Sanjana galrani
-
శాండల్వుడ్లో ‘శ్వా’ ఏర్పాటు కావాలి: సంజనా గల్రానీ
చలన చిత్రపరిశ్రమలో మహిళల భద్రత, సమాన గౌరవం, పని హక్కు వంటి అంశాలపై నటి సంజనా గల్రానీ కన్నడ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘ఇండస్ట్రీలో ఒక ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న ఆర్టిస్టు అసోసియేషన్తో కలిసి ఈ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ పని చేయాలి. ఓ నటికి ఉండాల్సిన కనీస హక్కులు గురించిన చర్చ జరగాలి. ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల నిర్వహణ జరగాలి. ప్రస్తుతం తోటి పరిశ్రమల్లో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. అలాంటి బ్లాక్ మార్క్స్ కన్నడ ఇండస్ట్రీపై పడకూడదు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను.కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్టిస్టు అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, టెక్నీషియన్స్ అసోసియేషన్ల విలువైన సలహాలతో ‘శాండిల్వుడ్ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్’ (ఎస్డబ్ల్యూఏఏ – ‘శ్వా’) ఏర్పాటు కావాలి. ముఖ్యంగా ఈ ‘శ్వా’పై కర్ణాటక ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలి’’ అని సంజన ఆ లేఖలో రాసుకొచ్చారు.అలాగే ఈ లేఖను పరిశీలించవలసినదిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, హోం మినిస్టర్ పరమేశ్వర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ లక్ష్మీ హెబ్బాల్కర్లను అడ్రస్ చేశారు సంజన. అలాగే సెట్స్లో నటీమణులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక క్యారవేన్ ఉండాలని, ఓ గది అయినా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని, రాత్రి షూట్ సమయంలో సరైన పరిస్థితులు ఉండాలని... ఇవన్నీ ‘శ్వా’కి ప్రాథమిక నియమాలుగా ఉండాలంటూ మరికొన్ని నియమాలను కూడా స్పష్టం చేశారు సంజన. -
డ్రగ్స్ కేసులో సంజనకు ఊరట
యశవంతపుర: మత్తు పదార్థాలను సేవించిన కేసులో నటి సంజనా గల్రానితో పాటు వ్యాపారవేత్తలు శివప్రకాశ్, ఆదిత్య మోహన్ అగర్వాల్పై దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో నటికి పెద్ద ఊరట కలిగింది. తమపై దాఖలైన డ్రగ్స్ కేసును రద్దు చేయాలని కోరుతూ వీరు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయమూర్తి హేమంత్ చందన గౌడర్ ధర్మాసనం కేసును విచారించింది. సంజనపై బెంగళూరు పోలీసులు 2020 ఏప్రిల్, సెప్టెంబర్లో కేసులు నమోదు చేశారు. 2015, 2018, 2019లోను వీరు డ్రగ్స్ సేవించారంటూ అక్రమంగా కేసులు నమోదు చేశారని వారి తరఫున వకీలు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి వారిపై కేసులను రద్దు చేశారు. -
డబ్బు చుట్టూ... జనవరి మొదటి వారంలో సినిమా
శివ కంఠమనేని, సంజనా గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మణిశంకర్’. జీవీకే (జి. వెంకట్ కృష్టణ్) దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ నిర్మించారు. ఎంఎల్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ‘మణిశంకర్’ బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్ సీఈవో సతీష్ రెడ్డి విడుదల చేశారు. అతిథులుగా పాల్గొన్న నటుడు మురళీ మోహన్, నిర్మాత సి. కల్యాణ్ చిత్రయూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథా కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ మూవీ తెరకెక్కింది. జనవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జి. వెంకట్ కృష్టణ్. ‘‘నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్ల సాయంతో ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు శివ కంఠమనేని. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎల్ రాజా పాల్గొన్నారు. -
కరోనా తర్వాత నాకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది: సంజనా
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “మణిశంకర్”.ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి.వి.కె(జి. వెంకట్ కృష్టణ్) అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. 'ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు. చాలా త్వరగానే సినిమాను పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్లోపే సినిమాను అద్భుతంగా నిర్మించాం. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్ల సాయంతో సినిమాను నిర్మించాను. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా మా సినిమాకు సంగీతం అందించాడు' అన్నారు. డైరెక్టర్ జి. వెంకట్ కృష్టణ్ మాట్లాడుతూ.. 'సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారు. ఇదే టీంతో మళ్లీ ఇంకో సినిమా చేస్తున్నా. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి' అన్నారు. సంజన గల్రానీ మాట్లాడుతూ.. 'కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్తో సినిమాను నిర్మించారు' అన్నారు. చదవండి: షూటింగ్కు అస్వస్థతకు లోనైన కన్నడ స్టార్ ఓటీటీలో నవీన్ చంద్ర రిపీట్ -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బుజ్జిగాడు, సత్యమేవ జయతే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సంజనా గల్రానీ. ఇటీవలే గ్రాండ్గా సీమంతం జరుపుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. బాబు పుట్టాడు, కంగ్రాచ్యులేషన్స్ అన్న క్యాప్షన్ను జోడిస్తూ సంజనతో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. మరో వైపు సంజన చెల్లి నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. మే 18న ఆమె హీరో ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ గుడ్న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఇరువురికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బిగ్బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ అయిన సంజన గల్రానీ శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు అజీజ్ పాషాను పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. విడాకుల బాటలో బాలీవుడ్ దంపతులు! -
రెండోసారి గ్రాండ్గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
హీరోయిన్ సంజనా గల్రానీ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్ గత నెలలో హిందూ సాంప్రదాయం ప్రకారంలో సీమంతం జరుపుకుంది. అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. తాజాగా అందరి సమక్షంలో మరోసారి గ్రాండ్గా సీమంతం చేసుకుంది సంజనా. ఈసారి ముస్లిం పద్ధతిలో ఈ వేడుక చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన యోగక్షేమాలను పట్టించుకునేవారిని మాత్రమే ఈ శుభకార్యానికి ఆహ్వానించానని తెలిపింది. అలా ఓ 300 మందికి ఆహ్వానం పంపామంది. ఈ ఫంక్షన్కు హాజరై తనను, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది. ఈ ఫంక్షన్లోని మెనూలో మటన్ బిర్యానీ హైలైట్ అని చెప్పింది. మరో 20 రోజుల్లో చిన్నారి బుజ్జాయి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందంటూ తన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె సీమంతం ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) చదవండి: సమంత 'ఊ అంటావా మావా' పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో అక్కడికి ఎందుకు వెళ్లాలి? బాలీవుడ్పై మహేశ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు -
హీరోయిన్ సంజనకు సీమంతం చేసిన స్నేహితులు
బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా గల్రానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలు సహా పలు విషయాలను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న సంజన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సౌత్ ఇండియన్ స్టైల్లో సీమంతం జరుపుకుంది. చదవండి: బన్నీకి ఫేవరెట్ అదే.. సీక్రెట్ రివీల్ చేసిన స్నేహారెడ్డి దీనికి సంబంధించిన ఫోటోలను సంజన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. 'కొన్నిసార్లు కుటుంబం కంటే కొంతమంది స్నేహితులే నయమనిస్తుంది. ఎంతో ప్రేమగా నా సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ నా సీమంతం చేశారు. 9వ నెలలోకి ప్రేవేశిస్తున్నా. ఇంకో నెల రోజుల్లో నా బిడ్డను చూస్తాను. నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు' అంటూ పేర్కొంది. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
హీరోయిన్ చెల్లెలితో టాలీవుడ్ హీరో ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి
Aadi Pinisetty Marriage With Actress Nikki Galrani?: టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పాటలు ఎక్కనున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తుంది. బుజ్జిగాడు హీరోయిన్ సంజన చెల్లెలే నిక్కీ గల్రానీ. చదవండి: ప్రభాస్కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్,అసలేమైందంటే.. ‘యాగవరాయినుం నా కాక్క’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అంతేకాకుండా రెండేళ్ల క్రితం ఆది పినిశెట్టి ఇంట్లో జరిగిన ఓ వేడకకు సైతం నిక్కీ హాజరైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఓ ఎయిర్పోర్ట్లో వీరు జంటగా దర్శనమివ్వడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే తాజాగా నిక్కీ- ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వీరితో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' సినిమాలతో అలరించిన ఆది ఇటీవలె గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: గుండెపోటుతో పునీత్ రాజ్కుమార్ అభిమాని మృతి -
నటి సంజనకు అభ్యంతరకర సందేశాలు
యశవంతపుర(కర్ణాటక): నటి సంజనా గల్రానికి అభ్యంతరకర సందేశాలు పంపిన ఓ ఫ్యాషన్ డిజైనర్ కుమారుడిని ఇందిరానగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 అర్ధరాత్రి నటి సంజనాకు అభ్యంతరకర సందేశాలు పంపాడు. దీంతో సంజనా వాట్సాప్ చాట్ సందేశాలను పోలీసులకు అందజేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను సంజనకు ఎలాంటి సందేశాలను పంపలేదని పోలీసులకు వివరించినట్లు సమాచారం. -
మేని మెరుపులతో మురిపిస్తోన్న సంజనా గల్రానీ
-
త్వరలోనే తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్
Actress Sanjana Galrani Pregnant Expecting First Child In May 2022: బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా గల్రానీ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పేర్కొంది. 'మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి. ఇప్పుడు నేను 5నెలల గర్భంతో ఉన్నాను. డెలివరి ముందు వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదు. ప్రసవం అయ్యేంతరకు పనిచేయాలనుకుంటున్నా. కొంత మంది మహిళలు డెలివరికి రెండు వారాల వరకు కూడా పని చేస్తారు. వారి లాగే నేను కూడా ఉండాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలె ఆమె భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఘాటుగా స్పందించిన ఆమె తన వైవాహిక జీవితం చాలా బాగుందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. గతేడాది శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. -
