vishkapatnam
-
విశాఖ జాయ్ జమీమా కేసులో మాజీ ఎంపీ కుమారుడి పేరు
-
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత సత్యప్రియ ఆత్మహత్య
-
పర్యాటకం కళకళ
సాక్షి అమరావతి : అందమైన తీర ప్రాంతం.. అపార పర్యాటక వనరులు.. తూర్పు కనుమల్లోని వైవిధ్యం.. విదేశాలను తలపించే హిల్ స్టేషన్లు.. కృష్ణా, గోదావరి అందాలు.. రాష్ట్ర పర్యాటకానికి మణిహారంగా నిలుస్తున్నాయి. దేశంలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ప్రధానంగా విశాఖలో బీచ్లకు, అరకు వ్యాలీకి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.గతేడాది విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పర్యాటక రంగంలో 117 ఒప్పందాల ద్వారా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు రూ.3049.90 కోట్ల సివిల్ వర్క్స్ ప్రారంభం అయ్యాయి. ఇవి పూర్తయితే 9,022 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.600 కోట్లతో 7 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందాలు పూర్తయ్యాయి. మరో రూ.3,757 కోట్లతో 2,750 మందికి ఉపాధి కలి్పంచేలా 15 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద (ఓఅండ్ఎం) 87 ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. రాష్ట్ర పర్యాటక సిగలో ఎన్నెన్నో.. ⇒ రూ.544 కోట్లతో రాజమహేంద్రవరంలోని గోదావరిపై ఉన్న పురాతన హేవ్లాక్ (రైల్వే) బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం. తునికి సమీపంలోని చిన్న శంకర్లపూడిలో 18 గోల్ఫ్ కోర్సులు, టూరిజం కాంప్లెక్సులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, వెల్నెస్ సెంటర్, బయోడైవర్సిటీ థీమ్ ప్రాజెక్టు. ⇒ విశాఖపటా్నన్ని టూరిజం డెస్టినీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భోగాపురంలో రూ.750 కోట్లతో 300 ఎకరాల్లో రేసింగ్ ట్రాక్, గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో రూ.243 కోట్లతో 10 ఎకరాల్లో ఐ ఆఫ్ వైజాగ్ (మెగా వీల్), రూ.100 కోట్లతో 5 ఎకరాల్లో స్కై టవర్, రూ.25 కోట్లతో స్నో వరల్డ్కు డీపీఆర్ సిద్ధమైంది. కోస్టల్ జోన్ టూరిజంలో భాగంగా 288 బీచ్లను గుర్తించి అత్యాధునిక వసతులు కలి్పస్తున్నారు. ⇒ ఆంధ్రా ఊటీగా పేరొందినæ అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా రూ.150 కోట్లతో తీర్చిదిద్దనున్నారు. ⇒ రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచి్చంది. ⇒పెనుకొండలో ఇస్కాన్ చారిటీస్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో స్పిరుచ్యువల్ కేంద్రం, అరకు, పేరూరు, కాకినాడలో 5 స్టార్ హోటల్, కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి.. పలు ప్రాంతాల్లో శిల్పారామాలు, విశాఖ లో టన్నెల్ ఆక్వేరియం హోటల్, పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్లు ఏర్పాటు కానున్నాయి. అన్న వరం ప్రాంతంలో మేఫెయిర్ సంస్థ (భువనేశ్వర్) లగ్జరీ రిసార్ట్ను అభివృద్ధి చేయనుంది. -
విశాఖ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
అదరగొట్టిన ప్రణీత్.. 8 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక కోస్టల్ రైడర్స్ జట్టు 16 పాయింట్లతో టాపర్గా నిలిచింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ 8 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్ ఆధారంగా ఉత్తరాంధ్ర లయన్స్కు రెండో స్థానం, రాయలసీమ కింగ్స్కు మూడో స్థానం, బెజవాడ టైగర్స్కు నాలుగో స్థానం లభించాయి. కోస్టల్ రైడర్స్తోపాటు ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత పొందాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాయలసీమ కింగ్స్తో బెజవాడ టైగర్స్ ... క్వాలిఫయర్–1లో ఉత్తరాంధ్ర లయన్స్తో కోస్టల్ రైడర్స్ ఆడతాయి. రాయలసీమ కింగ్స్తో చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లో కోస్టల్ రైడర్స్ జట్టు వీజేడీ పద్ధతిలో 8 వికెట్లతో గెలిచింది. ముందుగా రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. హనీష్ రెడ్డి (78; 5 ఫోర్లు, 6 సిక్స్లు) మెరిశాడు. వర్షం తగ్గాక కోస్టల్ రైడర్స్ జట్టుకు 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. కోస్టల్ జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. ప్రణీత్ (64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు), చిరంజీవి (32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడగా ఆడారు. మరో మ్యాచ్లో ఉత్తరాంధ్ర లయన్స్ ఏడు వికెట్లతో గోదావరి టైటాన్స్ను ఓడించింది. చదవండి: ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్ -
APL 2023: ఉత్కంఠగా సాగుతున్న ఏపీఎల్.. ఫోటోలు
-
మ్యాచ్ మ్యాచ్కు ఉత్కంఠ.. ఉన్నదిపాయే, ఉంచుకున్నది పాయే! జీవితమే!
భారత్లో క్రికెట్ అంటే ఒక మతం. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెటే ఎక్కువ మంది అభిమానించే ఆటగా మారిపోయింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. ఇంతవరకు అంతబాగానే ఉన్న బెట్టింగ్ అనే భూతం మాత్రం మనుషుల జీవితాలను ఛిద్రం చేస్తుంది. బెట్టింగ్ మాయలో పడి చిన్న పెద్ద తేడా లేకుండా తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్కు బలయ్యేది ఎక్కువగా యువకులే. టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కడంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు పుట్టుగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్క మ్యాచ్ కాకపోతే.. మరో మ్యాచ్ లో అయినా డబ్బులొస్తాయనే ఆశతో అప్పుల మీద అప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత అప్పులు ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరుచూ ఎదోఒక చోట జరుగుతునే ఉంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల సంఖ్యలో బెట్టింగ్లు అలవాటు పడి ప్రాణాలను తీసుకుంటున్నారు. మన పక్కరాష్ట్రం తమిళనాడులో కూడా గత మూడేళ్లలో 40 మంది ప్రాణాలను ఈ బెట్టింగ్ భూతం మింగేసింది. ఇది చూస్తే మనం అర్ధం చేసుకోవచ్చు బెట్టింగ్ మనుషులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో. ఇక యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆన్లైన్ బెట్టింగ్, జూద క్రీడలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా కట్టడి చేయాలి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలు ఆన్లైన్ క్రీడలు, బెట్టింగ్లను నిషేధించాయి. బెట్టింగ్ భూతానికి బలైన యువకుడు.. తాజాగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడు బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన మణికంఠ సాయికుమార్ (25) క్రికెట్ బెట్టింగ్లకు గత కొంత కాలంగా అలవాటు పడ్డాడు. దీంతో బయట అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్ల్లో తీవ్రంగా నష్టపోయి.. అప్పులపాలు అయ్యాడు. దీంతో బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అంది వచ్చినా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇది ఒక్క మణికంట కుటంబంలోనే కాదు.. ఈ క్షోభ చాలా మంది కుటుంబాల్లో నెలకొంటోంది. క్రికెట్ను అభిమానించండి తప్పులేదు.. బెట్టింగ్లకు మాత్రం అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇకనైన కళ్లు తెరవండి, బెట్టింగ్ మానండి. -
వేసవి ప్రభావం గురించి విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద
-
YMCA బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి
-
గీతం యూనివర్సిటీలో మొత్తం 40 ఎకరాలు ఆక్రమణ: ఆర్డీవో
-
విశాఖలో భారత్-ఆసీస్ రెండో వన్డే.. అభిమానులకు బిగ్ అలర్ట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా భారత జట్లు మూడు వన్డేల సిరీస్లో తలపడనున్నాయి. ఈ సిరీస్లో భాగంగా మార్చి 19న విశాఖపట్నం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను శనివారం(మార్చి 10) నుంచి విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసొసియేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 10 నుంచి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఏసీఏ సెక్రటరీ ఎస్ గోపినాథరెడ్డి తెలిపారు. అదే విధంగా 13న ఆఫ్లైన్లో కూడా టికెట్లను విక్రయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా నిర్ణయించామని గోపినాథరెడ్డి వెల్లడించారు. ఇక మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డేకు విశాఖ.. ఆఖరి వన్డేకు చెన్నైలోని చెపాక్ స్టేడియం అతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఆసీస్తో తొలి వన్డేకు మాత్రం టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు. ఈ మ్యాచ్లో భారత జట్టు సారథిగా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. ఆసీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్, శార్ధూల్ ఠాకూర్ -
ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్
-
దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. భారత జట్టులో మూడు మార్పులు..!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్లో ఓటమి చెందిన టీమిండియా.. మంగళవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న మూడో టీ20లో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్దమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-2తో భారత్ వెనుకబడి ఉంది. అయితే మూడో టీ20కు టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాగా తొలి రెండు మ్యాచ్ల్లో బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్ల్లోనూ విఫలమైన అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడికి మూడో టీ20కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు పేసర్ ఆవేష్ ఖాన్ కూడా ఈ మ్యాచ్కు బెంచ్కు పరిమతమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అతడి స్థానంలో ఆర్షదీప్కు సింగ్ను ఆడించాలని మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ మరో సారి బెంచ్కే పరిమతమయ్యే అవకాశం ఉంది. తుది జట్టు అంచనా : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Joe Root: ఎప్పుడు కొట్టని షాట్ ఆడాడు.. అందుకే ఆశ్యర్యపోయాడా? -
Kommu Konam Fish: చిన్న పడవకు చిక్కిన పెద్ద చేప
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంది. వచ్చే నెల వరకు సముద్రం చేప దొరకాలంటే కష్టం. ఈ పరిస్థితుల్లో ఆదివారం మత్స్యకారులకు కొమ్ముకోనం చేప కొమ్ము కాసింది. అదేంటి.. వేట విరామంలో ఇంత పెద్ద చేప ఎలా వలకు చిక్కిందని ఆలోచిస్తున్నారా? తెర పడవలపై పలువురు జాలర్లు రోజంతా కష్టపడితే కొమ్ముకోనం చేపలు విరివిగా పడతున్నాయి. వేట విరామంలో ఇంజిన్ బోట్ల (మరపడవలు)తో వేట నిషేధం. కానీ తెర పడవల మీద వేటకు వెళ్లవచ్చు. వీరి కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం దొరుకుతుంది. అలా ఆదివారం భారీ సంఖ్యలో చేపలు వలకు చిక్కాయి. 80 కిలోల నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ కొమ్ముకోనం చేపకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. 100 కిలోల చేప రూ.20 వేల పైబడి ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. 6 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఉండే ఈ చేపను కేరళవాసులు ఎంతో ఇష్టపడి తింటారు. ఒక్క వేటలో భారీగా చేపలు చిక్కడంతో మత్య్సకారులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఐపీఎల్లో తెలుగోళ్లు... తొలి సారిగా అంపైర్!
