-
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
కుల్కచర్ల: కుటుంబ కలహాలతో కలత చెందిన తండ్రి ఆత్మహత్యకు సిద్ధపడగా.. కాపాడబోయిన కూతురుతో పాటు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్చచర్ల మండల పరిధి చౌడాపూర్ల మండలం మందిపల్ గ్రామానికి చెందిన శివానంద్(51) భార్య లావణ్యలకు కుమారుడు సాయి, కూతురు చందన ఉన్నారు. 25 సంవత్సరాలుగా ఈ కుటుంబం మహబూబ్నగర్ జిల్లా శివరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో భూమి విషయంలో ఇంట్లో గొడవ జరగగా.. మనస్థాపం చెందిన శివానంద్.. రైలు పట్టాలపై నిల్చున్నాడు. ఇది గమనించిన కూతురు, కుమారుడు తండ్రిని కాపాండేదుకు యత్నించగా.. వేగంగా వచ్చిన రైలు.. తండ్రి శివానంద్, తనయ చందనను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలకు కుటుంబ సభ్యులు మందిపల్లో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
పరిగి మున్సిపాలిటీ పరిధిలో దొంగల బీభత్సం
-
ఏం మాట్లాడుతున్నావ్!.. ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం రచ్చరచ్చగా మారింది. వికారాబాద్ జెడ్పీ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మధ్య మాటల యుద్ధం సాగింది.అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డి దే కదా ! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ యాదయ్య వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ యాదయ్యను పట్నం మహేందర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఏం మేం మాట్లాడవద్దా అంటూ ఎమ్మెల్యే యాదయ్య కౌంటర్ ఇచ్చారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరి మధ్య కలుగజేసుకొని వివాదం సద్దుమణిగించారు. -
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన నీలం మధు, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్నగర్లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
పంచకుండా పడేశారు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి. వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చెక్కు దొరకలేదు. డిసెంబర్లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్మ్యాన్ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్ -
సైకో కిల్లర్.. మహిళలే టార్గెట్.. పోలీసులే విస్తుపోయే నిజాలు
సాక్షి, తాండూరు: చిల్లర ఖర్చుల కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు. చివరికి సైకోగా మారిపోయాడు. మర్డర్స్ చేయడం హబీగా మార్చుకున్నారు. అందుకు అడ్డా మీద కూలీలనే టార్గెట్ చేసుకున్నాడు. హత్య చేయడం అంటే అతనికి నీళ్లు తాగినంత ఈజీ.. ఇప్పటికే ఆరు హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తీరు మారలేదు. ఏడో హత్య చేసి పోలీసులకు మళ్లీ చిక్కిపోయాడు. వికారాబాద్ జిల్లాను వణికించిన సైకో కిల్లర్ కిష్లయ్య స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం... అదృశ్యమైన మహిళ గురించి తాండూరు పోలీసులు చేసిన దర్యాప్తు చేస్తుండగా...ఈ సైకో కిల్లర్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. సర్వబీ.. ఊరు వికారాబాద్ జిల్లా తాండూరు.. నవంబర్ 29న ఉదయం 9 గంటల ప్రాంతం.. కూలీ పనుల కోసం సర్వబీ అడ్డా మీదికి వెళ్లింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. డిసెంబర్ ఒకటిన ఆమె భర్త మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. స్వరాబీ అదృశ్యమైన రోజున ధారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప వెంట వెల్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిన్ని క్లూ దొరికింది. కిష్టప్పపై ఫోకస్ పెట్టారు. సైకో కిల్లర్ కిష్టప్ప బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేస్తే పోలీసులే విస్తుపోయారు. కిష్టప్పను అదుపులో తీసుకుని పోలీసులు తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. తాండూరులోని కూలీల అడ్డా మీద సర్వాబీని గ్రామంలో పని ఉందని చెప్పి వెంట తీసుకువెళ్లాడు. తాండూరు నుంచి జహీరాబాద్ వెళ్లే బస్సులో ఎక్కారు. మధ్యలో తట్టెపల్లి అటవీ ప్రాంతంలో బస్సు దిగి... లోపలికి తీసుకువెళ్లాడు. ఆమెను చీర కొంగుతోనే గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు, మోబైల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదును తీసుకుని కిష్టప్ప సొంత ఊరు అల్లీపూర్ వెళ్లిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారించగా.. డిసెంబర్ 7న అదృశ్యమైన మహిళ సర్వాబీ మృతదేహం పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లాలో కిష్టప్పపై ఆరు హత్య కేసులుండగా... ఐదు కేసుల్లో ఆధారాలు దొరకనివ్వలేదంటే అతని క్రిమినల్ మెంటాలిటీ ఎంటో అర్థం చేసుకోవచ్చు. మరో కేసు విచారణలో రెండేళ్ల పాటు జైల్లోనే ఉన్నారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన సైకో కిల్లర్ కిష్టప్ప ఏడో హత్యకు తెగబడ్డాడు. పని ఇప్పిస్తానని చెప్పి ప్రాణాలు తీసే ఇలాంటి క్రిమినల్స్తో బీ కేర్ ఫుల్.. బీ అలర్ట్. ఇదీ చదవండి: చికెన్ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్.. రూ.30 వేలు పరిహారం! -
