women dead
-
వీడియో: కూకట్పల్లిలో విషాదం.. కరెంట్ షాక్తో మహిళ మృతి
-
HYD: స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్తో మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోర్ స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్తో వివాహిత గంగా భవాని(33) అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్లో గంగాభవాని(33) పని మనిషిగా పనిచేస్తోంది. అయితే, గంగా భవాని అపార్ట్మెంట్లో బోర్వెల్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్తో మృతిచెందింది. కరెంట్ షాక్ తగిలిన వెంటనే ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె నేలపై పడి ఉండటాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా, ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్లోనే ఆమె భర్త వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు 11 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి మరియు 9 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి ఉన్నారు. వీరు ఏపీవాసులుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి -
ఎట్ల బతుకుతరు బిడ్డా.. దేవుడా ఎంత పనిచేసినవ్..
‘‘పాపపు దేవుడు పగ పట్టిండు బిడ్డా.. అప్పుడు నాన్నను తీసుకుపోయిండు.. ఇప్పుడు అమ్మను కూడా తీసుకుపోయిండు.. ఏం పాపం చేస్తిరిబిడ్డ మీరు.. ఎక్కడ కాకుండా అయిర్రు.. నాన్న పోయినంక అమ్మ కళ్లల్ల పెట్టి సాదుకుంది బిడ్డలారా.. అమ్మ కూడా పోయింది.. ఇప్పుడు ఎట్లా బిడ్డలారా.. అంటూ మృతి చెందిన టీచర్ రజిత కొడుకులను పట్టుకొని బంధువులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.’’ సాక్షి, కరీంనగర్: పిల్లలకు ఊహ తెలియని వయసులో తండ్రి గుండెపోటుతో దూరమయ్యాడు. అప్పటి నుంచి ఆ తల్లే అన్నీ తానై చూసుకుంటోంది. ఇద్దరు పిల్లలకు కన్నప్రేమ పంచుతూనే కుటుంబ బాధ్యతను మోస్తోంది. పిల్లలే ప్రాణంగా బతుకుతూ.. టీచింగ్ చేస్తోంది. రోజూ మాదిరిగానే పిల్లలను పాఠశాలకు సిద్ధం చేసి విధులకు బయల్దేరిన ఆమెను మృత్యువు కబళించింది. రెడీమిక్స్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. తలకు హెల్మెట్ పెట్టుకున్నా.. శరీరం పైనుంచి వాహనం వెళ్లడంతో బాడీ ముక్కలుముక్కలైంది. చెల్లా చెదురుగా పడిఉన్న శరీరభాగాలను ఒక్కచోటుకి చేర్చి ఆస్పత్రికి తరలించిన దృశ్యం ఘటనాస్థలంలో పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో కరీంనగర్లోని పద్మనగర్ బైపాస్ రోడ్డు చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. అంతా క్షణాల్లోనే.. కరీంనగర్లోని అలకాపురిలో నివాసం ఉంటున్న బైరెడ్డి రజిత (41) ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2014లో మోడల్సూ్కల్లో మ్యాథ్స్ పీజీటీగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఇల్లంతకుంట (రహీంఖాన్ పేట్) మోడల్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు స్కూల్కు సహోద్యోగులు, ఆ ప్రాంతంలో పనిచేసే మరికొందరు టీచర్లతో కలిసి ఆటోలో కరీంనగర్ నుంచి ఇల్లంతకుంటకు వెళ్తుండేవారు. అలకాపురి నుంచి స్కూటీపై వచ్చి పద్మనగర్ చౌరస్తాలోని ఓ పాఠశాల వద్ద పార్కింగ్ చేసి ఆటోలో సహోద్యోగులతో వెళ్తుంటారు. గురువారం ఉదయం 6.45 తరువాత ఇంట్లో పిల్లలను పాఠశాలకు సిద్ధం చేసి తన స్కూటీపై బయల్దేరారు. పద్మనగర్ బైపాస్ చౌరస్తా వద్దకు చేరుకొని, పక్కనే ఉన్న ప్రయివేటు పాఠశాలలో వాహనాన్ని పార్క్ చేసేందుకు యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సిరిసిల్ల వైపు నుంచి మానేరుడ్యాం వైపు రోడ్డు క్రాస్ చేస్తున్న రెడీమిక్స్ లారీ (టీఎస్02 యూబీ 7183) అతివేగంగా స్కూటీని ఢీకొట్టింది. దీంతో రజిత కిందపడగా ఆమె శరీరం పైనుంచి లారీ వెళ్లింది. శరీరం నుజ్జునుజ్జయి.. అక్కడికక్కడే చనిపోయారు. నాడు తండ్రి.. నేడు తల్లి.. రజితకు శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన బైరెడ్డి తిరుపతిరెడ్డితో వివాహం కాగా ఇద్దరు కొడుకులు ప్రజ్ఞాత్రెడ్డి(14), రిశిఖ్రెడ్డి(10) ఉన్నారు. తిరుపతిరెడ్డి కరీంనగర్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసేవారు. ఆరేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. అప్పటి నుంచి రజిత కరీంనగర్లోని అలకాపురిలో తన తల్లిగారింట్లో పిల్లలతో ఉంటున్నారు. పిల్లలను ప్రయివేటు పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కొడుకు పదో తరగతి, చిన్న కొడుకు ఆరో తరగతి చదువుతున్నారు. తండ్రి లేకపోయినా తన కొడుకులను ప్రేమగా చూసుకుంటున్న తల్లిని రోడ్డు ప్రమాదంలో రూపంలో విధి బలితీసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మమ్మి.. మాకు బాయ్ చెప్పి వెళ్లింది ‘మమ్మి.. మాకు బాయ్ చెప్పి వెళ్లింది. మళ్లీ ఎటు వెళ్తున్నామని’ మనవళ్లు అడిగిన ప్రశ్నకు రజిత తల్లిదండ్రులు సమాధానం చెప్పలేకపోయారు. సరిగ్గా ఏడు గంటలకు ప్రమాదం జరగడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పటివరకు పాఠశాలకు వెళ్లిందనుకున్న తమ కూతురు మరణించిందన్న వార్త తెలియడంతో గుండెలవిసేలా రోదించారు. రజిత మరణవార్త వినగానే బంధువులు, టీచర్లు వందలసంఖ్యలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. చివరిచూపునకు కూడా నోచుకోని మృతదేహం వద్ద గుండెలవిసేలా విలపించారు. రజిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అలకాపురిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలు తండ్రి బండ నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గైనకాలజిస్ట్గా నాకు ఎన్నో ప్రశ్నలున్నాయి: గవర్నర్ తమిళి సై
-
మలక్పేట ఘటనపై స్పందించిన తమిళిసై.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్!
సాక్షి, హైదరాబాద్: మలక్పేట ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట ఆసుపత్రిలో బాలింతల మృతి బాధాకరమని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తనకు ప్రశ్నలు ఉన్నాయంటూ ట్విస్ట్ ఇచ్చారు. కాగా, రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. మలక్పేట ఆసుపత్రిలో బాలింతల మృతి బాధాకరమన్నారు. గైనకాలజిస్ట్గా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వైద్య రంగంలో వసతులు మరింత మెరుగుపరచాలి. బిల్లులు పెండింగ్ కాదు.. పరిశీలనలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలి. వైద్యరంగం మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు.. కానీ ఇంకా మెరుగు పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. వివాదాలతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. యూజీసీ కొన్ని అంశాలను ప్రస్తావించింది, న్యాయ చిక్కులు లేకుండా చూసుకోవాలి అని అన్నారు. -
గుంటూరు: చంద్రబాబు సభలో తొక్కిసలాట..