విశాఖ స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విశాఖ నుంచి ప్రాతినిధ్యం లభించింది. ఢిల్లీ కాపిటల్స్ తరఫున ఆడేందుకు కేఎస్ భరత్ సిద్ధమవుతుండగా...మ్యాచ్లకు అంపైర్గా సీహెచ్ రవికాంత్ బయలుదేరనున్నారు. భరత్కు ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున ఆడిన అనుభవం ఉంది. బీసీసీఐ పానెల్ అంపైర్ రవికాంత్ మాత్రం తొలిసారిగా ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన వీరిద్దరికి క్రికెట్ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈసారి ఢిల్లీ కాపిటల్స్ తరఫున ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ కె. శ్రీకర్ భరత్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్లో ఆడనున్నాడు. రంజీల్లో ట్రిపుల్ సెంచరీ, వికెట్ కీపర్ బాటర్గా రికార్డు సాధించి భరత్ తొలిసారిగా 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు తరఫున ఐపీఎల్ మ్యాచ్లాడాడు. బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్ట్కు తొలిసారిగా జట్టుకూర్పులో స్థానం సాధించాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్కు స్టాండ్బైగా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలకు ఎంపికైనా జాతీయ జట్టు తరఫున పూర్తిస్థాయిలో ఆడే అవకాశం దక్కలేదు. ఇటీవలే న్యూజిలాండ్తో ఆడిన టెస్ట్ మ్యాచ్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టు తరఫున ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్లోనూ జట్టుతోనే ఉన్నాడు. అయితే ఐపీఎల్లో మాత్రం మరోసారి ఆడేందుకు అహ్వానం అందుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ తరఫున చివరి బంతిని గాల్లో బౌండరీకి తరలించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఐపీఎల్లోనూ భరత్కు మంచి గుర్తింపు వచ్చింది. సిక్సర్ను ఢిల్లీ కాపిటల్స్ జట్టుపైనే సాధించగా...ఈసారి ఆదే ఢిల్లీ కేపిటల్స్ తరఫున జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. టీ20 మ్యాచ్ల్లోనూ అర్ధసెంచరీ నమోదు చేసిన భరత్ వికెట్ల వెనుక నిలబడి 29 స్టంపింగ్స్ చేశాడు. ప్యానెల్ అంపైర్గా 250 మ్యాచ్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ల్లో 250 మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ తొలిసారిగా ఐపీఎల్లో అంపైరింగ్కు ఆహ్వానం అందుకున్నాడు. పలు టీ20 మ్యాచ్లు అంపైరింగ్ చేశారు. తొలిసారి జిల్లా ప్యానల్ అంపైర్గా పిచ్పైకి వచ్చిన రవికాంత్ అనతికాలంలోనే అనంతపురంలో తొలిసారిగా స్టేట్ ప్యానల్ అంపైర్ అయ్యారు. ఇక 2008లో బీసీసీఐ ప్యానల్ అంపైర్ కావడంతో దేశవాళీ క్రికెట్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్లకు అంపైరింగ్ చేసే స్థాయికి ఎదిగారు. 2015 నుంచి రంజీల్లో 39 మ్యాచ్లకు అంపైరింగ్ చేశారు. తొలిసారిగా ఇండియా ఏతో తలపడిన న్యూజిలాండ్ ఏ నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్కు అంపైరింగ్ చేయడంతో అంతర్జాతీయ మ్యాచ్ అరంగేట్రం జరిగింది. దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుతో భారత్ ఆడిన మ్యాచ్లకు, మహిళల దక్షిణాఫ్రికా–భారత్ టీ20 సిరీస్కు అంపైరింగ్ చేశారు. -
న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్లో మెరిసిన శ్రీకర్ భరత్.. విశాఖలో సంబరాలు
విశాఖ స్పోర్ట్స్ : విశాఖ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో రోజు టెస్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం దక్కింది. వాస్తవానికి తొలిరోజే ఆడాల్సిఉండగా సీనియర్ వికెట్కీపర్ వృదిమాన్ సాహా తుది 11 మంది ఆటగాళ్లలో స్థానం సాధించడంతో శ్రీకర్ భరత్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే అనుహ్యంగా రెండోరోజు ఆటలో వృద్దిమాన్ మెడ కండరం పట్టేయడంతో అతని స్థానంలో మూడో రోజు ఆటకు శ్రీకర్ భరత్ బరిలో దిగాడు. ఆకట్టుకున్న శ్రీకర్ భరత్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 67వ ఓవర్లో అశ్విన్ వేసిన తొలిబంతిని ఓపెనర్ యంగ్ ఆడగా... ఔట్సైడ్ ఎడ్జ్గా వచ్చిన బంతిని భరత్ లోలెవల్లో ఒడిసి పట్టుకున్నాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో భారత్ రివ్యూకు వెళ్లింది. యంగ్ను ఔట్గా ప్రకటించడంతో భరత్కు కాట్బిహైండ్గా తొలి వికెట్ దొరికింది. 89వ ఓవర్లో అక్షర్ వేసిన బంతిని ఇన్సైడ్ ఎడ్జ్గా టేలర్ ఇచ్చినా... భరత్ మిస్ అయ్యాడు. తిరిగి 94.3 ఓవర్లో అక్షర్ బంతినే టేలర్ ముందుకువచ్చి డిఫెండ్ చేసుకోబోయి వికెట్ల వెనుక కాట్ బిహైండ్గా భరత్కు దొరికిపోయాడు. ఓపెనర్ లాథమ్ వికెట్ల వెనుక దొరికిపోయి భరత్కు తొలి స్టంపౌట్ ఆటగాడయ్యాడు. దీంతో ప్రత్యమ్నాయంగా బరిలోకి వచ్చిన విశాఖ కుర్రాడు శ్రీకర్ భరత్ సత్తాచాటాడు. గతంలోనే ఇంగ్లండ్తో మ్యాచ్కు స్టాండ్బైగా ఎంపికైన భరత్ ఆడే అవకాశాన్ని అందుకోలేకపోయినా నిరుత్సాహపడకుండా ఈసారి నేరుగా జాతీయ తుది జట్టులో ఆడేందుకే అవకాశాన్ని సుగమం చేసుకున్నాడు. శనివారం భారత్ తరఫున శ్రీకర్ భరత్ చేసిన మూడు డిస్మిసల్స్ అధికారిక టెస్ట్ లెక్కల్లోకి చేరకున్నా ప్రత్యమ్నాయ ఆటగాడిగా చక్కటి గుర్తింపు పొందాడు. ఇలా అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని భరత్ అందిపుచ్చుకోవడంతో విశాఖ క్రీడాభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చాలా థ్రిల్లింగ్గా వుంది... జాతీయ జట్టుకు టెస్ట్ మ్యాచ్లో ఆడటమనేది కల. ఆ కల ఈరోజు నెరవేరింది. మూడోరోజు ఆట ఆరంభం నుంచే వికెట్ల వెనుక నిలబడటం...తొలి క్యాచ్ను, తొలి స్టంపౌట్ చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. టీ20 సిరీస్ ప్రారంభం నుంచే జట్టుతో ఉన్నాను. – శ్రీకర్ భరత్, వికెట్ కీపర్,బ్యాటర్ చదవండి: KS Bharat: ఒక్క వికెట్ పడగొట్టు అక్షర్.. అశూ.. నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు! -
షణ్ముఖ ప్రియకు విశ్వ గాన ప్రియ బిరుదు
సాక్షి,విశాఖ పట్నం: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియకు ఈ నెల 5వ తేదీన విశ్వ గాన ప్రియ బిరుదుతో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యంగస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేస్తున్నట్టు నిర్వహకుడు వీరుమామ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకులకు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఎస్.అప్పలరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకట కుమారి, జీవీ తదితరు పాల్గొంటారన్నారు ఆరోజు సాయంత్రం 5 గంటలకు హోటల్ ఫోర్ పాయింట్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. విజయ కుమార్ మాట్లాడుతూ షణ్ముఖ ప్రియకు తమ సంస్థ నుంచి పది లక్షలు విలువైన 108 గజాలు స్థలం బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. వేడుకులకు సంబంధించిన పాస్ల కోసం 99129 99949 నంబరుకు సంప్రదించాలన్నారు. చదవండి: బాక్సింగ్ రింగ్లోకి..విజయ్ దేవరకొండ -
మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మేకపాటి గౌతమ్ రెడ్డి
సాక్షి,చిత్తూరు: మూడు రాజధానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అవుతుందని ఆయన తెలిపారు. అది విశాఖ కావచ్చు, విజయవాడ కావచ్చు.. ఇంకొకటి కావచ్చు అని గౌతమ్ రెడ్డి వాఖ్యనించారు. చదవండి: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ -
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్పోస్ట్ వద్ద ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేసి ఏలూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగాను దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సింహద్రి అప్పన్నను దర్శించుకున్న పి.వి.సింధు
సాక్షి,విశాఖపట్నం: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పి.వి.సింధు ఆదివారం విశాఖ సింహద్రి అప్పన్నను దర్శించుకున్నారు. పి.వి.సింధు కు అధికార లాంఛనాలతో అర్చకులు స్వాగతం పలికారు. సింహాద్రి అప్పన్న విశిష్టతను క్షేత్ర వైభవాన్ని సింధుకు అర్చకులు వివరించారు. ఆమెతో పాటు తండ్రి పి.వి.రమణ కూడా ఉన్నారు. కాగా సోమవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చదవండి:మరో టీమ్కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే! -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ..ఆపై
సాక్షి, విశాఖపట్నం (గాజువాక): కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం యారాడలో సంచలనం రేపింది. బంధువులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొల్లి శ్రీను కుటుంబంతో యారాడలో నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య మొల్లి సంధ్య కూడా కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. శ్రీను ఐదు నెలలుగా పనులకు వెళ్లడం లేదు. భార్య సంపాదనపైనే ఆధారపడుతున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన శ్రీను తన 14 ఏళ్ల కుమార్తె అనూష, పదేళ్ల కుమారుడు చరణ్లకు బాదం పాలల్లో పురుగు మందు ఇచ్చి తాను కూడా తాగాడు. దీంతో వారందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. బంధువులు గమనించి వెంటనే వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన తెలిసిన వెంటనే న్యూపోర్టు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పిల్లల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం..సీనియర్ మేనేజర్ మృతి
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్పై నుంచి జారిపడి సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
వైఎస్సార్సీపీలోకి జనసేన కార్యకర్తలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తన ఉనికిని దాదాపు కోల్పోయింది. ఆ పార్టీకి కాస్త పట్టుకున్న జీవీఎంసీ 79వ వార్డులో భారీ షాక్ తగిలింది. మొన్నటి జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన తరఫున కార్పొరేటర్ అభ్యర్దిగా పోటీ చేసిన కింటాడ ఈశ్వరరావు సహా దాదాపు 100 మంది వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుజాతనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈశ్వరరావు సహా జనసేన కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో తొలి నుంచి ఉన్న వారికి తగిన ప్రాధాన్యమిస్తూనే పార్టీలోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇస్తామన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ ఆయా ప్రాంతాల అభివృద్ధికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈశ్వరరావుకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్రాజ్ చేస్తున్న ప్రజాసేవను, అంకితభావాన్ని చూసి పార్టీలో చేరానన్నారు. పార్టీ సిద్ధాతాలకు అనుగుణంగా సేవలందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నంరెడ్డి అజయ్రాజ్, నాయకులు ఇల్లపు ప్రసాద్, కాసు అంజిరెడ్డి, సుండ్రపు అప్పారావు, సుండ్రపు శ్రీనివాస్, వినోద్, గొర్లె రామునాయుడు, ఎల్బీ నాయుడు, ఆదిరెడ్డి మురళి, చిన్ని, ఐడి బాబు పాల్గొన్నారు. -
విశాఖపట్నం టూ ఢిల్లీ టూర్.. ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు ఇవే
సాక్షి,విశాఖపట్నం: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు డిప్యూటీ జనరల్మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ తెలిపారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ లోని వీఐపీ లాంజ్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరులసమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా యాత్రలకు సంబంధింన బ్రోచర్ను ఆవిష్కరించారు.ఐఆర్సీటీసీ ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలు, ఉత్తర భారతయాత్రలను విజయవంతంగా పూర్తిచేసిందని ఆయన తెలిపారు. రానున్న రెండు నెలల్లో రెండు ప్రత్యేక రైళ్లునడుపుతున్నట్టు ఆయన చెప్పారు. మొత్తం 13 కోచ్ల రైళ్లను కేవలం ఈ యాత్రల కోసమే నడుపుతున్నట్లు, రైలుమొత్తం 1300 ఉన్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో కేవలం సగం ఆక్యుపెన్సీతో మాత్రమే ఈ రైళ్లు నడుపుతామన్నారు. ప్రయాణికులకు ప్రతి రోజూ కోవిడ్ కిట్లు అందజేస్తామన్నారు. ఈ రైళ్లలో బయటవారికి ఏ విధమైనఅనుమతి లేకుండా ఈ టూర్ ప్యాకేజిలో ఉన్న వారికి ప్రత్యేక ఐడీ కార్డులు ఇచ్చి వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. ఇటువంటి తీర్థయాత్రలను వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని, దీనికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తక్కువ చార్జీలతోనే సందర్శించే అవకాశం కల్పిస్తుందని సిబ్బంది తెలిపారు. ఈసమావేశంలో స్టేషన్ మేనేజర్ సురేష్, స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ,సిబ్బంది పాల్గొన్నారు. ఈ యాత్రల గురించి మరింత సమాచారం కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో గేట్ నం.1 వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 82879 32318 / 82879 32281 / 7670908300 / 0891 2500695 నంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. ఉత్తర భారత యాత్ర ఈ యాత్ర మొత్తం 10 రాత్రుళ్లు 11 పగళ్లు ఉంటుంది. ఈ యాత్రలో ఆగ్రా, వైష్ణోదేవి, స్వర్ణదేవాలయం, వాఘాసరిహద్దు, మానస దేవి మందిరం, గంగా ఆర్తి, ఎర్రకోట, అక్షర్ధామ్ టెంపుల్, కుతుబ్మీనార్, లోటస్ టెంపుల్,ఇండియా గేట్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈటూర్ ఆగస్టు 27 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 6వతేదీన ముగుస్తుంది. ఈ టూర్లో ప్రయాణించాలనుకునేవారు విజయవాడ లేదా గుంటూరులో రైలెక్కాల్సి ఉంటుంది. స్లీపర్క్లాస్–10,400/–, థర్డ్ ఏసీ–17,330/–(ఒక్కొక్కరికి) జీఎస్టీతో కలిపి ఈ టూర్ చార్జీలు ఉంటాయి. మహాలయ పిండదాన్ తర్పణ్ ఈ యాత్ర మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈయాత్రలో వారణాసి, ప్రయాగరాజ్, గయ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమై అక్టోబరు 1వ తేదీతో ముగుస్తుంది.ఈ టూర్లో చేరాలనుకునేవారు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బ్రహ్మపూర్లలో రైలెక్కవచ్చు. ఈ టూర్లో స్లీపర్క్లాస్–6620/–, థర్డ్ ఏసీ–11,030/–(ఒకొక్కరికి) జీఎస్టీతో కలిపి చార్జీలు నిర్ణయించారు. ఈ స్పెషల్ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారికి రైలెక్కినది మొదలు దిగే వరకు అన్ని ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. స్లీపర్క్లాస్ వారికి హాల్స్, ధర్మశాలలు, డార్మెటరీలలోవసతి కల్పిస్తారు. థర్డ్ ఏసీ వారికి డబులు, లేదా త్రిబుల్ షేరింగ్ హోటల్లో రూంలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం,సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, సైట్ సీయింగ్ అన్నిప్యాకేజీలు పైన నిర్ణయింన ధరలలోనే ఉంటాయన్నారు. -
మావోయిస్టుల పట్టుతప్పుతోంది...
