Trivikraman Srinivas
-
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్గా సాగుతుంది. లేడిస్తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం రానుందని ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్కు సలహాలిస్తున్న ఫ్యాన్స్) దీనిని నిజం చేస్తూ తాజాగా గీతా ఆర్ట్స్ , హారికా- హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా అల్లు అర్జున్- త్రివిక్రమ్లతో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాకు సంబంధించి ట్వీట్ చేశారు. నేడు (జులై 3)న ఉదయం 10 గంటల 8 ని.లకు వీడియో ద్వారా వారు మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుందని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది. We are elated to reunite the much celebrated duo. It's the Icon Star @alluarjun garu & our Darling Director #Trivikram garu coming together for the 4th time 🤩🌟 More Details Soon 🖤 #AlluAravind #SRadhaKrishna @haarikahassine @geethaarts pic.twitter.com/xO7P05IBgY — Naga Vamsi (@vamsi84) July 3, 2023 -
మహేష్ బాబు మూవీ నుంచి శ్రీలీల అవుట్
-
టాలీవుడ్ లో సంక్రాంతి సందడి
-
SSMB28 షూటింగ్ మళ్ళీ వాయిదా..!
-
ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్ బాబు
-
త్రివిక్రమ్ కి ఏమైంది ..?
-
మహేశ్ కోసం ‘కోబ్రా’ విలన్ను రంగంలోకి దింపిన త్రివిక్రమ్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్ 28వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్, స్క్రిప్ట్ వర్క్ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి రానుంది. చెప్పాలంటే ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు కానుందని వినికిడి. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుతున్నాయట. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: రీసెంట్గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్కి గుడ్న్యూస్ చెప్పిన బాలీవుడ్ జంట ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకిగాను తివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ విలక్షణ నటుడిని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో విలన్గా కొంతమంది పేర్లు బయటకు రాగా అందులో తెలుగు నటుడు తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరుణ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూను త్రివిక్రమ్ విలన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రోషన్ మాథ్యూ ఎవరో కాదు .. రీసెంట్గా విడుదలైన చియాన్ విక్రమ్ 'కోబ్రా' సినిమాలోని మెయిన్ విలన్. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్గా మారిన సూసైడ్ నోట్ 2015లో మాలీవుడ్లో నటుడిగా కెరియర్ మొదలు పెట్టిన రోషన్ అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక 'కోబ్రా' సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. నాని 'దసరా' సినిమాలోను రోషన్ మాథ్యూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోషన్ను మహేశ్ మూవీలో మెయిన్ విలన్ పాత్రకి గాను త్రివిక్రమ్ తీసుకున్నాడని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా వెలుడనుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమా మహేశ్ సరసన పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే. -
ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. ఎప్పుడు, ఎక్కడంటే
Bheemla Nayak OTT Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో పవన్కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా అభిమానులకు చిత్ర బృందం మరో గుడ్న్యూస్ చెప్పింది. గత నెల 25న విడుదలైన భీమ్లా నాయక్ సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. మార్చి25న ఈ సినిమాను ఒకేసారి డిస్నీ+ హాట్స్టార్తో పాటు ఆహాలో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించారు. కాగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు భీమ్లా నాయక్ సైతం ఓటీటీలో విడుదల కానుంది. Vastunnadu #BheemlaNayakOnHotstar. Get ready for the ultimate battle of duty and power from 25th March. https://t.co/WpAm1tEKJc@PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @NavinNooli @dop007 @vamsi84 @DisneyPlusHSTel pic.twitter.com/8XDb7f27Ir — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 17, 2022 Next friday ee time ki, power storm mee intiki vachesthundhi. dates mark cheskondi, calendar kaaliga unchukondi. #ahaLaBheemla from March25 nundi 🔥🔥#ahaLaBheemlaFromMarch25@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @SitharaEnts @MenenNithya @MusicThaman pic.twitter.com/eO0lEuKnZm — aha on Duty (@ahavideoIN) March 17, 2022 -
#SSMB28 : మహేశ్-త్రివిక్రమ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)
-
దుబాయ్లో మహేశ్ను కలిసిన త్రివిక్రమ్
Mahesh Babu And Trivikram Srinivas Are Chilling At Dubai: వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్లు వర్క్ ఫ్రమ్ వెకేషన్ అంటున్నారు హీరో మహేశ్బాబు. ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చి కొన్ని రోజులుగా ఫ్యామిలీతో కలిసి మహేశ్బాబు దుబాయ్ వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వెకేషన్లోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను చేయనున్న సినిమాకి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు మహేశ్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం గురించిన చర్చల కోసం త్రివిక్రమ్ దుబాయ్ వెళ్లారు. ఈ చర్చల్లో సంగీత దర్శకుడు తమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నారు. ‘‘వర్క్ అండ్ చిల్. ఉపయోగకరమైన చర్చలతో సోమవారం మధ్యాహ్నం సాగింది’’ అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేశ్బాబు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్లో భాగంగా మహేశ్, త్రివిక్రమ్, తమన్ దుబాయ్లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. Work and chill... productive afternoon with the team!! #TrivikramSrinivas @vamsi84 @MusicThaman #Dubai pic.twitter.com/F11xtEM0GW — Mahesh Babu (@urstrulyMahesh) December 27, 2021 -
మహేశ్ బాబు సరసన మాస్ మహారాజా హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను ప్రకటించినప్పుటి నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేశ్ సరసన అప్కమింగ్ హీరోయిన్, మోడల్, మిస్ ఇండియా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించే చాన్స్ కొట్టెసింది. ఈ క్రమంలో ఆమె త్రీవిక్రమ్-మహేశ్ కాంబినేషన్లో రాబోయే చిత్రంలో సెకండ్ హీరోయిన్గా ఆమెను ఎంపిక చేసినట్లు వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా మీనాక్షిని ‘సలార్’లో ప్రభాస్కు సెకండ్ హీరోయిన్గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మహేశ్, డైరెక్టర్ పరశురాంతో చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా పూజ హెగ్డే పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
'త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ'..కానీ సినిమా కోసం కాదు
Allu Arjun -Trivikram For An Add Shooting: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ మరోసారి నటించారు. అయితే ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం. రాపిడో బైక్ ఆన్లైన్ అగ్రిగేటర్ యూడ్ కోసం వీరిద్దరి కలిసి పనిచేశారు. అన్నపూర్ణ స్టూడియోస్లో దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కానుంది. కాగా త్రివిక్రమ్ బడా సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలను కూడా రూపొందిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్వకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రిస్మస్ నాడు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ థియేటర్స్లో విడుదల కానుంది. చదవండి : కమెడియన్ అలీ ఇంటిని ఎప్పుడైనా చూశారా? సల్మాన్తో ఇప్పటికీ టచ్లోనే ఉంటా : సల్లు భాయ్ మాజీ ప్రేయసీ -
SSMB28: స్టోరీ అవుట్, ఆ సినిమాలో మహేశ్ పాత్రే టైటిల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎస్ఎస్ఎమ్బీ28’ చిత్రం నుంచి తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఇటీవల వీరిద్దరి కాంబోపై ఇటీవల ఆఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎదోఒక అప్డేట్ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పక్కప్లాన్తో చేస్తున్న ఈ మూవీ స్టోరీలైన్, టైటిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎమ్బీ 28’ అనే వర్కింగ్ టైటిల్తో హరిక హాసిని బ్యానర్లో చినబాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పార్థు’ అనే టైటిల్ను ఖారారు చేశారని, ఇందులో మహేశ్ మధ్య తరగతి కటుంబానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడనే వార్త కూడా వైరల్ అవుతోంది. ఇందులో హీరో తండ్రి ఓ డాన్ అని, అది తెలియక హీరో కొన్ని పరిస్థితుల్లో తండ్రితోనే పోరాటం చేయడం జరుగుతుందట. ఇక ఆ తర్వాత అతడే తన తండ్రి అని తెలిశాక హీరో ఎలాంటి స్టేప్ తీసుకుంటానేది ఈ కథ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా అతడు మూవీ మహేశ్ పాత్ర పేరు పార్థు అనే విషయం తెలిసిందే. డాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తీసుకోవాలని భావిస్తున్నారట త్రివిక్రమ్. ఈ తండ్రీకొడుకుల వార్ను ఆసక్తికరంగా మలిచేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. ఇందులో మహేశ్ సరసన ఇప్పటికే పూజా హెగ్డె ఎంపికైన తెలిసిందే. మరో హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్ నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్ ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. చదవండి: SSMB28: మరోసారి మహేశ్తో రొమాన్స్ చేయనున్న ఆ హీరోయిన్ SSMB28: వచ్చే ఏడాది సమ్మర్కు రానున్న క్రేజీ కాంబో -
ఫస్ట్ మహేశ్తోనే, ఆ తర్వాత ఎన్టీఆర్తో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్దమవుతోంది. త్రివిక్రమ్తో ఓ మూవీ చేయనున్నట్లు మహేశ్ ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ‘మహేశ్ సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో డైరెక్షన్లో ఓ మూవీ రూపొందాల్సి ఉంది. తాజా బజ్ ప్రకారం మహేశ్ రాజమౌళితో కంటే ముందే మాటల మాంత్రికుడితో జతకడుతున్నట్లు తెలుస్తోంది. ‘ఎస్ఎస్ఎమ్బీ28’ అనే వర్కింగ్ టైటిల్తో దర్శకుడు ఈ మూవీ రూపొందించేందుకు రేడి అయ్యాడట. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ‘ఎస్ఎస్ఎమ్బీ28’ అనే హ్యాష్ ట్యాగ్ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతేగాక నవంబర్ లేదా డిసెంబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో మహశ్కు జోడీగా మరోసారి బుట్టబోమ్మ జతకడుతోంది. ఇప్పటికే ‘మహర్షి’ మూవీలో పూజా హెగ్డె, మహేశ్లు జంటగా ప్రేక్షకులను అలరించారు. ఈ సారి త్రివిక్రమ్తో కలిసి ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది. జీఎమ్ బెంటస్, హారిక హాసిన్ క్రియేషన్స్పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ జూనీయర్ ఎన్టీఆర్తో కూడా ఓ చిత్రం చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వాయిదా పడినట్లు వార్తలు గుప్పుమనగా నిర్మాత నాగవంశీ ఈ వార్తల్లో నిజం లేదంటూ ట్వీట్ చేశాడు. కాగా త్రివిక్రమ్ మాత్రం ‘ఎన్టీఆర్30’ ప్రాజెక్ట్ను హోల్డ్లో ఉంచి ముందుగా మహేశ్ ‘ఎస్ఎస్ఎమ్బీ 28’ మూవీని పట్టాలేక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్. చదవండి: చూస్తుండగానే మోనాల్కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! మరో సారి మహేశ్తో జతకట్టనున్న పూజా? ఆ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తి.. త్రివిక్రమ్ మూవీకి బ్రేక్! -
మాటల మాంత్రికుడు, అల్లు అరవింద్కు కరోనా!
దేశంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి టాలీవుడ్కు సైతం వ్యాపించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్లు కరోనా పాజటివ్గా పరీక్షించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్లో ఉన్నారని వినికిడి. అయితే దీనిపై ఇప్పటికి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే అల్లు అరవింద్, త్రివిక్రమ్లు డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారని, కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హీరోయిన్ నివేదా థామస్ సైతం తాజాగా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ట్వీట్ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్గా పరీక్షించాను. డాక్టర్ సలహాతో అన్ని విధాల మెడికల్ ప్రోటోకాల్ పాటిస్తూ ఐసోలేషన్కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్కు వెళ్లండి. ఈ కష్టకాలంలో నాకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నా మెడికల్ టీంకు. నాపై ప్రత్యేక శ్రద్ధా చూపిస్తున్నా వారికి నిజంగా రుణపడి ఉంటాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. pic.twitter.com/S6kh4filk3 — Nivetha Thomas (@i_nivethathomas) April 3, 2021 చదవండి: అయాన్ బర్త్డే: అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్లు! -
వ్యవసాయం లాభసాటిగా మారాలి
‘‘జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటప్పుడు వ్యవ సాయం లాభసాటిగా మారాలి కానీ, నష్టాల్లో కూరుకుపోతోంది. దానికి పరిష్కారం చెప్పడానికి ‘శ్రీకారం’ ద్వారా ప్రయత్నం చేశాడు కిషోర్. ఈ చిత్రకథ ఆసక్తికరంగా ఉంది’’ అని డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నారు. శర్వానంద్ హీరోగా కిషోర్ బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న రిలీజ్ కానుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ‘శ్రీకారం’ చిత్రంలోని టైటిల్ సాంగ్ని త్రివిక్రమ్ విడుదల చేశారు.‘‘నాలుగేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘శ్రీకారం’తో ఫ్యూచర్ ఫిల్మ్ చేశాను. ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే విధంగా చాలా విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు బి. కిషోర్. ‘‘అత్యధిక థియేటర్స్లలో గ్రాండ్గా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ్ ఆచంట. -
జోడీ రిపీట్?
‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజా హెగ్డే, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం శ్రుతీహాసన్ పేరు కూడా చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ జోడీ కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. -
ఎన్టీఆర్ చిత్రం.. పవర్ఫుల్ పొలిటీషియన్గా!
యంగ్టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ తర్వాత త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఈ నందమూరి హీరో ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటేస్ట్ అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ను చిత్రబృందం సంప్రదించిందని టాక్. అంతేకాకుండా సంజయ్ దత్కు త్రివిక్రమ్ వీడియో కాలింగ్ చేసి స్టోరీ నెరేట్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ పాత్రకు సరిసమానంగా ఉండే పవర్ ఫుల్ పాత్ర కావడంతో సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు తప్పక స్కోప్ ఉంటుంది. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, పూజా హెగ్డేలను ఎంపిక చేశారని ఫిల్మ్వర్గాల సమాచారం. ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోల వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చదవండి: మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి ‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్ -
‘అర్జున్ రెడ్డి పార్ట్-2’ అని పెట్టాను..
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి డిలీట్ చేసిన ఓ సీన్ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. అల్లు అర్జున్, సుశాంత్ మధ్య సాగే సన్నివేశాలను ఆ వీడియోలో చూపించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సుశాంత్ వద్దకు వచ్చిన బన్నీ.. తను షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నానని చెప్తాడు. సుశాంత్ మద్యం సేవిస్తున్న వీడియోని చూపించి.. దీనికి అర్జున్రెడ్డి పార్ట్ 2 అని పేరు పెట్టానని చెప్తాడు. దీంతో కంగారు పడిపోయిన సుశాంత్ నేనేం చేయాలి అని బన్నీని అగుడుతాడు. ఆ తర్వాత సుశాంత్ సిటీ బస్సు వెనక పరుగెడతాడు. అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు ఈ సీన్ సినిమాలో పెట్టి ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రంలో టబు, మురళీ శర్మ, సుశాంత్, సముద్రఖని, జయరామ్, నివేదా పేతురాజు ముఖ్య పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. -
అయిననూ పోయి రావలె హస్తినకు?
‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, హీరో ఎన్టీఆర్ తొలిసారి కలిశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరోసారి ఈ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. హారికా హాసినీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై యస్. రాధాకృష్ణ, కల్యాణ్రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2021 ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ చిత్రం. ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాంబినేషన్ కలవబోతున్న సంగతిని బుధవారం అధికారికంగా ప్రకటించారు. మరి టైటిల్ ఇదే షురూ అవుతుందా? వేచి చూడాలి. -
ఏప్రిల్ 8న ‘అల..వైకుంఠపురములో’
ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. తొలుత పాటలు సెన్సేషన్ సృష్టించగా.. ఆ తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాన్బాహుబలి రికార్డులను తిరగరాస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ను భారీ మొత్తం చెల్లించి జెమిని టీవీ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న డిజిటల్ ఫ్లాట్ఫామ్ సన్ నెక్ట్స్లో ప్రసారం కానుంది. ఇక ఈ చిత్రంపై బాలీవుడ్ కన్నుపడింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏకంగా రూ.8 కోట్లకు కైవసం చేసుకున్నాడని సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ రీమేక్లో కండలవీరుడు సల్మాన్ఖాన్ నటిస్తాడని సమాచారం. దక్షిణాది చిత్రాలపై మక్కువ ఎక్కువ చూపే సల్మాన్కు ‘అల.. వైకుంఠపురములో’స్టోరీ బాగా నచ్చడంతో ఈ సినిమా రీమేక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న సల్మాన్ ఈ రీమేక్ చిత్రం విజయం సాధించి పెడుతుందో వేచి చూడాలి. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఏర్పడింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో నేరుగా తానే నిర్మిస్తానని అల్లు అరవింద్ భావిస్తున్నాడట. ఈ విషయంపై రాధాకృష్ణ, త్రివిక్రమ్లతో అల్లు అరవింద్ చర్చిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాలీవుడ్ రీమేక్ రైట్స్పై నెలకొన్న సందిగ్దత వీడాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘సామజవరగమన’ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ -
పిట్ట కథకూ నాకూ లింక్ ఉంది
‘ఈ సినిమాతో నాకు ఓ చిన్న లింక్ ఉంది. అదేంటంటే నాకు ఈ చిత్రకథ తెలియటమే. కథ విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దర్శకుడికి రెండు, మూడు పేర్లు వచ్చాయి. వాటిలో ‘ఓ పిట్టకథ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అని క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. అదే ఈ సినిమాకు నా కంట్రిబ్యూషన్’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థపై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను త్రివిక్రమ్ విడుదల చేశారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘స్టార్ హీరోలతో చాలా కమర్షియల్ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు చేస్తున్నాను. అలాగే మళ్లీ కొత్తవాళ్లతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దర్శకుడు చందు చెప్పిన చిన్న కథకు ఎగ్జయిట్ అయ్యాను. వెంటనే ఈ కథను సెట్స్ మీదకు తీసుకెళ్లాను. ఈ టైటిల్ పోస్టర్ను విడుదల చేసిన త్రివిక్రమ్కు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో సాగే సినిమా ఇది. షూటింగ్ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి అన్నారు. ‘‘ఒక పల్లెటూరిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకిత్తించే సినిమా’’ అన్నారు చందు ముద్దు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి తదితరులు నటించారు. -
మరోసారి త్రివిక్రమ్తో జూనియర్ ఎన్టీఆర్
మాటల మాంత్రికుడు, దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్.. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి హిట్ను సంపాదించిన విషయం తెలిసిందే. మాస్ ఫాలోయింగ్ ఉన్న తారక్కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్ను తీసుకు వచ్చింది. అయితే ఈ వేసవిలో మరోసారి వీరు జతకడుతున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన హ్యట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తారక్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. -
‘అల.. వైకుంఠపురములో’ మ్యూజికల్ నైట్
-
అల.. వైకుంఠపురములో ట్రైలర్ విడుదల
హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఇప్పటికే ఈ మూవీలోని అన్ని పాటలు అందరినీ అలరించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఈ చిత్రంలోని పాటలతో ‘మ్యూజికల్ కాన్సెర్ట్’ (ప్రీ రిలీజ్ వేడుక) యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తెలుగు తెరపై ‘త్రివిక్రమ్’ మాటల మంత్రం