వైభవంగా ఎల్లమ్మ ఉత్సవాలు
బొంరాస్పేట: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని పోలెపల్లి ఎల్లమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే ప్రజాసంక్షేమం
బొంరాస్పేట/సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాగుబోతు పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం మదన్పల్లి నుంచి హాథ్సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు, భార్యాభర్తలకు వృద్ధాప్య పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాభర్తీ వంటి హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో ధరలు పెంచి పేదలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను పదవుల నుంచి తప్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. వికారాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన దుద్యాల మండల కేంద్రంలో కూడా రేవంత్ యాత్ర కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పార్టీ ఫిరాయిస్తే ఉరి శిక్ష విధించాలి బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అపహాస్యం చేశాయని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన 9 ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని విమర్శించారు.గురువారం ఉదయం ఆయన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీభవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని అన్నారు. అవసరమైతే ఉరి వంటి కఠిన శిక్షలను అమలు చేసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రగతిభవన్, రాజ్భవన్లకు పరిమితం చేసి.. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేశారని విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని హైకోర్టు, ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక మాఫియా బరితెగింపు
బషీరాబాద్: ఇసుక మాఫియా బరితెగించింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకోబోయిన పోలీస్ కానిస్టేబుల్పై ట్రాక్టర్ ఎక్కించడంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలతో తాండూరు డీఎస్పీ శేకర్గౌడ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి.శంకర్, హోంగార్డు శివరాం రాత్రి బ్లూ కోట్ విధుల్లో భాగంగా ఇందర్చెడ్ గ్రామంలో ఉన్నారు. ఈ సమయంలో ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్ను గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా బైక్ పైకి తీసువెళ్లాడు. ట్రాక్టర్ కింద పడిన కానిస్టేబుల్ శంకర్పై నుంచి ఇసుక ట్రాక్టర్ చక్రాలు వెళ్లాయి. దీంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. అనంతరం తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ను వేగంగా తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఇసుక మాఫియా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ట్రాక్టర్తో ఢీ కొట్టిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకా అయ్యాళం గ్రామానికి చెందిన భీమారాయగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టా రు. ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటక సరిహద్దు గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టిందని డీఎస్పీ తెలిపారు. కాగా తీవ్ర గాయాలపాలైన శంకర్కు తాండూరులో ప్రథమ చికిత్స చేయించి, మె రుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. విరిగిన కాళ్లకు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగని ఇసుక మాఫియా.. బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా ఆగడా లు పెచ్చుమీరాయి. ఐదేళ్లుగా క్యాద్గిరా, నవాంద్గి, గంగ్వార్, ఇందర్చెడ్ గ్రామాల వద్ద కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో ఈ వ్యవహారం కొనసాగుతోందన్న ఆ రోపణలున్నాయి. ఈ విషయంపై ‘సాక్షి’పలు మా ర్లు కథనాలు సైతం ప్రచురించింది. పోలీసు, రెవె న్యూ, భూగర్భశాఖ అధికారులు నిర్లక్ష్యంతోనే ఇసు క మాఫియా రెచ్చిపోతోందనే వాదనలున్నాయి. -
విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి
తాండూరు: అమెరికాలోని మిస్సౌరిలో వైద్యవిద్య అ భ్యసిస్తున్న తాండూరు విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. శివదత్తు సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితుడితో కలిసి ఓజార్క్ సరస్సుకు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. (చదవండి: దంత ఆరోగ్యంపై తలసరి ఖర్చు 4 రూపాయలే!) -
పెద్దగా బుసలు కొడుతూ.. బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది!
