాటికల్లా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తాం. 5జీ రాకతో రాష్ట్రంలో డిజిటల్ విప్లవం అన్ని రంగాల్లో వృద్ధికి దోహదం చేస్తుంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ► ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా సారవంతమైన భూములు, సహజ వనరులు, నైపుణ్యం, విశిష్ట సంస్కృతి ఉన్నాయి. విశాఖలో అందమైన బీచ్లున్నాయి. అధిక ఆదాయాన్ని అందించే కృష్ణా, గోదావరి నదుల మధ్య మంచి భూములున్నాయి. విజయనగరం సామ్రాజ్యం నుంచి తిరుమల వరకు ఎంతో చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇవన్నీ వినియోగించుకుంటూ ఆధునిక కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది. ఇన్ఫ్రా, ఫార్మా రంగంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు గణనీయమైన శక్తి కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా పేరొందిన సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వృత్తి నిపుణులు పలువురు ఏపీకి చెందిన వారే. రిలయన్స్ ఇండస్ట్రీస్లో మంచి నైపుణ్యంతో వివిధ నాయకత్వ హోదాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారున్నారు. ► రిలయన్స్ రిటైల్ ద్వారా భారీగా విస్తరించాం. రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో రిలయన్స్ రిటైల్ సేవలను అందిస్తోంది. రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధితోపాటు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. రైతులు, హస్తకళాకారుల ఉత్పత్తులను విక్రయిస్తూ నేరుగా 50,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. రిలయన్స్ ఫౌండేషన్ విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో కృషి చేస్తోంది. గ్రామీణ సామాజిక కేంద్రాల్లో రిలయన్స్ భాగస్వామి కానుంది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతో ఇదే విధమైన బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. రాష్ట్ర వృద్ధి రేటులో రిలయన్స్ భాగస్వామిగా ఉంటుంది. మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ సదస్సు విజయవంతమై రాష్ట్రాభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని సృష్టించాలని కోరుకుంటున్నా. -
అలా కలిసొచ్చింది.. ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ రిపోర్టు పరిణామాలతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. దీంతో ఆ లిస్టులో ఆసియా దేశాల నుంచి ఏకైక కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిల్చారు. ఫోర్బ్స్ వెబ్సైట్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గత వారం వరకు మూడో స్థానంలో కొనసాగిన అదానీ ర్యాంకు తాజాగా 15వ స్థానానికి తగ్గింది. ఆయన సంపద 75.1 బిలియన్ డాలర్లుగా ఉంది. -
జియో సంచలనం.. మొన్న సౌతాఫ్రికా లీగ్, ఇప్పుడు ఐపీఎల్! ఫ్రీ?!
FIFA World Cup 2022- SA20 2023- IPL 2023:ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! ఐపీఎల్-2023 సీజన్ మ్యాచ్లను ఎలాంటి ప్రత్యేకమైన ఫీజు లేకుండానే డిజిటల్ మాధ్యమంలో చూసే అవకాశం రానుంది. ఇందుకు సంబంధించి రిలయన్స్ గ్రూపు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్-18 రూ. 23, 758 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియోసినిమా యాప్లో ఫ్రీగా మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిఫా, సౌతాఫ్రికా లీగ్ ఇటీవల ముగిసిన సాకర్ మెగా టోర్నీ ఫిఫా వరల్డ్కప్-2022ను ఇప్పటికే జియో సినియా యాప్లో విజయవంతంగా ప్రసారం చేశారు. టీవీ ఛానెళ్లు స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్18 హెచ్డీలో ప్రేక్షకులు ఈ ఫుట్బాల్ సమరాన్ని వీక్షించగా.. డిజిటల్ యూజర్లకు జియో సినిమాలో ఈ వెసలుబాటు దక్కింది. మరోవైపు.. జనవరి 10న మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్లను జియో సినిమాలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇదే తరహాలో ఐపీఎల్-2023ని కూడా జియో సినిమా యాప్లో ప్రసారం చేసేందుకు వయాకామ్ ప్లాన్ చేస్తున్నట్లు ది హిందూ బిజినెస్లైన్ కథనం పేర్కొంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఐపీఎల్ మ్యాచ్లను డిజిటల్ మీడియాలో ఫ్రీగా ప్రసారం చేసిన తొలి సంస్థగా రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికినట్లవుతుంది. అంతేగాక.. టీవీ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ గ్రూప్నకు భారీ షాకిచ్చినట్లవుతుంది. 6️⃣ teams 3️⃣3️⃣ matches ♾️ entertainment Enjoy the thrilling 🏏 season as #SA20 is HERE 💥@sa20_league action from Jan 10 to Feb 11 👉🏻 LIVE on #JioCinema, #Sports18 & @colorstvtamil 📺📲#SA20League #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/Jo3FkSJysw — JioCinema (@JioCinema) January 12, 2023 -
నవంబర్ 17 వరకూ అనిల్ అంబానీపై చర్యలు వద్దు
ముంబై: బ్లాక్ మనీ చట్టం కింద ఐటీ శాఖ నోటీసులు అందుకున్న రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 17 వరకూ ఎటువంటి బలప్రయోగ చర్యలు తీసుకోవద్దని ఆదాయ పన్ను శాఖను న్యాయస్థానం ఆదేశించింది. రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 814 కోట్ల వివరాలు వెల్లడించకుండా రూ. 420 కోట్ల మేర పన్నులు ఎగవేశారంటూ ఆగస్టు 8న అంబానీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పన్నులు ఎగవేయాలనే ఉద్దేశ్యంతో, ఆయన కావాలనే తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించలేదని ఆరోపించింది. నోటీసులో పొందుపర్చిన సెక్షన్ల ప్రకారం అనిల్ అంబానీకి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ అనిల్ అంబానీ హైకోర్టును ఆశ్రయించారు. నిర్దిష్ట లావాదేవీలు 2006–07 నుంచి 2010–11 మధ్యలో జరిగినవని ఐటీ శాఖ చెబుతుండగా.. బ్లాక్మనీ చట్టం 2015లో అమల్లోకి వచ్చిందని ఆయన తరఫు లాయరు రఫిక్ దాదా వాదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. దీన్ని ఇప్పటికే ఐటీ కమిషనర్ వద్ద సవాలు చేసినట్లు, సివిల్ వివాదం పెండింగ్లో ఉండగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లేదని దాదా తెలిపారు. అనిల్ అంబానీ పిటిషన్పై స్పందించేందుకు కొంత సమయం కవాలని ఐటీ శాఖ కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. -
సంపద సృష్టిలో అదానీ రికార్డ్!
ముంబై: అదానీ గ్రూపు తన విలువను అత్యంత వేగంగా పెంచుకుంది. 2020 ఏప్రిల్ వరకు ఆరు నెలల కాలంలో (2021 నవంబర్–2022 ఏప్రిల్) అదానీ గ్రూపు విలువ 88 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. ‘బర్గుండీ ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ జాబితా బుధవారం విడుదలైంది. రూ.18.87 లక్షల కోట్లతో అదానీ గ్రూపు కంటే ఈ జాబితాలో ముందున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ అదే కాలంలో 13.4 శాతమే పెరిగింది. మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఉండగా, రూ.12.97 లక్షల కోట్లతో టీసీఎస్ మూడో స్థానంలో ఉంది. 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో టీసీఎస్ విలువ 0.9% తగ్గినా కానీ, మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ ఉన్నాయి. ► అదానీ గ్రూపు కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ విలువ ఆరు నెలల్లో 139 శాతం పెరిగి 2022 ఏప్రిల్ నాటికి రూ.4.50 లక్షల కోట్లకు చేరింది. గ్రూపు కంపెనీల్లో అత్యంత వేగంగా ఎక్కువ విలువను పెంచుకున్న కంపెనీ ఇది. దీంతో జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు ఆరు నెలల క్రితం నాటి జాబితాలో ఇది 16వ స్థానంలో ఉండడం గమనార్హం ► అదానీ విల్మార్ ఇదే కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.66,427 కోట్లకు ఎగసింది. అదానీ పవర్ 158 శాతం పెరిగి రూ.66,185 కోట్లకు చేరింది. ► అదానీ గ్రూపులో తొమ్మిది కంపెనీల విలువ ఉమ్మడిగా 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. టాప్–500 కంపెనీల మొత్తం విలువలో అదానీ గ్రూపు కంపెనీల విలువ 7.6 శాతంగా ఉంది. ► 2020 ఏప్రిల్ నాటికి 6 నెలల్లో భారత్లోని టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ సగటున కేవలం 2% పెరగ్గా.. అదానీ గ్రూపు కంపెనీల విలువ 88% పెరగడం విశేషం. ► 2021 అక్టోబర్ 30 నాటికి భారత్లో టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నాటికి రూ.232 లక్షల కోట్లకు చేరింది. ► వీటి మార్కెట్ విలువ కొద్దిగానే పెరిగినా.. బీఎస్ఈ 30 షేర్ల కంటే మెరుగ్గానే ఉంది. ఇదే కాలంలో సెన్సెక్స్ 4 శాతం క్షీణించగా, నాస్డాక్ ఏకంగా 17% పతనాన్ని ఎదుర్కొన్నది. ► మార్కెట్ విలువలో క్షీణత చూసినవీ ఉన్నాయి. రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ విలువ ఇదే కాలంలో 17.9 శాతం పడిపోయి రూ.23,000 కోట్లుగా ఉంది. అన్లిస్టెడ్ కంపెనీలు.. ► అన్లిస్టెడ్ కంపెనీల్లో ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో 35.6 శాతం పెరిగి రూ.2.28 లక్షల కోట్లకు చేరింది. ► సీరమ్ ఇన్స్టిట్యూట్ విలువ 4.6 శాతం పెరిగి రూ.1.75 లక్షల కోట్లకు చేరగా, బైజూస్ విలువ 24.7 శాతం వృద్ధి చెంది రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. ► శాతం వారీగా చూస్తే వేదంత్ ఫ్యాషన్స్ విలువ 320 శాతం పెరగ్గా, అదానీ విల్మార్, బిల్ డెస్క్ 173 శాతం మేర (విడిగా) వృద్ధి చెందాయి. -
మోసం చేసేందుకు సహాయపడ్డారు
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్తో (ఎఫ్ఆర్ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్ఆర్ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది. స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్ఆర్ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్ను రిలయన్స్కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్ఆర్ఎల్కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్తో కుమ్మక్కై ఎఫ్ఆర్ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్ఆర్ఎల్లో అమెజాన్కు స్వల్ప వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎల్ డీల్ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
అయ్యో అనిల్ అంబానీ.. భారీ నష్టాల్లో రిలయన్స్ హోమ్
న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో రూ. 4,522 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 445 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 16 శాతంపైగా క్షీణించి రూ. 162 కోట్లకు పరిమితమైంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం మూడు రెట్లు పెరిగి రూ. 5,440 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 1,520 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 65 శాతం పడిపోయి రూ. 294 కోట్లకు చేరింది. కాగా.. 2022 మార్చి31కల్లా కంపెనీ రూ. 10,123 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది. చదవండి: రిలయన్స్ రికార్డులు..తొలి కంపెనీగా.. -
నాయకత్వ మార్పిడి కసరత్తు నడుస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (64) తన వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యాన్ని అప్పగించే పనిని ప్రారంభించినట్టు ప్రకటించారు. తనతో సహా సీనియర్లతో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారసత్వ ప్రణాళికల గురించి అంబానీ మాట్లాడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి కవలలు ఆకాశ్, ఇషాతోపాటు అనంత్ ఉన్నారు. రిలయన్స్ కుటుంబ దినం సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. రిలయన్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ వర్ధంతి నాడు కుటుంబ దినం జరుపుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రసిద్ధి చెందిన భారత బహుళజాతి సంస్థగా అవతరిస్తుందన్నారు. శుద్ధ, గ్రీన్ ఎనర్జీలోకి ప్రవేశించడంతోపాటు.. రిటైల్, టెలికం వ్యాపారాలతో అసాధారణ స్థాయికి రిలయన్స్ చేరుకుంటుందని చెప్పారు. సరైన నాయకత్వంతోనే సాధ్యం.. ‘‘పెద్ద కలలు, అసాధారణమనుకునే లక్ష్యాలు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యపడతాయి. రిలయన్స్ ఇప్పుడు ముఖ్యమైన, నాయకత్వ మార్పిడిలో ఉంది. సీనియర్లు అయిన నాతరం నుంచి.. యువ నాయకులైన తదుపరి తరానికి బదిలీ కానుంది. ఎంతో పోటీవంతమైన, ఎంతో అంకితభావం కలిగిన, అద్భుతమైన యువ నాయకత్వం రిలయన్స్లో ఉంది. మేము వారిని ప్రోత్సహించి నడిపించాలి. వారి వెనుకనుండి.. వారు మాకంటే మెరుగ్గా పనిచేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించాలి’’ అని అన్నారు. ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు ‘‘ఆకాశ్, ఇషా, అనంత్ తదుపరి తరం నాయకులు. వారు రియలన్స్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ ఎంతో చురుకుదనం, సామర్థ్యాలున్నాయి. రిలయన్స్ను మరింత విజయవంతంగా నడిపించాలని మనమందరం కోరుకుందాం’’ అని ముకేశ్ పేర్కొన్నారు. ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్ పిరమల్, ఆకాశ్ భార్య శ్లోక, అనంత్కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న రాధిక పేర్లను అంబానీ ప్రస్తావించడం గమనార్హం. భవిష్యత్తుకు పునాది రాళ్లు రానున్న దశాబ్దాల్లో అపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా రిలయన్స్ భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేయాల్సిన సమయం ఇదేనని అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దం రెండో భాగంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పగలను. ప్రపంచ టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ చేరుతుంది. రిలయన్స్ ప్రముఖ బహుళజాతి సంస్థగా అవతరిస్తుంది’’ అని అంచనాలను వ్యక్తీకరించారు. -