Sanjjanaa Galrani: విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Actress Sanjjanaa Galrani Respond On Her Divorce Rumours: ‘బుజ్జిగాడు’ బ్యాటీ, కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీకి 2020 గడ్డు కాలమని చెప్పుకొవచ్చు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లింది. ఈ క్రమంలో 2020 డిసెంబర్లో బెయిల్పై బయటకు వచ్చిన ఆమె తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. అప్పటి వరకు తరచూ వార్తల్లో నిలిచిన సంజన పెళ్లి అనంతరం మీడియాకు దూరంగా ఉంది. చదవండి: ఇలా జరగడం బాధగా ఉంది: నాని భావోద్వేగం ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ అంటూ కన్నడ మీడియాల్లో వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలో సంజనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంజనకు తన భర్తతో మనస్పర్థలు వచ్చాయని, త్వరలో ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతోందంటూ సోషల్ మీడియా, మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవి కాస్తా సంజన దృష్టికి వెళ్లడంతో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ మండిపడింది. చదవండి: నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ వైవాహిక జీవితం చాలా బాగుందని, తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. అంతేకాదు ఆధారాలు లేని వార్తలు సృష్టించందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సంజన హెచ్చరించింది. కాగా కన్నడ నటి అయిన సంజన తెలుగులో పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితాలు అయ్యింది. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్లో మెరిసిన సంజన ఆ తర్వాత పలు చిత్రాల్లో సహా నటిగా, హీరోయిన్గా మెప్పించింది. -
ఆకట్టుకుంటున్న ‘మణిశంకర్’ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మణిశంకర్’. యాక్షన్ ఎలిమెంట్స్తో ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘మణిశంకర్’ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ముందు కత్తులతో ఇంటెన్స్ లుక్లో శివ కంఠమనేని ఉన్న ఈ క్రియేటివ్ మోషన్ పోస్టర్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా హీరో శివకంఠమనేని మాట్లాడుతూ.. ‘ఈ రోజు విడుదలైన మా ‘మణిశంకర్’ టైటిల్, ఫస్ట్లుక్ మోషన్పోస్టర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సంజన గల్రాని, ప్రియా హెగ్దేలతో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు జీవీకే మేకింగ్ చాలా కొత్తగా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’ అన్నారు. అలాగే దర్శకుడు జీవీకే మాట్లాడుతూ.. ‘మణిశంకర్ అనేది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. -
బిగ్బాస్ : ప్రియాంక సింగ్కు కన్నడ నటి మద్దతు
Sanjana Galrani Support To Bigg Boss 5 Contestant Priyanka Singh: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ సీజన్-5 అదరగొడుతుంది. అప్పుడే హౌస్లో అలకలు, గ్రూపు రాజకీయాలు, లవ్ యాంగిల్స్ మొదలైన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్న కంటెస్టెంట్లు టాస్కుల విషయానికి వచ్చే సరికి ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ హౌస్ను హీటెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ట్రాన్స్ జెండర్గా బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఇంటా, బయటా మంచి మార్కులే కొట్టేస్తుంది. ఇప్పటికే ఆమెకు ప్రేక్షకుల నుంచి భారీగానే మద్దతు లభిస్తోంది. ఇటీవలె నటుడు నాగబాబు సైతం ప్రియాంకకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. హౌస్లో తనకు తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నా, తన పూర్తి సపోర్ట్ మాత్రం ప్రియాంకకే అని ఇదివరకే ఆయన ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజన గల్రానీ సైతం ప్రియాంకకు తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఎప్పుడూ అబ్బాయిలు లేదా అమ్మాయిలే షోలో గెలుస్తారు. కానీ ఈసారి ఒక మార్పు తీసుకొద్దాం. ట్రాన్స్జెండర్స్ ఎప్పుడూ వాళ్ల జీవితం కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటారు. వాళ్ల మీద ఎప్పుడూ నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందుకే ప్రియాంక సింగ్ కోసం ప్రేమగా ఈ వీడియో చేస్తున్నాను. ఆమెకు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించండి' అంటూ సంజన ఇన్స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చింది. కన్నడ నటి అయినప్పటికీ ఒక తెలుగు షో గురించి మాట్లాడటమే కాకుండా, ఓ కంటెస్టెంట్కు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుండటంపై పింకీ(ప్రియాంక సింగ్)ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తొలి వారం సరయూ ఎలిమినేట్ కాగా ఈవారం ఉమాదేవి, కాజల్, ప్రియ,నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబోలతో పాటు ప్రియాంక సింగ్లు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఇప్పటికే లోబో, ప్రియాంక సింగ్, ప్రియలు సేఫ్ జోన్లో ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. మరి వీరిలో ఈవారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారన్నది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. చదవండి : ఉమాపై గెలుపు, ఏడుస్తూనే ట్విస్ట్ ఇచ్చిన లోబో! టీఆర్పీ రేటింగ్లో సత్తా చూపిన బిగ్బాస్ 5, కానీ.. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన
Sandalwood Drug Case: డ్రగ్స్ కేసులో నిందితురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమె తల్లీ రేష్మా గల్రాని ఈ విషయం తెలిపారు. అన్నింటికీ తలరాత బాగుండాలి. అయితే మేం ఎలాంటి తప్పు చేయలేదు. పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాం అని చెప్పారు. సంజన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాము డ్రగ్స్ సేవించినట్లు సీసీబీ పోలీసులు చార్జిషీటులో పేర్కొనడంపై శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలు, అందాల నటి రాగిణి ద్వివేది స్పందించారు. దేవుడు వేసిన ప్లాన్పై మనకు భరోసా ఉండాలి. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్తో సంప్రదిస్తున్నారు. డ్రగ్స్పై కఠిన చర్యలు: హోంమంత్రి రాష్ట్రంలో మత్తు దందాను నియంత్రిస్తామని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. బుధవారం కోరమంగళ్లోని కేఎస్ఆర్పీ మైదానంలో పోలీసు పబ్లిక్ స్కూలును ప్రారంభించి విలేకర్లతో మాట్లాడారు. మత్తు పదార్థాలతో యువత జీవనం నాశనమవుతోందన్నారు. పోలీసుల పిల్లలకు ఉత్తమ విద్యను అందించడానికి పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐపీఎస్ రజనీశ్ గోయల్, డీజీపీ ప్రవీణ్ సూద్ పాల్గొన్నారు. చదవండి : Drugs Case: శాండల్వుడ్ నటీమణులు రాగిణి, సంజనకు షాక్ నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్ -
సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టు: నటీమణులు రాగిణి, సంజనకు షాక్
Sandalwood Drug Case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతితో సినీ పరిశ్రమలో డ్రగ్ వ్యవహరం కలకలం సృష్టించింది. బాలీవుడ్, శాండల్వుడ్లో డ్రగ్ కేసు సంచలనం సృష్టించింది. బాలీవుడ్లో పలువురు సినీ నటీనటులు, స్టార్ హీరోయిన్స్ పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఇక శాండల్వుడ్కు వస్తే సంజన గల్రానీ, రాగిణీ ద్వివేది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని, తరచూ డ్రగ్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వారి తలవెంట్రులను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సాంపుల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నెటిజన్ రూ. కోటి డిమాండ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సోనూసూద్ తాజాగా సీఎఫ్ఎస్ఎల్ ఈ రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ రిపోర్టులో రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్లు తేలింది. 2020 అక్టోబర్లో వీరిద్దరి వెంట్రకల నమూనాలను సేకరించిన బెంగళూరు పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఈ రిపోర్టులో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడవ్వడంతో బెంగళూరు పోలీసులు మరోసారి రాగిణి, సంజనలకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సంజనా ప్రభాస్ బుజ్జీగాడు మూవీతో పాటు పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రాగిణి కన్నడలో స్టార్నటిగా గుర్తింపు పొందింది. కాగా ఈకేసులో జైలుకు వెళ్లిన సంజనా, రాగిణిలు ఇటీవల బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు రాగానే సంజన తన స్నేహితుడైన డాక్టర్ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? -
ప్రభాస్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు: హీరోయిన్
Sanjana Galrani About Prabhas: బుజ్జిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా క్లాస్తో పాటు మాస్ ఆడియెన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమా విజయవంతం అయినా సంజనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ పరిశ్రమకు పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవలె డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. శాండల్వుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన ఈ కేసుతో సంజన పేరు ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది.ఇక ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంజన.. ఇటీవలె నటిగానూ ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. ఓ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన సంజన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది. 'అరెస్ట్ అయి జైళ్లో ఉన్నప్పుడు ప్రతీరోజు జీసెస్, అల్లా, శివయ్యలను ప్రార్థించేదాన్ని. అంతేకాకుండా ప్రతీరోజు యోగా చేసేదాన్ని. వీటివల్లే ఇంత త్వరగా కంబ్యాక్ చేయగలిగాను. ఆ నెగిటివిటి నుంచి బయటపడగలిగాను' అని తెలిపింది. ఇక బుజ్జిగాడు సినిమా గురించి మాట్లాడుతూ..ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'ప్రభాస్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.ఆయన చాలా డెడికేటెడ్ యాక్టర్. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఎంతో కష్టపడేవాడు. బుజ్జిగాడు షూటింగ్ సమయంలో ప్రభాస్ చాలా సన్నగా కనిపిస్తారు. క్యారెక్టర్ కోసం ప్రతిరోజు ఆయన కేవలం పెసరెట్టు మాత్రమే తినేవారు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారన్నది ప్రభాస్ ఫిజిక్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్తో పనిచేసినందుకు సంతోషంగా భావిస్తున్నా' అని సంజన తెలిపింది. -
జైలు నుంచి వచ్చాక నటి సంజన సైన్ చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇదే..
