Srikanth Odela
-
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్కు 'మెగా' ఆఫర్
'భోళాశంకర్' పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్లో పెట్టారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, దసరా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్లో ఒకప్పుడు అందాలభామగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా గతంలో పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను కూడా ఆయన షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ను విడుదల చేసి ఫ్యాన్స్లో హైప్ పెంచారు. అయితే, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యతను ఇస్తుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగా రాణీ ముఖర్జీ మంచి సెలక్షన్ అని చిరు కూడా అన్నారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్లో ట్రెండ్ అవుతుంది. -
స్పీడ్ పెంచిన మెగాస్టార్.. ‘యానిమల్’ డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్!
హీరో చిరంజీవి మెగా స్పీడ్తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. కాగా ఆయన నెక్ట్స్ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందని, షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాదిలో ఈ మూవీ సెట్స్కు వెళ్తుందని సమాచారం. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోని సినిమా సెట్స్లో చిరంజీవి జాయిన్ అవుతారని తెలిసింది. అలాగే తనతో ‘గాడ్ఫాదర్’ సినిమా తీసిన దర్శకుడు మోహన్రాజాతో సినిమాకి కూడా చిరంజీవి పచ్చ జెండా ఉపారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఇంకా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారని, ఆయన ప్రస్తుతానికి కమిటైన సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, చిరంజీవి–సందీప్ కాంబో లోని సినిమా ప్రకటన ఉండొచ్చని సమాచారం. -
కథ రాశారు... స్టార్ని పట్టారు
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. కథలో బలం ఉందని హీరో నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి లాంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరిచయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. నాగ్ పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్కుమార్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్హిట్ ఫిల్మ్తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్నగర్ భోగట్టా.కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్కు వినిపించగా, శౌర్యువ్కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్తో ఎన్టీఆర్కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్-శౌర్యువ్ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్ కెరీర్లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
'దసరా' దర్శకుడితో చిరంజీవి సినిమా.. నిర్మాతగా హీరో నాని (ఫొటోలు)
-
అఫీషియల్: మెగాస్టార్తో జతకట్టిన హిట్ డైరెక్టర్.. హీరో నాని కూడా!
దసరా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీతో మరింత క్రేజ్ దక్కించుకున్న శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. అంతా ఊహించినట్లుగానే వీరి కాంబోలో మూవీ ఖరారైంది.ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న చిత్రానికి దసరా హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను కూడా షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంపై ఫ్యాన్స్లో మరింత ఆసక్తి నెలకొంది.నాని తన ట్వీట్లో రాస్తూ..'ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఆయన కోసం గంటల తరబడి క్యూలైన్స్లో వెయిట్ చేశా. నా సైకిల్ను కూడా కోల్పోయా. కానీ ఆయన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇదంతా ఒక చక్రం లాంటిది. దర్శతుడు శ్రీకాంత్తో కలిసి ఆ కల నెరవేరబోతోంది' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.మెగాస్టార్ రిప్లైశ్రీకాంత్ ఓదెల, నానితో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోందంటూ మెగాస్టార్ రిప్లై ఇచ్చారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాతే చిరంజీవి- శ్రీకాంత్ కాంబోలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.Thrilled at this collaboration and looking forward to this one my dear @NameisNani 🤗@odela_srikanth#ChiruOdelaCinema Natural Star @NameisNani @UnanimousProd@sudhakarcheruk5 @SLVCinemasOffl https://t.co/AGfKjrwjDL— Chiranjeevi Konidela (@KChiruTweets) December 3, 2024 -
ఆ లీక్ వీరులెవరో నాకు తెలుసు.. దసరా డైరెక్టర్ ఆగ్రహం!
దసరా మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆయన నానితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించి టైటిల్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై దర్శకుడు శ్రీకాంత్ మండిపడ్డారు.నా మూవీ టైటిల్ లీక్ చేసింది ఎవరో తనకు తెలుసని శ్రీకాంత్ ఓదెల అన్నారు. మా టీమ్తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నా సినిమాకు మాత్రమే కాదు.. ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిదని ఆయన హితవు పలికారు. వాళ్లు సినిమా రంగంలో క్రియేటర్స్ అని కొనియాడారు. సినిమాలకు వారు అందించే నిస్వార్థమైన సేవలను గౌరవించాలని.. అంతేగానీ కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలు మోపడం సరికాదని శ్రీకాంత్ అన్నారు.కాగా.. శ్రీకాంత్.. నానితో తెరకెక్కిస్తోన్న చిత్రానికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ మూవీ యూనిట్ ప్రకటించకముందే సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఈ విషయంపై శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశారు. To whomever it may concern,నా సినిమాకే కాదు, ఎవరి సినిమా లో ఏ లీక్ అయినా ASSISTANT DIRECTORS or WRITERS ని blame చేయడం మానేస్తే better.These people are the future creators and their selfless contribution to cinema deserves utmost RESPECT!Change the habit of blaming it on… pic.twitter.com/xoO3gLCANp— Srikanth Odela (@odela_srikanth) November 10, 2024 -
అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్'
‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు వెల్లడించి, టైటిల్ లోగోను ‘ఎక్స్’లో షేర్ చేశారు నాని. పీరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని, ఇందులో సికింద్రాబాద్ కుర్రాడిగా నాని నటిస్తారని టాక్. హీరోయిన్ గా జాన్వీకపూర్ లేదా శ్రద్ధాకపూర్ నటిస్తారనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నాని ‘హిట్ 3’ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్ లో జరుగుతోంది. 2025 మే 1న ‘హిట్ 3’ రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
ముచ్చటగా మూడోసారి...
‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.కాగా ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘ఈ చిత్రంలోని మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్ అవుతున్నారు. ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ చిత్రాల తర్వాత నానీతో ముచ్చటగా మూడోసారి అనిరుథ్ సినిమా చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది. -
దసరా కాంబినేషన్ షురూ
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం ఆరంభమైంది. ‘‘మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో నానీని చూపించే గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, ఆకట్టుకునే కథని తయారు చేశారు శ్రీకాంత్ ఓదెల.భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ‘దసరా’ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం, పలు అవార్డులు అందుకోవడంతో పాన్ ఇండియా చిత్రం ‘నాని ఓదెల 2’ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
దసరా కాంబినేషన్ షురూ
‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో ‘నాని ఓదెల 2’ (వర్కింగ్ టైటిల్) చిత్రం షురూ అయింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్ సినిమా ‘దసరా’కి 2023 మార్చి 7న చివరిసారిగా కట్, షాట్ ఓకే అని చెప్పాను. 2024 సెపె్టంబర్ 18న ‘నాని ఓదెల 2’ ప్రకటన వీడియో కోసం మళ్లీ యాక్షన్ చెప్పాను.48,470,400 సెకన్లు గడిచాయి. ప్రతి సెకను ఈ ్రపాజెక్ట్ కోసం సిన్సియర్గా ఉన్నాను. ‘దసరా’ చిత్రం స్థాయిని ‘నాని ఓదెల 2’తో వంద రెట్లు పెంచుతానని మాట ఇస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘నానీని ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్లో చూపిస్తూ, యునిక్ అండ్ ఎగ్జయిటింగ్ నెరేటివ్తో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ‘నాని ఓదెల 2’ చిత్రం అందించనుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
నాని కొత్త సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్!
-
తొలి సినిమా రిలీజ్ కాలేదు.. జాన్వీకి తెలుగులో మూడో ఛాన్స్?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతోనే ఈమె బాగా ఫేమస్. చాన్నాళ్ల క్రితమే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవర, RC 16 ప్రాజెక్టులపై బోలెడు ఆశలు పెట్టేసుకుంది. ఈ రెండు ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే మూడో అవకాశం కూడా పట్టేసిందట.శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ.. 'దఢక్' సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ ఫేమ్ ఓ మాదిరిగా వచ్చింది. యాక్టింగ్ పరంగా ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'దేవర'లో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. సెప్టెంబరులో మూవీ రిలీజైతే ఈమె భవిష్యత్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)దీనితో పాటు రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీలోనూ హీరోయిన్ జాన్వీనే. దీని షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. ఈ రెండు సెట్స్పై ఉండగానే ఇప్పుడు జాన్వీని మరో ఛాన్స్ వరించిందట. 'దసరా'తో హిట్ కొట్టిన నాని-శ్రీకాంత్ ఓదెల.. మరో మూవీ కోసం పనిచేస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలవనుంది. ఇందులోనే హీరోయిన్గా జాన్వీని అనుకుంటున్నారట. ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.తెలుగులో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇంతలోనే జాన్వీకి మూడో ఛాన్స్ అంటే ఆశ్చర్యమే. అయితే జాన్వీని తీసుకుంటే తమ సినిమాకు పాన్ ఇండియా వైడ్ మరింత రీచ్ వస్తుందని బహుశా నాని-శ్రీకాంత్ ఓదెల భావించి ఉండొచ్చు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది.(ఇదీ చదవండి: మ్యూజీషియన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
గుర్తింపు అవసరం లేదు!
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గత ఏడాది మార్చి 30న విడుదలైన ‘దసరా’ చిత్రం హిట్గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. నాని కెరీర్లోని ఈ 33వ సినిమాను ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరియే నిర్మించనున్నారు. ‘దసరా’ విడుదలై, ఏడాది పూర్తయిన సందర్భంగా తాజా చిత్రాన్ని శనివారం (మార్చి 30)న అధికారికంగా ప్రకటించింది యూనిట్. ‘లీడర్ కావాలనుకుంటే నీకు గుర్తింపు అవసరం లేదు’ అని అర్థం వచ్చేలా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ పై ఓ ఇంగ్లిష్ కోట్ ఉంది. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇక ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అలాగే సుజిత్ డైరెక్షన్లో హీరోగా నాని ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. -
దసరా డైరెక్టర్ మరోసారి నాని.. ఈసారి వేరే లెవెల్
-
దసరా కాంబినేషన్ రిపీట్.. విజయ్ దేవరకొండ కూడా..
