vanchana pai garjana
-
నయవంచకులపై గర్జన
సాక్షి, న్యూఢిల్లీ :నిస్సిగ్గుగా నయవంచన పర్వం సాగించారు. నాలుగేళ్లపాటు నమ్మక ద్రోహం చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ప్రత్యేక హోదా అంశానికి పాతరేశారు. హోదా మాటెత్తితే శివాలెత్తారు. ఇప్పుడు పోలవరం అంటూ.. స్టీల్ప్లాంట్ అంటూ జిమ్మిక్కులు ప్రారంభించారు. ఎన్నికల శంకుస్థాపనలతో మళ్లీ మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును వైఎస్సార్ సీపీ ఎండగట్టింది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్తో దేశ రాజధానిలో గురువారం ‘వంచనపై గర్జన’ పేరిట నిరసన తెలిపింది. ఎముకలు కొరికే చలిలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు రోజంతా ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ముమ్మాటికి ఇవ్వాల్సిందేనని ముక్తకంఠంతో కోరారు. వంచనపై గర్జనలో ఎమ్మెల్యే జోగులు రాజాం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని, విభజన చట్టంలో హామీలును అమలుచేయాలని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గురువారం నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమంలో పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేస్తున్న మోసానికి నిరసనగా ఈ కార్యక్రమం జరిగిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని ఒక్క వైఎస్సార్ సీపీయేనని ఆయన చెప్పారు. జగన్తోనే హోదా సాధ్యామన్నారు. -
న్యూఢిల్లీలో : ‘వంచనపై గర్జన దీక్ష’
-
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: వైవీ
ఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్సీపీయేనని తెలిపారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్లు చేపట్టామని, పార్లమెంటులోపలా, బయటా పోరాటం చేశామని చెప్పారు. హోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశామని అన్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలతో బాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని మొదట ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నయవంచకుడని తూర్పారబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి..ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టారని అన్నారు. హోదా వచ్చుంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నయవంచనను ప్రజల గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా 25 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోదా సాధించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. -
చంద్రబాబు కొత్త డ్రామా: వైవీ సుబ్బారెడ్డి
-
చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి
-
విజయం మాదే: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను నెరవేరుస్తుందని భావిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహిస్తున్న ‘వంచనపై గర్జన’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు కొత్త డ్రామా: వైవీ సుబ్బారెడ్డి ధర్మపోరాట దీక్షలతో మరో డ్రామాకు సీఎం చంద్రబాబు తెర తీశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి హోదా ఆవశ్యకతను చాటిచెప్పడంతో ఈ అంశం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్లేటు ఫిరాయించి ధర్మాపోరాట దీక్షలతో మరోసారి వంచించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం, ప్రత్యేక హోదా కోసం నాలుగన్నరేళ్లుగా చిత్తశుద్ధితో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. దమ్మున్న నాయకుడు అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. హోదా కవచంతో వస్తున్నారు: జంగా ప్రత్యేక హోదా భిక్ష కాదు, తెలుగు ప్రజల హక్కు అని వైఎస్సార్ సీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. హోదా కవచం కప్పుకుని ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. -
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల
ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని వైఎస్సార్సీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది వైఎస్సార్సీపీయేనని చెప్పారు. శ్వేతపత్రాలతో చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మొదటగా అవిశ్వాసం పెట్టింది కూడా వైఎస్సార్సీపీయేనని తెలిపారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో కేంద్రం దిగివచ్చేదని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తూర్పారబట్టారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాదని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, 25 ఎంపీ స్థానాలు గెలిస్తే మనం అనుకున్నది సాధించవచ్చునని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల
-
‘ఆయన్ను బ్రోకర్లా బాబు వాడుకుంటున్నారు’
ఢిల్లీ: నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి తన సొంత ప్రయోజనాలు నెరవేరలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలేశారని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు ఢిల్లీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో భయపడి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికీ చంద్రబాబేనని నొక్కివక్కానించి చెప్పారు. ఎన్నోసార్లు మోదీని పొగుడుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం చేసిన విషయంలో వెంకయ్యనాయుడు పాత్ర ఉందని అన్నారు. ఏపీకి మొదటి శత్రువు చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వల్ల ఏపీకి రూ. లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను తన అనుచరులకు ఇచ్చి చంద్రబాబు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్ను ఒక బ్రోకర్లా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా అన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల కేసు: కన్నబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. హోదాపై యూటర్న్ తీసుకుని హోదా నేనే తెస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ తీసుకురాకుండా బీజేపీని చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో చంద్రబాబు కలిసిపోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఏంటో కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. -
‘పోరాడితే కేసులా.. మరి హోదా సాధించని బాబు సంగతి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రధాని మోదీతో లాలూచీ పడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆర్థికమంత్రి జైట్లీకి సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. హోదా కోసం పోరాడితే పీడీ యాక్ట్తో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి హోదా సాధించని చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెట్టాలని ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన నేతలను తన పార్టీలోకి తీసుకోవడమే చంద్రబాబుకు తెలిసిన పని అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోద ప్రకటించాలని మోదీని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు: పృథ్వీ వైఎస్సార్సీపీ నేత, నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహాకూటమి అనేది సిగ్గుమాలిన, అనైతిక కలయిక అని అభివర్ణించారు. ప్రజలు చంద్రబాబును తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్తోనే సాధ్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావాడాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్కుమార్రెడ్డికి గమ్యం లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది నాయకులు సంక్రాంతికి హరిదాసుల్లా వచ్చి ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్తో టీడీపీ కలవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓటుకు నోటు కేసు వల్లే రాజధాని వదులుకున్నారు
-
తెలుగువాడిగా పుట్టినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి
-
‘చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు’
సాక్షి, న్యూఢిల్లీ: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఢిల్లీలో విజయవంతంగా కొనసాగుతుంది. ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి వైఎస్సార్ సీపీ చేపట్టిన దీక్షకు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీక్షలో ప్రసంగిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై నేతలు మండిపడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ మాత్రమేనని నేతలు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. హోదా తేలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలన్నీ ఓ బోగస్ అని తెలిపారు. విభజన నష్టాలపై ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కులాలు, మతాలను అవమానించింది చంద్రబబాబేనని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు అయిందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. మైనార్టీల, అర్చకుల సమస్యలు ఇప్పటికీ తీరలేదన్నారు. చంద్రబాబు ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తారని విమర్శించారు. సంక్షేమ రాజ్యం రావాలంటే కేవలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తోనే సాధ్యమని అన్నారు. -
బీజేపీ,టీడీపీ ఏపీకి అన్యాయం చేశాయి
-
వయస్సు పై బడ్డా ఇంకా బుద్ధి రాలేదు
-
హామీల పై కేంద్రం దొంగనాటకాలు
-
‘ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉందని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. హోదా కోసం జననేత వైఎస్ జగన్ అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. కేవలం పోలవరానికి ఒక్క గేటు పెట్టి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వయస్సు పై బడ్డా టీడీపీ నాయకుడు జేసీ దివాకర్రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. దివాకర్రెడ్డి వైఎస్ జగన్ను విమర్శించి మన్నలను పొందాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ను విమర్శిస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘40 ఏళ్ల అనుభవం... అబద్ధాలు చెప్పడానికేనా’ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పక్కబెట్టిన చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణాల గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. వైఎస్ జగన్పై అవాకులు, చవాకులు పేలుతున్న జేసీ దివాకర్రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. బ్యాకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారికి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు ఏ పార్టీతోనైనా కలుస్తారు
-
రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం
-
ఏపీ ప్రజలను వంచించారు
-
వంచనపై గర్జన
-
‘కేవలం పునాది వేస్తారు.. నమ్మించేస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అన్నింటికి కేవలం పునాది మాత్రమే వేసి బాబు ప్రజలను నమ్మిస్తారని అన్నారు. రాజధానిలో అన్నీ తాత్కాలిక భవనాలే అని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, భారతీయ జనతాపార్టీలు ఆంధ్రప్రదేశ్ని ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు తెలియజెప్పడానికే ‘వంచనపై గర్జన దీక్ష’ చేపట్టామని అన్నారు. విభజన హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఉన్నప్పుడు కనీసం కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా బాబు మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోనుందనే కాంగ్రెస్తో జతకట్టారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటుకు వినిపించేందుకే.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం పార్లమెంటుకు వినిపించాలనే వంచనపై గర్జన దీక్ష చేపట్టామని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. హోదా కోసం మొదటినుంచీ పోరాడుతోంది తమ పార్టీయేనని అన్నారు. హోదా సాధనే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. తమ పార్టీకి చెందిన ఐదు మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని చెప్పారు. ఏపీకీ అన్యాయం చేసిన వారిలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాన్ ముద్దాయిలని అన్నారు. -