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుతోపాటు విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల ఉద్యమం క్రమంగా నీరుగారుతోంది. పార్టీకి ఏవోబీ వ్యాప్తంగా గిరిజనుల నుంచి ఆదరణ కరువైంది. గతరెండేళ్ల వ్యవధిలో 9 ఎదురుకాల్పలు సంఘటనలుజరగగా.. 12 మంది మావోయిస్టులు, దళ సభ్యులను పార్టీ పోగొట్టుకుంది. 29 మందిమంది మావోయిస్టులు, దళ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగమంతా మారుమూల గ్రామాల్లో గిరిజనుల అభివృద్ధి నినాదాన్ని విస్తృతం చేసింది. రామ్గూడ అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్ కౌంటర్ మావోయిస్టులకు పెద్ద నష్టంగా చెప్పవచ్చు. ఈ ఘటనలో 33మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నాతోపాటు, అనేకమంది కీలక మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టు నేతలుఆర్కే, ఉదయ్, చలపతి, అరుణలు మరలా మావోయిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకుప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఫలితం కనిపించడం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లోను ఐదుగురు కీలక నేతలను పోగొట్టుకోవడంమావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. అంతేకాక ఇటీవలఅమరవీరుల వారోత్సవాలు విఫలం కావడం..తాజాగా గురువారం డీజీపీ సమక్షంలో ఆరుగురుమావోయిస్టు కీలక నేతల లొంగిపోవడం పార్టీ ప్రాభవానికివిఘాతమే. తగ్గిన కార్యకలాపాలు ఏవోబీలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి. ఒడిశాలోని కలిమెల, నందపూర్,గుమ్మా, నారాయణపట్నం, పెదబయలు, కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గడంతో దళాల కార్యకలపాలు తగ్గాయని సమాచారం. గాలికొండ దళంలో10మంది, పెదబయలు, కోరుకొండ దళాలకు చెందిన 25మంది, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో50మంది వరకు మావోయిస్టులు గతంలో పనిచేసేవారు.ఈ రెండేళ్ల వ్యవధిలో వారి సంఖ్య 50కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో దళాలు తగ్గి ప్రస్తుతం ఒడిశాలోని కటాఫ్ ఏరియా, ఏవోబీస్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసునిర్బంధం అధికమైంది. విశాఖ ఏజెన్సీతోపాటు ఒడిశాలోని కోరాపుట్టు, మల్కన్ గిరి జిల్లాల్లో పోలీసుయంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు.పోలీసులకు కలిసొచ్చిన అభివృద్ధి నినాదం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతకాలంగా చేస్తున్న ప్రచారం పోలీసు యంత్రాంగానికి అనుకూలమైంది. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రకృతిపరమైన సమస్యలున్నాయి. కష్టసాధ్యమైనా వీటిని అధిగమిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సౌకర్యాలు కల్పిస్తోంది. పోలీసులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనులకు దగ్గరవుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు గిరిజనులను హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలలో గిరిజనులంతా బహిరంగంగానే మావోయిస్టులకు వ్యతిరేకంగా అభివృద్ధి నినాదంతో ర్యాలీలు చేస్తున్నారు. మావోయిస్టులకు గతంలో వలేమారుమూల గ్రామాల గిరిజనుల సహకారం తగ్గిందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు కీలకనేతలు, మిలీషియా సభ్యులు కూడా ఇటీవల కాలంలో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వని భర్త
సాక్షి,నర్సీపట్నం: ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో చేసేది లేక పార్వతి అనే మహిళ నర్సీపట్నం మున్సిపాలిటీ పెద బొడ్డేపల్లిలోని తన అత్తవారి ఇంటి వద్ద బుధవారం బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చెందిన టి.పార్వతికి నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లికి చెందిన రామకృష్ణతో 2019 మార్చిలో వివాహం జరిగింది. రూ.12 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. రామకృష్ణ విశాఖలో వార్డు సచివాలయం సెక్రటరీగా పని చేస్తున్నాడు. పాప పుట్టి ఏడాదిన్నర అవుతున్నా కాపురానికి తీసుకురాకుండా అత్త, మామలు అడ్డుపడుతున్నారు. ఆడపిల్లల పుట్టిందని, తల్లిపేరు మీద ఉన్న భూమి రాయించుకు రాలేదని కాపురానికి తీసుకురాలేదని పార్వతి తెలిపింది. నెల రోజుల్లో కాపురానికి తీసుకెళ్తానని రావికమతం పోలీసు స్టేషన్లో అంగీకరించిన భర్త ఆ తరువాత పట్టించుకోలేదని వాపోయింది. దీంతో మానసిక వేదనతో తన తల్లి ఇటీవల మృతి చెందిందని, తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తోబుట్టువు వద్ద తలదాచుకుంటున్నానని ఆమె చెప్పింది. బంధువులను వెంట పెట్టుకుని భర్త ఇంటికి వచ్చానని, ఇంటి వద్ద ఉన్న అత్త, మామలు తనను లోపలికి రానివ్వకుండా తలుపులు వేసుకుని బయటకు వెళ్లిపోయారని తెలిపింది. దీంతో న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించినట్టు చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు, భర్త తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు పిలిపించిన టౌన్ ఎస్ఐ లక్ష్మణ్రావు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఔరా అనిపిస్తున్న గుండు సూదిపై రాకెట్..
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక హస్తకళలో రాష్ట్రపతి అవార్డు పొందిన శ్రీశైలపు చిన్నయాచారి గుండు సూదిపై జీఎస్ఎల్వీ–ఎఫ్10 రాకెట్ నమూనాను అమర్చి ఔరా అనిపించారు. శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన జీఎస్ఎల్వీ–ఎఫ్10 రాకెట్ను స్ఫూర్తిగా తీసుకొని మైక్రో ఆర్టుతో అద్భుత కళాఖండాన్ని తయారు చేశారు. గుండు సూది పైభాగంలో బంగారంతో 5 మిల్లీమీటర్ల ఎత్తు, 1.5 మిల్లీమీటర్ల వెడల్పుతో రూపొందించారు. రాకెట్ చివరి భాగంలో భారతదేశం జెండా ఏర్పాటు చేశారు. రాకెట్ను తయారుచేయడానికి రెండు రోజుల సమయం పట్టిందన్నారు. అప్డేట్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)-ఎఫ్10 వాహకనౌక ప్రయోగం విఫలమైంది. -
‘సింహాద్రి అప్పన్న’కు యునెస్కో గుర్తింపునకు యత్నాలు
సింహాచలం(పెందుర్తి): సింహగిరి వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. వీటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పి.వి.జి.డి.ప్రసాదరెడ్డిని బుధవారం కలిసి కోరారు. రామప్ప ఆలయానికి మించిన చారిత్రక శిల్పకళా సౌందర్యం సింహాచలం ఆలయానికి ఉందని ఈవో వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, పురాతన పుస్తకాలు, ఫొటోలను వీసీకి చూపించారు. 11వ శతాబ్దం నుంచి తరతరాల సంస్కృతికి అద్దంపట్టేలా సింహాచలం దేవస్థానంలో శిల్పాలు ఉన్నాయని, శ్రీకృష్ణదేవరాయలు నుంచి గజపతుల వరకు ఉన్న రాజశాసనాలు చరిత్రకు అద్దం పడుతున్నాయని వివరించారు. ఇటీవలే అన్ని శిల్పాలను ప్రత్యేక తైలంతో శుభ్రపరిచినట్టు చెప్పారు. వీటి గురించి భక్తులకు అర్థమయ్యేలా బోర్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏయూ సహకారం అందిస్తే సింహాచలం ఆలయ విశిష్టతను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయ త్నిస్తాయన్నారు. సహకారం అందిస్తాం.. ఆలయ శిల్పకళ, శాసనాలను అధ్యయనం చేసి అన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వీసీ ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు. నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే సింహాచలం దేవస్థానంపై పూర్తిస్థాయి పరిశీలన చేయిస్తామన్నారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలు సింహాచలం దేవస్థానానికి ఉన్నాయని ఈ సందర్భంగా వీసీ అభిప్రాయపడ్డారని ఈవో తెలిపారు. -
అమ్మాయి రొమాంటిక్గా మాట్లాడుతూ న్యూడ్ కాల్ చేయమనగానే...