-
ఓ ఇంటివాడైన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల
దసరాతో తెలుగు వెండితెరపై బ్లాక్బస్టర్ డెబ్యూ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం (మే 31న) ఆయన వివాహం కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో ఘనంగా జరిగింది. ఈ దర్శకుడి పెళ్లికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. దసరా హీరో నాని కూడా ఈ పెళ్లికి రావాలని అనుకున్నప్పటికీ తన అప్కమింగ్ సినిమా షూటింగ్ పూణెలో జరుగుతుండటంతో శ్రీకాంత్ వివాహానికి హాజరు కాలేకపోయాడు. అటు కీర్తి సురేశ్ కూడా బిజీగా ఉండటంతో డైరెక్టర్ పెళ్లికి రానట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం ఎంతటి సెన్సేషనల్ విజయం అందుకుందో తెలిసిందే! నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ నాని కెరీర్లోనే అత్యధికంగా రూ.100 కోట్లు రాబట్టింది. దీంతో శ్రీకాంత్ నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తాడు? ఎలాంటి జానర్లో తెరకెక్కించనున్నాడు? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. Join us in sending heartfelt congratulations to the newlyweds. @odela_srikanth has taken a leap into a lifetime of love and happiness❤️ May your journey together be filled with endless moments of joy and togetherness 💑✨ -Team @MediaYouwe #SrikanthOdela #OdelaSrikanth #Dasara… pic.twitter.com/yqbqygjLPJ — YouWe Media (@MediaYouwe) May 31, 2023 చదవండి: గుంటూరు కారం ఎట్లా ఉంటాదో తెలుసా? అయితే ఈ టీజర్ చూడాల్సిందే! -
ఈ సినిమాలో అదొక్కటే అద్భుతమైన షాట్: పరుచూరి
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విజయం పట్ల ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నాని నటన అత్యద్భుతంగా ఉందని ప్రశంసించారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) పరుచూరి మాట్లాడుతూ.. ' ఈ సినిమా పూర్తిగా నాని- కీర్తి సురేశ్దే. ప్రారంభం నుంచి చివరి వరకూ తన నటనతో ఆశ్చర్యానికి గురిచేశాడు నాని. సాధారణంగా క్యూట్ లుక్లో ఉండే నాని ఈ చిత్రంలో ఊర మాస్ లుక్లో కనిపించాడు. అందుకే ఈ సినిమా విషయంలో ముందు నానినే మెచ్చుకోవాలి. అలాగే హీరో మిత్రుడిగా దీక్షిత్ శెట్టి అదరగొట్టాడు. ఈ చిత్రంలో అంతర్లీనంగా రామాయణం - మహాభారతం కథలు కనిపించాయి. విలన్ ఒక రావణాసురుడి లాంటి వాడు. అందుకే అతడిని చంపేటప్పుడు రావణకాష్ఠం చూపించారు. సాయికుమార్ పాత్ర చిన్నదే అయినప్పటికీ క్లైమాక్స్లో డైలాగ్ విని.. ఇతడే విలనా? అన్న సందేహం కూడా ప్రేక్షకులకు వస్తుంది. అలాంటి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను దర్శకుడు శ్రీకాంత్ క్రియేట్ చేశాడు. ఇందులో మరో విచిత్రం ఏమిటంటే.. క్లైమాక్స్లో హీరోని అంతం చేయడానికి ఎంతోమంది రౌడీలు వస్తారు. ఆ సమయంలో గ్రామస్థులెవరూ హీరోకు సపోర్ట్ చేయరు. సమాజంలో ఒక వ్యక్తికి భయపడి పేద ప్రజలు ఎలా బతుకుతారో? చెప్పడానికి ఈ సినిమానే ఓ నిదర్శనం. నాకు తెలిసినంతవరకూ ఏదో ఒక గ్రామాన్ని చూసి స్ఫూర్తి పొందే వాళ్లు ఇలాంటి సీన్స్ తీశారు. ఆ గ్రామంలో పెత్తందారు చెప్పిందే అక్కడి ప్రజలు వినాలి అనే రూల్స్ ఉంటాయి. (ఇది చదవండి: ప్యాలెస్లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?) పరుచూరి మాట్లాడుతూ.. 'చిన్నప్పుడు ధరణిపై ఇష్టంగా ఉన్న అమ్మాయి.. ఆ తర్వాత వేరొకరితో పెళ్లి జరుగుతుంది. సూరి (దీక్షిత్ శెట్టి) చనిపోయిన తర్వాత వెన్నెల (కీర్తిసురేశ్)ను వితంతువును చేస్తుంటే.. ధరణి (నాని) అక్కడికి వెళ్లి అదే తాళిని ఆమె మెడలో కడతాడు. అదే ఈ సినిమాలో అద్భుతమైన షాట్. అప్పటి దర్శకులు చేయలేని ధైర్యం ఇప్పుడున్న వాళ్లు చేశారనడానికి నిదర్శనం. విలన్ చనిపోయాక కూడా సినిమా నడుస్తుంది. ధరణి ప్రేమను వెన్నెల ఒప్పుకుందా? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. చివర్లో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రేక్షకుల ఉత్కంఠకు తెరదించాడు. నాని జీవితంలో ఇది మరిచిపోలేని చిత్రంగా నిలిచింది. అసలు అక్కడ ఉన్నది నానినేనా అనే సందేహం కలుగుతుంది.' అంటూ ప్రశంసించారు. -
దసరా మూవీపై అల్లు అర్జున్ రివ్యూ.. నానిపై ప్రశంసల వర్షం
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని, కీర్తి సురేశ్ నటనకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం దసరా మూవీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. దసరా టీం అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ..' దసరా టీమ్ మొత్తానికి నా అభినందనలు. చాలా అద్భుతంగా సినిమా తీశారు. నా సోదరుడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కీర్తి సురేశ్ నటనకు ఫిదా అయిపోయా. దసరా చిత్రబృందం అందరూ చాలా బాగా చేశారు. సంతోశ్ అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సత్యన్ కెమెరా పనితనం సూపర్బ్. శ్రీకాంత్ ఓదెల ఆరంగ్రేటం అదిరిపోయింది. నిర్మాతలు, అలాగే సినిమాలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. వేసవిలో నిజమైన అసలైన ఎంటర్టైనర్ దసరా.' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవలే బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు మేకర్స్ పుష్ప-2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్లో రికార్డ్స్థాయిలో దూసుకెళ్తోంది. రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన విజయం సాధించిన ‘పుష్ప’సినిమాకు సీక్వెల్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. Big Congratulations to the entire team of #Dasara . Brilliantly made film . Finest performance my brother @NameisNani . Candid performances by @KeerthyOfficial and all the other cast . Wonderful songs & B.Score by @Music_Santhosh garu & excellent camera work by Sathyan garu . The… — Allu Arjun (@alluarjun) April 17, 2023 -
చిన్న మిస్టేక్ వచ్చినా ఒప్పుకోని కీర్తి.. బరాత్ డ్యాన్స్ కోసం 25 టేక్స్!
