venkat
-
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
‘శివరామరాజు’ ఫేమ్ వెంకట్ హీరోగా ‘హరుడు’... ఆకట్టుకుంటున్న గ్లింప్స్
శివరామరాజు ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం హరుడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న హరుడు చిత్రం గ్లింప్స్ శనివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు.అనంతరం నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ చాలా బాగున్నాయి. మంచి విజయం సాధించాలని కోరుకుంటన్నా అన్నారు.దర్శకుడు రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ, ముందుగా నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి కి థ్యాంక్స్. ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేశారు. వెంకట్ గారితో ఐదేళ్ళ జర్నీ వుంది. లవర్ బాయ్ గా చేసిన ఆయన మాస్ హీరోగా ఇందులో చేశారు. నటశాసింగ్ కూడా నటించింది. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు. నాకు దర్శకుల టీమ్ సపోర్ట్ గా వుండడంతో అవుట్ పుట్ బాగా వచ్చింది అన్నారు.హీరో వెంకట్ మాట్లాడుతూ, హరుడు చిత్రం కమర్షియల్ ఎలిమెంట్ తో మాస్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయింది. నిర్మాత డాక్టర్ అయినా... సినిమా పై తపనతో వచ్చారు. ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. నాకు పవర్ ఫుల్ రోల్ దర్శకులు ఇచ్చారు. మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర వుంటుంది. డబ్బింగ్ లో ఆమె నటన చూశాను. అలాగే నటశాసింగ్ మరో పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్ లో సలోని చేశారు. ఇందులో ఐదు పాటలున్నాయి. సంగీత దర్శకుడు మణి జెన్నా మంచి బాణీలు ఇచ్చారు. మాస్ సినిమాకు ఫైట్స్ కీలకం. శివరాజ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. లోగడ షూటింగ్ లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే కొంత గేప్ కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. -
హారర్ సినిమాలు అంటే అమెరికా వాళ్ళు పడి చస్తారు..
-
తెలుగు కామెడీ సినిమాలు చూస్తే నాకు అసలు నవ్వు రాదు..
-
మాస్ హరుడు
‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు’ వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ కమ్ బ్యాక్ ఇస్తున్న చిత్రం ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, సలోని, శ్రీహరి, నటషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈట ప్రవీణ్ రెడ్డి, ఈట దిక్కల లక్ష్మణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘హరుడు’ రూపొందుతోంది. వెంకట్గారికి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. నవంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నా హాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మని జీన్న, కెమెరా: డి, సన్నీ, ఆనంద్. -
కొడుకుని కత్తితో పొడిచాడని.. భర్తపై భార్య ఘాతుకం!
పశ్చిమగోదావరి: భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త మృత్యువాత పడగా, కుమారుడు కత్తిపోటు గాయానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంకు చెందిన గుల్లంకి వెంకట్ (44), ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పార్వతికి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే పది ఏళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. వెంకట్ తన స్వగ్రామం తాడేపల్లిగూడెంలో ఉంటుండగా, పార్వతి తన ఇద్దరు పిల్లలతో ఉండ్రాజవరంలో ఉంటోంది. వెంకట్ అప్పుడప్పుడూ వచ్చి పార్వతిని తనతో వచ్చేయమని గొడవ పడుతుండేవాడు. ఇటీవల కుమార్తె పెళ్లి కారణంగా వచ్చిన వెంకట్ పది రోజుల నుంచి ఉండ్రాజవరంలోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి పార్వతిని తనతో వచ్చేయాలంటూ మళ్లీ గొడవకు దిగాడు. దీంతో భార్య పార్వతి, కొడుకు కృష్ణవంశీతో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కృష్ణవంశీని వెంకట్ కత్తితో పొడిచాడు. కొడుకు కత్తిపోటుకు గురికావడంతో చలించిన పార్వతి ఒక్కసారిగా భర్తపై ఇటుకతో దాడికి పాల్పడింది. వెంకట్ దాడిని ప్రతిఘటించే క్రమంలో తల్లీకొడుకు ఇద్దరూ కలిసి ఇటుకలతో వెంకట్ తలపై కొట్టడంతో వెంకట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తేరుకున్న పార్వతి గాయపడిన భర్త, కొడుకును తణుకు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా వెంకట్ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు నుంచి ఏలూరు, అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. గురువారం తెల్లవారుజామున వెంకట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. కొడుకు కృష్ణవంశీ ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉండ్రాజవరం ఎస్సై వి.అప్పలరాజు కేసు నమోదు చేయగా, నిడదవోలు సీఐ కె.వెంకటేశ్వరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: వివాహానికి హాజరై తిరిగొస్తుండగా.. -
జడ్జి కుమారుడిపై ఫిర్యాదు తీసుకోరా?
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్స్టేషన్.. ఏమన్నా పర్యాటక కేంద్రం అనుకుంటున్నారా? ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కాకుండా సందర్శనకు వస్తుంటారా? జ్యుడీషియల్ అధికారి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే తీసుకోరా? దేశంలో ఎవరిపై ఫిర్యాదు చేసినా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియదా? ఓ మహిళ పోలీస్ స్టేషన్కు వచ్చి వేధింపుల ఆరోపణలు చేసి.. ఆ విషయంలో కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో శుక్రవారం నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి. ఏ కారణాలతోనైనా న్యాయస్థానం ముందు హాజరుకాకుంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం’ అని కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ ఓదెల వెంకట్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను శుక్ర వారానికి వాయిదా వేసింది. సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్కు ఆదేశాలు కరీంనగర్ జిల్లాకు చెందిన రమ్య కోర్టులో ఆఫీస్ సబార్డి నేట్గా నియమితురాలయ్యారు. అయితే సెషన్స్జడ్జి కుమారుడు తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన విద్యార్హత, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని దాచి పెట్టిందంటూ ఆమెను సర్వీసు నుంచి తొలగించారు. ఇదే విషయంపై ఆమె రెండు రోజుల క్రితం హైకోర్టును ఆశ్ర యించారు. సీజే ధర్మాసనం ముందుకు ఈ అంశం రావడంతో సదరు సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఎస్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ న్యాయవాది రూపేందర్కు హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా జడ్జి కుమారుడు.. చట్టానికి అతీతుడా? ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాము ఆదేశించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కోర్టు ఆదేశాలను ఎస్హెచ్ఓకు సరిగా తెలియజేయలేదా? లేక ఆ మహిళ పీఎస్కు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదనే కారణంతో ఎస్హెచ్ఓను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా అని జీపీపై అసహనం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఆదేశాలున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ నిర్లక్ష్యం ప్రదర్శించారు. పీఎస్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళను వేచి ఉండాల్సిందిగా కోరడం రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించడమే. ఇది సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితి. నిందితుడు జిల్లా జడ్జి కుమారుడన్న కారణంగా ఎస్హెచ్ఓ నిందితుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అతను చట్టానికి అతీతుడా? చట్టం ప్రకారం పరిపాలించే సమాజంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఈ ఘటన మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏఏజీని పిలిపించిన ధర్మాసనం..: విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)ని ధర్మాసనం కోర్టు హాల్కు పిలిపించింది. ‘కొందరు జీపీలపై ఆధారపడవద్దు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించినా.. ఎస్హెచ్ఓ ఉల్లంఘించారు. అంతేకాదు ఫిర్యాదు దారుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీఎస్లో నిరీక్షించేలా చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సూచించే ధైర్యం కూడా మీ న్యాయాధికారులకు లేదు. ఇది నిజంగా దిగ్భ్రాంతికర విషయం’ అని వ్యాఖ్యానించింది. ఎస్హెచ్ఓను తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. -
అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా, మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్తో పాటు వెంకట్ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ ఇద్దరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. నిజానికి మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, బుధవారం అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. జగ్గారెడ్డికి బీ ఫారాలపై సంతకాల అధికారం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఫారాలిచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్జికి ఇచి్చంది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదిత సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతిపిన్న వయస్కుడిగా మండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్న వారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటివరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్ శాసనమండలికి ఎన్నిక కావడమే రికార్డు అని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమిస్తారని గాంధీభవన్ వర్గాల సమాచారం. -
Tikamaka Thanda: ఊరందరికీ మతిమరుపు ఉంటే..?
ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్న సినిమా తికమకతాండ. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనే కథాంశం.ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ : ట్విన్స్ రామ్ హరి హీరోలుగా ఒక కొత్త ప్రయోగంతో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. వేరే బిజినెస్ లు చేస్తున్న మా పిల్లలకి సినిమా పైన ఉన్న మక్కువతో వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని నిర్మించాం. ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చాడు. మనందరికీ తెలుసు ఊరంతా మతిమరుపు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళు పడే ఇబ్బందులు బాధలు ఎలా ఉంటాయి. కామెడీగా ఉంటూనే మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది’అన్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ : తెలంగాణలోని ఒక మంచి విలేజ్ నెట్వర్క్ లేని చోట అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమాని చిత్రీకరించాం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన వస్తుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ నెల 15న థియేటర్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మా సినిమాని ప్రేక్షకులు అందరూ చూసే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. -
దీపావళి మనసుని హత్తుకుంటుంది
‘‘ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ చిన్నదైనా అందమైన సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ అన్నారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కీడా’ (తెలుగులో ‘దీపావళి’). కృష్ణ చైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా 38 ఏళ్ల జర్నీలో దాదాపుగా నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. నేను డబ్బుల గురించి ఆలోచించను. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుందా? లేదా అని మాత్రమే ఆలోచిస్తా. కథ పూర్తయ్యాకే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళతాను. ఓ సినిమా పూర్తయ్యాకే మరొకటి చేస్తాను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. ‘దీపావళి’ కథనిప్రాణం పెట్టి రాశాడు వెంకట్. చెప్పిన కథను చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. మా సినిమా ఇండియన్ పనోరమాకి ఎంపికవడం గొప్ప అనుభూతి. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఇక రామ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఇందుకు సరైన కథ కుదరాలి’’ అన్నారు. -
ఇరవై ఏళ్లకు నా కల నెరవేరింది
‘‘ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నాకు ‘దీపావళి’ కథ ఆలోచన పుట్టింది. పల్లెటూరు, అక్కడి ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్ చేస్తూ భావోద్వేగాలతో ‘దీపావళి’ తీశాను’’ అని దర్శకుడు ఆర్ఏ వెంకట్ అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారి తమిళంలో నిర్మించిన చిత్రం ‘కీడా’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘మాది తమిళనాడు. 2003లో చెన్నైలో ఆఫీస్ బాయ్గా నా జీవితం ప్రారంభించి, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్గా చేశాను. దర్శకునిగా ‘దీపావళి’ నా తొలి సినిమా. 20 ఏళ్ల తర్వాత నా కల నిజమైంది. రవికిశోర్గారి తొలి తమిళ సినిమాకు నేనే డైరెక్టర్ అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంది. నా తర్వాతి సినిమా కోసం ఎమోషనల్ పాయింట్తోనే ఓ కథను సిద్ధం చేస్తున్నాను. రవికిశోర్గారికి నచ్చింది. ఈ సినిమాని ఓ స్టార్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. -
Madhapur: డ్రగ్స్తో పాటు వ్యభిచారం కూడా!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో కోణం బయటపడింది. డ్రగ్స్ పార్టీలతో పాటు వ్యభిచారం దందా కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో కేసులో దర్యాప్తులో లోతుకు పోయే కొద్దీ మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాదాపూర్లోని విఠల్ రావు నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులకు.. దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. గతంలోనూ వెంకట్, బాలాజీలపై వ్యభిచార నిర్వహణ కేసులు ఉన్నట్లు తేలింది. తాజాగా మాదాపూర్లోని అపార్ట్మెంట్లో డ్రగ్స్ పట్టుబడగా.. ఫ్లాట్లో ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు ఉండడంతో వ్యభిచార దందా గుట్టురట్టయ్యింది. పలు చిత్రాలకు ఫైనాన్షియర్గా వ్యవహరించిన వెంకట్ ఈ డ్రగ్స్ సప్లై ప్రధాన సూత్రధారిగా తేలింది. సినిమా వెంకట్తో పాటు బాలాజీలు ఆ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాల పేరిట ఆ ఇద్దరినీ రెండు రోజులుగా అదే అపార్ట్మెంట్లో ఉంచినట్లు సమాచారం. ఈ అసాంఘిక కార్యకలాపాల కోసం రూమ్ నెంబర్ 804ను ఉపయోగించుకుంటున్నారు. వారానికి చొప్పున సర్వీస్ అపార్ట్మెంట్ను రెంటుకు తీసుకొని డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ దందాలతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే.. గతంలోనూ వ్యభిచారం నిర్వహిస్తుండగా రెండుసార్లు ఈ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సోదాల్లో అధికారులు వెంకట్ దగ్గర నుంచి 15 గ్రాముల ఎండిఎంఏ, 30 ఎల్ ఎస్ టి పిల్స్ తొ పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వెంకట్.. తాను ఉపయోగించడంతో పాటు మరికొందరికి అమ్ముతున్నట్లు గుర్తించారు. వెంకట్, బాలాజీ డ్రగ్ కస్టమర్లు ఎవరు? సినీ పరిశ్రమలో ఎవరైనా ఉన్నారా? అనేదానిపై నార్కోటిక్ టీమ్ ఆరాలు తీస్తోంది. -