'బుజ్జిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ. కన్నడలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సంజనకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు కలిసిరాలేదు. ఇక కన్నడలో బిజీ అవుతున్న టైంలో సంజన డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. గతేడాది శాండిల్వుడ్ ఇండస్ట్రీలో జరిగిన డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్ అయ్యే ఇటీవలె బెయిల్ మీద బయటకు వచ్చింది. అనంతరం ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ..తన కంట్లో కన్నీళ్లు అయిపోయాయని, ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అంటూ ఆదేవన వ్యక్తం చేసింది. ఇక అదే సమయంలో ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో నటిగా మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుందట సంజన. ఇందులో భాగంగానే కథలు వింటుందని, తాజాగా వెంకట కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఓ ప్రాజెక్టుకు సంజన సైన్ చేసినట్లు సమాచారం. ఫిమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు మణిశంకర్ అనే టైటిట్ను కూడా ఫిక్స్ చేశారట. అంతేకాకుండా తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో ఈ మూవీ తెరకెక్కనుందని, వచ్చే నెలలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. చదవండి : డాక్టర్తో రహస్య పెళ్లి : అందుకే అందరికి చెప్పలేదు.. సంజన డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు! -
డాక్టర్తో రహస్య పెళ్లి : అందుకే అందరికి చెప్పలేదు.. సంజన
Sanjana Galrani: శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టై, ఇటీవల బెయిల్పై విడుదలైన హీరోయిన్ సంజన గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకుంది. గతేడాది లాక్ డౌన్లోనే వివాహం చేసుకున్న సంజన.. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టింది. అలాగే రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో కూడా వివరించింది. ‘పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే డ్రగ్స్ కేసు ఇష్యూలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నా పెళ్లి విషయాన్ని ఇండస్ట్రీ వర్గాల వారితో పంచుకోలేకపోయాను. అయితే అందర్నీ పిలిచి రిసెప్షన్ని గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాం. కానీ లాక్డౌన్ వల్ల అది సాధ్యం కాలేకపోయింది’అని సంజన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తెలుగులో పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన. ఈ చిత్రం తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితమైంది. శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టై, మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై బయటికొచ్చింది. చదవండి : డైరెక్టర్ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్తో హీరో ఆశీష్ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్ -
మా డేటింగ్ను సీక్రెట్గా ఉంచాను, తప్పలేదు: నటి
శాండల్వుడ్ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన నటి సంజన గల్రానీ బెయిల్పై బయటకు రాగానే రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంతో అడుగుపెట్టిన ఆమె ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన సీక్రేట్ డేటింగ్ గురించి చెప్పుకొచ్చింది. అంతేగాక గతేడాది తను పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా భర్త అజీజ్ పాషా. ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో డాక్టర్. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. మా స్నేహం పెద్దాయ్యాక ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఎప్పుడో మేము కన్ఫాం చేసుకున్నాం కానీ ఎవరికి చెప్పలేదు. ఇన్నేళ్లు సీక్రేట్గా డేటింగ్లో ఉన్నాం. ఇక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకునే లోపే ఈ సంఘటన జరింగింది(డ్రగ్ కేసు)’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక డ్రగ్స్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నట్లు చెప్పింది. కానీ బయటకు వచ్చిరాగానే తను కరోనా బారిన పడటంతో కాస్తా నిరాశకు గురయ్యాన్నంది. అప్పుడు అజీజ్ సపోర్టుతోనే కరోనా నుంచి కోలుకున్నానని, ఆనంతరం తాను అనుకున్నట్లుగానే కొద్ది మంది సమక్షంలో అజీజ్ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అయితే తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని అందుకే ఎవరీకి చెప్పకుండా ఇన్నేళ్లు సీక్రేట్ డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది. అయితే ఆయన డాక్టర్ కావడంతో కరోనా రోగులకు వైద్యం అందించే క్రమంలో ఆయన ఎక్కువ సమయంలో ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోందని, దీంతో నా ఆరోగ్యం కంటే ఆయన ఆరోగ్యం పట్ల బెంగగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: అతడు నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన సంజన రహస్య పెళ్లి..ఫోటో వైరల్ -
అతడు నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్
బెంగుళూరు : శాండిల్ వుడ్లో గతేడాది వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో హీరోయిన్ సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు ఆమె జైలు శిక్ష అనుభవించింది. తాజాగా సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిఖిల్ హెగ్డే అనే బిజినెస్మెన్పై చీటింగ్ కేసు పెట్టడమే ఇందుకు కారణం. ఇందులో కర్ణాటకలోని కోరమంగలలో 2016లో కేఫ్ పెట్టాలని నిఖిల్ హెగ్డే ఆశ్రయించాడని,ఇందుకు గానూ తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అగ్రిమెంట్ ప్రకారం.. ప్రతీ నెలా తనకు లక్ష రూపాయలు చెల్లించాలని, అయితే ఇప్పటివరకు పేమెంట్ చేయలేదని నిక్కీ గల్రానీ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా నా ఫోన్కాల్స్కు సైతం సమాధానం ఇవ్వడం లేదని పేర్కొంది. నిక్కీ గల్రానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాలని అతడికి నోటీసులు పంపారు. కాగా 2014లో సినీ ఇండసస్స్ర్టీలోకి అడుగుపెట్టిన నిక్కీ గల్రానీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది. చదవండి : జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్ ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా! -
జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్
కన్నడ చిత్రపరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టై, ఇటీవల బెయిల్పై విడుదలైన హీరోయిన్ సంజన గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకుంది. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరి పెళ్లికి అతి కొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. తెలుగులో పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన. ఈ చిత్రం తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితమైంది. ఇక గత ఏడాది శాండిల్ వుడ్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు జైల్లో ఉండి ఇటీవల బెయిల్ పై బయటికొచ్చింది. -
డ్రగ్స్ కేసు: నటి రాగిణి, సంజనాపై చార్జిషీట్
సాక్షి, బెంగళూరు : సంచలనాత్మక డ్రగ్స్ వాడకం– రవాణా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి బెయిల్పై బయటికి వచ్చిన శాండల్వుడ్ నటీమణులు రాగిణి ద్వివేది (30), సంజనా గల్రాని (31)తో పాటు 25 మందిపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ), కాటన్పేటే పోలీసులు మంగళవారం ఎన్డీపీఎస్ కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. డ్రగ్స్ ముఠాలు, వాటి దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీల చార్జిషీట్లో సమాచారం పొందుపరిచారు. 180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇంకా పరారీలో ఉన్న వారిపేర్లు కూడా చార్జిషీట్లో ప్రస్తావించారు. డ్రగ్స్ కేసులో 2020 సెప్టెంబరు మొదటివారంలో రాగిణి, ఆ తరువాత కొన్నివారాలకు సంజనను అరెస్టు చేసి 3 నెలలకు పైగా జైల్లో ఉంచడం తెలిసిందే. రాగిణి మత్తు పార్టీలు ఇలా ► 2019 మే 26 న నటి రాగిణి పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ వద్ద గల హోటల్లో ప్రియుడు రవిశంకర్తో రాగిణి పార్టీ నిర్వహించడం, ఎక్స్టసీ డ్రగ్ మాత్రల సేవనంతో పాటు ఇతరులకూ సరఫరా చేసినట్లు చార్జిషీట్లో ప్రస్తావించారు. ► 2020 జూలై 5 న యలహంక లెరోమా హోటల్లో పార్టీలో డ్రగ్స్ సేవించారు. ► 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ముఖ్య నిందితుడు లూమ్పెపే సాంబాకు ఫోన్ చేసి డ్రగ్స్ కొనుగోలు చేశారు. నైజీరియా పర్యాటకుడు నుంచి రాగిణి డ్రగ్స్ తీసుకుంది. ► ఆమె ఇతర నిందితులకు వాట్సాప్ ద్వారా డ్రగ్స్ కావాలని అడిగారు. ఆమె ఐఫోన్ 11 ప్రోమ్యాక్స్ మొబైల్ఫోన్ను సోదా చేయగా కీలక సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. సంజన గురించీ పెద్దసంఖ్యలో అభియోగాలు ఉన్నాయి. ► ప్రియుడు రవిశంకర్తో రాగిణి డ్రగ్స్ డీల్ గురించి ఏమేం మాట్లాడారు అనేది ప్రస్తావించారు. 69వ పేజీలో 2018 డిసెంబర్ 8వ తేదీన నటి రాగిణికి వ్యతిరేకంగా రవిశంకర్ భార్య చేసిన చాటింగ్ను పొందుపరిచారు. -
ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా!