పెళ్లంటే హల్దీ, మెహందీ, సంగీత్.. ఇలా నానా హంగామా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ ఉన్నా లేకపోయినా పెళ్లి వేడుకలో కచ్చితంగా ఉండేది బరాత్. ఇక్కడ క్లాస్ పాటలకు పర్ఫామ్ చేయడం కాదు మాస్ మ్యూజిక్కు స్టెప్పులేయడమే ఉంటుంది. అప్పటిదాకా ఎమోషన్లో ఉన్న వధూవరుల బంధువులు, కుటుంబసభ్యులు కూడా బరాత్ ప్రారంభమవగానే ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. పెళ్లికొడుక్కి డ్యాన్స్ వచ్చినా రాకపోయినా ఎలాగోలా గుంపులోకి లాక్కొచ్చి నాలుగు స్టెప్పులేయిస్తారు. కానీ ఈ మధ్య పెళ్లికూతుళ్లను ఎవరూ పిలవకపోయినా సరే వాళ్లే డైరెక్ట్గా బరాత్లో ఎంటరై తీన్మార్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇలాంటి తీన్మార్ డ్యాన్స్ దసరా సినిమాలో కీర్తి సురేశ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి వారం రోజులవుతున్నా ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా కీర్తి పాప మాస్ డ్యాన్స్ వెనక ఉన్న కష్టాన్ని వెల్లడించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ డ్యాన్స్ బిట్ కోసం కీర్తి 25 టేకులు తీసుకుందని చెప్పాడు. చిన్న మిస్టేక్ వచ్చినా మళ్లీ మొదటి నుంచి చేస్తానని అదే ఎనర్జీతో డ్యాన్స్ చేసేదని పేర్కొన్నాడు. అన్నిసార్లు ఒకే బిట్ను, అదే జోష్తో చేసిందంటూ కీర్తి డెడికేషన్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దసరా విషయానికి వస్తే ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ నటించిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్ను మెప్పించిన ఈ మూవీ వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సంతోషంతో నిర్మాత చెరుకూరి సుధాకర్.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు బీఎమ్డబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడు. -
'దసరా' మూవీ షూటింగ్ ఎలా జరిగిందో తెలుసా? వీడియో రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతుంది. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ టాక్ను తెచ్చుకొని బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే దసరా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి అదరగొడుతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ దసరా పాటలు, డైలాగ్స్ మోత మోగుతోంది. సినిమా సూపర్ హిట్ కావడంతో రీసెంట్గా కరీంనగర్లో సక్సెస్ మీట్ను గ్రాండ్గా నిర్వహించింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే దసరా మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. పవ్వ తాగడం, సిల్క్ బార్ దగ్గర్నుంచి క్లైమాక్స్ షాట్స్ వరకు మేకింగ్ వీడియోను వదిలారు. మీరూ చూసేయండి మరి. -
నాని 'దసరా' మాస్ జాతర... డైరెక్టర్కి జాక్పాట్
-
దసరా డైరెక్టర్కి BMW కారు గిఫ్ట్గా ఇచ్చిన ప్రొడ్యూసర్
-
'దసరా' డైరెక్టర్కు 'బీఎండబ్లూ' కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సినిమా దసరా. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది.పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తాచాటుతుంది. ఇక దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే శ్రీకాంత్ ఓదెల సూపర్ సక్సెస్ అయ్యారు. గతంలో రంగస్థలం సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చారు. ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ గతంలో పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు చేసినా కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు దసరాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందడంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఖరీదైన ‘బీఎమ్డబ్లూ’ కార్ను గిఫ్ట్గా ఇచ్చాడు. కరీంనగర్లో జరిగిన దసరా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆయన అందరి ముందే డైరెక్టర్కు కారును ప్రజెంట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాని ఎక్కడ పుట్టినా.. ఇప్పుడు తెలంగాణ బిడ్డే: మంత్రి గంగుల
నాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం విజయోత్సవ సభ బుధవారం సాయంత్రం కరీంనగర్ ఎస్సారార్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు. మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు బలగంతో, పెద్దపెల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల దసరాతో కరీంనగర్ సత్తా చాటారన్నారు. తెలంగాణ సాధించడం వల్లే మట్టిలోని మాణిక్యాలు బయటకొస్తున్నాయని పేర్కొన్నారు. కాసర్ల శ్యామ్ గొప్ప పాటలు రాస్తూ తెలంగాణ సంస్కృతిని వెలుగులోకి తెస్తున్నారని.. నాని ఎక్కడ పుట్టినా దసరా సినిమా తర్వాత తెలంగాణ బిడ్డయ్యాడని అన్నారు. నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. కరీంనగర్ ఎనర్జీ అద్భుతంగా ఉందని, ఈవెంట్ సక్సెస్కు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లో అద్భుతమైన అభివృద్ధితోపాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుందని.. త్వరలోనే ఇక్కడ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తానన్నారు. దసరా డైలాగ్స్తో ప్రేక్షకులను అలరించాడు. సక్సెస్ మీట్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మేయర్ వై.సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, ఎడిటర్ నవీన్, ప్రముఖ నటుడు దీక్షిత్, దాసర్ల శ్యామ్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కరీంనగర్ : ‘దసరా’ చిత్రం విజయోత్సవ సభ (ఫొటోలు)
-
'దసరా' మూవీ డైరెక్టర్తో అఖిల్ నెక్ట్స్ మూవీ ఫిక్స్!