ఇక ఆర్ఐఎల్ సోలార్ పవర్
జీరో కార్బన్పై దృష్టి పెట్టిన డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగం పెంచింది. ఇప్పటికే రిలయన్స్ న్యూ ఎనర్జీ పేరిట పునరుత్పాదక ఇంధన కంపెనీని నెలకొలి్పన సంస్థ ఒకే రోజు రెండు కంపెనీలపై గురిపెట్టింది. తాజాగా నార్వేజియన్ దిగ్గజం ఆర్ఈసీ సోలార్ను సొంతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ద్వారా 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థ స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్లోనూ 40 శాతం వాటాను చేజిక్కించుకుంది. తద్వారా 2035కల్లా జీరో కార్బన్ పోర్ట్ఫోలియో నిర్మాణంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎస్ఎల్) తొలిసారి ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేసింది. చైనా నేషనల్ బ్లూస్టార్(గ్రూప్) కో నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ను సొంతం చేసుకుంది. నార్వేకు చెందిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్ఈసీ గ్రూప్)లో 100 శాతం వాటాను 77.1 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,783 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ పేర్కొంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు పూర్తి అనుబంధ సంస్థగా రిలయన్స్ న్యూ ఎనర్జీ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో 2035కల్లా నికరంగా జీరో కార్బన్తో శుద్ధ ఇంధన పోర్ట్ఫోలియో కంపెనీగా ఆవిర్భవించేందుకు ఆర్ఐఎల్ తొలి అడుగు వేసింది. ఆర్ఐఎల్ వార్షిక సమావేశంలో శుద్ధ ఇంధన తయారీ సామర్థ్యాలపై రూ. 60,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. కంపెనీ తీరిలా.. నార్వే, సింగపూర్ కేంద్రాలుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్ఈసీ గ్రూప్)నకు సోలార్ ఎనర్జీలో పట్టుంది. కొత్తతరహా సాంకేతిక ఆవిష్కరణలు, అత్యంత మన్నికైన దీర్ఘకాలిక సోలార్ సెల్స్, ప్యానల్స్ను రూపొందిస్తోంది. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన కంపెనీ నార్వేలో సోలార్ గ్రేడ్ పాలీసిలికాన్ తయారీకి రెండు, సింగపూర్లో పీవీ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి ఒక ప్లాంటు చొప్పున నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా 1,300 మందికిపైగా ఉద్యోగులున్నారు. విస్తరణకు మద్దతు ఆర్ఈసీ విస్తరణ ప్రణాళికలకు పూర్తి మద్దతివ్వనున్నట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్ఈసీ.. సింగపూర్లో 2–3 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ తయారీతోపాటు.. బ్రాండ్న్యూ 2 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ను ఫ్రాన్స్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ పేరిట జామ్నగర్లో ఏర్పాటైన కాంప్లెక్స్లో ఆర్ఈసీ సాంకేతికతలను ఆర్ఐఎల్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎల్కు షాపూర్జీ కంపెనీలో వాటా శుద్ధ ఇంధన ఆస్తులపై దృష్టిపెట్టిన ఆర్ఐఎల్ తాజాగా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్లో 40 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,845 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా కంపెనీ బోర్డులో ఇద్దరు సభ్యులను నియమించనుంది. ఈపీసీ కార్యకలాపాల స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ను ఖుర్షీద్ యజ్డీ డరువాలా కుటుంబంతో కలసి షాపూర్జీ పల్లోంజీ భాగస్వామ్య ప్రాతిపదికన(జేవీ) ఏర్పాటు చేసింది. డీల్లో భాగంగా తొలుత షేరుకి రూ. 375 ధరలో 2.93 కోట్ల స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రిలయన్స్ న్యూ ఎనర్జీ పొందనుంది. ఈక్విటీ జారీ తదుపరి పెరగనున్న వాటా మూలధనంలో ఇది 15.46 శాతానికి సమానంకాగా.. తదుపరి మరో 1.84 కోట్ల షేర్లను(9.7 శాతం వాటాకు సమానం) షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి అదే ధరలో సొంతం చేసుకోనుంది. ఆపై సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ నుంచి 25.9 శాతం వాటా(4.91 కోట్ల షేర్లు) కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను ప్రకటించనుంది. వెరసి కంపెనీలో 40 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. గ్రూప్ రూ. 20,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను కొద్ది రోజులుగా షాపూర్జీ పల్లోంజీ అమలు చేస్తోంది. వినూత్న ఇన్వెస్ట్మెంట్... కొత్త, ఆధునిక సాంకేతికతలపై ఇన్వెస్ట్చేసే మా వ్యూహాలకు అనుగుణంగానే ఆర్ఈసీ గ్రూప్ను కొనుగోలు చేశాం. నిర్వహణా సామర్థ్యాలు సైతం ఈ దశాబ్దాంతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్దేశించుకున్న 100 గిగావాట్ల శుద్ధ ఇంధన సాధనకు ఉపయోగపడనున్నాయి. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ అధినేత -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్లు..
హైదరాబాద్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్లో భాగమైన రిలయన్స్ డిజిటల్ సంస్థ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ’డిజిటల్ ఇండియా సేల్’ నిర్వహిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్డిజిటల్డాట్ఇన్ పోర్టల్లో షాపింగ్ చేసేవారికి దీని కింద పలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. ఆగస్టు 16 దాకా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంటు (రూ.3,000 వరకూ), పేటీఎం ద్వారా రూ. 9,999 కనీస చెల్లింపుపై ఆగస్టు 31 దాకా రూ. 500 వాలెట్ క్యాష్బ్యాక్ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, జెస్ట్మనీ ద్వారా రూ. 10,000కు పైబడి చేసే కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్బ్యాక్ (రూ. 5,000 దాకా) పొందవచ్చని పేర్కొంది. టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన వాటిపై ఈ ఆఫర్లు లభిస్తాయని వివరించింది. -
అమెజాన్–ఫ్యూచర్స్ వివాదం
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్–రిలయన్స్ రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ నుంచి తీసుకున్న అవార్డు (తీర్పు) భారత్ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందా? ఇది దేశీయంగా అమలు సాధ్యమేనా అన్న అంశాలపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసుకుంది. ‘‘ఈ కేసులో వాదోపవాదనలను విన్నాం. తీర్పును రిజర్వ్ చేస్తున్నాం’’ అని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవాయ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ 17 (1), 17 (2) సెక్షన్ల కింద సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డు చట్ట బద్దతపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసింది. సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డు, దీని అమలుపై ఢిల్లీ హైకోర్టు సింగిల్, డివిజనల్ బెంచ్ విభిన్న తీర్పుల నేపథ్యంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. రిలయన్స్కు ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ అండ్ హోల్సేల్, లాజిస్టిక్స్ బిజినెస్ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల డీల్పై అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. ఫ్యూచర్ అన్లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్ రిటైల్ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఇప్పుడు ఫ్యూచర్స్ రిటైల్ వాటా రిలయన్స్కు విక్రయించడం సమ్మతం కాదని వాదిస్తోంది. -
వాస్తవాలు ఎందుకు దాచారు?
న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ గ్రూప్ తన రిటైల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ అసెట్స్ను రిలయన్స్కు విక్రయించడానికి సంబంధించి అమెజాన్తో జరుగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదానికి ప్రధాన మూలమైన 2019 నాటి అమెజాన్–ఫ్యూచర్స్ గ్రూప్ ఒప్పందం పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించలేదని కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమెజాన్కు నోటీసులు జారీ చేసింది. ఇందుకుగాను జరిమానాసహా తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదని నాలుగు పేజీల షో కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న అమెజాన్–ఫ్యూచర్స్ న్యాయపోరాటంలో సీసీఐ తాజా నోటీసులు కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... తన రిటైల్ అండ్ హోల్సేల్, లాజిస్టిక్స్ బిజినెస్ను రిలయన్స్ రిటైల్కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఫ్యూచర్స్ గ్రూప్ (ఎఫ్ఆర్ఎల్) 2020 ఆగస్టు 29న ప్రకటించింది. ఇది ఎంతమాత్రం తగదని 2020 అక్టోబర్లో అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఫ్యూచర్ అన్లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో విచారణలో ఉంది. అయితే 2019 నాటి ఒప్పందం వివరాలను తనకు పూర్తిగా వెల్లడించలేదన్నది అమెజాన్కు వ్యాపారాల్లో గుత్తాధిపత్య నిరోధక రెగ్యులేటర్– సీసీఐ తాజా నోటీసుల సారాంశం. కాగా రిలయన్స్, ఫ్యూచర్స్ ఒప్పందం సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉంటుందని సుప్రీంకు గురువారం అమెజాన్ తెలిపింది. -
క్యూ1 ఫలితాలు, ప్రపంచ పరిణామాలే కీలకం
ముంబై: కార్పొరేట్ల తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకంగా మారొచ్చని చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. అలాగే కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మార్కెట్ సోమవారం ముందుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక గణాంకాలు, రిలయన్స్ – జస్ట్ డయల్ విలీన ప్రక్రియ అంశాలపై స్పందించాల్సి ఉంటుంది. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. కావున ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ‘‘దేశీయంగా సానుకూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. సూచీల తాజా గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. ఈ అంశాలు ఒడిదుడుకుల ట్రేడింగ్ను ప్రేరేపించవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,950 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నిరాలి షా తెలిపారు. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కావడంతో పాటు కంపెనీలు ఆశాజన ఆర్థిక ఫలితాల ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో నెలరోజుల తర్వాత గతవారంలో సూచీలు తిరిగి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఆర్థిక, బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, మెటల్స్ షేర్లు రాణిండంతో క్రితం వారంలో సెన్సెక్స్ 754 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లను ఆర్జించగలిగాయి. కీలక దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సందడి... దేశీయ కార్పొరేట్ల తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటన సందడి కీలక దశకు చేరుకుంది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాలకు చెందిన అనేక పెద్ద కంపెనీలు ఈ వారంలో తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంకులతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్లోని మొత్తం పది కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. నేడు రెండు లిస్టింగ్లు... ఇటీవల ఐపీఓ ఇష్యూలను పూర్తి చేసుకున్న రోడ్ల నిర్మాణ సంస్థ జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ క్లీన్ సైన్స్ టెక్నాలజీ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నాయి. గ్రే మార్కెట్లో ఇరు కంపెనీల షేర్లు 55–60 శాతం ప్రీమియం ధర పలుకుతున్నాయి. కావున లాభదాయక లిస్టింగ్కు అవకాశం ఉందని ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై తొలి భాగంలో రూ.4,515 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమెజాన్!