-
చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు: ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఘటన విషాదం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందగా పలువురు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో సభ నిర్వాహకులు, చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నాలుగు రోజుల క్రితమే జరిగిన కందుకూరులో చంద్రబాబు రోడ్ షో కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే న్యూ ఇయర్లో మొదటిరోజే ఇలా మరో దారుణం జరిగింది. దీంతో, చంద్రబాబు తీరుపై ప్రజలు మండిపడితున్నారు. గుంటూరు చంద్రబాబు సభకు 5వేల లోపే జనం హాజరు కాగా, హాజరైన వారిలో సగం మందికి కూడా కానుకలు అందలేదు. కానుకలు అయిపోయాయంటూ నిర్వహకులు చేతులెత్తేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంతో ఒక మహిళల అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. కానుకల దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేసే యత్నం చేశారు. జనాలు ఎక్కువగా కనిపించేందుకు అందరినీ ఒకేవైఉపు తరలించే ప్రయత్నం చేశారు.కానుకల కోసం ఒక్కసారిగా జనాలు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. -
అనుమానాస్పదంగా మమత మృతి.. ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఏమైంది?
మైసూరు: భర్త, అత్తమామల ధన దాహానికి నిండు ప్రాణం బలైంది. కోటి ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన యువతి అర్ధాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. ఈ దారుణం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని హుల్లహళ్ళి గ్రామంలో జరిగింది. మమత (20) అనే వివాహిత యువతి మెట్టినింట వేధింపులతో అనుమానాస్పద రీతిలో శవమైంది. డబ్బు తేవాలని వేధింపులు వివరాలు.. 2021 మార్చిలో మమతకు, ప్రేమచంద్ర నాయకతో పెద్దలు పెళ్లి చేశారు. 30 గ్రాముల బంగారం, రూ. 80 వేల నగదు కట్నంగా ఇవ్వడంతో పాటు పెళ్ళి ఘనంగా జరిపించారు. కొన్ని నెలల తరువాత మమతకు వేధింపులు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భర్త ఆమెను కొట్టేవాడు. అత్త మామ కూడా కొడుక్కే వంతపాడేవారు తప్ప సర్దిచెప్పలేదు. మమత గర్భం దాల్చిందని తెలిసి బలవంతంగా అబార్షన్ చేయించారు. చవితి రోజున ఘోరం విషయం తెలుసుకున్న మమత తల్లిదండ్రులు కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లారు. తరువాత తప్పయిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో భర్త వెంట వెళ్లింది. ఏం జరిగిందో కానీ వినాయక చవితి రోజున ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. వెంటనే భర్త, అత్తమామ, ఇద్దరు ఆడపడుచులు ఇంటి నుంచి పారిపోయారు. తరువాత తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. ఈ నేపథ్యంలో భర్త, అత్తమామలు తన కుమార్తెను హత్య చేశారని మమత తండ్రి శుక్రవారంరోజున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హుల్లహళ్ళి పోలీసులు ప్రేమచంద్ర నాయకతో పాటు అతని తండ్రి శంకరనాయక, యశోద, అనుజ, ప్రేమ అనేవారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
పరామర్శకు వెళ్లి మృత్యుఒడిలోకి.. లిఫ్ట్ రూపంలో మృత్యువు ఎదురైంది!
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని తెలంగాణ ఆసుపత్రిలో దారుణ విషాద చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం కారణంగా ఓ మహిళ మృతిచెందింది. ఆసుపత్రిలోని లిఫ్ట్లోపడిపోయి ఓ మహిళ చనిపోయింది. వివరాల ప్రకారం.. మృతురాలు ప్రమీల.. తెలంగాణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించేందుకు వెళ్లింది. పరామర్శ అనంతరం.. తిరిగి వెళ్లే క్రమంలో ప్రమీల.. ఆసుపత్రిలో ఉన్న బటన్ నొక్కింది. ఈ క్రమంలో లిఫ్ట్ కిందకు రాకుండానే డోర్ తెరుచుకుంది. దీంతో, లిఫ్ట్ వచ్చిందనుకున్న మహిళ అడుగు ముందుకు వేయగానే.. లిప్ట్ గుంతలో పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలు.. కంగారుపడి గట్టిగా అరిచారు. ఈ ప్రమాదంలో ప్రమీల లిఫ్ట్లోనే మృతిచెందింది. -
డాక్టర్ల నిర్లక్ష్యం.. తల్లిని కోల్పోయిన పిల్లలు
తిరువొత్తియూరు: సేలం జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. దీంతో బంధువులు ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించి ప్రైవేట్ ఆస్పత్రికి సీలు వేశారు. వివరాల ప్రకారం.. జలగంఠాపురం సౌరియూర్ ప్రాంతానికి చెందిన భూపతి భార్య సంగీత (28). ఈ దంపతులకు 11 ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సంగీత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి 20 రోజులకు ముందు ఎడప్పాడిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చా రు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన సంగీతకు 2 వారాల తర్వాత తరచూ కడుపునొప్పి రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లా రు. డాక్టర్లు ఆమె కడుపులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి ఆమెకు రెండవ సా రి ఆపరేషన్ చేశారు. తర్వా త ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకున్న సంగీత ఆదివారం అస్వస్థతకు గురైంది. మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లాగా అక్కడ మూడోసారి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉద యం సంగీత ఆమె మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సంగీత చనిపోయిందని ఆరోపిస్తూ.. బంధువులు రాత్రి ధర్నాకు దిగారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో సిబ్బంది లెనిన్ సంగీత మృతదేహాన్ని సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇది కూడా చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి -
బస్సులోనే గుండె పోటు: జగిత్యాలకు చెందిన మహిళ మృతి
సాక్షి, ముంబై: ముంబై నుంచి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పూడూరుకు వెళ్తుండగా మార్గమధ్యలో నే గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది. పుణే లోని పాటస్ ప్రాంతంలో బుధవారంరాత్రి ఈ సం ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొడి మ్యాల మండలం పూడూరుకు చెందిన పెద్ది కేతవ్వ (40) అనే మహిళ ముంబైలో కూలీగా పనిచేస్తుంది. తన కూతురు కల్యాణితో కలిసి బుధవారం శ్రీసాయిపూజా ట్రావెల్స్ బస్సులో ముంబై నుంచి బయలుదేరింది. అయితే అకస్మాత్తుగా కేతవ్వకు గుండెపోటు వచ్చింది. ట్రావెల్స్ యాజమాన్యం ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కూతురికి అప్పగించారు. అనంతరం ఘటన స్థలం నుంచి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కూడా శ్రీసాయిపూజా ట్రావెల్స్ సహాయసహకారాలు అందించింది. మృతురాలి కుమార్తెతోపాటు అంబులెన్స్లో వచ్చి బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ట్రావెల్స్ యజమాని పల్లికొండ తిరుపతి తెలిపారు. ట్రావెల్స్ యాజమాన్యాన్ని, మహేశ్, దుర్గేశ్, మునీందర్, డ్రైవర్ నర్సయ్య, ముహమ్మద్ అందరూ అభినందించారు. చదవండి: (రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం) -