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుంది. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందీ చిత్రం. రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్కి అతి దగ్గర్లో ఉంది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల తొలి ప్రయత్నంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. రంగస్థలంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే దర్శకుడిగా తన మాస్ మార్క్ చూపించాడు. దీంతో శ్రీకాంత్ ఓదలె నెక్ట్స్ సినిమా ఎవరితో తీయనున్నారనే క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కినేని అఖిల్కు ఇప్పటికే ఆయన కథ చెప్పారని, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. -
ఆ మాట జీవితాంతం వినాలని ఉంది
‘‘దసరా’ సినిమా విడుదల తర్వాత చాలామంది నాని.. ‘దసరా’కి ముందు, ‘దసరా’ తర్వాత అంటున్నారు. నా గత చిత్రాలు ‘భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, జెర్సీ’లకి కూడా ఇదే మాటలు విన్నాను. జీవితాంతం నేను చేసిన ప్రతి సినిమాకి ఈ మాట వినాలని ఉంది (నవ్వుతూ)’’ అని హీరో నాని అన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న విడుదలైంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు. ► ‘దసరా’ కథని శ్రీకాంత్ చెప్పినప్పుడు అద్భుతంగా ఉందనిపించింది. మంచి సాంకేతిక నిపుణులను తనకు ఇచ్చి, ప్రోత్సహించాలని కథ వినగానే నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. ప్రేమ, స్నేహం, పగ.. యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, మన సంస్కృతిని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ‘దసరా’ అలాంటి సినిమానే. అందుకే మిగతా భాషల్లోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులే కాదు.. ఉత్తరాదిలోనూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ► ‘దసరా’ లొకేషన్లో ఎంజాయ్ చేస్తూ చేసిన సన్నివేశం ఏదీ లేదు. దుమ్ము, ధూళి, వేడి మధ్య చాలా కష్టపడి పని చేశాం. అయితే సన్నివేశాలు బాగా వస్తున్నాయనే ఫీలింగ్ షూటింగ్లోనే కలిగింది. ఈ సినిమా క్లయిమాక్స్ని ప్రేక్షకులతో కలసి థియేటర్లో చూడటానికి చాలా ఆత్రుతగా ఎదురు చూశాం.. మేము అనుకున్నట్టే క్లయిమాక్స్కి మంచి స్పందన వస్తోంది. ‘దసరా’ చూసినవారంతా గొప్పగా స్పందిస్తున్నారు. ఫోన్ కాల్స్తో పాటు ఎమోషనల్ మెసేజ్లు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ► రామ్చరణ్కు ‘రంగస్థలం’, అల్లు అర్జున్కి ‘పుష్ప’, నాకు ‘దసరా’ అని సోషల్ మీడియాలో వార్తలు రావడం చూశాను. ఆ మాటలకు నటుడిగా ఆనందపడతాను. కానీ తృప్తిపడను. ఎప్పుడైతే మనం తృప్తి పొందుతామో ఆ తర్వాత ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఏ సినిమాకీ నేను తృప్తిపడను. ఆనందం మాత్రం ఉంటుంది. ► రస్టిక్ మూవీ చేయాలా? వేరే జానర్ మూవీ చేయాలా? అని నేను ప్లాన్ చేయను. ‘దసరా’ మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందే నేను దాన్నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఓ సినిమాలో ఆరేళ్ల పాపకి తండ్రిగా చేస్తున్నాను. నటుడిగా వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయాలనేది నా ఆలోచన. నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో ‘దసరా, ఎంసీఏ, నేను లోకల్’ ఉన్నాయి. నేను ఏ సినిమానీ జానర్వారీగా చూడను.. కథ నచ్చితే సినిమా చేసేస్తాను. అయితే ఏ జానర్ని కూడా రిపీట్ చేయకపోవడాన్ని సౌకర్యంగా భావిస్తాను. ► కొత్త దర్శకులని పరిచయం చేయాలని ప్రత్యేకంగా అనుకోను. కథ నచ్చితే చేస్తాను. అయితే నేను పరిచయం చేసిన దర్శకులు మంచి స్థానాల్లో ఉండటం గర్వంగా ఉంది. ‘దసరా’ తొలి ఆటకి మా అబ్బాయి జున్నుని తీసుకెళ్లాను. నా ఫ్యాన్స్ అరుస్తూ, పేపర్లు విసిరేస్తుంటే.. ఎందుకు అలా చేస్తున్నారో వాడికి అర్థం కాలేదు. పేపర్లు వేస్ట్ అవుతున్నాయంటూ టెన్షన్ పడ్డాడు (నవ్వుతూ). ► ప్రభాస్, మహేశ్గార్లతో పాటు ఇండస్ట్రీలోని చాలామంది ‘దసరా’ని మెచ్చుకుంటూ మెసేజ్లు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ‘జెర్సీ, శ్యామ్ సింగరాయ్’ సమయంలో కూడా చిరంజీవి, రామ్చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్బాబుగార్లు మెసేజ్ చేశారు. ఇది ఆనందంతో పాటు బాధ్యతని కూడా పెంచుతుంది. నా చిత్రాలను చాలామంది వేరే చిత్రాల బాక్సాఫీసు లెక్కలతో పోలుస్తారు. ప్రతి సినిమాకి ఒక లక్ష్యం ఉంటుంది.. ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి మూవీని ప్రత్యేకంగా చూడాలి. -
Dasara Review: ‘దసరా’మూవీ రివ్యూ