సీఎంను కలిసిన ‘గల్ఫ్ సమన్వయకర్తలు’
సాక్షి, అమరావతి: గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయకర్తలు, వైఎస్సార్సీపీ కన్వినర్లు గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. గల్ఫ్ దేశాల్లోని ఏపీ వాసులకు అందిస్తున్న సాయం.. వారి సంక్షేమా చర్చించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నట్లు వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం(మైనార్టీ వెల్ఫేర్) అంజాద్ బాషా, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి, కువైట్ ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్లు నాయని మహేష్రెడ్డి, ఎంవీ నరసారెడ్డి, దుబాయ్ కోఆర్డినేటర్ సయ్యద్ నాసర్ వలీ, వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వినర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వి నర్ ముమ్మడి బాలిరెడ్డి, ఖతార్ కన్వి నర్ డి.శశికిరణ్, దుబాయ్ కన్వినర్ సయ్యద్ అక్రమ్, సౌదీ అరేబియా కన్వినర్ రెవెల్ ఆంథోని తదితరులు పాల్గొన్నారు. సీఎంకు హజ్ పవిత్ర జలం డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా, హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి హజ్ పవిత్ర జలాన్ని అందజేశారు. -
ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంతో వస్తున్న 'బెల్'
ప్రొగన్ మూవీస్ పతాకంపై పీటర్ రాజ్ నిర్మించి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'బెల్'. వెంకట్ భువన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు గురుసోమసుందరమ్, శ్రీధర్ మాస్టర్, నితీష్ వీరా, దుర్గ, శ్వేతా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భరణీ కన్నన్ ఛాయాగ్రహణం, రాబర్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. (ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!) ఈ సందర్భంగా మంగళవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకట్ భువన్ మాట్లాడుతూ చిత్రానికి నిర్మాతనే ముఖ్యమన్నారు. ఈ చిత్ర నిర్మాత పీటర్ రాజ్ తనకు మంచి మిత్రుడన్నారు. తాను చిత్రాన్ని నిర్మిస్తాను మీరు దర్శకత్వం వహించండి అని చెప్పడంతో ముందుగా కాస్త భయం అనిపించిందన్నారు. దీంతో కథపై దృష్టి పెట్టి చాలా పరిశోధనలు చేసి బెల్ చిత్ర కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. పీటర్ రాజ్ ఈ చిత్రానికి నిర్మాత మాత్రమే కాకుండా, ఒక సహాయ దర్శకుడిగా తనతోనే ఉంటూ ఎంతగానో సహకరించారని చెప్పారు. ఇది ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రమని చెప్పారు. కాగా ఇందులో ప్రతి నాయకుడిగా ప్రధాన పాత్రను పోషించిన నటుడు గురు సోమసుందర్ మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మాత పీటర్రాజ్కు పెట్టిన పెట్టుబడి తిరిగిరావాలన్నారు. చాలా పోటాన్షియల్ ఉన్న కథ కావడం, తన పాత్ర కొత్తగా ఉండటంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్ర సంగీతం కూడా బాగా వచ్చిందనీ, కచ్చితంగా బెల్ చిత్రం సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
ప్రేమంటే ఇదేనా.. ఈ ఫీలింగేంటి ఇంత బాగుంది
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ విడుదల చేసి, ‘‘ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్ బాగున్నాయి.ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి’అన్నారు. ‘‘ఇది ఒక అందమైన రియలిస్టిక్ ప్రేమకథ. ఓషోలోని తత్త్వం, బుద్ధునిలోని సహనం, శ్రీశ్రీలోని రెవలిజం, వివేకానందుడిలోని గుణం ఉండేలా తనికెళ్ల భరణిగారి పాత్రను డిజైన్ చేయడం జరిగింది. నటీనటులు, టెక్నీషియన్స్ ఫుల్ సపోర్ట్ చేశారు’’ అన్నారు వెంకట్ వందెల. ‘‘నేను సోలో హీరోగా నటించిన తొలి చిత్రం ఇది’’ అన్నారు తేజ్ కూరపాటి. ‘‘ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో ఈ చిత్రం షూటింగ్ చేశాం. అనుకున్న టైమ్కు, అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తి చేశాం’’ అన్నారు ముల్లేటి కమలాక్షి. ఇక ట్రైలర్ విషయానికొస్తే..‘చరిత్ర మనకెప్పుడో చెప్పింది సాల్మన్ రాజుగారు.. మనకు కావాల్సింది దాని కోసం ఎన్ని యుద్ధాలైనా చేయమని. వదిలే ప్రసక్తే లేదు’.‘ప్రేమంటే ఇదేనా.. ఈ ఫీలింగేంటి ఇంత బాగుంది’.‘గుళ్లో దైవం..బళ్లో పుస్తకం తప్ప ఏ ధ్యాసలేని నా జీవితంలోకి ఒక్కడొచ్చాడు. వాడొవడో కూడా నాకు తెలియదు. అసలు ప్రేమంటే ఏంటి అది ఎలా ఉంటుంది. ఒక్కసారి నాకు కనబడితే నెత్తిపై ఒక్కటిచ్చి ఏడ్చేలోపే పీక పిసిగి చంపేయాలని ఉంది’ లాంటి డైలాగ్స్తో ఆకట్టుకుంటుంది. -
దేనికీ పనికిరానన్నారు, ఆ ప్రమాదంలో తీవ్రగాయాలు: నటుడు
'సీతారాముల కల్యాణం' సినిమాతో నటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు వెంకట్. ఈ సినిమా మంచి హిట్ సాధించినప్పటికీ అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం 'అన్నయ్య' మూవీతో! ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు వెంకట్. ఇందులో మెగాస్టార్ అతడిని జెమ్స్ అని పిలుస్తుంటాడు. దీంతో చాలామంది ఇప్పటికీ వెంకట్ను జెమ్స్ అనే పిలుచుకుంటారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉన్నాడీ యాక్టర్. తాజాగా అతడు ఓ టీవీ షోకు హాజరై వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించాడు. చదువు మీద ధ్యాస లేదన్న వెంకట్ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు. ఒక డ్యాన్స్ మాస్టర్ అందరిముందు తనను అవమానించాడని, తాను దేనికీ పనికిరానని, ఎక్కడినుంచి పట్టుకొచ్చారని విసుగు ప్రదర్శించాడని వెల్లడించాడు. ఒకసారైతే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చెంప చెల్లుమనిపించాడని చెప్పుకొచ్చాడు. ఆ ఐదుగురు సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరిగిందని తెలిపాడు వెంకట్. రాడ్ల మీద ఎక్కి పైకి దూకాల్సిన సీన్ ముందుకు దూకబోయి వెనక్కు పడ్డట్లు తెలిపాడు. ఆ ప్రమాదంలో పెద్ద గాయాలే అయ్యాయన్న ఆయన మూడు నెలలపాటు ఆస్పత్రి బెడ్కే పరిమితమైనట్లు పేర్కొన్నాడు. ఈ యాక్సిడెంట్ వల్ల చాలా సినిమాలు మిస్ అయ్యాయని చెప్తూ బాధపడ్డాడు. -
దటీజ్ మెగాస్టార్.. అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ..
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభిమాని.. తనను కలవాలని కోరగా.. ప్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ఇంటికి పిలిపించుకున్నారు.స్వయంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాదు.. చికిత్స కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫేమస్ ఆస్పత్రికి తరలించారు. అవరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విటర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. ‘నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను’ అని ట్విటర్ వేదికగా చిరంజీవి వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో చిరంజీవి ఎలా అయినా వెంకట్ ను కలవాలని భావించి వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తీయించి హైదరాబాద్ రప్పించారు. శనివారం నాడు చిరంజీవి.. వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి. వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన వీరాభిమానిని కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకటట్ భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని కూడా మెగా అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ, యూపీలో యోగి, హరియాణాలో ఖట్టర్, అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మల ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆరోపించారు. మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయమని, త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు ప్రభుత్వాలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. లఖీమ్పూర్ ఘటనను నిరసిస్తూ సోమవారం ఢిల్లీలోని యూపీ భవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చదవండి: (లఖీమ్పూర్ ఖేరిపై.. రాజకీయ ప్రకంపనలు) హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రైతులను కొట్టండి... నేనున్నాను, చూసుకుంటానని కార్యకర్తలను ఉసిగొల్పిన తరువాత కూడా ఆయనను ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగించగలుగుతున్నారని వెంకట్ ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా మద్దతు లేకుండా ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడుతారా? అని వ్యాఖ్యానించారు. 11 నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమాన్ని హత్యల ద్వారా అణచివేయాలని కుట్రలు పన్నుతున్నారని వెంకట్ ధ్వజమెత్తారు. అయితే ఇది వారికి ఏమాత్రం సాధ్యం కాదని, యూపీ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని తెలిపారు. యూపీలో రాజ్యాంగం అమలవ్వటం లేదని, అధికారులు, ప్రభుత్వం ప్రజల పక్షాన పని చేయని కారణంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు ఉద్యమానికి ముప్పాళ్ల సంఘీభావం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూననేని సాంబశివరావు , బీకేఎంయూ జాతీయ కార్యదర్శి జెల్లి విల్సన్లు సంఘీభావం తెలిపారు. -
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగరావును ప్రకటించింది. గత ఆరేళ్లుగా ఆయన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బల్మూరి వెంకట్తో పాటు స్థానిక నేతలు రవీందర్రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్ను బరిలో నిలపాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బల్మూరి వెంకట్ పేరును ఖారారు చేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా... 2015, 2018లో జరిగిన ఎన్ఎస్యూఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2017లో ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎంబీబీఎస్ చదివిన వెంకట్ది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్ మండలం తారుపల్లి గ్రామం. అవివాహితుడయిన వెంకట్ (29) విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయనను పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగి క్రమశిక్షణతో పనిచేసే యువనాయకత్వానికి కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవం ఇస్తుందన్న విషయం వెంకట్ ఎంపికతో మరో మారు నిరూపితమయిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్రెడ్డి వ్యాఖ్యానించారు. అధినాయకత్వానికి ధన్యవాదాలు: వెంకట్ హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్గాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు పార్టీ నాయకులకు వెంకట్ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. -
ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ కన్నుమూత
RR Movie Makers Venkat Passed Away: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో 'లగాన్' నటి.. ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ.. ఆర్.ఆర్ బ్యానర్స్పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్మెన్, డమరుకం, పైసా వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'డైవర్స్ ఇన్విటేషన్' అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. వెంకట్ మృతి పట్ల హీరో రవితేజ, డైరెక్టర్లు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి సమా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. Really sad to hear about R.R Venkat garu's passing away. One of the best producers I've worked with. Heartfelt condolences to his family and loved ones. 🙏 — Ravi Teja (@RaviTeja_offl) September 27, 2021 Extremely saddened to hear about the demise of senior producer #RRVenkat Garu. My deepest condolences to the family. — SurenderReddy (@DirSurender) September 27, 2021 Sad to know about RR Venkat garu's demise. Met him a couple of times and found him to be very passionate about movies. He was a man of guts and ambition. Praying for the strength to his family🙏 — Sreenu Vaitla (@SreenuVaitla) September 27, 2021 -
ఎన్ఎస్యూఐ దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను వాయిదా వేయాలని కోరుతూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ శనివారం విరమించారు. వెంకట్ దీక్ష చేపట్టి మూడు రోజులు కావడంతో ఉదయం గాంధీభవన్లోని దీక్షా శిబిరానికి వచ్చిన వైద్యులు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని నిర్ధారించారు. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కు తెలియజేయడంతో మాజీ ఎంపీ వీహెచ్తో కలిసి ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి విషమించినందున దీక్ష విరమించాలని వెంకట్కు సూచించిన ఉత్తమ్, విద్యార్థుల పక్షాన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దీక్ష విరమణకు వెంకట్ అంగీకరించారు. మధ్యాహ్నం దీక్ష విరమించిన వెంకట్ను అంబులెన్స్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలి: ఉత్తమ్ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల కోసం దీక్ష చేపట్టిన వెంకట్ను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా జేఈఈ, నీట్ పరీక్షలను కూడా వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. చలో రాజ్భవన్తో ఉద్రిక్తత వెంకట్ ఆరోగ్యం క్షీణించడంతో ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యవర్గం ‘చలో రాజ్భవన్’ కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. దీంతో గాంధీభవన్ నుంచి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాజ్ భవన్కు బయలుదేరారు. కానీ పోలీసులు వారిని గాంధీభవన్ గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
రాయలసీమ ప్రేమకథ
‘‘రాయలసీమ లవ్స్టోరీ’ ట్రైలర్లో ‘ఇడియట్’ సినిమా యాటిట్యూడ్ కనపడుతోంది. కర్నూల్లో షూట్ చేసిన ఏ సినిమా అయినా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది కర్నూల్ నేపథ్యంలో వస్తున్న ‘రాయలసీమ లవ్స్టోరీ’ ఇంకెంత హిట్ అవుతుందో ఊహించుకోవచ్చు. రామ్లో మంచి ప్రతిభ, పవర్ కనపడుతున్నాయి. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ మంచి భవిష్యత్ ఉండాలి’’ అని డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రల్లో రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్స్టోరీ’. రాయల్ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, ఆడియో బిగ్ సీడీలను జి.నాగేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘మొదటి నుంచి మమ్మల్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన నాగేశ్వర్ రెడ్డిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక్క లైన్ చెప్పగానే నన్ను నమ్మి పది రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేయించారు నిర్మాతలు. వారు నాకు జీవితం ఇచ్చారు. కథకు తగ్గ కరెక్ట్ టైటిల్ ‘రాయలసీమ లవ్స్టోరీ’’ అన్నారు. ‘‘రాయలసీమ అనగానే అందరికీ బాంబులు, ఫ్యాక్షన్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికే ఈ చిత్రం నిర్మించాం’’ అన్నారు రాయల్ చిన్నా. ‘‘అను కున్న సమయానికి సినిమా పూర్తయింది. ఔట్పుట్ కూడా బాగా వచ్చింది. ఈ నెల 27న సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు నాగరాజు. ‘‘నిర్మాతల సహకారం వల్లే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు సాయి ఎలేంద్ర. వెంకట్, హృశాలి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ మహేందర్. -
వ్యూహాలు ఫలించాయా?