న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందం విషయంలో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన రూలింగ్పై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఫ్యూచర్ లేదా అమెజాన్లు ఈ విషయంలో పంపిన ఈ–మెయిల్ ప్రశ్నలకు స్పందించలేదు. కేసు వివరాల్లోకి వెళితే, ఫ్యూచర్ గ్రూప్లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్తో విక్రయించడం సరికాదని పేర్కొంటూ, ఇందుకు సంబంధించి రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్– రిలయన్స్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఫ్యూచర్ రిటైల్ను ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై జరిగిన విచారణలో భాగంగా... జనవరి 21వ తేదీన ఫ్యూచర్–రిలయన్స్ డీల్కు సెబీ, సీసీఐ, స్టాక్ ఎక్సే్చంజీల షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో జనవరి 26న ఫ్యూచర్ ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్నీ ఆశ్రయించింది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్ ఎక్సే్చంజీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ జనవరి 25న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్ఐఏసీ ఆదేశాలను గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, ప్రమోటర్లు తదితర ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడంలేదనీ అమెజాన్ తాజా పిటిషన్లో ఆరోపించింది. న్యాయం, చట్టం అమలు, ఆర్బిట్రల్ ప్రక్రియ, బాధ్యతల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని పేర్కొంది. ఈ పిటిషన్ను నాలుగురోజులు విచారించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న రూలింగ్ ఇస్తూ, ఆర్ఐఎల్తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఫ్యూచర్ దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన డివిజనల్ బెంచ్ ఈ నెల 8వ తేదీన ఫ్యూచర్కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై తాజాగా అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. -
ఒక్కరోజులో 5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన అంబానీ
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కరోజులో భారీగా పతనమయ్యాయి. సోమవారం ఒక్కరోజే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో (ఎన్ఎస్ఈ) రిలయన్స్ షేర్ ఐదు శాతానికి పైగా నష్టపోవడంతో, రిలయన్స్ సంస్థ 5.2 బిలియన్ల డాలర్ల మేర నష్టపోయింది. నిఫ్టీ ఇంట్రా ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు నిమిషానికి 12 మిలియన్ల డాలర్ల మేరకు సంపదను కోల్పోగా, రిలయన్స్ సంస్థ మరింత నష్టాన్ని చవి చూసింది. సోమవారం చవిచూసిన నష్టాల కారణంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అతని సంపద 79.2 బిలియన్ల డాలర్ల వద్ద స్థిరపడిందని ఆ సంస్థ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో రిలయన్స్ నిర్వహణ ప్రగతి బలహీనంగా ఉందని, ఇదే కొనసాగితే ఆ సంస్థ మార్కెట్ అంచనాలను చేరుకోలేదని కోటక్ ఈక్విటీస్ సంస్థ వ్యాఖ్యానించింది. సోమవారం జరిగిన ట్రేడింగ్లో రిలయన్స్ సంస్థ మార్కెట్ లీడర్ హోదాను కూడా కోల్పోయింది. -
రిలయన్స్లో జీఐసీ, టీపీజీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్బ్యూరో: రిలయన్స్ గ్రూప్నకు చెందిన రిటైల్ వ్యాపార దిగ్గజ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పెట్టుబడులు వచ్చి చేరనున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీఐసీ రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించింది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 1.22 శాతం వాటాను జీఐసీ చేజిక్కించుకోనుంది. డీల్లో భాగంగా ఆర్ఆర్వీఎల్ను రూ.4.285 లక్షల కోట్లుగా విలువ కట్టారు. మరో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టీపీజీ తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 0.41 శాతం వాటాను టీపీజీ దక్కించుకోనుంది. ఈ ఏడాది ప్రారంభంలో జియో ప్లాట్ఫామ్స్లో టీపీజీ రూ.4,546.8 కోట్లు పెట్టుబడి చేసింది. -
రిలయన్స్ రిటైల్ జోరు..
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్లో భాగమైన జియో ప్లాట్ఫామ్స్ తర్వాత తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్లోకి (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అబుధాబికి చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ ముబాదలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ 1.4 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. ఇందుకుగాను ముబాదలా రూ. 6,247.5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించింది. రిలయన్స్ గ్రూప్లో ఈ సంస్థకు ఇది రెండో ఇన్వెస్ట్మెంట్. ముబాదలా ఇప్పటికే రూ. 9,093.6 కోట్లతో జియో ప్లాట్ఫామ్స్లో 1.85 శాతం వాటా కొనుగోలు చేసింది. ‘ముబాదలా వంటి దిగ్గజ సంస్థతో భాగస్వామ్యం మాకు గణనీయంగా ఉపయోగపడనుంది. భారత రిటైల్ రంగంలో లక్షల సంఖ్యలో చిన్న రిటైలర్లు, వ్యాపారులకు తోడ్పాటునివ్వాలన్న మా సంకల్పంపై ముబాదలాకు ఉన్న నమ్మకానికి ఈ పెట్టుబడులు నిదర్శనం. మా లక్ష్య సాధనలో ఆ సంస్థ పెట్టుబడులు, మార్గదర్శకత్వం ఎంతగానో తోడ్పడగలవు‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ‘ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడుల ద్వారా రిలయన్స్తో భాగస్వామ్యం మరింత పటిష్టమైంది.’ అని ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్ తెలిపారు. మూడు వారాల్లో అయిదో డీల్.. గడిచిన మూడు వారాల్లో ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడులకు సంబంధించి ఇది అయిదో డీల్. అమెరికాకు చెందిన కేకేఆర్ అండ్ కంపెనీ రూ. 5,550 కోట్లు (1.28 శాతం వాటా), ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ. 3,675 కోట్లు (0.84 శాతం వాటా) ఇన్వెస్ట్ చేశాయి. ఇవిగాకుండా సిల్వర్ లేక్ రెండు విడతలుగా మొత్తం రూ. 9,375 కోట్లు పెట్టుబడులు (2.13 శాతం వాటా) పెట్టింది. వీటి ప్రకారం రిలయన్స్ రిటైల్ వేల్యుయేషన్ దాదాపు రూ. 4.29 లక్షల కోట్లుగా ఉండనుంది. సెప్టెంబర్ నుంచి చూస్తే రిటైల్ విభాగంలో 5.65 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ ఇప్పటిదాకా రూ. 24,847.5 కోట్లు సమీకరించినట్లయింది. -
ము‘క్యాష్’ రిటైల్ స్వారీ..!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్లోని డిజిటల్ వ్యాపార విభాగం జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు లైను కడుతున్నారు. తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)లో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్లేక్ పార్ట్నర్స్ 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఆర్ఆర్వీఎల్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. ‘ఈ పెట్టుబడుల ప్రకారం ఆర్ఆర్వీఎల్ విలువ సుమారు రూ. 4.21 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని పేర్కొంది. సిల్వర్లేక్ ఇప్పటికే జియో ప్లాట్ఫామ్స్లో 1.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో ఇది రెండో ఇన్వెస్ట్మెంట్. ఈ డీల్కు నియంత్రణ సంస్థపరమైన అనుమతులు రావాల్సి ఉంది. రిలయన్స్ రిటైల్కు మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా ఉండగా .. సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్, డేవిస్ పోక్ అండ్ వార్డ్వెల్ న్యాయ సలహదార్లుగా ఉన్నారు. సిల్వర్ లేక్కు శార్దూల్ అమర్చంద్ మంగళ్దాస్ అండ్ కో, లాథామ్ అండ్ వాట్కిన్స్ లీగల్ అడ్వైజర్లుగా ఉన్నారు. 12 వేల పైచిలుకు స్టోర్స్.. ఆర్ఆర్వీఎల్లో భాగమైన రిలయన్స్ రిటైల్ .. దేశవ్యాప్తంగా సూపర్మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ చెయిన్ స్టోర్స్, హోల్సేల్ వ్యాపారం, ఫ్యాషన్ అవుట్లెట్స్, ఆన్లైన్ నిత్యావసరాల స్టోర్ జియోమార్ట్ మొదలైన వాటిని నిర్వహిస్తోంది. సుమారు 7,000 పట్టణాల్లో 12,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. రిటైల్ విభాగంపై ఆధిపత్యం సాధించే క్రమంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్తో తలపడేందుకు రిలయన్స్కు ఈ పెట్టుబడులు ఉపకరించనున్నాయి. ‘నికర రుణ రహిత సంస్థగా మారిన రిలయన్స్ గ్రూప్ అధిక వృద్ధి సాధించేందుకు ఈ వాటాల విక్రయం తోడ్పడగలదు. ఇదే సెగ్మెంట్లో మరిన్ని వాటాల విక్రయానికి దోహదపడగలదు‘ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అనలిస్ట్ శ్వేతా పటోడియా అభిప్రాయపడ్డారు. రిటైల్ విభాగంలో వాటాల విక్రయం ఊహించిన దానికన్నా ముందుగానే చోటు చేసుకుంటోందని క్రెడిట్ సూసీ తెలిపింది. పెట్టుబడుల సమీకరణ మొదలైన నేపథ్యంలో ప్రణాళికల అమలుపై.. ముఖ్యంగా జియోమార్ట్పై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఫైనాన్షియల్ సేవల సంస్థ సిటీ ఒక నివేదికలో పేర్కొంది. జియోలో సిల్వర్లేక్.. ఫేస్బుక్ తర్వాత జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసిన తొలి అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్లేక్. సుమారు రూ. 10,203 కోట్లతో రెండు విడతల్లో 2.08 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ తర్వాత కేకేఆర్, విస్టా, జనరల్ అట్లాంటిక్, గూగుల్ మొదలైనవి జియోలో ఇన్వెస్ట్ చేశాయి. ట్విట్టర్, ఎయిర్బీఎన్బీ, ఆలీబాబా, డెల్ టెక్నాలజీస్ వంటి పలు టెక్ దిగ్గజాల్లో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టింది. కేకేఆర్కు కూడా రిలయన్స్ ఆఫర్... జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులు పెట్టిన వారికి .. తమ రిటైల్ విభాగంలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు రిలయన్స్ ఆఫర్ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే సిల్వర్లేక్ ఇన్వెస్ట్ చేస్తోంది. జియోలో ఇన్వెస్ట్ చేసిన మరో ఈక్విటీ సంస్థ కేకేఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,100 కోట్లు) పెట్టుబడులు పెట్టొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడులతో రిలయన్స్ మార్కెట్ వేల్యుయేషన్లో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వాటా ఏకంగా రూ. 9 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కొద్దీ చిన్న వర్తకులతో భాగస్వామ్యం ఏర్పర్చుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించే మా ప్రయత్నాల్లో సిల్వ ర్లేక్ కూడా భాగస్వామి కానుండటం సంతోషకర విషయం. ఈ రంగంలో టెక్నాలజీతో పెను మార్పులు తేవచ్చని విశ్వసిస్తున్నాం. భారతీయ రిటైల్ రంగానికి సంబంధించి మా ప్రణాళికలు అమలు చేయడంలో సిల్వర్లేక్ విలువైన భాగస్వామి కాగలదు‘. – ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ -
అనిల్ అంబానీకి ఎస్బీఐ షాక్