టైటిల్: దసరా నటీనటులు: నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 30, 2023 వైవిధ్యమైన పాత్రలు అలవోకగా చేసుకుంటూ నేచురల్ స్టార్గా ఎదిగాడు నాని. ఫలితాన్ని పట్టించుకోకుండా కొత్త జోనర్స్ని ట్రై చేయడం ఆయనకు అలవాటు. అయితే నానికి ఈ మధ్య కాలంలో మాత్రం సాలిడ్ హిట్ లభించలేదు. చివరి చిత్రం ‘అంటే సుందరానికి..’ బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తాపడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న నాని.. ఈ సారి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని ఊరమాస్గా నటించిన చిత్రం ‘దసరా’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా నిర్వహించడంతో..‘దసరా’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 30)విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కరీంనగర్ జిల్లా వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన ధరణి(నాని), సూరి(దీక్షిత్ శెట్టి) ప్రాణ స్నేహితులు. బొగ్గు రైళ్లను కొల్లగొడుతూ.. వచ్చిన డబ్బుతో ఊర్లోని సిల్క్ బార్కి వెళ్లి మద్యం సేవిస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. ధరణి, సూరిల చిన్నప్పటి స్నేహితురాలు వెన్నెల(కీర్తి సురేశ్) ఓ అంగన్వాడి టీచర్. వెన్నెల అంటే ధరణికి చాలా ఇష్టం. కానీ సూరి కూడా వెన్నెలని ప్రేమించడంతో.. స్నేహం కోసం ధరణి తన ప్రేమను త్యాగం చేస్తాడు. అయితే సిల్క్ బార్లో జరిగిన ఓ గొడవ కారణంగా వీళ్ల జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. ధరణి స్నేహితులపై ఓ ముఠా ఎందుకు దాడి చేసింది? శివన్న(సముద్రఖని), రాజన్న(సాయి కుమార్) రాజకీయ వైరం వల్ల గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చిన్న నంబి (షైన్ టామ్ చాకో)తో ధరణి చేసిన చాలెంజ్ ఏంటి? సూరి ఇష్టపడిన అమ్మాయి వెన్నెలను ధరణి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ధరణి ప్రేమను వెన్నెల అర్థం చేసుకుందా? తన స్నేహితులకు జరిగిన అన్యాయంపై ధరణి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. తెలంగాణ నెటివిటితో సాగే ఓ రివేంజ్ డ్రామా చిత్రం ‘దసరా’. ఈ తరహా చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మొన్నటి రంగస్థలం వరకు ఈ తరహా చిత్రాలు చాలానే వచ్చాయి. అయితే ఈ రొటీన్ కథకు సింగరేణి బ్యాక్డ్రాప్ పాయింట్ని జోడించి రియలిస్టిక్గా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తొలి చిత్రమైనా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. తను రాసుకున్న ప్రతి పాయింట్ని వాస్తవికతకు దగ్గరగా ఉన్నది ఉన్నట్లుగా తెర రూపం ఇచ్చాడు. ఇది రివేంజ్ డ్రామా అయినా.. అంతర్లీనంగా అందమైన ప్రేమ కథతో పాటు స్నేహ బంధం, ఊరి రాజకీయాలు, తెలంగాణ గ్రామ ప్రజల జీవన శైలిని సజీవంగా చూపిస్తూ కథను రక్తి కట్టించాడు. ఫస్టాఫ్ మొత్తం ధరణి, సూరిల స్నేహ బంధం చుట్టూ తిరుగుతుంది. వాటితో పాటు ఊర్లోని సిల్క్ బార్పై ఆదిపత్యం కోసం రాజన్న, శివన్న చేసే రాజకీయాలను చూపించారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ అదిరిపోతుంది. ఒక్క చిన్న ట్విస్ట్తో విరామం పడుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం తన స్నేహితులను అన్యాయం చేసినవారిపై ధరణి ఎలా రివేంజ్ తీసుకున్నాడనేది చూపించారు. అయితే కథనం మొత్తం ఊహకందేలా సాగడం మైనస్. సవతి సోదరులు శివన్న, రాజన్న మధ్య రాజకీయ వైరం అంటూ కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ రెండు క్యారెక్టర్ల మధ్య వైరాన్ని మాత్రం బలంగా చూపించలేకపోయాడు. అలాగే ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్లో కథ మొత్తాన్ని సైడ్ట్రాక్ పట్టించాడు. కథ స్వభావం రిత్యా ఎమోషన్స్ ఇంకాస్త పండించి ఉంటే బాగుండేది. అయితే దర్శకుడు మాత్రం చాలా నిజాయితీగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా జీవించడం ఆయనకు అలవాటు. అతని నటన చాలా సహజంగా ఉంటుంది.అందుకే నేచురల్ స్టార్ అయ్యాడు.అయితే ఇప్పటి వరకు నాని చేసిన పాత్రలు ఒకెత్తు.. ధరణి పాత్ర మరో ఎత్తు. తన కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడు నాని. ధరణి క్యారెక్టర్ కోసం మేకోవర్ అయిన తీరు బాగుంది. ఊరమాస్ పాత్రలో జీవించేశాడు. ఇక వెన్నెలగా కీర్తి సురేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెలంగాణలోని పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా నటించింది. సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. సూరి పాత్రకు దీక్షిత్ శెట్టి న్యాయం చేశాడు. ఇక రాజన్నగా సాయికుమార్, శివన్నగా సముద్రఖని పర్వాలేదపించారు. పూర్ణ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకి ప్రాణం పోసింది ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. 22 ఎకరాల్లో వేసిన వేసిన విలేజ్ సెట్ అద్భుతం. సినిమా కోసం ఓ పల్లెటూరిని నిజంగానే సృష్టించాడు. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం, పాటలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘దసరా’ మూవీ స్టిల్స్
-
దసరా మూవీలో సిల్క్ స్మిత పోస్టర్.. ఎందుకంటే!