వికారాబాద్ జిల్లా: మూడు కుక్క పిల్లలను నాగుపాము కాటేసి చంపిన హృదయ విదారక ఘటన జిల్లాలోని బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో చోటు చేసుకుంది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక చోట ఉన్న మూడు కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి చంపేసింది నాగుపాము. కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి సమయంలో నాగుపాము పెద్ద పెద్దగా బుసలు కొడుతూ అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. -
అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా
వికారాబాద్ జిల్లా: జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 29 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అనంతగిరిలో మైసవ్వ చిన్న గుట్ట దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్రేన్ ద్వారా బస్సుని వెలికి తీశారు. కాగా, బస్సు బ్రేకులు సక్రమంగా లేవని అధికారులకు డ్రైవర్ చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది. -
రహదారులపై మృత్యు ఘోష.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి
జోగిపేట (అందోల్)/ధారూరు: రాష్ట్రంలో రహ దారులు నెత్తురోడాయి. గురువారం జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా దారికనిపంచక జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. దారి కనిపించక కుటుంబం బలి జీడిమెట్లలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా షాపూర్ నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరింది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జోగిపేట వైపు నుంచి వస్తున్న నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాంసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో స్పీడ్గా వస్తున్న బస్సు కారును ఢీకొట్టి సుమారు 200 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. కారు ముందుభాగం బస్సుకింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో జీడిమెట్ల సుభాష్నగర్కు చెందిన ఎలక్ట్రిషియన్ దిలీప్ (50), భార్య వినోద (44), కూతురు సుప్రతిక (24), మనవరాలు కాన్షీ (ఏడాదిన్నర) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరగగానే అక్కడే రోడ్డు పక్కన పనిచేస్తున్న కూలీలు కారు వద్దకు పరుగెత్తివెళ్లి చూడగా, చిన్నారితోపాటు దిలీప్, వినోద మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన సుప్రతిక కొట్టు మిట్టాడుతోంది. ఆమెను కాపాడేందుకు కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా రాలేదు. చివరకు ఆమె కూడా పది నిమిషాల్లో మృత్యు ఒడిలోకి జారుకుంది. కారు డోర్లు ఇరుక్కు పోవడంతో ఆమెను కాపాడలేకపో యామని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కళ్ల ముందే జరిగిన ఈ ఘోరమైన ఘటనను మరిచిపోలేక పోతున్నా మన్నారు. తల్లి ఒడిలోనే చిన్నారి తనువు చాలించడం అక్కడున్న వారి హృదయాలను కలిచి వేసింది. జేసీబీ, క్రేన్ సహాయంతో గంటకుపైగా శ్రమించి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. వద్దన్నా వెళ్లాడు.. దిలీప్ కూతురు సుప్రతిక, అల్లుడు ప్రదీప్రెడ్డికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతు న్నాయి. దీంతో గత నెల 31న అడ్వొకేట్తో మాట్లాడేందుకు కుటుంబంతోసహా మహారాష్ట్ర లోని స్వగ్రామమైన షాపూర్కు వెళ్లారు. కుమా రుడు వంశీని అక్కడే ఉంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుటుంబసభ్యులంతా మృతి చెందడంతో వంశీ అనాథయ్యాడు. వంశీ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. మహారాష్ట్రలోని షాపూర్కు వెళ్లిన దిలీప్ తన స్నేహితుడైన సంజీవరెడ్డి వద్దనే ఉన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు జీడిమెట్లకు వెళ్లేందుకు సిద్ధ మయ్యారు. ఇంతపొద్దున ఎందుకు, టిఫిన్ చేసి 8 గంటలకు బయలుదేరండి అని చెప్పినా వినకుండా వెళ్లాడని సంజీవరెడ్డి జోగిపేటలో ఆవేదనతో చెప్పారు. తమ ఇంటి నుంచి బయ లుదేరిన రెండు గంటల్లోనే చనిపోయాడన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిద్రమత్తులో లారీ నడిపి.. వికారాబాద్ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలం రేగొండికి చెందిన ఆటో డ్రైవర్ జమీర్ తన ఆటోలో 