యూ టర్న్ తీసుకుంది చంద్రబాబే
-
హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు
-
వంచనపై గర్జన: ‘ప్రజలను నడిరోడ్డుపై పడేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ఈ దీక్ష చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ దీక్ష చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన హామీలపై నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ.. హోదా సాధన కోసం ఇప్పటికే పలుమార్లు ఏపీలోని వివిధ జిల్లా కేంద్రాల్లో వంచనపై గర్జన దీక్షలు నిర్వహించింది. అంతేకాకుండా పార్టీకి చెందిన ఎంపీల చేత వారి లోక్సభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు సమర్పించి.. ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పారు. దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ దీక్షలో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురువారం సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. హోదా కావాలని తెలుగు జాతి మొత్తం కోరుకుంటుంది వైఎస్సార్ సీపీ నాయకులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకుని ఏపీ తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తెలుగు జాతి మొత్తం కోరుకుంటుందని తెలిపారు. హోదా కోసమే వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా జననేత వైఎస్ జగన్తోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను నడిరోడ్డుపై పడేశారు మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన బీజేపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ప్రజలను నడిరోడ్డున పడివేసి ఎవరి దారి వారు చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై చంద్రబాబు ఎప్పుడో చేతులెత్తేసి.. ప్రస్తుతం కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లతో ప్రజలకు ఏ మాత్రం లాభం లేదని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన మొట్టమొదటి పార్టీ వైఎస్సార్ సీపీనే అని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ను తిట్టిన చంద్రబాబు నేడు అదే పార్టీతో కలిశారని ఎద్దేవా చేశారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ లోక్సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారని.. అందరం కలిసి రాజీనామాలు చేద్దామంటే పారిపోయిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. టీడీపీ నేతలు దమ్ముంటే తమతో కలిసి రావాలని.. మోదీ ఇంటి వద్ద ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్ హయంలోనే పోలవరం పనులు ప్రారంభం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే పోలవరం పనులు ప్రారంభించారని.. ఆయన చలువ వల్లే అసలు పోలవరానికి రూపం వచ్చిందని గుర్తుచేశారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం కడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం ఏ పార్టీతోనైనా కలుస్తారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాన చేస్తున్నారని తెలిపారు. అల్మట్టి డ్యామ్ ఎత్తు పెరగడానికి కూడా చంద్రబాబే కారణమని అన్నారు. కమీషన్ల కోసమే పోలవరం చేపట్టారు.. వంచనపై గర్జన దీక్షలో వైఎస్సార్ సీపీ నాయకులు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని చేపట్టాడని విమర్శించారు. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఏపీ అన్ని రకాల నష్టపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. రాజన్న రాజ్యం కావాలంటే అది వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వల్లే సాధ్యమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకుంది చంద్రబాబేనని గుర్తుచేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రైతుల వలసల గురించి చంద్రబాబు చులకనగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో యూ టర్న్ తీసుకుంది చంద్రబాబేనని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు హోదా కోసం ఉభయ సభల్లో పోరాడారని అన్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనేక రూపాల్లో పోరాటాలు చేశారని తెలిపారు. -
వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం
-
నయవంచనపై హస్తినలో సమరభేరి
విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించా లని, రాజధానిని సజా వుగా నిర్మించాలని, పోల వరం ప్రాజెక్టులో అవకత వకలు లేకుండా అవినీతి రహితంగా నిర్మించాలని, సేద్యపు నీటి ప్రాజెక్టు లను తగు ప్రాధాన్యతతో నిర్మించాలని రైతు ప్రయోజనాలు కాపాడాలని నిత్యం నినదించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు నేడు ఢిల్లీ కేంద్రంగా నరేంద్ర మోదీ, చంద్రబాబు రాష్ట్రా నికి ప్రత్యేక హోదా గురించి అవలంబించిన మోసంపై సమర శంఖారావం పూరించను న్నారు. ప్రత్యేక హోదా ప్రాముఖ్యతను వైఎస్ జగన్ గుర్తించినంతగా రాష్ట్రంలో ఏ పార్టీ నాయ కుడు గుర్తించలేదు. హోదా సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతూ.. కొన్ని సందర్భా లలో ఆమరణ దీక్ష కూడా చేపడుతూ ఆయన పోరాటాలు చేశారు. తన ప్రజాసంకల్ప యాత్రలో ప్రత్యేక హోదా ప్రాముఖ్యతపై, కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో కొనసాగి హోదా సాధించని బాబు వైఫల్యంపై ప్రసం గాలు చేశారు. మోదీ, వెంకయ్య, పవన్కల్యాణ్, బాబు జోడీ కట్టిన 2014 ఎన్నికలలో హోదాని ఎన్నికల వాగ్దానంగా తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ నలుగురూ తమకు మాత్రమే సాధ్యమైనరీతిలో అవకాశవాద కపట రాజకీయాలకు పాల్పడి ప్రత్యేక హోదాను అట కెక్కించడానికి వివిధ పద్ధతులలో ప్రయత్నాలు చేశారు. ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ, పవ న్కల్యాణ్ ఈమధ్య ఒక వేదికగా కొనసాగిన సమయంలో.. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పార్లమెంట్లో మోదీకి వ్యతిరేకంగా అవి శ్వాస తీర్మానం ప్రవేశపెడితే, వివిధ రాష్ట్రాలలో పర్యటించి 50 మంది పార్లమెంట్ సభ్యులకు మించి మద్దతు కూడబెడతానంటూ పవన్ కల్యాణ్ ప్రధాన ప్రతిపక్ష నేతకు సవాల్ విసి రారు. దానికి ప్రతిపక్ష నేత తనదైన శైలిలో, తమ పార్టీ ఎంపీలతో అవిశ్వాస తీర్మానాన్ని మోదీకి వ్యతిరేకంగా లోక్సభలో ప్రవేశ పెట్టడా నికి సిద్ధమేనని, అయితే పవన్కల్యాణ్ హోదా అంశంపై తన రాజకీయ స్నేహితుడైన చంద్ర బాబు మద్దతు కూడగట్టాలని లేదా బాబుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, దానికి తాము మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ నిజాయితీకి హోదా పట్ల నిబ ద్ధతకు ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా? ఆ సవాల్ను బాబు, ఆయన రాజకీయ కవచమైన పవన్కల్యాణ్ ఇద్దరూ స్వీకరించలేదు. పైగా వైఎస్సార్సీపీ లోక్సభలో అనేక పార్టీల మద్దతు కూడగట్టి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చి లోక్సభలో జరిపిన ఆందోళనకు మద్దతు ఇవ్వ కుండా బాబు తనదైన విద్రోహకరమైన నైపు ణ్యంతో పలాయనవాదం చేపట్టారు. పంచపాం డవుల్లా ఏపీ భవన్లో ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలను బాబు కానీ నేటి ఆయన రాజకీయ స్నేహితుడు రాహుల్గాంధీ పార్టీ సభ్యులుగానీ పరామర్శిం చలేదు. మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ కాగా, ఆ పార్టీ తీర్మా నాన్ని అంగీకరించి చర్చించడానికి మోదీ ప్రభుత్వం సాహసం చేయలేదు. పైగా వైఎ స్సార్సీపీ ఎంపీల రాజీనామాలను అంగీకరించ డంలో విపరీతమైన జాప్యం చేసి హోదాపై ఉప ఎన్నికలలో ప్రజాభిప్రాయం తమకు వ్యతిరే కంగా ఉంటుందని వారి రాజీనామాలు అల స్యంగా అంగీకరించారు. ఈ చర్య తమ పార్టీ తప్పిదమని ఈ అంశం పై తమ పార్టీలో చర్చ జరిగిందని, చర్చకు అవకాశం ఇచ్చి రాజీనామా లకు ఆమోదం తెలిపి ఉండాల్సి ఉందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు ఓ సందర్భంలో బాహాటంగానే అంగీకరిం చారు. ఒకవైపు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ తన రాజకీయ పోరాట ప్రస్థానం కొనసాగి స్తూనే ఉంది. మరోవైపు విద్రోహాలలో ఆరితేరిన బాబు హోదాపై.. విభజన హామీలు అమలు పరచడంలో మోదీ వైఫల్యంపై తానూ పోరాడు తున్నాననే భావన కల్పించడానికి విపరీతంగా శ్రమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత ప్రమా ణాలు పాటించలేదని ఇనుము, ఉక్కు నాసిరక మైనవి వాడారని కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం రాత పూర్వకంగా ఇచ్చిన నివేదిక బాబు నిజాయితీ బండారాన్ని తెలియజేస్తుంది. (రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మోసంపై నేడు ఢిల్లీలో వైఎస్సార్సీపీ సమర శంఖారావం సందర్భంగా) -ఇమామ్ (వ్యాసకర్త కదలిక సంపాదకులు) మొబైల్ : 99899 04389 -
ఢిల్లీలో నేడే ‘వంచనపై గర్జన’
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్మంతర్ వద్ద గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగే ఈ దీక్షలో వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీఎత్తున పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటం ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వంచనపై గర్జన దీక్ష చేపట్టినట్లు వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ నాలుగున్నరేళ్లుగా వివిధ రూపాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా అవసరమని గట్టిగా విశ్వసిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక హోదా కాంక్షను రగిల్చారు. అన్ని వేదికలపై హోదా ఆవశ్యకతను వివరించారు. వైఎస్సార్సీపీ ఇప్పటికే పలుమార్లు వివిధ జిల్లా కేంద్రాల్లో వంచనపై గర్జన దీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన లోక్సభ సభ్యత్వాలను రాజీనామా సమర్పించిన అనంతరం అదే రోజు నుంచి ఏపీ భవన్లో మేకపాటి రాజమోహన్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్రెడ్డి, వైఎస్ అవినాశ్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఢిల్లీ పోలీసులు వారి దీక్షలను భగ్నం చేసిన అనంతరం ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఏప్రిల్ 29న విశాఖపట్నంలో తొలిసారి ‘వంచనపై గర్జన’ దీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా జూన్ 2న రెండో గర్జనను నిర్వహించారు. జూలై 3న అనంతపురంలో, ఆగస్టు 9న గుంటూరులో, నవంబర్ 30న కాకినాడలో దీక్షలను విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పబోతున్నారు. హోదా సాధించేదాకా పోరాటం ఆగదు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2015 ఆగస్టు 10న ఢిల్లీలో పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ధర్నా అనంతరం జగన్తో సహా పార్టీ నేతలంతా పార్లమెంట్ వైపునకు మార్చ్ఫాస్ట్ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో జగన్ పలుమార్లు భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని వేడుకున్నారు. పలువురు జాతీయ పార్టీల నేతలను కూడా కలుసుకుని విభజన చట్టంలోని హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో 2018 మార్చి 5న వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు ప్రత్యేక హోదాను కోరుతూ మహాధర్నాను నిర్వహించారు. పార్లమెంట్లో తుదికంటా పోరాడినా కేంద్రం దిగి రాకపోవడంతో ఎంపీలు తమ రాజీనామాలను సమర్పించారు. పది జిల్లాల్లో యువభేరీలు ప్రత్యేక హోదా అవసరాన్ని యువకులకు, విద్యార్థులకు వివరిస్తూ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పది జిల్లా కేంద్రాల్లో యువభేరీలు నిర్వహించారు. దీనికి యువత, విద్యార్థుల నుంచి భారీఎత్తున స్పందన, సంఘీభావం లభించింది. అంతకు ముందు జగన్ గుంటూరు వేదికగా హోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడమే కాకుండా ప్రత్యేక హోదా ఆకాంక్షను అణచివేసేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వం అణచివేతకు దిగే కొద్దీ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి హోదా డిమాండ్ను సజీవంగా ఉంచడంలో సఫలీకృతం అయ్యారు. ప్రత్యేక హోదా అంటే జైలుకేనని హెచ్చరించిన సీఎం చంద్రబాబు సైతం ఈ విషయంలో యూటర్న్ తీసుకుని హోదా బాట పట్టాల్సి వచ్చింది. దీక్షతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.. ఢిల్లీలో నిర్వహించనున్న ‘వంచనపై గర్జన’కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య నేతలు బుధవారం జంతర్మంతర్ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. 