-
రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం నీరివ్వలేదు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయితే, ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని.. అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, బీరోలు, పోచారంలో సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అలాగే దమ్మాయిగూడెం నుంచి పోచారం వరకు నిర్మాణం జరుగుతున్న కాలువ, సొరంగం పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండగా, ఇప్పటికే మొదటి లిఫ్ట్ ట్రయల్రన్ పూర్తిచేసి రెండో లిఫ్ట్ ట్రయల్ రన్కు సిద్ధమవుతున్నామని తెలిపారు.మొదటి విడత ఆగస్ట్ 15న..సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మొదటి విడతగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయిస్తామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై ఎక్కడా నీటి నిల్వకు రిజర్వా యర్లు కట్టలేదని, దీంతో 10 టీఎంసీల నుంచి 12 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ నిర్మించాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. కాగా, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్ర నాయక్, నీటిపారుదల శాఖ సీఈ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. -
మే నెలాఖరుకల్లా ‘సీతారామ’ పనులు పూర్తవ్వాలి
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెకు కింద కాలువల పనులను మే నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఆదివారం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సీతారామ ప్రాజెక్టు పురోగతి, చేపట్టాల్సిన పనులపై మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా ఉత్తమ్తో కలిసి సమీక్షించారు. పెండింగ్లో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకా సాగర్, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ప్రాజెక్టుపై సుమారు రూ. 7,500 కోట్లు ఖర్చు చేశారని, మూడు పంప్హౌస్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. టెండర్లు పూర్తి చేయాలి.. రూ. 70 కోట్లతో ఏన్కూరు వద్ద లింకు కెనాల్ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు వేగంగా చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ పనులు పూర్తి చేస్తే వచ్చే సీజన్లోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, బేతుపల్లి పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇటీవల గండుగులపల్లిలో జరిగిన సమావేశంలో సమీక్షించిన అంశాలను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లగా సంబంధిత పనులను దశలవారీగా ప్రాధాన్యతను బట్టి పూర్తిచేసి మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. యాతాలకుంట భూసేకరణ త్వరగా తేలిస్తే కెనాల్ కింద నీరు ఇవ్వొచ్చన్నారు. ఈ పనులు పూర్తయితే సీతారామ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. సత్తుపల్లి ట్రంకు కెనాల్కు సంబంధించి భూసేకరణకు చెల్లించాల్సిన రూ. 12 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పాలేరు టన్నెల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పై పనులన్నీ పూర్తి చేస్తే వైరా రిజర్వాయర్ కింద 1.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. -
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే రాజకీయాలకు గుడ్బై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల విడుదలను కళ్లారా చూశాకే రాజకీయాల నుంచి విరమిస్తానని... ఆ కోరిక నెరవేర్చుకునేందుకే ఎన్నికల్లో నిలబడుతున్నానని , ప్రజల కోరిక మేరకే నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి తుమ్మలను ఖమ్మంలోని ఆయన స్వగృహంలో కలిశారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ హోదాలో పొంగులేటి తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారన్నారు. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక అధికారికంగా నీళ్లు వదిలి అదే వేదికపై అందరికీ ధన్యవాదాలు తెలిపి రాజకీయాల నుంచి విరమించాలనేది తన జీవిత కోరిక అని వ్యాఖ్యానించారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పతనం మొదలైంది: శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి, రెండు శాతం ఓట్లు కూడా లేని సమయాన కేసీఆర్ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరి జిల్లాను అభివృద్ధి పథాన నడిపించారని చెప్పారు. అయితే, బీఆర్ఎస్లో కొన్ని శక్తులు ఆయ న్ను అవమానాలు, అవహేళనలకు గురిచేసి బయటకు వెళ్లేలా చేశాయన్నారు. కాంగ్రెస్ పక్షాన మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
ఆగిన ‘సీతమ్మ సాగర్’ పనులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిపై చేపట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. సీతమ్మ సాగర్ నిర్మాణ పనులకు సంబంధించి అభ్యంతరాలను లేవనెత్తుతూ కొందరు వేసిన పిటిషన్పై గ్రీన్ ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏమైనా పనులు జరుగుతున్నాయా? లేదా ? అనే అంశాలను ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పని ప్రదేశం నుంచి కొంత మిషనరీ, కార్మికులను వెనక్కి రప్పించింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు నిలిపివేయనుంది. బాధితుల ఫిర్యాదుతో.. గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సీడబ్ల్యూసీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి పొందేందుకు తుది డీపీఆర్ను సిద్ధం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైన వేసవికాలం వృధా కాకూడదనే ఉద్దేశంతో బ్యారేజీ అనుబం«ధ పనులు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో బాధితులు మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. పనులకు సంబంధించి కొన్ని ఫొటోలను సైతం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి బోర్డులో ఎస్ఈ ర్యాంక్కు తక్కువ కాని వారు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత కమిటీ జూన్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది. జూలై 12లోగా ఈ కమిటీ తమ నివేదికను అందించాల్సి ఉంటుంది. ఆ ముద్ర పడకూడదని.. తెలంగాణాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోందనే ఆరోపణలు మొదట్నుంచీ ఉన్నాయి. ముఖ్యంగా ‘సీతారామ’డిజైన్ల విషయంలో కోర్రీల మీద కొర్రీలు వేస్తూ వస్తోంది. ఈ సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే ముద్ర పడటం మంచిది కాదనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే బ్యారేజీ, కరకట్టల దగ్గర జరుగుతున్న పనులు ఆపేయాలంటూ నిర్మాణ సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం సీతారామ ఇంజనీర్లను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్లో స్టే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. అయితే బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది. మరోవైపు నష్టపరిహారం సైతం తగు మొత్తం చెల్లించడం లేదంటూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు బాధితుల్లో కొందరు సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్నారంటూ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 26న గ్రీన్ ట్రిబ్యునల్ పనులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం
తిరుమలాయపాలెం: రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చి న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రస్తు తం అందరి ముందున్న లక్ష్యమని, జెండా ఏదైనా అజెండా ఒక్కటేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆదివారం నిర్వహించిన పాలే రు నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నిధులు, నీ ళ్లు, నియామకాలు అని చెప్పి అధికారంలో కి వచ్చారని, రాష్ట్రంలో నేడు అప్పులు, రైతులు, యువత ఆత్మహత్యలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. 20కి మించి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన గ్రా మం ఉంటే చూపించాలని పొంగులేటి సవాల్ విసి రారు. 36.86 లక్షల మంది రైతుల్లో 5.86 లక్షల మందికే రుణమాఫీ చేశారని, ఇంకా 31 లక్షల మందికి రుణ మాఫీ కాలేదని, బడ్జెట్లోనూ దానికి ప్రత్యేక నిధులు కేటాయించలేదని విమర్శించారు. రూ.19,600 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు ఆరేళ్లలో రూ.6,200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇంకా రూ.13 వేల కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉందని, సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతామన్న పెద్దమనిషి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయ డంలో కేసీఆర్ దిట్ట అన్నారు. మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సీతారామ’ కొత్త ఆయకట్టు కొంతేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డు ప్రశ్నల వర్షం కురిపి స్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రం నుంచి స్పష్టత కోరిన బోర్డు తాజాగా మరో లేఖను సంధిం చింది. గతంలో గరిష్ట వరద వచ్చినప్పుడు ఉండే ముంపు సమస్యలు, ప్రాజెక్టు డిజైన్లపై పలు ప్రశ్నలు లేవనెత్తిన బోర్డు.. తాజాగా కొత్త ఆయ కట్టుకు ప్రతిపాదించిన నీటి వినియోగం, విద్యుత్ లెక్కలపై ప్రశ్నలు వేసింది. పాక్షిక వివరాలతో నివేదికను ఆమోదించలేమని, పూర్తి వివరాలను వీలైనంత త్వరగా తమకు సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. బోర్డు సంధించిన ప్రశ్నలు ఇలా.. ► పాత ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ ప్రాజెక్టుల ద్వారా 33 టీఎంసీలను వినియోగిస్తూ 4.10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతిపాదిం చారు. తదనంతరం సమీకృత దుమ్ముగూడెం ప్రాజెక్టును 50 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతి పాదించారు. కానీ ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 70 టీఎంసీల నీటిని తీసుకుంటూ కేవలం 3.35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టునే ఎందుకు ప్రతిపాదించారో కారణాలు చెప్పాలి. ► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షల క్యూసెక్కులుగా ఉన్నప్పుడు గోదావరి నీటిమట్టం 62.86 మీటర్లుగా ఉంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు గరిష్ట నీటిమట్టం 60.43 మీటర్లుగా ఉంది. కానీ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ను 56.5 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ అంశానికి సంబంధించి అన్ని వరద లెక్కల వివరాలు సమర్పించాలి. ► గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని వినియోగిస్తామని తెలిపారు. మరి వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీలను ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలి. ► ఇక 70 టీఎంసీలను తరలిస్తున్నా ఆ నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవా? ► ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న హెడ్రెగ్యు లేటర్ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకొనేలా డిజైన్ చేయగా కాల్వ సామర్థ్యాన్ని మాత్రం 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారు. దీనిపై తేడాలెందుకో తెలపాలి. ► ప్రాజెక్టు అప్రైజల్ కమిటీకి ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు విద్యుత్ అవసరాలు 694 మెగావాట్లుగా పేర్కొనగా డీపీఆర్లో వాటిని 725 మెగావాట్లుగా పేర్కొన్నారు. ఏది సరైనదో వివరణ ఇవ్వాలి. ► స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధర, డీపీఆర్లో పేర్కొన్న యూనిట్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఇందుకుగల కారణాలు తెలపాలి. ► ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 1,480 టీఎంసీల గోదావరి లభ్యత జలాల్లో 900 టీఎంసీలు తమవేనని తెలంగాణ చెబుతోంది. కానీ డీపీఆర్లో సాంకేతికంగా 1,480 టీఎంసీల నీటికి ఆమోదం లభించలేదని వ్యాప్కోస్ తెలిపినట్లుగా పేర్కొ న్నారు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన తెలంగాణ నీటిని వినియోగిస్తుందో స్పష్టత ఇవ్వాలి. -