విషాదం: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని సామ్రాట్ అపార్టుమెంట్లో రమ్యకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలనికి చేరుకొని పరిశీలించారు. రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకొన్న గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రమ్యకృష్ణకు వివాహం జరిగి ఐదేళ్లు అవుతోందని, ఆమె భర్త గోపి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. వీరికి కవల పిల్లలు ఉన్నారు. భార్యభర్తలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావంటతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఐదేళ్ల క్రితం వివాహం జరిగిందని, తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు లేవని రమ్యకృష్ణ భర్త గోపి తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కలహాలే కారణమా? వేరే ఇబ్బందులేమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన గప్చుప్
భువనేశ్వర్ : ఆబాలగోపాలం లొట్టలేసుకుని ఆరగించే గప్చుప్ ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. బంగాళదుంప మిశ్రమం కూరిన చిన్న డొల్ల పూరీలో చురచురలాడించే చింతపండు నీరు నింపుకుని గుటుక్కున (గప్చుప్) మింగేయడంలో జరిగిన తొందరపాటు చర్య ఈ ప్రమాదానికి కారణమైంది. సుందరగడ్ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్ పరిధి సరఫ్గడ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ విషాదం జరిగింది. స్థానికురాలైన ఫూలమతి కిషాన్ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్చుప్ ఆమె గొంతు గుండా శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది. భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్చుప్ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు. -
టెక్సాస్ వర్సిటీలో కాల్పుల కలకలం
టెక్సాస్ : టెక్సాస్ యూనివర్సిటీలో సోమవారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించగా, రెండేళ్ల చిన్నారి గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెక్సాస్ ఏఅండ్ఎమ్ యూనివర్సిటీ(కామర్స్)లోని ప్రైడ్ రాక్ రెసిడెన్సీ హాల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.17 గంటలకు కాల్పులు జరిగనట్టు తమకు సమాచారం అందిందని యూనివర్సిటీ పోలీస్ చీఫ్ బ్రయాన్ వాఘన్ మీడియాకు వెల్లడించారు. దీంతో తాము ఘటన స్థలానికి వెళ్లి చూడగా.. ఓ గదిలో ఇద్దరు మహిళలు మృతిచెంది కనిపించారని చెప్పారు. గాయపడ్డ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. అయితే మరణించినవారు యూనివర్సిటీ విద్యార్థుల లేదా బయటి వ్యక్తుల అనేదానిపై వాఘన్ స్పష్టత ఇవ్వలేదు. ప్రైడ్ రాక్ రెసిడెన్సీ హాల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించినట్టు యూనివర్సిటీ అధికారులు ధ్రువీకరించారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు, టీచర్లు బయటకు రావద్దని సూచించారు. అలాగే ఆ రోజుకు మిగతా క్లాసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ కాల్పులు ఎందుకోసం జరిగాయనేది తెలియాల్సి ఉంది. -
దేవుడా.. ఎంతపనిజేస్తివి!
సాక్షి, ఇబ్రహీంపట్నం: కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందాడు.. దీంతో పుట్టింటికి వచ్చింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని తన సర్వస్వంగా భావించి అతడిని అపురూపంగా పోషించుకుంటోంది. ఆ దేవుడు అంతలోనే వారిని చిన్నచూపు చూశాడు. మహిళ తన తల్లి, కుమారుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా మృత్యువు రూపంలో వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆమె మృతిచెందగా కుమారుడు, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. అందరి హృదయాలను ద్రవింపజేసే ఈ విషాదకర ఘటన ఆదివారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చర్లపటేల్గూడ శివార్లలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో నివాసముండే రామిడి పావని(28) తన తల్లి వసంత(55), కుమారుడు లిక్విత్రెడ్డి(10)తో కలిసి స్కూటీపై అమ్మమ్మ ఇల్లు అయిన కర్ణంగూడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో చర్లపటేల్గూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో స్కూటీని వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో పావని అక్కడిక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడు లిక్విత్రెడ్డి, తల్లి వసంతకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. అయితే, పావని అత్తగారిల్లు ఆదిబట్ల. ఆమె భర్త తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో కుమారుడితో కలిసి తల్లి వద్ద నివసిస్తుండేది. ఘటనా స్థలంలో మృతురాలి తల్లి రోదించిన తీరు హృదయ విదారకం. దేవుడా ఎంత పనిజేస్తివి అంటూ గుండెలుబాదుకుంది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కు.ని చికిత్స చేసుకున్న మహిళ మృతి
చెన్నై,తిరువొత్తియూరు: విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకున్న మహిళ హఠాత్తుగా మృతి చెందారు. దీంతో ఆమె బంధువులు ఆగ్రహించి ఆందోళన చేశారు. విక్రవాండి సమీపంలోని తొరవి గ్రామానికి చెందిన కేశవేల్(38) కూలీ కార్మికుడు. అతని భార్య రామాయి (32). ఆమెను గత 10వ తేదీ ప్రసవం కోసం విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు సిజేరియన్ ద్వారా ఆడబిడ్డ జన్మించింది. తరువాత అక్కడ చికిత్స పొందుతున్న రామాయికి కొన్ని రోజులకు ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. దీని తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామాయికి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం గత 20వ తేదీ ముండియంబాక్కంలో వున్న విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్లు చేసిన వైద్యం ఫలించక సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ సంగతి తెలుసుకున్న రామాయి బంధువులు వైద్యు ల నిర్లక్ష్యం వలనే బాలింత మృతి చెందారని ఆరోపిస్తూ ఆసుపత్రికి ముట్టడి చేసి ఆం దోళన చేశారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసు సూపరిన్టెన్డెంట్ జ యకుమార్, డిప్యూటీ పోలీసులు తిరుమా ల్ తదితరులు అక్కడికి చేరుకుని వారిని సమాధానం చెప్పి ఆందోళన విరమింపచేశారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..