16వ లోక్సభకు ప్రస్తుతం జరుగు తున్న చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాల్లో అయినా కేంద్రం దిగి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా వంచనపై గర్జన దీక్షతో ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఢిల్లీలో విపరీతమైన చలి ఉండడంతో పార్టీ శ్రేణులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలని నేతలు సూచించారు. ధర్మపోరాటం పేరుతో బాబు విన్యాసాలు: మేకపాటి బీజేపీతో నాలుగున్నరేళ్లు కలిసి కాపురం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నడూ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఇప్పుడు ధర్మపోరాటం పేరుతో విన్యాసాలు చేస్తున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి బుధవారం విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా ధర్మపోరాటం చేస్తే ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ హోదా ఇస్తానంటోందని చెప్పి ఓట్లడిగే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. బీజేపీతో అంటకాగినన్ని రోజులు హోదా అడగకుండా ఇప్పుడు ధర్మపోరాటం పేరుతో విన్యాసాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మేకపాటి స్పష్టం చేశారు. ఏపీకి చంద్రబాబు వెన్నుపోటు: విజయసాయిరెడ్డి బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టుగా ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధర్మానికి, అన్యాయానికి, అవినీతికి, అనైతికతకు చంద్రబాబు మారుపేరని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంతో నాలుగున్నరేళ్లు కలిసి ఉండి, ప్యాకేజీకి అంగీకరించి, రాష్ట్రానికి హోదా రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం ముందు నుంచీ పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. వచ్చే ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరిగినా, బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగినా చంద్రబాబు ఓటమి ఖాయమని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. అవిశ్వాసం పెట్టిన ఘనత వైఎస్సార్సీపీదే: వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత వైఎస్సార్సీపీదేనని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు హామీల సాధన కోసం వైఎస్సార్సీపీ నాలుగున్నరేళ్లుగా పోరాడుతోందని గుర్తుచేశారు. అంతేకాకుండా తమ పదవులను సైతం త్యాగం చేసి, ఆమరణ నిరాహార దీక్షకు దిగామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షలు చేశారని, యువభేరి కార్యక్రమాలతో యువతలో చైతన్యం కలిగించారని చెప్పారు. లోక్సభకు ఇవే చివరి పూర్తిస్థాయి సమావేశాలు కావడంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ దిశగా వంచనపై గర్జన దీక్షతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. హోదాకు బాబు అడ్డుపడ్డారు: బొత్స 29సార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పే చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి వద్ద ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నించిన చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు బీజేపీ నేతలను సన్మానించారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాధనకు వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. -
ఢిల్లీలో రేపు వంచనపై గర్జన దీక్ష
-
రేపు ఢిల్లీలో వంచనపై గర్జన
-
ఈనెల 27న ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ వంచనపై గర్జన
-
ఢిల్లీ వేదికగా 27న వైఎస్ఆర్సిపీ అధ్వర్యంలో వంచనపై గర్జన దీక్ష
-
వైఎస్ఆర్సీపీ అలు పెరుగని పోరాటం చేస్తోంది
-
కేంద్ర,రాష్ట్రల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ దీక్ష
-
గర్జించిన కాకినాడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై ... ప్రత్యేక హోదా కావాలంటూ కాకినాడ మరోసారి గర్జించింది. బాలాజీ చెరువు కూడలి జన సంద్రమైంది. దిక్కులు పిక్కటిల్లేలా వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఉదయం ఎనిమిది గంటలకుప్రారంభమై పది గంటలయ్యేసరికి జన ప్రవాహంగా మారిపోయింది. పూటకో మాట...రోజుకో మెలికపెడుతూ ఆది నుంచీ ప్రజలను మోసం చేస్తూ వచ్చిన టీడీపీ వైఖరిపైజనాగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది.విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ సర్కార్ ఆడుతున్న నయవంచక నాటకాలపై నిరసన గళం విప్పారు. కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సభలో హోదా ఇవ్వాల్సిందేనని పెద్ద ఎత్తున గర్జించారు. వంచనపై దీక్షకు ప్రజా మద్దతు,సంఘీభావం లభించింది. పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం నింపింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఉదయం 9.50 గంటలకు జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతంతో సభ ప్రారంభం కాగా, సర్వమత ప్రార్థనలతో దీక్షకు శ్రీకారం చుట్టారు. హోదా కోసం పదవులకు రాజీనామా చేయడమే కాకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన లోకసభ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్లు వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం చూపించిన చిత్తశుద్ధిపై పార్టీ నేతలతో సహా వివిధ వర్గాల వారు ఉచిత రీతిన సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నేతలంతా నల్ల దుస్తులతో దీక్షల్లో పాల్గొని నిరసన గళం వినిపించారు. సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా దీక్షను చేపట్టారు. తరలివచ్చిన ప్రజలు ఆద్యంతం అక్కడే ఉండి సంఘీభావం తెలియజేశారు. దీక్షల్లో పాల్గొన్న వారికితొలుత హిజ్రాలు మద్దతు పలికారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత మార్వాడీ సమాజం ప్రతినిధులు వేదికపైకి వచ్చి హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసిన ఎంపీలను సన్మానించారు. తదుపరి న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘం నేతలు పెద్ద ఎత్తున వచ్చి, పదవులను త్యాగం చేసిన ఎంపీలను ఉచిత రీతిలో సత్కరించారు. తృణప్రాయంగా పదవులను త్వజించిన నేతలకు ఎంత గౌరవించినా తక్కువేనని, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని అభినందించారు..చంద్రబాబు మోసాలపై నేతల గళం... నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసపూరిత విధానాలను, హామీలు అమలు చేయడంలో చేస్తున్న వంచనపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎంత నయవంచనకు గురి చేస్తున్నారో కళ్లకు కట్టినటు వివరించారు. ప్రజల్ని మోసం చేయకుండా వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని, ఏఏ ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారా దోపిడీ చేస్తున్నారని సమగ్రంగా వివరించారు. తండ్రి కొడుకులైన చంద్రబాబు,లోకేషే కాకుండా వారి బినామీలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ చేసిన అవినీతి భాగోతాలను బయటపెట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన దోపిడీ గతంలో ఎప్పుడూ జరగలేదని, ప్రజాధనాన్ని మింగేశాశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ప్రజల్ని నయవంచనకు గురి చేయడమే కాకుండా తానేదో ఉద్దరించినట్టుగా అనుకూల మీడియాలో ఊదరగొట్టి మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. హోదా కోసం తొలినుంచి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ అని గుర్తు చేశారు. తన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయనో, తన బినామీల బండారం వెలుగు చూస్తుందనో ఐటీ, సీబీఐ, ఈడీ అధికారుల విచారణలను అడ్డుకునేందుకు చంద్రబాబు శతవిధాలా యత్నిస్తున్నారని విమర్శించారు. పవన్ తీరును ఎండగట్టిన నేతలు ఎక్కడైనా అధికార పక్షాన్ని నిలదీయడం, ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలను ప్రశ్నించడం చూశాం గానీ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేసే నేతగా ఒక్క పవన్ కల్యాణ్నే చూశామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, కాంగ్రెస్, ఇటు పవన్ కల్యాణ్లు జగన్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడాన్ని తప్పు పట్టడమే కాకుండా వారి లోపాయికారీ కుట్రలను ఎండగట్టారు. ఇక కోడి కత్తే కదా, దానికంత రచ్చ అని పవన్ చేసే వ్యాఖ్యలపై కూడా అనిల్కుమార్ యాదవ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ కోడి కత్తితో ఒక్కసారి చిన్న పిల్లాడితో రక్కిస్తే ఏమవుతుందో పవన్ కల్యాణ్కు తెలుస్తుందని సుతిమెత్తని చురక అంటించారు. ఇదే తరహాలో మిగతా నేతలు కూడా పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు. వంచనపై గర్జన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పార్టీ సీనియర్నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కొప్పర మోహన్రావు, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కర్నూలు జిల్లా ముఖ్యనేత గౌరు వెంకటరెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి , తిప్పల నాగిరెడ్డి, కొయ్యా ప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, తానేటి వనిత, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బూసి వినీత. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కో–ఆర్డినేటర్లు వాసుబాబు, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ కో–ఆర్డినేటర్ కవురు శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, నాగులాపల్లి ధనలక్ష్మి, కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్వీజేఆర్కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, మిండకుదిటి మోహన్, కర్రి నారాయణరావు, కొలగాని దుర్గాప్రసాద్, ఇనుకొండ పట్టాభిరామయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జంపని రామకృష్ణంరాజు, ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల బూత్కమిటీల ఇన్చార్జ్ వీవీఎస్ చౌదరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముదునూరి మురళీకృష్ణంరాజు, జంపన రామకృష్ణంరాజు(బుజ్జిరాజు), నాయకులు బుర్రా అనుబాబు, కొయ్యా ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, కాకినాడ పార్లమెంట్జిల్లా బూత్కమిటీల ఇన్చార్జ్ ఒమ్మిరఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడ : వంచనపై గర్జన
-
పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీ నాయకులను ప్రశ్నించడంలేదు
-
స్వార్ధం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు
-
