star maa
-
బుల్లితెర ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త సీరియల్ వచ్చేస్తోంది!
స్టార్ మా సపరివారంలో సరికొత్తగా మరో సీరియల్ వచ్చి చేరనుంది. 'నువ్వుంటే నా జతగా' అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయనుంది.'నువ్వుంటే నా జతగా' అనే సీరియల్ ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథగా తీసుకొస్తున్నారు. సంప్రదాయానికి, సంస్కృతికి ఎంతో విలువ ఇచ్చే ఒక అమ్మాయికి.. గాలికి తిరిగే కుర్రాడికి మధ్య ఒక అనుకోని మూడుముళ్ల బంధం ఈ కథకి మూలం. ఈ సీరియల్ సోమవారం(డిసెంబర్ 16) నుంచే రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ప్రేమ ఉన్నచోట కోపం ఉంటుందనే ఒక ప్రాథమిక సూత్రానికి, ప్రేమ ఉంటే తప్పుని దిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందనే మౌలికమైన ఆదర్శాన్ని ఈ సీరియల్ ద్వారా చూపించనున్నారు.ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఆ కలలన్నీ మూడుముళ్లతోనే కరిగిపోతే? జీవితం అక్కడ ఆగిపోయినట్టు కాదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్న థియరీని ఒక కొత్త దృక్పథంతో చెప్పే ఈ కథ స్టార్ మా బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది. -
స్టార్ మాలో మరో కొత్త సీరియల్
మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ ఎల్ బి చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిలినీ ప్రత్యేకంగా అలరించబోతోంది. ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే “స్టార్ మా” సీరియల్ కథల పరంపరలో రానున్న "గీత ఎల్ ఎల్ బి" పూర్తిగా ఒక విలక్షణమైన కథ. బంధాలకు విలువ ఇచ్చి, వాటిని నిలబెట్టాలనుకునే అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు, తడబడినా నిలబడడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఎదురైన రకరకాల మనుషులు అన్నీ కలిస్తే ఈ గీత జీవితం.ఒక సగటు అమ్మాయి జీవితంలో.. ఎవరు తనకు ప్రేరణ అనుకుందో అతనితోనే గొడవకు దిగాల్సి రావడం ఆమెకు ఎదురైన అతిపెద్ద సవాలు. న్యాయాన్ని గెలిపించడానికి ఆ అమ్మాయి పడే తపన, కొన్నిసార్లు ఆమె అనుభవించే సంఘర్షణ "గీత ఎల్ ఎల్ బి" సీరియల్ ని విభిన్నమైన సీరియల్ గా నిలబెట్టబోతోంది’ అని మేకర్స్ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ఈ సీరియల్ ప్రసారం కానుంది. -
బుల్లితెర ప్రియులకు సరికొత్త సీరియల్.. ఎప్పుటినుంచంటే?
తెలుగులో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తున్న ఛానల్ "స్టార్ మా". సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోంది. తాజాగా "ఇల్లు ఇల్లాలు పిల్లలు" అనే సరికొత్త సీరియల్తో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథే ఇల్లు ఇల్లాలు పిల్లలు.ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ ఉంది. అంతే కాదు - మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా ఉంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే... ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథేంటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటోసరికొత్త సీరియల్ "ఇల్లు ఇల్లాలు పిల్లలు" చూడాల్సిందే.ఈ సీరియల్ ఈ నెల 12 నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం చేయనున్నారు. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ. తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు నిర్మాత, ప్రభాకర్ ఈ సీరియల్లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని.. ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చూపించనున్నారు. -
బుల్లితెర అవార్డుల పండుగ.. ఛీఫ్ గెస్ట్ ఎవరంటే?
స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేడుక బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో స్టార్ మా సీరియల్స్కు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అందించే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం ఇవాళ బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనుంది.ఈ గ్రాండ్ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి పురస్కరించుకొని టీవీ నటులు, అక్కినేనిని గుర్తు చేస్తూ చేసిన మెడ్లీ ఈ కార్యక్రమంలో హైలైట్గా నిలువనుంది. ఈ వేడుకలో బుల్లితెర నటీనటుల సందడి స్టార్ మా పరివార్ అవార్డ్స్లో చూసేయండి. -
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. బన్నీకి పోటీ ఇచ్చేలా ఉన్నాడుగా!
రైతు బిడ్డ ట్యాగ్తో బిగ్బాస్లో అడుగుపెట్టిన తెలంగాణ బిడ్డ పల్లవి ప్రశాంత్. ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఏకంగా ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. బిగ్బాస్ సీజన్-7 విన్నర్గా నిలిచి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక రైతు బిడ్డ కాస్తా బిగ్బాస్ విన్నర్గా స్టార్గా ఎదిగాడు. అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత ఊహించని పరిణామాలతో జైలుకు వెళ్లి వచ్చాడు.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే పల్లవి ప్రశాంత్.. తాజాగా స్టార్ మా అవార్డ్స్ వేడుకలో మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తన తన ట్విటర్లో పోస్ట్ చేసింది. స్టార్ మా పరివార్ అవార్డ్స్లో పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఎంట్రీ అంటూ వీడియోను రిలీజ్ చేసింది. మన రైతు బిడ్డ ఏకంగా పుష్ప స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గడ్డంతో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. ఈ వేడుక త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కానుంది. Pallavi Prashanth’s grand entry at the Star Maa Parivaar Awards! 🌟✨ His energy and grace will leave everyone in awe, setting the stage on fire with his powerful presence. Coming soon only on #StarMaa! 🌟 #StarMaaParivaarAwards2024 #SMPA2024 pic.twitter.com/5Lkrminsn9— Starmaa (@StarMaa) October 15, 2024 -
బిగ్ బాస్ ఐదవ వారం విశ్లేషణ...'పాత బొమ్మలతో కొత్త పోస్టర్'
ఓ పిల్లాడు సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా నాకేదైనా కొత్త వంట చేసి పెట్టు అని తల్లిని అడిగాడు. ఇంట్లో పొద్దున వండిన ఇడ్లీలు తప్ప ఏమీ లేవు. దాంతో తల్లి ఆ ఇడ్లీలను తుంచి వేపుడు చేసి బిడ్డకు పెట్టింది. తల్లి తన కోసం కొత్త వంట చేసిందని సంబరపడిపోయి ఆనందంగా తిన్నాడు ఆ బిడ్డ. ఇక్కడ తల్లి పాత్ర బిగ్ బాస్ అయితే బిడ్డ పాత్ర ప్రేక్షకులు. ఇక ఇడ్లీలు కంటెస్టెంట్లు అని వేరేగా చెప్పకరలేదు. బిగ్ బాస్ 8 లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్ అని టాగ్ లైన్తో ఊదరగొట్టిన బిగ్ బాస్ ఎపిసోడ్లు లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్ ఏమో గాని లిమిట్ లెస్ కన్ఫ్యూజన్ మాత్రం చూస్తున్న ప్రేక్షకులను గురి చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇస్తున్న(లేక చేస్తున్న) ఎంటర్ టైన్మెంట్ సరిపోలేదో (సరిరాదో) ఏమో కాని ఉన్నపళాన వారం వ్యవధిలో ఇద్దరిని ఎలిమినేట్ చేసి మరో 8 పాత కంటెస్టెంట్లను హౌస్లోకి పంపాడు బిగ్ బాస్. ఆదిత్య ఓం, నైనిక ఈ వారం ఎలిమినేట్ అయిన వారిలో వున్నారు. ఒక ఎలిమినేషన్ (ఆదిత్యఓం) హౌస్ మొత్తం కలిసి తీసుకున్నదైతే మరో ఎలిమినేషన్ మాత్రం (నైనిక) బిగ్ బాస్ చేసింది. ఇక వైల్డ్ కార్డ్ పేరిట ఓ 8 పాత కంటెస్టెంట్లను రంగంలోకి దింపిన బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంపిక లో మాత్రం పెద్దగా ఆసక్తి కనబరిచినట్టుగా లేదు. కంటెస్టెంట్లు దొరక్కో లేక పాత కంటెస్టెంట్ల అందుబాటులో వున్నందుకో కాని పెద్దగా ఉత్సాహాన్నిచ్చే కంటెస్టెంట్లు లేరనే అనిపిస్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లలో ఈ పాత కంటెస్టెంట్లైన కొత్త వైల్డ్ కార్డ్స్ ఉన్న కంటెస్టెంట్లతో ఎలా ఆడతారో ఈ పాత కొత్త ఆటను ఆస్వాదించే ప్రేక్షకులకు తెలియాలి. ఆఖరుగా ఒక్క మాట 'కొత్తొక వింత పాతొక రోత' అన్న నానుడి సదరు బిగ్ బాస్ కు తెలిసో లేదో...!!-ఇంటూరి హరికృష్ణ -
బిగ్ బాస్ రెండవ వారం విశ్లేషణ...'హౌస్లో శేఖర్ భాషా అంకం సమాప్తం '
బిగ్ బాస్ హౌస్ లోని రెండవ వారం వాడి వేడి వాదనలతో నామినేషన్స్ అవగా మిగతా వారమంతా ఫుడ్ టాస్క్ మీద నడిచింది. ముందుగా నామినేషన్స్ గురించి చెప్పుకుందాం. హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ గురించి చెప్పేటప్పుడు సదరు కంటెస్టెంట్ ఆటను ముందుగా పొగిడి తరువాత తన నామినేషన్ కారణాన్ని వివరిస్తూ వివాదపర్చడం విడ్డూరమనిపించింది. ఈ నామినేషన్స్ టైంలో విచిత్రంగా ప్రతి కంటెస్టెంట్ ఫైర్ అవుతున్నారు. ఇటువంటి ఫైరింగ్ నామినేషన్స్ నుండి జోవియల్ కంటేస్టెంట్ అయిన శేఖర్ భాషా ఎలిమినేట్ అవడం విశేషం. శేఖర్ భాషా ఎలిమినేషన్ వ్యక్తిగతంగా అతను తండ్రి అవడం ఓ కారణమైతే అదే కారణాన్ని చూచాయగా చూపిస్తూ హౌస్ లోని కంటెస్టెంట్లందరూ (ఒక్క కంటెస్టంట్ తప్ప) శేఖర్ భాషా హౌస్ నుండి బయటకు వెళ్ళాలి అని బాహటంగానే నామినేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో చిన్న కారణమైనా పెద్దదిగా చేస్తారు. అందుకేనేమో బిగ్ బాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మా బాగా నచ్చుతోంది. ఈ సందర్భంగా ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఈ వారాంతం జరిగిన షోలో బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను నాగార్జున అందలం ఎక్కించారు. అదేంటంటే భారతదేశంలోని ఏ బిగ్ బాస్ షోకి రానంత ప్రేక్షకాదరణ ఒక్క తెలుగు బిగ్ బాస్ కే దక్కిందట. మొత్తంగా 6 బిలియన్ల నిమిషాల నిడివితో ఈ తెలుగు బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులు చూశారట. ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ లెక్కన మన తెలుగు ప్రేక్షకులు భారతదేశంలోనే ఉత్తమోత్తమ ప్రేక్షకులను చెప్పుకోవాలి, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకు విషయం కన్నా వివాదం నచ్చుతుందన్న విషయం మరోసారి నిరూపించారు. ఇకపోతే ఫుడ్ టాస్క్ గురించి చెప్పాలంటే చాలానే చెప్పాలి. రాతి యుగంలో ఆది మానవులు ఆహారం కోసం అరాచకం చేసేవారట. ఈ విషయం మన తరం వారు ఎవ్వరూ చూసివుండరు కాని చదువుంటారు. అయితే అదే పరిస్థితి చూడాలనుకుంటే ఈ వారం బిగ్ బాస్ ఫుడ్ టాస్క్ చూసి ఆనందించవచ్చు. ఫుడ్ టాస్క్ కు సంబంధించి దీనికి మించిన వివరణ మరేదీ వుండదు. వారం వారం అంచనాలు అందుకోలేని సంచనాలతో దూసుకువెళ్తున్న ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం ముందు ముందు మరెన్ని సంచనాలకు తావిస్తుందో చూడాలి.- ఇంటూరు హరికృష్ణ -
బిగ్బాస్ 8 ఫస్ట్ ప్రోమో విడుదల.. ట్విస్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
బిగ్బాస్ తెలుగు సీజన్ 8 కోసం ఎదురుచూసిన అభిమానులకు నేటి (సెప్టెంబర్ 1) నుంచి పండుగే అని చెప్పవచ్చు. నాగార్జున హౌస్ట్గా మరోసారి ఈ సీజన్లో కూడా మెప్పించనున్నాడు. తాజాగా విడుదలైన మొదటి ప్రోమో ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఈ సీజన్ లిమిట్లెస్ అంటూ నాగార్జున చెప్పారుజ అందుకు తగ్గట్టే కంటెస్టెంట్స్ను సోలోగా పంపకుండా జోడీలుగా బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు. అయితే, ప్రోమోలో నాని-ప్రియాంక మోహన్ సందడి చేశారు. 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను నాగ్తో పంచుకున్నారు. ఆపై '35 చిన్న కథ కాదు' ప్రమోషన్స్ కోసం రానా, నివేదా థామస్ సరదాగా మెప్పించారు. చివరిలో దర్శకుడు అనిల్ రావిపూడి ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు సాయింత్రం 7గంటలకు స్టార్ మాలో బిగ్బాస్ ప్రసారం కానుంది. -
వరంగల్లో 'సత్యభామ' యూనిట్ సందడి
తెలుగు సంస్కృతి , సంప్రదాయాలను ఆచరిస్తూ నిర్వహించిన ఉత్సాహభరితమైన వేడుకలో భాగంగా ప్రముఖ సీరియల్ ' సత్యభామ' లో నటించిన ముఖ్య తారాగణంతో వరంగల్లో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహించింది. ' సత్యభామ' తారలు తమ మొదటి వరలక్ష్మీ వ్రతాన్ని వరంగల్ నగర ప్రజలతో కలిసి జరుపుకోవడం వల్ల ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఈ తారల వివాహ రెసెప్షన్ వేడుకలు సైతం వరంగల్లో జరుగగా, అప్పుడు ఇక్కడి వారు అపూర్వమైన స్వాగతం పలికారు. వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ' సత్యభామ' సిరీయల్ నటీనటులు అందరూ వరలక్ష్మి పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో పూజను కొనసాగించారు. హాజరైన మహిళలకు వాయనాలు అందించటంతో పాటుగా ప్రసాదాలు పంపిణీ చేశారు. అభిమానులు తమ ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటూ కళాకారులను బహుమతులతో ముంచెత్తారు. ఈ షో తో తమకున్న లోతైన బంధాన్ని మరింతగా వెల్లడించారు. ఈ సీరియల్ హీరో క్రిష్ ప్రేక్షకులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమంలో ఆనందం తారాస్థాయికి చేరుకుంది. అసలైన తెలుగు శైలిలో పండుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఆన్-స్క్రీన్ జంట వేదికపై నృత్యం చేయడంతో ఉత్సాహం మరింతగా పెరిగింది. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సంపదను జోడిస్తూ, ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శన జరిగింది. పురాతన కళను నేటి తరానికి గుర్తుచేస్తూ జరిపిన ఈ తోలుబొమ్మలాట, తెలుగు ప్రజల సంప్రదాయాలకు ఒక అందమైన తీపిగుర్తుగా నిలిచింది. -