Sitarama project: ముంపు సంగతేంటి...?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై సునిశిత పరిశీలన చేస్తున్న గోదావరి బోర్డు.. తాజాగా సీతారామ ఎత్తిపోతలపై అనేక ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు హైడ్రాలజీ వివరాలు, డ్రాయింగ్లు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, నిధుల ఖర్చులు, వచ్చిన అనుమతులకు సంబంధించి అన్ని వివరాలు తమ ముందుంచాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. డీపీఆర్ ఆమోద ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా తాము కోరిన వివరాలన్నీ సమర్పించాలంటూ తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. ఇందులో ప్రధానంగా.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షలుగా ఉన్నప్పుడు గోదావరి నీటి మట్టం 62.86 మీటర్లుగా ఉందని పేర్కొంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు అత్యధిక నీటి మట్టం 60.43 మీటర్లు ఉందని చెప్పింది. కానీ, ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ 56.5 మీటర్లులో నిర్మి స్తున్నారని, గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోందన్న అనుమానాన్ని బోర్డు వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర వరదల లెక్కలతో తమకు నివేదించాలని కోరింది. రబీకి ఎక్కడి నుంచి మళ్లిస్తారు... ఇక గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకుంటా మంటున్నారని, వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలని కోరింది. హెడ్రెగ్యులేటర్ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా డిజైన్ చేయగా, కాల్వ సామర్థ్యాన్ని 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారని, ఈ తేడాలెందుకో తెలపాలని కోరింది. ఇప్పటికే ప్రాజెక్టులో 50శాతం పనులు పూర్తయ్యా యని చెబుతున్నారని, అయితే ప్రస్తుతం మిగిలిన పనులు, నిధుల ఖర్చు వివరాలు తెలపాలంది. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ అవసరాలు, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధరలు, దీనికి అనుగుణంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలు అందించాలని తెలిపింది. గోదావరికి సంబంధించి తెలంగాణ, ఏపీ సరిహద్దులుగా ఉన్న కొత్త మ్యాప్లు, పరివా హక రాష్ట్రాలో వివిధ సందర్భాల్లో జరిగిన ఒప్పం దాల నివేదికలు తమ ముందుంచాలని తెలిపింది. కాళేశ్వరం, సీతారామ ద్వారా 307 టీఎంసీల మేర నీటిని తెలంగాణ వినియోగిస్తుందన్నందున దుమ్ముగూడెం వద్ద లభ్యతగా ఉండే మిగతా జలాలు, సహజ(ఎకో) ప్రవాహాల వివరాలు అందించాలంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు లభించిన అన్ని రకాల అనుమతులు ముఖ్యంగా పర్యావరణ, అటవీ, రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం వంటి వివ రాలను సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. -
‘సీతారామ ప్రాజెక్టు’ వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(కేసీఆర్) అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సిఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. చదవండి: ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేసీఆర్ గుడ్న్యూస్ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సీలు మురళీధర్ రావు, హరేరామ్, సిఇలు వెంకట కృష్ణ, శంకర్ నాయక్, మధు సూదన్ రావు, ఎస్.ఇ. శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు ‘‘అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది. దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటి ద్వారా ఖమ్మం జిల్లా యావత్తు నీరు అందించవచ్చు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి, అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్ కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలి. సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాలువలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాలి. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్ కల్లా పూర్తి చేయాలి. కృష్ణా నదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదు. అంతా అనిశ్చితి ఉంటుంది. కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి’’ అని సిఎం చెప్పారు. -
‘సీతారామ’ వేగం పెంచండి
సాక్షి, కొత్తగూడెం: కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, మే చివరికల్లా మొదటి ప్యాకేజీ పనులు పూర్తవ్వాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ ఆదేశించారు. శనివారం అశ్వాపురం మండలంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండేతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చిన బృందం నేరుగా అశ్వాపురం గౌతమీనగర్ హెవీవాటర్ ప్లాంట్లోని పర్ణశాల అతిథి గృహానికి చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుమ్మరిగూడెం వద్ద ప్రస్తుతం ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీతమ్మసాగర్ పేరుతో మరో ఆనకట్ట నిర్మించేందుకు నిర్ణయించిన ప్రాంతాన్ని పరిశీలించారు. మ్యాప్ల ద్వారా కాంటెక్ సంస్థ, అధికారులతో మాట్లాడి కొత్త బ్యారేజీ ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం, వరద ముంపు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంప్హౌసులు, కెనాల్ పనుల వివరాలు తెలు సుకున్నారు. అనంతరం బీజీకొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మొదటి ప్యాకేజీ పంప్హౌస్ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ అధికారులు, నిర్మాణ సంస్థ బాధ్యులతో మాట్లాడి పంప్హౌస్ పనుల పురోగతిని, పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే వివరాలు తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం సీతారామ పనుల తీరుపై మేఘా సంస్థ అధికారులతో సీతారాంపురం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. విద్యుత్ స్టేషన్కు వెళ్లే రహదారిపై దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలని సూచించారు. 8 ప్యాకేజీలపై సమగ్ర సమీక్ష పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండొద్దని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నిర్ణీత కాలంలోనే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు 8ప్యాకేజీల పనులను రజత్కుమార్ సమగ్రంగా సమీక్షించారు. మొదటి ప్యాకేజీలో 75 శాతం పనులు పూర్తి కావచ్చాయని, రెండో ప్యాకేజీ పనులను వేగవంతం చేశామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పనులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఎస్ఈ నాగేశ్వరరావును ఆదేశించారు. 3వ ప్యాకేజీ పనులు పురోగతిలో ఉన్నాయని, 4వ ప్యాకేజీలో మిషన్ భగీరథ పైపులైన్ల పనుల కారణంగా 60 శాతం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇసుక కొరత ఉందని, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఇసుక విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. మార్చి 22 నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు ఒక దశకు వచ్చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈలు వెంకటకృష్ణ, నాగేశ్వరరావు, ఈఈ బాబురావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తహసీల్దార్ భగవాన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులున్నారు. -
‘సీతారామ’ ప్రాజెక్ట్ పరిశీలనకు సీఎం కేసీఆర్?