10 మందిని ఎక్కించుకుని వికారాబాద్కు బయలుదేరాడు. వీరిలో ఎనిమిది మంది అడ్డా కూలీలున్నారు. వీరంతా వికారాబాద్లోని ఓ క్రషర్ మిషన్లో పనిచేస్తారు. బాచారం గ్రామ సమీపంలోకి రోడ్డు మలుపు వద్ద అతివేగంతో ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ జమీర్ (35), హేంలానాయక్ (45), రవి (40) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను తొలుత వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ నేనావత్ కిషన్(40) తుదిశ్వాస వదిలాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మిగిలిన వారిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ నెనావత్ వినోద్ (35) మృతి చెందాడు. ప్రస్తుతం ఆరుగురు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ ఎం.కుమార్ (28) నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిన ట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినా పట్టనట్లు వ్యవహరించిన డ్రైవర్ కుమార్.. అదే లారీని నడుపుకొంటూ తాండూరు వరకు సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ సత్యనా రాయణ, సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ నరేందర్ ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. తండాకు చెందిన ముగ్గురు మృతిచెందడంతో మదనంతపూర్లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేదని, దీంతో క్షతగాత్రులను తరలించేందుకు పోలీసులు ఇబ్బంది పడినట్లు స్థానికులు చెప్పారు. ఆపకపోతే ప్రాణాలు దక్కేవి మదనంతాపూర్ వద్ద కూలీలను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ జమీర్.. క్రషర్లో పనిచేసే టిప్పర్ డ్రైవర్ శ్రీనివాస్ కోసం బాచారం వద్ద ఐదు నిమిషాలు ఆపాడు. అక్కడి నుంచి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఆపకపోయి ఉంటే ఆటో సురక్షితంగా బాచారం మలుపు దాటి ఉండేదని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. -
పెళ్లికి నిరాకరించారని తల్లీ కూతుళ్లపై దాడి
ధారూరు(వికారాబాద్): నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లికి నిరాకరించారన్న కోపంతో ఓ యువకుడు తల్లీ, కూతుళ్లపై పెట్రోల్ పోసి హతమార్చేందుకు యత్నించాడు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వికారాబాద్ జి ల్లా ధారూరు మండలం గడ్డమీది గంగారం గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొల్ల రాకేశ్ (27) హైదరాబాద్లో ఆటో మొబైల్ రంగంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో రాకేశ్కు ఏడాది క్రితం (ఇల్లరికం) నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత రాకేశ్ యువ తిపై అనుమానం పెంచుకుని వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని యు వతి తల్లి భారతమ్మ గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టి వారి సమక్షంలో పెళ్లి రద్దు చేసుకున్నారు. గ్రామంలోని మేనత్త ఇంట్లో వారంరోజులుగా మకాం వేసి ఆ యువతిని తనకిచ్చి పెళ్లి చేయాలని రాకేశ్ వేధించడం మొదలు పెట్టాడు. అందుకు యువతి తల్లి అడ్డుచెబుతుండటంతో కోపంతో రగిలిపోయిన రాకేశ్ ఆ తల్లీకూతుళ్లను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అందులోభాగంగా పథకం ప్ర కారం ఆదివారం యువతి ఇంటికి వెళ్లి తల్లీ, కూతుళ్లపై వెంట తెచ్చుకున్న పెట్రో ల్ పోశాడు. తల్లీకూతుళ్లు భయంతో కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని అగ్గిపుల్ల వెలిగిస్తున్న రాకేశ్ను పట్టుకుని బంధించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్పైడర్ ‘మ్యాన్’!
తాండూరు టౌన్: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్కు చెందిన రామకృష్ణ ఇంట్లో మనిషి తలను పోలిన సాలె పురుగు (స్పైడర్)ను కనుగొన్నారు. దాన్ని చూసిన ఆ ఇంట్లోని పిల్లలు స్పైడర్ మ్యాన్లా ఉందంటూ కేరింతలు కొట్టారు. సాలె పురుగు వెనుక భాగం అచ్చం మనిషి తల, కళ్లు, నోరును పోలి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ వివరణ ప్రకారం ఇది అరుదైన జాతి సాలె పురుగు అని తెలుస్తోంది. ఇలాంటిది గతంలో చైనా దేశంలో కనిపించినట్టు.. దీని శాస్త్రీయ నామం అరేనియస్ మిటిఫికస్ అని సమాచారం. -
కారు పార్టీలో ‘కయ్యం’.. టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్..