సుమన్ రంగనాథన్, ముమైత్ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్కుమార్ ముఖ్య తారలుగా కేటీ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? అనే అంశాలతో రూపొందిన చిత్రమిది. ఏడుమంది ఉన్న గ్యాంగ్కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగస్టు 15న విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 1,2’ చిత్రాలకు మా సినిమాకి సంబంధం లేదు. ఇందులో కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు కె.టి.నాయక్. -
సమ్మర్ ‘జిమ్దగీ’
సాక్షి, సిటీబ్యూరో :ఓ వైపు ఫిట్నెస్ ఫీవర్ కారణంగా సిటీటెంపరేచర్తో ఉంది. మరోవైపు సమ్మర్ సీజన్ శరీరాల్ని హీటెక్కించేస్తోంది. వారంలో రెండు మూడు రోజులతో సరిపెట్టేవారు మాత్రమే కాదు ఒక్క రోజు కూడా జిమ్కి డుమ్మా కొట్టడానికి ఇష్టపడని వారూ సిటీలో ఎక్కువే.ఈ నేపథ్యంలో.. హాట్ సమ్మర్లో ‘జిమ్దగీ’ ఎలా ఉండాలో వివరిస్తున్నారు నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ఎం.వెంకట్. వెయిట్లాస్కి ప్లస్... చలికాలం, వానాకాలంతో పోలిస్తే వేసవిలో శరీరం త్వరగా వార్మప్ అవుతుంది. ‘శారీరక శ్రమ, మరో వైపు వేడిగాలి బాడీ టెంపరేచర్ను పెంచుతాయి. ఈ వేడి దేహమంతా విస్తరించేందుకు చర్మం ద్వారా రక్తం అధికంగా సరఫరా అవుతుంది. ఇది గుండె కొట్టుకునే స్థాయిని పెంచుతుంది. దీంతో బాడీ టెంపరేచర్ సాధారణ స్థాయికన్నా పెరుగుతుంది. ఈ పరిస్థితి కేలరీలు అధికంగా ఖర్చయ్యేందుకు, మరింత వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి ఈ సీజన్ వెయిట్ లాస్ కోరుకునేవారికి ప్లస్ అవుతుంది. నిదానమే సరైన విధానం... ఈ సీజన్లో వ్యాయామం స్లోగానే స్టార్ట్ చేసి దశలవారీగా వేగం పెంచాలి. ఏదేమైనా కొంత వేగాన్ని నియంత్రించడం అవసరమే. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు అధికంగా చేసేవాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాహం అనిపించకపోయినా సరే వ్యాయామ సమయంలో తరచూ నీళ్లు తాగుతుండాలి. వెదర్.. చూడాలి బ్రదర్.. మిట్టమధ్యాహ్నపు ఎండలో ఏసీ జిమ్లో అయినా సరే ఎక్సర్సైజ్లు చేయడం అంతగా మంచిది కాదు. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే వ్యాయామం చేయడం సముచితం. బలహీనత, తలనొప్పి, తలతిరగడం, ఒళ్లు పట్టేయడం వాంతులు, గుండె మరీ ఎక్కువగా కొట్టుకోవడం, తీవ్రమైన అలసటకు సంబంధించిన సూచనలు కనిపించినట్లయితే వెంటనే వ్యాయామం ఆపేసి, చల్లని ప్రదేశంలో, నీడలో సేదతీరడం అవసరం. వ్యాయామానంతరం చన్నీటి స్నానం చేస్తే అలసిన కండరాలకు చక్కగా సేదతీరే అవకాశం లభిస్తుంది. సీజన్కి...నప్పేవి ఈ సీజన్లో శరీరం సహజంగానే కొంత ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి బాగా ఒత్తిడికి గురిచేసే క్రాస్ ఫిట్ శైలి వ్యాయామాలు టైర్, హామర్తో, బాటిల్ రోప్తో చేసే వర్కవుట్స్ని బాగా తగ్గించేయాలి. శరీరం వార్మప్ అయి ఉంటుంది కాబట్టి మజిల్ టోనింగ్ మీద దృష్టి పెట్టాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూనే కార్డియో వ్యాయామాలకు బదులుగా క్రంచెస్, పుషప్స్, బర్పీస్, ఇంచ్వామ్, మౌంటెయిన్ క్లైంబర్స్, స్పాట్ జాగింగ్ వంటివి ఎంచుకోవాలి. డీహైడ్రేషన్ దరిచేరకుండా... రోజు మొత్తం మీద కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలి. చెమట ద్వారా కోల్పోయే సోడియం, పొటాíషియం, క్లోరైడ్లను భర్తీ చేసేందుకు వ్యాయామానికి ముందు పొటాసియం అధికంగా ఉండే అరటి, దానిమ్మ పండ్లు వంటివి తీసుకోవాలి. అవసరమైతే ఓఆర్ఎస్ వంటి సప్లిమెంట్స్ని వర్కవుట్స్ చేసే సమయంలో వినియోగించడం మంచిది. స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ను ఆశ్రయించవచ్చు. కాఫీ, టీ, ఆల్కహాల్ వల్ల దేహంలోని నీటిస్థాయి ఆవిరై వ్యాయామ సమయంలో త్వరగా అలసిపోతాం. వాటికి ఈ సీజన్లో తప్పనిసరిగా గుడ్బై చెప్పాల్సిందే. వెయిట్లాస్కి బెస్ట్... కొంత మంది వేసవి సీజన్లో వేడికి భయపడి వర్కవుట్స్ మానేస్తారు. అయితే సరిగ్గా వినియోగించుకుంటే ఇది మజిల్ టోనింగ్కి, ముఖ్యంగా వెయిట్లాస్కి అత్యంత ఉపయుక్తమైన సీజన్. డ్రైఫిట్ దుస్తులు ధరించడం దగ్గర్నుంచి స్వల్ప మార్పు చేర్పులతో ఈ సీజన్లో వర్కవుట్స్ని ఎంజాయ్ చేయవచ్చు. – ఎం.వెంకట్, ట్రైనర్, టార్క్ ఫిట్నెస్ స్టూడియో -
హిజ్రాలపై కక్ష పెంచుకొని..
బంజారాహిల్స్: హిజ్రాలపై దాడులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటూ అటు పోలీసులకు, ఇటు హిజ్రాలకు చుక్కలు చూపిస్తూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కురుమ వెంకటేష్ అలియాస్ గ్రానైట్ వెంకట్ అలియాస్ వెంకట్యాదవ్ అలియాస్ వెంకట్ అలియాస్ చిన్నాను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్.కళింగరావు, డీఐ కె. రవికుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, కక్కాలపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్ యాదవ్కు 2009లో ఎల్బీనగర్లో దివ్య అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడాది పాటు సహజీవనం చేశారు. అనంతరం వెంకట్కు వివాహం జరిగింది. తనను వదిలి భార్యతో కాపురం చేస్తున్న వెంకట్పై కోపం పెంచుకున్న దివ్య అతడి గ్రామానికి వెళ్లి గొడవ చేసింది. తన పరువు తీసిందని దివ్యపై పగబట్టిన వెంకట్ ఆమెను హత్య చేసేందుకు నగరానికి వచ్చాడు. దివ్య ఆచూకీ తెలుసుకునే ప్రయతత్నంలో కూకట్పల్లిలో ప్రవళ్లిక అనే మరో హిజ్రాను బండరాయితో మోది దారుణం హత్య చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసిందన్న కసితో హిజ్రాలపై కక్ష పెంచుకొని వారినే లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డాడు. తరచూ వారిపై లైంగిక దాడులకు పాల్పడటమేగాక నగదు, నగలు దోచుకునేవాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్నెం. 2లోని ఇందిరానగర్లో మకాం వేసిన అతను గతేడాది ఇందిరానగర్లోనే ఓ హిజ్రాతో మాట్లాడుతున్న బ్రహ్మం అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్ 27న యాస్మిన్ అనే హిజ్రా ఇంట్లో చొరబడి ఆమెపై దాడి చేసి రూ. 2 లక్షల నగదు, బంగారు దోచుకెళ్లాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వెంకట్ పోలీసుల కళ్లుగప్పి వివిధ రాష్ట్రాల్లో మకాం వేశాడు. పక్కా నిఘా వేసిన బంజారాహిల్స్ డీఐ రవికుమార్ రెండు రోజుల క్రితం అనంతపురంలోని ఓ లాడ్జీలో స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న వెంకట్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణలో వెంకట్ క్రిమినల్ చిట్టా వెలుగు చూసింది. ప్రతినెలా హిజ్రాల నుంచి హఫ్తాలు వసూలు చేయడం, తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడులకు పాల్పడటం, హిజ్రాల ఇళ్లల్లోకి చొరబడి నగదు ఎత్తుకెళుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై గోపాలపురం, మాదాపూర్, కేపీహెచ్బీ, సనత్నగర్, బంజారాహిల్స్, బాలానగర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో పది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, నాన్బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఎంతో కష్టపడి వెంకట్ యాదవ్ను పట్టుకున్న బంజారాహిల్స్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు సూచనలు, సమాచారంతో డీఐ రవికుమార్ లక్ష్యాన్ని ఛేదించారని కొనియాడారు. -
హిజ్రాల పాలిట కాల'యముడు'
బంజారాహిల్స్: హిజ్రాల పాలిటకాలయముడిగా మారిన పాత నేరస్తుడు, రౌడీషీటర్ కుమ్మరి వెంకట్ యాదవ్ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు హత్య కేసులు, 9 దోపిడీ, దొమ్మీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గుండు కొట్టించుకుని మారువేషంలో తిరుగుతూ రోజుకో సిమ్కార్డు మారుస్తూ, నాలుగు రాష్ట్రాల్లో తల దాచుకుంటున్నాడు. ఎట్టకేలకు బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అతడిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు సూచనల మేరకు డీఐ రవికుమార్ నాలుగు రోజుల పాటు అనంతపురంలో మకాంవేసి ఓ లాడ్జిలో ఉంటున్న వెంకట్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా, కక్కాల్పల్లి గ్రామానికి చెందిన వెంకట్ యాదవ్ 2016 జనవరిలో బంజారాహిల్స్, ఇందిరానగర్లో బ్రహ్మం అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను హత్యచేసి జైలుకు వెళ్లాడు. 2015లో కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ప్రవళిక అనే హిజ్రాను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్లో ఇందిరానగర్లో యాస్మిన్ అనే హిజ్రాపై దాడి చేసి నగలు, నగదు దోచుక్కెళ్లాడు. అప్పటినుండి తప్పించుకు తిరుగుతున్న వెంకట్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అయితే, గత నెలలో కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో స్వప్న అనే హిజ్రాపై దాడి చేసి నగదు దోచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఖైత్లాపూర్లో హిజ్రాలను సమావేశపరిచి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇప్పటిదాకా అతడిపై 11 కేసులు నమోదై ఉన్నాయి. 2008లో దివ్య అనే హిజ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతను హిజ్రాలందరితో పరిచయం పెంచుకున్నాడు. 2015 నాటికి హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని దాదాపు 3000 మంది హిజ్రాల పాలిట యముడయ్యాడు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో హిజ్రాలతో గ్రూప్ ఏర్పాటు చేయించి, ప్రతినెలా హప్తా వసూలు చేసేవాడు. ఇలా ప్రతి నెల రూ.1.50 లక్షల వరకు వసూలు చేసేవాడు. ఎవరైనా మామూళ్లు ఇవ్వకపోతే కొట్టడం, కిడ్నాప్, కత్తులతో గాట్లు పెట్టడం, బ్లేడ్తో చేతులపై కోయడం తదితర అకృత్యాలకు పాల్పడేవాడు. దీంతో గత నాలుగేళ్లుగా నగరంలోని హిజ్రాలు వెంకట్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. తరచూ తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడికి పాల్పడటం, వారి వద్ద డబ్బు లాక్కుని పరారవ్వడం మామూలైపోయింది. జైలుశిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదు. అతని ఆగడాలను నియంత్రించాలని పలుమార్లు హిజ్రాలు ధర్నాలు సైతం చేశారు. పోలీసుల రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా నమోదైన అతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో హిజ్రాలు ఊపిరి పీల్చుకున్నారు. మాట్లాడుతున్న సామాజిక కార్యకర్త దేవి .. రౌడీషీటర్ నుంచికాపాడండి పంజగుట్ట: నగరంలో ట్రాన్స్జెండర్లను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న రౌడీషీటర్ వెంకట్ యాదవ్ బారినుండి తమను కాపాడాలని, అతనికి బెయిల్ రాకుండా చూడాలని పలువురు ట్రాన్స్జెండర్లు కోరారు. ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వెంకటేష్ యాదవ్ బయటికి వస్తే అకృత్యాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సామాజిక కార్యకర్త దేవితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వెంకట్ యాదవ్ తమను అన్ని విధాలుగా వేధిస్తున్నాడన్నారు. 2015లో ప్రవల్లిక అనే ట్రాన్స్జెండర్ను హత్య చేయడమే కాకుండా పలువురు ట్రాన్స్జెండర్లపై అనుచరులతో దాడిచేసి బంగారం, నగదు లాక్కెళ్లే వాడన్నారు. అతను ఎప్పుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికామన్నారు. రెండు రోజులక్రితం అతడిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులు అతను బయటకు రాకుండా జైలులోనే ఉంచాలని, అప్పుడే తాము ధైర్యంగా ఉంటామన్నారు. నా అనే వారు లేక భిక్షాటనతో పొట్టపోసుకుంటున్న తమకు వెంకట్ యాదవ్ రూపంలో పెద్ద సమస్య వచ్చిపడిందన్నారు. అతనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీస్స్టేషన్ల ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. సమాజం ట్రాన్స్జెండర్లను దూరం పెట్టడంతోనే సమస్యలు వస్తున్నాయని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని దేవి పేర్కొన్నారు. వారికి కూడా ఓటు హక్కు ఉందని, ఈ విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారన్నారు. వెంకట్ యాదవ్ నేరాలన్నింటినీ పరిశీలించి అతనిపై చార్జీషీట్ వేయాలన్నారు. వెంకట్ యదవ్ జైలులో ఉన్నా అతని అనుచరుల ఆగడాలు తగ్గలేదని, వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని హక్కుల కార్యకర్త లారెన్స్ అన్నారు. సమావేశంలో చంద్రముఖి, బాబి, సోనా రాధోడ్, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
సీపీఐ, సీపీఎం సహకరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పోటీచేసే స్థానాల్లో పరస్పరం సహకరించుకుని, పూర్తిస్థాయిలో మద్దతు అందించుకోవాలని సీపీఐ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఈ రెండు పార్టీలు పోటీచేయని స్థానాల్లో ఎవరికి మద్దతునివ్వాలనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. వామపక్షాలు పోటీచేయని చోట్ల టీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు బలమైన లౌకిక, ప్రజాస్వామ్యశక్తులు, అభ్యర్థులకు మద్దతునివ్వాలని సూచించింది. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పోటీచేయని సీట్లలో ఎవరికి మద్దతు తెలపాలనే విషయంలో ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో రాష్ట్ర కమిటీకి సీపీఐ జాతీయకార్యదర్శివర్గం సూచనలు చేస్తూ ఒక లేఖను పంపినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో చెరో రెండుస్థానాల్లో పోటీ చేయడంతోపాటు పరస్పరం సహకరించుకుని మిగతాసీట్లలో టీఆర్ఎస్, బీజేపీల ఓటమికిగాను బలమైన లౌకిక, ప్రజాతంత్రశక్తులను బలపరిచే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ సీపీఐ షరతు విధించడం పట్ల సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. సీపీఐ, సీపీఎం అభ్యర్థులు పోటీచేయని మిగతా 13 సీట్లలో జనసేన, బీఎస్పీ, ఎంసీపీఐ(యూ), బీఎల్పీ, ఎంబీటీ వంటి పార్టీలకు మద్దతునివ్వాలని సీపీఎం చేసిన సూచనను సీపీఐ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో పొత్తులపై తేల్చాలంటూ ఇరుపార్టీలు జాతీయ నాయకత్వాలను ఆశ్రయించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం వేర్వేరుగా పోటీ చేయడంతో పాటు, ఇతర స్థానాల్లో మద్దతునిచ్చే విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయం తీసుకోనున్నాయి. ఏచూరితో రాష్ట్ర కమిటీ భేటీ... ఖమ్మం లోక్సభ స్థానానికి సీపీఎం అభ్యర్థి బి.వెంకట్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన రాష్ట్ర కమిటీ భేటీలో సీపీఐతో చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన గురించి ఏచూరికి వివరించారు. వామపక్షాలు పోటీచేయని చోట్ల సీపీఐ షరతుపై ఆ పార్టీ జాతీయనాయకత్వం తో మాట్లాడి స్పష్టతనివ్వాలని ఏచూరిని రాష్ట్ర నాయకులు కోరారు. ఈ సందర్భంగా పార్టీ పోటీచేస్తున్న ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. -