మాటలతో మంత్రం వేసి...డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం ఆయనకి మాత్రమే సాధ్యం. పాత్రల మధ్య పంచ్ డైలాగులతో నవ్వించాలన్నా....అనుబంధాల గురించి గుండె బరువెక్కే మాటలు రాయాలన్నా అది ఆయన కలానికి మాత్రమే సాధ్యం. ‘తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది......మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి..కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ’లాంటి ఎన్నో డైలాగులు ఆయన గుండె లోతుల్లోంచి రాసుకున్నవే. సినిమా చూస్తున్నంత సేపు మనల్ని కదలించే ఎన్నో సీన్లు...సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుడి మదిలో కదలాడుతూనే ఉంటాయి. అయన డైలాగుల్లో పంచ్ ఉంటుందని అంటారు కానీ, జీవితం ఉంటుందంటారు ఆయన అభిమానులు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.... -
‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అల వైకుంఠపురములో..’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఎంతటి హిట్ టాక్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి వీరిద్దరూ కలిసి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్, బన్నీ డైలగ్, ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాట టీజర్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. పూర్తి సాంగ్ను దీపావళి కానుకగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ‘రాములో..రాములా నన్నాగం చేసిందిరో’అని సాగే పాటకు తమన్ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ పాట కూడా అభిమానులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’అని సాగే సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్లో ఇప్పటివరకు ఏడు లక్షల లైక్లు సాధించిన తొలి తెలుగు పాటగా ‘సామజవరగమన’చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా విడుదల చేసిన పాట ఇదే ఊపులో భారీ హిట్ సాధించే అవకాశం ఉంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సినిమా ఫలితం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టి అభిమానులకు కానుకగా ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరామ్, సుశాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
‘అల వైకుంఠపురములో’ మూవీ స్టిల్స్
-
హిట్ మూడు
ముచ్చటగా మూడు... ఇచ్చటనే ఉండు... వేరెచ్చటనో దొరకపోదు. ఇది ట్రిపుల్ ధమాకా జోరు. అందరితో కలిసినా ఈ కాంబినేషనే స్పెషల్ అన్నప్పుడు చూసేవాళ్లకి ఆ ‘హిట్ మూడు’ వేరు. ఇప్పుడు కాంబినేషన్స్ రిపీట్ కావాలంటే చాలా కలిసి రావాల్సి ఉంటుంది కానీ గతంలో కాంబినేషన్స్ చాలా ఈజీగా కొనసాగేవి. ఎన్.టి.ఆర్–రాఘవేంద్రరావు, అక్కినేని–దాసరి నారాయణరావు, చిరంజీవి–కోదండరామిరెడ్డి, బాలకృష్ణ–కోడి రామకృష్ణ, రాజేంద్రప్రసాద్–రేలంగి నరసింహారావు, నరేష్–జంధ్యాల... ఇవన్నీ చాలా సులువుగా కొనసాగిన కాంబినేషన్లు. నిన్న మొన్న కూడా మహేష్బాబు– గుణశేఖర్, రవితేజ– పూరి జగన్నాథ్, త్రివిక్రమ్–పవన్ కల్యాణ్ తదితర కాంబినేషన్లు వెంటవెంటనే రిపీట్ అయ్యాయి. కాని ఇప్పుడు సేమ్ కాంబినేషన్ కోసం చాలా రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. ‘జయం’, ‘ధైర్యం’ సినిమాలు చేసిన తేజ–నితిన్ మళ్లీ ఇప్పటి వరకూ కలిసి పని చేసే వీలు రాలేదు. సిద్దార్థకు ‘బొమ్మరిల్లు’ వంటి పెద్ద హిట్ ఇచ్చిన భాస్కర్ తిరిగి ఆ కాంబినేషన్తో ప్రేక్షకుల ముందుకు రాలేదు. అల్లు అర్జున్తో ‘బన్ని’, ‘బద్రినాథ్’ చేసిన వి.వి.వినాయక్ మళ్లీ అల్లు అర్జున్తో కలిసి పని చేయాలంటే ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. విజయ్ దేవరకొండ–సందీప్ రెడ్డిల ‘అర్జున్ రెడ్డి’ వచ్చి అప్పుడే రెండేళ్లు గడిచిపోతున్నా వీరిరువురి కాంబినేషన్లో మరో సినిమా ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని కాంబినేషన్లు మాత్రం మూడోసారి, నాలుగోసారి సెట్ కావడం ప్రేక్షకులకు ఆనందం కలిగించే అంశమే. త్రి–అర్జున్ విశాఖ సముద్రంలో తుఫాను పుట్టించిన ‘జులాయి’ (2012) కలెక్షన్లు అల్లు అర్జున్– త్రివిక్రమ్లది మంచి కాంబినేషన్ అని తేల్చాయి. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2015లో చిత్తూరు బోర్డర్లో బాక్సాఫీసును చింతపండు పితికినట్టు పితికి ఇదే కాంబినేషన్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015)తో కలెక్షన్లు రాబట్టాయి. వీరు మళ్లీ కలిసి పని చేయడానికి మూడేళ్లు పట్టింది. ఈ 2019లో త్రివిక్రమ్–అల్లు అర్జున్ కలిసి పని చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈసారి కథ ఎలా ఉంటుందో ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారో అని ప్రేక్షకులకు కుతూహలంగా ఉంది. లెటజ్... వెయిట్ అండ్ సీ. బి ఫర్ బాలయ్య అండ్ బోయపాటి 2010లో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సింహా’ వచ్చినప్పుడు ఆ మాస్కు ప్రేక్షకులు విపరీతంగా క్లాప్స్ కొట్టారు. బాలకృష్ణను డాక్టర్గా, లెక్చరర్గా కొత్త పాత్రల్లో చూపి యాక్షన్ను మిళితం చేసి హిట్ కొట్టాడు డైరెక్టర్. మళ్లీ∙నాలుగేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్’(2014) మాస్ క్రేజ్ను డబుల్ చేసింది. జగపతిబాబుకు విలన్గా ఈ సినిమా కొత్త కెరీర్ను ప్రసాదించింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత అంటే 2019లో బాలయ్య– బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా సిద్ధమవుతూ ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానుంది. దాని కోసం ఎటువంటి కథను బోయపాటి సిద్ధం చేశారో. హీరో విలనయ్యాడు ‘అష్టా చమ్మా’ (2008)తో నానీని హీరోగా మలిచారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇందులో అవసరాల శ్రీనివాస్ మరో హీరో. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కడానికి ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. 2016లో నాని హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో తయారైన ‘జెంటిల్మన్’ పెద్ద హిట్ అయ్యి ఈ జోడీకి ప్రేక్షకుల్లో వాడి ఉందని నిరూపించింది. మూడేళ్ల తర్వాత నాని–ఇంద్రగంటి కాంబినేషన్లో ‘వ్యూహం’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోంది. సుధీర్బాబు మరో హీరో. విశేషం ఏంటంటే.. ఇది నాని కెరీర్లో 25వ సినిమా. అంతకంటే స్పెషల్ ఏంటంటే.. ఈ సినిమాలో నాని విలన్గా నటించనున్నారు. అంటే ‘అష్టా చమ్మా’లో ఇద్దరు హీరోలు. ‘వ్యూహం’లో ఇద్దరు హీరోలు. సెంటిమెంట్గా కూడా కలిసి రావచ్చు. ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్లీడర్’ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి 2014లో నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ చిత్రం తెగ నచ్చేసింది. రెండేళ్ల తర్వాత నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జ్యో అచ్యుతానంద’ వస్తే దానిని ఆదరించారు ప్రేక్షకులు. ఈ చిత్రంలో నారా రోహిత్ మరో హీరో. తాజాగా మూడో చిత్రం కోసం చేతులు కలిపారు నాగశౌర్య, అవసరాల. ఇందులో మాళవికా నాయర్ కథానాయికగా నటించనున్నారు. గతంలో ‘కల్యాణ వైభోగమే’ సినిమాలో నాగశౌర్య అండ్ మాళవిక జంటగా నటించారు. ఇప్పుడు ఏ హీరో హీరోయిన్ ముచ్చటగా మూడోసారి జోడి కట్టబోతున్నారో తెలుసుకుందాం. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘దర్బార్’లో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇంతకుముందు ‘చంద్రముఖి’ (2005)లో హీరోయిన్గా, ‘శివాజీ’, ‘కథానాయకుడు’ (2008) చిత్రాల్లో వీళ్లు స్పెషల్ సాంగ్లో కలిసి నటించారు. అలాగే తెలుగులో సమంత కూడా నాగార్జునతో మూడోసారి కనిపించనున్నారు. అయితే జంటగా కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014లో వచ్చిన ‘మనం’లో తొలిసారి వీరు కలిసి నటించారు. ‘రాజుగారి గది 2’ (2017) వీరి రెండవ చిత్రం. ఇప్పుడు ‘మన్మథుడు 2’ కోసం స్క్రీన్ను షేర్ చేసుకోబోతున్నారు. రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత ఓ స్పెషల్ రోల్ చేయనున్నారు. ‘సారొచ్చారు’, ‘వీర’ చిత్రాల్లో రవితేజ– కాజల్ జంటగా నటించిన విషయం తెలిసిందే.‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న తాజా సినిమాలో ఆయన సరసన కాజల్ నటిస్తున్నారని సమాచారం. ‘కత్తి సండై’ (2016) సినిమాలో ఫస్ట్ టైమ్ జంటగా నటించారు తమన్నా, విశాల్. తాజాగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమా కోసం ఈ ఇద్దరూ జోడీ కట్టారు. అలాగే తమన్నా ప్రధాన పాత్రలో రూపొందనున్న ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఆమె సరసన కనిపించనున్నారట విశాల్. మరి.. వచ్చే ఏడాది ఎవరెవరు ముచ్చటగా మూడోసారి జంటగా కనిపిస్తారో చూడాలి. ‘తేరి’ (2016) కోసం హీరో విజయ్, దర్శకుడు అట్లీ మొదటిసారి పని చేస్తే ఆ సినిమా పెద్ద హిట్ అయింది. వెంటనే వీరిద్దరూ కలిసి ‘మెర్సెల్’ (2017) (తెలుగులో ‘అదిరింది’) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించింది. దాంతో ఆలస్యం చేయకుండా హ్యాట్రిక్ కోసం మూడో సినిమాను పట్టాలెక్కించారు విజయ్ అండ్ అట్లీ. చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఇందులో పదేళ్ల తర్వాత విజయ్కు జోడీగా నటిస్తున్నారు నయనతార. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ‘కత్తి’, ‘తుపాకీ’, ‘సర్కార్’ చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ల కాంబినేషన్ కూడా ఇంతే. ‘టైగర్ జిందాహై’ చిత్రం వీరిద్దరి స్నేహం కుదిర్చింది. ఆ తర్వాత సల్మాన్–అలీ కలిసి 2016లో ‘సుల్తాన్’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ఏడాది ఈ రంజాన్కు ‘భారత్’ చిత్రాన్ని రెడీ చేశారు. వీరి కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. హీరో రణ్బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీల కాంబినేషన్లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న మూడో సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఇంతకుముందు రణ్బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ‘వేకప్ సిద్’, ‘ఏ జవానీ హై దివానీ’ సినిమాలు వచ్చాయి. వచ్చే ఏడాది ఏ కాంబినేషన్లో ‘హిట్ మూడు’ వస్తుందో చూడాలి. -
త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘వనవాసం’
నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం "వనవాసం". భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. రిలీజ్కు సిద్దమవుతున్న ఈ చిత్ర టైటిల్, పోస్టర్లను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నాకు వనవాసం టైటిల్ బాగా నచ్చింది. ఈ టైటిల్ లాగానే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. టీం అందరికి అల్ ది బెస్ట్’ చెప్పారు. భరత్ కుమార్.పి నరేంద్ర మాట్లాడుతూ త్రివిక్రమ్ తమ సినిమా టైటిల్ ని మెచ్చుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీయడం జరిగిందన్నారు. సినీ అభిమానులందరూ మెచ్చుకునే విధంగా తమ చిత్రం ఉంటుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. -
హిందీలో దుమ్మురేపుతున్న త్రివిక్రమ్ సినిమా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరో నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం 'అ ఆ'. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై నితిన్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. అవునండి తెలుగులో హిట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూట్యూబ్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 26న 'అ ఆ' చిత్ర హిందీ వర్షన్ని యూట్యూబ్లో పోస్ట్ చేశారు. మూడు రోజుల్లోపే ఈ చిత్రం 20 మిలియన్ల వ్యూస్ చేరుకుని రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో వేగంగా 10 మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. హీరో నితిన్ అయినా.. సినిమా ఎక్కువగా సమంత పాత్ర చూట్టూనే తిరుగుతుంది. అందుకు తగ్గట్టుగా సమంత కూడా అనసూయ పాత్రలో ఒదిగిపోయింది. సెంటిమెంట్, కామెడీ, అమాయకత్వం, పొగరు ఇలా అన్ని రకాల వేరియేషన్స్ను బాగా చూపించింది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ సమంత ఆకట్టుకుంది. చిత్రంలో చూపించిన పల్లె వాతావరణం, అందుకు తగ్గట్టుగా మిక్కి జె మేయర్ స్వరపరిచిన బాణీలు ఉత్తరాది సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలకు యూట్యూబ్ లో ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. హిందీలో డబ్ అయిన అల్లు అర్జున్ నటించిన సరైనోడు, దువ్వాడ జగన్నాథం చిత్రాలు ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉన్న విషయం తెలిసిందే. -
రూటు మార్చిన భీమవరం బుల్లోడు
తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది హాస్య నటులు వచ్చారు. నవ్వుల పువ్వులు పూయించారు. కమెడియన్గా వచ్చి హీరోలుగా మారారు కొందరు. కమెడియన్స్ అంటే హీరోలకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు మరికొందరు. ఈ ప్రవాహంలో ఎంతో మంది తట్టుకుని నిలబడ్డారు. కొంతమందికి కలసిరాలేదు. బ్రహ్మానందం లాంటి హాస్యనటుడికి ప్రత్యామ్నాయాన్ని ఎవరైనా చూపగలరా? అన్న ప్రశ్నకు నటుడు సునీల్ ఒక జవాబులా కనిపించాడు. అతి కొద్ది కాలంలోనే విలక్షణ నటనతో, టైమింగ్తో, హావభావాలతో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టించాడు. కొన్ని పాత్రలు సునీల్ మాత్రమే చేయగలడు అనే స్థాయి నుంచి కేవలం సునీల్ కోసమే కొన్ని పాత్రలు ప్రాణం పోసుకున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తనకు ఎంతో పేరు తెచ్చిన హాస్యాన్ని వదిలి హీరోగా ట్రై చేశాడు. మొదట్లో రెండు హిట్లు పడినా, తరువాత సరైన విజయాలు లేక, సమయం కలిసిరాక రేసులో వెనకబడ్డాడు. తిరిగి మళ్లీ ఎలాగైనా ఫాంలోకి రావాలనే ఉద్దేశంతో తనకు జీవితాన్నిచ్చిన హాస్యప్రధానమైన (కమెడియన్) పాత్రల్లో నటించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తన ప్రాణ స్నేహితుడైన త్రివిక్రమ్- ఎన్టీఆర్, శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రాల్లో సునీల్ కమెడియన్గా కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాలతో మళ్లీ తన దశను మార్చుకోవాలనుకుంటున్న సునీల్కు ఎలాంటి ప్రతిఫలం వస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం అల్లరి నరేశ్ సుడిగాడు2 సినిమాలో సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. -
‘నేను త్రివిక్రమ్కు కథ ఇవ్వలేదు’
జై లవ కుశ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రముఖ రచయిత మధుబాబు నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రచయిత మధుబాబు క్లారిటీ ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మధు బాబు స్పందించారు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాకు తాను కథ అందిస్తున్నట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అసలు త్రివిక్రమ్ తనను కథ విషయంలో సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే అవకాశం వస్తే సినిమాలకు కథ అందించేందుకు సిద్ధమని మధుబాబు తెలిపారు. -
పవన్ టీజర్ : తెలుగులో టాప్, సౌత్లో సెకండ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ ను తిరగరాస్తోంది. ఇప్పటికే తెలుగుతో అతి తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా, అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా అజ్ఞాతవాసి రికార్డ్ సృష్టించింది. తాజాగా దక్షిణాదిలోనూ పవన్ సినిమా టీజర్ జోరు కనిపిస్తోంది. ఈ టీజర్ సౌత్ ఇండియాలో 24 గంటల్లో అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. విజయ్ హీరోగా నటించిన మెర్సల్ టీజర్ కు అత్యధికంగా ఏడు లక్షల నలబై వేలకు పైగా లైక్ లు రాగా అజ్ఞాతవాసి టీజర్ నాలుగు లక్షలకుపైగా లైకుల వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇదే రికార్డ్ కాగా.. దక్షిణాదిలో మాత్రం సెకండ్ ప్లేస్ సాధించింది. అజ్ఞాతవాసి తరువాతి స్థానాల్లో సూర్య తాన సేరంద కూటం, అజిత్ వివేగం, రజనీ కబాలి టీజర్లు ఉన్నాయి. -
'అజ్ఞాతవాసి' ఆడియో వచ్చేస్తోంది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ఆడియో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాలోని ఒక పాటను రిలీజ్ చేసిన త్రివిక్రమ్ టీం, త్వరలో పూర్తి ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. తొలిసారిగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ మాస్ పాటను ఆలపించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజ్ఞాతవాసి ఆడియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా డిసెంబర్ 18న ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వారణాసి ఒడ్డున పవిత్ర గంగానదిలో..
-
పవన్ కొత్త సినిమా అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంతవరకు టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న మ్యూజికల్ టీజర్ ను రిలీజ్ చేసిన యూనిట్, దీపావళికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని భావించారు. అయితే అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. ఇటీవల కేరళలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలో యూరప్ వెళ్లనుందట. ప్రస్తుతం పవన్ రాజకీయ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. ఆ తరువాత 15 రోజుల పాటు యూరప్ షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్ పవన్, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్ లపై పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపుగా షూటింగ్ పూర్తవ్వనుందని తెలుస్తోంది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘అత్తారింటికి దారేది’ లేటెస్ట్ స్టిల్స్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ ఈ చిత్రంలో.. పవన్ కళ్యాణ్ సరసన సమంతా జోడీగా నటించింది.పవన్ కళ్యాణ్, సమంతా జోడీ ఈ సినిమాతో సరికొత్త ట్రెండ్ సృష్టించనుందా..!ఈ ఆరడుగుల బుల్లెట్ ప్రేక్షకుల ముందుకు త్వరలో దూసుకురానుంది. చిత్రంలోని ఓ దృశ్యం.. జల్సా తరువాత త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో.. ఈ చిత్రం మరో సూపర్ డూపర్ హిట్... కానుందా...!!చిత్రంలోని ఓ సన్నివేశం...సమంతా.. చిరునవ్వుతో..సమంతా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించనుంది.ఈ సినిమాలో త్రివిక్రమ్ సృష్టించిన డైలాగులు అదుర్స్ ..`కాటమురాయుడా...` అంటూ పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకులను.. అలరిస్తోంది.చూడు సిద్దప్పా.. సింహం గడ్డం గీసుకోదూ... అంటూ పవన్ చెప్పినా.. డైలాగ్.. టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. భారీ అంచనాలతో... వస్తున్న .. ఈ ‘అత్తారింటికి దారేది’ సినిమా ఏ మేరకు.. ఆకట్టుకుంటుందో.. !!