ఆనందపురం(భీమిలి): ఆనందపురం మండలం శిర్లపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొండపల్లి గ్రామానికి చెందిన కోన శ్రీనివాసరావు ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. కుటుంబంతో విజయనగరం కంటోన్మెంట్లో నివాసం ఉంటున్నాడు. సింహాచలంలోని బైరవకోనలో దైవ దర్శనానికి శ్రీనివాసరావుతో పాటు అతని భార్య రేణుకాదేవి, వదిన రమణ, తోడల్లుడు చిన రాంబాబు రెండు బైకులపై సోమవారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు. అక్కడ దైవ దర్శనం అనంతరం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శిర్లపాలెం గ్రామం వద్దకు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న కారు ముందు ఉన్న బస్సును ఓవర్ టేక్ చేసి శ్రీనివాసరావు నడుపుతున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటారు బైక్ వెనుక వైపు కూర్చున్న రేణుకాదేవి(37) కిందపడి పోగా వెనక వైపు నుంచి వస్తున్న లారీ ఆమెపై నుంచి వెళ్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ, కారు డ్రైవర్లను ఎస్ఐ శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి బాకురుపాలెం నుంచి శిర్లపాలెం మధ్య రెండు రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆనందపురం–పెందుర్తి రహదారి నుంచి విజయనగరం వెళ్లే ఈ మార్గంలో ఇటీవల వాహన రాకపోకలు ఎక్కువయ్యాయి. అలాగే బాకురుపాలెం, ముకుందపురం, శిర్లపాలెం, ముచ్చర్ల గ్రామాల వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఈ రూట్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఊరంతా షాక్.. మహిళ మృతి
పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్): ఊరంతా షాక్ రావడంతో.. ఓ మహిళ మృతి చెందింది. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటలో శనివారం ఈ సంఘటన చోటుచేసు కుంది. కొత్తపేటకు చెందిన పెద్ద శంకరయ్య, శంకరమ్మల మూడో కూతురు పద్మజ(38)ను పదేళ్ల క్రితం బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన గుంటి నిరంజన్కి ఇచ్చి వివాహం చేశారు. అయితే తల్లిగారింటికి వచ్చిన పద్మజ శనివారం ఉదయం దుస్తులు ఉతికి.. ఇంటి ముందున్న తీగపై ఆరబెడుతుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పద్మజకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పద్మజ భర్త నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు హెడ్కానిస్టేబుల్ కుర్మయ్య తెలిపారు. ఇదే సమయంలో ఊరంతా షాక్ వచ్చిందని, కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సమస్యతో షాక్ వస్తోందని గ్రామస్తులు తెలిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
సుల్తాన్బజార్: ఒడిషాకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెను ఆమె భర్త హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఒడిషాలోని, బరంపురం జిల్లాకు చెందిన దత్తర జైనా కుమార్తె మధుమితకు (26) అదే ప్రాంతానికి చెందిన కాంట్రాక్టు ఉపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్తో 2013లో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది నెలలకే అదనపు కట్నం తేవాలని ప్రశాంత్ భార్యను వేధిస్తుండేవాడు. దీంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లి అతడు అడిగిన డబ్బులు తెచ్చి ఇచ్చింది. భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లి పోవడంతో పెద్దలు పంచాయితీ చేసి కాపురానికి పంపారు. ఈ నెల 13న ఇద్దరూ కలిసి రైలులో నగరానికి వచ్చారు. 14న స్థానిక రంగ్మహల్ చౌరస్తాలోని శ్రీ సాయి రెసిడెన్షియల్ లాడ్జిలో 206 గది అద్దెకు తీసుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. సాయంత్రం బయటికి వెళ్లి భోజనం చేసి లాడ్జికి తిరిగి వచ్చారు. అర్థరాత్రి మధుమిత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆమె భర్త ఆటోలో నాంపల్లి కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై అతను మృతురాలి తండ్రికి సమాచారం అందించడంతో మృతురాలి తండ్రి, మేనమామ కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వచ్చారు. తన కూతురిని ఆమె భర్తే గొంతు నుమిలి హత్య చేసి అనారోగ్యంతో చనిపోయిందని కట్టుకథ అల్లుతున్నాడని ఆరోపిస్తూ వారు అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జూ పార్క్లో కూలిన భారీ వృక్షం.. మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జూపార్కులో చెట్టు నెలకొరగడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు, జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్కు చెందిన నిఖత్ ఫాతిమా (60) కుటుంబ సభ్యులతో కలిసి నెహ్రూ జూలాజికల్ పార్కు సందర్శనకు వచ్చింది. శనివారం సాయంత్రం ఈదురు గాలులకు పెద్ద వర్షం రావడంతో భారీ చెట్టు కూలి నెలకొరిగాయి. జూలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న నిఖత్ ఫాతిమాపై భారీ చెట్టు పడటంతో తీవ్ర గాయాలకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో పాటు మరో 10 మందికి స్వల్ప గాయాలకు గురైనట్లు పోలీసులు, జూపార్కు అధికారులు తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు పార్క్ సందర్శనకు వచ్చిన ఓ సందర్శకురాలు మృతి చెందడం...పదిమందికి పైగా సందర్శకులు గాయాల పాలవడంపై హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూపార్కు డైరెక్టర్ సిదానంద్ కుక్రెట్టి, జూ క్యూరేటర్ క్షితిజాలు జూలో నెలకొరిగిన చెట్ల ప్రదేశాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. గాలివాన దెబ్బకు నేలకూలిన చెట్లు శనివారం సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన గాలి వానకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలాయి.చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరునిలిచిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు 47 చెట్లు కూలినట్లు, 18 ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినట్లు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులందాయి. వాన సమస్యలపై అందిన ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తూ జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు రంగంలోకి దిగి తక్షణ సహాయక చర్యలందించాయి. బహదూర్పురా పోలీస్స్టేషన్, కామినేని ఆస్పత్రి, హైకోర్టు వెనుక భాగంలో, హుస్సేనిఆలం పీఎస్ ముందు, మిశ్రీగంజ్ ఆయా హోటల్, శాలిబండ పీఎస్ వెనుక, హుస్సేనీఆలం హనుమాన్ మందిర్ వద్ద,తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. పాతబస్తీలోని నూర్ఖాన్ బజార్లో కొత్తగా నిర్మించిన భవనం పిట్టగోడ కూలింది. దాంతోపాటు చెట్లు కూడా నేలకొరిగి అక్కడున్న మూడు బైక్లపై పడ్డాయి. ఫలక్నుమా రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో భారీ చెట్టు నేలకూలింది. ఆయా ప్రాంతాల్లో గాయపడ్డవారికి డీఆర్ఎఫ్ బృందాలు ప్రాథమిక వైద్యసేవలందించాయి. జోనల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండి, అత్యవసర ఫిర్యాదులపై క్షేత్రస్థాయి బృందాలు తక్షణ సాయమందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ దానకిశోర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇంజినీర్లకు సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. -
పెళ్లికి వెళ్తూ పరలోకానికి..
శ్రీకాకుళం , కొత్తూరు: బంధువుల వివాహానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన మహిళ.. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో జారి పడి దుర్మరణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన పప్పల లక్ష్మి అలియాస్ అప్పలమ్మ(48) శ్రీకాకుళంలొ జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం కొత్తూరు–శ్రీకాకుళం ఆర్టీసీ బస్సు ఎక్కి డోర్ వద్ద నిలబడింది. కొద్దిసేపటికే కుప్పిలి వాని చెరువు వద్ద ఉన్న మలుపు వద్దకు బస్సు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించేందుకు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో లక్ష్మి ఒక్కసారిగా పట్టుతప్పి బస్సు నుంచి కిందకు జారిపడింది. బలమైన గాయాలు తగలడంతో వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించారు. వైద్యాధికారి శివాజీ పరిశీలించగా అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. లక్ష్మికి భర్త రామారావు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, ఆర్టీసీ బస్సుకు తలుపు వేసి ఉంటే ప్రాణం పోయేది కాదని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. -
ఘోర ప్రమాదం : నలుగురు మహిళల మృతి
జయపురం/మల్కన్గిరి : ఛత్తీస్గడ్లో మావో ప్రభావిత ప్రాంతం దంతేవాడ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. రైల్వే వంతెన పైనుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి... దంతేవాడ ప్రాంతంలోని కుపేర్ గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు కర్రలు(వంట చెరకు) తెచ్చుకునేందుకు పరిసర ప్రాంతాలకు ఆదివారం వెళ్లారు. తిరిగి వీరు మధ్యాహ్నం వేళ కర్రలు పట్టుకుని సంకిని-డాంకిని నదిపై ఉన్న రైల్వే వంతెన పైనుంచి ట్రాక్పై నడుచుకుంటూ గ్రామానికి వస్తున్నారు. వీరు వంతెనకు మధ్యలో ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా గూడ్స్ రైలు వచ్చింది. ఆ సమయంలో వారు వెనక్కి వెళ్లాలో, ముందుకు వెళ్లాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. తప్పించుకునేందుకు వీలులేక రైలుకు దొరికిపోయారు. రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. అయితే మరో ఇద్దరు మహిళలు గూడ్స్ రైలును చూసి ప్రాణాలకు తెగించి నదిలోకి దూకేయడంతో వారి ప్రాణాలు దక్కాయి. దంతేవాడ నుంచి కరళీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు, జవాన్లు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను రైల్వే ట్రాక్ మీద నుంచి వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే మహిళలు రైల్వే వంతెన మీదుగా నడుస్తున్న సమయంలో రైలు రావడంతో వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయారని పోలీసులు చెప్పారు. -
తను లేని జీవితం వద్దు.. నన్నూ చంపేయండి.!