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేస్తున్నాయి. మార్చి 30న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దసరా పోస్టర్లో సిల్క్ స్మిత ఫోటో ఉండడంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. 'నా చిన్నప్పుడు మా తాతకు కాళ్లు విరిగిపోయాయి. తాతా కల్లు తీసుకురామంటే వెళ్లా. కల్లు దుకాణంలో ఫస్ట్ టైమ్ సిల్క్ స్మిత ఫోటో చూశా. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆమెను చూస్తూనే ఉన్నా. ఆ తర్వాత అనిపించింది నాకు. ఆమెలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలేమో. ఆమెకు ఫ్యాషనేట్ సినిమాలంటే పిచ్చి అని విన్నాను. చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది. అందుకే కల్లు దుకాణం వద్దే సిల్క్ స్మిత ఫోటో పెట్టా.' అని అన్నారు. అయితే కీర్తి సురేశ్ను ఈ విషయంపై చాలామంది అడిగారని ఆమె చెప్పుకొచ్చారు. 'Dasara' Mass Jaathara ki sarvam siddham 🔥🔥 Natural Star @NameisNani's #Dasara Grand Release on 30 MARCH 2023 💥💥#EtlaitheGatlaayeSuskundhaam 🤙@KeerthyOfficial @Music_Santhosh @sathyaDP @NavinNooli @sudhakarcheruk5 @SLVCinemasOffl pic.twitter.com/6Fi0YN80A9 — srikanth odela (@odela_srikanth) August 26, 2022 -
'తెలంగాణ యాసలో డైలాగులు పలకడం కష్టం అనిపించింది'
మహానటి... బొద్దుగా కనిపించడానికి ప్రోస్థటిక్ మేకప్. రంగ్ దే... గర్భవతిగా కనిపించడానికి కడుపు చుట్టూ కుషన్ సాని కాయిదమ్... చింపిరి జుత్తు, కమిలిపోయిన చర్మం... ఇప్పుడు ‘దసరా’.. డార్క్ మేకప్. కీర్తీ సురేష్ ఓ ఐదారు సినిమాలు చేస్తే అందులో పైన చెప్పినట్లు లుక్ పరంగాను.. నటన పరంగానూ చాలెంజ్ చేసే పాత్రలే ఎక్కువ. ‘క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడితే అంత ఆత్మసంతృప్తి దక్కుతుంది’ అంటారు కీర్తి. నాని, కీర్తి జంటగా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘దసరా’ ఈ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. మహానటి, రంగ్ దే, సాని కాయిదమ్ (తెలుగులో ‘చిన్ని’) వంటి చిత్రాల్లో చాలెంజింగ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ‘దసరా’లో చేసిన వెన్నెల క్యారెక్టర్ పెట్టిన కష్టాల గురించి? వెన్నెల క్యారెక్టర్ ఫిజికల్గా కొంచెం కష్టం అనిపించింది. డార్క్ మేకప్తో కనిపిస్తాననే సంగతి తెలిసిందే. ఈ మేకప్ వేయడానికి గంట పట్టేది. తీయడానికి ఇంకా ఎక్కువ టైమ్ పట్టేది. చాలా ఓపిక అవసరం. ఇక బొగ్గు గనుల బ్యాక్డ్రాప్ కాబట్టి లొకేషన్లో ఒకటే దుమ్ము. ఇలా ఫిజికల్ కష్టాలు చాలానే. ఇక నటనపరంగా చాలెంజ్ ఏంటంటే.. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇప్పటివరకూ చేసిన పాత్రలకన్నా వ్యత్యాసం చూపించాల్సి వచ్చింది. తెలంగాణ యాసని పట్టుకోగలిగారా? నిజానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథ చెప్పినప్పుడు నాకస్సలు అర్థం కాలేదు. నాలుగు గంటలు ఓపికగా కథ చెప్పారు. అయినా తికమకగానే అనిపించింది. మరోసారి చెప్పాక అర్థం అయింది. అలాగే తెలంగాణ యాసలో డైలాగులు పలకడానికి కాస్త కష్టం అనిపించింది. కొన్ని రోజులు ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత పట్టుకోగలిగాను. శ్రీకాంత్ ఓదెల అసోసియేట్ శ్రీనాథ్కు తెలంగాణ యాస మీద పట్టుంది. ఆయనే నేర్పించారు. అలాగే ఒక ప్రొఫెసర్ చిన్న చిన్న వివరాలను కూడా యాడ్ చేశారు. డబ్బింగ్ చెప్పారా? ఇంతకుముందు క్యారెక్టర్లకు చెప్పినంత త్వరగా చెప్పగలిగారా? నా గత క్యారెక్టర్స్కి మూడు రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేసేదాన్ని. వెన్నెలకు చెప్పడం అంత సులువు కాదు. ఈ పాత్రకు ఐదారు రోజులు పట్టింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకన్నా ‘వెన్నెల’ క్యారెక్టర్కే ఎక్కువ శ్రమపడ్డారనుకోవచ్చా? అలా ఏం కాదు. శ్రమ పెట్టిన పాత్రల్లో ఇదొకటి. అయితే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా సందర్భాల్లో ‘మహానటి’ గుర్తొచ్చింది. ‘మహానటి’ గుర్తుకు రావడానికి కారణం? జనరల్గా ఒక సినిమా చేసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. ఆ సినిమా పూర్తయినా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అన్ని సినిమాలకూ ఇలా జరుగుతుందని చెప్పను. ‘మహానటి’ విషయంలో అలాంటి ఓ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ‘దసరా’కి ఆ ఫీల్ వచ్చింది. అందుకే ‘దసరా’ చేస్తున్నప్పుడు ‘మహానటి’ వైబ్స్ వచ్చాయన్నాను. అంటే.. ఆ సినిమాకి వచ్చినట్లే ‘దసరా’కి కూడా మీకు జాతీయ అవార్డు వస్తుందనుకోవచ్చా? యాక్చువల్గా ‘మహానటి’కి అవార్డుని ఆశించలేదు. వచ్చింది... చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అవార్డులు ఎదురు చూడటంలేదు. నేను ఏ సినిమా చేసినా బెస్ట్గా చేయాలనుకుంటాను. ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను.. అంతే. ఈ సినిమాలో ‘చమ్కీల అంగీలేసుకొని...’ పాట చాలా పాపులర్ అయ్యింది.. ఇది ముందే ఊహించారా? ఆ పాట వినగానే అన్ని పెళ్లి వేడుకల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్రేషన్ ఉంది. లిరిక్స్ చాలా బాగుంటాయి. ట్యూన్ అద్భుతంగా కుదిరింది. పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేం ఊహించినదానికంటే పెద్ద విజయం సాధించింది. శ్రీకాంత్ ఓదెల గురించి.. ‘దసరా’ కథని శ్రీకాంత్ అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. నా విషయానికి వస్తే.. కథ, నా పాత్ర, డైరెక్టర్ని అర్థం చేసుకుంటాను. దర్శకుడు నా నుంచి ఎలాంటి నటన కోరుకుంటున్నారో అలా చేస్తాను. కష్టానికి తగిన ప్రతిఫలం అంటారు.. మరి సింపుల్ క్యారెక్టర్లు చేసినప్పుడు తీసుకునే పారితోషకమే చాలెంజింగ్ రోల్స్కీ తీసుకుంటారా.. పెంచుతారా? రెమ్యునరేషన్ లెక్కలు వేయను. ఆ లెక్కలు వేసుకుని సినిమా ఒప్పుకోను. ఏదైనా క్యారెక్టర్ ఒప్పుకునే ముందు నాకు లభించే ఆత్మసంతృప్తి గురించి మాత్రమే ఆలోచిస్తాను. ‘దసరా’ పాన్ ఇండియా మూవీ... మామూలుగా పాన్ ఇండియా చిత్రాలకు హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఉంటుందంటారు.. మరి ఈ చిత్రానికి మీ రెమ్యునరేషన్... అలా ఒక్క సినిమాకే పెంచేస్తామా? ఈ సినిమాతో పాన్ ఇండియా ప్లాట్ఫామ్లోకి వచ్చాను. అయినా ఒక మంచి సినిమా చేసేటప్పుడు రెమ్యునరేషన్ పట్టింపు కాదు. ఏ సినిమాకైనా ఇంతే. ఆ సినిమా వల్ల నాకెంత ఆనందం, ఆత్మసంతృప్తి లభించాయన్నదే నాకు ముఖ్యం. ‘మహానటి’ తర్వాత మీకు హిందీ నుంచి ఆఫర్స్ వచ్చినా మీరు వెళ్లలేదు.. కారణం? హిందీలో కొన్ని కథలు విన్నాను. అయితే ఆ కథల్లో నాది బలమైన పాత్ర అనిపించలేదు. బాలీవుడ్లో మంచి పాత్రలు వస్తే చేయాలనే ఉంది. కథ కూడా చాలా ముఖ్యం. -
నాని ‘దసరా’ మూవీ స్టిల్స్
-
నాని దసరా.. ట్రైలర్ మామూలుగా లేదుగా..!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ' చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ' అనే పాటతో మొదలైంది. నాని ఫుల్ మాస్ లుక్లో అలరించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడో లిరికల్ చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను ధీ - రామ్ మిర్యాల ఆలపించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. పక్కా జానపథ యాసలో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. -
దసరా హిందీ వెర్షన్ ప్రమోషన్లో నాని (ఫోటోలు)
-
మైండ్ బ్లాక్ అయింది, కోతిలెక్క గెంతుతున్నా: దసరా డైరెక్టర్
నాని ప్రధాన పాత్రలో నటించిన మాస్ మూవీ దసరా. ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్లో కనిపించడమే కాకుండా తెలంగాణ యాసలో డైలాగులు వదిలాడు. తాజాగా ఈ సినిమా టీజర్ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ చేస్తూ దసరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. 'నాని మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న ఓదెల శ్రీకాంత్ తొలి సినిమాతోనే ఇంత ప్రభావం చూపిస్తుండటం మెచ్చుకోదగ్గ విషయం. చివరి షాట్ ఏదైతే ఉందో అది అన్నింటికంటే తోపు' అని ట్వీట్ చేశాడు జక్కన్న. రాజమౌళి ప్రశంసలతో శ్రీకాంత్ ఓదెల ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈమేరకు ట్విటర్లో ఆయన స్పందిస్తూ.. 'రాజమౌళి సర్.. మీ ట్వీట్కి మైండ్ మొత్తం బ్లాక్ అయ్యింది. అప్పటికెళ్లి మాకు ఇంగ్లీష్లో రిప్లై పెడదాం అనుకుంటున్న.. కానీ తెలుగులోనే మాటలు ఒస్తలేవు సర్. కోతి లెక్క గెంతుతున్న! థ్యాంక్ యూ సో మచ్ సర్' అంటూ రిప్లై ఇచ్చాడు. చదవండి: నాన్న చనిపోయిన బాధ లేదు, ఎక్స్పోజింగ్ మొదలుపెట్టావా? గ్లామర్ కోసం సర్జరీలు.. : సమీరా రెడ్డి