సాక్షి, కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో భద్రాద్రి జిల్లాలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంను జిల్లాకు తీసుకొచ్చేలా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినట్లేనని రేగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకే. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని సైతం ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్ వద్ద ఒక లింక్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బంది వచ్చినా ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజీకొత్తూరు వద్ద ఫేస్–1 పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశముంది. ఇక తాజాగా దుమ్ముగూడెం వద్ద రూ.3,400 కోట్లతో మరో ఆనకట్ట నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు నీటి కొరత లేకుండా 30 టీఎంసీలా నీరు నిల్వ ఉండేలా దీనికి రూపకల్పన చేశారు. గోదావరిలో ప్రతిఏటా వస్తున్న వరద నీరంతా వృథాగా సముద్రంలోకి వెళుతోంది. మరోవైపు గత వేసవిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో అశ్వాపురం మండలంలోని భారజల కర్మాగారంలో రెండురోజుల పాటు ఉత్పత్తి నిలిపేశారు. దుమ్ముగూడెం హైడల్ ప్లాంట్లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మరో ఆనకట్ట నిర్మించేలా కార్యాచరణ రూపొందించారు. రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్.. ఏజెన్సీ ఏరియాలో సాగునీటి కోసం రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత నెల 21న నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి మణుగూరు సబ్డివిజన్లో పర్యటించారు. 30వ తేదీన మంత్రి అజయ్కుమార్ పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యటించిన సీఎం.. సీతారామ ప్రాజెక్టు వద్దకు రానున్నారు. అలాగే జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పడంతో పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సీఎం పర్యటన ఖాయమైనట్లే పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన మొదట పినపాక నియోజకవర్గంలో ఉండేలా కృషి చేశాను. సీఎం అంగీకారంతో ఇది సాధ్యమవుతోంది. పోడుభూముల సమస్య పరిష్కారానికి కూడా కేసీఆర్ అంగీకరించారు. సీఎం పర్యటన తరువాత ఈ సమస్య కొలిక్కి వస్తుంది. – రేగా కాంతారావు, ప్రభుత్వ విప్ -
‘సీతారామ’ పూర్తి చేయిస్తా
సాక్షి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉభయ జిల్లాల ప్రజల సమస్యలు తనకు కూలంకశంగా తెలుసునని, రెండు జిల్లాల అభివృద్ధికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. బుధవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో గోదావరి నీళ్లు తాగి, మైదాన ప్రాంతంలో పెరిగానని అన్నారు. ఉమ్మడి జిల్లాపై పట్టు ఉందని, ప్రజలతో తన కు, తన కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తనకు మంత్రి పదవి ఉన్నప్పటికీ ఎప్పటిలా సామాన్యుడిలాగే ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటా నని తెలిపారు. తన కుటుంబం కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చిందని, తాను కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నానని.. క్రమశిక్షణతో తన బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు. జిల్లాకు అతి ముఖ్యమైన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రానైట్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, తన వద్దకు వచ్చిన ప్రతి సమస్యనూ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని, వడివడిగా జిల్లాల అభివృద్ధి ముందుకు సాగేలా కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గాన్ని అభి వృద్ధి చేసుకునే అవకాశం వచ్చిం దని, నగరం అభివృద్ధికి ఇప్పటికే పలుచోట్ల రోడ్ల విస్తరణ చేసి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, ప్రజలు సహకరిస్తే మిగిలిన రోడ్ల వైడింగ్ చేపడతామని వివరించారు. రోడ్లపై ఏర్పడిన గుం తలను పూడ్చేందుకు ప్రస్తుతానికి ప్యాచ్ వర్క్లు చేయిస్తున్నామని, వర్షాలు కురుస్తుండడంతో పనులు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం చివరి వరకు ఖమ్మంలో ఐటీ హబ్ను ప్రారంభిస్తామన్నారు. ఖమ్మంలో నిర్మిస్తున్న నూతన బస్ స్టేషన్ను మోడల్ బస్ స్టేషన్గా చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో పర్యటించిన తాను త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి సమస్యలపై దృష్టిసారిస్తానని ప్రకటించారు. -
ఆగస్టులో ట్రయల్ రన్