ఖమ్మం సీపీఎం అభ్యర్థిగా వెంకట్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా బోడా వెంకట్ను బరిలో నిలపనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు ప్రకటించారు. నగరంలోని సుందరయ్య భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 11వ తేదీన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీపీఎం అభ్యర్థిగా వెంకట్ను నిర్ణయించామని, ఆయన ఈనెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. ఆరోజు ఉదయం 11 గంటలకు పెవిలియన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సభకు సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు ఇతర నాయకులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే సమస్యలపై పోరాడిన వ్యక్తి వెంకట్ అని, విద్యార్థుల సమస్యలు, సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా, వ్యవసాయ కార్మికసంఘ రాష్ట్ర బాధ్యుడిగా, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిం చారని అన్నారు. కుల వివక్ష వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర వహించి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. భూ ఉద్యమం లో వెంకట్ చురుకైన పాత్ర పోషించి కోనేరు రంగారావు భూ కమిటీ ఏర్పాటుకు కారకులయ్యారని తెలిపారు. మల్లన్నసాగర్ ఉద్య మంలో రైతుల తరఫున ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లారని పేర్కొన్నారు. రాజకీయ విలువలను దిగజార్చారు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి.. రాజకీయ విలువలను పూర్తిగా దిగజార్చారని, ప్రజాభిప్రాయాలకు తిలోదకాలు ఇస్తున్నారని పోతినేని సుదర్శన్రావు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు, అభివృద్ధి చేసుకునేందుకు రాజకీయాలను సంతలో సరుకుల్లా మార్చారని విమర్శించారు. ఆయా పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులు తమ స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఓటు వేసి గెలిపిస్తే వారి వేలికి వేసిన సిరా చుక్క చెరగకముందే గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి మారి ఓటరును వెక్కిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎంకు సీపీఐ, జనసేన, బీఎస్పీ మద్దతు ఉంటుందని తెలిపారు. సీపీఎం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి బి.వెంకట్ మాట్లాడుతూ తనకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల ఇబ్బందులు, దళితుల సమస్యలన్ని తెలుసన్నారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తనకు తెలుసని చెప్పారు. వ్యాపారులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు కలిసి పోటీచేయడం తెలంగాణకు అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి బి.వెంకట్ బయోడేటా.. పేరు: బోడా వెంకట్ తండ్రి పేరు: బోడా బజారు తల్లిపేరు: బోడా నాగరత్నం పుట్టినతేది: 02.11.1964 గ్రామం: వినోభానగర్, జూలూరుపాడు మండలం, ఉమ్మడి ఖమ్మంజిల్లా విద్యార్హత: డిగ్రీ భార్య: మేకల అరుణకుమారి రాజకీయ నేపథ్యం:మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. విద్యాభ్యాసం సమయంలో 1981లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. 1985లో సీపీఎం సభ్యుడు అయ్యారు. అనంతరం పార్టీ, అనుబంధ సంఘాల్లో రాష్ట్రస్థాయి బాధ్యతలను నిర్వర్తించారు. -
అవసరమైతే కోర్టుకి వెళతాను
బెనర్జీ, వెంకట్, ముమైత్ఖాన్, సంజీవ్ కుమార్, సుమన్ రంగనాథన్ ప్రధాన పాత్రధారులుగా కేటీ నాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా దండుపాళ్యం 4’ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? పోలీసులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? అనే అంశాలతో మా ‘దండుపాళ్యం 4’ రూపొందింది. ఇందులో ఏడుగురు ఉన్న గ్యాంగ్కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘షూటింగ్ పూర్తయిన మా సినిమాను సెన్సార్కు అప్లై చేశాను. కంటెంట్ పరంగా సినిమాలో ఏదైనా సమస్య ఉంటే ఫలానా సన్నివేశాన్ని, ఫలానా డైలాగ్ని తొలగించడం జరుగుతుంది. నా సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి, లేకుంటే రిజెక్ట్ చేస్తానని అన్నారు. సినిమాలో ఉన్న సమస్య ఏంటో చెప్పకండా రిజెక్ట్ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత ఆయన ఈ సినిమాను సెన్సార్ చేయను. రివైజింగ్ కమిటీకి వెళ్లండన్నారు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నాను. రివైజింగ్ కమిటీనే కాదు... ట్రిబ్యునల్.. అదీ కాకపోతే కోర్టుకి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమాతో సెన్సార్ బోర్డుకి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సినిమాను మార్చిలో విడుదల చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాయలసీమ ప్రేమకథ
వెంకట్ హీరోగా, హృశాలి, పావని హీరోయిన్లుగా రామ్ రణధీర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. ఏ వన్ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై పంచలింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రం నిర్మించారు నిర్మాతలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఔట్ పుట్ ఇచ్చాను. యువతని టార్గెట్ చేస్తూ రూపొందించిన మా సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్, టీజర్కు మేం ఊహించినదానికంటే ఎక్కువ స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. మా చిత్రం టీజర్కు వచ్చిన స్పందన చూసి సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నాం’’ అని రాయల్ చిన్నా, నాగరాజు అన్నారు. నాగినీడు, నల్లవేణు, పృథ్వీ, జీవా, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు తదితరులు నటించారు. -
ఆ డబ్బంతా చంద్రబాబు ఏం చేశారు?
విజయవాడ: ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి కోసూరి వెంకట్ విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాజధానికి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు 56 లక్షల ఇటుకలను అమ్మారని చెప్పారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బాండ్లు కూడా అమ్మిన సంగతిని వివరించారు. ఈ డబ్బంతా చంద్రబాబు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి వేల ఎకరాల భూములు బలవంతంగా లాక్కున్నారని, ఆ భూములతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో దోచేసిన సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెడుతూ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నీతి నిజాయతీపరుడే అయితే, దమ్ముంటే వీటిపైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఫీజులపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏదీ!
హైదరాబాద్: కూకట్పల్లిలోని న్యూ సెంచరీ పాఠశా లలో గురువారం స్టేజీ కూలిపోయి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనపై నిరసన వెల్లువెత్తింది. చిన్నారుల మృతదేహాలతో శుక్రవారం పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మృతదేహాలపై పడి బంధువులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. కాగా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు ఆరోపించారు. పాఠశాల పైకప్పు ప్రమాదకరంగా ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన పలువురు పాఠశాల బస్సును ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రూ.5 లక్షల పరిహారం... సంఘటన జరిగిన వెంటనే న్యూ సెంచరీ పాఠశాల డైరెక్టర్ ఎం.వెంకట్ పరారయ్యాడు. చిన్నారులు మృతి చెంది 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని యాజమాన్యం కోసం నిరీక్షించారు. యాజమాన్యం అజ్ఞాతంలో ఉండటంతో అధికారులతో చర్చించి నష్టపరిహారాన్ని ప్రకటించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. స్కూల్ అనుమతిని రద్దు చేయడంతో పాటు భవనాన్ని పూర్తిగా తొలగిస్తామన్నారు. పాఠశాలలోని 176 మంది విద్యార్థులకు నష్టం జరగకుండా సమీపంలోని 11 పాఠశాలల్లో చేర్పిస్తామని, వారికయ్యే ఫీజును ప్రభు త్వమే భరిస్తుందని ప్రకటించారు. అలాగే మృతి చెంది న విద్యార్థినులు మణికీర్తన, చందనశ్రీ కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందివ్వనున్నట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ సందర్శన... మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం ఉదయం పాఠశాలను సందర్శించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో శ్రీధర్ను సస్పెండ్ చేస్తూ డీఈవోను సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే ప్రతి వారం మండల ఎడ్యుకేషన్ అధికారులు అన్ని పాఠశాలలను తనిఖీ చేసి ఎప్పటికప్పడు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఒక విద్యార్థి డిశ్చార్జ్.. న్యూ సెంచరీ పాఠశాల ప్రమాదంలో గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థుల్లో సందీప్ను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. నరేశ్, లిఖిత ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలోనే చెప్పాం... పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పిల్లర్లు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయని గతంలోనే పలుమార్లు యాజమాన్యానికి గుర్తు చేశాం. లైట్ వెయిట్గానే ఉంది.. ప్రమాదమేమీ లేదని నిర్లక్ష్యం వహించారు. పాఠశాల పైకప్పు కూడా తాటి చెక్కలతో పేర్చారు. యాజమాన్య నిర్లక్ష్యంతోనే చిన్నారులు బలయ్యారు. – రమణారావు, విద్యార్థి తండ్రి వెంకట్రావ్నగర్ నా ఆనందం ఆవిరైంది... నా మనవరాలు మణికీర్తన గొప్పగా చదువుకుంటుందని చాలా ఆనందపడ్డాం. పెద్ద డాక్టర్ అయి నాకు మెరుగైన వైద్యం చేస్తానని, తన దగ్గరే ఉంచుకుంటా అని చెబుతుంటే ఎంతో ఆనందపడ్డా. ఇప్పుడు ఆ ఆనందమంతా ఆవిరైపోయింది. నా మనవరాల్ని ఈ పాఠశాల బలిగొంది. – పద్మ, మణికీర్తన నానమ్మ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే... రూ.లక్షల ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల భద్రతలో లేకపోవడం దారుణం. కేవలం యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విలువైన చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిశాయి. నా మనవరాలు పాఠశాలలో చేరి రెండు నెలలైనా కాలేదు.. ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఇది మాకు తీరని గుండెకోత. దీనికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. – డి. రంగయ్య, చందనశ్రీ తాతయ్య -
మా కుమారుడికి మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, హైదరాబాద్ : తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందించాలని చెంగిచర్ల ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటనలో గాయపడిన వెంకట్నాయక్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వెంకట్ నాయక్ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను చెన్నయ్లో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. -
రాయలసీమ ప్రేమకథ
వెంకట్, హృశాలి, పావని ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘రాయలసీమ లవ్స్టోరీ’. రామ్ రణధీర్ దర్శకత్వంలో నాగరాజు, హుస్సేన్, ఇమ్మాన్యుయేల్ నిర్మిస్తున్న ఈ సినిమా కర్నూల్లో ప్రారంభమైంది. నర్వా రాజశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ క్లాప్ ఇవ్వగా, ఆయన తనయుడు భరత్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘రాయలసీమ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో చిత్రాలొచ్చాయి. అవన్నీ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కినవే. మా సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్స్టోరీగా రూపొందిస్తున్నాం. కర్నూల్లో పది రోజులపాటు మొదటి షెడ్యూల్ ఉంటుంది’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. -
అనుకోని ఓ కథ!
రాకేష్, రమ్య, వెంకట్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘అనుకోని ఓ కథ’. ఏ.ఎం.జె. ఫిలిమ్స్ పతాకంపై జనార్ధన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఫలాన్ని స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్లో రిలీజ్ చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘టైటిల్ బాగుంది. ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనుకుంటున్నా. ఫలాన్ని చాలా సినిమాలకు పనిచేశారు. తన సంగీతం బాగుంటుంది’’ అన్నారు. ‘‘మంచి హారర్ మూవీ ఇది. జనార్ధన్ చక్కగా తీశారు. కథ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విజయవంతమవుతాయి. ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు తెలంగాణ ఫిలించాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘తక్కువ బడ్జెట్లో సినిమా తీశా. అన్ని వర్గాల వారికీ నచ్చే అంశాలున్నాయి’’ అన్నారు జనార్ధన్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, నిర్మాతలు ప్రసన్నకుమార్, సాయి వెంకట్ పాల్గొన్నారు. -
నా చావుకు కారణం డాక్టర్, ఆయన భార్యే!