న్యూఢిల్లీ: గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకి ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులు ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీని వెంటాడుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బాకీల రికవరీకి రంగంలోకి దిగింది. ఆయనిచ్చిన రూ. 1,200 కోట్ల వ్యక్తిగత పూచీకత్తుకి సంబంధించిన మొత్తాన్ని రికవర్ చేసుకునే దిశగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్పై వారం రోజుల్లోగా సమాధానమివ్వాలంటూ అనిల్ అంబానీని ట్రిబ్యునల్ ఆదేశించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ (ఆర్ఐటీఎల్) తీసుకున్న రుణాలకు గాను అనిల్ అంబానీ ఈ వ్యక్తిగత పూచీకత్తునిచ్చినట్లు ఆయన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా తగు సమాధానాలను అంబానీ దాఖలు చేస్తారని వివరించారు. 3 చైనా బ్యాంకులకు చెల్లించాల్సిన 717 మిలియన్ డాలర్ల బాకీలను రుణ ఒప్పందం ప్రకారం 21 రోజుల్లోగా కట్టేయమంటూ గత నెలలో బ్రిటన్ కోర్టు అనిల్ అంబానీని ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాలకు ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని, రుణదాతలకు చెల్లింపులు జరపాల్సిందేనని లండన్లోని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్ట్ స్పష్టం చేసింది. -
అనిల్.. 21 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించండి
లండన్ : రుణ ఒప్పందంలో భాగంగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 717 మిలియన్ డారల్లను( భారత కరెన్సీలో దాదాపు రూ. 5446 కోట్లు) 21 రోజుల్లోగా చెల్లించాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి శుక్రవారం యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2012 లో రిలయన్స్ కామ్ మూడు చైనీస్ బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి అనిల్ అంబానీ తన వ్యక్తిగత హామీని సమర్పించారు. కాగా సంస్థ ఇప్పుడు దివాలా తీర్పులో ఉండడంతో వడ్డీతో తిరిగి పొందాలని బ్యాంకులు దావా వేసిన రుణంపై డిఫాల్ట్ అవడంతో సదరు బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయి. కాగా రిలయన్స్కు రుణం ఇచ్చిన మూడు చైనా బ్యాంకుల్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (ముంబై బ్రాంచ్), చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు ఉన్నాయి.(అమెజాన్లో 50,000 ఉద్యోగాలు) లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉండడంతో లండన్ హైకోర్టులోని వాణిజ్య విభాగంలో జస్టిస్ నిగెల్ రిమోట్ హియరింగ్ ద్వారా శుక్రవారం విచారణ చేపట్టారు. రుణం తీసుకున్నప్పుడు అనిల్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ తీర్పునిచ్చారు. నిగెల్ చదివిన తీర్పులో హామీ యొక్క 3.2 నిబంధన ప్రకారం, రిలయన్స్ కామ్ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో హామీ ఇచ్చిన వ్యక్తే దానిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యక్షంగా ఆ సంస్థ ప్రతినిధి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది దివాల చర్య చట్టం కింద వర్తిస్తుందంటూ పేర్కొన్నారు. 21 రోజుల్లోగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని మొత్తం చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకావం ఉందంటూ తీర్పునిచ్చారు. కాగా ఇంతకుముందు జరిగిన విచారణలో అంబానీ వాదనను కోర్టు తోసిపుచ్చింది.ప్రస్తుతం అనిల్ నికర విలువ సున్నాగా ఉండడంతో అతని కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు పొందే అంశంపై కోర్టు నిరాకరించింది. (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక) -
జియో వన్స్మోర్..ముకేశ్ హ్యాట్రిక్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫామ్స్ .. పెట్టుబడుల సమీకరణలో జోరుగా దూసుకుపోతోంది. తాజాగా మరో అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్ట్నర్స్తో జట్టు కట్టింది. జియో ప్లాట్ఫామ్స్లో విస్టా 2.32 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ. 11,367 కోట్లు. దీంతో మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్లాట్ఫామ్స్ ఏకంగా రూ. 60,596 కోట్లు సమీకరించినట్లయింది. ‘ఈ పెట్టుబడులతో జియో ప్లాట్ఫామ్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ తర్వాత విస్టా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉంటుంది. దీంతో కేవలం మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలోనే దిగ్గజ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 60,596.37 కోట్లు సమీకరించినట్లవుతుంది‘ అని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఇప్పటికే రూ. 43,574 కోట్లతో 9.99 శాతం, మరో టెక్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సిల్వర్ లేక్ రూ. 5,666 కోట్లతో 1.15% వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్ ప్రకారం జియో ప్లాట్ఫామ్స్ ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది. 20 శాతం వాటా విక్రయం దిశగా... డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియో ప్లాట్ఫామ్స్ను ఏర్పాటు చేసింది. దాదాపు 38.8 కోట్ల సబ్స్క్రయిబర్స్తో అత్యంత తక్కువ కాలంలోనే టెలికం దిగ్గజంగా ఎదిగిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇందులో భాగంగా ఉంది. వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లకు జియో ప్లాట్ఫామ్స్ 20 శాతం వాటాలు విక్రయించాలని నిర్దేశించుకుంది. ఇప్పటికే మూడు ఒప్పందాల ద్వారా 13.46 శాతం వాటాలను విక్రయించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పెట్టుబడులు సమీకరించనుంది. డిసెంబర్ నాటికే రుణాలు తీర్చేసే దిశగా.. 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాది ఆగస్టులో నిర్దేశించుకుంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే ఈ ఏడాది డిసెంబర్లోనే దాన్ని సాధించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పెట్టుబడులు, రూ. 53,125 కోట్ల ప్రతిపాదిత రైట్స్ ఇష్యూ, సౌదీ ఆరామ్కో వంటి దిగ్గజాలకు గ్రూప్ సంస్థల్లో వాటాల విక్రయం వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. మార్చి ఆఖరు నాటికి రిలయన్స్ రుణభారం రూ. 3,36,294 కోట్లుగా ఉండగా, నగదు నిల్వలు రూ. 1,75,259 కోట్లు. సర్దుబాట్లు చేస్తే నికర రుణం రూ. 1,61,035 కోట్లు. రుణాలు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా జూన్ నాటికి రైట్స్ ఇష్యూ వంటివన్నీ కలిపి రూ. 1.04 లక్షల కోట్లు సమీకరించవచ్చని కంపెనీ భావిస్తోంది. మూడు డీల్స్లో జియోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్: 60,596 కోట్లు ఫేస్బుక్ పెట్టుబడి (9.99% వాటా) : 43,574 కోట్లు విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ (2.32% వాటా) : 11,367కోట్లు సిల్వర్ లేక్ పెట్టుబడి (1.15 % వాటా) : 5,666 కోట్లు జియో ఎంటర్ప్రైజ్ విలువ :5.16 లక్షల కోట్లు విస్టా సహ వ్యవస్థాపకుడు మనోడే..! అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం విస్టా ప్రధానంగా సాఫ్ట్వేర్, డేటా, టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దాదాపు 57 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం విస్టా పోర్ట్ఫోలియోలో భారత కంపెనీల్లో సుమారు 13,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ సేథ్కి భారతీయ మూలాలు ఉన్నాయి. ముకేశ్ అంబానీలాగే ఆయన తండ్రి కూడా గుజరాత్కు చెందినవారు. అంతే గాకుండా విస్టా వ్యవస్థాపకుడు రాబర్ట్ స్మిత్తో ముకేశ్కు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. ముకేశ్కు అత్యంత సన్నిహితులైన మనోజ్ మోదీ, బ్రయాన్ సేథ్ ఈ డీల్ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ సేథ్ ప్రపంచంలోనే దిగ్గజ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లో ఒకటైన విస్టాతో భాగస్వామ్యం కుదరడం సంతోషకరం. రాబర్ట్ స్మిత్తో పాటు గుజరాత్కి చెందిన కుటుంబ నేపథ్యమున్న బ్రయాన్ సేథ్.. ఇద్దరూ అంతర్జాతీయంగా ప్రముఖ టెక్నాలజీ లీడర్లు. డిజిటల్ భారతదేశ వృద్ధి సామర్థాలపైగట్టి నమ్మకం ఉన్నవారు. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత్ కోసం జియో నిర్మిస్తున్న డిజిటల్ సమాజం సామర్ధ్యంపై మాకు నమ్మకం ఉంది. ముకేశ్ అంబానీ దార్శనికత, ప్రపంచస్థాయి జియో నాయకత్వ బృందం కలిసి ప్రారం భించిన డేటా విప్లవాన్ని మరింత ముం దుకు తీసుకెళ్లగలవు. – రాబర్ట్ స్మిత్, విస్టా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో -
జియోకు ఫేస్బుక్.. లైక్
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు రిలయన్స్ గ్రూప్, ఫేస్బుక్ తాజాగా దేశీ టెక్నాలజీ రంగంలో భారీ డీల్కు తెరతీశాయి. రిలయన్స్ గ్రూప్లో భాగమైన జియో ప్లాట్ఫామ్స్లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ వెల్లడించింది. ఈ డీల్ విలువ 5.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్బుక్లో భాగమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఊతంతో దేశీ ఈ–కామర్స్ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్ రిలయన్స్కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్బుక్కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన జియో ప్లాట్ఫామ్స్లో రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం. తద్వారా అందులో అతి పెద్ద మైనారిటీ షేర్హోల్డరుగా ఉంటాం‘ అని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఫేస్బుక్ డీల్తో జియో ప్లాట్ఫామ్స్ విలువను రూ. 4.62 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ప్రకటనలో పేర్కొంది. 2014లో వాట్సాప్ కొనుగోలు డీల్ తర్వాత ఫేస్బుక్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. సాధారణంగా మీడియా, ఆన్లైన్ సంస్థల్లోనే ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేస్తున్న ఫేస్బుక్ తాజాగా జియోలో పెట్టుబడులు పెట్టడాన్ని బట్టి చూస్తే.. భారత్లో వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ పేమెంట్, ఈ–కామర్స్ విభాగాల్లోని భారీ వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునే వ్యూహంలో ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. డీల్ ఇలా.. డీల్ ప్రకారం.. జియో ప్లాట్ఫామ్స్.. ఫేస్బుక్కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కూడా బోర్డులో ఉంటారు. తమ డిజిటల్ వ్యాపారాలన్నింటినీ కలిపి రిలయన్స్ గ్రూప్ గతేడాది అక్టోబర్లో జియో ప్లాట్ఫామ్స్ను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 15,000 కోట్లను ఇది తన దగ్గరే అట్టిపెట్టుకుని, మిగతా మొత్తాన్ని సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో కొంత తీర్చేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది నాన్–ఎక్స్క్లూజివ్ డీల్గా ఉండనుంది. అంటే జియోతో మాత్రమే కాకుండా ఇతరత్రా భారత, విదేశీ కంపెనీలతో కూడా కావాలనుకుంటే ఫేస్బుక్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కాగా, ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు తెలపాల్సి ఉంటుంది. రిలయన్స్కు ప్రయోజనాలు.. గతేడాది డిసెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొత్తం రుణభారం రూ. 