‘అలా చేస్తే పవన్ను ప్రజలు క్షమించరు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేస్తే.. వారు పవన్ను క్షమించరని వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ఏదో ఒక రూపంలో చంద్రబాబుకు పవన్ మద్దతు ఇస్తూనే ఉన్నారని అన్నారు. నాలుగేళ్లుగా హోదాపై ఎన్నో విధాలుగా చంద్రబాబు మభ్యపెట్టారని మండిపడ్డారు. బాబు ప్రమాణ స్వీకారం చేసి ఇచ్చిన మొదటి హామీ నుంచి అన్నీ గాల్లో కలిసిపోయాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ మాత్రమే పోరాటం చేశారని తెలిపారు. అందుకే చంద్రబాబు 28 సార్లు ఢిల్లీ వెళ్లారు : మేకపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏ మాత్రం ప్రజాస్వామ్య విలువలు లేవని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ స్థానాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెట్టడం కోసమే చంద్రబాబు 28సార్లు ఢిల్లీ వెళ్లారన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తామని మోదీ చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా ఇవ్వలేమని మాట మార్చారని చెప్పారు. ప్రత్యేక హోదా కాదు.. ప్యాకేజీ ఇస్తామంటే చంద్రబాబు తలాడించారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నయవంచకుడు ప్రజాస్వామ్యంలో ఉండటానికి తగదని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ప్రజలందరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవిని : ఆదిములపు సురేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని వంటిదని వైఎస్సార్ సీపీ నేత ఆదిములపు సురేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి పాలనను అంతమొందించాలన్నారు. నాలుగేళ్లు హోదా అడగని బాబు ఇప్పుడు యు టర్న్తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజల అభీష్టాలను చంద్రబాబు తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్లపాటు ప్రజల కష్టాలను తన భుజాలపై మోస్తారని హామీ ఇచ్చారు. ధర్మపోరాటం కాదు.. పచ్చపోరాటం : పార్థసారధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తోంది ధర్మపోరాటం కాదని, పచ్చ పోరాటమని వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి విమర్శించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో మంత్రులే అవినీతికి పాల్పడుతున్నారని, మొత్తం ఏపీని దోపిడి చేశారని ఆరోపించారు. దోమలపై కూడా చంద్రబాబు గెలుపు సాధించలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని నొక్కిఒక్కానించారు. -
‘వారిని ఏపీ ప్రజలు క్షమించరు’
సాక్షి, కాకినాడ : నమ్మక ద్రోహం చేసిన వారిని, మాట తప్పిన వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరని వైఎస్సార్ సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 600 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 15 ఏళ్లు హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు మాటల్ని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందన్నారు. ‘ఇది చంద్రబాబుపై దీక్ష మాత్రమే కాదు.. కేంద్రంపై గర్జన కూడా’ అని అన్నారు. ఏపీకి హోదా విషయంలో చంద్రబాబు అనేక మార్లు యు టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ మనుగడ సాధిస్తుందన్నారు. వైఎస్ జగన్ మాత్రమే హోదా కోసం అనేక సార్లు పోరాటం చేశారని తెలిపారు. రాష్ట్రంలో నయవంచన పాలన నడుస్తోంది: కన్నబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నయవంచన పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. తన సొంత మనషుల కోసం అధికారాన్ని వాడుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్తో చంద్రబాబు కలిసి తిరుగుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తెలిపారు. హోదాపై అనేక సార్లు మాట మార్చింది చంద్రబాబేనన్నారు. ఏపీ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారు : కోలగట్ల ఆంధ్రా ప్రజల ఆత్మాభిమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోనియా గాంధీ వద్ద తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి ద్రోహం చేసిందన్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు జరిగిన అవమానాన్ని చంద్రబాబు మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ హామీలను చంద్రబాబు నెరవేర్చారో.. దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ మేనిఫెస్టోపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని సువర్ణ పాలన వైఎస్ జగన్తోనే సాధ్యమని పేర్కొన్నారు. -
ప్రారంభమైన వంచనపై గర్జన
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న వంచనను ప్రజలముందు ఉంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన కార్యక్రమం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాలాజీ సెంటర్లో ప్రారంభమైంది. వైఎస్సార్ సీపీ నేతలు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి, సర్వమత ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్సా సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, రామకృష్ణారెడ్డి, కన్నబాబు పలువురు ఎమ్మెల్యేలు , వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు, భారీ సంఖ్యలో మహిళలు, అభిమానులు హాజరయ్యారు. -
‘చంద్రబాబు ఏనాడూ పోరాడలేదు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటం కోసం, విభజన హామీల అమలుకు గత నాలుగున్నరేళ్లుగా తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వంచనపై గర్జన సభ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ హామీలు సాధించటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం చంద్రబాబు ఏనాడూ పోరాడింది లేదని చెప్పారు. హోదా కోసం కేంద్రాన్ని ఏ రోజు అడిగిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ, టీడీపీ పార్టీలు రెండూ ఏపీ ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒక్కటే : వైఎస్సార్ సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటేనని వైఎస్సార్ సీపీ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పోరాటాన్ని ఎవరూ నమ్మరని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఖర్చులతో చంద్రబాబు ధర్మపోరాటమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని, యుటర్న్ తీసుకున్నంత మాత్రాన ప్రజలు ఆయన్నునమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 సార్లు పోరాడారని తెలిపారు. -
చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒక్కటే
-
వంచనపై వైఎస్సార్ సీపీ ఉద్యమ హోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు...ఆ బంగారు భవిత కోసమే వైఎస్సార్ సీపీ ఆరాటం... దశలవారీగా పోరాటం ... ఆ దిశగా మరో అడుగు వేస్తోంది ... చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వంచనను జనం ముందు ఉంచేందుకు ...ధర్మపోరాటాల పేరుతో అధర్మానికి పాల్పడుతున్న చంద్రబాబు నైజాన్ని ఎండగట్టేందుకు ఈసారి కాకినాడ బాలాజీ చెరువు కూడలిని వేదికగా చేసుకుంటోంది. హోదా కోసం ఎంపీ పదవులు త్యాగం చేసిన నేతలతోపాటు ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలంతా ఈ సభకు తరలివస్తున్నారు. హోదాయే ఊపిరిగా... నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా మరుగున పడకుండా ... మాట తప్పకుండా, మడమ తిప్పకుండా హోదాయే ఊపిరిగా వైఎస్సార్సీపీ అవిశ్రాంత పోరు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాలు, బంద్లు, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలతో హోదా డిమాండ్ను ముందుకు తీసుకెళ్లారు. హోదా కోసం ఎంపీ పదవులను తృణప్రాయంగా వైఎస్సార్సీపీ నేతలు త్యాగం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ ఆమరణ నిరాహార దీక్షలకు సహితం ఉపక్రమించారు. కాకినాడ వేదికగా మూడో పోరు... హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ నినాదంతో తొలి నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఈ జిల్లాలోనైతే ఇప్పటికే రెండుసార్లు పర్యటించి హోదా కోసం ఎలుగెత్తి చాటారు. 2016 జనవరి 27న కాకినాడలోని అంబేడ్కర్ భవన్లో యువభేరి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఏడాది మే పదో తేదీన హోదా కోసం కలెక్టరేట్ ఎదుట దీక్ష చేశారు. తాజాగా వంచనపై గర్జన పేరుతో శుక్రవారం నిరసనకు దిగుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, నగర నియోజకవర్గ సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి హాజరవుతున్న మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ రాష్ట్ర నేతలు, సమన్వయకర్తలతోపాటు వేలాదిగా తరలివచ్చే ప్రజల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. -
హోదా సాధిద్దాం
తూర్పుగోదావరి ,కాకినాడ: హోదాను సాధిద్దామని వైఎస్సార్ సీపీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీచెరువు సెంటర్లో శుక్రవారం జరగను న్న ‘వంచనపై గర్జన’ సభా వేదికను ఉభయగోదావరి జిల్లాల అదనపు ప్రాంతీయ పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ జిల్లాల అధ్యక్షుడు పిల్లి సుభాష్చంద్రబోస్, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితర నేతలు పర్యవేక్షించి పార్టీ శ్రేణులకు సూచనలిచ్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సభ సాయంత్రం ముగిసేవరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వంచనపై గర్జనకు రాజకీయాలకు అతీతంగా మేధావులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీలు, ప్రత్యేక హోదా కాంక్షించే ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ వేదికగా హోదా నినాదం మిన్నంటేలా దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్ర బోస్ మాట్లాడుతూ వంచనపై గర్జనకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పార్టీశ్రేణులు నల్లదుస్తులు ధరించి నిరసన కార్యక్రమానికి హాజరుకావాలని, ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా సభను విజయవంతం చేసి ప్రజాభీష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజెప్పాలన్నారు. ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, ఫ్లోర్ లీడర్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీల ఇన్చార్జి చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులు పెదిరెడ్డి రామలక్ష్మి, జమలమడక నాగమణి, డాక్టర్ పితాని అన్నవరం, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పెద్ది రత్నాజీతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
‘ఏపీలో ఒక మాట.. తెలంగాణలో మరో మాట’
సాక్షి, కాకినాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా నిలువునా దగా చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రేపు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని బాలజీ చెరువు సెంటర్లో జరిగే ‘వంచనపై గర్జన’ దీక్ష ఏర్పాట్లను ఆ పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్, ఫ్రూటీ కుమార్లు గురువారం పరిశీలించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను బీజేపీ, టీడీపీ రెండు మోసం చేశాయని అన్నారు. చంద్రబాబు తన అవసరం కోసమే కాంగ్రెస్తో కలిశారని తెలిపారు. ఊసరవెల్లిగా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసుతో చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదులుకున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలో అవకాశవాద రాజకీయాలు చేయడం అలవాటేనని వ్యాఖ్యానించారు. టీడీపీతో టీఆర్ఎస్ పొత్తుకు తిరస్కరిస్తే.. చంద్రబాబు కాంగ్రెస్తో కలిశారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్తో పొత్తు ప్రతిపాదనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలను కాపాడుకునేందుకే చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. బాబు తన పార్టీ నేతలను కాపాడుకోవడానికి ఏపీలో సీబీఐని అడుగుపెట్టకూడదంటూ తీర్మానాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలను ఆకాక్షిస్తుందనే విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు కనుసన్నల్లో జనసేన నడుస్తుందని విమర్శించారు. జనసేనతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు ఏంటో చెప్పాలన్నారు. చంద్రబాబుది ధృతరాష్ట్రుడి కౌగిలి అని.. జనసేన అధ్యక్షుడు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పవన్ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. టీడీపీ అవినీతిని పవన్ పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రేపు జరిగే వంచనపై గర్జన దీక్షను విజయవంతం చేయాలని కోరారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రజలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాడానికి అన్ని సంఘాలు, విద్యార్థులు, యువత వంచనపై గర్జన దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