‘‘నేను ప్రయాణించనున్న రోడ్డు చాలా రఫ్గా ఉంటుందని నాకు అర్థం అయింది. కానీ దాన్ని దాటేసి మళ్లీ ఎప్పటిలానే పైకి ఎగరాలనుంది’’ అన్నారు నటి సంజనా గల్రానీ. ఇటీవలే శాండిల్వుడ్ ఇండస్ట్రీలో జరిగిన డ్రగ్స్ ఆరోపణల్లో నటి సంజనా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బెయిలు మీద బయటకు వచ్చారామె. ఈ విషయాల గురించి సంజనా మాట్లాడుతూ– ‘‘కొన్ని నెలలుగా నేను ఏడుస్తూనే ఉన్నాను. బహుశా నా కంట్లో కన్నీళ్లు అయిపోయి ఉంటాయేమో? ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అని దేవుణ్ణి ప్రార్థించాను. కానీ నాకు ఎదురయ్యే ప్రతీ విషయాన్ని నవ్వుతూ ఎదుర్కొని విజయం సాధించాలనుకుంటున్నాను. మన న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. టైమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’’ అన్నారు. పెళ్లికి గురించి మాట్లాడుతూ– ‘‘నాకు నిశ్చితార్థం అయింది. లాక్డౌన్లో ఎంగేజ్ అయ్యాను. దాన్ని ప్రకటించే వీలు లేకుండా పోయింది. ఇంత జరిగాక నా పెళ్లిని చిన్న వేడుకలా చేసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా ఛారిటబుల్ ట్రస్ట్లో పెళ్లి చేసుకుంటాం’’ అన్నారామె. అయితే పెళ్లాడబోయే వ్యక్తి పేరు బయటపెట్టలేదామె. -
డ్రగ్ కేసులో నటి సంజనాకు ఊరట..
సాక్షి బెంగళూరు : శాండల్వుడ్ నటి సంజనా గల్రానీకి ఊరట లభించింది. ఆమెకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. శాండల్వుడ్లో డ్రగ్స్ వ్యవహారంలో సంజనాను సీసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత రెండు నెలల నుంచి ఆమె పరప్పన అగ్రహార జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం న్యాయమూర్తి శ్రీనివాస్ హరీశ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ .3,00,000 విలువైన బాండ్తోపాటు అంతే మొత్తం విలువైన రెండు పూచీకత్తు పత్రాలను సమర్పించాలనే షరతు విధించారు. అలాగే నెలకు ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. (చదవండి: డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్) ఇంతకు మందు సంజనా పలుమార్లు బెయిల్ దరఖాస్తు చేసుకోగా వాటన్నింటిని హైకోర్టు తిరస్కరించింది. కాగా ఇటీవల శాండిల్వుడ్ని డ్రగ్స్ కేసు కుదిపేసిన విషయం తెలిసిందే. సీసీబీ అధికారుల విచారణలో పలువురు కన్నడ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో పలువురిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక శాండిల్వుడ్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నటి సంజనా. ఆమె కంటే ముందు రాగిణి ద్వివేదిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: వారికి అండర్వరల్డ్ డాన్లతో సంబంధాలు..!) -
వారికి అండర్వరల్డ్ డాన్లతో సంబంధాలు..!
సాక్షి, బెంగళూరు : శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు అనుమతితో నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను పరప్పన జైలులో ఐదు రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆదివారం ముగించారు. సినిమాల ద్వారా ఎంతెంత సంపాదించారనే వివరాలను సేకరించారు. రాగిణి తండ్రి రిటైర్డు మిలిటరీ అధికారి కాగా, ఆయన పలు వివరాలను ఈడీకి అందజేశారు. రాగిణిపై అధిక అనుమానాలు మరో నటి సంజన విచారణలో అనేకసార్లు ఆవేదనతో విలపించినట్లు తెలిసింది. ఎన్ని సినిమాలు నటించారు. ఎంత డబ్బులు సంపాదించారు. పిత్రార్జితం ఎంత?, ఇటీవల కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఏమిటి అని ఈడీ అధికారులు సంజనపై ప్రశ్నలవర్షం కురిపించారు. పలు భాషల్లో 42 సినిమాలలో నటించిన సంజన సినిమా రంగంలో పెద్ద పేరును సంపాదించలేకపోయినా ఆదాయానికి మాత్రం ఢోకా లేదని గుర్తించారు. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో సమాచారం కోసం ఈడీ ఇప్పటికే ఐటీశాఖకు లేఖ రాసింది. రాగిణి, సంజన ఆస్తులు, వారి సంపాదన తీరుపై ఈడీ అవగాహనకు వచ్చింది. సంజన బెయిల్ దొరికి బయటకు వచ్చినప్పటికీ విచారణ కోసం మళ్లీ అదుపులోకి తీసుకువాలని ఈడీ భావిస్తోంది. (అనుశ్రీకి అండగా మాజీ సీఎం.. ఎవరా గాడ్ఫాదర్ ?) బెయిల్ కోసం ఆరాటం రాగిణి, సంజనల విచారణలో పలు ముఖ్యమైన అంశాలను సీసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా మరికొన్ని రోజులు ఇద్దరినీ ప్రశ్నించాలని నిర్ణయించారు. సీసీబీ విచారణలో రౌడీలు, అండర్వరల్డ్ డాన్లతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరులో వారికి సహకారం అందించిన కొందరు రౌడీలపై నిఘా పెట్టారు. ఇక హైకోర్టులో బెయిలు కోసం నటీమణులు లాయర్లను సంప్రదిస్తున్నారు. (డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!) ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్ డాలర్స్ కాలనీలోని అపార్ట్మెంట్లో గంజాయి సేవిస్తున్న వరుణ్, వినోద్ అనే డ్రగ్ పెడ్లర్లను బెంగళూరు సంజయ్నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారిని విచారించగా బెంగళూరులో జరిగే పార్టీలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారని తెలిసింది. -
ఐఎంఏ స్కాంలో చేతులు కాల్చుకున్న సంజన!
బెంగళూర్ : డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిల విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది బయటపడిన ఐఎంఏ స్కామ్లో ఐఎంఏ, దాని అనుబంధ కంపెనీలు అధిక రాబడి ఆశ చూపుతూ ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. శాండల్వుడ్ డ్రగ్ కుంభకోణంలో ఇప్పుడు ఐఎంఏ నిర్వాకం వెలుగులోకి వస్తోంది. సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలతో పాటు కస్టడీలో ఉన్న ఇతరుల ఆస్తులు, పెట్టుబడులపై ఆరా తీస్తున్న సీసీబీ, ఈడీలు పలు విషయాలను రాబట్టాయి. ఐఎంఏ స్కీమ్లో తాను భారీగా వెచ్చించి నష్టపోయానని విచారణ సందర్భంగా సంజనా వెల్లడించినట్టు తెలిసింది. చదవండి : డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు! పెట్టుబడిపై వేగంగా మెరుగైన రిటన్స్ రాబట్టుకోవచ్చని తాను ఆ స్కీమ్లో పెట్టుబడి పెట్టగా ఐఎంఏ అవకతవకలతో లక్షల రూపాయల మొత్తాన్ని పోగొట్టుకున్నానని ఆమె దర్యాప్తు అధికారులకు వివరించినట్టు సమాచారం. సంజనా, రాగిణిలు హవాలా లావాదేవీలకు పాల్పడ్డారనే అనుమానంతో వీరిద్దరినీ ప్రస్తుతం సీసీబీ అధికారులు విచారిస్తున్నారు. కస్టడీలో ఉన్న మరో నిందితుని సమాచారంతో ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు సంజనా, రాగిణి బెయిల్ పిటిషన్ను ఎన్డీపీఎస్ ప్రత్యేక న్యాయస్ధానం తోసిపుచ్చింది. వారికి బెయిల్ కోసం లాయర్లు హైకోర్టును సంప్రదించాలని యోచిస్తున్నట్టు సమాచారం. -
డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!
యశవంతపుర: శాండల్వుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో తవ్వేకొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. ఈ బాగోతంలో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్ఫోన్ల నుంచి సీసీబీ అధికారులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఇద్దరి మొబైల్ఫోన్లలో సెక్స్ రాకెట్ బయటపడినట్లు సీసీబీ వర్గాల కథనం. వారి మొబైళ్లలో నీలి వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు కొందరు సీసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో డ్రగ్స్ కథలో మరో మరో దందా వెలుగుచూసినట్లయింది. నీలి స్కాంతో సంబంధమున్నవారందరికీ నోటీసులిచ్చి విచారణ చేయాలని నిర్ణయించారు. ఇద్దరి మొబైల్ ఫోన్లలో నీలి దందా కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉందని, డ్రగ్స్ కేసు బయటపడగానే ఆ గ్రూపును డిలిట్ చేశారని సీసీబీ కథనం. మరో ఇద్దరు అరెస్ట్ మత్తు బాగోతంలో మంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కెంగేరికి చెందిన ఒకరు, నైజీరియాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించారు. మంగళూరుకు చెందిన సీసీబీ బృందం వీరిని పట్టుకొంది. వీరు ముంబై, గోవాల నుంచి డ్రగ్స్ను తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) మరికొందరి విచారణ పరప్పన అగ్రహార జైల్లో ఉన్న నటి రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా సీసీబీ పోలీసులు మూడు రోజుల నుండి కొందరిని ఆఫీసుకు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ ఆఫీసులో విచారించారు. వీరిద్దరూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. మాఫియా డాన్తో సంబంధాలున్న ఒక యువకున్ని సీసీబీ అదుపులోకి తీసుకొని విచారించింది. ఇటీవల సస్పెండయిన ఒక ఏసీపీతో ఇతనికి సంబంధాలున్నట్లు తెలిసింది. -
డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లకు షాక్
బెంగుళూరు: సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలకు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. శాండిల్వుడ్ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వీరిద్దరు ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా స్పెషల్కోర్టు వీరి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఇక వేరు వేరు ప్రాంతాల నుంచి డ్రగ్స్ సేకరించి వాటిని ఫైవ్ స్టార్ హోటలల్లో, క్లబ్స్లో, పబ్లలో సంజన టీం అమ్మేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మొదట తయారు చేసిన ఎఫ్ఐఆర్లో సంజనా పేరు లేదని ఆమె తరుపు న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. కేవలం డ్రగ్స్ అమ్మే వారి పేర్లనే రిపోర్టులో ఉంచారని తెలిపారు. ఇక రాగిని ద్వివేదిని రిమాండ్లోకి తీసుకొని 24 రోజులు అవుతుండగా ఇప్పుడు ఆమె తరుపు న్యాయవాది కల్యాణ్కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక మరోవైపు కర్ణాటకలో డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమనే కాకుండా, బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, విచారించారు. సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్లోనూ సుశాంత్ మరణానంతరం డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే లాంటి ప్రముఖ కథనాయకుల పేర్లే కాకుండా ఇంకా మరికొంత మంది పేర్లు ఆ డ్రగ్స్ కేసు వ్యవహారంలో బయటకు వస్తున్నాయి. చదవండి: రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే -
డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్
బెంగళూరు: శాండల్వుడ్లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు శనివారం బెయిల్ మీద బయటకు వస్తామని భావిస్తుండగా.. వారి ఆశ కాస్త నిరాశ అయ్యింది. వీరికి సంబంధించిన బెయిల్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా అది కాస్తా సెప్టెంబర్ 21 కి వాయిదా పడింది. సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కనుక బెయిల్ పిటిషన్ విచారణని వాయిదా వేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్) ప్రత్యేక కోర్టు రాగిణి, సంజనా బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి(సెప్టెంబర్ 21) వాయిదా వేసింది. రాగిణి, సంజనలు ఇద్దరికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లకు, పెడ్లర్లకు మధ్య జరిగిన మెసేజ్లను కూడా రిమాండ్ కాపీలో పొందు పర్చారు అధికారులు. (చదవండి: డ్రగ్స్కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?) డ్రగ్స్ రాకెట్ కేసుకు సంబంధించి సీసీబీ రాగిణి ద్వివేదిని సెప్టెంబర్ 4 న అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 8 న సంజన గల్రానిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్లో ఉన్నారు. శాండల్వుడ్ డ్రగ్ రాకెట్కు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సెలబ్రిటీ జంట ఐంద్రితా రే, దిగంత్లను సీసీబీ విచారణకు పిలిచింది. ఒక రోజు ప్రశ్నించమే కాక వారి గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని తరువాత పంపించింది. ఈ రోజు నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్లను సీసీబీ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. -
సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు
బెంగళూరు : డ్రగ్స్ దందాలో దక్షిణ ఆఫ్రికా పౌరులే శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో సూత్రధారులని సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. పెప్పర్ వెల్లడించిన సమాచారం ప్రకారం బెనాల్డ్ ఉడేన్నా అనే ఆఫ్రికన్న అరెస్ట్ చేశారు. అతడు అన్ని వివరాలూ వెల్లడించాడు. కన్నడ సినిమారంగానికి చెందిన సెలబ్రిటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఉడేన్నా ఆదిత్య ఆళ్వాకు చాలా సన్నిహితుడని, డ్రగ్స్ నిందితులు రవిశంకర్, వీరేన్ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవాడని తెలిసింది. బెంగళూరుతో పాటు చుట్టు ప్రక్కల రిసార్ట్లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. (నా పరువు తీస్తున్నారు!) జైల్లో పుస్తక పఠనంలో నటీమణులు జ్యుడిషియల్ కస్టడీ కింద నటీమణులు రాగిణి, సంజనలను పరప్పన అగ్రహార జైలుకు తరలించి అక్కడ క్వారంటైన్లో ఉంచారు. జైలులో పెట్టిన టిఫిన్, భోజనాలను ఇద్దరూ ఆరగించారు. కొంతసేపు నిద్రపోతూ, మరికొంత సేపు పుస్తకాలను చదువుతూ పొద్దుపుచ్చుతున్నారు. రాగిణికి వెన్నునొప్పి సమస్య ఉండటంతో జైలు వైద్యులు ఔషధాలను అందించారు. రాగిణి, తల్లి, న్యాయవాదులను అధికారులు కలవనివ్వడం లేదు. ఫోన్లో మాట్లాడడానికి అవకాశమిచ్చారు. కింగ్పిన్లతో నటీమణులకు లింక్లు దీని ఆధారంగా ఆదిత్య ఆళ్వకు చెందిన రిసార్ట్పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. లూమా, ఉడేన్నాలు బెంగళూరులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తుండగా వీరి వెనుక కూడా ఒక పెద్ద తలకాయ ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్ చేస్తుండగానే ముగ్గురు కింగ్పిన్లు పరారు కావడంతో కేసుపై సీసీబీ గోప్యత పాటిస్తోంది. ఈ ముగ్గురు దొరికితే మరెంతోమంది క్లయింట్ల పేర్లు బయట పడవచ్చు. ఈ కింగ్పిన్లు నటీమణులు రాగిణి, సంజనలతో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు సీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆదిత్య ఆళ్వ విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సంజన ఇంట్లోని వస్తువులే ముఖ్య సాక్ష్యాలు? 14వ నిందితురాలు సంజన హై–ఫై పార్టీలలో పాల్గొనడంతో పాటు ప్రకాశ్ రాంకా, రాహుల్తో కలిసి బెంగళూరు, గోవా, కేరళ, శ్రీలంకలో పబ్, బార్, అపార్ట్మెంట్ పార్టీలకు డ్రగ్స్ను గుట్టుగా సరఫరా చేసేవారని సీసీబీ చెబుతోంది. సెలబ్రిటీలకు కూడా మత్తు పదార్థాలను పంపేవారమని రాంకా ఒప్పుకున్నాడు. సంజన ఇంటిలో 9 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా ఆమె డ్రగ్స్ మాఫియాలో పాల్గొన్నట్లు సీసీబీ అనుమానిస్తోంది. సిమ్కార్డ్, ఐఫోన్, ప్రోమాక్స్ కంప్యూటర్, సీసీ కెమెరాల డీవీఆర్లను స్వాధీనం చేసుకొని సమాచారం సేకరించగా ఆసక్తికర సాక్ష్యాలు బయట పడినట్లు తెలిసింది. నేడు సంజనా బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరుగుతుంది. కేసు విచారణలో ఉంది, నేనేం మాట్లాడను : ఐంద్రిత డ్రగ్స్ కేసుపై నేను ఏమీ మాట్లాడకూడదు, సీసీబీ అధికారులు విధించిన నియమాలను పాటించాలి అని నటి ఐంద్రితా రై అన్నారు. విచారణ జరుగుతున్నందున తను మీడియాతో మాట్లాడితే నియమోల్లంఘన కిందకు వస్తుందన్నారు. దిగంత్ సినిమా షూటింగ్లకు వెళ్లవచ్చని, కానీ బెంగళూరు విడిచి వెళ్లరాదని చెప్పారన్నారు. ఒకటి రెండురోజుల్లో ఐంద్రిత దంపతులకు మరోసారి నోటీసులు పంపవచ్చని సమాచారం. కాగా, రాధారమణ సీరియల్ నటి శ్వేతాప్రసాద్ తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన ఒక నటితో కలిసిఉన్న పోటో వైరల్ అయ్యింది. ఆ ఫోటో మీద అసభ్యంగా పోస్టింగ్లు పెట్టవద్దన్నారు. -
డేటా మొత్తం డిలీట్ చేసిన సంజనా, రాగిణి
బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన శాండల్వుడ్ అందాల తారామణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలను సీసీబీ పోలీసులు సేకరించారు. ఇందులో డ్రగ్స్ దందాతో అనేక మంది ప్రముఖులకు లింకులు ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. డ్రగ్స్ కేసు బయటపడగానే రాగిణి, సంజనలు వారి మొబైల్ ఫోన్లోని డేటాను మొత్తం డిలీట్ చేశారు. అందులో పార్టీల నిర్వహణ, డ్రగ్స్తో మజా చేస్తున్న వ్యక్తుల ఫోటోలు, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. వారు జరిపే పార్టీల్లోకి డ్రగ్స్ తీసుకొనేవారిని మాత్రమే లోనికి అనుమతించేవారని సీసీబీ పోలీసులు చెబుతున్నారు. నిందితులు పార్టీల్లో కాకుండా, నివాసం ఉండే అపార్టుమెంట్లలో వాడే డ్రగ్స్ వేరేగా ఉండేవని తెలిసింది. దీంతో వారి ఫ్లాట్లలో మళ్లీ సోదాలు జరిపే అవకాశం ఏర్పడింది. మళ్లీ కస్టడీ కోరతారా? సోమవారం సాయంత్రంతో రాగిణి, సంజనల పోలీసు కస్టడీ ముగియనుంది. దీంతో వారిని కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసులు మరింత కాలం కస్టడీ కోరతారా?, లేదా జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. వారిద్దరూ బెయిలు అర్జీలు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రాగిణిని మూడుసార్లు, సంజనను రెండుసార్లు కస్టడీకీ తీసుకుని ప్రశ్నించారు. ఇద్దరూ మహిళా సాంత్వన కేంద్రంలో ఎంతో దిగులుగా ఉంటున్నారు. ( సంజన ఫ్లాట్స్కు నటులు, సంగీత దర్శకులు ) సంజనపై డ్రగ్స్ సప్లై కేసు నటి సంజన గల్రానిపై డ్రగ్స్ సేవించడంతో పాటు డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా పోలీసులు నమోదు చేశారు. సంజన తన వ్యాపార లావాదేవీలను ఎక్కువగా ఒకే సముదాయం చెందిన వ్యక్తులకు అప్పగించటంపై కూడా సీసీబీ దృష్టి సారించింది. సీసీబీకీ పూర్తి అధికారం: హోంమంత్రి డ్రగ్స్ కేసు దర్యాప్తుకు సీసీబీకి పూర్తి అధికారం అప్పగించిన్నట్లు హోంమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అయన ఆదివారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. సీసీబీకి సిబ్బంది కొరతను నివారించి వసతులను కల్పిస్తామని చెప్పారు. డ్రగ్స్తో యువత జీవనం నాశనం కాకూడదన్నారు. ఎమ్మెల్యే జమీర్కు నోటీసు? డ్రగ్స్ దందా కేసులో చామరాజపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్కు నోటీసులు ఇవ్వాలని సీసీబీ నిర్ణయించింది. జమీర్ అహ్మద్, నటి సంజనలు శ్రీలంకలో క్యాసినోలో పాల్గొన్నట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఆరోపించటం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సంబరగి నుంచి సీసీబీ సమాచారాన్ని సేకరించింది. జమీర్ అహ్మద్ను కూడా ప్రశ్నించవచ్చని తెలిసింది. ( డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం ) కొలంబో క్యాసినోకు తారల ప్రచారం శ్రీలంకలో క్యాసినో జూదాల్లో పాల్గొనడం గురించి నటీనటులు బహిరంగ ప్రచారం చేసిన వ్యాపార ప్రకటనలు బయటపడుతున్నాయి. క్యాసినోకు మేం వెళ్లాం, మీరూ వెళ్లండి అని ఐంద్రితారై, కాజల్, బిపాసా బసు, ఊర్వశి రౌటేలా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోను సూద్ తదితర అనేకమంది నటీనటులు పాల్గొన్న ప్రకటన అది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన షేక్ ఫాసీల్కు వీరు ధన్యావాదాలు చెప్పడం గమనార్హం. వివిధ బాషలకు చెందిన నటీనటులను డ్రగ్స్ నిందితులు కావలసిన నజరానాలు ఇచ్చి క్యాసినోకు తీసుకెళ్లినట్లు సీసీబీకీ బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి. దీంతో మరికొందరు నటీనటులకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. -
సంజన ఫ్లాట్స్కు నటులు, సంగీత దర్శకులు
బెంగళూరు : డ్రగ్స్ కేసు దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది. డ్రగ్స్ వినియోగం, రవాణాపై ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన నటీమణులు రాగిణి, సంజనాతో పాటు ఆరుగురిని సీసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరు జాయిట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ శుక్రవారం ఉదయం మహిళా సాంత్వన కేంద్రానికి వెళ్లి నటీమణులు రాగిణి, సంజనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు, ఎప్పటి నుంచి పార్టీలను నిర్వహిస్తున్నారనే వివరాలు సేకరించారు. కొందరు రాజకీయ నాయకుల పుత్రులు మత్తు పదార్థాలను తీసుకొనేవారని రాగిణి, సంజనాలు వెల్లడించినట్లు తెలిసింది. విచారణలో వారు వెల్లడించిన వివరాల మేరకు సదరు రాజకీయ నేతల పుత్రులకు నోటీసులు ఇవ్వాలని సీసీబీ పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. మంగళూరుకు చెందిన ప్రతీక్శెట్టి అరెస్ట్ మంగళూరుకు చెందిన ప్రతీక్శెట్టికి ప్రముఖ డ్రగ్స్ పెడ్లర్గా పేరుంది. ఇతనిని శుక్రవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. తప్పించుకుని తిరుగుతున్న షేక్ ఫైజల్, ఆదిత్య ఆళ్వల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రతీక్శెట్టికి డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నిశాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఫైజల్ ఇంటిపై దాడి చేసి అతడి తమ్ముడిని విచారించిన సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ప్రతీక్శెట్టిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. డ్రగ్స్ కేసులో ఫైజల్ పాత్ర అధికంగా ఉన్నట్లు గుర్తించిన సీసీబీ అతని కోసం గాలిస్తున్నారు. ( డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం ) పది ఫ్లాట్సూ నావే : సంజన నటి సంజనాను పోలీసులు శుక్రవారం కూడా సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరు నగరంలో 10 ప్లాట్స్ ఉన్నట్లు అంగీకరించారు. ఫ్లాట్స్కు ఎవరెవరు వచ్చి వెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కన్నడ సినీ రంగానికి చెందిన అనేక మంది నటులు, సంగీత దర్శకులు వచ్చి వెళ్లినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో సంజనా ఫ్లాట్కు వెళ్లిన సినిమా రంగానికి చెందిన ప్రముఖులు న్యాయ సలహాలను తీసుకుంటున్నట్లు సమాచారం. కేసు నుండి తప్పించుకోవటానికి రాజకీయ నాయకులు, వ్యాపారులు, శ్రీమంతుల పుత్రులు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రాగిణి బెయిల్ పిటిషన్ వాయిదా బెయిల్ కోసం నటి రాగిణి 33వ సీసీహెచ్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది. రాగిణి పోలీసు కస్టడీ అవధి శుక్రవారంతో ముగియటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరు పరిచారు. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని సీసీబీ పోలీసులు పేర్కొనడంతో పోలీస్ కస్టడీని 14 వరకు పొడిగించింది. మరో నిందితురాలు సంజనాను కూడా శుక్రవారం కోర్టు ముందు హాజరు పరిచి కస్టడీకి తీసుకున్నారు. క్యాసినోలో మాజీ ఎమ్మెల్సీ శ్రీలంకలోని క్యాసినోలో బెంగళూరుకు చెందిన మాజీ ఎంఎల్సీ ఒకరు పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో ముగ్గురు ప్రముఖ నటులు కూడా క్యాసినోలో పాల్గొన్నట్లు సీసీబీ సమాచారం సేకరించింది. ప్రశాంత్ సంబరగిపై కేసు నమోదు సామాజిక కార్యకర్త ప్రశాంత సంబరగిపై పోలీసులు సెక్షన్ ఐపీసీ 120బి, 504 సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ఖాన్ ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జమీర్ తరఫు న్యాయవాది చామరాజపేట పోలీసులకు వివరణ ఇచ్చారు. -
నన్ను బకరా చేస్తున్నారు: సంజనా
బెంగళూరు: శాండల్వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో బహుభాషా నటి సంజనా గల్రాని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెపై సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డోప్ టెస్టు చేయించేందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. డ్రగ్ టెస్టు నిమిత్తం గురువారం ఉదయం ఆమెను బెంగళూరులోని కేపీ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పోలీసులతో, వైద్యులతో వాగ్వాదానికి దిగారు. టెస్టు చేయించుకోనని తేల్చి చెప్పారు. తను ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎందుకు పరీక్ష చేయించుకోవాలని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (చదవండి: టచ్లో బడాబాబులు) "నేనేం తప్పు చేయలేదు. అయినా ఎందుకు అరెస్ట్ చేశారు? అందరి ముందు నన్ను బకరా చేస్తున్నారు. నాకు పోలీసులపై నమ్మకం నశిస్తోంది. నన్ను రక్షిస్తామని మీడియా ముందు చెప్పారు, ఇప్పుడేమో రక్తపరీక్ష చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? నేను తప్పు చేసినట్టు ఏ సాక్ష్యం లేకపోయినా నన్ను బలిపశువును చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. పరీక్షకు అంగీకరించడం, అంగీకరించకపోవడం నా హక్కు. నేను చేయించుకోను" అంటూ సంజనా పోలీసులపైకే ఎదురు తిరిగారు. కాగా డ్రగ్స్ కేసులో సంజనా సన్నిహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. అతడి ఫోన్లో స్వాధీనం చేసుకున్న సమాచారం ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో నటి రాగిణి ద్వివేదిని, సంజన గల్రానిని సైతం అరెస్ట్ చేశారు. (చదవండి: శాండల్వుడ్ డ్రగ్స్ కేసు: సంజన అరెస్టు!) -
డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం
సాక్షి, బెంగళూరు: శాండల్వుడ్లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అతడు బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. పోలీసులు సాక్ష్యాలన్నీ చూపడంతో సంజన పెళ్లయిందని ఒప్పుకోక తప్పలేదు. మత్తు గుట్టురట్టు శాండల్వుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో సీసీబీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసులో అరెస్టయిన నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానిలను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. వారి సన్నిహితులు, మిగతా నిందితులు ముఖ్య సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ను డెబిట్, క్రెడిట్, బిట్ కాయిన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలను సేకరించారు. డార్క్ వెబ్లో డ్రగ్స్ ముఠాలు, ఆఫ్రికన్ల నుంచి కొనుగోలు చేసేవారని తెలిసింది. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన) మరికొందరు నటీమణులు? కొందరు నటీమణులు డ్రగ్స్ పార్టీలలో పాల్గొనేవారని సీసీబీ విచారణలో బయటపడింది. రవిశంకర్, రాహుల్, వీరేన్ఖన్నాలు ముగ్గురూ విచారణలో రాగిణి, సంజనల పేర్లు చెప్పినట్లు తెలిసింది. మరికొందరు నటీమణులకు కూడా డ్రగ్స్ రాకెట్తో సంబంధాలు ఉన్నట్లు నిందితులు తెలిపారు. నటి సంజనా గతంలో కారు నడుపుతూ సెల్ఫీ తీసుకుంటున్న వీడియో సీసీబీ పోలీసులకు చిక్కింది. డ్రగ్స్ కేసులో 13వ నిందితుడు నియాస్ అహమ్మద్ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తుండగా సీసీబీ పోలీసులు మరింతకాలం విచారించాల్సి ఉన్నందుకు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరికీ విడి విడి గదులు డ్రగ్స్ కేసులో మహిళా సాంత్వన కేంద్రంలో ఉంటున్న రాగిణి, సంజనా గల్రానీలకు ప్రత్యేక గదులను కేటాయించారు. ఐదు పడకలు ఉన్న హాల్ను ఇద్దరికీ ఉమ్మడిగా ఇవ్వగా, ప్రత్యేక గదులు కావాలని పట్టుబట్టారు. వారిద్దరి మధ్య విభేదాలున్నందున ప్రత్యేక గదులను కేటాయించి భద్రతను పెంచారు. ల్యాబ్కు ఇద్దరి మొబైళ్లు సీసీబీ పోలీసులు రాగిణి, సంజనాల మొబైల్ఫోన్ల నుంచి వాట్సాప్, అవుట్ గోయింగ్ కాల్ డేటాను సేకరిస్తున్నారు. సుమారు 100 మందితో వీరు నిత్యం ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అరెస్ట్ చేస్తారని తెలియడంతోనే వీరు మొబైళ్లలోని సమాచారాన్ని తొలగించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి సమాచార పునరుద్ధరణ చేస్తున్నారు. రాగిణికి అస్వస్థత రాగిణి తల తిరుగుతున్నట్లు, ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో ఆమెను కేసీ జనరల్ ఆస్పత్రికీ తీసుకెళ్లి పరీక్షలు చేయించగా లో బీపీతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు బయట పడింది. రక్తపరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పగా రాగిణి వ్యతిరేకించారు. కోర్టు ఆదేశాల మేరకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఐ అంజుమాల చెప్పగా, సరేనన్నారు. -
ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన
బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్టయిన శాండల్వుడ్ నటీమణి సంజనా గల్రానిని బుధవారం 10 గంటల సమయంలో సీసీబీ పోలీసులు మడివాళ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయానికి తీసుకురాగా, మహిళా సీఐ అంజుమాల బృందం సంజనాను విచారించారు. మహిళా సాంత్వన కేంద్రంలో రాగిణి ద్వివేదిని మహిళా సీఐ కాత్యాయని ప్రశ్నించారు. నిందితుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో పాటు వివిధ కోణాల ద్వారా సేకరించిన వివరాలపై సంజనాను విచారించారు. 34 మంది పెద్ద పెద్ద వ్యక్తుల పుత్రుల పేర్లను సంజనా సీసీబీకి వెల్లడించిన్నట్లు సమాచారం. ఆమె చెబుతున్నదాంట్లో నిజమెంతో తెలుసుకొంటున్నారు. బెంగళూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు సినిమా, బుల్లితెర, వ్యాపారవేత్తల పుత్రులున్నట్లు తెలిసింది. మంగళూరు, యలహంక, కమ్మనహళ్లిలో జరిగిన హై–ఫై పార్టీలలో ఎవరెవరు పాల్గొన్నారనేది ఆరా తీస్తున్నారు. సంజనా, రాగిణి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఇతర నిందితులు వీరేన్ ఖన్నా, రాహుల్ నిర్వహించిన పార్టీలలో రాజకీయ, వ్యాపార, సినిమా రంగాల బడాబాబులు పాల్గొనేవారని సంజనా తెలిపింది. తను తప్పు చేశానని సంజన ఆవేదన చెందినట్లు సమాచారం. తనను మీడియా ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సంజన పట్టుబట్టగా అధికారులు ఒప్పుకోలేదు. ( ఫోన్లో మెసేజ్లను తొలగించిన నటి ) సంజన కంట నీరు నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రాని కేసుల గొడవతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. బెంగళూరు డైరీ సర్కిల్లోని మహిళా సాంత్వన కేంద్రంలో వీరిద్దరినీ ఉంచారు. మంగళవారం రాత్రి వీరికి ఐదు బెడ్లు ఉన్న ఒకే గదిని కేటాయించారు. ఇద్దరి మధ్య మాటలు లేకుండా గడిపారు. ఆ చివర, ఈ చివర బెడ్లను ఇద్దరికీ కేటాయించగా, మధ్యలో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. తనకు రాత్రి భోజనం వద్దని చెప్పిన సంజనా ఇదంతా నా కర్మ అంటూ బోరున విలపించినట్లు తెలిసింది. రాగిణి, సంజనకు కేపీఎల్లో విభేదాలు వచ్చాయి. అప్పటినుంచి మాటలు లేవు. మహిళలే దొరికారా? డ్రగ్స్ దందాలో రాగిణి, సంజనా పేర్లను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారని మరో నటీమణి పారూల్ యాదవ్ ఆక్రోశించారు. వారికి మద్దతుగా ఆమె గళమెత్తారు. దేశంలో డ్రగ్స్ను సేవిస్తున్నదీ, అమ్ముతున్నదీ ముగ్గురు (రియా చక్రవర్తి, రాగిణి, సంజనా) మాత్రమేనా, ఇంక ఎవరూ ఈ దందాలో లేరా? అని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ సిబ్బంది, క్రీడాకారులు, నటులు డ్రగ్స్ వ్యవహారంలో లేరా? అని ఆమె సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. -
నటి సంజన అరెస్ట్
యశవంతపుర: కర్ణాటక సినీరంగాన్ని డ్రగ్స్ భూతం కుదిపేస్తోంది. డ్రగ్స్ రవాణా ఆరోపణలపై తాజాగా బహుభాషా నటి సంజనా గల్రానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఉంటున్న బెంగళూరులోని ఇందిరానగర రోడ్డు సాయితేజ్ అపార్ట్మెంట్పై మంగళవారం తెల్లవారుజామున దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆమె నివాసంలో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, పెన్డ్రైవ్తో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో సంజనా సన్నిహితులు రాహుల్, పృథ్వీశెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో గత శుక్రవారం ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసి విచారిస్తుండడం తెలిసిందే. అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు నటి సంజనా.. నోటీసు లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించడంతో పోలీసులు ఆగ్రహించారు. నీవు చెప్పినట్లు మేం నడుచుకోలేం అని స్పష్టంచేశారు. కోర్టు వారంట్ను చూపించి అరెస్టు చేశారు. కాగా, ఓ ఎమ్మెల్యే తనయుడు, ఓ వర్ధమాన నటి, ఇద్దరు సీరియల్ నటుల పేర్లు బయటపడినట్లు సమాచారం. -
డ్రగ్స్ కేసు: నటి సంజన అరెస్టు!
సాక్షి, బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు శాండల్వుడ్ను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా నటి సంజన సన్నిహితుడు, రియల్ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే.(చదవండి: రంగుల తెరపై డ్రగ్స్ మరక!) అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు పొందారు.( చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) టాలీవుడ్ డ్రగ్స్ కేసును తలపిస్తున్న కన్నడ చిత్ర సీమ వ్యవహారం రెండేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అకున్ సబార్వాల్ నేతృత్వంలోని సిట్ అనేక మంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు. పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరైన తారల లిస్టులో ఉన్నారు. ఇక ఇటీవల శాండల్వుడ్లోనూ ఇదే తరహా డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ క్రమంలో ఆగష్టులో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనిఖా అనే యువతి కూడా ఉంది. సోదాల్లో భాగంగా ఆమె.. డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను గుర్తించారు. విచారణలో భాగంగాపలువురు హీరోలు, హీరోయిన్లు, సింగర్లకు అనిఖా డ్రగ్స్ సరఫరా చేసినట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని.. పలువురు సెలబ్రిటీలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు బీ-టౌన్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. -
నటి సంజనకు పోలీసుల నోటీసు
కర్ణాటక,యశవంతపుర : నడుస్తున్న కారులో సెల్ఫీ తీసుకున్న కేసుకు సంబంధించి శాండిల్వుడ్ నటి సంజనకు పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే తనకు కొంత వ్యవధి కావాలని ఆమె పోలీసులను కోరారు. తను షూటింగ్ నిమిత్తం దుబాయ్లో ఉన్నానని, వచ్చిన తరువాత హాజరవుతానని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంజనా కారు నడుపుతూ సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అవి వైరల్గా మారండంతో సీరియస్గా పరిగణించిన పోలీసులు వివరణ ఇవ్వాలని సంజనకు నోటీసులు పంపారు. ఆమె సెల్ఫీపై నెటిజన్లు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. View this post on Instagram Hey guys I'm going to watch #sarileruneekevvaru ! Can’t Wait to go watch my love love loveeee ❤ #maheshbabu #fangirl A post shared by SANJJANAA GALRANI (@sanjjanaagalrani) on Jan 12, 2020 at 8:33am PST -
సంజన వర్సెస్ వందన
సాక్షి, బెంగళూరు : బహుభాషా నటి సంజనా గల్రాని, ప్రముఖ నిర్మాత వందన జైన్ల మధ్య క్రిస్మస్ ముందు రోజు జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది. ఇద్దరు పరస్పర ఆరోపణలతో పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి బెదిరించుకునే స్థాయి వరకు వెళ్లింది. ప్రస్తుతం వీరి రచ్చ శాండిల్వుడ్లో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే... క్రిస్మస్ పండగకు ముందు రోజు నగరంలోని ప్రముఖ పబ్లో జరిగిన ఓ పార్టీ లో సంజన, నిర్మాత వందన జైన్లు పాల్గొన్నారు. మద్యం మత్తులో ఇద్దరు పరస్పరం గొడవపడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సంజనా ఏకంగా బెంగళూరు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. శనివారం సంజన మీడియాతో మాట్లాడుతూ...వందనకు రూ. 200 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ దందాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయ నాయకులు, క్రికెటర్ల నుంచి వందన జైన్ అక్రమ దందాలు చేసినట్లు ఆరోపించారు. ఇదే విషయంపై నిర్మాత వందన జైన్ మాట్లాడుతూ... తనను ప్రశ్నించటానికి సంజన ఎవరిని, తాగిన మైకంలో తనపై దాడి చేయడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంజన విషయాలు తనకు అన్నీ తెలుసని, అవి బయటపెడితే రోడ్డున పడుతుందని వందన అన్నారు. సంజన మద్యం బాటిల్తో తనపై దాడి చేసిన దృశ్యాన్ని అందరూ చూశారని, తనను సంజన హత్య చేస్తానని బెదిరిస్తున్నారని అన్నారు. తనకు బెంగళూరులో స్నేహితులు ఉన్నారని, నగరానికి వచ్చిన ప్రతిసారి వారిని కలుస్తానని, క్రిస్మస్ ముందురోజు స్నేహితులతో ఉండగా సంజన తనపై మద్యం బాటిల్తో దాడి చేసిందని వందన ఆరోపించారు. నటి సంజనపై ఫిర్యాదు నటి సంజనా తనపై దాడి చేశారని బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న బెంగళూరులోని ఒక పబ్లో సంజన తనపై దాడి చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదుపై సంజన వివరణ ఇచ్చారు. తాను ఎవరిపైనా దాడి చేయలేని స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని, కేవలం తన స్నేహితులతో వాగ్వాదం జరిగిందన్నారు. -
హీరోయిన్ సంజనకు సర్జరీ
సాక్షి, బెంగళూరు : 'బుజ్జిగాడు' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన కన్నడ నటి సంజనా గల్రానీకి సర్జరీ జరిగింది. తన అండాశయంలో పెరిగిన 550 ఎమ్ఎల్ డెర్మాయిడ్ని సర్జరీ చేసి తీసివేశారని సంజన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్టు తెలిపారు. అందుకే దాదాపు ఒక నెల నుంచి ఎక్కువగా బయటకు రావడం లేదని పేర్కొన్నారు. ప్రతి మహిళ కనీసం ఆరునెలలకొకసారి అయినా మమ్మోగ్రామ్ చేపించుకోవాలని, అండాశయం, గర్భాశయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 45 సినిమాల్లో సంజనా నటించారు. సంజనా ప్రస్తుతం తెలుగులోని ఓ ప్రముఖ టీవీ చానెల్లో ప్రసారమవుతున్న ‘స్వర్ణఖడ్గం’ సీరియల్లో నటిస్తున్నారు. -
ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదు..