సాక్షి, విశాఖపట్నం/దొండపర్తి: అమ్మాయి వలపు వలకు వేపగుంట ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణంగా మోసపోయాడు. ఆమె రొమాంటిక్గా మాట్లాడే సరికి ఒళ్లు మరిచిపోయాడు. నగ్నంగా కాల్ చేయమని ముద్దుగా అడిగితే మరో క్షణం ఆలోచించకుండా కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ న్యూడ్ కాల్ స్క్రీన్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించిన ఆ గ్యాంగ్కు రూ.24 లక్షలు సమర్పించుకున్నాడు. అప్పటికీ వారి బెదిరింపులు ఆపకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాలు ఆధారంగా కేసును ఛేదించారు. బాధితుడిని దోచుకున్న భార్యాభర్తతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.5లక్షలు నగదు, ల్యాప్టాప్, 5 స్మార్ట్ఫోన్లు, 3 బేసిక్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీఎంఆర్డీఏ భవనంలోని సైబర్ క్రైం స్టేషన్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ(క్రైం) సురేష్బాబు కేసు వివరాలను వెల్లడించారు. వేపగుంట ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మొబైల్కు గతేడాది నవంబర్ 6న ‘కాల్ మీ ఎనీటైమ్, ఐ యామ్ యువర్ బెస్ట్ఫ్రెండ్ టు టాక్’ అంటూ ‘55678557’ నంబర్కు ఫోన్ చేయాలని ఓ మెసేజ్ వచ్చింది. అది చూసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెంటనే నంబర్కు కాల్ చేయగా ఒక అమ్మాయి రొమాంటిక్గా మాట్లాడుతూ.. హాఫ్ న్యూడ్ వీడియోతో ముగ్గులోకి దించింది. న్యూడ్ వీడియో కాల్ చేయమని అడిగింది. మరోక్షణం ఆలోచించకుండా న్యూడ్ కాల్ చేసి అమ్మాయితో కొంత సేపు మాట్లాడాడు. ఆ తరువాత రోజు న్యూడ్ వీడియో స్క్రీన్షాట్ పంపించి డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత.. బెదిరింపులు డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తూ వచ్చాడు. అప్పటి నుంచి దఫదఫాలుగా ఆ గ్యాంగ్కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.24 లక్షల వరకు వేశాడు. అయినప్పటికీ వారి వేధింపులు, బెదిరింపులు ఆపకపోవడంతో ఈ ఏడాది జూలై 16న సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు వేసిన బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. వాటి ఆధారంగా నిందితులు ముగ్గురిని గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా కృష్ణా జిల్లా దబ్బకుపల్లికు చెందిన షేక్ అబ్దుల్ రహీమ్(30), హైదరాబాద్లో జీడిమెట్ల ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు గుండా జ్యోతి(28), గుండా వీర సతీష్(34)లు ఈ మోసానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చాడు. అక్కడ వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.5 లక్షల నగదుతో పాటు ల్యాప్టాప్, 8 మొబైల్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎస్ఐ కె.రవి కిశోర్, ఏఎస్ఐ బి.శ్రీనివాసరావు, ఇతర సిబ్బందిని డీసీపీ(క్రైం) సురేష్బాబు అభినందించారు. సమావేశంలో సిబ్బంది రవికుమార్, వి. శ్రీనివాసరావు, షేక్ భాషా పాల్గొన్నారు. -
తప్పతాగి యువకుడు రౌడీయిజం.. మహిళ ఏం చేసిందో చూడండి?
సాక్షి, విశాఖపట్నం: పరిస్థితి చేజారి పోతే మనిషిలో కొత్త శక్తి బయటకు వస్తుంది అది ఆడ కావచ్చు మగ కావచ్చు... నిస్సహాయులు కావచ్చు. ఈ క్రమంలోనే తప్పతాగి తిక్క వేషాలు వేసిన ఓ అకతాయికి తిక్క కుదిర్చిందో ఓ మహిళ. విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో రౌడీల ఆగడాలు నిత్యం కనిపిస్తుంటాయి. పేదరికం తో పాటు నగర శివారు ప్రాంతం కావడంతో ఆకతాయిలు రౌడీ మూకలు అమాయకులను బెదిరిస్తున్నారు. అలా ఆరిలోవ లో క్రాంతి నగర్ లో ఓ మహిళ దుకాణం వద్దకు రామకృష్ణ అనే యువకుడు వెళ్లాడు. అక్కడకి వెళ్లి ఆమెపై దుర్భాష లాడి రౌడీయిజం చెలాయించాడు. ఆ మహిళపై పై చేయు చేసుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ యువకుడిపై తిరగబడింది.. చేతికి చిక్కిన రౌడిని నాలుగు దెబ్బలు తగిలించింది. ఈ సీన్ మొత్తం అక్కడే ఉన్నవాళ్లు మొబైల్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు విశాఖలో వైరల్అవుతోంది. పోలీసులు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. కాగా ఇటీవల విశాఖ నగర శివారులో ఇలాంటి అల్లరిమూకల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో రౌడీ బుద్ధి చెప్పిన మహిళ తెగువను ప్రశంసిస్తున్నారు. -
సింహాచలం కొండపై నేలకొరిగిన ధ్వజస్తంభం
సాక్షి,విశాఖపట్నం: సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం అర్థరాత్రి అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పాడై పోవడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ఆలయ సాంప్రదాయరీతిలో ధ్వజస్తంభం పునః ప్రతిష్ట చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మురికివాడల రహిత నగరంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం : నగరం దశ దిశ మార్చుకుంటూ ముందుకెళ్తున్నా మధ్యలో అక్కడక్కడా అభివృద్ధికి దూరంగా విసిరిపడేసినట్లుండే మురికివాడలను పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. చుట్టూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా వారి దరికి మాత్రం అవి చేరలేదు. విశాఖను మురికి వాడల రహిత నగరంగా మార్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నడుంబిగించింది. మొత్తం 793 మురికివాడల్లో నివసించే ప్రజలకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారుల ఎంపిక సర్వేతో పాటు మ్యాపింగ్ చేసేందుకు జీవీఎంసీ 793 బృందాలతో రెండు రోజుల పాటు ఫ్లాష్ సర్వేకు సిద్ధమవుతోంది. జీవీఎంసీ పరిధిలో 2005 ముందు వరకూ 450 మురికివాడలుండేవి. ఆ తర్వాత భీమిలి, గాజువాక అనకాపల్లి విలీనం చేయడంతో 2013 నాటికి ఈ సంఖ్య 793కి చేరింది. గత ప్రభుత్వాలు ఈ మురికి వాడల అభివృద్ధికి ఏం చేయాలనేదానిపై ఏ ఒక్కరోజూ ఆలోచన చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం స్లమ్స్ను అభివృద్ధి చేయాలని, అందులో ఏళ్ల తరబడి నివాసముంటున్న ప్రజలకు పట్టాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి స్లమ్లెస్ సిటీగా విశాఖను మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 426 నోటిఫైడ్ స్లమ్స్.... నగర పరిధిలో మొత్తం 426 నోటిఫైడ్ స్లమ్స్ ఉండగా 367 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. వీటిలో 20వేల వరకూ గృహాలున్నాయని, లక్ష వరకూ జనాభా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మురికివాడలు వివిధ రకాల భూముల్లో అభివృద్ధి చెందాయి. జీవీఎంసీకి చెందిన 67 స్థలాల్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన స్థలాల్లో 563, కేంద్ర ప్రభుత్వం, అనుబంధ సంస్థలకు చెందిన స్థలాల్లో 10, ప్రైవేట్ భూముల్లో 153 మురికి వాడలు ఏర్పడ్డాయి. ఈ మురికి వాడలు ఎంత మేర విస్తీర్ణంలో ఉన్నాయన్న అంశాలను గణించనున్నారు. రెండు రోజుల పాటు ఫ్లాష్ సర్వే మురికివాడలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ నివసిస్తున్న ప్రజలకు సొంత ఇంటి పట్టాల్ని అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఈ నెల 11, 12 తేదీల్లో 793 మురికి వాడల్లో జీవీఎంసీ యూసీడీ విభాగం ఫ్లాష్ సర్వే నిర్వహించనుంది. ఒక్కో స్లమ్కు ఒక్కో బృందం చొప్పున 793 బృందాలను యూసీడీ పీడీ వై.శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటారు. ఇందుకోసం జోనల్ కమిషనర్లు, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, ఇంజినీరింగ్ సిబ్బంది, టౌన్ప్లానింగ్ సిబ్బంది, వీఆర్వోలు మొత్తం 3,965 మంది సర్వే నిర్వహించనున్నారు. సరిహద్దులు, ఒక్కో స్లమ్లో ఉన్న జనాభా, ఇళ్లు, స్థల స్వరూపం, స్లమ్ మ్యాపింగ్ మొదలైన అంశాలను సేకరించనున్నారు. ఈ సర్వే ఆధారంగా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. -
ప్రొఫెసర్ స్థాయి నుంచి గవర్నర్ గా..
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్గా నియమితులవడంపై విశాఖలో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హరిబాబు ప్రకాశం జిల్లాలో జన్మించినప్పటికీ విద్యార్థి నుంచి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రస్థానం విశాఖ కేంద్రంగానే సాగించారు. ఏయూ విద్యార్థి నుంచి ప్రొఫెసర్ వరకు.. హరిబాబు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో 1953, జూన్ 15న జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేశారు. పీహెచ్డీ పట్టా కూడా ఏయూ నుంచే పొందారు. ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. విద్యార్థి నాయకుడిగా.. విద్యార్థి దశలోనే నాయకుడిగా అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1972–73లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్కు సెక్రటరీ అయ్యారు. 1975–75లో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన లోక్ సంఘర్ష సమితి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంగా అరెస్ట్ అయ్యారు. విశాఖ సెంట్రల్ జైలు, ముషీరాబాద్ జైలులో 6 నెలలు ఉన్నారు. జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనతా పార్టీలో చేరి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా సేవలందించారు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1991–93 మధ్యలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 1993–2003 కాలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. విశాఖ–1 ఎమ్మెల్యేగా.. 1999లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి హరిబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2003లో శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కూడా అక్కడే నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. 2014 మార్చిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తన పదవీ కాలం ముగిసిన తరువాత తిరిగి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అభినందనల వెల్లువ గవర్నర్గా నియమితులైన హరిబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దసపల్లా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం సందడిగా మారింది. బీజేపీ నేతలతో పాటు అన్ని పక్షాల నేతలు, సన్నిహితులు హరిబాబు ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేస్తున్నారు. బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, బీజేపీ జిల్లా ఇన్చార్జి కోడూరి లక్ష్మీనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
ఏపీ: సర్కార్ బడికి న్యూ లుక్..