నయవంచనపై నాలుగో సమరభేరి
ఒక వైపు తెలుగుదేశం మరోవైపు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రాణాధార మైన ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఈ నేపథ్యంలో తొలినుంచి ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెబుతూ వైఎస్సార్ సీపీ సాగించిన అలుపెరగని పోరాటం చారిత్రక ప్రాధాన్యతను సంతరించు కుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై ధర్మ పోరాటం ముసుగులో చంద్రబాబు సాగిస్తున్న నయ వంచక రాజకీయాలను తూర్పారపడుతూ వైఎస్సార్ సీపీ కాకినాడలో రేపు గర్జన సభను నిర్వహస్తోంది. ఈ నెల 30న ‘నయవంచన’ పై గర్జన కాకి నాడలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే వైఎస్సార్ సీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం లోక్సభలో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన పంచపాండవులలాంటి ఎంపీలలో ఒక రైన వైవీ సుబ్బారెడ్డి సభను పర్యవేక్షించడం ఈ సంద ర్భంగా ప్రస్తావించుకోవాలి. ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా ప్రస్తుత పరిస్థితులలో ప్రాధా న్యత సంతరించుకుంది. మోదీ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం హోదా కోసం జరుపుతున్న క్రమం లోనే ఆమరణ నిరాహార దీక్ష సైతం ఢిల్లీ వేదికగా నిర్వహించి సమరశీలంగా పోరాడిన పార్టీ వైఎస్సార్ సీపీ. విభజన హామీల అమలు కొరకు పోరాటం అంటూ చంద్రబాబు దొంగ దీక్షలను మనం గుర్తుం చుకోవాలి. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పోరు, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, విశాఖలో రైల్వే జోన్, పోలవరం, నాణ్యతతో అవినీతి రహితంగా నిర్మించాలని చెబుతూనే రాజధాని పేరుతో సాగి స్తున్న అవినీతి, అక్రమాలు రైతుల భూములు ప్రభు త్వం కబ్జా చేసుకోవడం లాంటి సమస్యలపై జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేసింది. జగన్ సంవత్సర కాలంపైగా జరుపుతున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు అపూర్వ మద్దతు ప్రకటించారు. ప్రజలలో తన పాలన పట్ల వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తం కావడం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సంఘీభావం ప్రకటించడంతో చంద్ర బాబు కూడా ప్రత్యేకహోదాపై యూటర్న్ తీసుకో వడం, విభజన హామీలు అమలు పరచాలని మోదీ ప్రభు త్వంపై పోరాటం అంటూ నయవంచన ఉద్య మాలు చేయడం మనం గమనించాం. మైనార్టీలకు దగ్గర అయ్యేందుకు గుంటూరులో మైనార్టీలతో సదస్సు పెట్టి అభాసుపాలయ్యారు. ఆ సభలో మైనార్టీ సమ స్యలను ప్రస్తావించిన ముస్లిం యువకులపై దేశ ద్రోహ నేరం బనాయించడం చంద్రబాబు దిగజారు డుతనానికి నిదర్శనం. నాలుగు సంవత్సరాల పాల నలో నలుగురు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీలు కృష్ణా రావు, అజయ్కల్లామ్, ఎస్పీ టక్కర్, దినేష్ కుమార్ బాబు పంపిన అనేక ఫైళ్లలో సంతకాలు చేయడానికి గానీ, తమ ఆమోద ముద్ర వేయడానికి గానీ తిరస్క రించారు. తెలుగుదేశం పార్టీకి కంచు కోటలాగా ఉన్న ఉత్తరాంధ్రలో జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల విశేష స్పందన, మద్దతు లభించడంతోపాటు, ప్రతి పక్ష నాయకుడిపై హత్యాయత్నం సంఘటనను పాల కులే ప్రేరేపించారు అని నేడు ప్రజలు అర్థం చేసు కున్నారు. జగన్ ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరప బోయిన సభను అడ్డుకోవడం కోసం విశాఖ ఎయిర్ పోర్టులోనే నియనిబంధనలకు వ్యతిరేకంగా జగన్తో పాటు మరో ఇద్దరు ఎంపీలను నిర్బంధించి పోలీ సులు హైదారాబాద్కు వెనుతిరిగేటట్లు చేయడం మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్ష నేతపై విమానా శ్రయంలో జరిగిన హత్యా ప్రయత్నాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాయిలో బాబు కోడి కత్తి అంటూ వెటకా రంగా ఖండించడం సరైనది కాదని, కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఫోన్లో అయినా పలకరించకపోవడం పెద్ద తప్పు అని నిన్ననే సీనియర్ సీపీఐ నాయకుడు నారాయణ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, అసలు ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలని 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొనుగోలు చేయడం ఎంతటి బరితెగింపో మనం గమనించవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్సీపీ గర్జన కాకినాడలో 30 తేదీన చేపడుతోంది. ప్రత్యేక హోదాపై, విభజన హామీలపై ఎంతో నిర్ణయాత్మ కమైన పోరాటాన్ని పరిపక్వతతో, విజ్ఞతతో, దూర దృష్టితో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ జరుపుతున్న పోరాటం చారిత్రకత ప్రాధాన్యత సంత రించుకుంది. వైఎస్సార్సీపీ జరుపుతున్న నయ వంచన దీక్ష చంద్రబాబు మోసాలను, కుట్రలను, కుతంత్రాలను ఎండగట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాకినాడ సభకు జేజేలు. (నవంబర్ 30న కాకినాడలో వైస్సార్సీపీ గర్జన సందర్భంగా) వ్యాసకర్త : ఇమామ్, కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 -
‘వంచనపై గర్జన’ను విజయవంతం చేయాలి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, కాకినాడ : రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేసిన వంచనలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన కాకినాడలో ‘వంచనపై గర్జన’సభ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వంచనపై గర్జన సభలు జరిగాయి. ఐదో సభగా కాకినాడలో నిర్వహిస్తున్న వంచనపై గర్జనకు వేలాదిగా తరలి రావాలని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ. సుబ్బారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంచనపై గర్జన దీక్ష వేదిక ప్రదేశాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. బాలాజీ చెరువు సెంటర్లో ఈ నెల 30న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వంచనపై గర్జన దీక్ష ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దీక్షలో వైఎస్సార్సీసీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలలతో పాటు పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు తరలివస్తారన్నారు. ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకే ఈ దీక్షను చేపడుతున్నామని చెప్పారు. దీక్ష వేదిక ప్రదేశాన్ని పరిశీలించిన వారిలో సుబ్బారెడ్డితో పాటు, కోఆర్డినేటర్ లు ద్వారంపూడి, పెండెం దొరబాబు,దవులూరి దొరబాబు,పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, డా.సత్తి సూర్యనారాయణ రెడ్డి, నగర అధ్యక్షులు ఫ్రూటీ కుమార్ తదితరులు ఉన్నారు. -
వంచనపై గర్జించిన గుంటూరు
గుంటూరు గర్జించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా హోదాపై హామీ ఇచ్చి విస్మరించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తూర్పారబట్టింది. గుండెగుండెలో ఎగసిపడుతున్న హోదా ఆకాంక్షను ఢిల్లీ పాలకులకు కనబడేలా ఇన్నర్ రింగ్ రోడ్డులోని వీఏఆర్ మైదానంలో ఉప్పెనై ఎగసింది. ప్రాణాలను ఫణంగా పెట్టి నిరవధిక దీక్ష బూనిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే హోదా సాధ్యమని చాటిచెప్పింది. ఐదు కోట్ల ఆంధ్రుల బంగారు భవిష్యత్ ముడిపడిన హోదా సాధన కోసం తమ పదవులకు తృణప్రాయంగా రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యుల త్యాగాన్ని కొనియాడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. సాక్షి, అమరావతి బ్యూరో: ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని వీఏఆర్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ‘వంచనపై గర్జన’ దీక్ష సభకు అశేష జనవాహిని తరలివచ్చింది. సూర్యోదయంతోనే ఇన్నర్ రింగ్రోడ్డుపై మొదలైన జనప్రవాహం భానుడితో పోటీపడి అంతకంతకూ పెరుగుతూ జన ఏరుగా మారింది. అందరి అడుగులు వైదికవైపు జన ఉప్పెనలా సాగాయి. ఉదయం 9 గంటలకే తరలి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో దీక్షా స్థలి జనసంద్రంగా మారింది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. సభ ప్రారంభానికి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం జరిపిన పోరాటాలను, చేసిన ప్రసంగాలను వేదికపై ప్రదర్శించారు. సమరోత్సాహం నింపిన గర్జన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకట రమణ అధ్యక్షతన వంచనపై గర్జన సభ జరిగింది. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ ముఖ్యనాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రావి వెంకటరమణ, ఇతర నాయకులు పూలమాలుల వేసి నివాళులర్పించి దీక్షను ప్రారంభించారు. రావి వెంకటరమణ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ మోసాలను ఎండగట్టారు. ఉదయం పది నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 40 మందికిపై పార్టీ ముఖ్య నేతలు ప్రసంగించారు. ప్రత్యేక హోదా అవశ్యకతను వారు తమ ప్రసంగాల్లో చాటిచెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హోదా సాధన కోసం పడుతున్న కష్టాన్ని, గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను వివరించారు. నాయకుల ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా వంచనతో సాగిందని పార్టీనేతలు ఉదాహరణలతో వివరిం చారు. చంద్రబాబు గోత్రం మోసమని, ప్రత్యేక హోదాపై ఆయన చేసిన వంచన, దగాకు నిరసనగానే వంచనపై గర్జన చేపట్టామని వివరించారు. దోపిడీని ఎండగట్టిన నేతలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు మట్టి, ఇసుక, తెల్లరాయి దోపిడీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో ఎండగట్టారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో పంటలు ఎండి రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, టీడీపీ నాయకులు వివిధ రూపాల్లో కోట్ల రూపాయలు దండుకుంటున్న వైనాన్ని వివరించారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ వ్యవహా రాన్ని ఎండగట్టారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మాచర్ల ఎమ్మెల్యే, పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని చక్కదిద్దేం దుకే మంత్రి లోకేష్ పల్నాడులో పర్యటించారని దుయ్యబ ట్టారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పాపంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం ముస్లింలపై చూపుతున్న వివక్షను ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా వివరించారు. వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, పార్టీ ముఖ్య నేతలు ప్రసంగించారు. దీక్షకు తరలి వచ్చిన నాయకులు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బూడి ముత్యాలనాయుడు, కె.సంజీవయ్య, కళతూరు నారాయణస్వామి, కోరుముట్ల శ్రీనివాసులు, ఆదిమూలపు సురేష్, గౌరు చరిత రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సంకె వెంకటరెడ్డి, మేకా ప్రతాప అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, పి.