నరసన్నపేట : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని నిక హడ్కో కాలనీకి చెందిన కాడింగుల వెంకట్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. సాయంత్రం 4 గంటల సమయంలో వెంకట్ తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల వరకూ కుటుంబ సభ్యులతో బాగానే మాట్లాడిన వెంకట్.. గంట వ్యవధిలోనే మృతి చెందడంతో భార్య అన్నపూర్ణ, పిల్లలు సోనాలిక, యోగి, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నా చావుకు కారణం డాక్టర్, ఆయన భార్యే.. : వెంకట్ సూసైడ్ నోట్.. తన చావుకు మమత నర్సింగ్ హోం డాక్టర్ పొన్నాన సోమేశ్వరరావే కారణమని మృతుడు వెంకట్ తన సూసైడ్ నోట్లో స్పష్టం చేశాడు. మృతదేహాంపై ఉన్న బనీనుకు పిన్నీసుతో అతికించి ఉన్న సూసైడ్ నోట్ను భార్య అన్నపూర్ణ విలేకరులకు చూపించారు. ‘మన ఊరి డాక్టర్ సోమేశ్వరరావుతో వివాదం ఉన్న విజయ్ ఆగస్టు 24న హత్యకు గురయ్యాడు. హత్య కేసులో డాక్టర్తోపాటు, ఆయన బంధువు రెడ్డి బుచ్చిబాబు నన్ను ఇరికించారు. నా భార్య, పిల్లలను పెంచుకొనే పరిస్థితి లేకుండా నన్ను చాలా మోసం చేశారు. సోమేశ్వరరావు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వలేదు. నా వ్యాపారం పోయి చివరికి మానసికంగా కుంగిపోయాను. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నా భార్య చాలా కుంగిపోయింది. నా చావుకు కారణం పొన్నాన సోమేశ్వరరావు, ఆయన భార్యే..’ అని సూసైడ్ లెట్లో తన ఆవేదన తెలిపాడు. నా భర్త మృతికి డాక్టరే కారణం.. ‘నా భర్తతో డాక్టర్ సోమేశ్వరరావు చేయకూడని పని చేయించారు. మాకు సంఘంలో తీవ్ర అవమనాలకు గురి చేశాడు. çవిజయ్ హత్య సందర్భంగా ఇస్తామన్న డబ్బు కూడా ఇవ్వలేదు. దీంతో ఉన్న పని పోయి నా భర్త వీధినపడ్డాడ’ని వెంకట్ భార్య అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్సై పరిశీలన.. సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్సై ఎన్.లక్ష్మణ సంఘటనా స్థలానికి చేరుకు ని మృతదేహన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు ముందు వెంకట్ స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టినట్లు తెలుస్తోంది. మృతుడు హత్య కేసులో నిందితుడు గత ఆగస్టు 24న జరిగిన అదే కాలనీకి చెందిన మల్లా విజయ్ హత్య కేసులో వెంకట్ ఎ–4 నిందితుడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. విజయ్ను హత్య చేయడంలో వెంకట్ పాత్ర కీలకం. ప్రస్తుతం అంతా ఈ వ్యవహారాన్ని మరిచిపోతున్న తరుణంలో వెంకట్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. స్థానిక మమత నర్సింగ్ హోం డాక్టర్ పి.సోమేశ్వరరావుకు.. హత్యకు గురైన విజయ్కు వివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ను వెంకట్తో పాటు ఇతరుల సహాయంతో సోమేశ్వరరావు హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేశారు. విజయ్ హత్యోదంతంపై కోర్టులో చార్జిషీట్ వేసేందుకు చర్యలు తీసుకుంటుండగా.. వెంకట్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. -
‘ఫార్చ్యూన్’ డైరెక్టర్ను అరెస్ట్ చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: నిరుద్యోగులను మోసం చేసిన ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకట్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాయలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కంపెనీలో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయడం తగదన్నారు. అసలు కంపెనీలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో విద్యార్హతలకు సంబంధించిన వివరాలను నోటీస్ బోర్డులో ఎక్కడా పెట్టలేదని విమర్శించారు. కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు కావాల్సి ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇందులో భాగం కావడంతో కంపెనీ మోసంపై నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ప్రసాద్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకట్ ‘విక్టోరియన్’ విడుదల
గోకవరం (జగ్గంపేట) : గోకవరానికి చెందిన ఇంగ్లీష్ నవలా రచయిత దాసరి విశ్వనాథ్ వెంకట్ రచించిన ‘ద విక్టోరియ¯ŒS’ నవలను బాలీవుడ్ హీరో హృతిక్ రోష¯ŒS విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రచయిత వెంకట్ శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. తన రెండవ నవల ‘ద విక్టోరియ¯ŒS’ను ఈ నెల 10న హృతిక్ రోష¯ŒS జన్మదినం సందర్భంగా ముంబైలో ఆయన స్వగృహంలో విడుదల చేశారన్నారు. తన నవల విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న హృతిక్ తనను, తన కుటుంబ సభ్యులను ముంబైలో ఆయన నివాసానికి ఆహ్వానించారని, దీంతో తన తండ్రి రాధాకృష్ణ, సోదరి సాయిజలతో కలిసి ముంబై వెళ్లానని చెప్పారు. నవల కథాంశంతో పాటు కవర్ పేజీ బాగుందని హృతిక్ ప్రశంసించారని ఆనందం వ్యక్తం చేశారు. నవలను హృతిక్కు అంకితమిచ్చానన్నారు. వెంకట్ తొలి నవల ‘ఫారో ఆఫ్ ద కింగ్’ను 2011లో మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. -
బైక్ ప్రమాదంలో ఏలూరు వాసి మృతి
బెల్లంకొండ (గుంటూరు): బైక్ బోల్తాపడి ఏలూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందిన ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి ఒంటి గంటకు (తెల్లవారితే మంగళవారం) చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన వెంకట్ (28) అనే యువకుడు బైక్పై ఏలూరు నుంచి రెంటచింతల మండలం సత్రశాలకు వస్తుండగా మార్గమధ్యంలో బెల్లంకొండ క్రాస్రోడ్డు వద్ద గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బైక్ బోల్తా కొట్టి మృతి చెందినట్టు తెలిపారు. బైక్ వేగంగా వచ్చి బోల్తా కొట్టడంతో వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు సేకరించిన ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
దొంగల ఆట‘కట్’
► చోరీల నివారణకు ఓ పరికరాన్ని రూపొందించిన యువ ఇంజనీర్ భద్రాచలం టౌన్ : ఇంటికి/దుకాణానికి తాళం వేసి వెళ్లారా? ఏ అర్ధరాత్రో దొంగ వస్తాడేమోనని భయపడుతున్నారా? మీ భయాన్ని పోగొట్టేందుకు తానొక పరికరాన్ని కనిపెట్టానని చెబుతున్నాడు.. భద్రాచలానికి చెందిన ఓ యువ ఇంజనీర్. భద్రాచలం పట్టణానికి చెందిన ఆ యువ ఇంజనీర్ పేరు గుజ్జా వెంకట్. దొంగతనం, అగ్ని ప్రమాదం జరుగుతున్నదన్న సమాచారాన్ని ఇది వెంటనే యజమానికి, సమీప పోలీస్ స్టేషన్కు సమాచారమిస్తుందని చెబుతున్నారు. తన పరికరం పనితీరుపై ఆయన గురువారం భద్రాచలంలో విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పరికరం పేరు ‘తెఫ్ట్ అండ్ ఫైర్ అలర్ట్ కంట్రోల్ సిస్టమ్’. దీనికియ్యే ఖర్చు 10వేల రూపాయలు. దీనిని ఇల్లు, షాపు.. ఇలా ఎక్కడైనా అమర్చుకోవచ్చు. ఈ పరికరంలో మోషన్ డిటెక్టర్, వైర్లెస్ సీసీ కెమెరా ఉంటాయి. షట్టర్గానీ, తలుపు వద్దగానీ సెక్యూరిటీ బాక్స్ అమర్చుతారు. దానికి పాస్వర్డ్ ఉంటుంది. దానిని సంబంధిత యజమానికి కేటాయిస్తారు. సమీప పోలీస్ స్టేషన్లో ట్యాబ్ ఏర్పాటు చేస్తారు. పరికరం అమర్చిన షాపునకుగానీ, ఇంటికిగానీ దొంగలు వచ్చిన వెంటనే పరికరంలోని సీసీ కెమెరా ఫొటోలు తీస్తుంది. ఆ వెంటనే మోషన్ డిటెక్టర్ పనిచేయడం మొదలవుతుంది. ఈ డిటెక్టర్ నుంచి ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లోని ట్యాబ్కు, ఆ తరువాత యజమాని ఫోన్ నెంబర్కు సమాచారం వెళుతుంది. పోలీస్ స్టేషన్లోని ట్యాబ్లో సదరు ఇంటి/షాపు వివరాలు, ప్రాంతం వివరాలు కనిపిస్తాయి. స్టేషన్ సిబ్బంది ఈ వివరాలను పెట్రోలింగ్ పోలీసులకు ఫోన్/వాకీటాకీ ద్వారా అందజేస్తారు. వారు సాధ్యమైనంత త్వరలో ఆ ఇంటికి/షాపుకు చేరుకుంటారు. అంతేకాదు.. పెట్రోలింగ్ జీపులో కూడా ట్యాబ్లాంటి ప్రత్యేక పరికరం అమరిస్తే.. ఇంటి/షాపులోని సీసీ కెమెరాలో నమోదవుతున్న దృశ్యాలన్నిటినీ చూడవచ్చు. అప్పుడు దొంగలను పట్టుకోవడం సులభమవుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఈ పరికరం ఇలాగే సందేశాలను పంపడం ద్వారా అప్రమత్తం చేస్తుంది. దీనిని ముందుగా భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్, సీఐ శ్రీనివాస్కు వివరించినట్టు వెంకట్ చెప్పారు. భద్రాచలంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి చూద్దామని వారు చెప్పారని అన్నారు. తాను భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఖమ్మంలోని డిప్లొమా, భద్రాచలం పౌల్రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్, ఎంటెక్ పూర్తిచేసినట్టు చెప్పారు. -
కరీంనగర్ ప్రేమకథ!
ప్రేమ, వినోదం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈరోజుల్లో ప్రేమకథా చిత్రమ్’. దీనికి ‘కరీం నగర్లో’ అనేది ఉపశీర్షిక. క్రాంతి పిల్లి, సూర వేణుకుమార్, డింగారి సిద్ధార్థ్, వెంకట్, శ్రీలేఖ, ఉషాశ్రీ, సంజన, ప్రసన్న హీరో హీరోయిన్లుగా, అప్పారావు, ఆంజనేయులు ప్రధాన పాత్రల్లో క్రాంతి పిల్లి దర్శకత్వంలో పిల్లివారి కుటుంబం ఈ సినిమాను నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం చూస్తే ప్రేమలో ఎలా మోసపోకూడదో, ఏ ప్రేమ నిజమో, ఏది అబద్ధమో తెలుసుకుంటారు. ఈ చిత్రంలో మొత్తం 24 మంది సీనియర్ ఆర్టిస్టులు చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శరత్ చంద్ర. -
అక్రమ సంబంధాలు అంటగట్టి.. బయటకు గెంటాడు..