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్టు మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. మండల పరిధిలోని వీకే రామవరం, కమలాపురం గ్రామాల్లో జరుగుతున్న పంప్హౌస్, కెనాల్ నిర్మాణ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. వీకే రామవరంలో జరుగుతున్న పనులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కమలాపురంలో పనులు నత్తనడకన జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకుని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులు చేయాలి కాని.. కుంటిసాకులు చెప్తూ జాప్యం చేయడమేమిటని ఏజెన్సీలను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పనులు జరగకపోవడానిక కారణాలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జాప్యం జరిగిన రోజులకు సంబంధించి సిబ్బంది వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. సైట్ మేనేజింగ్, ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయం ఏమాత్రం లేదన్నారు. దశల వారీగా రోజుకు ఎంత పని చేయాల్సి ఉందనే అంశంపై ప్రణాళిక తయారుచేసుకుని దాని ప్రకారం పనులు చేస్తే త్వరగా పూర్తవుతాయన్నారు. రోజువారీ ఎంత కాంక్రీట్ పనులు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకుని, మూడు పంప్హౌస్ల నిర్మాణాలకు సంబంధించి రోజువారీ షెడ్యూల్ను అందచేస్తామని, ఆ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మొదటి, రెండు, మూడు పంప్హౌస్ల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా సీఎం కార్యాలయం నుంచి సీసీ టీవీలు ఏర్పాటు చేసుకుని పనులను ప్రతీ రోజూ పర్యవేక్షిస్తానన్నారు. ప్రాజెక్ట్ మొదటి, రెండో దశలకు 6 మోటార్లు, మూడో దశకు 7 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు గ్రావిటీ కెనాల్ 1,2,3,4,7,8 పనులు అక్టోబర్ మాసం చివరి నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్ పనుల్లో వేగం పెంచాలని, రానున్న వర్షాకాలం నాటికి సివిల్ పనులు పూర్తి చేయకపోతే వర్షాల వలన ఇబ్బందులు వస్తాయన్నారు. బీజీ కొత్తూరుకు వస్తుండగా కాలువ పనులు జరగడంలేదని గుర్తించానని, ఒక్క మనిషి కూడా కాలువ పనులు చేయడంలేదన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రజత్కుమార్ శైనీ, సీఎంఓ ఓఎస్డీ పెద్దారెడ్డి, ఈఈ నాగేశ్వరరావు, ములకలపల్లి తహశీల్దార్ ముజాహిద్, ప్రతిమ ఏజెన్సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అశ్వాపురం: సీతారామ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ నిర్మాణ సంస్థను, అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ–1లో భాగంగా మండల పరిధిలోని బీజీకొత్తూరులో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్హౌస్ పనులను ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్దేశ్పాండే, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, జిల్లా కలెక్టర్ రజత్కుమార్ శైనీతో కలిసి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ శుక్రవారం సందర్శించారు. పంప్హౌస్ పనులు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పంప్హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, పనులు ఎంత వరకు పూర్తయ్యాయి, పనుల్లో పురోగతిని, గోదావరి జలాలు పంప్హౌస్ వరకు ఎప్పటి వరకు తరలిస్తారనే వివరాలు తెలుసుకున్నారు. బీజీకొత్తూరు పంప్హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, కెనాల్పై వంతెనల నిర్మాణాలు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, జనవరి 23న పనులను సందర్శించిన సమయంలో మార్చిలో మోటర్లు డ్రై రన్ నిర్వహించి మే నెల కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదని, పనులపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని స్మితా సబర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ, అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో అలసత్వం వహిస్తే వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మొదటి పంహౌస్ , కెనాల్ పనులు వేగవంతం చేయాలన్నారు. మోటర్లు, పంపులు అమర్చే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ కల్లా పాలేరు జలాలకు సీతారామ జలాలు అనుసంధానం చేసేలా పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో అలసత్వం వహించినా, పనులు గడువు లోపు పూర్తి చేయకున్నా ఊరుకునేది లేదని తగిన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థను, ప్రాజెక్ట్ అధికారులను హెచ్చరించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రతీ రోజు జరిగిన పనులపై తనకు పూర్తి నివేదిక అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈ టీ.నాగేశ్వరరావు, ఈఈ బాబూరావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం శ్రీనివాసరావు, ఏఈలు రమేష్, శ్రీనివాస్, స్వాతి, రాజీవ్గాం«ధీ, దుర్గాప్రసాద్, మణుగూరు డీఎస్పీ సాయిబాబా, సీఐ రమేష్, తహసీల్దార్ అరుణ, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
‘సీతారామ’లో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగు అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. కేంద్ర అటవీ మరియు పర్యావరణ మం త్రిత్వ శాఖ ప్రాజెక్టుకు అవసరమైన తుది పర్యావరణ అనుమతికి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ యస్.కర్కెట్ట అనుమతుల మంజూరుకు సంబంధించి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వి.