3,06,851 కోట్లుగా ఉంది. చేతిలో నగదు రూ. 1,53,719 కోట్లు ఉండటంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లుగా ఉండనుంది. 2021 నాటికల్లా రుణ రహిత గ్రూప్గా ఆవిర్భవించాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తమ చమురు, రసాయనాల వ్యాపార విభాగాల్లో 20 శాతం వాటాను చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రయతాల్లో ఉంది. ఇప్పటికే ఇంధన రిటైల్ విభాగంలో వాటాలను బ్రిటన్ సంస్థ బీపీకి రూ. 7,000 కోట్లకు విక్రయించింది. తాజాగా ఫేస్బుక్ డీల్తో రుణ భారం తగ్గించుకునే దిశగా మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే, టెక్నాలజీలో ఫేస్బుక్ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్ కంపెనీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్కు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. జియో డిజిటల్కు ఊతం: విశ్లేషకులు డిజిటల్ వ్యాపార విభాగాల ద్వారా ఆదాయార్జన, 2021 నాటికి రుణరహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ లక్ష్యాల సాకారానికి ఫేస్బుక్ డీల్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ‘రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ విభాగం .. ప్రస్తుతం జియో ప్లాట్ఫామ్స్ పరిధిలో లేదు. వాట్సాప్తో జట్టు కట్టడం ద్వారా కిరాణా దుకాణదారు, కొనుగోలుదార్లను అనుసంధానం చేయొచ్చు‘ అని క్రెడిట్ సూసీ ఒక నివేదికలో పేర్కొంది. ఇది రెండు పక్షాలకూ వ్యూహాత్మక ఒప్పందమని బెర్న్స్టెయిన్ తెలిపింది. ‘ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థలు పలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ డీల్తో వుయ్చాట్ లాంటి యాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 38 కోట్ల పైచిలుకు యూజర్లు ఫేస్బుక్కు లభిస్తారు. జియోమార్ట్లోని 6 కోట్ల చిన్న వర్తకులతో పాటు జియో కస్టమర్లకూ కొత్త సొల్యూషన్స్ అందించవచ్చు’ అని వివరించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్కు పోటీగా జియోమార్ట్ .. ఈ డీల్ సందర్భంగా జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ విభాగం జియోమార్ట్ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్ఐఎల్ వివరించింది. ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు రావాల్సి ఉంది. రిలయన్స్కు ప్రయోజనాలు.. గతేడాది డిసెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొత్తం రుణభారం రూ. 3,06,851 కోట్లుగా ఉంది. చేతిలో నగదు రూ. 1,53,719 కోట్లు ఉండటంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లుగా ఉండనుంది. 2021 నాటికల్లా రుణ రహిత గ్రూప్గా ఆవిర్భవించాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తమ చమురు, రసాయనాల వ్యాపార విభాగాల్లో 20 శాతం వాటాను చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రయతాల్లో ఉంది. ఇప్పటికే ఇంధన రిటైల్ విభాగంలో వాటాలను బ్రిటన్ సంస్థ బీపీకి రూ. 7,000 కోట్లకు విక్రయించింది. తాజాగా ఫేస్బుక్ డీల్తో రుణ భారం తగ్గించుకునే దిశగా మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే, టెక్నాలజీలో ఫేస్బుక్ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్ కంపెనీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్కు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఫేస్బుక్కు ఏంటి... కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం 2017లో దేశీయంగా 45 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2022 నాటికి 85 కోట్లకు పెరగనుంది. ప్రస్తుతం ఫేస్బుక్కు భారత్లో 25 కోట్ల మంది యూజర్లు ఉండగా, అందులో భాగమైన వాట్సాప్నకు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మరో విభాగం ఇన్స్ట్రాగామ్కు కూడా ఇబ్బడిముబ్బడిగా యూజర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇక టెలికం కార్యకలాపాలు సాగిస్తున్న జియోకు 38.8 కోట్ల పైగా ఫోన్ సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. జియోతో జట్టు కట్టడం ద్వారా కోట్ల కొద్దీ యూజర్లకు మరింతగా చేరువ కావడానికి ఫేస్బుక్కి ఈ డీల్ ఉపయోగపడనుంది. పేమెంట్ సర్వీసులను కూడా ప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ఫేస్బుక్కు స్థానికంగా ఒక భాగస్వామి ఉంటే నియంత్రణలపరమైన అడ్డంకులను అధిగమించేందుకు.. ప్రైవసీ, లోకల్ స్టోరేజీ నిబంధనల పాటించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్య.. వైద్యంలోకి విస్తరణ: అంబానీ ఫేస్బుక్ భాగస్వామ్యంతో భారీ వ్యాపార ప్రణాళికలను ఆవిష్కరించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. స్థానిక కిరాణా దుకాణాల నుంచి కొనుగోలుదారుల ఇళ్లకే సరుకులు చేర్చడం మొదలుకుని క్రమంగా విద్య, వైద్య రంగాల్లోకి కూడా విస్తరించబోతున్నామని వెల్లడించారు. ‘రెండు దిగ్గజ సంస్థలు చేతులు కలపడం ద్వారా ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే కొంగొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయి. జియోమార్ట్, వాట్సాప్ భాగస్వామ్యం వల్ల.. సమీప భవిష్యత్లో ఇరుగుపొరుగుల్లో ఉండే ప్రతి కస్టమరుతో డిజిటల్ లావాదేవీలు జరిపేలా దాదాపు 3 కోట్ల పైచిలుకు చిన్న స్థాయి కిరాణా దుకాణదారులకు తోడ్పాటు లభిస్తుంది. అంతేకాదు.. ఈ విజయవంతమైన భాగస్వామ్యంతో మన రైతులు, చిన్న.. మధ్య తరహా సంస్థలు, మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సేవలందించేవారు .. అందరికన్నా ముఖ్యంగా నవభారతానికి వెన్నెముకలాంటి యువత, మహిళలకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ప్రపంచంలోనే అగ్రగామి డిజిటల్ దేశంగా భారత్ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది ‘ అని సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. జియోతో జట్టు... మరిన్ని అవకాశాలు లక్షలాది మంది ప్రజలు, చిన్న వ్యాపారాలు ఆన్లైన్లోకి రావడానికి జియో వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏ ఆర్థిక వ్యవస్థకైనా చిన్న వ్యాపారాలు చాలా కీలకం. భారత్లో 6 కోట్లకు పైగా చిన్న వ్యాపార సంస్థలున్నాయి. కోట్లాదిమంది ప్రజలు ఈ వ్యాపారాలపై ఆధారపడి ఉన్నారు. ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో వ్యాపార వృద్ధి, వినియోగదారులతో సంబంధాల నిమిత్తం ఈ వ్యాపార సంస్థలకు డిజిటల్ టూల్స్ అవసరం. ఈ డిజిటల్ టూల్స్ అందించడం కోసమే జియోతో జట్టు కట్టాం. రిలయన్స్తో మా భాగస్వామ్యం... భారత్లోని చిన్న వ్యాపార సంస్థలకు మరిన్ని కొత్త అవకాశాలను అందించనున్నది. రిలయన్స్ జియోతో కలిసి కొన్ని పెద్ద ప్రాజెక్ట్లను చేపట్టనున్నాం. ఈ ప్రాజెక్ట్ల కారణంగా భారత్లో చాలా మందికి వాణిజ్య అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. –మార్క్ జుకర్బర్గ్ అంబానీకి మహీంద్రా అభినందనలు ఫేస్బుక్తో డీల్ విషయంలో ముకేశ్ అంబానీకి అభినందనలు తెలియజేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర. ‘వైరస్పరమైన సంక్షోభ సమయంలో కుదిరిన ఈ ఒప్పందం .. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్కి దక్కే ప్రాధాన్యం గురించి చాటిచెబుతోంది. వృద్ధికి నూతన కేంద్రంగా ప్రపంచమంతా భారత్వైపే చూస్తుందన్న వార్తలకు బలం చేకూరుస్తోంది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. -
రిలయన్స్ రిటైల్... @ 2.4 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్నకు చెందిన రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లు(3,400 కోట్ల డాలర్లు) అని అంచనా. రిలయన్స్ రిటైల్ వాటాదారుల కోసం రిలయన్స్ గ్రూప్ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్ ఆధారంగా చూస్తే, రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లుగా తేలుతుంది. దేశంలో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్, డిమార్ట్ను ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ విలువ(రూ.1.20 లక్షల కోట్లు)కు ఇది దాదాపు రెట్టింపు విలువ. ఇంగ్లాండ్లో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్ టెస్కో విలువ (3,200 కోట్ల డాలర్లు)కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్ రిటైల్ షేర్లకు గాను ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ను పొందవచ్చని రిలయన్స్ రిటైల్ వెబ్సైట్ వెల్లడించింది. షేర్ల మార్పిడి స్కీమ్ ఎందుకంటే.., రిలయన్స్ రిటైల్ కంపెనీ తన ఉద్యోగులకు 2006, 2007 సంవత్సరాల్లో స్టాక్ ఆప్షన్స్ ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఈ ఆర్ఎస్యూ(రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు)ను ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నారు. ఈక్విటీ షేర్లు పొందిన ఉద్యోగులు వీటిని నగదుగా మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారని రిలయన్స్ రిటైల్ వివరించింది. ఈ కంపెనీని ఇప్పటికిప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ఆలోచన ఏదీ లేదని, అందుకే ఈ షేర్ల మార్పిడి స్కీమ్ను అందుబాటులోకి తెచ్చామని వివరించింది. రిలయన్స్ రిటైల్లో 99.95% వాటా రిలయన్స్ రిటైల్ వెంచర్కు ఉందని, మిగిలిన 0.05 శాతం వాటా ఉద్యోగుల వద్ద ఉందని వివరించింది. ఈ షేర్ల మార్పిడి స్కీమ్కు ఆమోదం పొందడం కోసం వచ్చే నెల 23న ఈక్విటీ వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపింది. పదివేలకు పైగా రిటైల్ స్టోర్స్... దేశవ్యాప్తంగా 10,901 స్టోర్స్ను నిర్వహిస్తున్న రిలయన్స్ రిటైల్ కంపెనీ ఆదాయం ఈ ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరానికి 89% వృద్ధితో రూ.1.3 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 169 శాతం ఎగసి రూ.5,550 కోట్లకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు పరోక్ష అనుబంధ సంస్థగా రిలయన్స్ రిటైల్ వ్యవహరిస్తోంది. గురువారం రిలయన్స్ షేర్ రూ.1,516 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9.6 లక్షల కోట్లు. రిలయన్స్ రిటైల్ కంపెనీని ఐదేళ్లలోపు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామని ఈ ఏడాది ఆగస్టులోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. -