వరంగల్: జర్నలిస్టు పేరుతో చెలామణి అవుతున్న ఓ వ్యక్తి తన భార్యకు అక్రమ సంబంధాలు అంటగట్టడమేగాక, పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా తన సంతానం కాదంటూ వేధించడంతో భార్య అతడి ఇంటి ఎదుటే బైఠాయించింది. వివరాలు.. వరంగల్ రామన్నపేటలో నివాసముంటున్న రాసాల వెంకట్ ఓ మాస పత్రిక ఎడిటర్గా చెప్పుకొంటూ జర్నలిస్టుగా కొనసాగుతున్నాడు. అతడికి పావనితో 2000 ఏప్రిల్ 23న వివాహమైంది. పెళ్లి సమయంలో అతడికి రూ. 3 లక్షల కట్నం, 3 తులాల బంగారం, మోటార్సైకిల్ కోసం రూ. 50 వేలు ఇచ్చారు. కొంతకాలానికి పావని-వెంకట్ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. అంతే.. వెంకట్ అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. దీంతో పెద్దమనుషులు పంచాయితీ చేసి న్యూశాయంపేటలోని ఇంట్లో రెండు పోర్షన్లను రాసిచ్చారు. వాటి అద్దె కూడా వెంకట్ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత మరోసారి వేధించి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. కొంతకాలంగా భార్య పావనికి అక్రమ సంబంధాలు అంటగట్టడమేగాక, ఇద్దరు ఆడపిల్లలు తనకు పుట్టలేదని వెంకట్ వేధించేవాడు. డీఎన్ఏ పరీక్షల కోసం ఈ ఏడాది జూలై 7న నోటరీ స్టాంపు కాగితాలపై పావనితో బలవంతంగా సంతకాలు కూడా చేయించుకొని, భార్యా పిల్లల్ని బయటకు గెంటాడు. భర్త వేధింపులు భరించలేని పావని తల్లి గారింట్లో ఉంటూ.. 15 రోజుల క్రితం పోలీస్ కమిషనర్ను కలిసి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని మహిళా పోలీస్ స్టేషన్కు పంపారు. స్పందన లేకపోవడంతో ఐద్వా మహిళా సంఘం అండతో భర్త నివాసం ఎదుటే ఆదివారం ఆందోళనకు దిగింది. మట్టెవాడ సీఐ శివరామయ్య వచ్చి వెంకట్పై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉంచేలా న్యాయం చేస్తానని పావనికి హామీ ఇచ్చారు. కాగా, ఇలాంటి వ్యక్తులను సాంఘిక బహిష్కరణ చేయాలని మాజీ కార్పొరేటర్ మెడికట్ల సారంగపాణి, వెంకట్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా కార్యదర్శి రజిత డిమాండ్ చేశారు. -
ఫిట్నెస్ రిజల్యూషైన్
న్యూ ఇయర్ రెజల్యూషన్స్కు సంబంధించి లైఫ్స్టైల్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలినదేమిటంటే... ఈ ఏడాది అత్యధిక శాతం మంది తీసుకున్న తీర్మానాల్లో టాప్లో ఉంది ఎక్సర్సైజ్. అదే సమయంలో గత ఏడాది తీసుకున్న తీర్మానాలను విజయవంతంగా అమలు పరిచింది 8 శాతం మించలేదని కూడా తేలింది. నిర్ణయం తీసుకున్న తొలినాళ్లలో ఉన్న ఆసక్తి స్వల్పకాలంలోనే అటకెక్కడమే దీనికి కారణం. కొత్త ఏడాది ప్రారంభమై... ఇప్పటికే రెండు వారాలు కావస్తున్న నేపధ్యంలో... మనం తీసుకున్న ఆరోగ్యకరమైన తీర్మానాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించడానికి ఉపకరించే కొన్ని సూచనలు ఇస్తున్నారు సిటీకి చెందిన ట్రైనర్ వెంకట్... ..:: ఎస్.సత్యబాబు ఎప్పుడూ ఒకే రకమైన ఎక్సర్సైజ్ రొటీన్ను అలవాటు చేస్తే... రిజల్ట్స్ సరిగా కనపడక మధ్యలోనే ఆపేసే అవకాశం ఉంటుంది. విభిన్న రకాలైన వర్కవుట్స్, ఆ వర్కవుట్స్లో కూడా వైవిధ్యం అవసరం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుంటే... తరచు వెయిట్స్ మార్పు చేసుకోండి. ఒక రోజు జిమ్లో, మరొకరోజు అవుట్డోర్లో జాగింగ్, స్ట్రెచ్చింగ్, కిక్బాక్సింగ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, స్పిన్నింగ్, స్విమ్బాల్, డాన్స్ ఎరోబిక్స్... ఇలా చేంజ్ చేయండి. ఒకోసారి మనతో ఫ్యామిలీని లేదా కనీసం పెట్డాగ్ను తీసుకెళ్లడం, పిల్లలతో ఆటలాడడం... ఇలా ఫిట్నెస్ రొటీన్ను వైవిధ్యభరితంగా తీర్చిదిద్దుకుంటే ఇక మీకు ఎక్సర్సైజ్ బోర్ కొట్టదు. తద్వారా... ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. తీరైన డ్రెస్సింగ్... డిఫరెంట్ డ్రెస్సింగ్ కూడా వర్కవుట్ రొటీన్ను ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది. మరీ టైట్గా ఉండని, బాగా సౌకర్యవంతంగా, కుషనింగ్ ఉన్న షూస్ ఎంచుకోండి. శాటిన్, కాటన్... ఫ్యాబ్రిక్స్లో ట్రాక్ సూట్స్ ఆకర్షణీయమైనవి దొరుకుతున్నాయి. చేతులకు గ్లవ్స్, వెయిస్ట్ బెల్ట్స్, కేలరీ కాలిక్యులేటర్.... కాస్త ఖర్చయినా మంచివి ఎంచుకోవాలి. వీటన్నింటిని ధరించడం వల్ల వచ్చే స్పెషల్ లుక్ కూడా ఎక్సర్సైజ్ పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. స్పీడ్ రిజల్ట్స్తో కిక్... తొలిరోజుల్లో చెప్పుకోదగ్గ రిజల్ట్స్ వస్తే అదొక కిక్లాగా పనిచేసి వర్కవుట్స్ రెగ్యులర్ అవడానికి కారణమవుతుంది. వెయిట్ లాస్ లేదా మరేదైనా రిజల్ట్ త్వరితంగా కనపడాలని ఆశించడం సహజమే. అలా జరగకపోతే నిరుత్సాహం ఆవరిస్తుంది. తొలినాళ్లలో కాస్త వేగంగా ఫలితాలనిచ్చే వ్యాయామం ఎంచుకోవాలి. బ్రిస్క్వాకింగ్ వల్ల క్యాలరీలు బాగా ఖర్చువుతాయి. జాగింగ్ ఒక గంటలో 6-7 కిలోమీటర్లు, నడక 10-12 కి.మీ చేయగలిగితే... మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ఎక్సర్సైజ్ రొటీన్ అందరికీ ఒకటే విధంగా నప్పదు. కాంబినేషన్ ఎక్సర్సైజ్లు చేయడం అనేది అన్ని వేళలా మంచిది. డైట్ మారితే... రైట్ రైట్ వ్యాయామం ప్రారంభించడంతో పాటు తప్పనిసరిగా ఆహారంలోనూ మార్పు చేర్పులు చేసుకోవాలి. ప్రత్యేకమైన, శక్తిని పెంచే పోషకాలు నిండిన ఆహారాన్ని డైట్లో జతచేయాలి. టీ, కాఫీ, జంక్ఫుడ్ వంటి వాటిని తగ్గించేసి, వాటి స్థానంలో ప్రొటీన్లు, విటమిన్లను అందించే మంచి ఫుడ్ని చేర్చడం ద్వారా సరికొత్త షాపింగ్ అలవాటవుతుంది. ఇంట్లోనూ, ఒంట్లోనూ కొత్త హుషారు వస్తుంది. ఇలాంటి మార్పులు, టైమింగ్ వంటివి కొత్త కొత్త సరదాలను, ఆసక్తులను ప్రోది చేస్తాయి. తద్వారా వ్యాయామాన్ని క్రమబద్ధం చేస్తాయి. ఈ ఏడాది మీరు తీసుకున్న ఓ చక్కని హెల్దీ రిజల్యూషన్ని విజయవంతం అయ్యేలా చేస్తాయి. కొన్ని టిప్స్: ప్రారంభంలో వార్మప్, కూల్డవున్ స్ట్రెచెస్ బాగా ప్రాక్టీస్ చేయాలి 8 నుంచి 10రిపిటీషన్స్, 3లేదా 4 సెట్స్ ప్రయత్నించాలి. రిపిటీషన్స్కు మధ్య 3-4సెకన్లు, సెట్కి సెట్కి మధ్య అరనిమిషం నుంచి నిమిషం విరామం ఇవ్వాలి. ఒక వ్యాయామం ఒక సెట్ చేయడానికి పట్టే సమయం చేస్తున్న కొద్దీతగ్గుతుంది. అంటే మీ సామర్ధ్యం పెరుగుతున్నట్టే. ఏ వయసు వారైనా చేయదగింది యోగా. ఆరంభంలో సూర్యనమస్కారాలు ఎంచుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో కొంతమందికి తక్కువ వెయిట్ ఎక్కువ రిపిటీషన్లు, మరికొంత మందికి ఎక్కువ వెయిట్ తక్కువ రిపిటీషన్లు... ఇలా బాడీ నేచర్ని బట్టి చేయాలి. బాడీబిల్డింగ్ సిద్ధాంతం ప్రకారం హెవీ వెయిట్ వల్ల సైజ్ వస్తుంది. దానికి కూడా మినిమం 8 లేదా 10రిపిటీషన్లు చేయాలి. ఎం. వెంకట్, ఫిట్నెస్ ట్రైనర్ -
వర్కవుట్స్తో వింటర్
చలి మీద గెలుపు సాధించాలంటే ఒకటే మార్గం... వర్కవుట్స్ అంటున్నాడు ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్. అయితే కాస్తంత కదలాలంటేనే బద్దకంగా అనిపించే వెదర్లో... వ్యాయామం అంటే ఎలా అని అడిగేవారికీ కొదవలేదు. అయితే చలికాలం తెచ్చే సమస్యలను ఎదుర్కోవాలంటే ఎక్సర్సైజ్ని మించిన అద్భుతమైన మార్గం లేదంటున్న వెంకట్... వింటర్ వర్కవుట్స్కు సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నారిలా... -ఎస్.సత్యబాబు చలిలో ఎక్సర్సైజ్ ఎనిగ్మా, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలను మరింత జఠిలం చేస్తుంది. వయసు మళ్లిన వారు, దీర్ఘకాల వ్యాధులున్నవారు మంచు కురిసే చోట చేయడం వల్ల ఫ్రాస్ట్బైట్, హైపోథెర్మియా వంటి సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెయిట్స్తో చేసే స్ట్రెంగ్త్ ట్రయినింగ్, స్విమ్మింగ్ల కన్నా బ్రిస్క్వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటి ఎరోబిక్ వ్యాయామాలు బాగా ఉపయుక్తం. చలి మరీ ఎక్కువుంటే ఇంట్లోనే ఫ్లోర్ మీద చేసే సిటప్స్, పుషప్స్, స్క్వాట్స్, చైర్ డిప్స్ వంటివి ఎంచుకోవాలి. డ్యాన్సింగ్, స్కిప్పింగ్, స్టెప్ అప్స్ వంటివీ సాధన చేయవచ్చు. వార్మప్ లేకపోతే ఈ సీజన్లో వ్యాయామం గాయాల పాలు చేస్తుంది. ఏ వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ అయినా సరే ఇది తప్పదు. వర్కవుట్స్కి ముందు సాధారణ రోజుల్లో కన్నా రెట్టింపు సమయం వార్మప్కే కేటాయించాలి. దేహాన్ని వెచ్చగా ఉంచేలా దుస్తుల్ని వాడాలి. వాకింగ్, జాగింగ్ చేసేవారు బ్రైట్ కలర్స్ ధరించడం మంచిది. అవి మీ డ్రెస్ను, మిమ్మల్ని ఎదుటి వాహనాలు, వ్యక్తులకు మరింతగా కనపడేట్టు చేస్తాయి. ఒక దానిమీద ఒకటి చొప్పున రెండు మూడు పొరలుగా (లేయర్డ్) దుస్తులు ధరించాలి. ముఖ్యంగా అవుట్డోర్లో చేసేవారికిది తప్పనిసరి. దీనివల్ల వేడి పుడుతుంది. అలాగే చేతులకు గ్లవ్స్, తలకు క్యాప్ ధరించడం మంచిది. చెమట పట్టిందని వెంట వెంటనే దుస్తులను తొలగించకుండా వాతావరణానికి ఎడ్జెస్ట్ అయ్యేందుకు దేహానికి కొంత వ్యవధి ఇవ్వాలి. ఈ సీజన్లో సూర్యోదయం తరువాత ఎక్సర్సైజ్లు చేస్తే మేలు. వ్యాయామ సమయంలో నోటితో కన్నా ముక్కుతో గాలి పీల్చడమే శ్రేయస్కరం. నోటితో పీల్చినపుడు చలిగాలి తిన్నగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాససంబంధ ఇబ్బందులు సృష్టిస్తుంది. వర్కింగ్ అవర్స్లో మెట్లు ఎక్కి దిగడం, మొబైల్లో నడుస్తూ మాట్లాడడం, క్లీనింగ్, గార్డెనింగ్ వంటివి చేస్తుండాలి. వ్యాయామాన్ని ఇష్టపడే వారికి చలికాలం మంచి సీజన్. లేజీనెస్ దూరం కావాలన్నా, ఫిజిక్ మంచి షేపప్ అవ్వాలన్నా వింటర్ వెదర్ అనువైనది. వెంకట్... -
రిపబ్లిక్ డే పరేడ్కు వెంకట్
చిట్యాల : 2015, జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి భవన్ ఎదుట జరిగే పరేడ్కు కుందనపల్లి గ్రామానికి చెందిన మాడుగుల వెంకట్ ఎంపికయ్యాడు. హైదరాబాద్లోని నిజాం కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వెంకట్ ఎన్ఎస్ఎస్ వలంటీర్గా సేవలందిస్తున్నాడు. ఈ క్రమం లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మొ దటిసారిగా యూనివర్సిటీ స్థాయిలో వలంటీర్లను కవాతు కోసం ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో అక్టోబర్ 11 నుంచి 22 వరకు వీరికి శిక్షణ ఇచ్చారు. గుజ రాత్, మహారాష్ట్ర, గోవా, దాద్రనగర్ హవేళి, డయ్యూడామన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 200 మంది శిక్షణ పొందారు. అందులో 40 మందిని పరేడ్కు ఎంపిక చేశా రు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురిని ఎం పిక చేయగా.. వరంగల్ జిల్లా నుంచి తాను ఒక్కడినే పరేడ్కు ఎంపికైనట్లు వెంకట్ తెలిపా డు. ఢిల్లీలో జనవరి 1 నుంచి 25 వరకు కవా తు ప్రాక్టీస్ చేసి 26న రాష్ట్రపతి భవన్ ఎదుట ప్రదర్శన ఉంటుందని తెలిపాడు. కాగా, పరేడ్కు ఎంపికైన వెంకట్ను ఓయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి.రెడ్యానాయక్, నిజాం కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీధర్, కోచ్ డాక్టర్ రవితేజ అభినందించారు. -
కండ బలం కష్టం కాదు...