సాక్షి, విశాఖపట్నం: డిజిటల్ తరగతులు.. క్రీడా మైదానాలు.. ఆవరణలో పచ్చదనం.. విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర మౌలిక సదుపాయాలతో కార్పొరేషన్ పాఠశాలలు భాసిల్లుతున్నాయి. జీవీఎంసీ తీర్చిదిద్దిన ఈ మోడల్ స్కూళ్లను చూసి అచ్చెరువొందిన ఫ్రెంచ్ ప్రతినిధులు మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. ఈ పాఠశాలలను మరింత స్మార్ట్గా మార్చేందుకు ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్డీ) రూ.52 కోట్ల గ్రాంట్ అందించనుంది. సిటీస్ అంటే ఏంటి.? నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు విభిన్న ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేటివ్, ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైన్ (సిటీస్) ఛాలెంజ్ పేరుతో 2019లో జరిగిన పోటీలో 15 నగరాలకు సంబంధించి మొత్తం 26 ప్రాజెక్టులు ఎంపికవ్వగా.. ఇందులో జీవీఎంసీకి చెందిన ఓ ప్రాజెక్టు అవార్డు సొంతం చేసుకుంది. స్మార్ట్సిటీలుగా ఎంపికైన 100 నగరాల్లో 15 ప్రధాన నగరాల మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఛాలెంజ్ ప్రాజెక్టుల్లో జీవీఎంసీ పాఠశాలలను ఆధునికీకరించిన విభాగంలో ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. ఈ ప్రాజెక్టుకు ఫిదా అయిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి అనుబంధ సంస్థైన ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎఎఫ్డీ) పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. ఎంత నిధులు..? మొత్తం రూ.65 కోట్లతో గ్రేటర్ పరిధిలోని 40 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.52 కోట్లు ఫ్రెంచ్ ప్రభుత్వ సంస్థ ఏఎఫ్డీ మంజూరు చేస్తుంది. మిగిలిన రూ.13 కోట్లు జీవీఎంసీ కేటాయిస్తుంది. ఏఏ పాఠశాలలను అభివృద్ధి చేస్తారు.? మొత్తం 40 పాఠశాలలను ఎంపిక చేశారు. భీమిలి జోన్లో 6 స్కూల్స్, జోన్–3లో 7 పాఠశాలలు, జోన్–4లో 7, జోన్–5లో 11, అనకాపల్లిలో 9 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 34 ప్రాథమిక పాఠశాలు కాగా, 6 హైస్కూల్స్ ఉన్నాయి. పాఠశాలలను ఎలా ఎంపిక చేశారు.? సిటీస్ ప్రాజెక్టుకు అనుగుణంగా స్కూల్స్లో స్మార్ట్ క్యాంపస్, క్రీడా ప్రాంగణానికి అనువైన స్థలం ఉండటంతో పాటు బాల బాలికల నిష్పత్తి, పాఠశాల అభివృద్ధి చేస్తే బాలికలు చదువుకునేందుకు వచ్చే అవకాశాలు, అభివృద్ధికి ఆస్కారం ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. ఎలా అభివృద్ధి చేస్తారు..? విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు. సామాజిక వసతులతో పాటు అభ్యసనకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆటస్థలం, పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించడం, డిజిటల్ తరగతి గదులు, విద్యార్థులు ఆరోగ్య వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా రికార్డులు నిర్వహణ ఇలా అనేక అంశాల్లో పాఠశాలను అభివృద్ధి చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. -
పల్లా ఆక్రమణలకు చెక్
-
విశాఖ జిల్లా అరకులో భారీగా గంజాయి స్వాధీనం
-
తీర్మానం పై హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాల నేతలు
-
గర్భవతిగా ఉన్నా 108 లో టెక్నీషియన్ శైలజ సేవలు
-
30వ రోజుకు చేరిన స్టీల్ ప్లాంట్ ఉద్యమం
-
మీ భద్రత..మా బాధ్యత
-
విశాఖలో తగ్గిన కరోనా కేసులు
-
పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
-
రెండు రోజులలో కరోనా నిర్దారణ ల్యాబ్ ఏర్పాటు
-
ప్రజలపై మాకు విశ్వాసం ఉంది
-
విశాఖే ఎందుకు? ఆసలు రహస్యం
-
ఆశలు అమ్మేస్తున్నారు
-
ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించడంతో పంజాబ్తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్నైట్ స్కోరు 328/5తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర చివరకు 423 పరుగులకు ఆలౌటైంది. ఏడు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. చివరి రోజు ఆంధ్ర 95 పరుగులు జతచేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (181; 15 ఫోర్లు, 4 సిక్స్లు) క్రితం రోజు స్కోరుకు 30 పరుగులు జతచేసి పెవిలియన్ చేరగా... షోయబ్ ఖాన్ (52; 6 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అరంగేట్రం స్పిన్నర్ మయాంక్ మార్కండే 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 102 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (54 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్, షోయబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 414 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆంధ్రకు మూడు పాయింట్లు, పంజాబ్కు ఒక పాయింట్ లభించాయి. హైదరాబాద్ మ్యాచ్ ‘డ్రా’ తిరువనంతపురం: వర్షం అంతరాయం కలిగించిన కేరళ, హైదరాబాద్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 30/1తో ఆదివారం చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సందీప్ (155 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... హిమాలయ్ అగర్వాల్ (132 బంతుల్లో 48; 7 ఫోర్లు), సుమంత్ (136 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్స్లో 495/6 వద్ద డిక్లేర్ చేసింది. మ్యాచ్లో రెండు జట్ల ఇన్నింగ్స్లు పూర్తి కాకపోవడంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. -
కిడారి హత్య.. స్థానికుల ప్రమేయం!
-
కిడారి హత్య.. స్థానికుల ప్రమేయం!
సాక్షి, విశాఖపట్నం : డుంబ్రిగూడా పరిసర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు, సోమల హత్య వెనుక స్థానికులు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యలో మావోయిస్టులకు సహకరించారన్న అనుమానంతో టీడీపీ మాజీ ఎంపీటీసీ సుబ్బారావు, అతని భార్యను విచారిస్తున్నారు. వీరితో పాటు అంత్రిగూడకు చెందిన కమల, శోభన్ అనే ఇద్దరు గిరిజనులు ఆదివారం అదుపులోని తీసుకుని అప్పటినుంచి విచారిస్తున్నారు. కిడారి హత్యకు వీరు సహకరించారని పోలీసులు నిర్ధారించుకున్న తరువాత రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డుంబ్రిగూడకు చెందిన నలుగురు విలేకర్లను కూడా పోలీసులు విచారించి విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో లివిటిపుట్టలో మావోయిస్టులు లేఖ ఇచ్చారన్న విషయంపై పోలీసులు ఆరా తీసున్నారు. కాగా ఒక వైపు సిట్ విచారణ జరుగుతున్నా.. మరోవైపు పోలీసు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏక్షణం ఏ అధికారిపై వేటు పడుతోందనని ఏజెన్సీలో పనిచేస్తున్న పోలీసులు ఆందోళన చెందుతున్నారు. -
‘అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ నేతలు అహంకారం, అధికారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుడి ముత్యాల నాయుడు, పార్టీ నేత పెట్టా ఉమశంకర్, మండిపడ్డారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాధరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ప్రకటలో పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ప్రస్తావించిన ప్రతీ అంశం వాస్తవమే అని, ప్రజలే రుజువులతో సహా వచ్చి ప్రతి సమస్యను ఆయనకు వివరిస్తున్నారని తెలిపారు. చేతనైతే అధికారం ఉన్నవారు ఈ సమస్యలను పరిష్కరించాలని, వైఎస్ జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్ఆర్ హయంలో జరిగిన అభివృద్ధికి.. చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. -
అపూర్వ జంట..అందరికీ ఆదర్శం
-
ఆర్మీ అధికారి అదృశ్యం