అనిల్కుమార్యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్రెడ్డి, గంగుల ప్రభాకర్రెడ్డి, అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పీఏసీ మెంబర్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, మేరుగ నాగార్జున, జంగా కృష్ణమూర్తి, పూనూరి గౌతంరెడ్డి, షేక్ సలాంబాబు, చిల్లపల్లి మోహన్రావు, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త షేక్ ఇక్బాల్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, జోగి రమేష్, గుం టూరు, నరసరావుపేట పార్టమెంటరీ జిల్లాల అధ్యక్షులు రావి వెంకటరమణ, అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్, గుంటూరు అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహర్నాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెనీక్రిస్టీనా, మర్రి రాజశేఖర్, కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు, కార్యదర్శులు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), లక్కాకుల థామస్నాయుడు, ఎండీ నసీర్అహ్మద్, ఆరిమండ వరప్రసాద్రెడ్డి, నిమ్మకా యల రాజనారాయణయాదవ్, మిట్టపల్లి రమేష్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ గులాంరసూల్, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి, యెనుముల మురళీధర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు, రామిరెడ్డి, పలు విభా గాల నేతలు పాదర్తి రమేష్గాంధీ, దొంతిరెడ్డి వేమారెడ్డి, అంగడి శ్రీనివాసరావు, అత్తోట జోసఫ్, తనుబుద్ధి కృష్ణారెడ్డి, యేళ్ల జయలక్ష్మి, బూరెల దుర్గ, పానుగంటి చైతన్య, బం డారు సాయిబాబు, షేక్ జిలాని, సయ్యద్ మాబు, ఆళ్ల పూర్ణచంద్రరావు, సఫాయితుల్లా, మెట్టు వెంకటప్పారెడ్డి, జగన్ కోటి, పరసా కృష్ణారావు, పసుపులేటి రమణ, మాదిరెడ్డి శ్రీని వాసరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, వాకా శ్రీనివాసరెడ్డి, గనిక ఝాన్సీరాణి, షేక్ గౌస్, సోమి కమల్, షేక్ సుభాని, షేక్ రబ్బాని, మండేపూడి పురుషోత్తం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ కృషిచేశారు. మాజీ ఎంపీలనుసన్మానించిన న్యాయవాదులు ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులను తృణప్రాయంగా త్యజించిన మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వి.వరప్రసాద్, వై.ఎస్.అవినాష్రెడ్డిని గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు శాలువాలు కప్పి సన్మానించారు. వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించారు. హోదాతో ప్రయోజనం లేదు ప్యాకేజీ ముద్దు అంటూ ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశలను చంద్రబాబు నట్టేట ముంచారు. ప్రత్యేక హోదాతో పారిశ్రామికాభివృద్ధి, మరెన్నో ఇతర ప్రయోజనాలు ఉంటాయని గుర్తించిన మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ ప్యాకేజీ వద్ద హోదా కావాలంటూ పోరాడారు. ఆయనతోనే హోదా సాధ్యమవుతుంది. వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని సీఎం చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చేయి కలిపి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. కోడెల కుటుంబ సభ్యుల దోపిడీతో ప్రజలు అల్లాడిపోతున్నారు.–డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే మిన్నంటిన నినాదాలు గుంటూరు: నగరంలోని ఇన్నర్ రింగ్రోడ్డులో జరిగిన ‘వంచనపై గర్జన’ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు రోశయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, కాకాని రోడ్డు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డులోని వీఏఆర్ గార్డెన్స్లోని దీక్షా స్థలికి చేరుకుంది. తూర్పు నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, నాయకులు ప్రత్యేకహోదా జగన్తోనే సాధ్యం అంటూ మిన్నంటేలా నినాదాలు చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు వాకా శ్రీనివాసరెడ్డి, గనిక ఝాన్సీరాణి, కీసర వెంకటసుబ్బారెడ్డి, పల్ల శ్రీను, వాసిరెడ్డి విజయామాధవి పాల్గొన్నారు. టీడీపీ నేతల అక్రమార్జనను కక్కిస్తాం రైతులు, మహిళలు, కార్మికులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేకహోదా కావాలంటూ వైఎస్ జగన్ గుంటూరు వేదికగా అమరణదీక్ష సహా అనేక సందర్భాల్లో ఆందోళనలు చేవారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీ సభ్యుల వరకు మైనింగ్, మట్టి, ఇసుక, పింఛను ఇలా అన్నింట్లో రాష్ట్రాన్ని దోచేశారు. పల్నాడులో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అతని పార్టనర్ మంత్రి నారా లోకేష్ కలిసి రూ.300 కోట్ల వరకు మైనింగ్ దోపిడీ చేశారన్న ఆరోపణలతో హైకోర్టు విచారణకు ఆదేశించింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు అక్రమంగా సంపాదించి ప్రతి పైసా కక్కిస్తాం. – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,వైఎస్సార్ సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే గర్జన మోదీకి వినిపించాలి వంచనపై గర్జన ప్రధాని మోదీకి వినిపించాలి. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ, హోదా 15 ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు ప్రకటించి తెలుగు ప్రజలను వంచించారు. తిరుపతి ఎన్నికల సభలో వారిద్దరు హోదాపై హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారు. ముఖ్యమంత్రి రోజూ లక్షల కోట్లు ప్రజాధనం దోచుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం రెండు సార్లు రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినా ఆ తీర్మానాలను కేంద్రానికి పంపించకుండా చంద్రబాబు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్లు చేస్తున్న వారిపై చంద్రబాబు కేసులు పెట్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పదవులను హోదా కోసం త్యాగం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రాణాలు సైతం ఫణంగా పెడుతున్నారు. ప్రజలు మోదీకి, చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. – ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే ఓటుకు రూ.10 వేలు ఇస్తామంటారు టీడీపీ ఎప్పుడో ఓటమిని పసిగట్టింది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో భయపడుతున్నారు. అందుకే నేరుగా గెలవలేమని భావించి ప్రతి నియోజకవర్గంలోనూ సుమారు 40 వేల ఓట్లు తొలగిస్తున్నారు. దీనిపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పాలకులు దారుణంగా కాలరాయాలని చూస్తున్నారు. ఓటుకు రూ.10 వేలు ఇస్తామని కూడా టీడీపీ నాయకులు ఆశపెడతారు. ఈసారి ప్రజలు మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. వారంతా ఓటుతో కసి తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.– మొహమ్మద్ ముస్తఫా,గుంటూరు తూర్పు ఎమ్మెల్యే దొడ్డిదారిలో ఓట్ల తొలగింపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదని గుర్తించిన సీఎం చంద్రబాబు దొడ్డిదారిలో ఓట్ల తొలగింపునకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తల ఓట్లను తొలగింపజేస్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు పైకి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో డ్వాక్రా మహిళలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నాలుగేళ్లగా ఎన్నో ఆందోళనలు చేస్తోంది. – కోన రఘుపతి, బాపట్ల ఎమ్మెల్యే -
‘ ఆ రెండు పార్టీలూ ఏపీని మోసం చేశాయి’
సాక్షి, గుంటూరు : రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారధి ఆరోపించారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు కేబినేట్లో ఒక్క ముస్లింకు కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. మొన్నటివరకూ హోదా వస్తే పారిశ్రామిక రాయతీలు రావన్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకొని హోదా కావాలంటున్నారని విమర్శించారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు రెండు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. హోదా వద్దని ప్యాకేజీయే కావాలని చంద్రబాబు కోరడం వల్లే హోదా రాలేక పోయిందన్నారు. చంద్రబాబు నయవంచకుడని, ప్రజలు అతన్ని నమ్మే ప్రసక్తి లేదన్నారు. హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను చంద్రబాబు అవహేళన చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
పదవి కోసం కాదు..ప్రజల కోసం పాదయత్ర
-
గుంటూరులో ‘వంచనపై గర్జన’
-
‘లోకేష్ మాటలు వినడం మన ఖర్మ’
సాక్షి, గుంటూరు : 2019లో వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని వైఎస్సార్సీపీ నేత, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్పై నిప్పులు చెరిగారు. ‘లోకేష్లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన చరిత్ర మీ కుటుంబానికి లేదు’ అని విమర్శించారు. ఒక్కసారి జగన్ సీఎం అయితే జీవితాంతం అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భయం టీడీపీకి ఉందని ఎద్దేవా చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యం అవుతుందని తేల్చి చెప్పారు. -
‘అందుకే ఏ పార్టీకి ఓటెయ్యలేదు’
సాక్షి, గుంటూరు : ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి అన్యాయం చేస్తే.. సరిచేస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఏ పార్టీకి వైఎస్సార్సీపీ ఓటెయ్యలేదని పేర్కొన్నారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు.రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లోపల, వెలుపలా బీజేపీని నిలదీసిన ఎకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే టీడీపీ మాత్రం యూటర్న్ తీసుకొని ప్యాకేజీకి ఒప్పుకుందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం మొదటగా పెట్టింది వైఎస్సార్సీపీయేనని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు వారే బుద్ది చెబుతారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ ఎంపీలు రాజీనామ చేస్తే, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హోదాపై యుటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయి
-
ప్రత్యేకహోదా నినాదాన్ని బలహీనపరిచింది టీడీపీనే
-
‘వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా సాధ్యం’
సాక్షి, గుంటూరు : ఐదు, పది కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న వాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని.. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా కన్నా ప్యాకేజీయే గొప్పదన్నారని చెప్పారు. రాష్ట్రానికి హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హోదా కావాలన్నారని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం హోదా కంటే ప్యాకేజీయే గొప్పదని ప్రకటించారని, మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని, టీడీపీ స్టాండ్ ఇదేనని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యం అవుతుందని తేల్చి చెప్పారు. -
చంద్రబాబు నాయుడు కాదు.. పీకే నాయుడు
సాక్షి, గుంటూరు : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ రావు వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం, ప్రజల కోసం రాజీనామా చేసిన తృప్తి తనకుందని అన్నారు. చంద్రబాబు నాయుడు విభజన హామీలు సాధించలేని అసమర్థుడని విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబుకు విభజన హామీలేవి గుర్తుకు రాలేదని అన్నారు. సీఎంగా ఉన్న ఇన్నేళ్ల కాలంలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 10లక్షల ఉద్యోగాలు, 10లక్షల రేషన్ కార్డులను పీకేశారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా కడప స్టీల్ప్లాంట్ చంద్రబాబుకు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు 60 ప్రభుత్వ సంస్థలను మూసేశారని, గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతున్నాయని అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు కాదు.. పీకే నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పని వ్యక్తని అన్నారు. వైఎస్ జగన్ వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాజీనామా చేయమంటే దొడ్డి దారిన పారిపోయారు గుంటూరు : టీడీపీ ఎంపీలను రాజీనామా చేయమంటే దొడ్డిదారిన పారిపోయారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎంపీలను ఆయన అభినందించారు. దేశ రాజకీయాలన్నీ వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ సీపీ ట్రాప్లో టీడీపీ పడిందని లోక్సభలో మోదీ చెప్పారు.. హోదా సాధించే క్రమంలో వైఎస్సార్ సీపీ ఎందాకైనా పోరాతుందని ప్రధానీ మోదీ పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు. టీడీపీ ఎంపీల వేషాలన్నీ అయిపోయాయని, వారి వేషాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యమన్నారు. హోదా ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఏపీని చంద్రబాబు దోపిడీ చేశారు గుంటూరు : ఈ నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు దోపిడీ చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికి హోదా పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామా చేశారని తెలిపారు. చంద్రబాబు తన ఎంపీలను ఏరోజు కూడా హోదా కోసం పోరాటం చేయమని చెప్పలేదన్నారు. అవిశ్వాసం పెడతామని.. మద్దతివ్వమన్నా చంద్రబాబు ఒప్పుకోలేదని చెప్పారు. మోదీ భయంతోనే.. వైఎస్ జగన్ చేసిన తీర్మానానికి మద్దతివ్వలేదని పేర్కొన్నారు. లక్షల కోట్ల అవినీతి నుంచి తప్పించుకునేందుకు హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, మోదీలకు గుణపాఠం చెప్పాలన్నారు. -
చంద్రబాబు నాయుడు కాదు.. ఆయన పీకే నాయుడు
-
‘యూటర్న్ బాబు.. అందర్నీ వంచించాడు’
సాక్షి, గుంటూరు: హోదా పేరుతో ప్రజల్ని వంచించిన చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు హోదా కోసం పోరాడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. వీఏఆర్ గార్డెన్స్లో గురువారం జరిగిన ‘వంచనపై గర్జన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతోంది జగనేనని అన్నారు. హోదా అంశంపై యూటర్న్ తీసుకున్న చంద్రబాబు రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అందర్నీ మోసం చేశాడని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు హోదా కోసం ధర్మ పోరాటం అని కొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తొక్కిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు దొంగ నాటకాలు ఇక సాగనీయమని హెచ్చరించారు. రాష్ట్రానికి హోదా రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాక్షించారు. -
చంద్రబాబు మహా మాయావీ
-
‘చంద్రబాబు హోదా తేలేని అసమర్థుడు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని అసమర్థుడని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి చంద్రబాబు, మోదీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి, నరేంద్ర మోదీ ప్రధాని అయినా ఏపీకి హోదా రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వంచనపై గర్జన దీక్షను టీడీపీ, బీజేపీ వంచనపై గర్జనగా అభివర్ణించారు. ఎంపీలందరూ రాజీనామా చేద్దామంటే టీడీపీ ఒప్పుకోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేసిన సంగతిని గుర్తుచేశారు. హోదా కోసం ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు యూటర్న్పై పీడీ కేసు పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు,విద్యార్థులు, డ్వాక్రామహిళలు సహా అన్ని వర్గాలను చంద్రబాబు వంచించారని మండిపడ్డారు. -
‘చంద్రబాబు, మోదీలు ప్రజా ద్రోహులుగానే మిగిలిపోతారు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులో తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 600 హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం వంచనతోనే ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగానే వంచనపై గర్జన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేస్తున్న వంచనను ప్రజలకు చెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీకి హోదా అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు, మోదీలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ధర్మపోరాటాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ధర్మపోరాటల పేరుతో ప్రజలను వంచిస్తోందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పటివరకు పోరాటం చేయలేదని తెలిపారు. బాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే వంచనపై గర్జన దీక్ష చేపట్టామన్నారు. చదవండి: గర్జనకు సిద్ధం వంచనపై వైఎస్సార్ సీపీ ‘యువ’గర్జన -
గర్జనకు సిద్ధం
హోదా పదేళ్లు ఇస్తామని మోదీ, కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రగల్భాలు పలికారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామంటూ నమ్మబలికి ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. అప్పటి నుంచి హోదాను పక్కకు నెట్టారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఊరూరా గళం విప్పారు. ఈ ఉద్యమాన్ని పాలకులు అధికారంతో అణగదొక్కే ప్రయత్నం చేశారు. చివరకు కమీషన్ల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి తలూపి హోదాను తాకట్టు పెట్టారు. ప్రజలు భగ్గుమనడంతో చంద్రబాబు మళ్లీ హోదా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మరోసారి రాష్ట్రాన్ని వంచించేందుకు నడుం బిగించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్ సీపీ నేతలు దీక్ష బూనారు. టీడీపీ దురాగతాలను ఎండగట్టనున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : వంచనపై గర్జన దీక్షకు సర్వం సిద్ధమైంది. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువభేరిలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే దీక్షలు, వంటా వార్పులు ఇలా అనేక రకాల ఉద్యమాలతో పోరాటం సాగించారు. ఈ క్రమంలో గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో రాష్ట్ర స్థాయి దీక్ష చేపట్టారు. నగరంలోని ఇన్నర్రింగ్ రోడ్డులోని వీఏఆర్ గార్డెన్స్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. బీజేపీ, టీడీపీ కుట్రను ఎండగట్టేందుకే.. ఇప్పటికే గుంటూరులోని వీఏఆర్ గార్డెన్స్లో దీక్ష స్థలిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులు నాలుగేళ్ళ క్రితం వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పక్కకు నెట్టేశారు. హోదా కాదు, ప్యాకేజీ అంటూ ప్లేటు ఫిరాయించారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. చివరకు పదవులకు రాజీనామా చేసి హోదా ఉద్యమాన్ని ఢిల్లీకి తాకించారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుని ప్రజలను మరోసారి వంచిస్తోంది. ఈ మోసాలను ప్రజలకు వివరించి.. హోదా గళం వినిపించేందుకు వంచనపై గర్జన పేరుతో సింహనాదం చేయనున్నారు. హోదాపై ప్రజలను చైతన్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దీక్ష ఏర్పాట్లను పరిశీలించిన నేతలు.... దీక్షా స్థలిలో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు, దాదాపు 250 మందికిపైగా కూర్చునేందుకు వీలుగా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఐదు వేల మందికిపైగా కార్యకర్తలకు సీటింగ్లు ఉండేలా చూస్తున్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా పరిశీలకులు బొత్స సత్యనారాయణ, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, గురజాల, పెదకూరపాడు సమన్వకర్తలు కాసు మహేష్రెడ్డి, కావటి మనోహర్నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బూరెల దుర్గ, ఎస్సీ విభాగం నాయకులు సాయిబాబా, ఆళ్ళ పూర్ణచంద్రరావు, మేరువ నర్సిరెడ్డి, పరస కృష్ణారావు, పసుపులేటి రమణ, మెట్టు వెంకటప్పారెడ్డి, బండారు సాయిబాబు, తనుబుద్ధి కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు. -
రేపు గుంటూరులో వంచనపై గర్జన దీక్ష
-
‘హోదా’ వంచకులకు బుద్ధి చెప్పాలి
అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ అనంతపురం అర్బన్/అనంతపురం అగ్రికల్చర్: ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను వంచించిన కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. విభజన సంద ర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల న్నింటీనీ అమలుచేయాల్సిన చట్టపరమైన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉందని.. అలాగే, హోదా సాధించుకోవాల్సిన కర్తవ్యం టీడీపీ ప్రభుత్వాని దన్నారు. అయితే, ఈ రెండూ తమ ధర్మం నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆరోపించారు. హోదాపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రెండూ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ అనంత పురం జిల్లా కేంద్రంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన 3వ ‘వంచనపై గర్జన’ దీక్షలో ప్రసంగించిన పలువురు నేతలు ప్రత్యేక హోదా సాధించాలన్న తమ ఆకాంక్ష తిరుగులేనిదని, తుదికంటూ పోరాడి విజయం సాధించి తీరుతామని పార్టీ శ్రేణులను, ప్రజలను ఉత్తేజితులను చేశారు. కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ గర్జనకు భారీఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. పదవీ త్యాగం చేసిన పార్టీ తాజా మాజీ ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. అంతకుముందు.. ఉ. 9 గంటలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి దీక్షను ప్రారంభించారు. సా.4 గంటలకు ముగించారు. 7 గంటల పాటు సాగిన ఈ గర్జనలో నేతల ఉపన్యాసాలు ఆద్యంతమూ ప్రజలను ఆకట్టుకున్నాయి. నాలుగేళ్లుగా ఏం చేశారు? ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి చేయకుండా నాలుగేళ్లుగా ఏం చేశారు? ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలంటూ ఎందుకు బయలుదేరారు? అని వక్తలు సీఎంను నిలదీసినపుడు సభికుల నుంచి హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు చేసే దీక్షలో ధర్మం లేదు.. పోరాటం అంతకంటే లేదు.. ఇదంతా తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న దీక్షలే అని అంటున్నప్పుడు ప్రజలు పెద్దగా ఈలలు వేస్తూ స్వాగతించారు. చంద్రబాబు చాలా తెలివైన మోసగాడని, సమయాన్ని బట్టి ప్రజలను మభ్యపెట్టడంలో ఆయనది అందె వేసిన చేయి అని నేతలు దుయ్యబట్టినప్పుడు కూడా చప్పట్లు మార్మోగాయి. నాలుగేళ్ల విలువైన కాలంలో ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు ఆ నిందలను కేంద్రంపై వేస్తూ ప్రజలను మరోసారి వంచించడానికి వస్తున్నారని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మోసపోరాదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రజలను కోరారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. తాను మోదీ చేతిలో దారుణంగా మోసపోయానని చెప్పుకోవడం క్షమించరాని నేరమని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, చంద్రబాబు 40ఏళ్ల అనుభవం బీజేపీ చేతిలో మోసపోవడానికి పనికి వచ్చిందా? ఇది నాలుగేళ్ల తరువాత తెలిసి వచ్చిందా? అని నాయకులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా లేనిదే ఆంధ్రప్రదేశ్ మనుగడ కష్టమని, అందుకే వచ్చే ఎన్నికల్లో 25కు 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ను గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే ఏ ప్రభుత్వాన్నైనా ఒత్తిడి చేసి హోదా సాధించుకోవచ్చన్నారు. ‘అనంత’ గర్జించాలి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనంతపురం జిల్లాకు ఎంతో మేలు చేసినా.. ప్రజలకు జగన్పై ఆదరాభిమానాలు మెండుగా ఉన్నా 2014 ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగాను రెండింటిలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారని వక్తల్లో కొందరు ప్రస్తావిస్తూ.. ఈసారి జరిగే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతి, అసమర్థ, వంచన పూరిత పాలనపై గర్జించాలని.. జిల్లాలోని 14కు 14 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరినపుడు సుమారు ఒకటిన్నర నిమిషంసేపు ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అరుపులు, ఈలలు, కేరింతలతో కూడిన ఆమోదం లభించింది. రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన ఒక్క అబద్ధపు హామీ కష్టాల్లో ఉన్న రైతాంగంపై బాగా పనిచేసిందని అందుకే 2014 ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేశారన్నారు. జగన్ కూడా అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, అలాంటి తప్పుడు హామీ ఇవ్వడానికి జగన్ అంగీకరించలేదని నేతలు వివరించారు. దీక్షలో లభించిన స్పందన ప్రజల ఆలోచనల్లో మార్పునకు అద్దంపడుతోందని వారు పేర్కొన్నారు. చేయీ చేయీ కలుపుదాం జగన్ను సీఎం చేద్దాం కాగా, దీక్ష సాగినంత సేపూ ప్రాంగణం మొత్తం సాధారణ ప్రజలతో కిటకిటలాడింది. వేదికపై దీక్ష చేస్తున్న నేతలకు సంఘీభావం తెలపడానికి జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. నగరంలో దాదాపుగా అన్ని వార్డుల నుంచీ పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు, యువత వచ్చారు. మైనారిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముస్లిం మహిళలు ప్రత్యేకంగా వేదికపైకి వచ్చి దీక్ష మధ్యలో దివంగత వైఎస్ చిత్రపటానికి భారీ పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చేయీ చేయీ కలుపుదాం.. జగనన్నను సీఎం చేసుకుందాం.. వైఎస్సార్ అమర్ రహే! జై జగన్! చంద్రబాబు నయవంచక పాలన నశించాలి! మోసం.. మోసం.. చంద్రబాబు పాలన వట్టి మోసం అనే నినాదాలు చేసుకుంటూ జనం దీక్షా స్థలికి తరలివచ్చారు. దీంతో అనంతపురం నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ కోలాహలమైన వాతావరణం కనిపించింది. కాగా, కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, మిథున్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రైతు కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ఇదిలా ఉంటే.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వేపచర్ల తండాకు చెందిన రైతు కేశవనాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియాను పార్టీ తరఫున అందిస్తున్నట్లు అనంతపురం జిల్లా ఇన్చార్జి, మాజీ ఎంపీ మిథున్రెడ్డి సభలో ప్రకటించారు. ప్రతి ఇంటికీ ఏటా రూ.లక్ష నుంచి ఐదు లక్షల లబ్ధి – ‘వంచనపై గర్జన’ సభలో నవరత్నాల పోస్టర్లు ఆవిష్కరణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏడాదికి ఎంతలేదన్నా రూ. ఒక లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి కలుగుతుందని పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి రూపొందించిన నవరత్నాల పోస్టర్లను నేతలు ‘వంచనపై గర్జన’ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రజాసంక్షేమం కోసం వైఎస్ జగన్ ‘నవరత్నాల’ పేరిట వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆసరా, మద్యపాన నిషేధం, ఫీజు రీయింబర్స్మెంట్, పేదలందరికీ ఇళ్లు, పింఛన్ల పెంపు, జలయజ్ఞం వంటి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. దీక్షలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు వంచనకు గురిచేసిన చంద్రబాబు, మోదీ రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ఇద్దరూ నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను వంచించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తారని రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే వారి ఆశలను అడియాశలు చేశారు. వైఎస్ హయాంలోనే 80శాతం పూర్తయిన హంద్రీ–నీవా ప్రాజెక్టు ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేని దుస్థితిలో ఉంది. – అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ, ‘అనంత’ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నా రాష్ట్రాభివృద్ధి కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నా. చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి. హోదా వద్దని.. ప్యాకేజీ ముద్దు అని ఆయన చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం. రైతులు, మహిళలు, యువకులతో పాటు అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారు. దేవుడిని రోజూ ఎలా తలుచుకుంటామో అలాగే తనను తలచుకునేలా దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి సంక్షేమ పథకాలు అమలుచేశారు. మీ నాలుగేళ్ల పాలనలో ఏం సాధించారు చంద్రబాబు? ఒక్కసారైనా స్వతంత్రంగా సీఎం అయ్యారా!? – వరప్రసాద్, మాజీ ఎంపీ చంద్రబాబు నయవంచకుడు ప్యాకేజీయే లాభమంటూ రాష్ట్ర ప్రజలను మోసగించి హోదా కోసం పోరాటం చేసిన వారిపై కేసులు నమోదు చేయించి మానసిక క్షోభకు గురిచేసిన నయవంచకుడు చంద్రబాబు. ప్రజల కోసం నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తోంది వైఎస్సార్సీపీ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 2 ఎంపీ స్థానాలతోపాటు 14 ఎమ్మెల్యే సీట్లను గెలిపించి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందాం. – మిథున్రెడ్డి, మాజీ ఎంపీ, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ వైఎస్ జగన్ కష్టం వృథా కాకూడదు ముఖ్యమంత్రి చంద్రబాబు గాలి మాటలు చెబుతూ గాల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పడుతున్న కష్టం వృథా కాకూడదు. ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. – వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దళితులను మోసగించారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారు. భావితరాలను కాపాడుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచి హోదా కోసం ఉద్యమిస్తున్నారు. హోదాతో ఏం లాభమని చెప్పిన చంద్రబాబు ఈరోజు జగన్ బాట పట్టారు. దళితుల కోసం టీడీపీ చేపడుతున్న దళిత తేజం వాస్తవానికి దళితులను వంచించే తేజం. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు కాజేశారు. – మేరుగ నాగార్జున ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాని, సీఎం విఫలం రాష్ట్రానికి చట్ట ప్రకారం రావాల్సిన హక్కులను నెరవేర్చడంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. నాలుగేళ్లు రెండు పార్టీలు కలిసి కాపురం చేసి ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నానికి తెర తీస్తున్నాయి. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా అధికారంలో ఉన్న నాలుగేళ్లు పట్టించుకోలేదు. ఈ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ అమలుచేస్తామని చెప్పి దానినీ పట్టించుకోలేదు? ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించే వైఎస్ జగన్ తొలి నుంచి పోరాడుతున్నారు. జగన్ ఉద్యమాలను రెండు పార్టీలు హేళన చేశాయి. ఉద్యమకారులపై కేసులు బనాయించారు. – బొత్స సత్యనారాయణ, పార్టీ సీనియర్ నేత ‘అనంత’ ఉద్యమ స్ఫూర్తితో హోదా సాధిస్తాం అనంతపురం జిల్లా ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధించడానికి కృషి చేస్తాం. చంద్రబాబు చేస్తున్న మోసాలు, దాష్టీకాలు, అన్యాయాన్ని చూస్తున్న రాష్ట్ర ప్రజలు టీడీపీని ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారు. అందుకే జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో టీడీపీ నేతల్లో ఓటమి భయం వెంటాడుతోంది. హోదా అవసరమే లేదంటూ ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోసకారి చంద్రబాబు చంద్రబాబు ఒక మోసకారి. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు. హోదా రాకపోవడంలో మొదటి ముద్దాయి మోదీ అయితే రెండో ముద్దాయి చంద్రబాబు. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. దీక్షలు, ధర్నాలు, యువభేరీలు నిర్వహించి యువతలో చైతన్యం తెచ్చారు. హోదా సంజీవనా? అన్న చంద్రబాబే ఈరోజు హోదా పల్లవి అందుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేం ఐదుగురు ఎంపీలం రాజీనామాలు చేశాం. దాన్ని కూడా వక్రీకరించిన దుర్మార్గుడు చంద్రబాబు. – మేకపాటి రాజమోహన్రెడ్డి, మాజీ ఎంపీ -
వంచనపై గర్జన దీక్ష
అనంతపురం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆలసత్వానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలో జరగనుంది. జూలై 2న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనంతపురం టవర్ క్లాక్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో (ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా) జరిగే ఈ దీక్షకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా లోక్సభ సభ్యత్వాలను త్యాగం చేసిన వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడో గర్జన ప్రత్యేక హోదా విషయంలో ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్న కుట్రలను ఎండగట్టడానికి వైఎస్సార్సీపీ నేతలు తొలిసారిగా విశాఖపట్నంలో ఏప్రిల్ 29న వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహించారు. రెండోసారి జూన్ 2న నెల్లూరు జిల్లా కేంద్రంలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచడానికి మూడోసారి సోమవారం అనంతపురంలో వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. నాలుగేళ్లుగా అలుపెరుగని పోరు విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి సాధించాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలుగెత్తి చాటుతున్నారు. హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా, కుయుక్తులు పన్నుతున్నా లెక్కచేయకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. గుంటూరులో ఆయన చేపట్టిన అమరణ నిరాహార దీక్షను టీడీపీ ప్రభుత్వం భగ్నం చేసింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తూనే ఉంది. ఈ క్రమంలో పార్టీకి చెందిన ఐదుగురు లోక్సభ సభ్యులు రాజీనామా చేశారు. హోదా ఆకాంక్షను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించిన సీఎం చంద్రబాబు సైతం చివరకు యూటర్న్ తీసుకోక తప్పలేదు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, అధికారం అనుభవించిన చంద్రబాబు ఇప్పుడు హోదా ఉద్యమం పేరిట దొంగ దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పోరాటంలోని అధర్మాన్ని, మోసాన్ని బహిర్గతం చేయడంతోపాటు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వంచనపై గర్జన దీక్షలు నిర్వహిస్తున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. నల్ల దుస్తులతో దీక్ష అనంతపురంలో వంచనపై గర్జన నిరాహార దీక్షలో పాల్గొననున్న నేతలందరూ నల్లటి దుస్తులు ధరించి నిరసన తెలపాలని వైఎస్సార్సీపీ సూచించింది. పార్టీ అగ్రనేతలు ఆదివారం రాత్రి నుంచే అనంతపురానికి చేరుకున్నారు. సోమవారం ఉదయానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు అనంతపురం చేరుకోనున్నారు. -
జూలై 2న వంచనపై గర్జన దీక్ష: వైఎస్సార్సీపీ
సాక్షి, అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జూలై 2న వంచపై గర్జన దీక్షను నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ వైఎస్సార్సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీక్ష అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ దీక్షలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేసిన నేతలతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొంటారని ఆయన అన్నారు. దీక్షలో పాల్గొనే నేతలంతా ఆ రోజున తప్పనిసరిగా నల్లదుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన హామీల అమలు కాకపోవడానికి కారణం సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించారు. -
అనంతలో వైఎస్ఆర్సీపీ వంచనపై గర్జన