ఫిట్నెస్కి సింబల్గా కనిపించే ప్యాక్ అంటే క్రేజ్ పెరుగుతూనే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో షారూఖ్ మరోసారి తన ఫిజిక్తో ఫ్యాన్స్ని ప్యాక్ చేసేశాడు. దీంతో ‘సిటీయూత్లో ‘సిక్స్’ ఫీవర్ ఒక్కసారిగా రెండింతలైంది. అయితే ఆరుపలకల అపు‘రూపం’సినిమా, సెలబ్రిటీలకు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా సిక్సర్ కొడుతున్నారు. అది చాలా సులభమని కొందరు అనుకుంటుంటే.. ఇప్పటికీ అత్యంత కఠినమైన ప్రయాసని మరికొందరు భావిస్తున్నారు. నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ ఏమంటున్నారంటే... ఆరు పలకలు అందరికీ... సిక్స్ప్యాక్ అంటే కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకురావు. ప్రతి మనిషి శరీరంలో సహజంగానే ఉండే మజిల్స్. అయితే వంశపారంపర్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాలు, బోన్స్ వగైరాల లాగానే ఫ్యాట్తో అవి కూడా కవర్ అయిపోతాయి. అలా అట్టడుగున్న ఉన్న వాటిని హార్డ్ వర్క్వుట్స్, ఎక్సర్సైజ్ల ద్వారా వెలుగులోకి తీసుకురావడ ం జరుగుతుంది. ఇవి కొందరికే సాధ్యం మరికొందరికి అసాధ్యం అనేది అపోహ మాత్రమే. వ్యక్తి శరీరపు తీరుతెన్నులపై ఆధారపడి 4 నుంచి 8(ఎయిట్ప్యాక్) దాకా పలకలను బిల్డప్ చేయవచ్చు. వ్యక్తి దేహం తీరుని బట్టి ఈ కండరాలు వెల్లడవడానికి 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా సమయం తీసుకుంటాయి. ఆత్రపడి సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడడం ప్రమాదకరం. డైట్ ఇంపార్టెంట్.. ఈ సిక్స్ప్యాక్కి గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైనది స్ట్రిక్ట్ డైట్. ఫ్యాట్ స్టమక్ని సాధించే క్రమంలో ట్రైనర్ సూచించిన డైట్ని తప్పనిసరిగా టైమ్ ప్రకారం ఫాలో అవ్వాలి. వీటిని సాధించడం మాత్రమే కాదు కాపాడుకోవడం కూడా కష్టమే. కొన్ని రోజులపాటు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే చాలు మాయమైపోతాయి. ఎగ్వైట్స్, ఫ్రూట్స్, గ్రిల్డ్ చికెన్... ఇలా ప్రొటీన్ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఫుడ్ ద్వారా సరిపోకపోతే అవసరాన్ని బట్టి ప్రొటీన్షేక్స్, ఎనర్జీడ్రింక్స్ వినియోగించవచ్చు. సిస్టమాటిక్... వర్కవుట్... క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. లక్ష్యం సిక్స్ప్యాక్ అయినప్పటికీ ఫిజిక్ని ఓవరాల్గా బిల్డప్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీనిలో భాగంగా రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్... వంటివి తప్పనిసరిగా భాగం కావాలి. ఒకేసారి కాకుండా వ్యాయామ సమయాన్ని విడతలవారీగా పెంచుకుంటూ రోజుకు కనీసం 2 నుంచి 3 గంటల పాటు చేయాల్సి ఉంటుంది. పొట్టకండరాలైన యాబ్స్కి ఎక్కువ శ్రమ ఉంటుంది కాబట్టి... అబ్డామినల్ ఎక్సర్సైజ్లు శిక్షకుల పర్యవేక్షణలో చేయాలి ఎందుకంటే చేసేవిధానంలో లోపాలుంటే మరిన్ని రకాల శారీరకసమస్యలకది కారణం కావచ్చు. - ఎస్.సత్యబాబు -
నిజంగానే పోలీస్ శిక్షణ తీసుకున్నా : వెంకట్
‘‘ఓ ఐఏయస్ అధికారి ముఖ్యమంతి అయితే ఎలా ఉంటుంది? యువతరం తలుచుకుంటే... సమాజంలో ఎలాంటి మార్పు తేగలరు? ఈ ప్రశ్నలకు సమాధానంగా మా ‘ఆ ఐదుగురు’ సినిమా ఉంటుంది’’ అని వెంకట్ అన్నారు. వెంకట్ ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆ ఐదుగురు’. అనిల్ జేసన్ గూడూరుని దర్శకునిగా పరిచయం చేస్తూ... సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ్కుమార్ పట్రా సమర్పిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో వెంకట్ విలేకరులతో ముచ్చటించారు. ‘‘ఇందులో నేను 40 మంది యువకులకు శిక్షణ ఇచ్చే పోలీస్ అధికారిని. నా శిక్షణ నుంచి బయటకొచ్చిన ఓ ఐదుగురు సమాజంలో ఎలాంటి చైతన్యాన్ని తెచ్చారన్నదే ఈ సినిమా ఇతివృత్తం. నా కెరీర్లో పోలీస్గా కనిపించడం ఇదే ప్రథమం. ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో రవికుమార్ అనే ఎస్.ఐ దగ్గర నిజంగానే పోలీస్ శిక్షణ తీసుకున్నాను. కథ నచ్చడంతో పోలీసులు కూడా ఈ సినిమాకు ఎంతో సహకరించారు. 35 మంది నిజమైన పోలీసు మధ్య శిక్షణ తీసుకోవడం నిజంగా మరచిపోలేను. పోలీస్ పాత్రలో సహజత్వం కోసం ఎంతో కష్టపడ్డాను. వారి జీవన శైలిని అధ్యయనం చేశాను. డూప్ లేకుండా పోరాటాలు కూడా చేశాను. ఈ కారణంగా బలమైన దెబ్బలు తగిలి కొన్నాళ్లు షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఇదంతా సినిమాపై ఇష్టంతో చేసిందే. ఈ సినిమాలోని ప్రతి పాత్రలో హీరోయిజం ఉంటుంది’’ అని వెంకట్ చెప్పారు. కథ నచ్చితే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధమని, ‘ఈగ’లో సుదీప్లా విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను రెడీగా ఉన్నానని ఈ సందర్భంగా వెంకట్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం లేదని, కలిసి నటించడానికి అందరూ ముందుకొస్తే మంచి కథలొస్తాయని వెంకట్ పేర్కొన్నారు. చిన్న సినిమాలకు పరిశ్రమలో స్థానం లేకుండా పోతోందని, ఈ విషయమై పవన్కల్యాణ్ని కలవాలనుకుంటున్నానని, ఈ సమస్యను ఆయన మాత్రమే పరిష్కరించగలరని వెంకట్ అభిప్రాయపడ్డారు. -
విశ్వరూప మహా గణపతి
ఈ సంవత్సరం శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం 60 సంవత్సరాల సందర్బంగా 60 అడుగుల ఎత్తులో దర్శనం ఖైరతాబాద్: ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ‘శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 60 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పున తామరపువ్వుపై దశ బాహువులతో నిల్చున్న త్రిముఖ గణపతికి ఇరువైపులా శివపార్వతుల శిరసులు ఉంటాయి. వెనుక ఏడు తలల సర్పం.. దానికి ఇరువైపులా కుమారస్వామి, అయ్యప్ప (12 అడుగుల ఎత్తు చొప్పున) ఉంటారు. ఇక, కింద రెండుపక్కలా సిద్ధి-బుద్ధి విగ్రహాల (ఒక్కొక్కటి 15 అడుగుల ఎత్తు)తో పాటు శివుడు, పార్వతి, వినాయకుల వాహనాలైన నంది, సింహం, ఎలుక రూపాలు ఉంటాయి. వినాయకునికి కుడి, ఎడమల్లో 20 అడుగుల చొప్పున ఎత్తులో లక్ష్మీనర్సింహస్వామి, దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పడి 60వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి 60 అడుగుల గణపతి విగ్రహాన్ని రూపుదిద్దుతున్నట్టు కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మహా గణపతి నమూనా పోస్టర్ను ఉత్సవ కమిటీ విడుదల చేసింది. కార్యక్రమంలో శిల్పి రాజేంద్రన్, ఆర్ట్ డెరైక్టర్ గువ్వల వెంకట్, సభ్యులు సందీప్, రాజ్కుమార్, మహేష్యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 40 శాతం పనులు పూర్తి 1978 నుంచి ఖైరతాబాద్ మహా గణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నాను. ఈ ఏట మహా గణపతికి షష్ఠి పూర్తి సందర్భంగా శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతిగా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే 40 శాతం వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. జూలై 4 నుంచి పనులు మరింత ఊపందుకుంటాయి. - శిల్పి రాజేంద్రన్ అదృష్టం దక్కింది 60 ఏళ్ల ఖైరతాబాద్ మహా గణపతికి ప్రతి రూపాన్ని చిత్రించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. శిల్పి రాజేంద్రన్ సూచనల మేరకు పూర్తి స్థాయి రూపాన్ని తెచ్చేందుకు నాలుగు రోజులు పట్టింది. మహా గణపతి ఆశీస్సులతోనే దిగ్విజయంగా పని పూర్తిచేశాను. - ఆర్ట్ డెరైక్టర్ గువ్వల వెంకట్ -
విలువలున్న సినిమాలే తీస్తాను..!
‘‘సత్యం, మార్గం, లక్ష్యం, నమ్మకం... వీటినే ఆయుధాలుగా చేసుకొని ఐదుగురు యువకులు చేసిన పోరాటమే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. యువతరం తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే సినిమా ఇది’’ అని ప్రేమ్కుమార్ పట్రా అన్నారు. ఆయన సమర్పణలో క్రాంతి, తనిష్క్, క్రాంతికుమార్, వాసు, కృష్ణతేజ ప్రధాన పాత్రలు, వెంకట్, అస్మితాసూద్ ప్రత్యేక పాత్రలు పోషించిన చిత్రం ‘ఆ అయిదుగురు’. అనిల్ జేసన్ గూడూరును దర్శకునిగా పరిచయం చేస్తూ సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రేమ్కుమార్ మాట్లాడుతూ, ‘‘ఐదుగురు పాండవులు, ఒక్కడే కృష్ణుడు... ఈ కాన్సెప్ట్తో ఈ కథ తయారు చేశాం. ఐదుగురు యువకులుగా కొత్తవారిని పరిచయం చేశాం. ఇక వీరిని నడిపించే పాత్రను వెంకట్ పోషించారు. నా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆ నలుగురు, వినాయకుడు. ఈ రెండూ నంది అవార్డులు అందుకున్నాయి. ఈ చిత్రంతో మూడోసారి నందిని అందుకోబోతున్నా’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్కుమార్. ఈ సినిమాలో ఓ కామెడీ పాత్ర చేశానని, ఇక నుంచి నటునిగా కూడా కొనసాగాలనుకుంటున్నానని ప్రేమ్కుమార్ చెప్పారు. ‘‘తెలుగు సినీ చరిత్రలోని టాప్ 100 చిత్రాల్లో నా ‘ఆ నలుగురు’ కూడా ఉంది. ఒక పాతాళభైరవి, ఒక శంకరాభరణం లాంటి క్లాసిక్స్తో పాటు నా ‘ఆ నలుగురు’ కూడా చెప్పుకుంటారు. ఒక నిర్మాతగా నాకిది చాలు. ఇక నుంచి కూడా విలువలతో కూడిన సినిమాలే తీస్తాను’’ అని ప్రేమ్కుమార్ వెల్లడించారు. చిన్న సినిమాలకు పంపిణీదారుల నుంచి కూడా ప్రోత్సాహం అందడం లేదని, ఎదురు డబ్బులిచ్చి సినిమాలను విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొందని, అదే బూతు సినిమాలనైతే... పోటీ పడి మరీ విడుదల చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ ఇమేజ్కి తగ్గట్టుగా...
‘‘ ‘ఆ నలుగురు’ చరిత్రలో నిలిచిపోయిన సినిమా. అందులో హీరో రఘురామ్ సమాజం కోసం ఆలోచించే మనిషి. అలాంటి వ్యక్తే వయసు తగ్గి ముఖ్యమంత్రి అయితే సమాజానికి ఎలాంటి సేవ చేస్తాడనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శకుడు అనిల్ జాసన్ గూడూరు తెలిపారు. వెంకట్ కీలకపాత్ర పోషించిన చిత్రం ‘ఆ ఐదుగురు’. క్రాంతి, క్రాంతికుమార్, తనిష్క్ రెడ్డి, కృష్ణతేజ, శశి, అస్మితా సూద్ ఇందులో ముఖ్య తారలు. ప్రేమ్ మూవీస్ పతాకంపై సరితా పట్రా నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రేమ్కుమార్ పట్రా మాట్లాడుతూ -‘‘ ‘ఆ నలుగురు, వినాయకుడు చిత్రాలతో ప్రజల ప్రశంసలతో పాటు అనేక పురస్కారాలు గెలుచుకున్నాం. మా సంస్థ ఇమేజ్ని మరింత నిలబెట్టే విధంగా ఈ ‘ఆ ఐదుగురు’ ఉంటుంది. సామాజిక స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మా నటీనటులకు పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: సుద్దాల అశోక్తేజ, కెమెరా: పీజీ విందా, సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్కుమార్ పట్రా. -
నన్ను హీరోను చేసింది బెజవాడే
నేను పుట్టింది బెజవాడలోనే ..నన్ను హీరోను చేసింది కూడా బెజవాడేనని ఆ ఐదుగురు సినీహీరో వెంకట్ అన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న ఎం అండ్ ఎం షోరూమ్ నిర్వాహకులు హీరో వెంకట్, హీరోయిన్ అస్మితలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వెంకట్ మాట్లాడుతూ.. నేను బెజవాడలో పుట్టినప్పటికీ, చదువుకున్నదీ ముంబయిలో అని చెప్పారు. ప్రతి వేసవి సెలవులకు బెజవాడ వచ్చి, ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడినన్నారు. గాంధీనగర్లో సినిమా థియేటర్లు ఉన్న రోడ్డు అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ సినిమాలు చూసే హీరో అయ్యానని చెప్పారు. నేను క్యూలో నిల్చుని, బెంచి టికెట్ కొనుక్కుని సినిమా చూసిన థియేటర్లలో నేను నటించిన సినిమాలు సీతారాముల కల్యాణం, శివరామరాజు వంటి సినిమాలు అత్యధిక రోజులు ప్రదర్శితమవడం ఆనందంగా ఉందన్నారు. ‘ఆ ఐదుగురు’ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుందని, ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి అయితే సమాజంలో ఎలా మార్పు తీసుకురాగలడన్నది ప్రధాన ఇతివృత్తమని వివరించారు. రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు తక్కువగా ఉంటాయన్నారు. సినిమా హీరోయిన్ అస్మిత మాట్లాడుతూ..ఈ సినిమా తన మూడో చిత్రమని చెప్పారు. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్నారు. నిర్మాత ప్రేమ్ పట్రా మాట్లాడుతూ.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు. -
'ఆ ఐదుగురు' మూవీ ట్రైలర్ లాంచ్
-
'ఆ ఐదుగురు' సినిమా స్టిల్స్
-
గడువు దాటొద్దు...