సాక్షి, చెన్నై: తనకు చేస్తున్న మోసాన్ని భరించలేకే అశ్వినిని హతమార్చినట్టు నిందితుడు అళగేశన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అశ్విని లేని జీవితం తనకు వద్దని, తననూ హతమార్చాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, అళగేషన్ను ఉరి తీయాలని అశ్విని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలో ప్రేమోన్మాది అళగేషన్(22) ఘాతకానికి శుక్రవారం అశ్విని(18) బలైన విషయం తెలిసిందే. ప్రజలు చితక్కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అళగేషన్ ఆరోగ్యం శనివారం కుదుట పడింది. దీంతో ఉదయాన్నే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి అతడి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ మేరకు ఆలపాక్కం ధనలక్ష్మి నగర్లో ఉన్నప్పుడు తొలిసారిగా అశ్వినిని చూసినట్టు పేర్కొన్నాడు. కొన్ని నెలలు ఆమె వెంట పడ్డానని, చివరకు తన ప్రేమను తెలియజేయడంతో అంగీకరించిదని తెలిపాడు. రెండేళ్లుగా తాను, అశ్విని ప్రేమించుకుంటున్నామని వివరించారు. ఆమెకు తండ్రి లేడని, తల్లి, సోదరుడు మాత్రమే ఉన్నట్టు చెప్పాడు. అందుకే తాను ఆమెను చదివించేందుకు కష్ట పడుతూ వచ్చానని పేర్కొన్నారు. రెండు లక్షల వరకు ఆమె చదువుల కోసం ఖర్చు పెట్టానని వివరించాడు. అయితే, కాలేజీలో చేరిన అనంతరం తనను ప్రేమించేందుకు తగ్గ అర్హతలు ఉన్నాయా అని అశ్విని ప్రశ్నించడం భరించలేక పోయాయని పేర్కొన్నాడు. ఆమె తల్లి ఒత్తిడి మేరకే అలా చెప్పినట్టు భావించానని, పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలిపాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదని భావించి ఆమెను హతమార్చిన మరుక్షణం తాను ఆత్మాహుతి చేసుకోవాలన్న లక్ష్యంతోనే కేకేనగర్కు వెళ్లడం జరిగిందన్నారు. అయితే, తనను అక్కడి జనం పట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఇప్పుడు తనను చంపేయాలని లేకపోతే ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. అశ్విని లేని జీవితం తనకు వద్దు అని బోరున విలపించాడు. బయటకు వచ్చిన ఫిర్యాదు : గత నెల 16వ తేదీన అశ్విని మధురవాయిల్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు తాజాగా బయట పడింది. తాను అళగేషన్ ప్రేమించుకున్నట్టు వివరించిన అశ్విని, ఇప్పుడు అతడికి ఎలాంటి అర్హతలు లేదు అని, అందుకే దూరం పెట్టినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొని ఉండడం గమనార్హం. ఈ సమయంలో పోలీసులు అళగేషన్కు బాగానే దేహశుద్ధి చేశారు. స్థానిక పెద్దల జోక్యంతో అళగేషన్ను హెచ్చరించి పంపించారు. అయితే, తనకు జరిగిన అవమానం, తనను మోసం చేసే విధంగా అశ్విని వ్యవహరించడాన్ని భరించ లేక హతమార్చి తీరాలన్న భావనతో వచ్చి తన పంతాన్ని అళగేషన్ నెగ్గించుకున్నాడు. తనకు దూరం అవుతున్న అశ్వినికి బలవంతంగా ఆ ప్రేమోన్మాది తాళి కట్టడం, దానిని ఆమె తెంచి పడేయడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుని ఉండడం గమనార్హం. అళగేశన్ను చూసి భయపడి : కళాశాల గేటు వద్ద మిత్రులతో కలిసి బయటకు వచ్చిన అశ్విని సమీపంలో నక్కి ఉన్న అళగేషన్ను గుర్తించింది. మిత్రులతో కలిసి వెళ్లి ఉంటే ప్రాణాల్ని దక్కించుకునేదేమో. ఎక్కడ అళగేషన్ తన ముందుకు వస్తాడోనన్న భయంతో పక్కనే ఉన్న మరో వీధి వెంట పరుగులు తీసింది. దీన్ని గుర్తించిన కిరాతకుడు వెంట పడి మరీ ఆమె గొంతులో కత్తిని దించి హతమార్చాడు. ఈ హఠాత్పరిణామాన్ని అక్కడే ఉన్న కొందరు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపు ఆమె విగతజీవిగా మారింది. అళగేషన్ వేధింపుల నేపథ్యంలో ప్రతిరోజూ తానే అశ్విని ఇంటికి తీసుకొచ్చే వాడిని అని, శుక్రవారం కాస్త ఆలస్యం కావడంతో ఆమెను పోగొట్టుకున్నట్టు ఆమె పెదనాన్న సంపత్ ఆవేదన వ్యక్తంచేశారు. అశ్విని చదువులకు తానేదో లక్షలు ఖర్చు పెట్టినట్టుగా నిందితుడు పేర్కొనడాన్ని ఆమె తల్లి శంకరి ఖండించారు. తాను అనేక ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ కుమార్తెను, కుమారుడ్ని చదివిస్తున్నట్టు వివరించారు. ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం అనంతరం అశ్విని మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. నిందితుడ్ని ఉరి తీయాలని, అప్పుడే మృతదేహాన్ని తీసుకుంటామని పట్టుబట్టారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బుజ్జగించారు. దీంతో మృతదేహాన్ని తీసుకున్న కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. -
చెన్నైలో మృగోన్మాదం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఇక్కడి మధురవాయల్కు చెందిన అశ్వని(18) స్థానికంగా ఓ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన అళగేశన్(22) అనే యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు తనను తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపంతో ఇంట్లోకి చొరబడి తాళి కట్టాడు. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అళగేశన్ జైలు పాలయ్యాడు. ఇటీవల బెయిల్పై బయటికొచ్చి మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఉంచి 10 రోజులు కాలేజీకి పంపలేదు. 8 నుంచి అశ్వనీ కళాశాలకు వస్తోందని తెల్సుకుని శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. వదిలేయమని బతిమాలుతున్నా వినకుండా కత్తితో నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు కోశాడు. దీంతో అశ్వని గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. పరారయ్యేందుకు యత్నించిన అళగేశన్ను స్థానికులు పట్టుకుని చితకబాదడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కేకే నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు తీర్చమంటే ఆహుతి చేశారు