గోపాలపట్నం (విశాఖపట్నం) : ఇంటి నుంచి విధులకు పయనమైన ఆర్మీ అధికారి ఆచూకీ లేకుండాపోయింది. అటు విధుల్లో చేరక.. ఇటు కుటుంబ సభ్యులకూ అందుబాటులోకి రాకపోవడంతో ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా గోపాలపట్నం సమీపంలోని నరవ గ్రామానికి చెందిన గవర శ్రీనివాసరావు (40) ఆర్మీలో 20 ఏళ్ల సర్వీసు చేశారు. సిపాయి (గన్ఫిట్టర్)గా చేరి ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం జలంధర్లో నాయక్గా పనిచేస్తున్నారు. భార్య యజ్ఞప్రియ, ఇద్దరు కొడుకులు పునీత్కుమార్(13), తరుణ్(10) ఉన్నారు. విధులు నిర్వహించే ప్రాంతంలోనే భార్యాపిల్లలతో ఉండేవారు. అయితే వచ్చే సెప్టెంబరు 30న ఆయన సర్వీసు పూర్తి కానుంది. ఈ తరుణంలో సొంతూరు నరవ గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సొంత ఇల్లు కట్టుకుని మే 2న గృహప్రవేశం చేశారు. పిల్లలిద్దరినీ ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్చారు. ఈ నేపథ్యంలో ఇటీవలే శ్రీనివాసరావుకు కపూల్తలాకు బదిలీ అయింది. ఉన్నది మూడు నెలల సర్వీసే. ఇంతలో బదిలీ అయిన తరుణంలో తాను అక్కడ సర్వీసు ముగించుకు వస్తానని మే 6న ఇంటి నుంచి బయలుదేరారు. దువ్వాడ రైల్వేస్టేషన్ వరకూ యజ్ఞప్రియ పిల్లలతో కలిసి భర్తను సాగనంపింది. జమ్మూ వెళ్లే రైలెక్కిన శ్రీనివాసరావు జలంధర్లో దిగి కపుల్తలాకు వెళ్లాల్సి ఉండగా... మే నెల 8న మధ్యాహ్నం తన ఫోన్, మనీ పర్సు పోయాయంటూ యజ్ఞప్రియకు తోటి ప్రయాణికుని నంబరుతో ఫోన్ చేసి చెప్పారు. తన ఏటీఎం కార్డు బ్లాక్ చేయాలని, తాను ఉన్న ప్రాంతానికి డబ్బులు తేవాలని శ్రీనివాసరావు కోరారు. తర్వాత నుంచి అతని జాడ లేదు. అలాగని అంతకు ముందు నెంబరుకి ఫోన్ చేస్తే తాను ఓ స్టూడెంట్నని సమాధానం వచ్చింది. ఫోన్ కావాలంటే ఇచ్చాను తప్ప తనకెలాంటి సంబంధం లేదని చెప్పడంతో యజ్ఞప్రియ కలవరపడింది. అదే రోజు జలంధర్ యూనిట్ ఉన్నతాధికారులకు ఫోన్లో తన భర్త సంగతి చెప్పి ఆందోళన వెలిబుచ్చింది. మే 15న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనస్థితిలో కుటుంబం : శ్రీనివాసరావు అదృశ్యమయ్యాడని తెలిసి యజ్ఞప్రియతో పాటు పిల్లలు, తల్లిదండ్రులు దీనంగా ఉన్నారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ముసలమ్మ, రాములుకు, అంగవైకల్యంతో ఉన్న సోదరుడు కనకరాజు, సోదరి నాగమణికి శ్రీనివాసరావు వెలుగుగా నిలిచారు. సోదరికి వివాహం చేశాడు. చివరికి సర్వీసు పూర్తి చేసుకుని ఉన్న ఊళ్లో స్థిరపడాలని ఆశలు పెట్టుకున్న ఆయన ఇపుడు కనిపించలేదని తెలిసి ఎవరికీ తిండి సహించడం లేదు. ఇంటిల్లపాదీ ఆందోళనతో గడుపుతున్నారు. మిస్టరీగా అదృశ్యం శ్రీనివాసరావు అదృశ్యం మిస్టరీగా మారింది. భార్య ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆర్మీ అధికారులకూ సమాచారం పంపారు. అదే సమయంలో యజ్ఞప్రియ జలంధర్, కపుల్తలాలో ఉన్న ఆర్మీ అధికారులను సంప్రదించింది. పానిపట్ నుంచి ఫోన్ చేశారని చెప్పి అక్కడా గాలించారు. అక్కడి స్టేట్ బ్యాంకులో మే 8న మధ్యాహ్నం శ్రీనివాసరావు తిరిగినట్లు, రూ.5 వేలు డ్రా చేసినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. అయితే అదే రోజు తన మనీ పర్సు, సెల్ఫోన్ పోయిందని, డబ్బులు తేవాలని చెప్పిన శ్రీనివాసరావు తర్వాత బ్యాంకులో డబ్బులు ఎలా డ్రా చేశారని ఆరా తీస్తే చెక్బుక్లు, పాస్బుక్లను చూపి నగదు పొందినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసిందని యజ్ఞప్రియ చెప్పారు. తన భర్త ఎలా అదృశ్యమయ్యారో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతోంది. జలంధర్లో రైలు దిగాల్సి ఉండగా, మార్గమధ్య పానీపట్లో ఎందుకు దిగినట్లు.. రైలెక్కాక ఎవరైనా పరిచయమై మోసగించారా.. లేక మరేం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. -
విశాఖ ’జూ’పార్క్ వివాదం
-
పుష్కరసాన్నాలు వెళ్తుండగా ప్రమాదం
-
రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
విశాఖపట్టణం : అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... విశాఖపట్టణం జిల్లా రొలుగుంట మండలంలోని పెదగడ్డ వంతెన వద్ద పోలీసులు వాహనాలు పరిశీలిస్తుండగా గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. కాగా తనిఖీలను గమనించిన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పట్టు బడిన గంజాయి విలువ రూ. 50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. (రోలుగుంట) -
40 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్టణం : అక్రమంగా తరలిస్తున్న 40కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ జిల్లా రోటుగుంట మండలంలో నందివంపు గ్రామం సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు..మండలంలోని బీబీపట్టణం గ్రామానికి చెందిన మాచాడ చిన్నమనాయుడు ఆటోలో 40 కేజీల గంజాయిని వైజాగ్ తరలిస్తున్నాడు. ఈ క్రమంలో నందివంపు గ్రామం సమీపంలో పోలీసులు ఆటోని అడ్డుకొని తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందుతుడిని అదుపులోకి తీసుకొని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (రోలుగుంట) -
150 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : విశాఖ జిల్లా రోలుగుంట మండల పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని నిందిగొండ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహనంలో బస్తాల్లో తరలిస్తున్న 160 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
600 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం : విశాఖ జిల్లా లో పెద్ద ఎత్తున గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లా పరిధిలోని చింతపల్లి నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి వెళ్తుతున్న లారీని శుక్రవారం ఉదయం నర్సీపట్నంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న విషయం వెలుగు చూసింది. దీంతో లారీలో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వాహనంతో పాటు 600 కేజీల గంజాయి, 5 సెల్ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని సమాచారం. (నర్సీపట్నం) -
హైదరాబాద్ x ఆంధ్ర
తొలి పోరులో ‘ఢీ’ నేటి నుంచి రంజీ ట్రోఫీ షురూ మొదటి రౌండ్లో 12 మ్యాచ్లు సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 2014-15 సీజన్ మ్యాచ్లు ఆదివారం ప్రారం భం కానున్నాయి. తొలి రౌండ్లో భాగంగా వివిధ మైదానాల్లో నేటి నుంచి 12 మ్యాచ్లు జరుగుతాయి. ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ వైఎస్ఆర్ స్టేడియంలో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు హైదరాబాద్, ఆంధ్ర జట్లు తలపడబోతున్నాయి. గత ఏడాది ఫార్మాట్నే కొనసాగిస్తూ మొత్తం 27 జట్లను మూడు గ్రూప్లుగా విభజించారు. సాధారణంగా ప్రతి ఏటా వన్డే టోర్నీలకు ముందే రంజీ మ్యాచ్లను నిర్వహిస్తారు. అయితే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో ముందుగా వన్డేలు జరిపారు. దాంతో కాస్త ఆలస్యంగా రంజీ ట్రోఫీ మొదలవుతోంది. ఫిబ్రవరి 8నుంచి 12 వరకు జరిగే ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులు మినహా ఇతర ఆటగాళ్లంతా ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. పలువురు వెటరన్, సీనియర్ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తులో టీమిండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు కూడా ఈ నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. రాత మారుతుందా... రంజీ ట్రోఫీలో చాన్నాళ్లుగా హైదరాబాద్, ఆంధ్ర జట్లది ఒకే రకమైన కథ, వ్యథ. ఇరు జట్లు ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేస్తున్నాయి. ఎప్పుడో ఒక మెరుపు తప్ప దేశవాళీలో నిలకడగా, చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. గత సీజన్లో గ్రూప్ ‘సి’ నుంచి బరిలోకి దిగిన హైదరాబాద్, ఆంధ్ర మెరుగ్గా రాణించలేక అక్కడే చతికిలపడ్డాయి. ఫలితంగా ఈసారీ గ్రూప్‘సి’ బరిలో దిగాల్సి వస్తోంది. రంజీ నిబంధనల ప్రకారం ‘సి’ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’కి ప్రమోట్ అవుతాయి. గత ఏడాది అక్షత్ రెడ్డి సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇప్పుడు రవితేజను కెప్టెన్గా ఎంపిక చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన కైఫ్కు ఆంధ్ర జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇరు జట్లలోనూ స్వల్ప మార్పులు మినహా ఎక్కువ మంది పాతవారే ఉన్నారు. ఈ రెండు జట్లలో ఏదైనా ముందుకు వెళుతుందో చూడాలి. రంజీ ట్రోఫీ గ్రూప్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: కర్ణాటక, బెంగాల్, ముంబై, రైల్వేస్, యూపీ, బరోడా, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్. గ్రూప్ ‘బి’: మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, సౌరాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, విదర్భ, హర్యానా, ఒడిషా. గ్రూప్ ‘సి’: హైదరాబాద్, ఆంధ్ర, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, అస్సాం, త్రిపుర, జార్ఖండ్, సర్వీసెస్. -
ఐటీ.. తోడ్పాటేదీ!
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. కానీ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఈ రంగం నీరుగారిపోతోంది. పేరుకు ఎస్ఈజెడ్లు మంజూరు చేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారు. వీటికి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. విద్యుత్ సమస్యల కారణంగా ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్నాం. భూములిచ్చిన కంపెనీలకు వాటిపై బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాయి. ఇంకేం ఉద్యోగాలొస్తాయి. మా కంపెనీలో విదేశీ నిపుణులను తీసుకువద్దామనుకుంటే విశాఖలో అత్యున్నతస్థాయి విద్యా వ్యవస్థలు లేవు. దీని వల్ల నిపుణులు విశాఖకు రావడానికి ఇష్టపడడం లేదు. మహిళా ఉద్యోగులకు రా త్రి వేళల్లో భద్రత లేకపోవడంతో ఉద్యోగా లు మానేస్తున్నారు’ అని పలు కంపెనీల యజమానులు గళమెత్తారు. మంగళవారం విశాఖ నగరంలో సీఐఐ ఆధ్వర్యంలో ఐటీశాఖ ఉన్నతాధికారులు, కంపెనీ యాజ మాన్యాల ముఖాముఖీ జరిగింది. ఇందు లో పలువురు ఐటీ యజమానులు సమస్యలపై ఎలుగెత్తారు. భద్రతలేక మహిళా ఉద్యోగుల రాజీనామా రుషికొండ హిల్ నంబర్-2లో ఐటీ కంపెనీలకు కనీస భద్రత లేదు. ఇక్కడ వీధి దీపాలు లేవు. మహిళా ఉద్యోగులు రాత్రి వేళ విధులకు రావడానికి భయపడుతున్నారు. చాలా మంది ఉద్యోగం మానేస్తున్నారు. పోలీసు భద్రత ఎక్కడా కనిపించడంలేదు. ఇలా అయితే కంపెనీలు ఎలా నడపాలి?. మరోవైపు కంపెనీకి బ్రాడ్బ్యాండ్ సమస్య తీవ్రంగా ఉంది. ఏ నెట్వర్క్ కూడా పనిచేయడంలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. -సతీష్ కనుమూరి, సీఈవో, న్యూనెట్ విదేశీ నిపుణులు విశాఖకు రావడం లేదు ఐటీ కంపెనీలను విద్యుత్ సమస్య వేధిస్తోంది. జనరేటర్లతో కంపెనీలను నడపడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా గురించి పట్టించుకోవడం లేదు. ఉన్న కంపెనీలను విస్తరించాలంటే అనుమతుల కోసం తిరగాల్సి వస్తోంది. మా కంపెనీలో సీనియర్ నిపుణుల అవసరం ఉండడంతో అమెరికాలో పనిచేస్తున్న ఉత్తరాది ఉద్యోగులను విశాఖకు పిలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. వారి పిల్లలకు ఇక్కడ సరైన విద్యా వసతుల్లేక రావడానికి ఇష్టపడడంలేదు. ప్రభుత్వం ఐటీ నిపుణుల పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఇటువంటి సౌకర్యాలు కల్పించాలి. -మాధురి, మిరాకిల్ కంపెనీ వైస్ప్రెసిడెంట్ పరిశ్రమలు పెట్టనివ్వరా! టీవీ చానల్ లేదా హోటల్ పెడతామంటే ఏపీఐఐసీ నరకం చూపిస్తోంది. అధికారుల చుట్టూ తిరిగితే భూమి మంజూరు చేయడం లేదు. డెయిరీ పెడదామనుకున్నా అదే పరిస్థితి. కేవలం లంచం ఇవ్వనందుకే ఇలా ఇబ్బంది పెడుతున్నారు. పరిశ్రమలు పెట్టాలనుకునే వారిని నిరుత్సాహ పర్చకండి. 500 మందికి ఉద్యోగం కల్పించాలనే నా ఆశయాన్ని అంతా కలిసి నీరుగార్చేశారు. -వై.వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్రభుత్వం సహకరించడం లేదు విశాఖలో అనేక ఐటీ కంపెనీలు బ్రాడ్బ్యాండ్ సమస్య ఎదుర్కొంటున్నాయి. గూగుల్ కంపెనీ తరపున విశాఖలో బ్రాడ్బ్యాండ్ సమస్య పరిష్కారానికి మేం చాలా ప్రయత్నించాం. కానీ ప్రభుత్వం నుంచి సరైన మద్దతు దొరకడం లేదు. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ స్టేటస్ ఇవ్వాలి. విశాఖలో మాకు సహకరిస్తే ఆ తర్వాత విజయవాడలోనూ ఐటీ రంగానికి మా వంతు సహకారం అందిస్తాం. -శ్రీనివాస్, గూగుల్ కంపెనీ ప్రతినిధి పేరుగొప్ప.. ఊరుదిబ్బ ఐటీ కంపెనీలు సమావేశాలు నిర్వహించుకోవడానికి కనీసం ఇంక్యుబేషన్ సెంటర్ లేదు. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కలగానే మిగిలింది. ఐటీ కంపెనీలకు ఎగ్జిట్ పాలసీ అమలుచేయాలి. 100 ఎకరాలను జో న్గా ఏర్పాటుచేసి చిన్న కంపెనీలకు ఎకరం చొప్పున కార్యాలయాల కు స్థలం మంజూరుచేయాలి. ఐటీ కంపెనీలకు సమీపంలో ఉద్యోగులకు మోడల్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం చేపడితే వారి సమస్యలు తీరుతాయి. -ఓ.నరేష్కుమార్, సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈవో -
హమ్మయ్య జీతాలిచ్చారు!
సాక్షి, విశాఖపట్నం: గురువుల ఇక్కట్లు కాస్త తీరాయి. జీవీఎంసీ ‘దీర్ఘకాలిక’ ఉ పాధ్యాయుల కేసులో బాధితులకు స్వల్ప ఊరట లభించింది. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు జీతాల కోసం అగచాట్లు పడుతున్న వారి దీన గాథను ‘ అ-అప్పు.. ఆ-ఆవేదన’ శీర్షికన సాక్షిలో ఈ నెల 19న వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు. రెండు మాసాలుగా తమ చుట్టూ తిప్పించుకుంటున్న ట్రెజరీ అధికారులు ఎట్టకేలకు కరుణించారు. జిల్లా విద్యాశాఖ చేపట్టిన బదిలీల ద్వారా జీవీఎంసీ పరిధిలోని స్థానాల్లోకి చేరిన 23 మందికి గతేడాది మే 16 నుంచి జూన్ 30 వరకు, డిసెంబర్ నెల జీతాలు రూ.10,95,892 వారి బ్యాంకు ఖాతాలకు మంగళవారం జమ చేశారు. కోర్టు ఉత్తర్వుల పేరిట పాత స్థానాల్లో కొనసాగుతున్న 35 మంది(వీరిలో ఐదుగురు డిసెంబర్లోనే బదిలీ స్థానాల్లో చేరిపోయారు)కి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలకుగాను రూ.29,66,674లు వారి ఖాతాల్లో జమయ్యాయి. విద్యాశాఖ ఉత్తర్వులతో కొత్తగా ఆ స్థానా ల్లో చేరిన 23 మందికి ఇంకా జూలై నుంచి నవంబర్ వరకు జీతాలు రావాల్సి ఉంది. బదిలీ ఉత్తర్వుల్ని అందుకోకుండా మెడికల్ లీవులో ఉన్న 30 మందికి డిసెంబర్ నుంచి జీతా లు రావాల్సి ఉన్నప్పటికీ వారెక్కడ పనిచేస్తున్నా రో.. తెలియని కారణంగా జీతాల బిల్లులు పెట్టలేమంటూ డీఈవో లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. 23 మందికి మిగిలిన ఐదు మాసాల జీతాలను కూడా 20 శాతం హెచ్ఆర్ఏతో తక్షణమే చెల్లించాల్సిందిగా వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరికి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. డీఈవో ఉత్తర్వుల మేరకే.. డీఈవో ఆదేశాల మేరకు ‘కొత్త’ టీచర్ల కు వారు పనిచేస్తోన్న జీవీఎంసీ పరిధిలోని 20 శాతం హెచ్ఆర్ఏతోనే జీతా లు, బకాయిలు చెల్లించే ఏర్పాట్లు చే శాం.జనవరి నెల బిల్లులు సిద్ధమయ్యా యి. జూలై నుంచి నవంబర్ వరకు చెల్లించాల్సిన జీతాభత్యాలను కూడా డీఈవో ఉత్తర్వుల ఆధారంగా నాలుగు మండలాల్లో ఖాళీగా ఉన్న 20 శాతం హెచ్ఆర్ఏతో కలిపి చెల్లిస్తాం. బదిలీ టీచర్లకు ఎల్పీసీ, ట్రెజరీ ఐడీలను వారికి కేటాయించిన గ్రా మీణ మండలాలకు ఇప్పటికే బదిలీ చేశాం. - సి.ఆర్.కె.దేవరాయలు, ఎంఈవో, పెందుర్తి