సుధాకర్కు మంగళవారం లేఖ పం పించారు. గతేడాది నవంబర్ 27న జరిగిన ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) సమావేశంలో సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని ఈ ప్రాజెక్టు అధికారులు కేంద్ర పర్యావరణ శాఖకు సిఫారసు చేసిన సంగతి తెలి సిందే. వారి సిఫారసు మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అనుమతిని జారీ చేసింది. పనులకు తొలగిన అడ్డంకి దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్ జిల్లాల్లో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు మరియు 1,39,836 హెక్టార్ల స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో 3 జిల్లాల్లో 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు దారి పొడుగునా చిన్న నీటి చెరువులను నింపడం, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఒక హెడ్ రెగ్యులేటర్ని, 372 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 4 పంప్హౌజ్ల నిర్మాణం, డెలివరీ సిస్టర్న్ నిర్మాణం, 9 కిలోమేటర్ల పైప్ లైన్, వాగులపై క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్, టన్నెల్స్, కాలువలపై క్రాస్ రెగ్యులేటర్లు మరియు తూముల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణాలకు మొత్తంగా 8,476 హెక్టార్ల భూమి అవసరం ఉండగా అందులో 1,531 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఈ భూముల వినియోగానికి పర్యావరణ అనుమతి తప్పనిసరి. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి పొందేందుకు గత ఆగ స్టులో మూడు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ అభిప్రాయ సేకరణ వివరాలతో కూడి న నివేదికను సాగునీటి శాఖ ఈఏసీకి సమర్పించగా, అన్ని పరిశీలించిన ఈఏసీ శాఖ అధికారులు.. ఇచ్చిన వివరణలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. వారి సిఫారసు మేరకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ – 2006కి లోబడి మంత్రిత్వ శాఖ ఈ నెల 7న తుది పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుకు లేఖ రాసింది. ఈ అనుమతి పదేళ్ళ వరకు మనుగడలో ఉంటుందని లేఖలో పేర్కొంది. వచ్చే ఖరీఫ్ నాటికే తొలి ఫలితాలు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.13,384.80 కోట్లు కాగా, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మూడేళ్లల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. తొలి ఫలితాలు మాత్రం ఈ జూన్, జూలై నాటికి పొందేలా కార్యాచరణ రూపొందించింది. ప్రాజెక్టుల పరిధిలోమూడు పంప్హౌజ్ల నిర్మాణం చేయనుండగా ఇం దులో మొదటి పంప్హౌజ్ను జూన్, జూలై నాటికి, రెండో పంప్హౌజ్ను ఆగస్టు, సెప్టెంబర్ నాటికి, మూడో పంప్హౌజ్ను అక్టోబర్, నవంబర్నాటికి పూర్తి చేసేలా సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో నీళ్లందని ఆయకట్టుకు సీతారామ ద్వారా వచ్చే ఖరీఫ్లోనే నీళ్లందించాలని సూచించారు. దీనికోసం 130 కిలోమీటర్ల కాల్వల తవ్వకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కాల్వల తవ్వకం పూర్తయితే.. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేసి సాగర్ కింది కాల్వలకు కలపాలని, వీలైనన్ని ఎక్కువ చెరువులు నిలపాలని సైతం సీఎం సూచించినట్లుగా తెలిసింది. ఫలించిన కేసీఆర్ దౌత్యం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ని కలిసి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని కోరారు. అనంతరం మంత్రి హర్షవర్ధన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగానూ ఈ అంశాన్ని కేసీఆర్ మరోసారి లేవనెత్తారు. ఈ దౌత్యం ఫలించి అనుమతులు మంజూరయ్యాయని అధికారులంటున్నారు. పర్యావరణ అనుమతిని మంజూరు చేసినందుకు కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు ధన్యవాదాలు తెలిపారు. -
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం సీఎం కేసీఆర్ జరిపిన దౌత్యం ఫలించింది. ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు పొందిన సీతారామ ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. -
జూన్లోగా ‘సీతారామ’ మొదటి దశ పనులు
సాక్షి, కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ బృందం తెలిపింది. గురువారం ఐదుగురు ఇంజనీర్ల బృందం భద్రాద్రి జిల్లాలో పర్యటించింది. సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద జరుగుతున్న మొదటి దశ పంప్హౌజ్, పాల్వంచ మండ లం నాగారం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్, ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద జరుగుతున్న రెండోదశ పంప్హౌజ్, కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్హౌజ్ పనులను పరిశీలించింది. అనంతరం ఒడ్డురామవరం వద్ద విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఎస్పీ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి నుంచి ఈ పథకాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మిం చాలనుకున్న రాజీవ్సాగర్, ఇందిరాసాగర్లను కలిపి రీ ఇంజినీరింగ్ చేసి సీతారామ రూపొందించినట్లు తెలిపారు. చురుకుగా పనులు సీతారామ మొదటి దశ పంప్హౌస్ వరకు మెయిన్ కెనాల్ పనులు చురుకుగా జరుగుతున్నాయని ఎంఎస్పీ రెడ్డి తెలిపారు. ములకలపల్లి మండలం ఒడ్డురామవరం వద్ద నిర్మిస్తున్న రెండోదశ పంప్హౌజ్ పను లు వచ్చే అక్టోబరులోగా పూర్తవుతాయని తెలిపారు. ములకలపల్లి మండలంలోని కమలాపురం వద్ద జరుగుతున్న మూడోదశ పంప్హౌజ్ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.110 కిలోమీటర్ల కెనాల్లో 50 కిలోమీటర్ల కెనాల్ 3,800 ఎకరాల అటవీ ప్రాంతం లో ఉందన్నారు. ఇందుకు సంబంధించి అటవీ అనుమతులు తీసుకున్నారన్నారు. దీంతో ఆటంకా లు లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు.వచ్చేనెలలో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ బృందంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.చంద్రమౌళి, వ ర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్, ఉపాధ్యక్షులు డాక్టర్ రమణనాయక్, మహాత్మరెడ్డి ఉన్నారు. వీరి వెంట సీతా రామ సీఈ సుధాకర్, ఎస్ఈ నాగేశ్వరరావు ఉన్నారు. -
‘మీకు ఇష్టం లేకపోతే వ్యవసాయం చేసుకుంటా’
సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో ఉండే పార్టీలే ఇక్కడ రాజకీయం చేయాలి.. పక్క రాష్ట్ర పార్టీలు తెలంగాణలో ఎందుకంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తుమ్మల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కేంద్రానికి లేఖలు రాసింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాదా అంటూ ప్రశ్నించారు. టీడీపీని వీడేటప్పుడు చాలా బాధపడ్డానని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అన్నారు. ప్రజలకు ఇష్టం లేకపోతే వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న పార్టీలే రాష్ట్రంలో రాజకీయం చేయాలి.. పక్క రాష్ట్ర పార్టీలు ఇక్కడ ఎందుకంటూ తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జిల్లా ప్రజలు తనను గెలిపిస్తే సీతరామ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తానని చెప్పారు. -
‘మోదీ అంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది’
సాక్షి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయం పట్టుకుందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆదివారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని ఆరోపించారు. టీఆర్ఎస్పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. -
‘సీతారామ’కు అటవీ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన వైల్డ్ లైఫ్ అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు తుమ్మల, టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్కుమార్లు మంగళవారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ను ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. ప్రాజెక్టుకు అవసరమైన మొదటి దశ అనుమతులు వచ్చాయని, వైల్డ్ లైఫ్ అనుమతుల మంజూరుకు సంబంధించి వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు తుమ్మల మీడియాకు తెలిపారు. అనంతరం తుమ్మల కేంద్ర మంత్రి గడ్కరీని కలసి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలోని 3 వేల కి.మీ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించడంపై గెజిట్ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. -
అభయ సీతారామ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగేసింది. సాగునీటిపరంగా ఉమ్మడి జిల్లాకు వరప్రదాయనిగా భావిస్తున్న ప్రాజెక్టు విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూపిన చొరవ ఫలితంగా అవసరమైన అటవీ అనుమతులకు రీజినల్ ఎంపవర్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెన్నైలో శుక్రవారం పర్యావరణ, అటవీ అనుమతులపై రీజినల్ ఎంపవర్ కమిటీ సమావేశమైంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, దీనికి పై అనుమతులు ఇవ్వాల్సిందిగా.. సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పూర్తి వివరాలతో కమిటీ ఎదుట పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. నిర్మాణాలు, కాల్వల తవ్వకం, పంప్హౌస్ల నిర్మాణం వంటి వివరాలను పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి దశగా 1,531 హెక్టార్ల అటవీ భూమి అవసరమని, దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి అటవీ భూముల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు అవసరమని పేర్కొన్నారు. దీనిపై సంతృప్తి చెందిన రీజినల్ ఎంపవర్ కమిటీ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు ఇచ్చేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసి.. అటవీ అనుమతులు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్(ఎంఓఈఎఫ్) వారికి సిఫార్సు చేసింది. కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్రం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. భక్తరామదాసు రెండో దశ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలానికి ఈనెల 12న సాగునీటిని విడుదల చేసిన మంత్రులు హరీష్రావు, తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా జరిగిన సభలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఒక కొలిక్కి వచ్చాయని.. ఇక తమ దృష్టి సీతారామ ప్రాజెక్టుపై సారిస్తామని, అటవీ పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన సాధిస్తామని ఘంటాపథంగా చెప్పారు. అనుమతుల అంశంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావుతో తుమ్మల పలుమార్లు సమావేశం కావడం.. దీనిపై కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు తీసుకోవాలని తుమ్మల కోరడంతో ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి.. వాటిని కేంద్రానికి ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయంగా అటవీ భూముల్లో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పినపాక నియోజకవర్గం.. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గల దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.8వేల కోట్లు మంజూరు చేసింది. 115 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టేందుకు 8 ప్యాకేజీలుగా విభజించి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. వీటిలో ఐదు ప్యాకేజీల్లో పనులు కొనసాగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంప్హౌస్ల నిర్మాణం.. మరో రెండు ప్యాకేజీల్లో కాల్వల తవ్వకం చేపట్టారు. కాగా.. ఉమ్మడి జిల్లా రైతులకు ఉపయోగపడే సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. వన్యప్రాణి బోర్డు అనుమతులపై దృష్టి.. సీతారామ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు గ్రీన్సిగ్నల్ లభించగా.. ఇక కేంద్ర వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతులపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇందుకోసం హైదరాబాద్లో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన ఇటీవల రాష్ట్ర వన్యప్రాణి బోర్డు గవర్నర్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అనుమతించింది. వీటిని కేంద్ర వన్యప్రాణి మండలి అనుమతి కోసం నివేదించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కిన్నెరసాని అభయారణ్యం ఎకో జోన్ నుంచి 442 హెక్టార్ల అటవీ ప్రాంతానికి వన్యప్రాణి మండలి అనుమతి తప్పనిసరిగా మారింది. దీంతో రాష్ట్రస్థాయి వన్యప్రాణి బోర్డులో అనుమతిస్తూ.. తుది అనుమతి కోసం కేంద్ర వన్యప్రాణి మండలికి ప్రతిపాదించారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలో వన్యప్రాణి సంరక్షణ కోసం రూ.2.41కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వన్యప్రాణులు తిరిగేందుకు 12 అండర్ పాసెస్లను ప్రతిపాదిస్తున్నారు. ఎకో బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టనున్నారు. గడ్డి పెంపకం, సాసర్పిట్లు నిర్మించి వన్యప్రాణులకు నీటి వసతి కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. -
సీతారామ ప్రాజెక్టుకు రెండు వారాల్లో టెండర్లు
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేసేందుకు రూపొందించిన సీతారామ ప్రాజెక్టు పనులకు రెండు వారాల్లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టును నిర్ణయించిన లక్ష్యం మేరకు 2018 జూన్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. శనివారం ఖమ్మం జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన కొందరు నేతల సమక్షంలో రాత్రి 9 గంటల వరకు సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుల ద్వారా ప్రతిపాదించిన 3.33 లక్షల ఎకరాలకు అదనంగా మరో 1.5 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా, గతంలో ప్రతిపాదించిన 1.2 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి అదనంగా మరో 10 టీఎంసీల సామర్థ్యం కల్పిస్తూ సుమారు రూ. 7,967 కోట్ల ఖర్చుతో సీతారామ ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని 25 మండలాలు, వరంగల్లోని ఒక మండలానికి మొత్తంగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించేలా రూపకల్పన ఉండాలన్నారు. కిన్నెరసాని వన్యప్రాణి నివాస ప్రాంతాన్ని తప్పించేలా సర్వే సంస్థ వ్యాప్కోస్, అధికారులు తయారు చేసిన భిన్నమైన అలైన్మెంట్లపై సీఎం కేసీఆర్ వద్ద చర్చ జరిపారు. అధికారులు సమర్పించిన తుది అలైన్మెంట్కే సీఎం ఆమోదం తెలిపినట్లుగా తెలిసింది. -
నేటి నుంచి సీఎం ఖమ్మం టూర్
భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టులకు శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి రెండ్రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 12 గంటలకు తిరుమలాయపాలెం చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా 12.20 గంటలకు ఎన్ఎస్పీ అతిథిగృహానికి, 12.30కు ఖమ్మం పట్టణానికి చేరుకుంటారు. 2 గంటలకు గెస్ట్హౌస్లో భోజనం తర్వాత 3 గంటల నుంచి ఖమ్మం పట్టణాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు పాపిరెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు డిన్నర్ తర్వాత ఖమ్మంలోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఖమ్మం నుంచి బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా 9.15 గంటలకు ముదిగొండ చేరుకుంటారు. ముతరాం గ్రామంలోని రామాలయాన్ని సందర్శిస్తారు. ముదిగొండ నుంచి 9.40కి బయల్దేరి 10.15కు తిరుమలాయపాలెం చేరుకుంటారు. అక్కడ భక్తరామదాసు పథకానికి శంకుస్థాపన చేస్తారు. 10.20 గంటలకు అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. అక్కడ్నుంచి 12 గంటలకు బయల్దేరి టేకుల పల్లి మండలం రోళ్లపాడుకు వెళతారు. 12.30 గంటలకు అక్కడ సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 12.45కు రోళ్లపాడు ప్రజలతో మాట్లాడతారు. 2 గంటలకు భోజనం ముగించుకొని హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు బయల్దేరుతారు.