వికారాబాద్: టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వపక్షంలోనే ప్రతిపక్షం తయారవడంతో అధికారిక, పార్టీ కార్యక్రమాలు ఉద్రిక్తంగా సాగుతున్నాయి. తాండూరులో మొదలైన ఈ కుమ్ములాటలు అంతటా పాకాయి. రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శుక్రవారం తాండూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్రావు.. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డిపై అసహనం వ్యక్తంచేయడం స్థానిక పరిస్థితులకు అద్దం పట్టింది. చదవండి: అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు! టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ప్రస్తుతం జిల్లాలో ఇదే సీన్ కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గపోరు జోరందుకుంది. పార్టీ కార్యక్రమాలకు విడివిడిగా హాజరుకావడం.. వ్యక్తిగత దూషణలకు దిగడం నేతలకు పరిపాటిగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మాటల యుద్ధం సాధారణంగా ఎక్కడైనా పాలక, ప్రతిపక్షాలు గొడవలు పడుతుంటాయి. అధికార పక్షం అవునంటే.. ప్రతిపక్షం కాదంటుంది. అయితే అందరికీ అవసరమయ్యే కొన్ని పనుల విషయంలో.. మనవతా దృక్పథంతో పరస్పరం సహకరించుకుంటాయి. కానీ మన జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎక్కువవుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో సొంత పారీ్టకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో విడివిడిగా పాల్గొంటూ మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు. నాలుగు చోట్లా అదే సీన్ తాండూరులో మొదలైన టీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలు జిల్లా అంతటా వ్యాపించాయి. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి వర్గాల మధ్య ప్రారంభమైన గొడవలు వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. కొగంగల్లో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ సాగుతోంది. వికారాబాద్లో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు పట్నం వర్గంతో జత కట్టడంతో స్థానిక ఎమ్మెల్యేకు వర్గపోరు మొదలైంది. ఇక ఎమ్మెల్యే వర్గీయులు ఇటీవల జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి కాన్వాయ్ని అడ్డుకోవడంతో పార్టీ కేడర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. పరిగి నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా అధికార పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దిగజారుతున్న ప్రతిష్ట అధికార పార్టీ నేతల తీరు ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో గతంలో నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు కలిసి హాజరైన నేతలు ప్రస్తుతం ఎవరికి వారే అనే రీతిలో సాగుతున్నారు. వికారాబాద్, తాండూరులో జరిగిన పలు సంఘటనలు నేతల వ్యవహారాన్ని ప్రజలు ఈసడించుకునే స్థాయికి చేరింది. అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వరకు గులాబీ నేతల వ్యవహార శైలి నానాటికీ దిగజారుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి మున్సిపల్ కార్యాలయాల సాక్షిగా చేస్తున్న రాజకీయాలు వెగటు పుట్టిస్తున్నాయి. ఆరు నెలల క్రితం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అధికార పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత గొడవలు పెరిగానే తప్ప తగ్గుముఖం పట్టలేదు. మంత్రులు, ఎంపీలు చెబితేనే తెగని పంచాయితీలకు జిల్లా అధ్యక్షుడు పరిష్కారం చూపగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఆయనే ఓ వర్గాన్ని నడుపుతుండగా ఇక నేతలను ఎలా సమన్వయం చేయగలరనే విమర్శలూ వినిపిస్తున్నాయి. -
మద్యం త్రాగేందుకు డబ్బులు ఇవ్వాలని నానమ్మపై మనువడి దాడి
-
డమ్మీ హామీలు.. అప్పులకుప్ప
దౌల్తాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమి దేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలో దించారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గురువారం ఉదయం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని సురాయిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర చల్లాపూర్, ఈర్లపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. దౌల్తాబాద్ మండల కేంద్రంలో గాంధీ కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మాట–ముచ్చట కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు భారంగా మారాయని, ఫింఛన్లు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని పలువురు షర్మిల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సంద ర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా పథకాల పేరు చెప్పి కేసీఆర్ ఎన్నో మోసాలకు పాల్పడ్డారని, రూ.25 వేలు ఇచ్చే వ్యవసాయ పథకాలను నిలిపివేసి కేవలం రూ.5 వేల రైతుబంధుతో సరిపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వసతిగృహాల్లో దొడ్డు బియ్యం ఇస్తున్నారని, రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు ఆపేశారన్నారు. రాష్ట్రంలో ఉద్యో గాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్కు చీమకుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. రూ.16 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.4 లక్షల కోట్ల అప్పులకుప్ప చేశారని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి రాగానే మోసం చేసిందని, విభజన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్టీపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీదనే పెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర «అధికార ప్రతినిధి పిట్టల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షులు తమ్మలి బాల్రాజ్, మండల అధ్యక్షులు కుర్మని పకీరప్ప ఉన్నారు. -
కాగ్నాలో కొట్టుకుపోయిన దంపతులు
బషీరాబాద్: కూరగాయలు అమ్మి తిరిగి వస్తుండగా భార్యాభర్తలు కాగ్నా నది దాటుతూ వరదలో కొట్టుకుపోయారు. మూడు రోజుల తర్వాత కర్ణాటకలోని జెట్టూరు వద్ద శవాలై తేలారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టిలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాటికేరి బుగ్గప్ప (50), యాదమ్మ (45) భా ర్యాభర్తలు. వీరికి మంతట్టి గ్రామ శివారులోని కాగ్నానది పరీవాహక ప్రాంతంలో పొలం ఉంది. ఆదివారం సాయంత్రం పొలంలో కూరగాయలు కోసుకొని చంద్రవంచలో విక్రయించి.. రాత్రి బంధువుల దగ్గర ఉండి మరుసటి రోజు వస్తామని కొడుకు వెంకటప్పకు చెప్పి వెళ్లారు. అయితే వారు సోమవారం రాకపోవడంతో కొడుకు.. బంధువుల దగ్గర ఆరా తీయగా ఉదయమే మంతట్టికి వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో వారికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం వెంకటప్పకు బంధువులు కర్ణాటకలోని జెట్టూరు కాగ్నా నదిలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాల ఫొటోలు పంపారు. అక్కడికి వెళ్లి చూ డగా తన తల్లిదండ్రులేనని గుర్తుపట్టాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుగ్గప్ప, యాదమ్మ దంపతులు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారని, చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారని గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. -
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
-
బాత్రూంలోనే నివాసం
పూడూరు: వారంపాటు కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఒక కుటుంబం స్నానాల గదినే నివాసంగా మార్చుకుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన కూలీలు గోనె కుమార్, కనకమ్మ దంపతులు కూతురితో కలిసి పురాతన ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు ఆ ఇల్లు కూలిపోయింది. దాని పునర్నిర్మాణానికి డబ్బుల్లేక బాత్రూంనే వారు నివాసంగా మార్చుకున్నారు. ఆరుబయట వంట చేసుకుంటున్నారు. వర్షం వస్తే పొరుగు వారిని ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. ఇల్లు కూలిన వెంటనే ఆధికారులు వచ్చి చూశారే తప్ప ఎలాంటి సహాయం అందించలేదని వాపోయారు. -
కులాలకు ఎదురెళ్లలేక రైలుకు ఎదురెళ్లి..
నవాబుపేట: రైలుకింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణం చెందింది. మృతు లిద్దరూ మైనర్లే. ఈ సంఘటన గురువారం వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం కడ్చర్లలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పవన్కుమార్ (18), ధారూర్ మండలం ఎబ్బనూర్కు చెందిన అభినయ (17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పవన్ ఇంటర్ సెకం డియర్ ఆపేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. అభినయ ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసింది. వికారాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నప్పుడు పవన్, అభినయ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి విషయం కుటుంబ పెద్దలకు తెలిసింది. ఈ వయసులో ప్రేమలు ఏమిటంటూ మం దలించారు. అయినా ఇద్దరి కులాలు వేర్వేరని చెప్పారు. తమ పెళ్లికి వయసు, కులాలు అడ్డుగా ఉన్నాయని మనస్తాపం చెందిన పవన్, అభినయ.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ బయట కలుసుకొని ద్విచక్ర వాహనంపై కడ్చర్ల సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి 12:30 సమయంలో హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్న ఎక్స్ప్రెస్కు ఎదురెళ్లి బలవన్మరణం చెందారు. రైలు వేగం ధాటికి పవన్ తల 200 మీటర్ల దూరంలో పడింది. గమనించిన రైలు డ్రైవర్ వికారాబాద్ స్టేషన్ మాస్టర్కి సమాచారం ఇచ్చారు. మృతదేహాలను చూసి ఇరువురి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతురాలి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ నర్సింగ్ రాథోడ్ తెలిపారు. -
పాలమూరు ఎత్తిపోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ ‘పాలమూరు ఎత్తిపోతల’పై లేదని.. వికారాబాద్ జిల్లా నానాటికి నిర్లక్ష్యానికి గురవుతోందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్లో ఆదివారం రాష్ట్ర డెవలప్మెంట్ ఫోరం ఆ«ధ్వర్యంలో నదీ జలాల సంరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. జూరాల ప్రాజెక్టుతో లిఫ్ట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి నీళ్లొస్తాయన్నారు. కాళేశ్వరం నిర్మించిన ఈ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, జూరాల ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతగిరి నుంచి ఏ ఉద్యమం చేపట్టినా ఉవ్వెత్తున ఎగిసిన దాఖలాలున్నాయని ఆయన గుర్తు చేశారు. దీనిపై గ్రామగ్రామాన కరపత్రాలు వేయించి అవగాహన కల్పిద్దామన్నారు. అనంతరం వక్తలందరూ కేంద్ర గెజిట్ను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ రణధీర్ బద్దం, అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మాజీ ఓఎస్డీ రంగారెడ్డి పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో మోసం.. మాయమాటలు చెప్పి లోబర్చుకుని..
తాండూరు రూరల్(వికారాబాద్ జిల్లా): ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బాలిక గర్భం దాల్చి, ప్రసవించిన సంఘటన తాండూరు మండలం జినుగుర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. చైల్డ్లైన్ అధికారులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(15). స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఖదీర్ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. చదవండి: స్నేహానికి ద్రోహం.. ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. గత శుక్రవారం కడుపులో నొప్పి వస్తోందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఏడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. బాలిక పడుతున్నవి పురిటి నొప్పులని (ప్రీ డెలివరీ) చెప్పారు. అదే రోజున బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. చైల్డ్లైన్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. విచారణ చేసిన సీడీపీఓ రేణుక సదరు బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ కరన్కోట్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
స్నేహానికి ద్రోహం.. ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని..
బషీరాబాద్(వికారాబాద్ జిల్లా): ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, ఫిర్యాదుదారుడి వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేశ్, పావణి (పేరుమార్చాం) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పిట్టలి విశ్వనాథ్, పరమేశ్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు. చదవండి: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం ఈ క్రమంలో పరమేశ్ భార్యతో విశ్వనాథ్ సన్నిహితంగా మెలిగేవాడు. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై అనుమానం రావడంతో పరమేశ్ తన భార్యను నిలదీశాడు. అయినా వీరి తీరు మారకపోవడంతో కొద్ది రోజుల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. ఆనాటి నుంచి పావణి, విశ్వనాథ్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 30న పావణి తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండాపోయింది. అదే రోజున విశ్వనాథ్పై అనుమానం వ్యక్తంచేస్తూ పరమేశ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను విశ్వనాథ్ అపహరించుకుపోయాడని, ఇంట్లోని నాలుగు తులాల బంగారం, రూ.42 వేలు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. విశ్వనాథ్కు మూడు నెలల క్రితమే అనురాధ అనే యువతితో వివాహం జరిగింది. మరో మహిళను తీసుకుని పారిపోయాడని తన భర్తపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న అనురాధ.. తన జీవితం ఏం కావాలని..? మామ పిట్టలి అంజిలప్పను నిలదీసింది. దీనిపై స్పందించిన ఆయన నాలుగు రోజుల్లో తన కొడుకు తిరిగిరాకపోతే.. ఆస్తి మొత్తాన్ని కోడలి పేరున రాస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా తన భర్త కనిపించకుండా పోయాడని, ఆయన ఆచూకీ కనుక్కోవాలని విశ్వనాథ్ భార్య అనురాధ సైతం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విశ్వనాథ్, పావణిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి తెలిపారు.