అనిల్ అంబానీ కంపెనీల పతనం
సాక్షి, న్యూఢిల్లీ : వ్యాపార దిగ్గజ సోదరులుగా ఘనతకెక్కిన ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాల మనుగడ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ముకేష్ అంబానీ కంపెనీల బ్రాండ్ విలువ పెరుగుతూ పోతుంటే మరోపక్క అనిల్ అంబానీ కంపెనీల బ్రాండ్ విలువ రోజు రోజుకు తరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ గ్రూప్ బ్రాండ్ విలువ గతేడాది కన్నా ఈ ఏడాది మరింత పడిపోయింది. ఇప్పుడు ఈ బ్రాండ్ విలువ 65 శాతం తగ్గి 3, 848 రూపాయలకు పడిపోయింది. దాంతో అనిల్ అంబానీ కంపెనీల గ్రూప్ బాండ్ భారత్లో 56వ స్థానానికి చేరుకుంది. 2018లో ఉన్న స్థానంతో పోలిస్తే ఏకంగా 28 ర్యాంకులు తగ్గింది. లండన్లోని ‘ఇండిపెండెంట్ స్ట్రాటజీ కన్సల్టెంట్’ ఇటీవల విడుదల చేసిన ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా–100’ జాబితాలో మొదటి స్థానాన్ని టాటా గ్రూప్ దక్కించుకుంది. రిలయెన్స్ కమ్యూనికేషన్స్ సహా రిలయెన్స్ గ్రూపులోని అన్ని కంపెనీల బ్రాండ్ విలువ పడిపోతుండడంతో మొత్తం కంపెనీల గ్రూప్పై దాని ప్రభావం పడుతోంది. ప్రస్తుతం రిలయెన్స్ కమ్యూనికేషన్లలో చెల్లింపుల పర్వం కొనసాగుతోంది. ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్’ ముందు ఈ కంపెనీ ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నది. స్వీడన్ టెలికమ్ పరికరాల కంపెనీ ‘ఎరిక్సన్’కు బకాయిలను చెల్లించడంలో ముకేష్ అంబాని సహకరించి ఉండక పోయినట్లయితే అనిల్ అంబానీ జైలుకు కూడా వెళ్లేవాడు. అనిల్ అంబానీ గ్రూప్నకు చెందిన ‘ఆర్ పవర్’ విద్యుత్ సంస్థ, ‘రిలయెన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్’, ‘రిలయెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా ముకేష్ అంబానీ సారథ్యంలోని ‘రిలయెన్స్ జియో’ 360 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతోని ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా–100’ జాబితాలో 14వ స్థానాన్ని ఆక్రమించుకుంది. అతి తక్కువ ధర వ్యూహంతోనే ఆ కంపెనీ అతి ఎక్కువ బ్రాండ్ విలువను పెంచుకోగలిగింది. టాటా గ్రూప్ వరుసగా రెండో ఏడు కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 1960 కోట్ల డాలర్ల విలువతో ఇది అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాల్లో ఎల్ఐసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, మహీంద్రా సంస్థలు కొనసాగుతున్నాయి. -
అంబానీ మరో కీలక నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. ముంబైలోని అతి విలాసవంతమైన భవన సముదాయాన్ని విక్రయించడమో లేదా అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట. తద్వారా కొన్ని అప్పులు తీర్చాలని భావిస్తున్నారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేలో 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రిలయన్స్ గ్రూప్నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయాన్ని విక్రయించడానికి లేదా దీర్ఘకాలిక లీజ్కివ్వడానికి యోచిస్తున్నారు అనిల్ అంబానీ. ఈ మేరకు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తద్వారా 1,500-2,000 కోట్ల రూపాయల సమకూర్చకోనుందని ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. మరోవైపు ఈ భవనం కూడా చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ లావాదేవీకోసం ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్ఎల్ను కూడా నియమించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అంబానీ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో అడాగ్ గ్రూపు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. కాగా 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో బిలియనీర్ క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు. మార్చి 2018 నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది. 2005 లో రిలయన్స్ సామ్రాజ్యాన్ని అన్నదమ్ములు (అన్న ముకేశ్ అంబానీ) తమలో తాము విభజించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అనిల్ అంబానీకి ఈ కార్యాలయం లభించింది. -
ఓ అసమర్ధుడి వ్యాపార యాత్ర...
న్యూఢిల్లీ: ఓడలు బళ్లు అవుతాయన్న సామెత... అడాగ్ గ్రూపునకు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే 2008లో అడాగ్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ గ్రూపు విలువ 42 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.2.9 లక్షల కోట్లు. అప్పుడు ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వారిలో అనిల్ది 6వ స్థానం. కానీ ఆ తరువాతి 11 ఏళ్లలో అనిల్ అంబానీ ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్న కంపెనీల నుంచే కొత్త కంపెనీలను సృష్టించారు. విలువ పెంచుతానంటూ రకరకాల వ్యాపారాల్లోకి వచ్చారు. పెరగటం మాట అటుంచి... ఆయన గ్రూపు విలువ అత్యంత దారుణ స్థాయికి పడిపోయి రూ.5,000 కోట్లకు పరిమితమయ్యింది. గడిచిన ఏడాదిన్నరగా అడాగ్ గ్రూపు షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో చూసినపుడు అడాగ్ గ్రూపు మార్కెట్ విలువ రూ.6,196 కోట్లు. అయితే మంగళవారం సైతం గ్రూపు కంపెనీల షేర్లు భారీగా 10 నుంచి 20 శాతం మధ్య నష్టపోయాయి. ఈ ప్రకారం ఆయన సంపద రూ.5,000 కోట్లకు దిగినట్టు భావించాలి. దీనికితోడు ప్రమోటర్లు తమ వాటాల్లో అత్యధిక భాగాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. షేర్లు ప్రతి రోజూ కొత్త కనిష్టాలకు పడిపోతుండటంతో రుణాలిచ్చిన సంస్థలు బహిరంగ మార్కెట్లో అడాగ్ గ్రూపు షేర్లను నిలువునా విక్రయించేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే అడాగ్ గ్రూపు విలువ చూడటానికి రూ.5వేల కోట్లున్నప్పటికీ... ప్రమోటర్ అనిల్ అంబానీ తాకట్టు పెట్టకుండా ఉంచుకున్న వాటాల విలువ కేవలం రూ.500 కోట్లే ఉంటుందని అంచనా. అంటే 2008 నాటి సంపదలో 98 శాతాన్ని హారతి కర్పూరం చేసేశారు. అనిల్తో పాటు ఆయన గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు కూడా... దాదాపు 90 శాతం సంపదను కోల్పోయి కుదేలయ్యారు. వారం రోజులు కూడా కాలేదు... గడిచిన 14 నెలల కాలంలో రూ.35,000 కోట్ల మేర రుణాలను చెల్లించేశామని, భవిష్యత్తులో అన్ని రుణాలను సకాలంలో చెల్లిస్తామని అనిల్ అంబానీ సరిగ్గా వారం క్రితం ప్రకటించారు. కానీ, ఆ మరుసటి రోజే అంటే గత బుధవారం రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీల ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రకటించింది. నిధుల మళ్లింపుపై ఆరోపణలు చేసింది. కోరిన సమాచారాన్ని అందించలేకపోయినట్టు పేర్కొంది. దీంతో అనిల్ గ్రూపు కంపెనీలపై మరిన్ని సందేహాలు తలెత్తాయి. సమీప కాలంలో అడాగ్ గ్రూపు షేర్లు కోలుకోకపోవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపించారు. మంగళవారం రిలయన్స్ ఇన్ఫ్రా 19 శాతం నష్టపోయి రూ.45.80 వద్ద క్లోజవగా, రిలయన్స్ క్యాపిటల్ 11 శాతం నష్టంతో రూ.63.55 వద్ద ముగిసింది. రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ 17 శాతానికి పైగా నష్టపోయి రూ.4.65 వద్ద, రిలయన్స్ పవర్ 13 శాతానికి పైగా క్షీణించి రూ.4.57 వద్దకు పడిపోయాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కూడా 10 శాతం నష్టంతో రూ.11.95కు చేరుకుంది. రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజిమెంట్ (ఆర్నామ్) మాత్రం నష్టం లేకుండా రూ.220.80 వద్ద క్లోజయింది. అయితే ఆర్నామ్లో మొత్తం వాటాను జపాన్కు చెందిన నిప్పన్కు అడాగ్ గ్రూపు విక్రయించటం తెలిసిందే. వ్యాపారాల విక్రయం... రిలయన్స్ క్యాపిటల్కు ఉన్న రూ.18,000 కోట్లకుపైగా రుణ భారాన్ని తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా ఆర్నామ్లో ఉన్న 42.88 శాతానికి వాటాను విక్రయించి బయటపడాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్నామ్లో 10.75 శాతం వాటాను రూ.1,450 కోట్లకు రిలయన్స్ క్యాపిటల్ ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. మిగిలిన వాటాను జపాన్కు చెందిన భాగస్వామి నిప్పన్ లైఫ్ కొనుగోలు చేయనుంది. బిగ్ఎఫ్ఎం రేడియోలోనూ వాటాలను రేడియో మిర్చికి విక్రయించేందుకు అనిల్ డీల్ కుదుర్చుకున్నారు. వీటన్నిం టికంటే ముందే అత్యంత విలువైన ముంబైలోని విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యాపారాన్ని అదానీ గ్రూపునకు అమ్మేశారు. మిగిలిన ఆస్తులు, ప్రాజెక్టులను విక్రయించి రుణ భారాన్ని దింపుకుని అస్సెట్ లైట్ విధానానికి మళ్లనున్నట్టు అనిల్ ఇప్పటికే ప్రకటించేశారు. మరి వ్యాపారాలను విక్రయానికి పెడితే రుణాలు తీర్చడానికి సరిపడా నిధులయినా వస్తాయా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. స్వయంకృతాపరాధం అప్పట్లో ముకేశ్, అనిల్ ఇద్దరూ రిలయన్స్ సామ్రాజ్యాన్ని చెరిసగం పంచుకున్నారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపద రూ.3.68 లక్షల కోట్లు. ఆయన గ్రూపు విలువైతే 7.5 లక్షల కోట్లపైమాటే. ఇక అనిల్ సంగతి చూస్తే ముకేశ్ సంపదలో 2 శాతం కూడా లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్గా ముకేశ్ అంబానీకి గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్న డివిడెండ్ ఆదాయం రూ.14,500 కోట్లు. కానీ, అనిల్ కంపెనీల విలువ ముకేశ్ డివిడెండ్ ఆదాయం ముందు కూడా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి దారితీసిన కారణాలేంటని ప్రశ్నించుకుంటే... ‘‘ఇది ఆశ, భయం వంటి సాధారణ కథ మాదిరే. రిలయన్స్ కమ్యూనికేషన్ సంక్షోభానికి అధిక రుణాలే కారణం. పైగా సకాలంలో వ్యాపారం నుంచి బయటపడలేదు. ఫలితంగా గ్రూపు కంపెనీలపైనా ఈ ప్రభావం పడింది’’ అని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ పేర్కొన్నారు. గ్రూపు 90 శాతం మార్కెట్ విలువను కోల్పోవడంతోపాటు వాటాదారుల నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందన్నారు. వ్యాపారాలను తప్పుగా నిర్మించటం, తనఖా ఉంచిన షేర్ల విక్రయాలు వాటాదారులకు కష్టంగా మారినట్టు చెప్పారు. అధిక రుణాలకు తోడు, తక్కువ మార్జిన్లు, తక్కువ క్యాష్ఫ్లోతో కూడిన వ్యాపారాలే అనిల్ గ్రూపులో 80%‡ ఉన్నట్టు టార్గెట్ ఇన్వెస్టింగ్ వ్యవస్థాపకుడు సమీర్కల్రా పేర్కొన్నారు. ‘‘అడాగ్ గ్రూపు వ్యాపారాల్లో పవర్, యుటిలిటీలు, ఎన్బీఎఫ్ఎసీ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే, వీటిల్లో కొన్ని ఆస్తులను వేగంగా విక్రయించడంపైనే భవిష్య త్తు ఆధారపడి ఉంది’’ అని భాసిన్ పేర్కొన్నారు. రాను న్న బడ్జెట్ ఈ గ్రూపు పరిస్థితిని మార్చేది కావచ్చన్నారు. -