=నాణ్యత ప్రమాణాలు పాటించాలి =అధికారులు సమన్వయంతో పనులు పర్యవేక్షించాలి =భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలి =మంత్రులు బలరాం, వెంకటరెడ్డి =మహాజాతర ఏర్పాట్లపై మేడారంలో అమాత్యుల సమీక్ష =వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన మేడారం (గోవిందరావుపేట), న్యూస్లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయూలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా నిరంతరంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ గుండు సుధారాణి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కిషన్ హాజరయ్యూరు. ఈ సందర్భంగా అధికారులు తమ తమ పరిధిలో జరుగుతున్న పనుల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా నాయక్, వెంకటరెడ్డి మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోటి మంది భక్తులు వస్తారన్న అంచనాలకు తగ్గట్లుగా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 24వ తేదీన మేడారంలో మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అప్పటివరకు పనులన్నీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. అటవీ, ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకోవాలని ఏ జీఓలో ఉంది... అంటూ మంత్రులు బలరాం నాయక్, వెంకటరెడ్డి అటవీ, ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తు.. సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాంటి వారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని మండిపడ్డారు. కాల్వపల్లి- నార్లాపూర్ రోడ్డు పనులు నిర్వహిస్తున్న వాహనాలను అటవీ అధికారులు అడ్డుకోవడంతోపాటు వాటి తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రుల దృష్టికి రాగా... వారు ఇలా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తీసుకువచ్చే ట్రాక్టర్లను కూడా ఆపొద్దని పోలీస్ అధికారులకు సూచించారు. అనంతరం గుడుంబా నివారణకు తీసుకుంటున్న చర్యలను ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాల నుంచి వచ్చే నల్లబెల్లాన్ని నియంత్రించకుండా స్థానికులపై దాడులు చేయడమేంటని వారిని మంత్రులు ప్రశ్నించారు. తన పార్లమెంట్ పరిధిలో 30 వేల మంది సారా తాగి చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని బలరాం నాయక్ తెలిపారు. అక్రమంగా బెల్లం, ఇతర వస్తువులను తీసుకువస్తున్న వాహనాలు, అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలని... దీని ద్వారా గుడుంబా తయారీ, అమ్మకాలు వాటంతట అవే తగ్గిపోతాయన్నారు. రెడ్డిగూడెంలో మద్యం నిల్వకు ప్రత్యేక గోడౌన్ ప్రతి సారి ట్రాఫిక్ రద్దీతో డిమాండ్కు అనుగుణంగా మద్యం బాటిళ్లను తీసుకురాలేక పోతున్నారని, ఈ మేరకు తగు చర్యలు చేపడుతున్నట్లు మంత్రులకు ఎక్సైజ్ అధికారులు వివరించారు. అధిక మొత్తంలో మద్యాన్ని దుకాణదారులకు అందించేలా రెడ్డిగూడెంలో ప్రత్యేక గోడౌన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుంకం చెల్లించని, కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు 10 చెక్పోస్టులు, ఏడు పెట్రోలింగ్ వాహనాలను వినియోగించనున్నట్లు వెల్లడించారు. బస్టాండ్ వద్ద కనీస పనులకు నిధులివ్వండి బస్టాండ్ ప్రాంగణంలో ప్రతి సారి వెట్మిక్స్ వేయడం ద్వారా మట్టి లేవకుండా ఉండేదని... ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్టాండు వద్ద లెవలింగ్, రోలింగ్ మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్టాండ్ చుట్టూ రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వారు... మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బస్టాండ్ ప్రాంగణంలో కనీస పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆల్కహాల్ బ్రీతింగ్ అనలైజర్లను అన్ని పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేసి.... డ్రైవర్లను పరీక్షించాలన్నారు. దీనివల్ల భక్తులకు బస్సు ప్రయాణంపై నమ్మకం కలుగుతుందన్నారు. సమావేశంలో ఏజేసీ, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ సంజీవయ్య, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. అధిక నిధులిచ్చిన ఘనత మాదే : రాంరెడ్డి ఆదివాసీల జాతరకు అత్యధిక నిధులిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రూ.100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయనతోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట్రమణారెడ్డి, రాష్ట్రమంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిలు ప్రారంభించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ప్రస్తుత జాతరకు కోటి మంది భక్తులు వస్తారనే అంచనాలకనుగుణంగా ప్రభుత్వం నిధుల మం జూరు చేసేలా ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేశారన్నారు. ప్రతిసారి పనుల హడావుడితో పనుల్లో నాణ్యత లోపాలు తలెత్తాయని.. ఇప్పటికైనా అలాంటి సంప్రదాయూనికి చెక్ పెట్టేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట వేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని, వీరిలో పట్టాలు లేని రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ఎమ్మెల్యే సీతక్క కోరగా... మంత్రులు సానుకూలంగా స్పందించారు. రైతులకు ఏదో ఒక రూపంలో పరిహారం అందే లా చూస్తామన్నారు. స్థానికంగా ఆదివాసి మ్యూజియం ఏర్పాటుకు రూ.3 కోట్లు, చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్కు రూ.కోటి విడుదల చేస్తామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసేందుకు ప్రజాప్రతినిధులు మూడు రోజుల జాతర వద్దే ఉండాలని మంత్రి రాంరెడ్డి సూచించారు. ఎంపీ రాజయ్య మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన నాయకులు కొందరు సమ్మక్క-సారలమ్మ తల్లుల ముందు ఓ మాట, మనసులో మరో మాట అనుకుంటారని... అయితే వారి మనసులోని మాట తల్లులకు తెలుసన్నారు. వారి మనసులో ఉండే కుతంత్రాలను మార్చాలని తాము తల్లులను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. పనుల ప్రారంభోత్సవంలో కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఏజేసీ, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ సంజీవయ్య, మేడారం ట్రస్ట్బోర్డు చైర్మన్ నాలి కన్నయ్య, డీఎంహెచ్ఓ సాంబశివరావు, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
దూరంగా ఉన్నా... దగ్గర కావచ్చు!
పెళ్లి అనేది ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అది ఆనందంతో పాటు ఎన్నో సందేహాలను, భయాలను, కన్ఫ్యూజన్లను తీసుకొస్తుంది. నాపెళ్ళి సమయంలో నేను కూడా వీటన్నిటితో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. పెళ్ళి తర్వాత నాజీవితం ఎలా ఉంటుందో... నాభర్త నన్ను అర్థం చేసుకుంటారో లేదోనన్న భయం... అక్కడ అడ్జస్ట్ అవగలనో లేదోనన్న సందేహం, అక్కడి వాళ్ళ మసస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియక కన్ఫ్యూజన్ కలిసి నన్ను కుదరుగా ఉండనివ్వలేదు. ఏదైతేనేం... వెంకట్ గారితో నా పెళ్ళి జరిగిపోయింది. నేను చిన్న కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం కూడా అంతే వేగంగా అయిపోయింది. వెంటనే హనీమూన్, చుట్టాలింటికి భోజనాలకు వెళ్ళడాలు వంటి వాటితో ఓ నెల రోజులు ఊపిరాడలేదు. ఆ తర్వాత మొదలైంది అత్తారింటిలో అసలైన జీవితం. మా అత్తగారు మంచిదే. కానీ ఆవిడ చెప్పింది చెప్పినట్టు పాటించాల్సిందే! లేదంటే చాలా ఫీలైపోయి ముఖం మాడ్చుకుని కూర్చునేది. ఏంటలా ఉన్నావని పొరపాటున ఏ కొడుకో అడిగాడా... ‘మీ నాన్న పోవడంతోనే నా విలువ పోయింది’ అంటూ ముక్కు చీదేది. దాంతో కొడుకులు కరిగిపోయేవారు. కట్ చేస్తే ఏముంది... ‘అమ్మను అర్థం చేసుకోండి, ఆమెను బాధపెట్టకండి’ అంటూ మాకు క్లాసులు. వంటదగ్గర్నుంచి ప్రతి విషయం గురించీ ముందే ఆజ్ఞలు జారీ చేసేసేది. ఆమె ఏది వండమంటే అదే వండాలి. ఇంట్లో లేదు కదా అని మరొటి వండితే ఇక అంతే సంగతులు. ఏదో పెద్దావిడలే అని సరిపెట్టేసుకునేదాన్ని. కానీ నా భర్తకు, నాకు ప్రైవసీ లేకపోతే మాత్ర చాలా బాధ కలిగేది. ఆయన నాకు చీర కొనుక్కొచ్చినా మొదట ఆవిడే చూడాలి. ఓసారి ఆయన అలా చూపించకుండా ఇచ్చారని నానా యాగీ చేసింది. పోనీ చూపిస్తే ఆనందపడేదా అంటే అదీ లేదు. దాంతో మా వారు పూలు తేవడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. నా మనసు చివుక్కుమనేది. మా తోడికోడళ్ళు కూడా అదోలా ప్రవర్తించేవారు. వాళ్ళకూ నా మీద కోపమేమీ లేదు. కానీ అత్తగారిని ఏమీ అనలేక నా మీద ప్రతాపం చూపించేవారు. వాళ్ళ పనులు నా మీద రుద్దడం, ఏదైనా తేడా జరిగి అత్తగారు కోప్పడితే నా మీద తోసెయ్యడం, మావారు నేనూ సన్నిహితంగా ఉంటే సెటైర్లు వేయడం చేసేవారు. ఓ ఆరునెలలు ఇవన్నీ భరించానుకానీ ఓరోజు నా ఓపిక నశించిపోయింది. ఆరోజు నా అపాయింట్మెంట్ ఆర్డర్ని మా ఇంట్లో చూపించాను. దాంతో చిన్నపాటి యుద్ధమే చెలరేగింది. తమకు మాట మాత్రమైనా చెప్పలేదని తోడికోడళ్ళు, అసలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని అత్తగారు అనేసరికి నాకు తిక్కరేగినట్టైంది...‘‘నేను ఎంబీయే చేశాను, నాతెలివితేటల్ని, చదువుని వృథా చేసుకోలేను, అయినా నాభర్త ఒప్పుకున్నారు’’ అని అనేసరికి అత్తగారు భద్రకాళి అయ్యారు. ‘అంతా నీ ఇష్టమేనా, అంత పెద్దవాడివైపోయావా!’ అంటూ మావారి మీద కేకలేశారు. నన్ను అమితంగా ఆశ్చర్యపర్చిన విషయం... మావారు నన్ను సపోర్ట్ చేస్తూ ఒక్కమాట కూడా మాట్టాడకపోవడం. తర్వాత నా దగ్గరకు వచ్చి, అమ్మకిష్టం లేదు కదా, ఉద్యోగం సంగతి మరోసారి ఆలోచించు అనడం.ఇక నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ వచ్చిందని నాకు అర్థమైంది. మావారికి ఒకటే చెప్పాను. ‘నాకు మీ అమ్మగారు. అన్నా వదినలు ముఖ్యమే... కానీ అంతకంటే ముందు మీరు, నాభవిష్యత్తు ముఖ్యం, మీరు నాభవిష్యత్తుగా తోడుగా ఉంటారా లేదా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి’ అన్నాను. ఆయన కాస్త ఆలోచించే మనిషే. అందుకే నన్నేమీ అనలేదు. అలాగని ఎస్ కూడా చెప్పలేదు. మౌనంగా ఉండిపోయారు. నేను తనతో చెప్పాను...‘‘దగ్గరగా ఉండి స్ఫర్థలు పెంచుకుంటున్నాం. దూరంగా ఉండే ప్రేమలు పెంచుకుందాం, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఏమన్నా నేను సహించాను, కానీ నాకంటూ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటి గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అందుకే దూరంగా ఉండి మన బతుకు మనం బతుకుదాం, కానీ మీ వాళ్లకు మాత్రం దూరం కావద్దు, వాళ్ళ పట్ల అన్ని బాధ్యతలూ నెరవేరుద్దాం’’ అన్నాను. మావారు మొత్తానికి కన్విన్స్ అయ్యారు. అత్తగారు మా నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఆయన అన్నలు, వదినలు మమ్మల్ని సపోర్ట్ చెయ్యలేదు. కానీ మేం అనుకున్న అడుగు వేశాం. అక్కడికి దగ్గర్లోనే ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాం. వారు న్ను ప్రోత్సహించి నాక్చిన మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా జీతంలో సగభాగం ప్రతినెలా తీసుకెళ్ళి అత్తగారికిచ్చాను. పండుగలకి, పబ్బాలకి అందరికీ బట్టలు కొన్నాను. ఇంట్లో ఏ పూజనీ, శుభకార్యాన్నీ మిస్ కాలేదు. అత్తమ్మ మందుల దగ్గర్నుంచి తోడికోడళ్ళ పిల్లల పుట్టినరోజుల వరకూ దేన్నీ మర్చిపోలేదు. దాంతో మొదట కోపంగా ఉన్నవారు మెల్లగా నాకు చేరువయ్యారు. నామనసులో ఏ దురద్దేశం లేదని అర్థం చేసుకున్నారు. చనిపోయేవరకూ మా అత్తగారు అందరికీ చెప్పేవారు...‘మా చిన్నకోడలు భలే పిల్లండీ, నేనెంత అదృష్టవంతురాలినో’ అని. నేనారోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మనస్ఫర్థలతో మా మధ్య దూరాలు పెరిగిపోయి ఉండేది. మా వాళ్ళకూ నాకూ మధ్య పెద్ద ఆగాథం ఏర్పడి ఉండేది. నా మీద కోపంతో వాళ్ళు ... నా ఆశలు తీరలేదన్న అసంతృప్తితో నేనూ బతకాల్సి వచ్చేది. అలాగని అందరూ వేరు కాపురాలు పెట్టాలని అనడం లేదు. కానీ మీ స్పేస్ మీకు అవసరం అనిపించినప్పుడు ఓ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడవద్దని మాత్రం చెబుతాను. అది తప్పు కాదు. ఒక్కోసారి దూరం ప్రేమల్ని, బంధాల్ని బలపరుస్తుందే తప్ప తగ్గించదు. దానికి నా జీవితమే ఓ ఉదాహరణ. - విమల, ముమ్మిడివరం, తూ.గో.జిల్లా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే మాకు రాసి పంపించండి. బంధాలను బలపరచుకోవడానికి, అనుబంధాలను పదిలపరచుకోవడానికి మీ అనుభవాలు మరికొందరికి దారి చూపవచ్చు. మా చిరునామా: అస్త్ర, సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్,హైదరాబాద్ - 500034, మెయిల్: sakshi.asthra@gmail.com -
మేడపాటి వెంకట్,వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ తో సాక్షి వేదిక