సాక్షి, ఆసిఫాబాద్/బెజ్జూరు: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకు ఓ దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు! ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ మహిళ మరణించింది. ఈ దారుణ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామానికి చెందిన దుర్గం స్రవాంతబాయి(45) భర్త తిరుపతి ఆరేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు శంకర్, చిన్న కొడుకు శ్రీనివాస్ హైదరాబాద్లో చదువుకుంటున్నారు. రెండో కొడుకు దాసుతో కలిసి మర్తిడిలో కూలి పనులు చేసుకుంటూ స్రవాంతబాయి జీవనం సాగిస్తోంది. నాలుగేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన కామెర దుర్గయ్య కుమార్తె వివాహం సందర్భంగా అతడికి రూ.47 వేలు అప్పుగా ఇచ్చింది. గత కొన్ని రోజులుగా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా.. దుర్గయ్య జాప్యం చేస్తూ రావడంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. అర్ధరాత్రి ముగ్గురు వెళ్లి.. అప్పు తీర్చమన్నందుకు స్రవాంతబాయిపై దుర్గయ్య కక్ష పెంచుకున్నాడు. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మండల కోఆప్షన్ సభ్యుడు బసరాత్ఖాన్, దుర్గయ్య భార్య చాలుబాయి, కొడుకు సాయి మంగళవారం అర్ధరాత్రి స్రవాంతబాయి ఇంటికి వెళ్లారు. నిద్రిస్తున్న ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కుటుంబీకులు 100కు ఫోన్ చేశారు. బెజ్జూరు ఎస్సై శివప్రసాద్ 108 ద్వారా బాధితురాలిని సిర్పూర్(టి)లోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఉన్న ఆమె నుంచి సిర్పూర్(టి) జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ రామారావు సమక్షంలో పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. బసరాత్ఖాన్, చాలుబాయి, సాయి కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు మరణ వాంగ్మూలంలో ఆమె వెల్లడించింది. తర్వాత మెరుగైన వైద్యం కోసం వరంగల్కు తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే చనిపోయింది. మృతురాలి కుమారుడు దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 25న మృతురాలి ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. పిల్లలు అనాథలయ్యారు ఇన్నాళ్లు నా చెల్లె తన కొడుకులను తండ్రి లేకపోవడంతో ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు ఎవరూ లేని వారు అనాథలయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. – జుండే తుకారాం, మృతురాలి అన్న కాంగ్రెస్, దళిత నాయకుల ధర్నా స్థానిక కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాలు, స్రవంతాబాయి బంధువులతో కలిసి మృతదేహంతో సిర్పూర్(టి) ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మృతురాలి ఇల్లు దహనం చేసింది కూడా వారేనని ఆరోపించారు. స్రవాంతబాయి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అధికార పార్టీ నాయకులు కావడంతో పట్టించుకోలేదని ఆరోపించారు. సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. దీనిపై పోలీసులను వివరణ అడగ్గా.. అలాంటిదేమీ లేదన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యమే..
కోరుట్ల: వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత లత, అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయారని బాధిత కుటుంబీకులు శుక్రవారం ఉదయం కోరుట్ల ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. లత మృతికి కారకులను శిక్షించాలని కోరారు. సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను శిక్షిస్తామని డీఎంహెచ్వో సుగంధిని హామీ ఇచ్చారు. వివరాలు బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం. కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన గర్భిణి లత ప్రసవం కోసం గురువారం రాత్రి ఆస్పత్రికి వచ్చారు. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పిన వైద్యురాలు శ్రీలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోయారని, తర్వాత కాంపౌండర్లు పట్టించుకోలేదని మృతురాలి భర్త శ్రీనివాస్, పోసానిపేట సర్పంచ్ గంగారెడ్డి, గ్రామస్తులు ఆరోపించారు. అప్పుడే పుట్టిన పసికందు చనిపోయిందని తెలిసి షాక్కు గురైన లతను ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఆలస్యంగా వైద్యులు స్పందించారని, అప్పటికే పరిస్థితి విషమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. లతతోపాటు పసికందు మృతికి వైద్యులే కారణమని వారు ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న కోరుట్ల, కథలాపూర్ తహసీల్దార్లు సత్యనారాయణ, మధు, సీఐ సతీష్చందర్రావు, ఎస్సైలు రవికుమార్, జాన్రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. డీఎంహెచ్వో వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అదే సమయంలో డీఎంహెచ్వో సుగంధిని ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులను శిక్షిస్తామని, మృతురాలి భర్త శ్రీనివాస్కు ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని డీఎంహెచ్వో సుగంధిని హామీ ఇచ్చారు. లత పిల్లల చదువుకు సాయం చేస్తామని, అంత్యక్రియలకు రూ.10వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మైలవరం: కృష్ణాజిల్లా మైలవరం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో పాటు ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మైలవరం నుంచి ఆటోలో 11 మంది వ్యక్తులు పుల్లూరు చర్చిలో ప్రార్థనలో పాల్గొనేందుకు వెళుతుండగా భద్రాచలం నుంచి మైలవరం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా ఆటో డ్రైవర్ను విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మైలవరం నుంచి సొంత ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మండలంలోని పుల్లూరు గ్రామంలో ప్రార్థనలో పాల్గొనేందుకు 30వ నంబర్ జాతీయ రహదారిపై వెళుతుండగా వేగంగా వస్తున్న కారు స్థానిక దర్గా సమీపంలో ఆటోను ఢీకొట్టింది. ఆటో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి రోడ్డు మధ్యకు రావడంతో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టిందని ప్రమాద స్థలంలో ఉన్న వారు తెలిపారు. మృతి చెందిన వారు మైలవరానికి చెందిన సగ్గుర్తి లత (40), గరికపాటి నాగమణి (25), మందా రాజేశ్వరి (17), గరికపాటి నాగేశ్వరరావు (34) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో మందా రూతమ్మ, పల్లెపోగు కన్యాకుమారి, పల్లెపోగు జన్ని, గరికపాటి యశస్విని, సగ్గుర్తి సుశీల, కటారపు రాణి, పల్లెపోగు జెస్సి ఉన్నారు. స్వల్పంగా గాయపడిన వారిలో కారులో ప్రయాణిస్తున్న షేక్ రసూల్, లావూడియా మనోహర్, ముత్యాల సతీష్, డి. రాహుల్, బుద్దా ప్రవీణ్ ఉన్నారు. కాగా పాల్వంచ నుంచి ఐదుగురు వ్యక్తులు గన్నవరం విమానాశ్రయానికి వారి బంధువును తీసుకువచ్చేందుకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. -
బాత్రూమ్ పైకప్పు కూలి..