సెప్టెంబర్ వరకూ తనఖా షేర్ల విక్రయం ఉండదు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా రుణదాతలకు గడువు ప్రకారమే వడ్డీ, అసలు చెల్లింపులను రిలయన్స్ గ్రూప్.. జరుపుతుంది. అంతే కాకుండా రిలయన్స్ పవర్లో రిలయన్స్గ్రూప్నకు నేరుగా ఉన్న 30 శాతం వాటాలో పాక్షిక వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించడం కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు త్వరలో రోడ్షోలను నిర్వహిస్తారు. రిలయన్స్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్న రుణదాతల్లో టెంపుల్టన్ ఎమ్ఎఫ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఎమ్ఎఫ్, ఇండియాబుల్స్ ఎమ్ఎఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్లు ఉన్నాయి. కాగా తనఖా షేర్లు విక్రయించకుండా యథాతథ ఒప్పందం కుదిరినందుకు రుణదాతలకు రిలయన్స్ గ్రూప్ ధన్యవాదాలు తెలిపింది. తమపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞులమని రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటీవల రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఈ పతనం కారణంగా తనఖా పెట్టిన షేర్ల విలువ బాగా తగ్గినప్పటికీ, రుణదాతలు తనఖా షేర్లను విక్రయించబోమని తాజా ఒప్పందం ద్వారా అభయం ఇచ్చాయి. ఎడెల్వీజ్కు బకాయి రూ.150 కోట్లు తనఖా పెట్టిన షేర్లను ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎడెల్వీజ్ సంస్థలు అన్యాయంగా కావాలని ఓపెన్ మార్కెట్లో విక్రయించాయని, ఫలితంగా తమ కంపెనీల షేర్ల విలువలు భారీగా పడిపోయాయని రిలయన్స్ గ్రూప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఈ ఇరు కంపెనీలు ఖండించాయి. తనఖా ఒప్పందం ప్రకారమే షేర్లను విక్రయించామని, ఎలాంటి దురుద్దేశం లేదని ఎడెల్వీజ్ పేర్కొంది. కాగా క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఎడెల్వీజ్ను తక్షణం నిషేధించాలని కూడా సెబీని రిలయన్స్ గ్రూప్ కోరింది. కాగా రిలయన్స్ గ్రూప్ ఎడెల్వీజ్ సంస్థకు రూ.150 కోట్ల రుణం చెల్లించాల్సి ఉండగా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ రుణం పూర్తిగా తీరిపోయింది. -
ఈ ప్రశ్నలకు బదులు లేదంటే రా‘ఫేల్’!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం 60 వేల కోట్ల రూపాయలకు మించిపోయిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కొనసాగుతున్న రగడకు సంబంధించి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానానికి ఎక్కడ ఇసుమంత కూడా సంబంధం ఉండడం లేదు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత రావాలంటే కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే. మొదటి ప్రశ్న : ఈ రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందం గురించి అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్కు తెలుసా? తెలిస్తే ఆయన ఎందుకు క్యాబినెట్ సమావేశంలో ఇంత పెద్ద ఒప్పందం గురించి చర్చించలేదు ? చర్చించినట్లయితే ‘మినిట్స్’ ఉంటాయి గదా! ఎందుకు లేవు ? ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ వెళ్లి ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయన వెంట పారికర్ ఎందుకు వెళ్లలేదు? 2015, ఏప్రిల్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ వెళ్లి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండేతో చర్చలు జరిపారు. 126 రాఫెల్ యుద్ధ విమానాలకు గాను 36 యుద్ద విమానాల సరఫరాకు ఫ్రాన్స్తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఆదే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఒప్పందానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న డసౌ కంపెనీకి భారతీయ భాగస్వామి కంపెనీగా ఎంపికయిన అనిల్ అంబానీ నాయకత్వంలో రిలయెన్స్ గ్రూపు ‘రిలయెన్స్ డిఫెన్స్ ఫిక్సిడ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్’ సంస్థ మోదీ పర్యటనకు కేవలం 12 రోజుల ముందే 2015, మార్చి నెలలో ఏర్పాటయింది. అనిల్ అంబానీ గ్రూప్ 2015, జూన్ నెలలో మహారాష్ట్ర ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాగపూర్లో ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్ పోర్ట్ సెజ్ నుంచి 289 ఎకరాల స్థలాన్ని కోరింది. అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆ మేరకు స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనిల్ అంబానీ గ్రూప్ సంస్థకు అప్పగించింది. 2016లో భారత్, ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల తుది ఒప్పందం కుదిరింది. ఆ తర్వాతనే అనిల్ అంబానీ రిలయెన్స్ పేరు బయటకు వచ్చింది. 2017, అక్టోబర్ 27వ తేదీన నాగపూర్లో ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో అనిల్ అంబానీ. పక్కన డసౌ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్.... నాగపూర్లో 2017, అక్టోబర్ 27వ తేదీన ‘డసౌ రిలయెన్స్ ఎయిరోస్పేస్ లిమిటెడ్’ పేరిట సంయుక్త ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గడ్కారీ, డసౌ సీఈవో ఎరిక్ ట్రాపియర్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, అనిల్ అంబానీ హాజరయ్యారు. అయినా డసౌ భాగస్వామ్య కంపెనీ రిలయెన్స్ కంపెనీ అని తనకు తెలియదని మనోహర్ పారికర్ స్థానంలో సెప్టెంబర్లోనే కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ పలు సార్లు పదే పదే చెప్పడం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. 2016, జూన్ నెలలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంట్లో ఓ ప్రకటన చేస్తూ రాఫెల్ యుద్ధ విమానాల గురించి తనకు తెలయదనే చెప్పారు. పవర్ఫుల్ ప్రధాని ఉన్నప్పుడు కేబినెట్ డమ్మీగా ఉండడం సహజమేగానీ, ఏకంగా 60 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన రక్షణ ఒప్పందం గురించి రక్షణ మంత్రికి చెప్పకుండా ఓ ప్రధాని ఒప్పందం చేసుకుంటారా? అన్నది రెండో ప్రశ్న. ఒప్పందం గురించి తనకు తెలియదన్నట్లుగా మాట్లాడినందుకే పారికర్ను మూడు నెలల్లోనే ఆ శాఖ నుంచి తప్పించారా? అనారోగ్య కారణాలే కారణమా? 2018, ఫిబ్రవరి నెలలో నిర్మలా సీతారామన్ రాజ్యసభలో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందం విలువను వెల్లడించకపోవడానికి కారణం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలంటూ నాడు ఫ్రాన్స్, భారత్తో ఒప్పందం చేసుకోవడమేనని తెలిపారు. ఇందులో ఏ మాత్రమైన నిజముందా? భారత్కు సంబంధించిన భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు భారతీయులకు జవాబుదారీగా ఉండాల్సిన భారత ప్రభుత్వం ఇలాంటి ఒప్పందానికి లొంగడం అంటే ఎంత అర్థరహితం. ఫ్రాన్స్కు చెందిన డసౌ ఏవియేషన్స్ కంపెనీ ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీ, అలాంటప్పుడు రహస్య ఒప్పందాలకు ఆస్కారం ఉండదు. భారత్కు 36 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి 8.139 బిలియన్ యూరోల విలువైన రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు 2016 బ్యాలెన్స్ షీట్లో ఆ కంపెనీ పేర్కొంది. ఒప్పందం విలువలో రహస్యమేమి లేదని, 36 విమానాల్లోని ఫీచర్స్ ఏమీటన్నదే రహస్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడే ఆ తర్వాత వివరణ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. నేటి రూపాయి విలువతో పోలిస్తే నాటి బిలియన్ యూరోల ఒప్పందం అక్షరాల 69 వేల కోట్ల రూపాయలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు అనుభవం లేదా? రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థయిన ‘హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)’ కంపెనీ డసౌ భాగస్వామ్య కంపెనీగా ఉండాలని ప్రతిపాదించారు. ఆ కంపెనీని కాదని అనిల్ అంబానీ కంపెనీని తీసుకరావడానికి కారణం ఏమిటంటే హెచ్ఏఎల్కు అంత అనుభవం లేకపోవడమేనని నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. అనుభవాలిదుగో! అంతకుముందు సోవియట్, ఆ తర్వాత రష్యా నుంచి మిగ్, సుఖోయ్ రేంజ్ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ, ఆ తర్వాత బ్రిటన్, ఫ్రెంచ్ జెట్ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ, ఫొలాంగ్ గ్నాట్ నుంచి ఆంగ్లో-ఫ్రెంచ్ విమానాల ఒప్పందాల వరకు క్రియాశీలక భాగస్వామ్య కంపెనీగా ఉన్నది హెచ్ఏఎల్యే. అంతెందుకు ‘ఫ్రెంచ్ మిరేజ్-2000’ యుద్ధ విమానాల ప్రాజెక్టులో ప్రస్తుత డసౌ కంపెనీతోనే హెచ్ఏఎల్ గత 30 ఏళ్లుగా కలిసి పనిచేస్తోంది. అనిల్ కంపెనీకి జీరో అనుభవం యుద్ధ విమానాలను తయారు చేయడంలో అనిల్ అంబానీ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. అయినా నౌకా కంపెనీలో ఎరోనాటిక్స్ అన్నది ఓ చిన్న విభాగం. ఆయన నౌకా కంపెనీ 2011లో భారతీయ నౌకాదళంలో ఐదు నౌకల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. వాటిని 2016, నవంబర్ నాటికి అప్పగించాలి. గత నెల సెప్టెంబర్ నెలలో రెండో నౌకను సరఫరా చేసింది. ఇక మరో మూడు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. 45 వేల కోట్ల అప్పులు అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయెన్స్ కమ్యూనికేషన్లకు 45 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులను భరించలేకనే ఆయన ఇటీవల అధాని గ్రూపునకు తన పవర్ కంపెనీలను 18వేల కోట్ల రూపాయలకు విక్రయించారు. అప్పుల్లో ఉన్న కంపెనీకి ఓ భారీ ప్రాజెక్టును కట్టబెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో వివరించాలి? ఈ ప్రాజెక్ట్తో ఆ అప్పులన్నింటినీ తీర్చుకోమని చెప్పడమా? అనిల్ అంబానీ వేరు, ముకేష్ అంబానీ వేరు 2012, 2013లో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రాన్స్తో చర్చలు జరిపినప్పుడు రిలయెన్స్ కంపెనీని కూడా పరిగణలోకి తీసుకున్నారని, అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే వచ్చిందా? అని మోదీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ట్వీట్లు కూడా వదులుతున్నారు. ముకేష్ అంబానీ నాయకత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీ అప్పట్లో సంప్రతింపుల్లో పాల్గొన్న మాట నిజం. 2014లోనే అది పూర్తిగా తప్పుకొంది. ముకేష్ కంపెనీలు వేరు అనిల్ అంబానీ కంపెనీలు వేరన్న విషయం మోదీ ముఖ్యులకే తెలియకపోతే ఎలా? -
‘రాఫెల్’పై కాంగ్రెస్ను తప్పుదోవ పట్టిస్తున్నారు
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ గ్రూప్ పాత్రపై పోటీ సంస్థలు, కొన్ని శక్తులు కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నాయని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఫ్రాన్స్ నుంచి భారత్ కొంటున్న 36 ఫైటర్ జెట్లకు సంబంధించి తాము ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందడం లేదని అనిల్ లేఖలో వెల్లడించారు. భారత్లో ఆయుధాలు అమ్మాలనుకునే సంస్థలు దేశీయ కంపెనీలతో జట్టుకట్టాలన్న నిబంధన నేపథ్యంలోనే డసాల్ట్ ఏవియేషన్ సంస్థ తమ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశామన్నారు. రాహుల్ వ్యక్తిగత విమర్శలతో తీవ్ర మనోవేదనకు లోనైనట్లు అనిల్ తెలిపారు. -
‘జియో’కు ఏం ఎక్కువ, మాకేం తక్కువా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలను కాదని ఇంకా ఆవిర్భవించని ‘జియో ఇనిస్టిట్యూట్’ విద్యా సంస్థకు ‘ఎమినెన్స్ (అత్యున్నత)’ హోదాను కేంద్ర ప్రభుత్వ కల్పించడాన్ని ఈ హోదా కోసం జియోతో పోటీ పడిన సంస్థలేవీ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అలా పోటీ పడిన 27 ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఓపీ జిందాల్ యూనివర్శటీ, అజీం ప్రేమ్జీ యూనివర్శిటీ, అశోక యూనివర్శిటీ, నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంస్థల పురోగతి రికార్డును పరిగణలోకి తీసుకోకుండా ఎంత అద్భుతమైన ప్రణాళికలను చూపించినప్పటికీ రాబోయే విద్యా సంస్థ అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని ఎలా విశ్వసిస్తారని ఈ హోదా దక్కని విద్యా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ‘జియో ఇనిస్టిట్యూట్’ను ప్రతిపాదించిన రిలయెన్స్ గ్రూపునకు దేశంలో చాలా మంచి పేరున్నందున, ఆ గ్రూప్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నందున, విద్యా సంస్థ కోసం 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందున, సంస్థను ఏర్పాటు చేసిన 10 ఏళ్లలోనే ప్రపంచంలోని టాప్ 500 ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిస్తుందని పూర్తి విశ్వాసం కలిగినందున ఆ సంస్థకు ‘ఎమినెన్స్’ హోదా ఇచ్చామని ఇటు ఎంపిక కమిటీ, అటు కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే ఈ హోదా కోసం యూజీసీ ప్రతిపాదించిన ప్రమాణాల మేరకే హోదా ఇచ్చారా ? అన్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పడం లేదు. ‘గ్రీన్ఫీల్డ్’ కేటగిరీ కింద ఇచ్చామంటూ చెప్పిందే చెబుతూ సమర్థించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయోత్నిస్తోంది. ఎందులో జియోతో తాము సరితూగమో చెప్పండని ఈ గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కిందనే దరఖాస్తు చేసుకున్న తమిళనాడులోని ప్రతిపాదిత క్రియా యూనివర్శిటీ (దీనికి మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సలహాదారు), ఒరిస్సా వేదాంత యూనివర్శిటీ, హైదరాబాద్లోని ప్రముఖ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. గ్రీన్ఫీల్డ్ కింద ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, యూనివర్శిటీ, డీమ్డ్ యూనివర్శిటీ హోదాలేని ఉన్నత విద్యా సంస్థలు గ్రీన్ఫీల్డ్ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని 2017, నవంబర్ 17న యూజీసీ వివరణ ఇచ్చిందని, ఆ వివరణ మేరకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. తమ సంస్థలో భారతీయ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులు కూడా గణనీయంగా చదువుతున్నారని పేర్కొంది. గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద ఒకే ఒక్క సంస్థకు అత్యున్నత హోదా ఇస్తున్నారని తెలియడంతో అది కాస్త జియోకే దక్కుతుందని తాము భావించామని, అందుకు ఆ సంస్థకు, ప్రభుత్వానికున్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సమీకరణలు కారణం కావొచ్చని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని విద్యా సంస్థల యాజమాన్యాలు మీడియా ముందు వ్యాఖ్యానించాయి. ‘ఎమినెన్స్’ హోదా కింద ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రోత్సహకాలు ఏమీ ఉండకపోయినా విద్యా సంస్థపై పెట్టే పెట్టుబడులకు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. చదవండి: రిలయెన్స్ మీద అంత మోజెందుకు? -
అప్పుల ఊబిలోంచి రిలయన్స్ గట్టెక్కేనా?
-
అప్పుల ఊబిలోంచి రిలయన్స్ గట్టెక్కేనా?
ముంబయి: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుందంటూ మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రశ్నకు ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీ సమాధానం ఇచ్చారు. పక్కా ప్రణాళికతో తాము ముందుకు వెళ్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మదుపర్లలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. సంస్థ ప్రణాళికను బ్యాంకర్లు, సంయుక్త రుణ సంస్థల ఫోరమ్లు అంగీకరించాయని, వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ నిబంధనలో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఏడు నెలల గడువు లభించిందని వివరించారు. ఒకవేళ 2017 డిసెంబరులోపు చెల్లించకుంటేనే రుణాలను ఈక్విటీ కిందకు బ్యాంకులు మారుస్తాయని చెప్పారు. అయితే ఈ పరిస్థితి అస్సలు రాదని ధీమా వ్యక్తం చేశారు. బ్రూక్ఫీల్డ్, ఎయిర్సెల్ లావాదేవీల ద్వారా వచ్చే 25వేల కోట్లతో సెప్టెంబరు కల్లా అప్పుభారం 20వేల కోట్లకి తగ్గుతుందని అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో వాటాను విక్రయించడం ద్వారా ఆర్కామ్కు 11వేల కోట్లు వస్తాయి. అలాగే ఆర్కామ్ వైర్లెస్ వ్యాపారాన్ని ఎయిర్సెల్లో విలీనం చేసి ఎయిర్కామ్ అనే కొత్త సంస్థను అనిల్ అంబానీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ లావాదేవీల వల్ల సుమారు 60 శాతం అప్పు తగ్గుతుందని ఆర్కామ్ భావిస్తోంది. మరికొంత రుణాన్ని తగ్గించుకునేందుకు విదేశాల్లోని వ్యాపారాల్లో వాటా విక్రయాన్ని కూడా సంస్థ పరిశీలిస్తోంది. డీటీహెచ్ వ్యాపారం, స్థిరాస్తులను విక్రయించే యోచనలో ఉన్నామని అనిల్ అంబాని తెలిపారు. రేటింగ్ ఏజెన్సీలు ఆర్కామ్ రేటింగ్ను తగ్గించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తిరిగి రేటింగ్ పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. -
అట్లాంటిక్ కౌన్సిల్ అడ్వైజరీ బోర్డులో అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: రాజకీయ, కార్పొరేట్ దిగ్గజాల అంతర్జాతీయ సంస్థ ది అట్లాంటిక్ కౌన్సిల్ అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డులో వ్యాపార దిగ్గజం అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చోటు దక్కించుకున్నారు. న్యూస్ కార్ప్ చైర్మన్ రూపర్ట్ మర్డోక్, స్పెయిన్ మాజీ ప్రధాని జోస్ మారియా అజ్నార్, ఎయిర్బస్ సీఈవో థామస్ ఎండర్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్ తదితర ప్రముఖులు ఇప్పటికే ఈ బోర్డులో ఉన్నారు. రిలయన్స్ గ్రూప్ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది. దక్షిణాసియాలో.. ముఖ్యంగా భారత్లో అట్లాంటిక్ కౌన్సిల్ విస్తరిస్తున్న నేపథ్యంలో బోర్డులో అనిల్ అంబానీ చేరిక సరైన సమయంలో జరిగిందని కౌన్సిల్ చైర్మన్ జాన్ హంట్స్మాన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భౌగోళికంగా, రాజకీయంగా పెరుగుతున్న భారత్ ప్రాబల్యానికి ఇది గుర్తింపుగా అనిల్ అంబానీ తెలిపారు. -
నేడు ధీరూభాయ్కి పద్మవిభూషణ్ ప్రదానం
అందుకోనున్న భార్య కోకిలాబెన్ న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూపు వ్యవస్థాపకుడు, దివంగత ధీరూభాయ్ అంబానీకి కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయన భార్య కోకిలాబెన్ సోమవారం (నేడు) స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి వారి కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, వారి భార్యలు నీతా, టీనాలతో పాటు కుమార్తెలు నీనా కొఠారి, దీప్తి సల్గావుంకర్ కూడా హాజరుకానున్నారని సమాచారం. అంబానీ మరణించిన 14 ఏళ్ల తర్వాత ఆయనకు పద్మవిభూషణ్ ప్రకటించారు. కాగా, ధీరూభాయ్తో పాటు నిర్మాణ దిగ్గజం పల్లోంజి షాపూర్జి మిస్త్రీ, మారుతి ఉద్యోగ్ చైర్మన్ ఆర్సీ భార్గవ, సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ, మాస్టర్ కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ పాల్ ఎస్ బంగలు ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు. -
రిలయన్స్ డిఫెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్గా హెచ్ఎస్ మల్హి
న్యూఢిల్లీ : అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ అనుబంధ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్కు చెందిన నేవీ డిఫెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓగా వైస్ అడ్మిరల్ హెచ్ఎస్ మల్హి (రిటైర్డ్) నియమితులయ్యారు. పిపావావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్షోర్ ఇంజినీరింగ్ కంపెనీని రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ సీఈఓ పదవికి రాజీవ్ సుమన్ మే 30న రాజీనామా చేశారు. దీంతో మల్హి కంపెనీ ప్రెసిడెంట్గా, సీఈఓగా బాధ్యతలు చేపడతారని రిలయన్స్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో పేర్కొంది. హెచ్ఎస్ మల్హి ఇండియన్ నేవీలో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. -
చీపురు పట్టిన అనిల్ అంబానీ
ముంబై: రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీ చీపురు పట్టారు. ముంబైలోని చర్చి గేట్ రైల్వే స్టేషన్ ముందు చెత్తాచెదారాన్ని ఉడ్చారు. తన బాటలో నడవాల్సిందిగా బాక్సర్ మేరీ కోమ్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, టెన్నిస్ తార సానియా మిర్జా, తెలుగు సినీహీరో నాగార్జునతోపాటు మొత్తం తొమ్మిది మందిని ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ గాంధీ జయంతి రోజున ‘స్వచ్ఛ భారత్’లో పాల్గొనాల్సిందిగా తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారిలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు సల్మాన్ఖాన్, ప్రియాంకచోప్రా తదితరులతోపాటు అనిల్ అంబానీ కూడా ఉన్నారు. ప్రధాని పిలుపు మేరకు బుధవారం అనిల్.. తన స్నేహితులతో కలిసి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. తన ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్లో పాలుపంచుకున్న అనిల్ అంబానీని ప్రధాని మోదీ తన బ్లాగ్లో అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా అనిల్ అంబానీ ఆహ్వానించిన తొమ్మిది మంది ప్రముఖుల్లో ప్రముఖ రచయిత్రి శోభా డే, జర్నలిస్టు శేఖర్ గుప్తా, గేయ రచయిత ప్రసూన్ జోషి, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, రన్నర్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు. -
కేసీఆర్తో అనిల్ అంబానీ భేటీ
హైదరాబాద్: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఎంసీహెచ్ఆర్డీలో వీరిద్దరూ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనిల్ అంబానీ ఆసక్తి చూపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మౌలిక సదుపాయాలు, మీడియా రంగంలో పెట్టుబడులు పెడతామని అనిల్ అంబానీ కేసీఆర్కు తెలిపినట్టు సమాచారం. అనిల్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశమయ్యారు. పారిశ్రామిక విధానాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.