స్టార్ మాలో కొత్త సీరియల్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు స్టార్మా లో మరో కొత్త సీరియల్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రాబోతుంది. సునిశిత హాస్యం, ప్రేమ,ప్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సీరియల్ సాగుంతుందని మేకర్స్ తెలియజేశారు. జనవరి 22 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. సీతాకాంత్, 40 ఏళ్ల వయసు కలిగిన విజయవంతమైన వ్యాపారవేత్త . బాధ్యతలు కలిగినప్పటికీ వినోదాన్ని అభిమానించే 20 ఏళ్ల రామలక్ష్మి పాత్రలో రక్ష కనిపిస్తుంది. వీరి ఇరువురి జీవితాల ద్వారా ప్రేక్షకులను ఆహ్లాదకరమైన ప్రయాణంలో నడిపిస్తుంది "ఎటో వెళ్లిపోయింది మనసు". సీతాకాంత్ పాత్రను సీతాకాంత్ పోషించారు. ఆయన జీవితం ఒక క్రమ పద్దతిలో వెళ్లాలనుకుంటారు. దాని చేతనే ఆయన ప్రసిద్ది చెందారు, అయితే రామలక్ష్మి ప్రతి సందర్భం లోనూ ఉత్సాహం తీసుకువస్తూ , జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య వయస్సు అంతరం వినోదభరితమైన ఘర్షణలకు దారి తీస్తుంది, హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సరైన నేపథ్యాన్ని సృష్టిస్తుంది. రామలక్ష్మి గతం నుంచి కుటుంబ రహస్యాలను వెలికితీసినప్పుడు, ఈ ద్వయం సంఘటనల సుడిగుండంలో తమను తాము కనుగొంటారు, ఇది సౌకర్యం కోసం చేసుకున్న వివాహంతో ముగుస్తుంది. సీతాకాంత్ యొక్క ఖచ్చితమైన స్వభావం, రామలక్ష్మి యొక్క నిర్లక్ష్య స్ఫూర్తితో ఢీకొంటూ ప్రేమ, నవ్వు మరియు కుటుంబ బంధాలను మిళితం చేసే ప్రయాణానికి వేదికగా నిలుస్తుంది. ప్రేమంటే వయసు, అభిరుచుల తూకం కాదు , రెండు గుండెల చప్పుడు అని చెబుతుంది. స్టార్ మా లో ప్రతి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు "ఎటో వెళ్లిపోయింది మనసు" ప్రసారమవుతుంది. -
ఫుడ్ డెలివరీ బాయ్ టాలెంట్కు మెచ్చి సాయం చేసిన రాహుల్ సిప్లిగంజ్
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" స్టార్ మాలో మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు. గతంలో తాను కూడా ఒక బార్బర్ షాప్లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్ చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
ఆకట్టుకుంటున్న ‘స్టార్ మా’పవర్ అవర్
‘స్టార్ మా’ పవర్ అవర్ విజయవంతంగా ప్రారంభించి టెలివిజన్ హిస్టరీలో ఎంతో ఆకట్టుకునే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "సత్యభామ" మరియు "ఊర్వసి వో రాక్షసి వో" షోలు ఉన్నాయి. డిసెంబర్ 18న ప్రీమియర్, పవర్ అవర్ రాత్రి 9:30 గంటలకు "సత్యభామ"తో ప్రారంభమైంది. ఆ తర్వాత రాత్రి 10:00 గంటలకు "ఊర్వసి వో రాక్షసి వో" ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అవుతుంది. ప్రముఖ టెలివిజన్ జంట యష్, వేద నటించిన ‘సత్యభామ’ డిసెంబర్ 18న రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10:00 గంటలకు ‘ఊర్వసి వో రాక్షసి వో’ శైలిని పునర్నిర్వచించటానికి హామీ ఇచ్చే గ్రిప్పింగ్ రివెంజ్ డ్రామా. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నుండి 10:30 గంటల వరకు పవర్ అవర్ సమయంలో “సత్యభామ” మరియు “ఊర్వసి వో రాక్షసి వో” యొక్క బ్యాక్-టు-బ్యాక్ ఉత్సాహాన్ని అనుభవించడానికి ఆడియన్స్ ను స్టార్ మా ఆహ్వానిస్తోంది. -
అభిమానులతో బతుకమ్మ ఆడిన 'స్టార్ మా' నటీనటులు
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, స్టార్ మాకు సంబంధించిన సీరియల్ నటులు సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో ఉనన దుర్గా పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రముఖ షోలు 'పలుకే బంగారమాయెనా, నాగ పంచమి'లలో నటించిన ప్రముఖ నటీనటులు తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులను కలుసుకున్నారు. దీంతో వారందరూ ఎంతగానో సంతోషించారు. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడటమే కాకుండా పలు సినిమాల సూపర్ హిట్ పాటలు పాడుతూ డ్యాన్స్లు చేశారు. అనంతరం వారితో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా పలు బహుమతులను కూడా అందుకున్నారు. ఇలా సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో మెప్పించారు. ఇలా తమను అభిమానిస్తున్న ప్రేక్షకులతో ఇలా బంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు.. ప్రతి పండుగను ఇలా సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఎప్పటికీ కట్టుబడి ఉందిని వారు తెలిపారు. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా స్టార్ మా నటీనటులను ఇలా ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం చెప్పుకోతగినదని పేర్కొన్నారు. -
తల్లికి దూరమైన కుమారుడు ఏమయ్యాడు?.. ఆసక్తి పెంచుతోన్న సీరియల్!
అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్లు ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇదే "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి. కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం.. ఆ తల్లికి, కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ, కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడతాడో.. తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే "గుండె నిండా గుడి గంటలు" చూడాల్సిందే. -
పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!
తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న స్టార్ మాలో మరో కొత్త సీరియల్ వచ్చేసింది. సరికొత్త కథనంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు "మామగారు" అనే సరికొత్త సీరియల్తో పలకరించింది. ఈ నెల 11 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే వినూత్నమైన కథనం కలిగిన ఈ సీరియల్.. అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉండనుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని.. ఉన్నత వుద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె. చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధ ల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్లు కావటం... ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటం తో , ప్రభుత్వం గంగాధరన్ పాస్పోర్ట్ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి.. చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయస్థితి ఏర్పడటం... డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య .. సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య.. తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? అనేది సీరియల్ చూస్తేనే తెలుస్తుంది. తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ.. ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు... నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో మామగారు సీరియల్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది. -
‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్
భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. ఎన్నో ఆశలను నేర్పిస్తుంది. ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఈ కథతో స్టార్ మా ప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ "పలుకే బంగారమాయెనా". పుట్టుకతోపరాజితులే గానీ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలానిలబడ్డారు అనే విలక్షణ మైన కథ తో ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది ఈ సీరియల్. ‘గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణం లో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు ఉంటాయో.. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏదో సాధించాలనేతపన ఉన్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేనినిస్సహాయ పరిస్థితి. అయితే, ఆమె జీవితం లోకి అతని రాక ఒకమలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమెఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్దచేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది "పలుకేబంగారమాయెనా" కథ’ అని సీరియల్ బృందం పేర్కొంది. -
బిగ్బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?
బుల్లితెరపై బిగ్బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా, త్వరలోనే బిగ్బాస్-7 ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా బిగ్బాస్ -7 ప్రోమోను 'స్టార్ మా' విడుదల చేసింది. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా అభిమానులకు బిగ్బాస్ టీమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఓటీటీ వేదికైన డిస్నీ+ హాట్స్టార్లోనూ ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. (ఇదీ చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?) సీజన్ 1లో ఎన్టీఆర్, సీజన్ 2లో నాని హోస్ట్గా సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వచ్చిన అన్ని సీజన్ల వరకు అక్కినేని నాగార్జున హోస్ట్గా మెప్పంచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా 7వ సీజన్లో నాగ్నే హోస్ట్గా ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ప్రోమోలో నాగ్ లుక్ అదిరిపోయింది. ఆగష్టు చివరి వారంలో బిగ్ బాస్-7 జర్నీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) ఈసారి షో చాలా కొత్తగా ఉంటుందని ఈ ప్రోమోలో నాగార్జున చెప్పారు... ప్రతిసారి ఇదే డైలాగ్ కదా చెప్పేది అని. మరో డైలాగ్ అందుకుంటాడు. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటూ ప్రోమోతో నాగ్ ముందుకు వచ్చాడు. ఈ డైలాగ్తో కంటెస్టెంట్లను కొంతమేరకు డైలామాలో పడేశాడు. అంటే ఈసారి షో రొటిన్గా కాకుండా రూట్ మార్చాలనే ప్లాన్లో ఉన్నట్లు అర్థం అవుతుంది. గత ఆరు సీజన్ల మాదిరి అవే టాస్క్లు కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు ఆడియన్స్ ఊహకు కూడా అందకుండా షో రన్ చేయాలిని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. -
Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే
బుల్లితెరపై బిగ్బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా, త్వరలోనే బిగ్బాస్-7 ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి ఈసారి సీజన్ ఉంటుందా..? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ అభిమానులకు బిగ్బాస్ టీమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి అప్డేట్ లేకుండా ప్రోమోను రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు) BB7 తెలుగుతో మళ్లీ వచ్చేస్తున్నామని ఈసారి వినోదం పూర్తి ప్యాకేజీ ఉంటుందని టీమ్ తెలిపింది. ఈ సీజన్లో అభిమానులకు ఎమోషన్స్తో పాటు సర్ప్రైజ్లు ఉంటాయని మేకర్స్ చెప్పారు. ఈ సీజన్లో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండనున్నట్లు వారు చెప్పారు. ఓరకంగా అభిమానుల్ని రోలర్కోస్టర్ రైడ్లోకి తీసుకెళ్తుందని మేకర్స్ తెలుపుతూ ప్రోమోను విడుదల చేశారు. కాబట్టి ఈసారి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ సీజన్కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్గా చేయనున్నారని తెలుస్తొంది. -
టీఆర్పీలో రికార్డు సృష్టించిన స్టార్ మా.. ఆ ఛానల్స్ను వెనక్కు నెట్టి..
స్టార్ మా చానల్స్ కొత్త చరిత్ర సృష్టించాయి. బార్క్ 13వ వారం రేటింగ్స్లో అత్యధిక రేటింగ్స్ సాధించింది స్టార్ మా. ప్రైమ్ టైమ్ తోపాటు నాన్ ప్రైమ్ ట్రైమ్లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్ రేటింగ్స్ దాటేసింది. 13వ వారం మొత్తమ్మీద స్టార్ మాకు 882 జీఆర్పీల రేటింగ్ వచ్చింది. స్టార్ మా ప్రైమ్టైమ్ జీఆర్పీ లలో 342 , నాన్ ప్రైమ్ టైమ్లో 510 సాధించింది. నూతన సీరియళ్ల లాంచ్ లోనూ స్టార్ మా తన ఆధిపత్యం చాటింది. తెలుగు ఛానెల్స్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర భాషలోని వినోద ఛానెల్స్ సాధించలేని అరుదైన రికార్డు సాధించింది. ఇటీవలే స్టార్ మాలో ప్రారంభమైన నాగపంచమి, బ్రహ్మముడి సీరియల్స్ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి. గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ నాగపంచమి సీరియల్ 11556 ('000 ఏఎంఏ), బ్రహ్మముడి సీరియల్ 10372.2('000 ఏఎంఏ) సాధించింది. ఈ రికార్డులకు దూరంగా సన్టీవీలో ప్రారంభమైన వనథై పోలా 9661.2 ('000 ఏఎంఏ); స్టార్ ప్లస్లో ప్రారంభమైన ఇమ్లీ 8814.1 ('000 ఏఎంఏ), కలర్స్లో నాగిన్ - 5 సీజన్ 8700.5 ('000 ఏఎంఏ) తరువాత స్థానాలలో నిలిచాయి. ఇక స్టార్ మా మూవీస్ , జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్పీల రేటింగ్ సాధించింది. ఇండియాలో నెంబర్1 మ్యూజిక్ ఛానెల్గా స్టార్ మా మ్యూజిక్ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్ ఛానెల్స్పై చూపింది. -
సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్
షూటింగ్ సెట్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘స్టార్ మా’ ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటున్ చందన్ కుమార్. ప్రస్తుతం అతడు తెలుగులో ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు జరిగిన షూటింగ్లో చందన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. సీరియల్కు పనిచేస్తున్న ఓ టెక్నిషియన్ను నానాబూతులు తిడుతూ నోరుపారేసుకున్నాడు. దీంతో యూనిట్ అంతా తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన మదర్ను దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై అంతేకాదు అతనిపై మాటల దాడికి దిగారు. ఇక అక్కడే ఉన్న మిగతా సిబ్బంది చందన్తో చేత టెక్నిషియన్కు క్షమాపణలు చెప్పించారు. అనకూడని మాటలు అన్నాడు, నా తల్లిని దూషించాడు ఇప్పుడు సారీ చెబితే ఊరుకుంటామా అని సదరు సిబ్బంది వాదించాడు. ఇలా నటుడు చందన్ ఓవరాక్షన్ చేసి చెంప దెబ్బతిన్న వీడియో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. కాగా చందన్ కన్నడ పరిశ్రమలో ఎంతోకాలంగా యాక్టివ్గా ఉన్నాడు. చందన్ హీరోగా, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా ప్రేమ బరహా చిత్రం కూడా వచ్చింది. ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి కన్నడ సీరియల్స్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత -
"నువ్వు నేను ప్రేమ" అంటున్న స్టార్ మా!
ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే "నువ్వు నేను ప్రేమ". ఇద్దరి మధ్య శత్రుత్వం సంధించే చాలా కష్టమైన ప్రశ్నలకు అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది ఈ సీరియల్ "నువ్వు నేను ప్రేమ". జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా ఈ సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది. స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది. (అడ్వర్టోరియల్) "నువ్వు నేను ప్రేమ" ప్రోమో👇 -
నేను కడుపులో ఉండగానే అమ్మను వదిలేశాడు : 'కస్తూరి' నటి
Kasturi Serial Heroine Aishwarya Gets Emotional: ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు, వ్యధలు కనిపిస్తుంటాయి. తెరపై కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి సరదాగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్విని తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. స్టార్మాలో ప్రసారం అవుతున్న ‘కస్తూరి’, ‘C/O అనసూయ’సీరియల్స్తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని(శివాణి), ఐశ్వర్య(కస్తూరి)లు తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, ఆఖిరికి తన తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేదని నటి తేజస్విని పేర్కొంది. 'ఇంటర్లో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పటివరకు తెలియదు. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లాను. అప్పటికే అన్నీ చేసేశారు. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. 'నేను కడుపులో ఉండగానే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయకండి ప్లీజ్' అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. -
రెండేళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి-శ్రీముఖి.. ఫోటోలు లీక్
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్గా సత్తా చాటుతున్నాడు. 'సమ్థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది. బిగ్బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బిగ్బాస్ గ్రాండ్ ప్రీమియర్..సెప్టెంబర్ 5న ప్రారంభం
వినోద ప్రియులు మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్టార్ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్బాస్ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ 'స్టార్ మా' ఛానెల్లో సెప్టెంబర్ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. గత సీజన్ గ్రాండ్ ఫైనల్.. భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక వీక్షణ రేటింగ్ను సాధించి రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్బాస్ షో ఉండనుంది. బిగ్బాస్ తెలుగుకు సంబంధించి ఓ సీజన్ ముగింపు రాత్రే తరువాత సీజన్కు సంబంధించిన చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రచారాన్ని రూపొందించారు. ఈ షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనంటూ ఎదురుచూసున్న అభిమానుల జీవితాల్లో పూర్తి వినోదాన్ని తీసుకువస్తామంటూ ఈ ప్రచారం జరిగింది. ''స్టార్ మా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను చేరుకుంది. మా వీక్షకులు మా పట్ల చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలే దీనికి కారణం. అగ్రశ్రేణి ఛానెల్స్ సరసన మేము నిలిచాం. తద్వారా దేశంలో ప్రాంతీయ ఛానెల్ శక్తిని ప్రదర్శించాం. బిగ్బాస్ తెలుగు మరో సీజన్ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న ఉత్సాహపూరితమైన షోలలో బిగ్ బాస్ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. తెలుగు వీక్షకుల నడుమ ఇది అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది..’’ అని స్టార్ మా అధికార ప్రతినిధి అన్నారు. అక్కినేని నాగార్జున ఈ సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్, యాక్షన్, వినోదంను నూతన టాస్క్లు, ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు. బిగ్బాస్ ఐదవ సీజన్కు హోస్ట్ చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తద్వారా వారిని మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. అంతర్జాతీయంగా అత్యంత విజయవంతమైన నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో బిగ్ బాస్ ఒకటి. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్షైన్ గ్రూప్ సొంతం.బిగ్బాస్ తెలుగు–సీజన్ 5, స్టార్మాలో సెప్టెంబర్05, సాయంత్రం 6 గంటలకు తొలిసారి ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం–శుక్రవారం వరకూ మరియు రాత్రి 9 గంటలకు శని–ఆదివారాలలో ప్రసారమవుతుంది. -
"అమ్మకు తెలియని కోయిలమ్మ" స్టార్ మాలో
విలక్షణమైన కథలు, వినూత్నమైన కథనాలతో ప్రేక్షకులకు విభిన్నమైన ధారావాహికలను అందిస్తున్న స్టార్ మా.. ఇప్పుడు మరో సరికొత్త కథని సీరియల్ గా అందిస్తోంది. ఆ కథ పేరు "అమ్మకు తెలియని కోయిలమ్మ". అనుబంధాల మధ్య సంఘర్షణ, ఆప్యాయతల మధ్య దూరాలు పెరిగి ఎవరి కథ ఎలా షాక్ ఇవ్వబోతోంది ? ఎవరి కథ ఎందుకలా అయింది ? అసలు ఎందుకు ఇలా జరిగింది ? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం "అమ్మకు తెలియని కోయిలమ్మ". అమ్మకీ కోయిలమ్మకీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో .. అనుబంధాల ఆధారంగా విశ్లేషించే కథ ఇది. తెలుగు సినిమాల్లో ఎన్నో ముఖ్యమైన కేరక్టర్స్ చేసిన మంజు భార్గవి ఈ కథలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నటులు చిన్నా, వినోద్ బాల, అశ్వని గౌడ ముఖ్యమైన కేరక్టర్స్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్ గా కావ్యశ్రీ నటిస్తున్నారు. జులై 19 న రాత్రి 9.30 గంటల నుంచి స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టార్ మా ప్రేక్షకుల్ని అలరించబోతోంది. -
‘పాపే మా జీవనజ్యోతి’ అంటోంది స్టార్ మా
స్టార్ మా సరికొత్త భావోద్వేగాలతో కూడిన ఓ కొత్త కథ తో సరికొత్త ధారావాహిక రూపొందించింది. ఈ సారి అమ్మ అనే ఎమోషన్ తో వినూత్నమైన కథను అందిస్తోంది. ఆ సీరియల్ పేరు "పాపే మా జీవనజ్యోతి". టైటిల్ లో జీవన పాప అయితే, జ్యోతి తల్లి. ఆనందంగా సంతోషంగా వున్న ఓ పెద్ద కుటుంబం.. అందులో అందరికీ ముద్దుల మురిపాలు పంచే ఓ పాప. కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్ల లేని లోటు తీర్చిన పాప ఆ అమ్మాయి. దానితో ఇంట్లో అందరూ కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటారు ఆ పాపని. కానీ ఇంతలోనే ఊహించని సంఘటన. కొన్ని కారణాల వాళ్ళ ఆ పాప ఇంటి నుంచి మిస్ అయింది. ఎవరో ఎత్తుకుపోయారు. ఏ తల్లి సహించలేనిది. ఏ కుటుంబం భరించలేనిది. ఇంతకీ ఎవరి పని ఇది? తరవాత పరిస్థితులు ఎలా మారాయి? పాప ఏమైంది? ఎవరి చేతుల్లో వుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. అన్నిటికీ జవాబులిస్తుంది "పాపే మా జీవనజ్యోతి" సీరియల్. పల్లవి, ప్రీతమ్, ప్రీతీ నిగమ్ తదితరులు నటిస్తున్న ఈ ధారావాహికని శాండల్ వుడ్ మీడియా నిర్మిస్తోంది. మాధవ్ దర్శకులు. ఏప్రిల్ 26 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మా లో ఈ ధారావాహికి ప్రసారం అవుతుంది. -
ప్రేమని నిలబెట్టుకునేందుకే ఆ జంట ఏం చేస్తుందంటే..
ఎవరు భర్త అవుతారో, ఎవరు భార్యగా వస్తారో తెలియకపోవడమే జీవితంలో మేజిక్. ఆ తరవాత ఒకరికోసం ఒకరు అనే భావన ఏర్పరచుకోవడం మరో మేజిక్. 'స్టార్ మా' సరికొత్తగా ప్రారంభించబోతున్న ధారావాహిక కోసం ముందుగా విడుదల చేసిన పాట సంచలనం సృష్టిస్తుంది. ఇది కేవలం రెండు ముఖ్యమైన పాత్రల పరిచయం. ఏ సిరులూ తన సుగుణాలతో సరితూగవని అమ్మాయి... నా కలలను నీ కనులతో చూడాలని ఆశ పడే అబ్బాయి... ఎంత అందంగా వుంది ఈ ఊహ. పాత్రల పరంగా అది పూర్తిగా నిజం. అలా పాట అంతా జీవితాన్ని అందమైన కోణం లో చూసిన ఇద్దరి ఆలోచనలు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఆ ప్రేమని నిలబెట్టుకునేందుకే ఆ జంట ప్రయత్నించి నిలబడుతుంది. ఈ నెల 22న (సోమవారం) ఈ సీరియల్ ప్రారంభం అవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది. చదవండి : చిరంజీవి పాటకు స్టెప్పులేసిన బిగ్బాస్ భామ, ఫ్యాన్స్ ఫిదా -
చిరంజీవి పాటకు స్టెప్పులేసిన బిగ్బాస్ భామ, ఫ్యాన్స్ ఫిదా
మోనాల్ గజ్జర్.. ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్బాస్ షోతో వచ్చేసింది. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్గా తెలుగు బిగ్ బాస్ 4 సిజన్లో కంటెస్టెంట్గా హౌజ్లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. 98 రోజుల పాటు హౌజ్లో కొనసాగి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో బయటకు రాగానే మోనాల్కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇటీవల వచ్చిన ‘అల్లుడు అదుర్స్’లో స్పెషల్ సాంగ్లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఇందులో మోనాల్ డ్యాన్స్, ఎక్స్ప్రెషన్కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత స్టార్ మాలో వస్తున్న డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షోకు మెంటర్గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో తాజాగా స్టార్ మా డ్యాన్స్ ప్లస్ షో ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో మోనాల్ డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ చిరు-రోజాల సూపర్ హిట్ సాంగ్ మావ మావ పాటకు బాబా భాస్కర్ మాస్టర్తో కలిసి ఆకుపచ్చ రంగు చీరలో మోనాలు చిందులేసింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక జియా చార్లీ చాప్లీస్గా అందరిని ఆకట్టుకొగా బాబా భాస్కర్, యశ్, రఘు మాస్టర్లు ఒక గ్రూప్గా, అనీ మాస్టర్, ముమైత్ ఖాన్, మోనాల్ ఒక గ్రూప్గా పంజా మూవీలో ఐటెం సాంగ్ వెయ్రా చెయ్యి వేయ్రా పాటకు డ్యాన్స్ చేసి స్టేజ్పై రచ్చరచ్చ చేశారు. చదవండి: సోషల్ హల్చల్: కళ్లతో కైపెక్కిస్తోన్న భామలు ఏకధాటిగా 21 గంటలు షూటింగ్లో పాల్గొన్నా -
‘స్టార్ మా’ లో నయనతార కొత్త వేషం..!
ఆదివారాలు పాజ్ బటన్తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం. అయితే సమయాన్ని మరపురానిదిగా మలుచుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ‘స్టార్ మా’ ఆదివారాలు ఇదే ఫార్ములాని అనుసరిస్తోంది. ఈ ఆదివారం (7వ తేదీ) సాయంత్రం 6 గంటలకు నయనతార ప్రత్యేక పాత్రలో నటించిన "అమ్మోరు తల్లి" చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. ఎన్నో మంచి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార ముక్కుపుడక అమ్మవారిగా విభిన్నమైన హావభావాలతో కనువిందు చేయబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా "అమ్మోరు తల్లి" చిత్రం రాబోతోంది. వినోదానికి కొత్త అర్ధం చెబుతున్న ఈ సంచలన చిత్రం ఓ వినూత్నమైన అనుభూతిని ఇవ్వనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు "స్టార్ట్ మ్యూజిక్ " షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సాయంత్రం నయనతార నట విశ్వరూపం. స్టార్ మా ప్రేక్షకులకు ఈ ఆదివారం వెరీ వెరీ స్పెషల్. చదవండి: ఆన్లైన్ క్లాసులు: షాకైన అమ్మోరు తల్లి -
కన్నులపండువగా స్టార్ మా సండే
మిగతా రోజుల కంటే ఆదివారం నాడు కాస్త ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే రోజూ కంటే ఇంట్లో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది గనక, ఆదివారం 'ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం, ఆదివారాన్ని మెమరబుల్ డే ని చెయ్యడం కోసం స్టార్ మా గ్రాండ్ ఈవెంట్ “100% లవ్” రెండో భాగంతో వస్తోంది. ఫిబ్రవరి 28న సా. 6 గం.లకు స్టార్ మా లో ప్రసారం కాబోతున్న ఈ ఈవెంట్లో తెరపైన జంటలు, అసలైన జంటలు మరింతగా కనువిందు చేయబోతున్నారు. పక్కా ఎంటర్టైన్మెంట్ అనడానికి అవసరమైన అన్ని అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఈవెంట్లో స్టార్ యాంకర్ ఓంకార్ పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. సై అంటే సై అంటున్న రెండు వర్గాల్లో కప్ని ఎవరు కొట్టబోతున్నారనెది ఉత్మంఠభరితంగా ఉండబోతోంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు సుమ తన “స్టార్ మ్యూజికొతో మేజిక్, 1.30 గం.లకు కామెడీని పండించే రైతుల్లాంటి కామెడీ స్టార్స్ ఎలాగూ ప్రతి ఆదివారం టోటల్ ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్స్టైన్మెంట్ని ఇస్తూనే ఉన్నాయి. ఈ ఆదివారం స్టార్ మాలో ఓహో అనిపించే వినోదం ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంటుంది. ఆస్వాదించడమే ఆలస్యం. -
సండే స్టార్ మా లో ప్రేమలోకం !
ప్రేమంటే రెండు అక్షరాల మహాకావ్యం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా చెప్పడానికి ఎంతో మిగిలే ఉంటుంది. అలాంటి ప్రేమని స్టార్ మా ఈ ఆదివారం ఓ కొత్త కోణంలో ఒక ఈవెంట్ గా అందించబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ పేరు "100% లవ్". తెరపైన జంటలకీ నిజ జీవితంలో జంటలకీ మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు! సగటు ప్రేక్షకుడు కోరుకునే అంశాలనే ఉంటూనే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించడానికి "100% లవ్" అన్ని హంగులతో రాబోతోంది. సరదాగా ఆడుకునే ఆటలు, ప్రేమగా పంచుకునే మాటలు, రెండు హృదయాల మధ్య ఎన్నో స్వీట్ నథింగ్స్, ఉంగరాలు మార్చుకునే ఉద్వేగ క్షణాలు, కలిసి అడుగులు వేసే సంతోషాలు... ఇలాంటివి ఎన్నో ఈ ఈవెంట్ అందించబోతోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 21న) సాయంత్రం 6 గంటలకు "100% లవ్" ఈవెంట్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. -
రుద్రమ దేవి ధైర్యసాహసాలతో...
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రాణి రుద్రమదేవి ధైర్య సాహసాలను బుల్లి›తెరపై ఆవిషరించేందుకు సిద్ధమైంది స్టార్ మా ఛానెల్. బుల్లి తెరపై మునుపెన్నడూ లేని ప్రమాణాలతో ‘రుద్రమదేవి’ కథను సీరియల్ రూపంలో తీసుకొస్తున్నారు. ‘‘ఈ రుద్రమదేవి కథా కాలాన్ని యథాతథంగా తెర మీదకు తీసుకు వచ్చేందుకు వందల మంది కృషి చేశాం. ఇది మన తెలుగు కథ. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కథ’’ అని స్టార్ మా బృందం పేర్కొంది. ‘రుద్రమదేవి’ సీరియల్ జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు స్టార్ మా చానెల్లో ప్రసారం కానుంది. -
అతిపెద్ద ఆవిష్కరణగా బిగ్బాస్: నాగార్జున
బిగ్బాస్ సీజన్ 4ను హోస్ట్ చేయడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున అన్నారు. బిగ్బాస్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వారం కోట్లాదిమంది వీక్షకులకు వినోదం కలిగించడమే అత్యుత్తమ సంతృప్తిగా నిలుస్తుందన్నారు. కాగా స్టార్ మా అందిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ 4. సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మరో రెండు వారాల్లో శుభం కార్డు పడనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సహా ఇప్పటి వరకు బిగ్బాస్ హౌజ్లోకి 19 అడుగు పెట్టగా ప్రస్తుతం హౌజ్లో ఆరుగురు పోటీదారులు మాత్రమే మిగిలారు. వీరంతా కూడా ఈ సంవత్సరపు టైటిల్ కోసం పోటీపడుతుండటంతో పాటుగా వీలైనంతగా వినోదాన్ని అందిస్తున్నారు. విభిన్న నేపథ్యాల నుంచి కంటెస్టెంట్లు ఉండటంతో ఈ క్లైమాక్స్ ఖచ్చితంగా వీక్షించేందుకు ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తోంది. చదవండి: నేను అర్హురాలు కాదేమో..: అరియానా ఈ సీజన్ గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ ‘‘బిగ్బాస్ ప్రతి వారం కోట్లాది మందికి వినోదం అందించడం అత్యుత్తమ సంతృప్తిని అందిస్తుంది. అదీ మహమ్మారి విజృంభణ లాంటి కష్టసమయంలో బిగ్బాస్ సీజన్ 4 గత రికార్డులను తుడిచి పెట్టేసింది. అలాగే జాతీయస్థాయిలో బిగ్బాస్ 3 సీజన్ సృష్టించిన రికార్డులను ఇది అధిగమించింది. 20+ టీవీఆర్తో ఇది బిగ్బాస్ షోలలో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచింది. గతవారం ఏపీ మరియు తెలంగాణాలలో 4 కోట్లకు పైగా వీక్షకులు దీనిని వీక్షించడం ఈ షో పట్ల వారి ప్రేమకు నిదర్శనం. గత 12 వారాలలో జంట రాష్ట్రాలలో దాదాపు 83% మంది వీక్షకులు బిగ్బాస్ సీజన్ 4 వీక్షించారు. ఇది అపూర్వం. ఇప్పుడు మేము అత్యంత ఉత్సాహ పూరితమైన దశలో ప్రవేశించాము. ఈ షో యొక్క ఫైనల్ మరింత ఆసక్తిగా ఉండబోతుంది. బిగ్బాస్ సీజన్4 ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు. చదవండి: మోనాల్ స్ట్రాంగ్: బాధను దిగమింగిన అవినాష్ కాగా ఇప్పటి వరకు విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్లో తమ సొంత రికార్డులనే అధిగమించింది. ప్రతి వారం ఆకట్టుకునే ప్రదర్శనతో 4 జీఈసీలలో 42% వాటా (ఎస్డీ+హెచ్డీ)ను పొందింది. బిగ్బాస్లాంటి భారీ వేదికను వినియోగించుకుని స్టార్ మా ఇప్పుడు తమ ప్రైమ్ టైమ్ను ప్రతి సంవత్సరం స్ధిరీకరించుకోవడంతో పాటుగా కొన్ని నూతన బ్లాక్బస్టర్ షోలనూ ఆవిష్కరించింది. స్టార్ మా ఇప్పుడు తమ బిగ్బాస్ షో సమయాన్ని రాత్రి 10 గంటలకు మార్చింది. అదే సమయంలో తమ అతిపెద్ద ఫిక్షన్ సీరియల్ ‘వదినమ్మ’ను రాత్రి 9.30గంటలకు తీసుకువచ్చింది. దీనితో స్టార్ మా ప్రైమ్ టైమ్ రాత్రి 11 గంటల వరకూ విస్తరించడంతో పాటుగా వీక్షకులకు ప్రతి రోజూ అదనంగా అర్థగంట వినోదం అందుబాటులోకి వస్తుంది. చదవండి: హారికకు సోహైల్ వార్నింగ్: కథే వేరే ఉందిగా! చదవండి: అరియానాకు చుక్కలు చూపిస్తున్న సోహైల్ -
వినోదానికి కేరాఫ్గా మారిన స్టార్ మా
సాక్షి, హైదరాబాద్: మారుతున్న సాంకేతికత, కంటెంట్ లభ్యతతో టెలివిజన్ వినోదం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవ వేళ సాధారణతకు భిన్నంగా అసాధారణ ప్రయాణాన్ని ఆరంభించి ట్రెండ్ సెట్టర్గా నిలిచిన స్టార్ మా ప్రయాణాన్ని చుట్టేసొద్దాం.. తెలివైన, శక్తివంతమైన వినోదంతో విజయ ప్రయాణాన్ని ఆరంభించిన స్టార్ మా గత నాలుగు సంవత్సరాలలో వినోదానికి కేరాఫ్గా మారింది. ఒక వారాన్ని మించి మరో వారం అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన తెలుగు వినోద ఛానెల్గా విశిష్ట గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు వినోదాన్ని పునర్నిర్వచించిన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోల సమ్మేళనమిది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ కావాల్సిన సంపూర్ణ వినోదాన్నిఅందిస్తున్నందుకు స్టార్ మా గర్విస్తోంది. (చదవండి: ఐపీఎల్ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప) 2017 అక్టోబర్లో నెంబర్ 1 షో కార్తీక దీపంను స్టార్ మా లో ప్రారంభించారు. ఈ కథ కోట్లాది మంది ప్రేక్షకులను రంజింపజేస్తూనే, భారతదేశపు అభిమాన సీరియల్గా నిలిచింది. తమ నాల్గవ సీజన్లో ఉన్న బిగ్బాస్, ప్రతి సంవత్సరం టెలివిజన్ వీక్షకుల నడుమ ఆసక్తిని రేకిత్తిస్తోంది. కార్తీక దీపంలో దీప అయినా, గృహలక్ష్మిలో తులసి; మౌనరాగంలో అమ్ములు లేదా కేరాఫ్ అనసూయలో అనసూయ అయినా స్టార్ మా లోని ప్రతి క్యారెక్టర్, మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రతిబింబిస్తూనేఉంటుంది. స్టార్ మా యొక్క ట్యాగ్లైన్ ‘మీ తో మేము, మా తో మీరు’ను స్ఫురిస్తూనే ఉంటుంది.ఇక స్టార్ మా.. స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ ఛానళ్లను కూడా నడుపుతున్న విషయం తెలిసిందే. -
‘స్టార్ మా’ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే ఎక్కువ మంది వీక్షించే ఎంటర్టైన్మెంట్ ఛానెల్గా ‘స్టార్ మా’ అవతరించింది. తాజాగా విడుదల అయిన రేటింగ్స్ లో ఈ ఘనత సాధించినట్లు స్టార్ మా ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని రీజినల్ చానెల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్న స్టార్ మా సన్ టీవీని దాటి ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్గా మారింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, ప్రముఖ తారలతో కూడిన ఈవెంట్లు, లైవ్ కార్యక్రమాలు స్టార్ మా లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తెలుగులో పాపులర్ సీరియల్స్ తో స్టార్ మా ముందుంది. 42 శాతం వీక్షకులను ఆకట్టుకుంటున్న వదినమ్మ, కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి, తాజాగా ప్రారంభమైన దేవత, కస్తూరి తదితర కార్యక్రమాలతో స్టార్ మా ముందుకు వెళ్తుంది. బిగ్బాస్, సిక్స్సెన్స్, ఇస్మార్ట్ జోడీ లాంటి రియాలిటీ షో లు కూడా మా టీవీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. -
‘అనసూయ’గా వంటలక్క అత్తమ్మ!
‘కేరాఫ్ అనసూయ’తో మరో పవర్ఫుల్ పాత్ర ద్వారా ‘స్టార్ మా’ ప్రేక్షకుల ముంగిటకొస్తున్నారు అర్చన అనంత్. కార్తీకదీపం సీరియల్లో వంటలక్క దీపకు అత్తమ్మ సౌందర్యగా తెలుగు లోగిళ్లలో సుపరిచితమైన వ్యక్తి అర్చన అనంత్. ఐపీఎల్ను మించిన క్రేజ్ కార్తీకదీపం సీరియల్కు తెలుగునాట ఉన్నా సీరియల్లో అత్తమ్మగా తప్ప వ్యక్తిగతంగా అర్చన గురించి తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే! ఫ్యాషన్ డిజైనర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిన అర్చన ఇప్పుడు నటిగా మాత్రం విశ్వరూపం చూపుతున్నారు. కార్తీకదీపంలో తనదైన నటనతో ప్రతి హృదయాన్నీ తట్టిలేపిన ఆమె ఇప్పుడు కేరాఫ్ అనసూయ అంటూ ‘స్టార్ మా ’ ఛానెల్లో అక్టోబర్ 12వ తేదీ నుంచి మధ్యాహ్నం 2గంటలకు తెలుగు లోగిళ్లను పలుకరించబోతున్నారు. నటనా రంగం వైపు మళ్లడం దగ్గర నుంచి అనసూయగా తాను చేయబోయే పాత్ర వరకూ అనేక అంశాలను ‘సాక్షి’ తో ముచ్చటించారు. అలా మొదలైంది.. డాక్టర్ కాబోయి యాక్టర్ అని చాలామంది అంటుంటారు కానీ, దానికి భిన్నం అర్చన కెరీర్ ప్రయాణం. అసలు తానెన్నడూ నటి కావాలని అనుకోలేదనే అంటుంటారామె. నటిగా మారడానికి గల కారణాలను ఆమె చెబుతూ ‘‘ఫ్యాషన్ డిజైనర్గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని కోరడం జరిగింది. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్లో పాల్గొన్నాను. ఆ తరువాత నటించే అవకాశం వచ్చింది. చెబితే మీరు నవ్వుతారు కానీ, నా తొలి పాత్ర ఓ శవంలా పడుకోవడం. నో డైలాగ్స్... నో ఎక్స్ప్రెషన్స్. అదీ ఓ షార్ట్ఫిలిం కోసం! ఆ చిత్ర కెమెరామెన్ మా నాన్నకు స్నేహితులు కావడంతో నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఆయన అయితే ఏం లేదు.. మీరు శవంలా పడుకుంటే చాలన్నారు. అలాగే పడుకున్నాను.. అదిగో అలా నా నటనా ప్రయాణం ప్రారంభమైంది’’ అని చెప్పుకొచ్చారు. సినీ కుటుంబమే కానీ.. అర్చన కుటుంబ నేపథ్యం సినిమానే. నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటులు అనంత వేలు. తమ ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కానీ తనకు దానిమీద ఆసక్తి మాత్రం పెద్దగా ఉండేది కాదు. నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. తన పరపతి ఉపయోగించి తనన్ను ఎక్కడా రికమెండ్ చేయలేదాయన అని వెల్లడించిన అర్చన... అన్నట్లు తమ నాన్నే తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. కల నెరవేర్చుకోవడానికి పదేళ్లు పట్టింది.. నటిగా మారిన తరువాత తెలుగు వినోద పరిశ్రమలోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు అర్చన. నిజానికి తన తొలి ప్రాజెక్ట్ కన్నడ అని చెప్పిన ఆమె కన్నడ, తమిళ, మలయాళ భాషలలో బిజీగా మారిన తరువాతనే తెలుగుకు రావడం జరిగిందన్నారు. తాను ఓ తెలుగు ప్రాజెక్ట్ కోసం వచ్చి తమిళ ప్రాజెక్ట్కు ఎంపికయ్యానని, అలాగే మలయాళంలో కూడా చేశానన్న ఆమె నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు. కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్ కోసమే తనకు ఇన్నేళ్లూ అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన అదృష్టమన్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్కు అభిమానులున్నారిప్పుడు. తనను సౌందర్యగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తిస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ క్యారెక్టర్లో ఇమిడిపోవడానికి తన నిజ జీవిత సంఘటనలు కూడా కారణమంటూ తన అమ్మ తమతో ప్రవర్తించే రీతిలోనే.. దీపతో సౌందర్య ఆ సీరియల్లో ప్రవర్తిస్తుందన్నారు. ఇకపై అనసూయ అనే అంటారు..? ‘కేరాఫ్ అనసూయ’ తెలుగులో తాను చేస్తోన్న తాజా సీరియల్ అని చెప్పారు అర్చన. సౌందర్య క్యారెక్టర్లాగానే అనసూయ క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనసూయ క్యారెక్టరైజేషన్ గురించి ఆమె వెల్లడిస్తూ మనందరికీ డబ్బు పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికా ఉంటుంది. దానికోసం ఒకొక్కరూ ఒక్కోలా శ్రమిస్తారు. పేదింటి పిల్ల అయిన అనసూయ కూడా అంతే ! డబ్బున్న వ్యక్తిని పెళ్లాడితే తాను కోరుకున్న జీవితం వస్తుందని అలాగే చేస్తుంది. అంతేకాదు, తాను అనుభవిస్తున్నట్లుగానే విలాసవంతమైన జీవితం తన కుమార్తెలు కూడా అనుభవించాలనుకుని ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో జరిగే సంఘటనలే ‘కేరాఫ్ అనసూయ’. ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే క్యారెక్టర్ ఇది. ‘స్టార్మా’ లోనే తాజా సీరియల్ వస్తుండటం, అదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రతి గృహిణినీ కదలించబోతుండటం పట్ల ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇకపై మీ మీ అత్తమ్మ... అనసూయగా మారుతుండటాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారనే నమ్ముతున్నాను. కార్తీకదీపం లాగానే స్ట్రాంగ్ క్యారెక్టర్తో సినీ రంగానికి... కన్నడంలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశాను. కానీ తెలుగులో ఓ బలీయమైన క్యారెక్టర్తో రావాలని కోరుకుంటున్నాను. అదీ ఓ పవర్ఫుల్ పోలీసాఫీర్గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్లో కూడా నటించాలనుకుంటున్నాను. టీవీ, సినిమా రెండూ వైవిధ్యమైన మాధ్యమాలు. రెండూ గొప్పవే అని అన్నారు. సహజసిద్ధంగా నటన ఉండాలనేది తన భావన అన్న అర్చన, కళ్లతోనే నటించడమే తన దృష్టిలో అసలైన నటనగా వెల్లడించారు. చక్కటి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా చేయడానికి అభ్యంతరం లేదన్నారామె. -
ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మాటీవీ చానెల్లో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్కు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత తెలుగు సీరియళ్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్కు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. ఈ సీరియల్ మాటీవీలో ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతుంది. తాజాగా ఇదే సమయంలో ఐపీఎల్ 13వ సీజన్ మ్యాచ్లు కూడా మొదలవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సమస్యే వచ్చి పడింది. (చదవండి : కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి') ఇంట్లో ఒకే టీవీ ఉంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి.. లేకపోతే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇదే సమస్యపై సెప్టెంబర్ 3న కార్తీకదీపం సీరియల్ కోసం ఐపీఎల్ టైమింగ్ మార్చాలంటూ సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు చెన్నై ఐపీఎల్ టీమ్, స్టార్ మాకి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని.. ఎలాగైనా ఐపీఎల్ మ్యాచ్లను రాత్రి 8 గంటలకు ప్రసారం చేయమని చెప్పవలసిందిగా స్టార్ మాకి కూడా సెపరేట్గా ట్వీట్ చేశాడు. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్గా మారింది. దీనిపై స్టార్ మా కూడా స్పందిస్తూ శివచరణ్ అడిగింది సబబే కదా అంటూ రీట్వీట్ కూడా చేసింది. (చదవండి : 'మేం లేకపోయినా.. చెన్నైకి నష్టం లేదు') Looks like a genuine request 🙂#KarthikaDeepam https://t.co/mDqYnHCzPu — starmaa (@StarMaa) September 3, 2020 అయితే ఈ విన్నపం కార్తీకదీపంలో హీరోయిన్ దీప పాత్ర పోషిస్తున్న ప్రీమి విశ్వనాథ్కు తెలిసింది. ఒక సీరియల్ను ఇంతలా అభిమానించేవారు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఐపీఎల్ టైమింగ్ మార్చడం కుదరని పని అని తెలుసుకున్న దీప(ప్రేమి విశ్వనాథ్) వారి అభిమానానికి సంతోషించి తానే స్వయంగా ఉత్తరంతో పాటు 32 అంగుళాల టీవీని కొని శివచరణ్ ఇంటికి పంపించింది. ఇప్పుడు శివ చరణ్ ఇంట్లో ఏ సమస్య లేదు.. ఇకపై రాదు కూడా.. ఎందుకంటే శివచరణ్ కుటుంబసభ్యులు ఒక టీవీలో కార్తీక దీపం చూస్తుంటే , మరొక టీవీలో ఐపీఎల్ మ్యాచ్లు చూసే అవకాశం లభించింది. ఈ వార్త తెలుసుకున్న మిగతావారు మాకు కూడా ఇలాంటి అవకాశం వస్తే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు. (చదవండి : ఐపీఎల్ వీరులు వీరే.. ఈసారి ఎవరో?) @SGanguly99 sir please change the timing of @IPL from 7:30pm to 8:00pm because at 7:30pm our family will watch #KarthikaDeepam and we have only one TV in my house .so please change the timings sir and avoid conflicts in my house@ChennaiIPL@StarMaa — పవిత్రపు శివ చరణ్ (@pscharan07) September 3, 2020 -
‘నవ్య, నేను ఫ్రెండ్స్లానే ఉంటాం’
అనుబంధాలతో అల్లుకున్న పొదరింట్లో ఉన్న అమ్మాయి.. నాలో ఏదో చిలిపి కల అంటూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్న ఆమె జీవితంలో.. కల్లోలం రేపేందుకు ఓ విలన్ వచ్చేస్తాడు.. అతడి రాకతో, డాక్టర్గా ప్రాక్టిస్ చేస్తున్న అమ్మాయి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది.. విలన్ పన్నే కుట్రలను ఆమె ఎలా తిప్పికొట్టింది.. అతడిని తట్టుకుని నిలబడిందా లేదా? అన్నది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. ప్రముఖ ఛానెల్ ‘స్టార్ మా’లో ప్రసారం కానున్న ‘కస్తూరి’ సీరియల్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా.. అగ్నిసాక్షి సీరియల్తో ఇన్ని రోజులు గౌరీగా ప్రేక్షకుల మనసులో నిలిచిన ఆ అందమైన అమ్మాయే.. ఇకపై కస్తూరిగా మనల్ని అలరించనుంది. ఆమె మరెవరో కాదు.. ఐశ్వర్య పిస్సే! అల్లరిపిల్ల ‘గౌరీ’కి సంబంధించిన ముచ్చట్లు మీకోసం.. నిజ జీవితంలోనూ అంతే.. స్టార్ మాలో వచ్చిన ‘‘అగ్నిసాక్షి’’ ముగింపు సమయంలోనే ఐశ్వర్యకు ‘‘కస్తూరి’’ సీరియల్ ఆఫర్ వచ్చిందట. నిజానికి ఫిబ్రవరిలో ఈ షూటింగ్ మొదలవ్వాలి. అయితే లాక్డౌన్ కారణంగా కాస్త ఆలస్యమైనా త్వరలోనే సీరియల్ బుల్లితెరపై ప్రసారం కానుంది. ఐశ్వర్య ఇందులో మెడికోగా కనిపించనుంది. ఇందులో క్యారెక్టర్ ఐశ్వర్య నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుందట. ఐశ్వర్యకి ఓపిక ఎక్కువేనట. బాధ కలిగినా వెంటనేగా ముఖం మీద చూపించదు. కస్తూరిలో అలాంటి క్యారెక్టర్ తనకు ఇచ్చిన యూనిట్కు, తన వెన్నంటి ప్రోత్సహిస్తున్న స్టార్ మాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలంటున్నది ఐశ్వర్య. డాక్టర్ కావాలని.. ఐశ్వర్య బెంగళూరులో పుట్టింది. చిన్నప్పుడే వాళ్ల నాన్న తనను, తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు. ఐశ్వర్య వాళ్ల అమ్మ హెల్త్ వర్కర్గా పని చేసేది. అందుకే ఐశ్వర్య చిన్నప్పుడు ఆయుర్వేదం డాక్టర్ కావాలని కలలు కన్నది. కానీ అమ్మ కష్టం అర్థమై డాక్టర్ చదువును పక్కకు పెట్టేసింది. పదో తరగతిలో ఉన్నప్పుడు థియేటర్స్లో జాయినయింది. అలా మెల్లగా నటన మీద ఆసక్తి పుట్టడంతో చాలా ఆడిషన్లకు వెళ్లింది. అలా నటిగా మారి ఇప్పుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. తన చిన్ననాటి కల తీరనప్పటికీ, ఇప్పుడు ‘స్టార్ మా’ వల్ల కస్తూరిలో తను డాక్టర్ పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నది ఈ కన్నడ భామ. కన్నడతో కెరీర్.. సినిమాల్లో కంటే సీరియల్ ‘బెస్ట్’ అని భావించింది ఐశ్వర్య. అప్పటికే సీరియల్స్ హవా నడుస్తుండటంతో.. అటు వైపుగా అడుగులు వేసింది. మొదట రెండు సీరియల్స్లో చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత ఓ సీరియల్లో మెయిన్ లీడ్ చేసింది. అలా నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలో రెండు సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేసింది. కానీ సీరియళ్లలో వరుస అవకాశాల కారణంగా సినిమా అవకాశాలను పక్కకు పెట్టింది. అన్నట్లు.. ఒక సినిమాలోనూ హీరోయిన్గా నటించింది ఐశ్వర్య. కానీ అది ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత ఆర్కా మీడియాలో పని చేసినప్పుడు తెలుగులో ఆఫర్ వచ్చింది. తెలుగు లోగిళ్లలో.. తెలుగులోకి రావాలని అస్సలు అనుకోలేదట ఐశ్వర్య. అయితే ఇక్కడ అడుగు పెట్టాక చాలా కంఫర్ట్గా ఫీలయిందట. ముందు ఇంగ్లిష్లో రాసుకొని డైలాగులు చెప్పేదాన్నని... ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలనంటున్నదీ అమ్మడు. ఇక స్టార్ మాలో వచ్చిన అగ్నిసాక్షి సీరియల్ తన కెరీర్కి చాలా ప్లస్ అయిందని, ఇప్పటికీ తనను గౌరిగానే గుర్తు పెట్టుకుంటారంటున్నరని మురిసిపోయింది. అయితే ఇప్పడు కస్తూరి వచ్చాక మాత్రం తనని కస్తూరి అని పిలువడం ఖాయమంటున్నది. చాలా కాలం తర్వాత వస్తున్నా, ఇటీవల విడుదలైన ప్రోమోకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉందంటున్నది. వాళ్ల అన్నయ్యనే పెళ్లి చేసుకున్నా.. ‘‘నటి నవ్య నాకు మొదటి సీరియల్ నుంచి పరిచయం. వాళ్లన్నయ్యనే నేను పెళ్లి చేసుకున్నా. మేం వదిన, ఆడపడుచులుగా కాకుండా ఫ్రెండ్స్లా ఉంటాం. తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. కరోనా సమయంలో కూడా తను చూపిన గుండె నిబ్బరం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తను స్ట్రాంగ్గా ఉంది కాబట్టే అలా నిలబడగలిగింది. స్టార్ మాలో వచ్చిన ‘ఇస్మార్ట్ జోడి’ వల్ల నేను చాలా నేర్చుకున్నా. భార్యభర్తల అన్యోన్యత గురించి చాలా తెలుసుకున్నా’’అని అంటున్నది ఐశ్వర్య. పద్ధతిగా ఉంటే.. ‘‘ప్రతీ పనిలో అమ్మ తోడ్పాటు మరువలేనంటుననది. తెలుగులో నాకంటూ ఒక గుర్తింపు రావడానికి స్టార్ మా ముఖ్య కారణం. వారి అండతో మరిన్ని మంచి ప్రాజెక్ట్లతో కనిపించాలని అనుకుంటున్నారు. అగ్నిసాక్షి సీరియల్కి రెండు అవార్డులు అందుకున్నా. ప్రేక్షకుల అభిమానం వల్లే ఈ అవార్డులు అందుకోగలిగాను. పద్ధతిగా ఉండే క్యారెక్టర్లు వస్తే తప్పకుండా సినిమాల్లో కూడా చేస్తాను. గౌరిగా ఆదరించినట్టే.. ఇప్పుడు కస్తూరిగా కూడా అదే అభిమానం చూపిస్తారని ఆశిస్తున్నా’’ అంటున్న ఐశ్వర్యకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం!! -
బిగ్బాస్-4: ఈ సారి సరికొత్త వినోదంతో
సాక్షి, హైదరాబాద్: తెలుగు టెలివిజన్లో అత్యుత్తమమైన రేటింగ్స్ని సాధించి వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన నాన్ ఫిక్షన్ షో బిగ్బాస్-4 త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2017లో స్టార్ మాలో ఒక సంచలనంగా ప్రారంభమైన బిగ్బాస్ ప్రతి సిజన్లోను ప్రేక్షకులను సరికొత్తగా వినోదాన్ని అందిస్తూ వస్తోంది. అద్భతమైన ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ బిగ్బాస్ సీజన్ సీజన్కు ఎదుగుదలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్-4 ప్రమోషన్లో భాగంగా నాగార్జున మూడు జనరేషన్లుగా నటిస్తూ ఇచ్చిన ప్రకటన అంచనాలను పెంచడమే కాకుండా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. (చదవండి: బిగ్బాస్ 4 ప్రోమో.. గోపి ఎవరు?) వరసగా రెండోసారి హోస్ట్గా బిగ్బాస్ హౌజ్ను నాగార్జున నడిపించబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రోమో కోసం మళ్లీ షూటింగ్ ఫ్లోర్కి రావడం సరదాగా ఉందన్నారు. గత సీజన్ గొప్ప విజయం అందుకున్న తరువాత ఇప్పుడు ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్తో పాటు సర్ప్రైజ్ కూడా అందించే ప్రయత్నం చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రచార చిత్రంలో తన లుక్ గురించి నాగార్జున మాట్లాడుతూ ‘మూడు పాత్రలు చేయడం, పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజీ మెయిన్ చేయడం, వాయిస్లో జాగ్రత్తలు, మేనరిజంలో వైవిధ్యం చూసుకుంటూ అదీ తక్కువ సమయంలో షూట్ చేయడం పెద్ద ఛాలెంజ్. కానీ నేను దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. జీవితం, ఆశ, వినోదం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని నేను నమ్ముతున్నాను. ఈ ఏడాది బిగ్బాస్ సీజన్లో సంపూర్ణమైన వినోదాన్ని అందించబోతున్నాం’ అని అన్నారు. స్టార్ మా అధికార ప్రతినిధి మాట్లాడుతూ అర్థవంతమైన కంటెంట్, విభిన్నమైన అంశాలతో ఉత్తమమైన వినోదాన్ని మేము అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం. ప్రతి బిగ్బాస్ సీజన్లో మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేక్షకులు బాగా ఇష్టపడే షోలలో ఒకటైన బిగ్బాస్ నాలుగో సీజన్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సీజన్ను ప్రేక్షకులు తమ ఇళ్లలో కూర్చునే ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. (చదవండి: బిగ్బాస్ 4: కెమెరా, యాక్షన్ వాట్ ఏ వావ్..) #BiggBossTelugu4 Entertainment Like Never Before...What A Wow-Wow!!! Coming Soon On @StarMaa @iamnagarjuna is watching you 👁️ pic.twitter.com/P1rCiUvZ6F — starmaa (@StarMaa) August 15, 2020 -
బిగ్బాస్ 4: కెమెరా, యాక్షన్ వాట్ ఏ వావ్..
హైదరాబాద్ : టెలివిజన్ రంగంలో బిగ్బాస్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్బాస్ తెలుగు సీజన్-4 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అంతా సవ్యంగా జరిగితే ఈ పాటికి ఈ షో మొదలయ్యేది. కానీ కరోనా నేపథ్యంలో బిగ్బాస్-4కు కాస్త బ్రేక్ పడింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని స్టార్ మా అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అసలు బిగ్బాస్ సీజన్-4కుహోస్ట్ ఎవరు ఉంటారన్న దానిపై రకరకాల వార్తలు ప్రచారంలో వచ్చాయి. వీటన్నింటికి తెరదించుతూ బ్యాక్ ఆన్ ది ఫ్లోర్ విత్ లైట్, కెమెరా యాక్షన్ అంటూ నాగార్జున ఓ ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బిగ్బాస్ నాలుగో సీజన్ త్వరలోనే ప్రారంభమవుతుందని, వ్యాఖ్యాతగా నాగార్జున వ్యవహరించనున్నట్లు స్టార్మా సైతం ప్రకటించింది. (బిగ్బాస్-4పై ‘స్టార్ మా’ ప్రకటన) బిగ్బాస్ 3 వ్యాఖ్యాతగా నాగార్జున తనదైన శైలిలో షోను ఆసాంతం రక్తి కట్టించారు. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. బిగ్బాస్ సీజన్ 4 హోస్ట్గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. నిర్వాహకులు మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపారని సమాచారం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా షూటింగ్ చేయడం అనేది నిర్వహకులు సవాలుతో కూడుకున్న పనే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫిజికల్ టాస్క్లు లేకుండా.. షోను డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బిగ్బాస్ సీజన్-4లో కంటెస్టెంట్లు ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. (బిగ్బాస్ 4: ఆమెకు ఎపిసోడ్కు లక్ష?) View this post on Instagram What a Wow-Wow!!! #BiggBossTelugu4 A post shared by STAR MAA (@starmaa) on Jul 31, 2020 at 10:42pm PDT -
బిగ్బాస్-4పై ‘స్టార్ మా’ ప్రకటన
హైదరాబాద్ : బిగ్బాస్ తెలుగు సీజన్-4 ఎప్పుడు ప్రారంభం అవుతుందా బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షోకు సంబంధించి రకరకాల వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ ఏడాది బిగ్బాస్ షో ఉంటుందా? లేదా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. అయితే వాటన్నింటికీ తెరదించుతూ.. బిగ్బాస్ సీజన్-4 పై స్టార్ మా అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే బిగ్బాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు బిగ్బాస్ లోగోతో కూడిన ప్రోమోను ట్విటర్లో పోస్ట్ చేసింది. (బిగ్బాస్ సీజన్ 4 తాజా అప్డేట్) బిగ్బాస్ సీజన్-4పై స్టార్ మా క్లారిటీ ఇవ్వడంతో.. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్లు, హోస్ట్ వివరాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్బాస్ సెట్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది. Here is the most awaited time of the year!!! #BiggBossTelugu4 coming soon on @StarMaa#StaySafeStayStrong #MaaPrayatnamManakosam pic.twitter.com/cQZ1e1kclI — starmaa (@StarMaa) July 20, 2020 -
స్టార్ మాలో రామాయణం
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, బంధాలలోని గొప్పతనాన్ని, విలువలతో కూడిన జీవన విధానాన్ని చెప్పే ఇతిహాసం రామాయణం. తండ్రిమాటను జవదాటని కుమారుడు...ఆ కుమారునిపై అవాజ్యమైన ప్రేమను కురిపించే తండ్రి, పతి బాటలలోనే సతి అనే ఇల్లాలు... ఇలా ఎన్నో బంధాలు, మరెన్నో జీవనసత్యాలను తెలియజేసే మహోన్నత పౌరాణిక గాథ రామాయణం. భారతీయ జీవనగమనంలో అంతర్భాగమైన ఈ పుణ్యగాథ నేటి తరానికి మార్గనిర్ధేశకం. టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనంగా 1980లలో రామానంద్ సాగర్ తీసిన రామయణ్ గాథను ఇప్పుడు తెలుగులో స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయబోతుంది. అంతర్జాతీయంగా ఓ పౌరాణిక గాధకు అత్యధిక వీక్షణ రేటింగ్ తెచ్చుకోవడం ద్వారా గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న రామాయణ్ను లాక్డౌన్ కాలంలో పునః ప్రసారం చేశారు. అయితే హిందీ భాషలో ఉండటం, భావం అర్థం అయినా భాష అర్థంగాక పోవడం వంటి సమస్యలను కొంతమంది అభిమానులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలకు తగిన పరిష్కారం అందిస్తూనే రామానంద్ సాగర్ తీసిన 'రామాయణ్' సీరియల్ను స్టార్ మా ఛానెల్ తెలుగులో ప్రసారం చేయబోతుంది. ఈ సీరియల్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అనకాపల్లికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ. తన యుక్త వయసులో తాను ఈ సీరియల్ను దూరదర్శన్లో ఆదివారం పూట వీక్షించేవారమంటూ, అప్పట్లో ఇంటిల్లిపాది ఈ సీరియల్నూ క్రమం తప్పకుండా చూసేవారమని, మరలా ఇన్నాళ్లకు లాక్డౌన్లో మరలా ప్రసారం చేయడం చూశామన్నారు. భాష అర్థంగాకపోవడం కొంత సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు స్టార్ మా వారు తెలుగులో ప్రసారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమెనే మాట్లాడుతూ భారతీయ జీవనశైలికి ప్రతిరూపం రామాయణం. కనుమరుగవుతున్న కుటుంబ బంధాల వేళ పరమ పవిత్రమైన రామాయణ మహాకావ్యం మనందరికీ జీవనముక్తి మార్గం చూపడమే కాదు బంధాలను ఎలా నిలుపుకోవాలో కూడా చూపుతుందన్నారు. ఈ ధారావాహిక సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతుంది. -
వినోదానికి ఏమాత్రం ఢోకా లేకుండా ‘స్టార్ మా’
కరోన రక్కసి కారణంగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. వినోదరంగం అందుకు మినహాయింపేమీ కాదు. లాక్డౌన్ కారణంగా సీరియల్స్, టీవీ షోల షూటింగులు రద్దవ్వడం టీవీ పరిశ్రమపై భారీ ప్రభావం పడింది. ఈ క్రమంలో లాక్డౌన్ వేళ ఇంటిల్లిపాదికి చక్కటి వినోదాన్ని అందించేందుకు ‘స్టార్ మా’ తమదైన శైలిలో వినూత్న కార్యక్రమాలను ప్రసారం చేసి లాక్డౌన్ వేళ కుటుంబమంతటికీ ఇష్టమైన ఛానల్గా నిలిచింది. పిల్లల కోసం అవెంజర్స్, లయన్ కింగ్ లాంటి చిత్రాలతో పాటుగా కిండర్ల్యాండ్.. ఇస్మార్ట్ జోడీ జర్నీ, బిగ్ లాక్డౌన్ ఛాలెంజ్తో యువతకు కిక్కును తీసుకొస్తుంది. మహిళామణుల కోసం కార్తీకదీపం, కోయిలమ్మ లాంటి సీరియల్స్ పునః ప్రసారం చేయడంతో పాటు పెద్దవారి కోసం పురాణగాథలను అందిస్తోంది. తెలుగు బ్లాక్బస్టర్ చిత్రాల ప్రీమియర్లు మొదలు అంతర్జాతీయంగా బ్లాక్ బస్టర్ చిత్రాలైనటువంటి అవెంజర్స్ ఎండ్గేమ్ను ‘మా’ ప్రేక్షకులకు అందించింది. అంతేకాకుండా ఎక్కువ మంది వీక్షించడానికి ఇష్టపడే తెలుగు ఫిక్షన్ షోస్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నాన్ ఫిక్షన్ను ప్రైమ్టైమ్లో ప్రసారం చేసింది. ఉదయం పూట పురాణాలు మొదలు పిల్లల కోసం కిండర్ల్యాండ్ అంటూ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కార్యక్రమాలతో పాటు విభిన్న కార్యక్రమాలతో స్టార్ మా కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వేసవిలో తనకిష్టమైన అవెంజర్స్, లయన్కింగ్ లాంటి సినిమాలెన్నో చూశానని ఆరవ తరగతి విద్యార్థి అన్షూల్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ 'లయన్ కింగ్' సినిమాను మా నాన్నతో కలిసి థియేటర్లలో అప్పట్లో రెండుసార్లు చూశాను. కానీ టీవీలో చూడటం మాత్రం ఇంకా సూపర్గా ఉందన్నాడు. ఇక ఈ లాక్డౌన్ కాలంలో ప్రజలకు ఏమాత్రం బోర్ కొట్టకుండా, సృజనాత్మక మార్గాలను ఛానెల్ అనుసరించింది. లాక్డౌన్ కారణంగా షూటింగ్లకు అనుమతి లేకపోవడంతో మొబైల్ ఫోన్తో ఇంటిలోనే ఆసక్తికరమైన షోలనును చిత్రీకరించింది. అలాంటి వాటిలో 'ఇస్మార్ట్జోడీ జర్నీ' ఒకటి. టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జూమ్కాల్ను వినియోగించుకుని ఇస్మార్ట్ జోడిని రూపొందించారు యాంకర్ ఓంకార్. అయితే కష్టసాధ్యమే అయినప్పటికీ ఆకట్టుకునేలా తారల జీవిత ప్రయాణాన్ని అందంగా తెరకెక్కించగలిగామని ఓంకార్ అన్నారు. ఇదే తరహా సెలబ్రిటీ కార్యక్రమం 'బిగ్ లాక్డౌన్ ఛాలెంజ్'. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందనడానికి సోషల్మీడియాలో వీక్షకుల నుంచి వచ్చిన కామెంట్లే నిదర్శనం. బిగ్లాక్డౌన్ ఛాలెంజ్ కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని 32 సంవత్సరాల గృహిణి వాసంతి చెబుతూ తానెప్పుడూ సినీ, టీవీ తారల జీవితాలను దగ్గరగా చూడాలని కోరుకునేదానినని, ఈ లాక్డౌన్ వేళ స్టార్ మా ఆ కొరత తీర్చిందన్నారు. ఇంటిలో మా అభిమాన తారలేమి చేస్తున్నారు, వారి జీవనశైలి ఎలాగుంటుందో తెలుసుకునే వీలు మాకు చిక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల ఈ సంతోషమే 'మా ప్రయత్నం మన కోసం' అనే ఛానెల్ ప్రయత్నాలు విజయవంతమయ్యాయనడానికి నిదర్శనం! -
ఇంట్లోనే ఉండండి.. ఆన్లైన్లో బిల్లు కట్టండి: స్టార్ మా
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో దేశమంతా ఏకతాటిపైకి వచ్చిన వేళ, కోట్లాది(నెలకు 700 మిలియన్ల) మందికి పైగా వీక్షకులను చేరుకునే స్టార్ ఇండియా నెట్వర్క్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తమ వినియోగదారుల భద్రతను లక్ష్యంగా చేసుకుని.. 'ఇంట్లోనే ఉండండి, ఆన్లైన్లో బిల్లు కట్టండి' పేరిట ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా తమ వీక్షకులకు నిరంతర వినోదానికి భరోసా కల్పిస్తుంది. ఈ ప్రచారంతో భద్రత పట్ల అవగాహన మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. అదే సమయంలో కుటుంబాలకు వినోదాన్నీ అందిస్తూ... టీవీ బిల్లు చెల్లింపులకు సైతం బయటకు వెళ్లకుండా.. సమస్యలను ఇంటి బయటే వదిలేయమని కోరుతోంది. ఇందుకోసం వినూత్నమైన.. సృజనాత్మకతతో కూడిన ఆన్లైన్ సదుపాయాలను వినియోగించుకోవాల్సిందిగా వీక్షకులను అభ్యర్థిస్తోంది. ఈ విషయం గురించి స్టార్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ హెడ్- డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ గుర్జీవ్ సింగ్ కపూర్ మాట్లాడుతూ.. "మా ప్రచారం ద్వారా వినియోగదారులను ఇంటివద్దనే ఉండండి. సురక్షితంగా ఉండండి అని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. అదే సమయంలో వారు తమకు కావాల్సిన వినోదాన్ని పొందుతూనే ఆన్లైన్లో టీవీ ఎంటర్టైన్మెంట్ బిల్లులను చెల్లించాల్సిందిగానూ చెబుతున్నాం. బహుళభాషలలో మా ప్రాచుర్యం పొందిన జీఈసీ, కిడ్స్, మూవీస్, స్పోర్ట్స్ ఛానెల్స్ యొక్క చేరికపై ఆధారపడి ఈ సంక్షోభ సమయంలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాం'' అని అన్నారు. " ఈ ఆపద సమయంలో కూడా ఆన్గ్రౌండ్ పనిచేస్తున్న మా కేబుల్, డీటీహెచ్ భాగస్వాములకు చెందిన సాహసోపేత బృందాలను ప్రశంసిస్తున్నాము. అదే విధంగా వీక్షకుల కోసం సేవల పరంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు భరోసా కల్పించేందుకు చేస్తున్న వారి ప్రయత్నాలను అభినందిస్తున్నాము'' అని కొనియాడారు. ఇక స్టార్ మా నెట్వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్.. మాట్లాడుతూ... "బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటుగా సెలబ్రిటీ హోమ్ వీడియోలను అద్భుతంగా మిళితం చేసి మన తెలుగు వీక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి స్టార్ మా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. మా వినియోగదారుల భద్రత, ఆరోగ్యం తొలి ప్రాధాన్యమై ఈ కీలక సమయంలో, మేము ప్రతి ఒక్కరినీ తమ కేబుల్/డీటీహెచ్ బిల్లులు లేదా మరేదైనా యుటిలిటీ బిల్లును ఆన్లైన్ విధానంలో చెల్లించమని కోరుతున్నాం. అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా మరికొంత కాలం ఇళ్లలోనే ఉండాల్సిందిగానూ అభ్యర్థిస్తున్నాం. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ చెప్పేందుకు మనకోసం మా ప్రయత్నం'' అని అన్నారు. కాగా స్టార్ ఇండియా తమ నెట్వర్క్ ఛానెల్స్ ప్రేక్షకులకు అనంతమైన వినోదాన్ని పంచుతున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన క్లాసిక్ షోస్ అయినటువంటి మహాభారత్ మొదలు ఎన్నో ఆసక్తికరమైన షోలను తీసుకువచ్చాయి. ఇక స్టార్ మా టీవీ వీక్షకులు ఇప్పుడు తమ అభిమాన సీరియల్స్ కార్తీక దీపం, వదినమ్మ, గృహలక్ష్మి ఇలా మరెన్నో నాన్- ఫిక్షన్ సీరియళ్లతో పాటుగా నూతన, ఉత్సాహభరితంగా సాగే ప్రీమియర్స్ను వీక్షించవచ్చు. ఈ ఛానెల్ ఇప్పుడు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సినిమాలను ప్రసారం చేస్తుండటంతో పాటుగా ప్రతి శుక్రవారం ఫ్యామిలీ మూవీస్ను ప్రసారం చేస్తుంది. చిన్నారుల కోసం ఇక ఈ లాక్డౌన్ వేళ తమ వీక్షకులతో అనుసంధానించబడటానికి కొన్ని నాన్- ఫిక్షన్ ఫార్మాట్లను సైతం ఛానెల్ తీసుకువచ్చింది. వీకెండ్ బ్లాక్బస్టర్ షోకు కొనసాగింపుగా ఇస్మార్ట్ జర్నీ మరియు పూర్తి సరికొత్త రూపులో బిగ్లాక్డౌన్ ఛాలెంజ్ వంటివి సైతం వీటిలో ఉన్నాయి. ఈ బిగ్లాక్డౌన్ ఛాలెంజ్లో స్టార్ మా సెలబ్రిటీలు ఇంటి పనులతో ఒకరినొకరు సవాల్ విసురుకుంటుంటారు. స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ సైతం కొన్ని ఆసక్తికరమైన సినీ పండుగలను సృష్టించాయి. సినీ వినోదసాగరంలో తేలియాడుతూ ఇళ్లలోనే కుటుంబాలు ఉంటాయన్న భరోసానూ ఇవి అందిస్తాయి. స్టార్ మూవీస్ ఇప్పుడు చిన్నారులకు ఇష్టమైన చిత్రాలైనటువంటి మేరీ పాపిన్స్ రిటర్న్స్, డుంబో మరియు నట్క్రాకర్ మరియు ఫోర్ రియల్మ్స్ ఆన్ ప్లేడేట్ ప్రదర్శిస్తుంది. వీటితో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన మార్వెల్ మూవీ సెలక్షన్, అత్యుత్తమ యాక్షన్ బ్లాక్బస్టర్స్ ను యాక్షన్ ఎట్ 9తో వీక్షించవచ్చు. అదే విధంగా వీక్షకులు అత్యుత్తమ ఇంగ్లీష్ వినోదానికై అమెరికన్ ఐడల్, కాఫీ విత్ కరణ్, మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా అత్యుత్తమ ఎపిసోడ్స్ చూడవచ్చు. కిడ్స్ నెట్వర్క్పై 100 గంటలకు పైగా తాజా కంటెంట్ను జోడించారు. డిస్నీ ఛానెల్ మరియు హంగామా టీవీ లపై సమ్మర్ బొనాంజాను వీరు వీక్షించవచ్చు. వీటిలో దేశీయంగా తీర్చిదిద్దిన బాపు - తెలివైన నాయకుని యొక్క స్వచ్ఛమైన మరియు సానుకూల కథ.. దీనితో పాటుగా సంతోషకరమైన సర్కస్ ట్రూప్లోని స్నేహితులతో కూడిన జంతువుల కథ -గుడ్డు మరియు సృజనాత్మక గాడ్జెట్స్తో కూడిన సాఫ్ట్ టాయ్ - గాడ్జెట్ గురు విత్ గణేశాఆ వంటివి వీక్షించవచ్చు. చిన్నారులు వీటితో పాటుగా హగేమారు షోను సైతం వీక్షించవచ్చు. దీనిలో అల్లరి హగేమారు యొక్క కథను తెలుపుతారు.అంతేగాక వీటితో పాటుగా సెల్ఫీ విత్ భజరంగ్, డోరెమాన్, చాచా చౌదరి, మిరాక్యులస్లో నూతన ఎపిసోడ్స్ను సైతం వీక్షించవచ్చు. క్రీడాభిమానుల కోసం క్రీడాభిమానులు ఇప్పడు క్రికెట్ కనెక్టడ్ను ఆస్వాదించవచ్చు. దీనిలో క్రికెట్ లెజండ్స్ తమ అభిమానులతో వీడియో కాల్స్ ద్వారా ప్రతి వారమూ మాట్లాడవచ్చు. అలాగే ఐపీఎల్లో అత్యుత్తమ మ్యాచ్లు సైతం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్పై చూడవచ్చు. ఇంటరాక్టివ్ గేమ్స్తో తమ మెదడుకు వ్యాయామాన్ని అందించడంతో పాటుగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్పై వచ్చే బ్రెయిన్ బూస్టర్స్తో ప్రయోగాలూ చేయవచ్చు. అలాగే నూతన షో లాక్డౌన్ ఇండియాస్ ఫైట్ ఎగైనెస్ట్ కరోనా వైరస్ ద్వారా అత్యంత భయంకరమైన వైరస్పై భారతదేశపు పోరాటాన్ని చూడవచ్చు. ఓ నెట్వర్క్గా స్టార్ టీవీ, భావోద్వేగ పరంగా కోట్లాది మంది భారతీయులకు 25 సంవత్సరాలుగా కనెక్ట్ అయింది. ఈ కష్టకాలంలో తమ పూర్తి మద్దతును అందించడాన్ని కొనసాగిస్తుంది. ఇంట్లోనే ఉండండి, ఆన్లైన్లో బిల్లు కట్టండి క్యాంపెయిన్ వీడియో కోసం.. -
స్టార్ మా గణేష్ మహోత్సవం 2019
-
స్టార్ మా గణేష్ మహోత్సవం
-
‘మేడమ్ కాదు, మీ అమ్ములునే’
మూగ అమ్మా యిగా అమ్ములు తెలుగు టీవీ ప్రేక్షకులకు సుపరిచయమే. ‘స్టార్ మా’లో వచ్చే ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా ప్రియాంకా జైన్ ‘అమ్ములు’ పాత్రలో అందంగా ఒదిగిపోయింది. సినిమాలు చేస్తూ వెండి తెర నుంచిబుల్లితెరకు షిఫ్ట్ అయిన నటిప్రియాంకా జైన్ చెబుతున్న ముచ్చట్లివి. ‘మౌనరాగం సక్సెస్ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడి వాళ్లంతా నన్ను తమ ఇంటి అమ్మాయిగా అనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టి పెరిగింది ముంబయ్లో. మా నాన్న మనోజ్ జైన్ మొబైల్ బిజినెస్ వల్ల నా చిన్నతనంలోనే బెంగుళూర్కి షిప్ట్ అయ్యాం. చిన్నప్పుడు చదువు మీద అంత ఆసక్తి చూపేదాన్ని కాదు. దీంతో మా అమ్మ ఫల్గునీ జైన్ నన్ను ‘నటి’ని చేయాలనుకున్నారు. నా చిన్నప్పటి నుంచి ప్రతి హాలీడేస్లోనూ ఎక్కడ ఆడిషన్స్ జరిగితే అక్కడకు తీసుకువెళ్లేవారు. టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం నాన్న ‘నో’ చెప్పారు. ఎగ్జామ్స్ పూర్తయ్యాక ఫొటో షూట్ చేయించారు. ఆ తర్వాత కొన్ని బ్యూటీ పేజెంట్స్లో పాల్గొన్నాను. కన్నడలో ‘గోలీసోడా’ అనే మూవీలో అవకాశం వచ్చింది. అదే తెలుగులో డబ్ అయ్యింది. ఆ తర్వాత ‘చల్తే చల్తే, వినరా సోదర వీరకుమారా’ సినిమాలో చేశాను. ఆ తర్వాత ‘స్టార్ మా’ మౌనరాగం సీరియల్లో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది. సవాల్గా తీసుకున్నాను సీరియల్లో నా పాత్ర పేరు అమ్ములు. టీవీ సీరియల్లో మూగ అమ్మాయి ద్వారా కథను మెప్పించడం అంటే ఒక పెద్ద ప్రయోగమే అనుకున్నాను. ఇందులో డైలాగుల కంటే హావభావాలకే ఎక్కువ ఇంపార్టెన్స్. నటనలో బాగా రాణించవచ్చు అని ఈ పాత్ర నచ్చి ఒప్పుకున్నాను. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్.. నాలో ‘అమ్ములు’ను చూశారు. నన్ను అంత కాన్ఫిడెంట్గా నమ్మి ఓకే చేశారు. నా పాత్రకు నేను న్యాయం చేశానని ఇప్పుడు వస్తున్న ప్రశంసలు బట్టి తెలుస్తోంది. ఉదయం లేస్తూనే సీరియల్ ఈ ఫీల్డ్కి రావడానికి ముందు వద్దని చెప్పిన మా నాన్న ఇప్పుడు హాట్స్టార్లో తెల్లవారు జామునే ఎపిసోడ్ కోసం చూస్తారు. అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు భాష అర్ధం కాకపోయినా అన్ని పనులు పూర్తి చేసుకొని సీరియల్ టైమ్కి టీవీ ముందు కూర్చుంటారు. లీనమైపోయాను సీరియల్ మొదట రాజమండ్రి దగ్గర గోదావరి బ్యాక్ డ్రాప్లో స్టార్ట్ అయ్యింది. మొదటి రోజు లొకేషన్లో లంగాఓణీ వేసుకొని అక్కడ చెయిర్ వేసుకొని కూర్చుంటే.. ఒక్క సెకన్కూడా కాలేదు ‘ఈ ఇల్లు నాది, ఈ గోదావరి నాది’ అనిపించింది. అంతగా ఆ పాత్రలో లీనమైపోయాను. సీరియల్లో నాన్న అంటే భయం. అతను నా ముఖం కూడా చూడరు. ఆ భావాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా నా ముఖ కవళికలు, నటన ఉండాలి. చిన్న తేడా కూడా రాకూడదు. కానీ, ఎందుకో తెలియదు ప్రతి ఎమోషన్ మనసు నుంచి వచ్చేది. కొన్నిసార్లు నేను సరిగా నా భావాలను తెలియపరచలేదు అనిపించినప్పుడు నా చుట్టూ ఉన్నవారు సలహాలు ఇచ్చేవారు. ముందు నుంచి ఈ సీరియల్కి ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు. కానీ, అమ్ములుగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాను. ఇదే సీరియల్ తమిళ్లో కూడా వస్తోంది. అందులోనూ నేనే అమ్ములుని. కొత్త కొత్తగా ఉన్నవే.. ఎప్పుడూ ఒకేలా ఉండిపోకూడదు. కొత్త కొత్తవి ట్రై చేయాలనిపిస్తుంది. ప్రేక్షకులకు నేను ప్రతీసారి కొత్తగా పరిచయం అవ్వాలనుకుంటాను. అందుకే విభిన్న క్యారెక్టర్ల ద్వారా మెప్పించాలనుకుంటున్నాను. ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఆడియన్స్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటాను. మా అమ్మాయి అమ్ములు రాజమండ్రి దగ్గర మౌనరాగం షూట్ జరుగుతుంటే ఆడియన్స్ పరిగెత్తుకొని వచ్చేసేవాళ్లు. నా ఫస్ట్ అటెమ్ట్కే మంచి రెస్పాన్స్ ‘మీరు మా అమ్మాయి అమ్ముల.. మా ఇంటికి ఎప్పుడు వస్తారు’ అని అడుగుతుంటారు. ఎవరైనా మేడమ్ అని పిలిస్తే ‘మేడమ్ కాదు, మీ అమ్ములునే’ అని చెబుతుంటాను. వంటలోనూ కొత్తదనం తీరిక దొరికితే వంటలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాను. వంట చేయడం అంటే చాలా ఇష్టం. అయితే, వంట చేసే సమయంలో మధ్యలో అమ్మతో సహా ఎవరూ రాకూడదని కండిషన్ పెడతాను. వంటతో పాటు పెయింటింగ్, సింగింగ్, డ్యాన్స్... ఇష్టపడతాను. అంతా నేచురల్ యూనిట్లో తెలుగువారిని మెప్పించేలా ఉండాలన్నారు నా కాస్ట్యూమ్స్. ముందు తీసుకున్న కలర్ డ్రెస్సులు కూడా మురికి చేసి డల్గా మార్చేశాం. ఫస్ట్ డే మేకప్ మ్యాన్ మేకప్ చేశారు. నాకు మేకప్తో ఆ క్యారెక్టర్ని చేయడం నచ్చలేదు. మరుసటి రోజు మేకప్ లేకుండా చేస్తాను, అప్పుడు చూడండి అని చెప్పాను. మేకప్ లేకుండా లొకేషన్కి వెళితే ఇలాగే నేచరల్గా కావాలన్నారు. దీంతో మళ్లీ మళ్లీ టచప్ అనేదే లేదు. అలా నేచరల్గా ఆడియన్స్ అమ్ములు క్యారెక్టర్ని రిసీవ్ చేసుకున్నారు.ముందు నాకు అస్సలు తెలుగు రాదు. వింటూ వింటూ రెండు నెలల్లో తెలుగు వచ్చేసింది. ఎవరేం మాట్లాడుతారో వాళ్ల మధ్య ఉంటూ మాటలు వింటూ వచ్చాను. మొదట్లో కాదు, రాదు, వద్దు.. పదాలను ఎక్కడ ఉపయోగించాలో తెలియదు. యూనిట్లో తెగ నవ్వుకునేవారు. ఇప్పుడు నా భాష విని తెలుగమ్మాయినే అంటున్నారు. మూగమ్మాయిలా నటించినా నా యాక్టింగ్ మాట్లాడుతుంది అనుకుంటాను.’’– నిర్మలారెడ్డి -
త్వరలోనే బిగ్బాస్-3 షురూ
బిగ్బాస్ షో.. ఇది తెలియని వారుండరు. ఈ కార్యక్రమాన్ని విదేశాల నుంచి బాలీవుడ్ దిగుమతి చేసుకోగా.. ప్రస్తుతం దక్షిణాది పాగావేసింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ షో ఫుల్ క్రేజ్ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి అడుగు వేయించగా.. న్యాచురల్ స్టార్ నాని రెండో అడుగు వేయిస్తూ కాస్త తడబడ్డాడు. అయితే ఈ సారి బిగ్బాస్ను గతంలో మాదిరి కాకుండా సరైన మార్గంలో నడిపించాలని.. అలాంటి వారి కోసం చాలా మందినే పరిశీలించింది స్టార్ మా బృందం. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిన కింగ్ నాగార్జున.. బిగ్బాస్ను మూడో అడుగు వేయించనున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అనధికారికంగా ప్రకటించేశారు. బిగ్బాస్ మూడో సీజన్కు నాగ్ హోస్ట్ అని పలువురు మీడియాముఖంగానే చెప్పారు. అయితే మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం పక్కాగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జూలై మూడోవారం లేదా చివరివారంలో అంటూ ఏదో ఒకటి చెబుతున్నారు. అయితే స్టారమా బృందం మాత్రం.. బిగ్బాస్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పేసింది. బిగ్బాస్ మూడో సీజన్ త్వరలోనే రాబోతోంది అని ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈసారి బిగ్బాస్ మరింత కొత్తగా ఉండబోతోందని ప్రోమోను చూస్తుంటూనే తెలుస్తోంది. ఇక బిగ్బాస్ మూడో సీజన్ ఉండోబోతోందని, అది కూడా త్వరలోనే ప్రారంభం కానుందని అధికారికంగా తెలిసిపోయింది. ఇక కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించబోతున్నారని, కంటెస్టెంట్లుగా ఎవరెవరు పాల్గొనబొతున్నారనే విషయాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ షోలో కొంతమంది పాల్గొనబోతున్నారని, దానికి సంబంధించిన ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టిక్టాక్ స్టార్లు, యూట్యూబ్ స్టార్లు, సింగర్లు, యాంకర్లు ఇలా ప్రతి ఒక్క క్యాటగిరీ నుంచి టాప్ సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈసారి కామన్మ్యాన్కు బిగ్బాస్లో ఎంట్రీ లేదని సమాచారం. #BiggBossTelugu3..Coming Soon On @StarMaa pic.twitter.com/XX3ImEBS8C — STAR MAA (@StarMaa) June 15, 2019 -
బిగ్బాస్ 3 హోస్ట్గా నాగార్జున ఫిక్స్
నార్త్ నుంచి సౌత్కు దిగుమతైన రియాల్టీ షో బిగ్బాస్కు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. దక్షిణాది అన్ని భాషల్లో ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్బాస్ షో.. మూడో సీజన్కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనేవారి లిస్ట్ ఇదేనంటూ కొన్ని పేర్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సారి హోస్ట్ విషయంలో బిగ్బాస్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను, రెండో సీజన్కు న్యాచురల్స్టార్ నానిని తీసుకోగా.. మూడో సీజన్కు చాలా మంది పేర్లను పరిశీలించింది. ఎట్టకేలకు మూడో సీజన్కు హోస్ట్ దొరికేశాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించి బుల్లితెరపైనా తనకు తిరుగులేదని నిరూపించుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున.. బిగ్బాస్ మూడో సీజన్ను నడిపించనున్నాడు. ఇదే విషయాన్ని గత సీజన్లో పాల్గొన్న సామ్రాట్.. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. నాగార్జున హోస్టింగ్లో ఈ సీజన్ ఇంకా ఆసక్తికరంగా మారబోతోందని తెలుస్తోంది. అసలే రెండో సీజన్ వేడీ ఇంకా తగ్గలేదు. మొన్నటివరకు దీని గొడవలు చల్లారనే లేదు. మరి ఈ మూడో సీజన్ ఎక్కడికి దారితీస్తుందో.. ఎవరిని ఓవర్నైట్ స్టార్ను చేస్తుందో చూడాలి. అసలే ఈసారి లిస్ట్లో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ స్టార్లు, యాంకర్స్, సింగర్స్ ఇలా ప్రతీ క్యాటగిరీ నుంచి సెలబ్రిటీస్ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. జూలైలో బిగ్బాస్ 3 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తమిళ బిగ్బాస్ మూడో సీజన్ ఇప్పటికే రెడీ అయింది. కమల్ హాసన్ హోస్ట్గా వచ్చే వారంలో మొదలుకానుంది. -
మాలో యాత్ర
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని, ఎనలేని జనాదరణను సొంతం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలకు పాదయాత్రలో ఎలా అంకురార్పణ జరిగిందనే విశేషాలను చాలా అర్థవంతంగా మహి చూపించారని కూడా వీక్షకులు అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు మరోసారి ఆ మహానేతను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. ‘యాత్ర’ చిత్రం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘స్టార్మా’ చానెల్లో ప్రదర్శితం కానుంది. -
బుల్లితెరపై బ్రహ్మానందం!
బ్రహ్మానందం పేరు వింటేనే హాస్యం పుడుతుంది. ఆయన తెరపై కనబడితే నవ్వుల పూలు పూస్తాయి. ఒకప్పుడు ఈయన పాత్ర లేని సినిమాలు ఉండేవి కాదు. పెద్ద హీరోల సినిమాల్లో బ్రహ్మానందం పాత్రను స్పెషల్గా డిజైన్ చేసేవారు దర్శకులు. ఒక్కోసారి హీరోల పాత్రను డామినేట్ చేసేంతగా.. ఆ సినిమా సక్సెస్లో పాలుపంచుకున్నారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త తరహా కామెడీని ఆస్వాదించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకే తరహా పాత్రలు చేస్తే సినీ అభిమానులు స్వీకరించడం లేదు. దీనికి తోడు యంగ్ జనరేషన్ కమెడియన్స్ సత్తా చాటుతున్నారు. దీంతో ఈ మధ్య బ్రహ్మానందం చేస్తోన్న సినిమాలు అంతగా విజయం సాధించకపోవడం, అందులోని కామెడీ కూడా వర్కౌట్ కాకపోవడంతో బ్రహ్మానందం కాస్త విరామం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. వెండితెరపై హాస్యాన్ని పండించిన నవ్వుల రారాజు బ్రహ్మానందం.. ఇక నుంచి బుల్లితెరపై తన హాస్య చతురతను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. బుల్లి తెరపై హాస్య ప్రధానమైన కార్యక్రమాలు ఏ రేంజ్లో విజయం సాధిస్తున్నాయో తెలిసిందే. స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోతో ఆకట్టుకుంటోన్న ఈ షో.. త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. -
క్రికెట్ నరనరాల్లో జీర్ణించుకుపోయింది
-
ఆస్తులు పంచినట్టు క్రికెట్ ప్రేమను పంచారు : జూ.ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్ : తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్పై ప్రేమను పంచారని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్లకు తెలుగు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ మంగళవారం పార్క్హయత్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని స్టార్ మా రూపోందించిన ప్రచార వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు సరిహద్దులు లేవన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా క్రీడల్లోనే మాట్లాడుకోవచ్చని తెలిపారు. ఇక క్రికెట్ అయితే మన రక్తంలో చేరి నరనరాల్లో జీర్ణీంచుకుపోయిందన్నారు. పెద్ద వాళ్లు ఆస్తులు పంచినట్లు క్రికెట్పై ప్రేమను కూడా పంచారన్నారు. చిన్నప్పుడు తన తండ్రితో క్రికెట్ మ్యాచ్లను చూసేవాడినని, తన తండ్రి ద్వారానే తనకు క్రికెట్పై ఇష్టం పెరిగిందన్నారు. ఈ ప్రేమను తాను తన కుమారుడికి సైతం పంచుతానని చెప్పారు. ప్రచారకర్తగా తనకు అవకాశం కల్పించిన స్టార్ యాజమాన్యానికి ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. స్టార్ మా రూపోందించిన ప్రచార వీడియోలో ఎన్టీఆర్ తెలుగు ఐపీఎల్ ప్రత్యేకత ఏమిటో వివరించారు. ఆ బయోపిక్లు నావల్ల కాదు పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. సచిన్ తన అభిమాన క్రికెటర్ అని, క్రికెటర్ల జీవితాలపై సినిమాలు రావడం ఆనందంగా ఉందన్నారు. అయితే క్రికెటర్ల బయోపిక్స్ చేయడానికి తాను సాహసించనని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తనకు ఏ ప్రాంచైజీని కొనే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆస్తులు పంచినట్టు క్రికెట్ ప్రేమను పంచారు
-
రేణు దేశాయ్తో స్టార్ మా రియాలిటీ షో
సాక్షి, హైదరాబాద్: రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా సుపరిచయం. భర్త పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలతో పూణేలో ఉంటున్నారు. సినిమాల పై ఉన్న ఫ్యాషన్తో రేణు దేశాయ్ ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. కొడుకు అకీరా నందన్ ఆచిత్రంలో ప్రత్యేకపాత్రలో కనిపించారు. ఇప్పుడు తాజాగా రేణు దేశాయ్ కూడా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమచారం. ఇప్పటికే తారక్ బిగ్బాస్ షో, రానా నెం.1 యారీ ప్రోగ్రాంలతో చిన్న స్క్రీన్పై మెప్పిస్తున్నారు. తాజాగా రేణు కూడా ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ప్రముఖ తెలుగు చానెల్ స్టార్మా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో సాగుతోంది. ఈ సీజన్ అనంతరం ‘స్టార్ మా’ రేణుదేశాయ్తో రియాలిటీ డాన్స్ షో ప్లాన్ చేస్తోంది. రేణు హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ డాన్స్ షో పై అంతా ఆసక్తిగా ఉన్నారు. -
బుల్లితెరపై బిగ్ బాస్ హవా
స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ తరహా షో తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో అన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ బిగ్ బాస్ రికార్డ్ టీఆర్పీలను సాధించింది. తారక్ ఫ్యాన్స్ తో పాటు రియాల్టీ షో అభిమానులు కూడా ఈ షోను ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోనే ప్రసారం చేస్తున్న స్టార్ మా ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా వారాంతంలో ఎన్టీఆర్ కనిపించే ఎపిసోడ్స్ లో రేటింగ్ భారీగా ఉంటోందని సమాచారం. స్టార్ మా ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం టీఆర్ఫీ 16.18 గా నమోదైంది.ఇటీవల కాలంలో ఒక ఛానెల్కు ఇంతటి టీఆర్ఫీ రాలేదు. ఇన్నాళ్లు నాలుగోస్థానంలో ఉన్న స్టార్ మా బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తరువాత మొదటి స్థానానికి రావటం విశేషం. -
స్టార్ ‘మా’ కార్యాలయంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని స్టార్ ‘మా’ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘స్టార్మా’ కొత్త లోగో : చిరంజీవి