కర్నూలు, కల్లూరు (రూరల్) : బాత్రూం పైకప్పు కూలి పాత కల్లూరులో ఓ మహిళ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.. పాతకల్లూరులోని చెంచునగర్లో చెంచు పెద్దక్క(27) మంగళవారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూం వెళ్లింది. ఈక్రమంలో బాత్రూం పైకప్పు కూలింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భర్త వెంటనే అక్కడి చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి నాలుగేళ్ల కూతురు ఉంది. పెద్దక్క మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత పరామర్శించారు. ఈమె కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రైలు నుంచి జారిపడి మహిళ దుర్మరణం
బిక్కవోలు (అనపర్తి) : గ్రామంలోని రాజారావుపేటకు చెందిన సిరికి సత్యవతి(45) రైలు నుంచి జారిపడి దుర్మరణం పాలైనట్టు బంధువులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున పాస్ట్ప్యాసింజర్ రైలులో సత్యవతి కుటుంబ సభ్యులతో కలసి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల దైవదర్శనానికి వెళ్ళింది. స్వామి దర్శనానంతరం తిరిగి సాయంత్రం కాకినాడ ప్యాసింజర్లో బిక్కవోలు బయలుదేరారు. భీమడోలు స్టేష¯ŒSకు వచ్చిన వారు రద్దీగా ఉన్న రైలు ఎక్కబోతుండగా రైలు కదిలిపోయిందని దీంతో చివరి మెట్టుపై ఉన్న సత్వవతి జారి కిందపడి రైలుకు ప్లాట్ఫాంకు మధ్యలో నుంచి పట్టాల పైకి జారిపోవడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఏలూరు రైల్వే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు బంధువులు తెలిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
మృతురాలి కుమార్తె సమాచారంతో విషయం వెలుగులోకి పెద్దాపురం : సాధారణ మరణంగా భావించి ఖననం చేసిన ఓ మహిళ మృత దేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం శనివారం వెలికితీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సంగటాల మహాలక్ష్మి, నర్సయ్యమ్మలు తమ కుమార్తె సంగటాల వరలక్షి్మని 2006లో అమలాపురానికి చెందిన అమలదాసు రాజ్కుమార్కు ఇచ్చి వివాహం చేశారు. అడ్డతీగల అటవీ రేంజ్ చవిటిదిబ్బల ఫారెస్ట్ గార్డుగా పనిచేస్తున్న రాజ్కుమార్ అక్కడే భార్యతో కలసి జీవిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ 24న వరలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిందంటూ రాజ్కుమార్ భార్య మృత దేహాన్ని అత్తవారింటికి పంపే శాడు. కుమార్తె మృతి చెందిందన్న శోకంలో ఉన్న తల్లిదండ్రులు, బంధు వులు తదుపరి కర్మకాండలు పూర్తి చేశారు. రెండు రోజుల తరువాత అమ్మ ఎలా చనిపోయిందని వరలక్ష్మి కుమార్తెను పెద్దలు అడగ్గా నాన్న కొట్టాడని ఆ చిన్నారి సమాధానం ఇచ్చింది. దీంతో వరలక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు అడ్డతీగల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై యర్రంశెట్టి గణేష్కుమార్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం పెద్దాపురం తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎస్సై గణేష్కుమార్, హెచ్సీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరలక్ష్మి మృత దేహాన్ని స్థానిక బంగారమ్మ గుడి వీధికి చెందిన శ్మశాన వాటిక నుంచి వెలికితీయగా, వైద్యులు విజయ్మోహన్, ప్రశాంతి శవ పంచనామా చేశారు. -
నిర్లక్ష్యంతోనే నా భార్యను చంపేశారు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : నిర్లక్ష్యంతో తన భార్యను చంపేసారని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆరోపించాడు. కోలమూరుకు చెందిన కె.వెంకటరమణమ్మ(50) చికిత్సపొందుతూ మృతి చెందడంతో ఆసుపత్రి వద్ద కుటింబీకులు, బంధువులు మంగళవారం ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు...రాజమహేంద్రవరం రూరల్ కోలమూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కె.వెంకటేశ్వరావు భార్య వెంకటరమణమ్మ కొంతకాలంగా ఆయాసంతో బాధపడుతోంది. ఆమెను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు గుండెలో వాల్వ్ పాడైందని చెప్పారు. వారు అక్కడ నుంచి తిరిగి ఆర్టీసీ డిపోలో ఉండే సంస్థ వైద్యురాలికి విషయం తెలిపారు. ఆమె సంస్థ తరపున వైద్యం చేయించేందుకు దానవాయిపేటలోని కమలాకర్ హార్ట్కేర్కు మాత్రమే వెసులుబాటు ఉందని చెప్పడంతో గత నెల 25న కమలాకర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు 29న వాల్్వకు సంబంధించి ఆపరేష¯ŒS చేశారు. తర్వాత ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. తిరిగి ఆమెకు ఆయాసం రావడంతో వేరే ఆసుపత్రికి మార్చాలని చెప్పారని, మళ్లీ ఎందుకో ఆసుపత్రి మార్చకుండా ఆ వైద్యులే ఇక్కడికి వస్తారని తాత్సారం చేసినట్టు భర్త వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో ఆమెకు పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతిచెందింది. విషయాన్ని కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో వారు వైద్యుని నిలదీసారు. దీనిపై ఆసుపత్రి ఎదుట ఆందోళనచేపట్టి ధర్నా చేశారు. తన భార్య మృతికి బ్రెయి¯ŒSస్ట్రోక్, పక్షవాతం, ఊపిరితిత్తుల సమస్య ఇలా పొంతనలేని కారణాలు చెబుతున్నారన్నారు. విషయం తెలిసిన ప్రకాశ్నగర్ పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతోను, డాక్టర్తోను మాట్లాడారు. జరిగినదానిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ రోగి పరిస్థితి బాగానే ఉందని, అయితే వాల్వ్ ఆపరేష¯ŒS చాలా క్లిష్టమైందని, సర్జరీ తర్వాత రోగి కోలుకునే శరీరం సహకరించడం బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. -
మత్యువుతో పోరాడి ఓడింది
అపస్మాకరస్థితిలోని మహిళ మృతి వీడని మిస్టరీ రాజమహేంద్రవరం క్రైం : రాజమహేంద్రవరంలోని రైల్వేక్వార్టర్స్లో అపస్మారక స్థితిలో లభించిన మహిళ కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందింది. ఈనెల ఏడోతేదీన రైల్వేకార్టర్లోని ఓ గదిలో చేతులు కట్టివేసిన స్థితిలో ఆమె కనిపించింది. క్వార్టర్ను శుభ్రం చేయడానికి వెళ్లిన స్వీపర్లు.. ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కాకినాడకు తీసుకువెళ్లారు. ఆమె వైద్యచికిత్స పొందుతూ మృతి చెందింది. వీడని మిస్టరీ పేపర్లలో వచ్చిన వార్తను చూసి ఆమె బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వారి చెప్పిన వివరాల ప్రకారం.. ఆలమూరు మండలం పెద్దపళ్ల గ్రామానికి చెందిన చిలుకూరి భవాని గత నెల 30న బాకీలు వసూలు చేసుకొని వస్తానని చెప్పి మండపేట వెళ్లింది. అనంతరం ఆమె ఆచూకీ లభించలేదు. ఈనెల 7న రాజమహేంద్రవరం రైల్వేక్వార్టర్లలో అపస్మారకస్థితిలో లభించింది. గత నెల 30వ తేదీ నుంచి ఈనెల 7వ తేదీ వరకు ఆమె ఏమైందో, ఎలా రాజమహేంద్రవరం వచ్చిందో తెలియలేదు. పలు అనుమానాలు ఇప్పటి వరకు ఈ కేసులో ఎవ్వరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. భవానీని మండపేట నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చారా లేక రాజమహేంద్రవరం వచ్చిన తరువాత కిడ్నాప్ చేసి రైల్వే క్వార్టర్లలో బంధించారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువరోజులు బంధించి ఉండడంతో అవయవాలు పనిచేయడం మానేసి కోమాలోకి వెళ్లిపోయింది. ఆ స్థితిలోనే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. మెదడులో నరాలు దెబ్బతినడంతో పాటు చాలా రోజులు ఆహారం, నీరు అందక డీ హైడ్రేషన్తో ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెబుతున్నారు. భవానీ మృతికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు, రైల్వే క్వార్టర్లలో ఎప్పుడు బంధించారు, ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో తెలియదు. ఇప్పటికే పోలీసులు ఆమె బంధువులను, అనుమానితులను ప్రశ్నించారు. రాజమహేంద్రవరానికి చెందిన జ్యోతిషుడిని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. -
పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి
చేర్యాల : పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని ఆకునూరులో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆకునూరు గ్రామానికి చెందిన తాటికొండ బొందమ్మ(50) వ్యవసాయ కూలీకి వెళ్లి ఇంటికి తిరుగుపయనమైంది. ఈ క్రమంలో ఆమె ఆకునూరులోని గంగమ్మ గుడి సమీపంలోని పెద్దవాగులో నుంచి వస్తుండగా సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త వెంకటస్వామి, కుమార్తె ఉన్నారు. ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, మాజీ సర్పంచ్ లావణ్యరఘువీర్, పల్లె కనకయ్య, శనిగరం నరేందర్, ఎండీ.హైమత్, మోంటె ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఊపిరి ధారపోసి..