సాక్షి బెంగళూరు: తనపై నటి సంజన చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని దర్శకుడు రవి శ్రీవత్స కొట్టిపారేశారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలకు ఆమె క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘గండ హెండతి’ చిత్రం షూటింగ్ సందర్భంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రవి శ్రీవత్సపై నటి సంజనా ఆరోపణలు చేశారు. షూటింగ్లో మొదట ఒక ముద్దు అంటూ ఆపై 10, ఆ తర్వాత 30 ముద్దులు పెట్టారంటూ సంజనా ఆరోపించారు. రవి శ్రీవత్స స్పందిస్తూ తాను ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదని తెలిపారు. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీమణులు, సీనియర్ పాత్రికేయుడు రవి బెళగెరె సైతం ఉన్నారని పేర్కొన్నారు. ఇంతమంది షూటింగ్లో ఉండగా తాను ఎలా ముద్దు పెట్టగలనని అన్నారు. ఒకటికి రెండు సార్లు సినిమా గురించి వివరించి తెలిపాకే ఆమెను తీసుకున్నట్లు తెలిపారు. హిందీ సినిమా ‘మర్డర్’ రీమేక్ అని చెప్పి ఆ సినిమా సీడీని కూడా ఇచ్చి చూడమని తెలిపానని చెప్పారు. సంజనా పబ్లిసిటీ కోసమే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న మరో దర్శకుడు వి.నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ #మీటూను దుర్వినియోగం చేస్తున్నారని, దర్శకులు సంఘం సంజనా ఆరోపణలను ఖండిస్తోందని చెప్పారు. -
నాతో అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు..
సినిమా: తననూ మోసం చేశారు అని నటి సంజనా గల్రాణి అంటోంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో వివిధ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు నటి నిక్కీగల్రాణి సహోదరి అన్నది గమనార్హం. ఇప్పుడు సినీ పరిశ్రమలో లైంగికవేధింపుల ఆరోపణలు వీరవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరూ తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెడుతున్నారు. అలా మీటూ అంటోంది సంజనా గల్రాణి. హిందీ చిత్రంలో నటిస్తున్న సమయంలో నేనూ లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పింది. ఆ కథేంటో ఆమె మాటల్లో చూద్దాం. నేను 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టాను. అప్పుడు ప్లస్ఒన్ చదువుతున్నాను. ఆ సమయంలో సినిమాల్లో నటించి మళ్లీ చదువుకోవచ్చుననే ఆలోచనతో వచ్చాను. తొలి అవకాశం కన్నడంలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు హిందీ చిత్రం మర్డర్ను చూపించి దీన్నే కన్నడంలో రీమేక్ చేస్తున్నామని చెప్పారు. అందులో పలు అశ్లీల సన్నివేశాలు చోటు చేసుకోవడంతో నేను నటించనని చెప్పాను. అందుకా దర్శకుడు మర్డర్ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులకు తగ్గట్టుగా పలు మార్పులు చేస్తున్నట్లు చెప్పడంతో అందులో ఒక్క ముద్దు సన్నివేశంలో నటించడానికి మాత్రం నేను అంగీకరించాను. చిత్ర షూటింగ్ కోసం అమ్మతో కలిసి బ్యాంకాక్ వెళ్లడానికి అంగీకరించిన దర్శకుడు అక్కడకు వెళ్లిన తరువాత అమ్మను షూటింగ్ స్పాట్కు రావొద్దని చెప్పారు. అక్కడ నాతో పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయగా మేము చెప్పినట్లు చేయకుంటే నీ కెరీర్ను నాశనం చేస్తామని బెదిరించారు. అలా ఎన్నో కలలతో వచ్చిన చిన్న పిల్లనైన నన్ను వారు ఇష్టానికి వాడుకున్నారు అని నటి సంజనా గల్రాణి ఆవేదన వ్యక్తం చేసింది. -
సిద్దు తరపున నటి సంజనా ప్రచారం
యశవంతపుర : కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయాటనికి కన్నడ చిత్రసీమ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపుర చాముండేశ్వర నియోజకవర్గం నుండి ప్రచారం చేయనున్నట్లు నటీ సంజనా తెలిపారు. సినిరంగానికి చెందిన నటుడు యశ్ కేఆర్ నగర జేడీఎస్ అభ్యర్థి సారా మహేశ్, కృష్ణరాజ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రామదాస్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. బెంగళూరు నగరంలోని దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున లూస్ మాదయోగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాదామిలో శ్రీరాములు తరపున కూడ సినీ రంగానికి చెందిన నటులు ప్రచారం చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. -
గెడ్డం గీయించుకున్న హీరోయిన్
హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు. అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు. హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు. బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్గా చేసి, నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్సింగ్లో విలన్కు భార్యగా నటించిన సంజనా గల్రానీ కూడా ఇలాగే మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే.. అందరిలా కేవలం మేకప్తోనే సరిపెట్టకుండా ఆమె గెడ్డం కూడా గీయించుకుంది!! అదేంటి, హీరోయిన్లు గెడ్డం గీయించుకోవడం ఏంటని మీకు అనుమానంగా వచ్చిందా? పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని పూర్తిగా తీయించేసుకుంటారు. కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన వ్యక్తిగత మేకప్ మన్తో గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్ చేయించుకోవడం విశేషం. -
నేచురల్లే నుంచి రైస్ బ్రాన్ ఆయిల్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేచురల్లే బ్రాండ్ పేరుతో వంట నూనెల విక్రయంలో ఉన్న సరైవాలా అగ్రి రిఫైనరీస్ తాజాగా రైస్ బ్రాన్ ఆయిల్ విభాగంలోకి ప్రవేశించింది. అలాగే ఇదే బ్రాండ్లో సోనా మసూరీ రైస్ను సైతం సినీ నటి సంజనా గల్రానీ చేతుల మీదుగా సోమవారమిక్కడ ప్రవేశపెట్టింది. హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ప్లాంటులో రైస్ బ్రాన్ ఆయిల్ (తవుడు నూనె) కోసం ప్రత్యేక యూనిట్ను రూ.25 కోట్లతో ఏర్పాటు చేసింది. రోజుకు 100 టన్నుల నూనె ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ యూనిట్కు ఉంది. ఇక వంట నూనెల పరిశ్రమ 7 శాతం వృద్ధి చెందుతోందని సరైవాలా డెరైక్టర్ అంజని కుమార్ గుప్తా ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అయితే రైస్ బ్రాన్ విభాగం మాత్రం అత్యధికంగా 25-30 శాతం వృద్ధి నమోదు చేస్తోందని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వివిధ కంపెనీలు నెలకు 4,000 టన్నుల రైస్ బ్రాన్ ఆయిల్ విక్రయిస్తున్నాయి. కాగా, సరైవాలా అగ్రి రిఫైనరీస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద రూ.50 కోట్లతో రిఫైనరీ నెలకొల్పుతోంది. రోజుకు 550 టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటులో జూన్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. నేచురల్లే బ్రాండ్లో సన్ఫ్లవర్ ఆయిల్ను సైతం కంపెనీ విక్రయిస్తోంది.