కుటుంబ పోషణకు సౌదీ వెళ్లిన కొత్తపేట వాసి నిర్జీవంగా తిరిగొచ్చి.. కుటుంబానికి మిగిల్చిన విషాదం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. బిడ్డలు ఎదుగుతున్నారు. వారికి మంచి జీవనాన్ని అందించాలి. ఇదే ఆమెను నిత్యం వేధిస్తున్నాయి. దీంతో ఓ నిర్ణయానికి వచ్చింది. కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే.. పొట్టకూటి కోసం విదేశానికి వెళ్లాలని సంకల్పించింది. ఏడాది క్రితం సౌదీ వెళ్లిన ఆమె నిర్జీవమై స్వగ్రామానికి తిరిగొచ్చింది. ఆ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. – కొత్తపేట కొత్తపేట శివారు రామారావుపేటకు చెందిన కముజు విమలకు భర్త అర్జునరావు, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గత ఏడాది జూన్ 15న ఉపాధి కోసం సౌదీ వెళ్లింది. ఆరు నెలల పాటు భర్తకు సక్రమంగానే సొమ్ము పంపించింది. ఏమైందో, ఏమో తర్వాత నుంచి డబ్బు పంపలేదు. ఈ ఏడాది జూన్ 16న అర్జునరావు ఆమె పనిచేసే ఇంటి యజమానికి ఫోన్లో ఆరా తీశాడు. ‘విమల మాకు పనిచేయదు. ఇండియాకు పంపించేస్తున్నాం’ అని ముక్తసరిగా సమాధానం చెప్పారు. అయినా విమల తిరిగి రాలేదు. ఆమెకు ఏమైందో, ఎక్కడుందో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఇలాఉండగా ఈ నెల 2న స్థానిక తహసీల్దార్ వచ్చి.. ‘ఆమె చనిపోయిందట, మృతదేహం వచ్చిందా?’ అని అడిగారు. దీంతో విమల కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎట్టకేలకు విమల మృతదేహం శుక్రవారం రాత్రి కొత్తపేటకు చేరుకుంది. అనారోగ్యంతో మరణం! ఇలాఉండగా విమల మృతిపై సందిగ్ధత నెలకొంది. అదే గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ములగలేటి బంగారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జూన్ 16న విమలను సౌదీ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కించగా, దుబాయ్లో మరో విమానం మారాల్సి ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో దిగాక విమల అనారోగ్యానికి గురికావడంతో, అక్కడి సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందాక ఆమె మరణించింది. అప్పటి నుంచి ఆమె మృతదేహం అక్కడే మార్చురీలో ఉంది. విచారణ అనంతరం ఆమె మృతదేహాన్ని శుక్రవారం విశాఖపట్నం ఎయిర్పోర్టుకు తరలించగా, అక్కడి నుంచి కొత్తపేటకు పంపించారు. కుటుంబ సభ్యుల రోదనలు ‘మా కోసం ఉపాధికి వెళ్లి తిరిగిరాకుండా పోయావా’ అంటూ విమల కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఇక్కడ కూలీ పనిచేసే విమల తన కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం దేశం విడిచి వెళ్లిందని, స్వదేశానికి చేరకుండానే చనిపోయిందంటూ స్థానికులు విచారం వ్యక్తం చేశారు. -
పంట కాల్వలో పడి యువతి మృతి
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు నల్లూరు (కపిలేశ్వరపురం) : ఓ పక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన యువతి కాకి సుబ్బలక్ష్మి (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తోడబుట్టిన సోదరుడే పంట కాల్వలోకి తోసేయడంతో ఆమె చనిపోయిందంటూ మరో సోదరుడు ఫిర్యాదు చేయడంతో సోమవారం అంగర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎస్సై కె.దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం... సుబ్బలక్ష్మి మండపేటలోని ఓ ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హైదరాబాద్లో ఉంటున్న ఆమె సోదరుడు కాకి రాంబాబు వేలిముద్రల ఫీడింగ్ నిమిత్తం ఇటీవల నల్లూరు వచ్చాడు. మరో సొదరుడు కాకి సత్యనారాయణ ఆలమూరు మండలం చింతలూరులో నివాసం ఉంటున్నాడు. రాంబాబు అక్కడకు వెళ్లి ఆర్థిక వ్యవహారాలను చర్చిస్తూ తగవు పడ్డాడు. సోదరి సుబ్బలక్ష్మికి పెళ్లి చేయాల్సి ఉన్నందున బాధ్యతగా ఉండాలని రాంబాబును అన్న సత్యనారాయణ మందలించాడు. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం సుబ్బలక్ష్మి మండపేట నుంచి చింతలూరులోని సోదరుడు ఇంటికి వచ్చింది. రాంబాబు తనను తరచూ కొడుతున్నాడని చెప్పగా ధైర్యం చెప్పి నల్లూరులోని తల్లి వద్దకు వెళ్లమని పంపించాడు. విషయం తెలుసుకున్న రాంబాబు చింతలూరులో ఆటో కోసం ఎదురుచూస్తున్న సోదరి సుబ్బలక్ష్మితో గొడవ పడ్డాడు. ఇద్దరూ నల్లూరు వెళ్లేందుకు ఆటో ఎక్కి వెదురుమూడిలో దిగారు. వంతెన వద్దకు వచ్చే సరికి రాత్రి సమయంలో సుబ్బలక్ష్మి పంట కాల్వలో పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కాలేరు గ్రామ శివారులో సోమవారం మృతదేహం లభ్యమైంది. ఎస్సై కె.దుర్గాప్రసాద్ శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఆచూకీ కనిపించడం లేదంటూ కేసు నమోదు చేసిన పోలీసులు సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు రాత్రి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. చిన్న వయస్సులోనే ఇళ్లల్లో పనిచేసుకుంటూ తమకు చేదోడు వాదోడుగా ఉంటున్న సుబ్బలక్ష్మి మృతిని ఆమె తల్లి తట్టుకోలేకపోతూ రోధిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది. -
అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి
-
అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో సామూహిక అత్యాచార యత్నానికి గురైన బాధితురాలు ఫాతిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మృత్యువుతో పోరాడుతూ ఈరోజ ఉదయం కన్నుముసింది. సీతాఫల్మండి చిలకలగూడకు చెందిన ఫాతిమాను గత నెల 29న నలుగురు యువకులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే.