YSR Kanti Velugu
-
వరంగా జగనన్న ఆరోగ్య సురక్ష
-
వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడతపై దృష్టి
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడతను ఈ ఏడాది మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్దేశించుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అదనంగా స్క్రీనింగ్ బృందాలను సమకూర్చడం లాంటి అంశాలపై దృష్టి సారించారు. సామూహిక కంటి పరీక్షల ద్వారా 5.60 కోట్ల మంది ప్రజల్లో నేత్ర సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరు దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించే ప్రణాళిక రూపొందించారు. తొలి రెండు దశల్లో ఇలా తొలి రెండు దశల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి సమస్యలు గుర్తించేందుకు స్క్రీనింగ్ నిర్వహించారు. నేత్ర సమస్యలతో బాధపడుతున్న 1,58,227 మందికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసింది. 310 మంది విద్యార్థులకు కేటరాక్ట్ సర్జరీలు చేశారు. కంటి వెలుగు ద్వారా అత్యధికంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఇతర విద్యార్థుల్లో ఓసీలు 14.42 లక్షలు, ఎస్సీలు 13.17 లక్షలు, ఎస్టీలు 4.50 లక్షల మంది ఉన్నారు. మూడో విడతలో 56.88 లక్షల మందికి స్క్రీనింగ్ రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించేలా మూడో విడత కార్యక్రమాన్ని 2020 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకూ 22,91,593 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 10,91,526 మందికి మందుల ద్వారా నయం చేయవచ్చని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 10,21,007 మందికి కళ్లద్దాలు అవసరం కాగా 8.50 లక్షల మందికి పంపిణీ పూర్తైంది. 1,66,385 మంది వృద్ధులు శుక్లాలతో బాధ పడుతున్నట్టు గుర్తించి ఉచితంగా సర్జరీలు నిర్వహిస్తోంది. వేగంగా పూర్తయ్యేలా అదనపు బృందాలు వృద్ధులందరికి కంటి పరీక్షలు వేగంగా పూర్తి చేసేలా ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నాం. మే నెలాఖరులోగా మూడో విడత పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాం. ఐదు నెలల్లో 33.96 లక్షల మంది స్క్రీనింగ్కు వీలుగా అదనపు బృందాలను నియమిస్తాం. పీఎంవోవో/పీఎంవోఏ రోజుకు 60 మందిని స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు స్క్రీనింగ్, కళ్లద్దాల పంపిణీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలో రోజువారి స్క్రీనింగ్ కార్యక్రమాలను పర్యవేక్షించాలి. – డాక్టర్ యాస్మిన్, డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు రాష్ట్ర ప్రత్యేకాధికారి -
అవ్వాతాతల కంటికి వెలుగు
సాక్షి, అమరావతి: మలిసంధ్యలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ‘డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం చూపు ప్రసాదిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 60ఏళ్లు పైబడిన వృద్ధులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు, కళ్లద్దాలు అందించడంతో పాటు, కేటరాక్ట్ సర్జరీలు ఉచితంగా చేస్తోంది. రాష్ట్రంలోని 5.60 కోట్ల మందికి కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ 2019 అక్టోబర్ 10న శ్రీకారం చుట్టారు. ఆరు దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు, 300 మందికి పైగా పిల్లలకు సర్జరీలు చేశారు. 22.16 లక్షల మందికి పరీక్షలు ఇక మూడో దశలో.. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరిలో ఇప్పటివరకూ 22,16,031 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో 10,42,457 మందికి మందుల ద్వారా నయమయ్యే సమస్యలున్నట్లు గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 10,01,049 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 8,31,584 మందికి పంపిణీ పూర్తయింది. అలాగే, 1,69,105 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య బృందాలు గుర్తించి వీరికి ప్రభుత్వమే ఉచితంగా కేటరాక్ట్ సర్జరీలు చేపడుతోంది. ఈ కార్యక్రమ నిర్వహణలో ఉమ్మడి విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 1.52 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 53.72 శాతం మందికి పూర్తయ్యాయి. అలాగే, 50.88 శాతం మందికి పరీక్షలు నిర్వహించి ఉమ్మడి వైఎస్సార్, 50.66 శాతంతో శ్రీకాకుళం జిల్లాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ ఆస్పత్రులు వెరీ పూర్ కేటరాక్ట్ సర్జరీల నిర్వహణలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తుంటే, మరికొన్ని ఆస్పత్రుల్లో అంతంతమాత్రంగానే సర్జరీలు జరుగుతున్నాయి. డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులను పరిశీలిస్తే.. ఈనెల 15 నుంచి 21 మధ్య వారం రోజుల్లో 41 సర్జరీలతో విశాఖపట్నం రీజనల్ కంటి ఆస్పత్రి తొలిస్థానంలో ఉంది. కర్నూలు రీజినల్ కంటి ఆస్పత్రిలో 35 సర్జరీలు, గుంటూరు జీజీహెచ్లో 30 సర్జరీలు నిర్వహించారు. మరోవైపు.. ఎనిమిది మంది సర్జన్స్ ఉన్నప్పటికీ అనంతపురం జీజీహెచ్లో ఒక్క సర్జరీ కూడా నిర్వహించలేదు. ఇక వైద్య విధాన పరిషత్ విభాగంలో.. ఏలూరు జిల్లా ఆస్పత్రి 61 సర్జరీలు నిర్వహించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఇదే విభాగంలోని గూడూరు, రామచంద్రాపురం, నరసరావుపేట, పాలకొల్లు, తణుకు, పాడేరు ఏరియా ఆస్పత్రులు, మార్కాపురం జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల్లో ఒక్క సర్జరీ కూడా నిర్వహించలేదు. ఉచితంగా ఆపరేషన్ చేశారు నేను చేనేత కార్మికుడిని. కంటిచూపు మందగించడంతో కంటి వెలుగు కింద ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తోందని తెలిసింది. మా గ్రామంలో శిబిరం ఏర్పాటుచేసినప్పుడు పరీక్ష చేయించుకున్నాను. శుక్లాలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వం ఇటీవలే కంటికి ఉచితంగా ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు బాగా కనిపిస్తోంది. – సీహెచ్ మల్లికార్జునరావు, వీరులపాడు, ఎన్టీఆర్ జిల్లా వేగంగా పూర్తిచేయడానికి చర్యలు వృద్ధులందరికీ కంటి పరీక్షలు వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారం వారం కార్యక్రమంపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. మందకొడిగా పరీక్షలు, సర్జరీలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. – డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి, ప్రజారోగ్య సంచాలకులు -
మలిసంధ్యలో ‘వెలుగు’రేఖ
సాక్షి, అమరావతి: చూపు లేకపోతే లోకమంతా చీకటే. చూపు కొద్దిగా మందగించినా జీవనం కష్టమవుతూ ఉంటుంది. అందుకే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతాంశాల్లో రాష్ట్ర ప్రజల కంటి చూపు పరిరక్షణకు కూడా చోటిచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019 అక్టోబర్ 10న శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం పిల్లలు, వృద్ధులకు వరమే అయింది. ఆరు దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలను పరీక్షించారు. వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షల లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో మూడో దశ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వడివడిగా జరుగుతోంది. 361 వైద్య బృందాలు నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రోజుకు సగటున 2,500 మందికి పరీక్షలు చేస్తున్నారు. సుమారు 900 కేటరాక్ట్ (శుక్లాలు) ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటివరకు 33.90 శాతం అంటే 19,28,511 మంది వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో చిన్న సమస్యలు ఉన్న 8,51,772 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 9,22,373 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 7,90,704 మందికి ఉచితంగా పంపిణీ పూర్తయింది. 1,54,366 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య బృందాలు గుర్తించాయి. వీరిలో 1,44,476 మందికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ సర్జరీలు చేయించింది. సెప్టెంబర్లోగా వృద్ధులందరికీ పరీక్షలు పూర్తి కంటి వెలుగు వైద్య పరీక్షలు, సర్జరీల్లో వేగం మరింతగా పెంచుతాం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వృద్ధులందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, రాష్ట్ర అంధత్వ నివారణ జేడీ, కంటివెలుగు సంస్థ రూపాయి ఖర్చు లేకుండా వయసు పైబడటంతో కంటి చూపు మందగించింది. ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కింద మా పీహెచ్సీలో గత ఏడాది ఉచితంగా కంటి పరీక్షలు చేసింది. ఉచితంగా ఆపరేషన్ చేశారు. తర్వాత కళ్లద్దాలు ఇచ్చారు. ప్రస్తుతం బాగా కనిపిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారు. నాలాంటి ఎంతో మంది పేదలకు ఆర్థిక భారం లేకుండా చీకట్లు తొలగిస్తున్నారు. – గోపిశెట్టి బ్రహ్మయ్య, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా -
AP: వృద్ధులకు వరం.. ‘వైఎస్సార్ కంటి వెలుగు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం వరంగా మారింది. ఈ కార్యక్రమం కింద 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని వృద్ధులందరి కంటిచూపు సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ 13 జిల్లాల్లోని 378 వైద్యబృందాలు ఇప్పటివరకు 15,64,710 (అర్హుల్లో 27.51 శాతం) మందికి కంటిపరీక్షలు చేశాయి. 6.04 లక్షల మందికి మందుల ద్వారా నయం అయ్యే సమస్యలున్నట్లు గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 8,23,264 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 5,33,789 మందికి ఇచ్చారు. వైఎస్సార్ కంటివెలుగు పథకం మొదటి రెండు దశల్లో విద్యార్థులకు కంటిపరీక్షలు చేశారు. మొత్తం 70.36 లక్షల మంది (మొదటిదశలో 66 లక్షల మంది, రెండోదశలో 4.36 లక్షల మంది) విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించారు. 796 ఆపరేషన్లు చేసిన మచిలీపట్నం వైద్యుడు భాస్కర్రెడ్డి రాష్ట్రంలో 1,27,632 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యబృందాలు గుర్తించాయి. వీరందరికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించింది. రాష్ట్రంలో వారానికి సుమారు ఆరువేల మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పథకం కింద అనేకమంది వైద్యులు అత్యధిక సర్జరీలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి 60 ఏళ్లు దాటిన 796 మందికి, 60 ఏళ్లలోపున్న 552 మందికి మొత్తం 1,348 ఆపరేషన్లు చేసి మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు భాస్కర్రెడ్డి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచారు. 964 సర్జరీలతో ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు ఎ.ఎస్.రామ్, 921 సర్జరీలతో విజయనగరం జిల్లా ఆస్పత్రి వైద్యుడు కె.ఎన్.మూర్తి తరువాత స్థానాల్లో ఉన్నారు. గుంటూరు జీజీహెచ్లో ఒక ప్రొఫెసర్, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఏరియా ఆస్పత్రి వైద్యుడు ఇప్పటివరకు ఒక్క సర్జరీ కూడా చేయని వారిలో ఉన్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ పరిధిలో సర్జరీలు చేయని, మొక్కుబడిగా చేస్తున్న వైద్యులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సెప్టెంబర్ నాటికి లక్ష్యసాధన వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వృద్ధులందరికీ కంటిపరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వేగంగా పరీక్షలు పూర్తిచేయడానికి జిల్లా అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. వైద్యుల వారీగా చేస్తున్న సర్జరీలను సమీక్షిస్తున్నాం. అవసరాన్ని బట్టి వైద్యులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. – డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, జేడీ, రాష్ట్ర అంధత్వ నివారణ, కంటివెలుగు సంస్థ -
అవ్వాతాతల కంటి పరీక్షలు వచ్చే ఏడాదికి పూర్తి
సాక్షి, అమరావతి: ఏపీలో తొలిసారిగా 60 ఏళ్లు దాటిన అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 60 సంవత్సరాలు దాటిన 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. మందులతో పాటు కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు అన్నీ ఉచితంగానే చేస్తారు. ఇందులో ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారందరికీ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పరీక్షలు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కరోనా కారణంగా ఈ పరీక్షలకు అవరోధం ఏర్పడింది. కరోనా తగ్గడంతో తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 4.71 లక్షల మందికి మందుల ద్వారా కంటిచూపు మెరుగుపరిచారు. 7.60 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడమే కాకుండా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీకి ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు 4.69 లక్షల మంది అవ్వా తాతలకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే, ఇప్పటివరకు 1.26 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా.. వాటిని ఒక లక్ష మందికి పూర్తిచేశారు. అక్టోబర్ రెండు నుంచి మధ్య వయస్కులకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అవ్వా తాతలందరికీ కంటి పరీక్షలను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నాం. ఇప్పటికే స్కూలు పిల్లలకు పూర్తయ్యాయి. వచ్చే సెప్టెంబర్ నాటికి అవ్వాతాతల కార్యక్రమం పూర్తిచేసిన తరువాత మధ్య వయస్సుల వారికి కూడా ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్ రెండు నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేస్తున్నాం. మొత్తం మీద అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చేయాలనే ముఖ్యమంత్రి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డా. హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు) -
వైఎస్సార్ కంటి వెలుగుతో ఎందరికో చూపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు కోల్పోయిన ఎంతో మందిలో వెలుగులు నింపినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ పి.శ్యామ్ప్రసాద్ చెప్పారు. ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ (ఏపీవోఎస్) ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 6వ రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సు ఐకాన్–2021ను శనివారం డాక్టర్ శ్యామ్ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేత్ర వైద్యంలో ఆధునిక పద్ధతులను వివరిస్తూ ముద్రించిన జర్నల్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా నేత్ర వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ నమ్రతా శర్మ, ఏపీ ఆప్తాల్మిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎం.పర్నికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్.విష్ణువర్ధన్రావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ ఎ.శ్రీహరి, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: కంటి వెలుగుల పరీక్షలు పూర్తి
సాక్షి, అమరావతి: విద్యా రంగ సంస్కరణలతో విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వారి ఆరోగ్యం విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బాలల భవితపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే బాలల కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు పిల్లలకు తొలిసారిగా చేపట్టిన కంటి పరీక్షలు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 66.17 లక్షల మంది స్కూలు పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. రెండు దశల్లో బాలలకు కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమిక కంటి స్క్రీనింగ్ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్ల సహాయంతో శిక్షణ పొందిన సిబ్బంది దీనిని పూర్తి చేశారు. ఈ పిల్లల మెడికల్ రికార్డు, ఇతర వివరాలన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్లో నమోదు చేశారు. 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలు కూడా ఇప్పటికే పంపిణీ చేశారు. 500 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేలగా ఇప్పటికే 459 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు. పిల్లలందరికీ పరీక్షలు పూర్తి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉన్న బాలలందరికీ కంటి పరీక్షలు పూర్తయ్యాయి. కళ్ల జోళ్లూ ఇచ్చాము. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాము. ఇంకా 41 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు చేయించాల్సి ఉంది. వీలైనంత త్వరగా వారికి కూడా ఆపరేషన్లు చేయిస్తాం. దీంతో పూర్తి స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి అయినట్లే. – డా.హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు) -
అవ్వాతాతలకు కంటి చూపు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదు.. చికిత్సలేని కారణంగా కంటిచూపునకు ఎవరూ దూరం కాకూడదు.. అన్న సత్సంకల్పంతో ప్రారంభమైన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఈ యజ్ఞంలో ఇప్పటివరకు 93వేల మందికి పైగా అవ్వాతాలకు కేటరాక్ట్ (కంటి శుక్లాలు) సర్జరీలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారు 56.88 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటివరకు 11.80 లక్షల మందికి కంటిపరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 413 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాయి. కరోనా కేసులు తగ్గిన తర్వాత పీహెచ్సీ స్థాయి నుంచి బోధనాసుపత్రి వరకూ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తున్నారు. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల దూకుడు సెకండరీ కేర్ (వైద్యవిధాన పరిషత్) పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోని కంటి వైద్యులు శస్త్రచికిత్సల్లో దూకుడుగా వెళ్తుండగా, బోధనాసుపత్రుల్లో ఉన్న కంటి డాక్టర్లు మాత్రం తగిన స్థాయిలో సర్జరీలు చేయలేకపోతున్నారు. విచిత్రమేమంటే 11 బోధనాసుపత్రుల్లో 107 మంది కంటివైద్య నిపుణులు ఉండగా, వారంతా కలిసి 4,495 శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. అదే వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో కేవలం 40 మంది మాత్రమే ఉండగా వీరు 5,143 ఆపరేషన్లు చేశారు. వాస్తవానికి నిపుణుడైన డాక్టర్ కంటిశుక్లాల ఆపరేషన్లు రోజుకు 8 నుంచి 10 వరకూ చేయచ్చు. కానీ, డీఎంఈ ఆస్పత్రుల్లో ఉన్న పెద్ద డాక్టర్లు గడిచిన మూడు మాసాల్లో ఒక్కొక్కరు సగటున 42 మాత్రమే చేశారు. ఇప్పటికీ చాలాచోట్ల కరోనా పేరుతో చికిత్స చేయడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో తక్కువ కంటి ఆపరేషన్లు చేస్తున్న ఆస్పత్రులు, డాక్టర్ల వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పేద రోగులకు మెరుగైన చికిత్స చేయాలని అధికారులు ఇప్పటికే వైద్యులకు పిలుపునిచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో వైద్యులకు శిక్షణ ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యాన్నే అవ్వాతాతలకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులకు బృందాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో కేటరాక్ట్ సర్జరీలు మరింత నైపుణ్యంతో చేయడానికి వైద్యులకు వీలు కలుగుతోంది. కంటి వెలుగు చికిత్స వివరాలు.. ► ఇప్పటివరకూ స్క్రీనింగ్ చేసింది : 11,80,170 మందికి ► మందులు అవసరమైన వారు : 4,64,850 ► కేటరాక్ట్ ఆపరేషన్లు జరిగినవి : 93,566 ► కళ్లద్దాలు అవసరమైన వారు : 6,05,680 ► ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన కేటరాక్ట్ ఆపరేషన్లు :9,638 ► ఎన్జీవో/ఆరోగ్యశ్రీ కింద చేసినవి : 48,129 ► ప్రైవేటు ఆస్పత్రుల్లో.. : 35,799 -
ముమ్మరంగా కంటి పరీక్షలు
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ కంటివెలుగు యజ్ఞం ముమ్మరంగా జరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో ఈ కంటి పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో కంటి వైద్యం డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు నానా యాతన పడేవారు. వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం మొదలయ్యాక ఇంటికి దగ్గర్లోనే పరీక్షలు చేయడం, అద్దాలు ఉచితంగా ఇవ్వడం, శుక్లాలుంటే ఆపరేషన్ చేస్తుండడంతో అవ్వాతాతల ఆనందానికి అవధుల్లేవు. ఇలా 60 ఏళ్లు దాటిన వారు భారీ సంఖ్యలో కంటి పరీక్షలకు క్యూ కడుతున్నారు. ఈ యజ్ఞంలో వందలాది మంది వైద్యులు, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు పాల్గొంటూ సేవలు అందిస్తున్నారు. 10.64 లక్షల మందికి పరీక్షలు రాష్ట్రంలో అరవై ఏళ్లు దాటిన వారు 56.88 లక్షల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. వీళ్లందరికీ ఉచితంగా కంటిపరీక్షలు చేసి, వారికి కంటివెలుగు ప్రసాదించాలని సర్కారు సంకల్పించింది. తొలిదశలో స్కూలు పిల్లలకు పూర్తవగా, రెండో దశలో అవ్వాతాతలకు శ్రీకారం చుట్టింది. కానీ, అంతలోనే కరోనా వచ్చింది. ఇప్పుడు మళ్లీ పరీక్షలు పునరుద్ధరించారు. తాజాగా ఆగస్టు 7 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10,64,979 మంది అవ్వాతాతలకు కంటిపరీక్షలు పూర్తిచేశారు. అంటే నిర్దేశించిన లక్ష్యంలో 18.72 శాతం పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 25.77 శాతం మందికి పూర్తయ్యాయి. 5.43 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం ఇప్పటివరకూ కంటిపరీక్షలు పూర్తిచేసుకున్న వారిలో 5.43 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. మరో 94,835 మందికి కంటిశుక్లాల ఆపరేషన్లు చేయాలని తేల్చారు. వీరందరికీ కళ్లద్దాలు, ఆపరేషన్లు ఉచితమే. సర్జరీలు ప్రభుత్వాస్పత్రులతోపాటు ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతోనే నిర్వహిస్తున్నారు. 84,145 మందికి కేటరాక్ట్ సర్జరీలు డాక్టర్లు సిఫార్సు చేసిన 94,835 మందిలో ఇప్పటివరకూ 84,145 మందికి కంటి శుక్లాలకు ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 10,822 మంది చేయించుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 8,785 మంది, ఎన్జీవో ఆస్పత్రుల్లో 45,941 మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో 29,419 మంది చేయించుకున్నారు. దేశంలో ఇంత పెద్దఎత్తున ఎక్కడా కంటి సర్జరీలు, పరీక్షలు జరగడంలేదు. సమీపంలోని పీహెచ్సీల్లో సంప్రదించాలి ఎవరైనా 60 ఏళ్లు దాటిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానీ, ఆరోగ్య ఉపకేంద్రంగానీ, సచివాలయంలోగానీ అడిగితే ఎక్కడ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారో చెబుతారు. అక్కడికెళ్తే పరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి సర్జరీలు ఉచితంగా చేస్తారు. – డాక్టర్ హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు -
వైఎస్సార్ కంటి వెలుగు: ఆ ‘చూపు’ సూపర్
సాక్షి, అమరావతి: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు.. అంటే అన్ని ఇంద్రియాల్లోకెల్లా నేత్రాలు చాలా ముఖ్యమైనవని అర్ధం. అలాంటి కంటిచూపుకు రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లల్లో కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారి జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో 2019 అక్టోబర్ 10న వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ఉచితంగా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 60 వేలకు పైగా స్కూళ్లలోని 66.17 లక్షల మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4.38 లక్షల మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించారు. బాలికల్లో 6.81 శాతం మందికి, బాలురుల్లో 6.46 శాతం మందికి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలింది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రతీ 100 మంది పిల్లల్లో 6.6 శాతం మంది పిల్లలకు కంటి సమస్యలున్నట్లు స్పష్టమైంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ పరీక్షల్లో మిగతా పిల్లలతో పోల్చి చూస్తే గిరిజన పిల్లల్లో దృష్టి లోపాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వారు నివశించే ప్రాంతాలతో పాటు ఆధునిక ఆహారపు అలవాట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రభావం తక్కువగా ఉండటంతో వారిలో దృష్టి లోపాలు తక్కువగా ఉన్నాయి. వీరిలో అత్యల్పంగా 0.29 శాతమే సమస్యలున్నట్లు పరీక్షల్లో తేలింది. అలాగే.. ఎస్సీ పిల్లల్లో 1.09 శాతం దృష్టిలోపం ఉండగా ఓసీ పిల్లల్లో 1.77 శాతం ఉంది. అత్యధికంగా బీసీ పిల్లల్లో 3.46 శాతం కంటి సమస్యలు కనిపించాయి. రెండు దశల్లో కంటి పరీక్షలు పిల్లలందరికీ రెండు దశల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమికంగా కంటి స్క్రీనింగ్ నిర్వహించారు. వీరి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్లో నమోదు చేశారు. ఈ స్క్రీనింగ్లో కంటి సమస్యలున్నట్లు గుర్తించిన 4.38 లక్షల మంది పిల్లలకు రెండో దశలో నిపుణులతో పరీక్షలు చేయించారు. ఇందులో 2.41 లక్షల మందికి మందులు, వైద్యుల సలహాలు, సూచనలిచ్చారు. 1.58 లక్షల మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. మరో 42,542 మందికి నిపుణుల పరీక్షలకు సూచించారు. ఈ పరీక్షల ద్వారా 24,017 మంది పిల్లలకు కంటి సంరక్షణపై సూచనలు చేశారు. 2,612 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చగా వీరిలో 294 మందికి వాటిని పూర్తిచేశారు. మరో 145 మంది పిల్లలకు శుక్లాల ఆపరేషన్లు చేశారు. పిల్లలపై ‘ఎలక్ట్రానిక్స్’ ప్రభావం తీవ్రంగా ఉంది చిన్న పిల్లల కంటిచూపుపై ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావం తీవ్రంగా ఉంది. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు వంటివి చిన్నతనం నుంచే అలవాటు చెయ్యొద్దు. టీవీల ప్రభావం కూడా తక్కువేం కాదు. వీటి ప్రభావం పట్టణ పిల్లల్లో ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో ఈ ఉపకరణాలు తక్కువగా వాడుతున్నారు కాబట్టి గిరిజన పిల్లల్లో కంటి సమస్యలు తక్కువగా ఉన్నాయి. – డా. హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు కంటి పరీక్షల వివరాలు జెండర్ పరీక్షలు దృష్టిలోపం లోపం శాతం బాలురు 34,44,818 2,22,676 6.46 శాతం బాలికలు 31,72,795 2,16,075 6.81 శాతం సామాజికవర్గాల వారీగా కంటి పరీక్షలు.. సామాజికవర్గం దృష్టిలోపం లోపం శాతం ఎస్సీ 72,771 1.09 శాతం ఎస్టీ 19,214 0.29 శాతం బీసీ 2,29,567 3.46 శాతం ఓసీ 1,17,109 1.77 శాతం -
వైద్యానికి నిధుల కొరత లేదు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నిధుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకుని టెండర్లు నిర్వహించిన కాలేజీల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మెడికల్ కాలేజీల కోసం భూ సేకరణ, నిధుల కేటాయింపుల్లో జాప్యం జరగకుండా కలెక్టర్లతో చర్చించాలని అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్య రంగం, కుటుంబ సంక్షేమశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ కంటి వెలుగు పథకాలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాడు – నేడు కింద వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన అన్ని పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పీహెచ్సీలు, సీహెచ్సీలు, బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలు మెరుగుపరిచి తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు అవార్డు అయ్యాయని, మిగిలిన 12 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ లోగా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 3,90,479 మంది అవ్వా తాతలకు ఉచితంగా కళ్లజోళ్లు వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలులో ఎటువంటి జాప్యం జరగకూడదని సీఎం జగన్ ఆదేశించారు. కంటి వెలుగు కింద అవ్వాతాతలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. కంటి వెలుగు పథకం మూడో విడతలో భాగంగా 8,09,262 మంది అవ్వాతాతలకు నేత్ర పరీక్షలు నిర్వహించి 3,90,479 మందికి ఉచితంగా కళ్లద్దాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో 41,193 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయని, ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని వివరించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. -
36వేల మందికి పైగా.. అవ్వా తాతలకు కంటి శస్త్రచికిత్సలు
సాక్షి, అమరావతి: అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రారంభమైన అందరికీ ఉచిత కంటి పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు దశల్లో స్కూలు పిల్లల కంటి పరీక్షలు పూర్తికాగా.. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన 7,29,266 మందికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించారు. ఇందులో 3,40,535 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడంతోపాటు వారిలో 2,03,483 మందికి వాటిని ఇప్పటికే పంపిణీ చేశారు. అలాగే, 72,416 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా వీరిలో 36,261 మందికి వాటిని నిర్వహించారు. అంటే 50 శాతం పైగా శస్త్ర చికిత్సలను పూర్తిచేశారు. నిజానికి.. రాష్ట్రంలోని 60 ఏళ్లు పైబడిన 56,88,420 మంది అవ్వా తాతలకు ఉచితంగా కంటి వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని గత ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం జగన్ ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో గత ఏడాది మార్చి నెలాఖరు నుంచి అవ్వాతాతల కంటి వెలుగు పరీక్షలు నిలిచిపోయాయి. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది నవంబరు 2 నుంచి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను తిరిగి ప్రారంభించారు. మిగతా వారికి కూడా వీలైనంత త్వరగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవ్వా తాతలందరికీ కంటివెలుగు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వాసుపత్రులు, ఎన్జీఓ కంటి ఆసుపత్రుల్లో మిగతా వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శంకర నేత్రాలయం, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో అవ్వా తాతలకు కంటి శస్త్ర చికిత్సలను చేయిస్తున్నాం. అలాగే, ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు 230 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను నియమించాం. త్వరలోనే మరికొంత మందిని నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. – డా. హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం -
అవ్వాతాతల కంటికి వెలుగు
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు కంటి పరీక్షలు మళ్లీ మొదలయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈనెల రెండోతేదీ నుంచి కంటి పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా 60 ఏళ్ల అవ్వాతాతల కంటిచూపు గురించి ఆలోచించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారికి నేత్రపరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 56,88,424 మంది అవ్వాతాతలకు వారి గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్ కంటివెలుగు మూడోవిడత కింద కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం జగన్ ప్రారంభించారు. కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి ఈ పరీక్షలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈనెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ప్రారంభించారు. గ్రామ, వార్డుల్లో కాకుండా పీహెచ్సీలు, వైద్యసంస్థల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. తొలి, మలివిడత పరీక్షలు సమాంతరంగా చేయడం ప్రారంభించారు. తొలివిడత ప్రాథమికంగా పరీక్షిస్తారు. దాన్లో మళ్లీ పరీక్షించాలని తేలితే అక్కడే కంట్లో చుక్కలమందు వేసి రెండోసారి పరీక్షిస్తున్నారు. రెండోసారి పరీక్షలో అద్దాలు ఇవ్వాలని గుర్తిస్తే అద్దాలు రాయడమే కాకుండా వాటిని తయారు చేయడానికి ఆర్డర్ను కూడా ఇచ్చారు. శస్త్రచికిత్స అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించే ఏర్పాట్లు చేశారు. 33,222 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తింపు కోవిడ్–19 ప్రభావం రాకముందు 3.06 లక్షలమంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అవసరమైన 90,773 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. 33,222 మందికి శస్త్రచికిత్స, 3,501 మందికి ఇతర చికిత్స అవసరమని గుర్తించారు. ఇప్పటికే 6,473 మందికి శస్త్రచికిత్సలు చేశారు. మిగిలినవారికి కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ వీలైనంత త్వరగా శస్త్రచికిత్సలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరికి శంకర నేత్రాలయం, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని వైఎస్సార్ కంటివెలుగు నోడల్ ఆఫీసర్ హైమావతి చెప్పారు. -
బాల్యానికి భరోసా
సాక్షి, అమరావతి : చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి వైద్యమందిస్తే పెద్దయ్యాక దుష్ప్రభావాలు కనిపించవనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. గత 12 నెలల్లో ఐదు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న సుమారు 1.22 కోట్ల మందికి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) కింద చేపట్టిన ఈ పరీక్షల్లో పలువురు చిన్నారుల్లో లోపాలు గుర్తించారు. వారిని ఇప్పటికే వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన లోపాలు గుర్తించి వారికి వయసొచ్చాక ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ,ప్రైవేటు స్కూళ్లు,కళాశాలల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎక్కువగా పదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లోనే సమస్యలు కనిపించాయి. దేశంలోనే గొప్పగా కంటివెలుగు కార్యక్రమం చిన్నారులకు వైద్య పరీక్షలే కాదు.. ‘వైఎస్సార్ కంటివెలుగు’లో భాగంగా 66 లక్షలమందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇందులో సమస్యలున్న 55 వేలమందికి విజన్కిట్స్ పంపిణీ చేశారు. 1.58 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా కళ్లద్దాలు అందజేసింది. 9,666 మంది చిన్నారులను పెద్దాస్పత్రులకు పంపి చికిత్స చేయించింది. ఎప్పట్నుంచో చిన్నారులు కంటి సమస్యలతో బాధపడుతుండగా నేరుగా స్కూళ్లకే వెళ్లి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇచ్చింది మొదటగా మన రాష్ట్రంలోనే. ఆర్బీఎస్కే కింద పరీక్షల వివరాలు మొదటి దశలో స్క్రీనింగ్ 62,83,203 పుట్టుకతోనే లోపాలున్నవారు 46,627 శారీరక లోపాలతో ఉన్నవారు 36,614 జబ్బులతో బాధపడుతున్నవారు 44,288 ఎదుగుదలలో లోపాలు 9,322 రెండోదశలో స్క్రీనింగ్ 59,99,438 పుట్టుకతోనే సమస్యలున్నవారు 10,439 రకరకాల శారీరక లోపాలున్నవారు 8,921 జబ్బులతో బాధపడుతున్నవారు 54,548 ఎదుగుదల లోపాలున్నవారు 30,084 వైఎస్సార్ కంటివెలుగు కింద మొత్తం స్కూళ్లు 60,406 స్క్రీనింగ్ చేయించుకున్న విద్యార్థులు 66 లక్షలు అద్దాలు తీసుకున్నవారు 1.58 లక్షలు పెద్దాస్పత్రులకు సిఫార్సు 9,666 విజన్కిట్లు తీసుకున్నవారు 55,000 -
అవ్వాతాతలకు వచ్చేనెలలో కళ్లద్దాలు
సాక్షి, వైఎస్సార్, కడప : డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మళ్లీ వేగం అందుకుంది. కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపి వేసిన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కళ్లద్దాలు పంపిణీ చేయడానికి, ఇతర సమస్యలకు చికిత్సను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొదటి దశ గతేడాది అక్టోబర్ 10 వరకు ..రెండవ దశ నవంబర్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమలు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,450 (1 నుంచి 10వ తరగతి) పాఠశాలల్లో 4,12,301 మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 32,800 విద్యార్దులకు కంటి వ్యాధులు ఉన్నట్లుగా గుర్తించారు. మళ్లీ కంటి వైద్య నిపుణులు బాధిత విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 13,600 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలను పంపిణీ చేశారు. 2,600 మందికి ఇతర కంటి లోపాలను గుర్తించి చికిత్సను అందించారు.మిగతా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు. మూడో దశకింద 60 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 20 వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. 10 డివిజన్లలో 14,780 మందికి పరీక్షలు నిర్వహించారు. 9,028 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించారు. 4,164 మందికి కంటి (ఐఓఎల్) ఆపరేషన్లు చేయాలని రెఫర్ చేశారు. ఇప్పటికే 302 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. మిగిలిన 1,588 మందికి కంటి లోపాలు లేవని గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా అప్పట్లో తాత్కాలికంగా పధకం ప్రక్రియను నిలిపి వేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అవ్వాతాతలకు కళ్లద్దాలు అందనున్నాయి. వైద్య నిపుణులు, వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలను అందజేస్తారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను చేస్తారు. (ఇంటివద్దకే కళ్లద్దాలు) వచ్చే నెలలో కళ్లదాలు అందజేస్తాం 'అక్టోబర్ 1న ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అవ్వాతాతలకు కళ్లద్దాలు పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలు పంపిణీ చేస్తాం. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడానికి చర్యలు చేపడుతాం. ఈ పధకం ద్వారా వేలాది మందికి కంటి వెలుగు రావడమే ప్రభుత్వ సంకల్పం.' అని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ రామిరెడ్డి తెలిపారు -
ఇంటివద్దకే కళ్లద్దాలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు సిద్ధం చేశారు. మార్చినెలలోనే ఈ కళ్లద్దాలు పంపిణీ చేయాల్సి ఉన్నా కోవిడ్–19 కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలో స్కూళ్లు తెరిచే అవకాశం ఉండటంతో ఆలోగా చిన్నారులకు ఉపాధ్యాయుల ద్వారా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వృద్ధులకు కళ్లజోళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది చిన్నారులకు, వృద్ధులకు కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇవ్వడం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ► రాష్ట్రంలో మొదటి, రెండో దశ కంటి వెలుగులో భాగంగా 60,393 స్కూళ్లలో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ► వీరిలో 4.38 లక్షల మంది చిన్నారులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు గుర్తించారు. ► మరో 55 వేల మందికి విజన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ► మూడో దశ కంటి వెలుగులో భాగంగా 60 ఏళ్లు దాటిన 3,06,961 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించగా 95,075 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. ► వీరికి వచ్చే నెల మొదటి వారంలో కళ్లద్దాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కళ్లద్దాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. ► మూడో దశలో మరింత మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమం కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ► కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చాక కోవిడ్ పరిస్థితులు రావడం, కళ్లద్దాలు తయారుచేసే సంస్థలు కొంతకాలం మూతపడటం వల్ల వాటి పంపిణీ తాత్కాలికంగా వాయిదా పడింది. ► కాగా, మొదటి దశలో రూ.11.18 కోట్లు, రెండో దశలో రూ.12.65 కోట్లు, మూడో దశలో రూ. 6.60 కోట్లు వ్యయం అయ్యింది. -
సెకండరీ ‘కేర్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి అంతకంటే జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. సామాన్య, పేద రోగులకు సర్కారీ ఆస్పత్రులే ఆధారం. ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ శ్రేణి ఆస్పత్రులు ఏటా లక్షలాది మందికి ఊరటనిస్తున్నాయి. అలాంటివి గత సర్కారు పాలనలో నిధులివ్వక, నియామకాలు లేక, పట్టించుకునే నాథుడు లేక దిక్కూమొక్కూ లేనివిగా మారాయి. ఇక ఎంతోమంది పేద గర్భిణులకు సాంత్వన చేకూర్చే సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్సీ) పరిస్థితి దయనీయం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో సీహెచ్సీలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు కళకళలాడుతున్నాయి. వానొస్తే ఇక నీరుగారే భవనాలు లేవు. వైద్యుల నియామకాలు, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు ధైర్యంగా వెళుతున్నారు. సెకండరీ కేర్ ఆస్పత్రులుగా పేరున్న వైద్య విధానపరిషత్ విభాగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్య విధాన పరిషత్లోని 169 ఆస్పత్రులను నాడు–నేడులో భాగంగా రూ.1,236 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పేద రోగులకు ఊరట.. ‘సామాజిక ఆరోగ్య కేంద్రాలకు మంచిరోజులొచ్చాయి. ఏడాదిలోగా అన్ని సీహెచ్సీలు కొత్త హంగులతో సేవలందిస్తాయి. వీటి పునరుద్ధరణ లక్షలాది మంది పేద రోగులకు ఊరటనిస్తుంది. వచ్చే నాలుగేళ్లలో ఆస్పత్రుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాం. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్బీ వైద్య సీట్లు వచ్చేలా చర్యలు చేపట్టాం’ –డాక్టర్ రామకృష్ణారావు (వైద్య విధాన పరిషత్ కమిషనర్) రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే లక్షల మంది చిన్నారులకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంతో మేలు జరిగింది. ఇప్పటివరకూ 68 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి. నాలుగేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రూ.560 కోట్లు కేటాయించారు. ఇందులో ఎన్హెచ్ఎం నుంచి రూ.220 కోట్లు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.340 కోట్లు ఇస్తోంది. కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ప్రభుత్వమే ఉచితంగా కళ్లద్దాలు అందచేసింది. ఈ కార్యక్రమం మొత్తం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఏరియా ఆస్పత్రుల్లోనే జరిగింది. 70 ఆస్పత్రుల్లో నలుగురు చొప్పున గైనకాలజిస్ట్లు రాష్ట్రంలో 192 సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా పేదలు ఎక్కువగా ఈ ఆస్పత్రుల్లోకే ప్రసవానికి వస్తుంటారు. అయితే 70 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సామర్థ్యానికి మించి కాన్పులు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి ఏకంగా నలుగురు చొప్పున గైనకాలజిస్ట్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యులు ఎలాగూ ఉంటారు. ఈ 70 ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు, పడకలు పెంచి మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు 24 సీహెచ్సీలను ఉన్నతీకరించి ఏరియా ఆస్పత్రులుగా మారుస్తున్నారు. ఉన్నతీకరించే ఆస్పత్రుల్లో పడకలను రెట్టింపు చేస్తారు. దివ్యాంగుల సర్టిఫికెట్లలో కొత్త ఒరవడి వివిధ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం దివ్యాంగులు సర్టిఫికెట్లు పొందాలంటే గతంలో నెలల తరబడి వేచి చూసేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచి వైద్యులను నియమించడంతో రెట్టింపు సంఖ్యకు పైగా సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. రూ.1,236 కోట్లతో నాడు–నేడు పనులు వైద్య విధాన పరిషత్లోని 169 ఆస్పత్రులను నాడు–నేడులో భాగంగా రూ.1,236 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 123 సామాజిక ఆరోగ్యకేంద్రాలు, 46 ఏరియా ఆస్పత్రులున్నాయి. ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి రూ.695 కోట్లు, సీహెచ్సీల అభివృద్ధికి రూ.541 కోట్లు వ్యయం చేస్తారు. నిర్మాణ పనుల నుంచి వైద్య పరికరాల వరకూ అన్ని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తారు. ప్రధానంగా తల్లీ బిడ్డల వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆగస్టు చివరికల్లా వైద్య సిబ్బంది నియామకాలు.. సెకండరీ ఆస్పత్రుల్లో ఉన్న ప్రధాన లోపాలు మౌలిక వసతులు, వైద్యుల కొరతే. నాడు–నేడుతో మౌలిక వసతుల కొరతను, కొత్త నియామకాలతో వైద్యుల కొరతను అధిగమించనున్నారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా 718 మంది వైద్యులను ప్రభుత్వం నియమిస్తోంది. ఆగస్టు చివరి కల్లా వైద్యుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది. ఇది కాకుండా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్లు కలిపి మరో 990 మందిని నియమించనున్నారు. -
కంటికి వెలుగు
-
అవ్వాతాతల కంటికి వెలుగు
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవ్వాతాతలకు ఉచితంగా కంటి వైద్యం అందిస్తాం. అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే అని భావించే వారిలో నేను మొదటి వాడిని. వారికి సేవ చేయడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. 56,88,420 మంది అవ్వాతాతలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. కంటి పరీక్షలు చేసిన వారికి 2 వారాల లోపు నేరుగా వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి కళ్లజోళ్లు పంపిణీ చేస్తాం. మార్చి 1 నుంచి ఆపరేషన్లు, ఇతర వైద్య చికిత్సలు చేయిస్తాం. సబ్ సెంటర్ నుంచి పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, భోదనాసుపత్రి వరకూ ఇప్పుడు అన్నింటి ఫొటోలు తీసి, మూడేళ్లలో మార్పు చేసి మళ్లీ ఫొటోలు తీసి అందరికీ చూపిస్తాం. అందుకు ఏకంగా రూ.15,337 కోట్లతో పనులు చేయబోతున్నాం. మంచి పాలన సాగిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స ఉంది. కేన్సర్ వచ్చినా చికిత్స ఉంది. కానీ అసూయతో వచ్చే కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగు ద్వారా చికిత్స చేయొచ్చు. చెడు చూపునకు ఎక్కడా చికిత్స లేదు. వయసు మళ్లితే చికిత్స ఉంది కానీ.. మెదడు కుళ్లితే చికిత్స లేదు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అవ్వాతాతలకు వయసు మీద పడిన తర్వాత దృష్టి లోపం లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పెద్ద వయసులో కంటి చూపు మందగిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయో అందరికీ తెలుసని, ఈ పరిస్థితిని మార్చబోతున్నామని చెప్పారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో మంగళవారం ఆయన మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తనకెంతో ఇష్టమైన అవ్వాతాతల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి జూలై ఆఖరు వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. 56,88,420 మంది అవ్వాతాతలకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆపరేషన్ల కోసం 133 కేంద్రాలు ‘మార్చి 1వ తేదీ నుంచి కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతాయి. ఆపరేషన్ల కోసం 133 కేంద్రాలు సిద్ధం చేశాం. జిల్లా కేంద్రాల్లోని 11 బోధనాసుపత్రులు, 13 జిల్లా ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు, 81 ఎన్జీవో పరిధిలోని ఆస్పత్రుల్లో వైద్యం చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులతో పాటు పీహెచ్సీ వైద్యలు, సిబ్బంది, ఆశా వర్కర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీని కోసం రూ.560 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొదటి దశగా 2019 అక్టోబర్ 10న కంటి వెలుగు ప్రారంభమైంది. స్కూళ్లకు వెళ్లే చిన్నారుల కోసం మొదలుపెట్టాం. ఏకంగా 66 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాం. 60 వేల మంది సిబ్బంది పాల్గొని ఒక మహాయజ్ఞంగా చేశారు. నవంబర్ 1 నుంచి 31 వరకూ రెండోదశ పూర్తి చేశారు. 500 మంది నిపుణులైన బృందాలతో 4.36 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. అందులో 1.50 లక్షల మందికి కళ్లజోళ్లు ఇచ్చాం. 46 వేల మందికి ఈ వేసవిలో పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు శస్త్ర చికిత్సలు చేయిస్తాం. కంటి పరీక్ష చేయించుకుంటున్న అవ్వను పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐపీహెచ్ స్టాండర్డ్స్ తీసుకొస్తాం ఆటో, లాయర్ అన్నదమ్ముల నుంచి చేనేత అక్కచెల్లెమ్మలు, మత్స్యకారులు, అగ్రిగోల్డ్ బాధితుల వరకు.. మీ బిడ్డగా చేతనైన సాయం చేశానని గర్వంగా చెబుతున్నా. ఈ రోజు మరో అడుగు ముందుకేసి మరో రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఆసుపత్రుల రూపురేఖలు మార్చే కార్యక్రమం ఒకటైతే.. వైఎస్సార్ కంటి వెలుగు మరొకటి. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో మార్చేందుకు ‘నాడు–నేడు’కు శ్రీకారం చుడుతున్నాం. జాతీయ స్థాయి ప్రమాణాలు నెలకొల్పుతాం. మొదటగా కర్నూలు జిల్లా నుంచే ప్రారంభిస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఐపీహెచ్ఎస్ (ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) స్థాయికి తీసుకొస్తాం. గ్రామాల్లోని ఆసుపత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడు దశల్లో మూడేళ్లలో పూర్తిగా మారుస్తాం. మొదటి దశలో 7,458 సబ్సెంటర్లలో ‘నాడు–నేడు’కు శ్రీకారం చుట్టాం. 4,906 కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. కొత్త శాశ్వత ఆస్పత్రులు తీసుకొస్తున్నాం. మిగిలిన 2,552 సబ్సెంటర్ల రూపురేఖలు కూడా మారుస్తాం. వీటన్నిటికీ రూ.11,029 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. కర్నూలులో బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనసందోహం 52 ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ రెండో దశలో 1,445 పీహెచ్సీ, 149 కొత్త ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. మిగిలిన 989 ఆసుపత్రులకు మరమ్మతులు చేసి అత్యాధునికంగా మార్చబోతున్నాం. రెండో దశలోనే 169 కమ్యూనిటీ సెంటర్ల రూపురేఖలు కూడా మారుస్తున్నాం. ఇవికాక 52 ఏరియా ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నాం. వీటన్నిటికీ రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సీహెచ్సీల కోసం రూ.1,212 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడు దశల్లో జిల్లా ఆసుత్రులు, భోదనాసుపత్రులను బలోపేతం చేస్తాం. కొత్తగా మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వీటికి రూ.12,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొత్తంగా వైద్య రంగ అభివృద్ధికి రూ.15,303 కోట్లు ఖర్చు పెడుతున్నందుకు గర్వపడుతున్నా. ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ హెల్త్కార్డు (నమూనా)ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న విధంగా, ఇదే కార్యక్రమం ద్వారా ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు శ్రీకారం చుట్టాం. కార్పొరేట్ స్థాయి ప్రమాణాలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటిని పూర్తిగా ఆధునికీకరించడమే కాకుండా మూడేళ్లలో మూడు దశల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ (బోధనాసుపత్రి) ఉండేలా చూస్తాం. ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా 16 కొత్త కాలేజీలు కలిపి మొత్తం 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు నర్సింగ్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ప్రతి ఆసుపత్రిలో పీజీ కోర్సులు వస్తాయి. పూర్తి స్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. పీజీ చేసే డాక్టర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు కూడా అందుబాటులో ఉంటారు. పేదవాడు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే డాక్టర్లు లేరనే మాటే రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. 11 బోధనాసుపత్రులు, 6 అనుబంధ ఆసుపత్రులు, 8 సూపర్ స్పెషాలిటీ, 3 కేన్సర్ ఆసుపత్రులు, 16 కొత్త నర్సింగ్ కాలేజీలు స్థాపించి వైద్య రంగం రూపురేఖలు మార్చబోతున్నాం. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా మనం ఖర్చు చేస్తున్నామని చెప్పేందుకు గర్వంగా ఉంది. మంచి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దేవుని ఆశీస్సులతో మంచి చేస్తున్నాం. మంచి పరిపాలన చేస్తున్నపుడు సహజంగా ఓర్చుకోలేని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చంద్రబాబు మాటలు విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆయనకు ఎంతటి కడుపు మంట ఉంటుందో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొన్ని చానెళ్లు, పత్రికలు ఉన్నాయి. వీరిని బాగుచేసే మందులు ఎక్కడా లేవు. వీటన్నింటి మధ్య మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు. నిజాయితీతో పని చేస్తున్నాం. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయంపై దృష్టి పెడుతున్నాం. మేనిఫెస్టోలోని వాగ్దానాలను ఏడాదిలోపే 85 శాతం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రజల ఆనందం, భవిష్యత్తు కోసం పని చేస్తున్నాం. అవ్వాతాతల దీవెనలు, అక్కాచెల్లెమ్మల చల్లని దీవెనలు మీ బిడ్డకు ఉండాలని కోరుతున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సభకు ముందు వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా సీఎం దగ్గరుండి.. వృద్ధులకు స్క్రీనింగ్ టెస్ట్లు చేయించారు. విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. మోడల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి శిలాఫలం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఆళ్లనాని, గుమ్మనూరు జయరాం, ఎంపీలు సంజీవ్కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, మండలి విప్ గంగుల ప్రభాకర్రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. న్యాయ రాజధానిలో సీఎంకు ఘన స్వాగతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కర్నూలుకు తొలిసారి రావడం, అందులో కర్నూలును ‘న్యాయ రాజధాని’గా ప్రకటించి ఉండటంతో కర్నూలు వాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరిచిపోలేని విధంగా స్వాగతం పలికారు. ఎస్ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఎస్టీబీసీ కళాశాలలో సభా వేదిక వరకు దాదాపు 25 వేల మంది మానవహారంగా నిల్చొని స్వాగతం పలికారు. ‘థ్యాంక్యూ సీఎం’ అనే ప్ల కార్డులను చేతబట్టి ‘జై జగన్.. జైజై జగన్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తప్పెట్లు, మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు చరిత్రలో ఏ ముఖ్యమంత్రికీ ఈ స్థాయిలో స్వాగతం లభించి ఉండదని స్థానికులు చర్చించుకున్నారు. బహిరంగ సభలోనూ ‘థ్యాంక్యూ సీఎం’ అన్న ప్లకార్డులు పెద్దఎత్తున ప్రదర్శించారు. మామయ్యా.. మళ్లీ మళ్లీ మీరే రావాలి బాలిక ప్రసంగానికి ముగ్దుడైన సీఎం ‘ఒక అమ్మలా ఆలోచించి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఒక నాన్నలా ఆలోచించి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నారు. ఒక అన్నలా ఆలోచించి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. ఇంత మంచి సీఎం మామయ్య ఉండగా మనకు ఇంకేమి కావాలి? చెప్పండి. మళ్లీ మళ్లీ ఇలాంటి సీఎం మామయ్య రావాలి. నేను డాక్టరై మీ పరిపాలనలో సేవ చేయాలని ఉంది మామయ్యా..’ అంటూ కర్నూలు జిల్లా మిడుతూరు కస్తూర్బా పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న జ్యోతిర్మయి చేసిన ప్రసంగానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్దుడయ్యారు. ప్రసంగం ముగియగానే ఆ బాలికను ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన సీఎం సభలో జ్యోతిర్మయి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. జ్యోతిర్మయిని అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘జగన్ మామయ్య చెప్పిన విధంగానే నవరత్నాల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్సార్ ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పెన్షన్ల పెంపు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యకు సంబంధించి చాలా పథకాలను ప్రవేశపెట్టారు. నేను డాక్టరై పేదలకు ఉచిత వైద్యం అందించాలనుకుంటున్నా. కానీ, మా ఇంట్లో ఇంత పెద్ద చదువులు చదివించడానికి స్తోమత లేదు. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. అమ్మఒడి, నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, పౌష్టికాహారం, కంటి వెలుగు తదితర పథకాలు, కార్యక్రమాలతో పేద విద్యార్థులందరూ చదువుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇన్ని గొప్ప పనులు చేసినందుకు సీఎం మామయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని జ్యోతిర్మయి వివరించడంతో సభకు హాజరైన వారందరూ చప్పట్లతో అభినందించారు. సీఎంకు ఘన స్వాగతం సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలుకు తొలిసారి రావడం, అందులో కర్నూలును ‘న్యాయ రాజధాని’గా ప్రకటించి ఉండటంతో కర్నూలు వాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరిచిపోలేని విధంగా స్వాగతం పలికారు. ఎస్ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఎస్టీబీసీ కళాశాలలో సభా వేదిక వరకు దాదాపు 25 వేల మంది మానవహారంగా నిల్చొని స్వాగతం పలికారు. ‘థ్యాంక్యూ సీఎం’ అనే ప్లకార్డులను చేతబట్టి ‘జై జగన్.. జైజై జగన్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తప్పెట్లు, మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు చరిత్రలో ఏ సీఎంకు ఈ స్థాయిలో స్వాగతం లభించి ఉండదని స్థానికులు చర్చించుకున్నారు. సభలోనూ ‘థ్యాంక్యూ సీఎం’ అన్న ప్లకార్డులు పెద్దఎత్తున ప్రదర్శించారు. సీఎంకు స్వాగతం పలుకుతున్న కర్నూలు ప్రజలు -
మూడోదశ వైఎస్ఆర్ కంటి వెలుగు
-
వైఎస్సార్ కంటి వెలుగు మూడో దశ ప్రారంభించిన సీఎం జగన్
-
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..
-
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది. కర్నూలులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ బడుల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పింది. (చదవండి : ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తాం: సీఎం జగన్) ‘ఇంత గొప్ప పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేటి సమాజంలో మహిళలకు, బాలికలను రక్షణ కరువైంది. ఒక అన్నలా, తమ్ముడిలా, తండ్రిలా, మామయ్యాలా ఆలోచించి దిశ పోలీస్ స్టేషన్లను ప్రవేశ పెట్టారు. ఆడవాళ్లనే కాకుండా నాలాంటి పేద విద్యార్థులకు రక్షణ కల్పించారు. ఆడవాళ్లందరి తరపున మన మామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, మన కర్నూలును న్యాయ రాజధానిగా ఎంచుకున్నందుకు మన మామయ్య గారికి మనమెంతో రుణపడి ఉండాలి’అని జ్యోతిర్మయి పేర్కొంది. చిన్నారి ప్రసంగానికి సీఎం వైఎస్ జగన్ ముగ్ధుడయ్యారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. -
రాజన్న కలలను నెరవేరుస్తున్నారు
-
మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమం
-
వాటికి మందులు ఎక్కడా లేవు: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్ కంటి వెలుగు పథకం అందించే దిశగా చేపట్టిన మూడో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం కర్నూలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 56 లక్షల 88 వేల 420 మంది అవ్వాతాతలకు గ్రామ సచివాలయాల్లోనే కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. మార్చి 1 నుంచి అవ్వాతాతలకు కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. 133 కేంద్రాల్లో కంటి శస్త్ర చికిత్సకై ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామ వాలంటీర్లు అవ్వాతాతల ఇంటికి కళ్లజోళ్లు అందజేస్తారని తెలిపారు. ఇక రూ. 15,337 కోట్లతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘మొదటి దశలో రూ. 1129 కోట్లతో నాడు-నేడు. రెండో దశలో పీహెచ్సీ, కమ్యూనిటీ సెంటర్లలో నాడు-నేడు. రూ. 700 కోట్లతో ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ. రాష్ట్రంలో కేవలం 11 బోధనాసుపత్రులు మాత్రమే ఉన్నాయి. మరో 16 టీచింగ్ ఆస్పత్రులు తీసుకువస్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటాం. నర్సింగ్ కాలేజీలు కూడా పెంచుతాం. పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్ లేడు అన్న పదం వినపడకూడదు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తమ ప్రభుత్వం మేలు చేస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంతమంచి పాలన చేస్తుంటే.. చూసి ఓర్చుకోని వారి సంఖ్య సాధారణంగా ఎక్కువగానే ఉంటుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు కడుపు మంటతో ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారన్నారు. ‘‘ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు పైగా చికిత్స చేస్తున్నాం. ఇంకా క్యాన్సర్కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉంది. కానీ, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు. కంటిచూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ, చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ, మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేనే లేదు. అలాంటి లక్షణాలున్న మనుషులను మహానుభావులుగా చూపించే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఉన్నాయి. వాటిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవు’’ అని చంద్రబాబు, ఎల్లోమీడియా తీరుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘‘వీటన్నింటి మధ్య కూడా మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు. నిజాయితీతో పని చేస్తున్నాడు. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తున్నాం. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెట్టాం. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో మొదటి ఏడాది కూడా పూర్తి కాకుండానే 85 శాతానికి పైగా అమలు చేసే చర్యలు తీసుకున్నాం. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏఎహెచ్లు, డీహెచ్లతో పాటు, టీచింగ్ ఆస్పత్రులను కూడా మార్చబోతున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు’ ‘సీఎం జగన్ మా ఆశలను చిగురింపజేశారు’ -
‘సీఎం జగన్ది సాహసోపేతమైన నిర్ణయం’
సాక్షి, కర్నూలు: కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయమని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ కంటివెలుగు పథకం మూడో దశను కర్నూలులో మంగళవారం సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆమోదయోగ్యమైన పరిపాలనను సీఎం జగన్ అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రతీ విద్యార్థి ఇంగ్లీష్లో చదువుకోవాలనేది సీఎం జగన్ తపన అని అన్నారు. పిల్లలను బడులకు పంపిస్తున్న తల్లులకు అమ్మఒడి ద్వారా భరోసా కల్పించారన్నారు. స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెను రూపొందించనట్లు మంత్రి బుగ్గన వివరించారు. రాజన్న కలలను నెరవేరుస్తున్నారు దివంగత మహానేత రాజన్న కలలను సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలులో మూడో దశ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి .. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని అభివర్ణించారు. బలహీనవర్గాలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ అని మంత్రి జయరాం కొనియాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మాట వీద నిలబడే నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. ఇచ్చిన ప్రతీ హామీని సీఎం నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పేర్కొన్నారు. చదవండి: అవ్వాతాతలకు వైఎస్సార్ కంటి వెలుగు నైపుణ్య కేంద్రాలతో పారిశ్రామిక ప్రగతి ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..! -
‘సీఎం జగన్ మా ఆశలను చిగురింపజేశారు’
-
‘సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు’
-
‘సీఎం జగన్ మా ఆశలను చిగురింపజేశారు’
సాక్షి, కర్నూలు: ‘ఏ సీఎం అయినా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి మరిచిపోతారు. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చి.. న్యాయ రాజధానిగా ప్రకటించిన తరువాత కర్నూలుకు వచ్చారు’ అని కర్నూలు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హఫీజ్ఖాన్ పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశను సీఎం వైఎస్ జగన్ మంగళవారం కర్నూలులో లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.. సీఎం జగన్పై ప్రశంసల జల్లు కురిపించారు. మూడో దశ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని కర్నూలు నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉన్నారు. ఈ పథకం మూడో దశలో భాగంగా దాదాపు 56.88 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్ జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి తమ జిల్లా ప్రజల ఆశలను చిగురింపజేశారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని హఫీజ్ ఖాన్ స్పష్టంచేశారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్కు జిల్లా ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కాగా, రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. చదవండి: అవ్వాతాతలకు వైఎస్సార్ కంటి వెలుగు నైపుణ్య కేంద్రాలతో పారిశ్రామిక ప్రగతి ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..! -
మూడో విడత వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
-
అంధత్వ శాతం తగ్గించడమే లక్ష్యం
-
అవ్వాతాతలకు వైఎస్సార్ కంటి వెలుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కర్నూలులో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్ కంటి పరీక్షలను సమాంతరంగా ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. అద్దాలు అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత పక్షం రోజుల్లో వలంటీర్ల ద్వారా పెన్షన్లతో పాటు కళ్ల జోళ్లను కూడా అందజేయనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. మార్చి 1వ తేదీ నుంచి గుర్తించిన ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తారు. తొలుత 175 నియోజకవర్గాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మరో మండలంలో పూర్తి చేస్తారు. ఇలా అన్ని మండలాల్లో కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. అంధత్వ శాతం తగ్గించడమే లక్ష్యం ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రస్తుతం 1 శాతం ఉన్న అంధత్వాన్ని 0.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 5.30 కోట్ల మందికి ప్రభుత్వం కంటి వైద్య పరీక్షలు చేపట్టింది. రూ.560 కోట్ల వ్యయంతో 2022 జనవరి 31కి ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొలి విడత గత ఏడాది అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని (ప్రభుత్వ, ప్రైవేట్) 60,401 పాఠశాలల్లో 66,15,467 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 4,36,979 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించారు. రెండవ విడత కార్యక్రమంలో వీరికి పరీక్షలు నిర్వహించి 2,40,997 మందికి ఔషధాలు పంపిణీ చేశారు. 1,52,779 మంది విద్యార్థులకు కళ్లద్దాలు ఇవ్వాలని వైద్యులు సూచించగా, ఈ నెల 15వ తేదీ వరకు 56,767 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 46,286 మంది విద్యార్థులకు మూడోసారి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 2,177 మంది విద్యార్థులకు శస్త్ర చికిత్స అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరతారు. 10.30 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రథమ, ద్వితీయ దశల్లో చికిత్స చేయించుకున్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేస్తారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రధాన మంత్రి వందన యోజనను అమలు చేసినందుకు జాతీయ అవార్డులు పొందిన మెడికల్ అధికారులను సత్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరం వెళ్లి, తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత సీఎం తొలిసారి జిల్లా పర్యటనకు వస్తుండడంతో 25 వేల మందితో మానవహారం ద్వారా ఘన స్వాగతం పలకనున్నారు. నాడు–నేడులో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాలకు శంకుస్థాపన నాడు–నేడు కార్యక్రమం కింద గ్రామీణ స్థాయిలో ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాలను ‘హెల్త్ అండ్ వెల్నెస్’ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలులో శంకుస్థాపన చేస్తారు. సభా ప్రాంగణంలో నిర్మించిన మోడల్ ‘హెల్త్ అండ్ వెల్నెస్’ సెంటర్ను సందర్శిస్తారు. - కంటి పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ఏ రోజుకారోజు ఏఎన్ఎంలు గ్రామ సచివాలయం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంప్యూటరీకరించనున్నారు. - ప్రాథమిక స్కీనింగ్ బృందం రోజుకు 50 నుంచి 100 మందికి పరీక్షలు చేయనుంది. - మంచంలో ఉన్న అవ్వాతాతల ఇళ్లకే వెళ్లి ప్రాథమిక స్క్రీనింగ్ చేయనున్నారు. - వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అవ్వాతాతలను గ్రామ సచివాలయాల్లోని స్క్రీనింగ్ కేంద్రాలకు తీసుకువస్తారు. అక్కడే ప్రాథమిక స్క్రీనింగ్, అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. -
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి
-
‘ఆసరా’తో ఆదుకుంటాం
మంచి పాలన అందుతున్నప్పుడు, వేలెత్తి చూపించే పరిస్థితులు ఏవీ లేనప్పుడు చిన్నచిన్న వాటిని, మనకు సంబంధం లేని అంశాలను కూడా పెద్ద సమస్యలుగా చూపించే ప్రయత్నాలు ఇవాళ జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతా. మీ అందరి దీవెనలు, దేవుడి దయ... వీటిమీదే నేను గట్టిగా నమ్మకం ఉంచా. మొదటి నుంచి కూడా వీటినే నమ్ముకున్నా. ఈరోజు కూడా మిమ్మల్నే, దేవుడినే నమ్ముకుంటా.. – సీఎం జగన్ సాక్షి, అమరావతి బ్యూరో: మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతున్నామని సోమవారం గుంటూరులో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఉండే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత రోగికి రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు అందిస్తామని తెలిపారు. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర జీవనభృతిని అందిస్తామని సీఎం వివరించారు. మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చేసి అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇందుకోసం రూ.13 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. మాట నిలబెట్టుకుంటున్నా... ‘నా పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా ఈరోజు ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన జరుగుతుంటే జీర్ణించుకోలేక ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. గుంటూరు వేదికగా ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. పేదలు ఆపరేషన్ తరువాత ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనను పక్కనపెట్టి కడుపు నిండటం కోసం మళ్లీ పనుల కోసం పరుగెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్ని మారుస్తూ శస్త్రచికిత్స అనంతరం రోగిని ఆప్యాయంగా పలుకరిస్తూ కోలుకునేందుకు వీలుగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా దీన్ని ప్రారంభించాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో రోగులు ఇంట్లో పస్తులు ఉండకుండా రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేల వరకు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర ఈ జీవనోపాధి భృతిని అందజేస్తాం. ఏ ఆపరేషన్కు ఎంత ఖర్చు అవుతుంది? ఈ సహాయం ఎంత కాలం ఇవ్వాలన్నది నిపుణులతో కూడిన డాక్టర్లు నిర్ణయిస్తారు. సంపాదించే వ్యక్తి రోగాలతో బాధపడుతుంటే ఆ కుటుంబాలు ఆదాయం లేక ఎంత సతమతమవుతాయో నా పాదయాత్రలో కళ్లారా చూశా. ఆ కుటుంబాలన్నింటికీ ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను...’’ అని ఆ రోజు చెప్పా. ఇప్పుడా మాట నిలబెట్టుకుంటున్నందుకు గర్వంగా ఉంది. గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన సభలో హాజరైన ప్రజలు జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. 3,648 కిలోమీటర్ల మేర సాగిన నా పాదయాత్రలో ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే.. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. అందులో భాగంగా వారికి జనవరి 1వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ చేస్తాం. కార్డుతో పాటు క్యూఆర్ కోడ్లో పేషెంట్కు సంబంధించి మెడికల్ రిపోర్టును పొందుపరుస్తాం. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీని 1,200 చికిత్సలకు విస్తరిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,000 చికిత్సలను చేరుస్తాం. తొలిదశలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో దీన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మూడు మహానగరాల్లోనూ వర్తింపు వచ్చే ఏప్రిల్ నాటికి 104, 108 వాహనాలు కొత్తవి 1,060 కొనుగోలు చేస్తాం. ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లోనే మంచి అంబులెన్స్ మీ ముందు ఉంటుంది. మంచి ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా ఉచితంగా మెరుగైన వైద్యం అందించి చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్లేలా చూస్తాం. మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఇబ్బంది పడకుండా చెక్కు మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి తెస్తాం. ఆరోగ్యశ్రీలో పెనుమార్పులు తెస్తూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో నవంబర్ 1 నుంచే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. రోగులకు మొక్కుబడిగా కాకుండా మెరుగైన సేవలు అందించేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలి. ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘ఏ’ ప్లస్ గ్రేడ్కి ఆర్నెళ్లలో మారాలి. అలా మారని ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ నుంచి తొలగిస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ ‘వైఎస్సార్ కంటి వెలుగు’.. ఆర్నెళ్లు తిరగక ముందే ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఓ వర్గాన్ని ఈ పథకంలోకి తెస్తాం. విద్యార్థుల తర్వాత అవ్వా తాతలకు దీన్ని వర్తింపజేస్తాం. ఆ తర్వాత ఆర్నెళ్లకు రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తానికి పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో 510 రకాల ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెల 15వతేదీ నుంచి 510 రకాల మందులను అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన ఔషధాలను మాత్రమే అందుబాటులోకి తెస్తాం. డయాలసిస్ రోగులకు మన ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా జనవరి 1 నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం. ప్రమాదాలు, పక్షవాతం, నరాల బలహీనత కారణంగా వీల్ చైర్లు, మంచానికే పరిమితమైన వారికి జనవరి 1 నుంచి రూ.5 వేలు చొప్పున పెన్షన్ చెల్లిస్తాం. బోధకాలు, కిడ్నీ బాధితుల(స్టేజ్ 3, 4, 5)ను రూ.5 వేల పెన్షన్ కేటగిరీలోకి తెస్తాం. లెప్రసీ బాధితులను రూ.3 వేల పెన్షన్ కేటగిరీలోకి తెచ్చి ప్రతి రోగికీ నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తాం. కేన్సర్ పేషెంట్లను కూడా మార్పులతో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం. వారికి ఎన్ని దశల చికిత్స అవసరమైన పూర్తిగా భరిస్తాం. పుట్టుకతో మూగ, చెవుడు లోపం కలిగిన చిన్నారులకు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అందచేస్తాం. అలవాట్లు మారినప్పుడే... ప్రజల అలవాట్లు మారినప్పుడే వైద్యంపై ప్రభుత్వం వెచ్చించే ఖర్చు తగ్గుతుంది. అందుకనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రిస్తున్నాం. దాదాపు 43 వేల బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్రూంలు లేకుండా చేశాం. 4,500 మద్యం షాపులను 3,500కి తగ్గించాం. పర్మిట్ రూమ్లు లేకుండా చేస్తున్నాం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం షాపులను మూసివేస్తున్నాం. ప్రైవేట్ వ్యాపారుల్లాగా లాభాపేక్ష ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేశాం. బార్లను కూడా 40 శాతం తగ్గించేశాం. మద్యం ధరలు షాక్ కొట్టేలాగే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందని నమ్ముతున్నాం. మూడేళ్లలో రూపురేఖలు మార్చేస్తాం డిసెంబర్ చివరి వారంలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రూ.13 వేల కోట్లు వెచ్చిస్తాం. విజయనగరం, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, గురజాల, మార్కాపురం, పులివెందులలో బోధనాస్పత్రులను ఏర్పాటు చేస్తాం. మే నెల నాటికి డాక్టర్లు, నర్సులు, ఇతర ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఈ అడుగులు ఒకవైపు వేస్తూనే ఒక మంచి సమాజం ఉండాలనే ఉద్దేశంతో స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. నిధుల కొరత ఉన్నా, నావద్ద ఎలాంటి మంత్రదండం లేకున్నా.. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజల దీవెనతో అడుగులు ముందుకు పడతాయనే నమ్మకంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’’ -
ముందు ‘చూపు’ భేష్
‘సర్వేంద్రియాణాం.. నయనం ప్రధానం’ అన్నారు. చూపు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దని దీని అర్థం. ఈ విషయం తెలిసినా చాలా మంది వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేస్తుంటారు. పేదరికం వల్ల చాలా మంది కంటి పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడుతుంటారు. ఈ విషయాన్ని సీరియస్గా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని తీసుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా వట్లూరులో మూడవ తరగతి చదువుతున్న పఠాన్ అన్సర్ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. తనకు కంటి చూపు బాగుందో లేదో కూడా తెలియదు. డాక్టర్లు స్కూలుకు వచ్చి పరీక్షలు చేశాక చూపులో సమస్య ఉందని తేలింది. విశాఖపట్నంలోని ఓ మున్సిపల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న లక్ష్మికుమారిదీ ఇదే సమస్య. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ద్వారా వీరి సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు లక్షలాది మంది చిన్నారుల కళ్లలో వెలుగు నింపుతోంది. కంటిచూపు మందగించినా, అక్షరాలు మసక మసకగా కనిపించినా.. సమీపంలో డాక్టరు లేక, ఉన్నా వైద్యానికి ఖర్చు చేయలేక అలాగే ఉండిపోయి ఇబ్బందులు పడుతున్న ఎందరో చిన్నారులకు వైఎస్సార్ కంటి వెలుగు పథకం వరంగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..60,668 స్కూళ్లలో 69,43,052 లక్షల మంది చిన్నారులకు ఈ పథకం కింద కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం మహోద్యమంలా సాగుతో ఇప్పటివరకు 2,12,024 మంది బాలికలకు, 2,18,898 మంది బాలురకు కంటి సమస్యలు ఉన్నట్టు తేలింది. మొత్తంగా బాలురలోనే ఎక్కువ కంటి సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో పెద్ద పెద్ద సమస్యలున్న చిన్నారులందరికీ బోధనాసుపత్రిలో మెరుగైన వైద్యం (శస్త్రచికిత్స) చేయించి, ఉచితంగా కళ్లజోడు ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలులో ప్రభుత్వ వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖ అధికారులు ఇలా ఎంతోమంది భాగస్వాములయ్యారు. మొత్తం ఆరు దశల్లో జరిగే కార్యక్రమంలో త్వరలోనే పెద్దవారికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తారు. మేమే వాళ్ల దగ్గరకు వెళ్లాం వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రజల చెంతకే వెళ్లి సేవలందించే పథకం. వైద్యులు, వైద్య సిబ్బంది స్కూళ్లకు వెళ్లకపోతే ఆ చిన్నారులు ఆస్పత్రులకు రాలేరు. దీనివల్ల వారికి ఉన్న సమస్యలూ గుర్తించలేం. సమస్య తీవ్రతరమయ్యాక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ పథకం వల్ల కంటి సమస్యలు గుర్తించే ప్రక్రియ సులభమవుతోంది. ఉపాధ్యాయులకు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తే ప్రాథమికంగా కంటి సమస్యలు గుర్తించ వచ్చు. ఆరు మీటర్ల దూరంలో ఒక చార్ట్ ఇచ్చి అక్షరాలు చదవమంటే వారిలో దృష్టి లోపం ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. విటమిన్ ఎ ద్రావణం తగినంత లేదు. ఇది పుష్కలంగా సరఫరా చేయాల్సి ఉంది. 50 ఏళ్లు దాటితే ఏడాదికోసారి కంటి పరీక్షలు విధిగా అవసరం. – డా.పల్లంరెడ్డి నివేదిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు చాలా బాగుంది పాఠశాల విద్య అభ్యసించే చిన్నారులందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తుండటం చాలా గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరూ పేద, మధ్యతరగతి వారే. వారంతకు వారు స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వీలుండేది కాదు. అటువంటిది వైద్యులే పాఠశాలకు వచ్చి పరీక్షలు నిర్వహించడం చాలా బాగుంది. –పి. నాగమణి, ప్రధానోపాధ్యాయురాలు, నగరపాలకోన్నత పాఠశాల (మెయిన్), కడప మంచి పరిణామం ప్రజల నేత్ర సంరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో బాగుంది. పాఠశాలలకే వెళ్లి, విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి కళ్లజోళ్లు ఉచితంగా అందించడం, శస్త్ర చికిత్సలను సైతం ఉచితంగా చేయించాలని నిర్ణయించడం మంచి పరిణామం. – గోదా నాగలక్ష్మి, గుంటూరు గుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ జిల్లాలో 47,499 మంది స్కూలు విద్యార్థులు కంటి చూపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 46,002 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. కంటి పరీక్షల స్క్రీనింగ్లోనూ, బాధితుల సంఖ్యలోనూ విజయనగరం జిల్లా చివరలో ఉంది. ఇక్కడ 3,03,819 మందికి పరీక్షలు నిర్వహించగా, 12,959 మంది విద్యార్థులకు మాత్రమే కంటి సమస్యలున్నాయి. -
‘కంటి వెలుగు’లో... రాష్ట్రంలోనే నెం.1
దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఓ చిన్నారి అంధత్వం బారిన పడుతోందని పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. పదో తరగతి గదిలో నల్లబల్లలపై రాసిన అక్షరాలు కనిపించక..దృష్టి లోపమని ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థులు సతమతమతమయ్యేవారు. ఈ దుర్భర స్థితిని దూరం చేసి దృష్టిలోపాన్ని నివారించాలనే ఉన్నత ఆశయంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకం ప్రవేశ పెట్టి చిన్నారులకు చూపును ప్రసాదిస్తోంది. సాక్షి, కాకినాడ: విద్యార్థులకు దశల వారీగా కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేసి, కళ్లద్దాలు అందజేసే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ సర్కారు కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు తొలి విడత కంటి పరీక్షలు పూర్తి చేశారు. ఈ పరీక్షల్లో 33,391 మంది విద్యార్థులకు కంటి సంబంధిత సమస్యలున్నట్లు గుర్తించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని మొత్తం 5,998 పాఠశాలల్లో 7,27,609 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ (కంటి పరీక్షలు) టెస్ట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా..5,996 పాఠశాలల్లో 7,04,570 మందికి పరీక్షలు నిర్వహించారు. మిగిలిన కొన్ని పాఠశాలలకు సెలవులు కావడం, గతంలో పరీక్షలకు రాని 23,039 మంది విద్యార్థులకు ఇంకా పరీక్షలు చేయాల్సి ఉంది. స్క్రీనింగ్ టెస్ట్లో 97 శాతం పూర్తి చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సంపాదించింది. బృందాల వారీగా.. ఈ పథకం తొలి విడత అమలు ప్రక్రియ కోసం జిల్లా వ్యాప్తంగా 4,550 బృందాలను నియమించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 5,000 కంటి వెలుగు కిట్లు అందజేశారు. ఒక ఉపాధ్యాయుడు, ఏఎన్ఎం, ఆశ, కార్యకర్తలను బృందంలో సభ్యులుగా నియమించారు. విద్యార్థుల దృష్టి లోపాలను ఎలా గుర్తించాలనే విషయంపై ఈ బృందాల్లోని సభ్యులకు ముందుగానే శిక్షణ ఇచ్చారు. నేత్ర సమస్యలను గుర్తించేందుకు వీలుగా అందజేసిన కిట్లో టార్చిలైట్లు, టేపు, నాలుగు గుర్తులతో కూడిన చార్టులను ఉంచారు. విద్యార్థికి 6 నుంచి 10 అడుగుల దూరంలో చార్ట్ను ఉంచి గుర్తులను పోల్చి చెప్పాలని పరీక్ష పెడుతూ దృష్టిలోపం ఉందో లేదో గుర్తించారు. కనుపాప పైపొరలు, దృష్టిలోపం ఉన్న 33,391 మందిని కంటి వెలుగు పథకంలో తొలి విడతలో గుర్తించారు. 33,391 మందికి దృష్టిలోపం స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో 33,391 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించారు. అయితే వీళ్లలో కళ్లజోళ్లతోనే ఎక్కువ మందిలో సమస్య తీరిపోతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కొద్ది మందికి శస్త్రచికిత్సలు, ఉన్నత వైద్యం అవసరం కానుంది. కారణాలు ఏమిటంటే.. పిల్లల్లో దృష్టి లోపానికి మేనరిక వివాహాలు, పౌష్టికాహార లేమి, విటమిన్–ఎ లోపం, ఎలక్ట్రానిక్ రేడియేషన్, వంశపారంపర్యం ప్రధాన కారణాలని వైద్యులు ధ్రువీకరించారు. జంక్ఫుడ్ అధికంగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం, తరగతి గదుల్లో సరైన వెలుతురు లేకపోవడం, బోర్డు నుంచి వచ్చే చాక్పీస్ పొడి కళ్లలో పడటం లాంటివి కూడా సమస్యకు దారి తీస్తాయంటున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు ఆటలు, వ్యాయామానికి తగిన సమయం ఇవ్వడం లేదు. ఇరుకు గదుల్లో తగినంత దూరంలో బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. తరగతి గదిలో కనీసం దూరంలో బోర్డు ఉండాలి అప్పుడే పిల్లల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. సరైన వెలుతురు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో బోర్డు, వెలుతురు సమస్య అంతగాలేదు. చిన్న వయసు నుంచే ట్యాబ్లు, సెల్ఫోన్లకు అలవాటుపడి..గంటల తరబడి చూడటం కూడా దృష్టి లోపాలకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు నవంబర్ 1వ తేదీ నుంచి రెండో దశ ప్రాథమిక దశలో నిర్వహించిన పరీక్షల్లో నేత్ర సమస్యలున్నట్లు గుర్తించిన వారికి రెండో దశలో ప్రత్యేక పరీక్షలు చేయనున్నారు. నవంబరు 1వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభం కానుండగా కంటి వైద్యుల పర్యవేక్షణలో మరోసారి పరీక్షలు చేస్తారు. పరీక్షించిన వారిలో ఇప్పటికే 7,877 మందికి కళ్లద్దాలు ఉన్నాయి. వారికి అవసరం మేరకు అద్దాలను మార్చడం, అద్దాలు లేని వారికి కొత్తగా కళ్లద్దాలు అందజేస్తారు. శస్త్ర చికిత్సలు అవసరమైతే నేత్ర వైద్యశాలకు తీసుకెళ్లి చేయించనున్నారు. చిన్నారుల్లో కార్నియా సమస్యలే అధికంగా ఉంటున్నాయని, పోషకాహార లోపం జన్యుపరమైన సమస్యలతో ఇబ్బంది పడేవారే ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. జాగ్రత్తలు పాటిస్తే మేలు కంటి సమస్యలను దూరం చేసేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తే ఉపయోగం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఆటలు అవసరం. విటమిన్–ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, గుడ్లు, చేపలు తీసుకోవాలి. పసుపు రంగు కలిగిన పండ్లు తినాలి. బొప్పాయి, అరటి, మామిడి, పైనాపిల్, పనస తదితర పండ్లు కళ్లు, మెదడుకు మంచిది. 100 శాతం అమలు చేస్తాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని వంద శాతం పూర్తి చేస్తాం. తొలి దశలో ప్రాథమిక పరీక్షల్లో ఆరు మీటర్ల దూరంలో నిర్ణీత పరిమాణం కలిగిన అక్షరాలను పూర్తిగా చెప్పలేపోయిన వారిని గుర్తించాం. విడివిడిగా రెండు కళ్లూ పరీక్షించాం. రెండో దశలో నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు నిపుణులు పరీక్షిస్తారు. ఇందుకు గాను 30 మంది ఆప్తమాలజిస్టులు అవసరమని కోరాం. రెండో దశలో కంటి సమస్యలు గుర్తించిన వారికి అవసరాన్ని బట్టి మందులు, కళ్లజోళ్లు అందజేస్తాం. శుక్లాల సమస్య ఉన్న వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ప్రస్తుతం నవోదయ లాంటి కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు అందుబాటులో లేరు. వారికి కూడా నేత్ర పరీక్షలు ఇదే తరహాలో నిర్వహిస్తాం. – డాక్టర్ పి.మల్లికార్జునరాజు, కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ -
నేత్ర పరీక్షల్లో నంబర్ వన్
సాక్షి ప్రతినిధి విజయనగరం: సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. చూపు ఉంటే చక్కగా చదువుకోవచ్చు.. నచ్చిన రంగంలో రాణించవచ్చు. అన్ని పనులూ చకచకా పూర్తిచేయవచ్చు. అందుకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేత్ర సంరక్షణకు పెద్దపీట వేసింది. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో నేత్ర సమస్యలను తొలగిస్తోంది. వారు చదువుకునే పాఠశాలకే వైద్యులను పంపించి పరీక్షలు చేయిస్తోంది. ఉచితంగా మందులు అందజేస్తోంది. చిన్నవయస్సులోనే కంటి సమస్యలను దూరం చేసేందుకు కృషిచేస్తోంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా.. దృష్టిలోపాలను సరిదిద్దుతోంది. వైఎస్సాఆర్ కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని ముందువరుసలో నిలుస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషిస్తున్నారు. పథకం సత్ఫలితాలనిస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు. పరీక్షలు ఇలా... జిల్లాలో 3,03,819 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 2,34,993 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 77.34 శాతం పరీక్షలు పూర్తి చేసిన జిల్లాగా విజయనగరం జిల్లా రికార్డు సృష్టించింది. పరీక్షలు చేయించుకున్న విద్యార్థుల్లో 10,909కి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో సాధారణ కంటి అద్దాలు ధరించిన వారు 2,239 మంది మాత్రమే కాగా దృష్టిలోపం ఉండి కూడా అద్దాలు ధరించని వారు 1750 మంది. 9,159 మందికి కంటి అద్దాలు అవసరమని పరీక్షల్లో నిర్ధారించారు. జిల్లాలో 3,396 పాఠశాలలు ఉండగా ఇంతవరకు 3,209 పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో నిర్ణయించారు. దీంతో జిల్లాలోని ఇంటర్ కళాశాలలు ప్రభుత్వ– 24, ప్రైవేటు–56, డ్రిగ్రీ ప్రభుత్వ– 6, ప్రైవేటు–16 కళాశాలల్లో చదువుతున్న సుమారు 66 వేలమంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయనున్నారు. అందరికీ కంటి వెలుగు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. పరీక్షల అనంతరం అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్సలు, కళ్లద్దాల పంపిణీ వేగంగా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ కావడానికి కంటి సమస్యలు కూడా కారణం. గిరిజన పాఠశాలల్లో ఎక్కువ మంది కంటి సమస్యల కారణంగా సబ్జెక్టుల్లో వెనకబడుతున్నారు. దీనిపై దృష్టి సారించాలని ఐటీడీఎ కొత్త పీఓకి కూడా చెప్పాం. కంటి సమస్యలతో ఏ విద్యార్థీ బాధపడకూడదు, అవకాశాలను పోగొట్టుకోకూడదన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. – డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా వెలుగులు నింపుతున్నారు.. మా అమ్మాయి భీమవనం యూపీ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల కంటి పరీ క్షలు నిర్వహించారు. సమస్యలు గుర్తించి మందు లు అందజేశారు. మాలాంటి నిరుపేదల పిల్లలకు వైద్య పరీక్షలు చేసి వెలుగులు నింపుతున్నారు. – తొత్తల సత్యవతి, విద్యార్థిని తల్లి, చినభీమవరం, బాడంగి కంటివెలుగయ్యాడు.. ముఖ్యమంత్రి జగనన్న విద్యార్థుల పాలిట కంటివెలుగయ్యాడు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలు ఒక్కొక్కటి అమలుచేస్తూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాడు. కంటివెలుగు పథకంతో విద్యార్థులకు చూపు ప్రసాదిస్తున్నాడు. నేత్ర సమస్యలను పరిష్కరిస్తున్నాడు. ఆయన మేలు మరువలేం. – గొంప ఉమా, రామలింగపురం, విద్యార్థి తల్లి చదువుకు సాయం.. పిల్లల్లో కంటి సమస్యలు పరిష్కరించడం వల్ల పిల్లలు చక్కగా చదువుకునేందుకు అవ కాశం కలుగుతుంది. సీఎంగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే అన్నిరకాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారు. నేత్ర సంరక్షణకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషదగ్గ అంశం. – భవాని, వీబీపురం, విద్యార్థి తల్లి ముందు‘చూపు’ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వైఎస్సార్ కంటివెలుగు పథకం అమలు చేయడం ఆనందదాయకం. విద్యార్థులకు చిన్న వయస్సులోనే కంటి సమస్యలు తెలుస్తాయి. పరిష్కారమవుతాయి. మంచి కార్యక్రమం. – బొద్దాన దేముడు, వేపాడ ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మంచి కార్యక్రమం.. సీఎం జగన్మోహన్రెడ్డి విద్యార్థుల్లో అంధత్వ నివారణ కోసం అమలుచేసిన కం టివెలుగు కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. పైసా ఖర్చులేకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సంతోషకరం. పేదలకు కంటి వెలుగు నివ్వడం దేవుడిచ్చిన వరం లాంటిది. – ఎలకల రాంబాబు, జోగులడుమ్మ నేత్ర సమస్యలకు చెక్.. ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల కళ్లను పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తుండడం ఆనందం గా ఉంది. చిన్నవయస్సులోనే నేత్ర సమస్యలకు చెక్ పెట్టేందుకు వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం అమలు చేయడం మంచి నిర్ణయం. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాం. – రాయగడ సూర్యశేఖర్, జియ్యమ్మవలస -
కంటి వెలుగు ప్రసాదించాలని..
విశాఖ, చింతపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి దశలో ఈ నెల 15వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దసరా సెలవులు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసినప్పటికీ మారుమూల గ్రామాల పిల్లలు నేటికీ పాఠశాలలకు చేరుకోలేదు. దీంతో ఉపాధ్యాయులు వారి కోసం గ్రామాలకు వెళుతున్నారు. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు.. గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చింతపల్లి మండలం బలపం పాఠశాల పరిధిలోని గ్రామాల విద్యార్థులు శనివారం కూడా హాజరు కాకపోవడంతో ఉపాధ్యాయులు వారికోసం అన్వేషణ ప్రారంభించారు. ఆదివారం ఉప్పొంగి ప్రవహిస్తున్న చెరువూరు వాగును దాటి గ్రామాల్లోకి వెళ్లి పిల్లలను గుర్తించి నేత్ర పరీక్షలు నిర్వహించారు. -
కంటి వెలుగు
-
వైఎస్ఆర్ కంటి వెలుగు
-
మీ మనవడిని.. మీ ‘కంటి వెలుగు’ని..
కరువు సీమ మురిసిపోయింది. రాజన్న బిడ్డకు అడుగడుగునా బ్రహ్మరథం లభించింది. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలో తొలి అడుగు వేసిన వైఎస్ జగన్ను జిల్లా ప్రజానీకం అక్కున చేర్చుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి.. అనతికాలంలోనే హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ.. ప్రజల ‘కంటి వెలుగు’గా మారిన సీఎం మరోసారి అనంతపురం జిల్లాపై వరాల వర్షం కురిపించారు. తన చిరునవ్వులతో అందరి హృదయాలను చూరగొన్నారు. సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు విచ్చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంత రైతాంగంపై వరాల జల్లు కురిపించారు. తాగు, సాగునీటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గురువారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం జిల్లా వాసులను ఆకట్టుకుంది. హంద్రీ–నీవా కాలువ ద్వారా ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీరుకూడా రావడం లేదన్నారు. ఈ కాలువను ఆధునీకరించి 6వేల క్యూసెక్కుల నీటిని ఇదే కాలువ గుండా ప్రవహించేలా చేస్తామన్నారు. ఇదొక్కటే కాకుండా ఈ కాలువ పక్కనే మరో 4వేల క్యూసెక్కుల సామర్థ్యం కల్గిన సమాంతర కాలువ పనులు కూడా చేపడతామన్నారు. జిల్లాను దేవుడు ఆశీర్వదించాడని, పదేళ్లుగా ఎప్పుడూ నిండని విధంగా ఈసారి చెరువులు నిండాయన్నారు. ‘గతంలో దివంగత నేత వైఎస్ హయాంలో చూశాం. మళ్లీ ఇవాల మా మనవడి పరిపానలో చూస్తున్నామని సగర్వంగా జిల్లా ప్రజలు చెబుతున్న మాటలు వింటున్నా’ అన్నారు. మీ అందరి తోడు, ఆశీస్సులు, దీవెనులు మీ బిడ్డకు ఇవ్వండి. మీ అందరి మన్ననలు పొందేలా పరిపాలన చేస్తాడని హామీ ఇచ్చారు. బీసీల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోయారు: మంత్రి శంకరనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. జ్యోతిరావు ఫూలే ఆలోచనలకు అనుగుణంగా ఆయా వర్గాలకు నామినేటెడ్ పదువులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పరిశ్రమల్లోనూ స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నారన్నారు. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు అడుగులేస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైద్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్రెడ్డి, మహ్మద్ ఇక్బాల్, కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, డాక్టర్ సిద్దారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జవహర్రెడ్డి, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్తికేయమిశ్రా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ అరుణకుమారి, జేసీ డిల్లీరావు, కమిషనర్ పి.ప్రశాంతి, జేసీ–2 సుబ్బరాజు, డీఎంఈ డాక్టర్ వెంకటేశ్, డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, గురునాథరెడ్డి, శివరామిరెడ్డి, నాయకులు నదీంఅహమ్మద్, నవీన్నిశ్చల్, మహలక్ష్మీ శ్రీనివాస్, ఆలూరి సాంబశివారెడ్డి, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప, రైతు మిషన్ సభ్యులు రాజారాం, చవ్వా రాజశేఖర్రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ లింగాల శివశంకర్రెడ్డి, వైవీ శివారెడ్డి, తోపుదుర్తి చందు, వీఆర్ రామిరెడ్డి, మధుసూదన్రెడ్డి, అనంత చంద్రారెడ్డి, కోగటం విజయభాస్కర్రెడ్డి, గౌస్బేగ్, వెన్నపూస రవీంద్రారెడ్డి, బీసీ రమేష్గౌడ్, ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ కంటి వెలుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు కూడా చేయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతపురంలో గురువారం ఆయన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పూర్తి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన చికిత్సలు, కళ్ల జోళ్లను అందిస్తామన్నారు.రూ.560 కోట్లతో మూడేళ్ల పాటు చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో వెలుగులు నింపుతామని, ప్రతి కంటిలో వెలుగు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం అని వివరించారు. ఒకటి.. రెండవ దశల్లో పిల్లలకు పరీక్షలు చేసి చికిత్స అందిస్తామని సీఎం తెలిపారు. అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని 62,489 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70,41,988 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేస్తామన్నారు. ఇందుకోసం వలంటీర్లతో పాటు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు, ఇతర మెడికల్ సిబ్బంది సహకారం తీసుకుంటామని చెప్పారు. రెండవ దశలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అవసరమైన వారికి మరిన్ని పరీక్షలు చేయడంతో పాటు కంటి చికిత్సలు చేయడం, కళ్ల జోళ్లను అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఒక్కో దశ కార్యక్రమాన్ని 6 నెలల పాటు చేపట్టి.. మొత్తం కార్యక్రమాన్ని 31 జనవరి 2022 నాటికి పూర్తి చేస్తామన్నారు. పిల్లల తర్వాత అవ్వా, తాతలకు కంటి పరీక్షలు చేస్తామని, ఈ విధంగా రాష్ట్రంలోని 5.4 కోట్ల మందికి కంటి పరీక్షలు చేపట్టి, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయిస్తామని వైఎస్ జగన్ వివరించారు. రోగులు కోలుకునే వరకు సాయం తలసేమియా రోగులకు జనవరి నుంచి రూ.10 వేల పింఛన్ పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా పెరాలసిస్తో పాటు మరో 4 రకాల రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. వీరికి కూడా జనవరి నెల నుంచి పింఛన్ ఇస్తామన్నారు. ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల ఆపరేషన్ల అనంతరం రోగులు కోలుకునే వరకు ఖర్చుల కింద రోజుకు రూ.225 చొప్పున లేదా ఎక్కువ రోజులైతే నెలకు రూ.5 వేలు సాయం డిసెంబర్ నుంచి అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్తగా డిసెంబర్ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు గత ప్రభుత్వం బకాయిపడిన రూ.650 కోట్లలో రూ.540 కోట్లు చెల్లించామన్నారు. రూ.1,000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామని.. జనవరి 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులకు అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాకు ఈ పథకం అమలును విస్తరిస్తామని చెప్పారు. నవంబర్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఎంపిక చేసిన 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలును విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసని, వాటిని పూర్తిగా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇందుకోసం జనవరి 2020 నుంచి జూన్ 2022 వరకు ఆధునికీకరణ, మరమ్మతు పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది? ప్రస్తుతం ఎలా ఉందనే వివరాలను ఫొటోలతో సహా ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు.ప్రజల ఆరోగ్య డేటాను భద్రపరచి డేటా స్టోరేజీ ఫెసిలిటీని అందుబాటులో ఉంచడం ద్వారా ఏ ఆసుపత్రికి వెళ్లినా సదరు రోగి పాత రికార్డు కూడా డాక్టర్లు సులువుగా తెలుసుకుని వైద్యం అందించేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కిడ్నీ రోగుల కోసం ప్రత్యేకంగా కిడ్నీ రిసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు పలాస వంటి ప్రాంతాలకు మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేస్తామన్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మార్చి నాటికి కొత్త 108, 104 వాహనాలు గత ప్రభుత్వం 108 వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని, ఫోన్ చేస్తే కుయ్..కుయ్ అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన వాహనం రావడం లేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మండలానికి ఒక్కో 108, 104 వాహనాన్ని సమకూర్చేందుకు 432.. 108 వాహనాలు, 676.. 104 వాహనాలు మొత్తం 1,108 వాహనాల కోసం టెండర్లు పిలిచామన్నారు. మార్చి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని జగన్ హామీ ఇచ్చారు. మార్కాపురం, పిడుగురాళ్ల, ఏలూరు, పులివెందులలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని.. ఇప్పటికే ఏలూరులో మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన కూడా చేశామన్నారు. కాగా, అంతకు ముందు సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్లనాని, శంకర్నారాయణ, కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మన కళ్లు మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. పుట్టగానే అమ్మ ఎలా ఉంటుందనేది పరిచయం చేసేది మన కళ్లే. అటువంటి కళ్లకు సంబంధించి ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటే.. 5.40 కోట్ల జనాభాలో ఏకంగా 2.12 కోట్ల మందికి చూపుపరంగా సమస్యలు ఉన్నాయి. మనం కొంచెం శ్రద్ధ పెడితే దాదాపు 80 శాతం సమస్యలు పూర్తిగా నయమవుతాయి. అందుకే రూ.560 కోట్లతో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ప్రారంభించాం. – సీఎం వైఎస్ జగన్ ►అనంతపురం జిల్లాకు నేను మనవడిని. అమ్మ విజయమ్మ ఇక్కడి ఆడపడుచు. ఈ జిల్లాకు మనవడిగా అన్ని విధాలా అభివృద్ధి చేసి, రూపురేఖలు మారుస్తాను. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో సమాంతర కాలువ నిర్మిస్తాం. -
‘వైఎస్సార్ కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం జగన్
-
సంపూర్ణ ఆరోగ్యమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, కృష్ణాజిల్లా: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపునందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వి నియోగ పరుచుకోవాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో "వైఎస్సార్ కంటి వెలుగు" పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు బాలికలతో పాటు ఎమ్మెల్యే ప్రతాప్ సయితం వైద్యుల చేత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పరీక్షలు చేయించుకున్న బాలికలకు కార్డులు అందజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ నాయకుడి లక్ష్యం అన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఉపవైద్య అధికారి డి.ఆశా, వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు తీరును వివరించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికే: ఎమ్మెల్యే అనిల్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన"వైఎస్సార్ కంటి వెలుగు" పథకం చాలా అద్బుతం అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా పామర్రు జడ్పీ హైస్కూల్లో "వైఎస్సార్ కంటివెలుగు" పథకాన్ని అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు వల్ల కంటి సమస్యలను గుర్తించి కళ్ళజోళ్ళను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్ది దశలోనే కంటి సమస్యలను గుర్తిస్తే వారి భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కూచిపూడిలో ఆటోవాలాల సంబరాలు.. మాటతప్పని మడమతిప్పని నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో ఆటోవాలాల సంబరాలు అంబరాన్నంటాయి. కూచిపూడి ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక నాలుగురోడ్ల కూడలిలో ఆటోవాలాలు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ను ఊరేగింపుగా తీసుకెళ్ళి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మానసభలో ఎమ్మెల్యేను ఆటోవాలాలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 1.37 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో సఫలీకృతులయ్యారని.. దీన్ని కూడా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వటం ఏ ప్రభుత్వం చేయలేదని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ తన సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఆటో కార్మికుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒక్క వైసీపీ మాత్రమే ఆలోచించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆటో కార్మికులకు రూ.10 వేలు నగదు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోయూనియన్ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
తండ్రి ఆరోగ్యశ్రీ.. తనయుడు కంటి వెలుగు
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం ఉన్న నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ కంటివెలుగు’ కార్యక్రమాన్ని ఆమె గురువారం చిత్తూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ కంటివెలుగు’ కార్యక్రమం పేద ప్రజలకు మరో సంజీవని వంటిదని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారు.. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ రెండు అడుగులు ముందుకువేసి ‘వైఎస్సార్ కంటివెలగు’ను ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ కంటి సంబంధిత జబ్బులు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని.. ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రోజా పేర్కొన్నారు. -
నాణ్యమైన విద్య, ఆరోగ్యమే లక్ష్యంగా..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అటు విద్య..ఇటు ఆర్యోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. జిల్లాలో ఏడు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రేపటి తరం కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, కళ్ల అద్దాలు ఇస్తుందని...అవసరమైతే కంటి ఆపరేషన్ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, పంచాయితీ, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా: పెనమలూరు నియోజకవర్గం కానూరు జడ్పీ హైస్కూల్లో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కంటి పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి,ఎంపీటీసీ ఛాన్బాషా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురంలోని లెనిన్ హైస్కూల్లో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో సుమారు లక్షా 60 వేల మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థి, విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా: కల్లూరు మండలం జెడ్పీ హైస్కూలులో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్ తరాల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో కంటి వెలుగు పథకాన్ని సీఎం ప్రారంభించడం అభినందనీయమని కాటసాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకానికి రూ.5లక్షల విరాళం.. అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ కంటి వెలుగు పథకానికి జంగాలపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున రెడ్డి రూ.5 లక్షలను విరాళంగా ఇచ్చారు. గురువారం అనంతపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. -
ప్రజలందరకీ ఈ సేవలు ఉచితం: డిప్యూటీ సీఎం
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు గురువారం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. క్రమంలేని ఆహార అలవాట్ల వల్ల, శరీరానికి విటమిన్లు సరిగ్గా అందక పోవడం వల్ల దృష్టి లోపం ఎక్కువగా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరికీ అలాంటి లోపం రాకూడదనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలందరికి ఈ సేవలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో మొదలు పెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరు కంటి జబ్బులతో భాదపడకూడదన్నదే సీఎం జగన్ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన భూమన .. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి కంటి పరీక్షలు చేయిస్తామని, విద్యార్థులందరిలో వెలుగు నింపడమే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. అదే విధంగా నిమ్మనపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్లో మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా.. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు యాదమరిలోని హై స్కూళ్లో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే ఎన్ ఎస్ బాబు ప్రారంభించారు. -
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన బాలినేని
-
డిసెంబర్ 1 నుంచి కొత్త ఆరోగ్య కార్డులు ఇస్తాం: సీఎం జగన్
సాక్షి, అనంతపురం: డిసెంబర్ 1 నుంచి కొత్త ఆరోగ్య కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నామని వివరించారు. అదేవిధంగా నవంబర్ 1 నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో వైద్యం చేయించుకునే నిరుపేదలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని ప్రకటించారు. గురువారం అనంతపురం జూనియర్ కాలేజీలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాపతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, పోషణ కార్యక్రమాలు, తల్లీబిడ్డల ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడారు. గురువారం ఉదయమే అనంతకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ఆవిష్కరించిన ఆనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మేనిఫేస్టొలో చెప్పకపోయినా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ప్రతి ఇంటిలో ఈ పథకం ద్వారా వెలుగులు నింపాలి ‘నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం. మన కళ్లు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అమ్మ అని పసిబిడ్డకు పరిచయం చేసేది కళ్లే. ఏపీలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటే 80 శాతం సమస్య తీరుతుంది. కంటి సమస్య నిర్లక్ష్యం చేస్తే కంటిచూపు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రజల కంటి సమస్యలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మేనిఫేస్టోలో చెప్పకపోయినా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా.. కంటి వెలుగు ప్రారంభించాం. రూ. 560 కోట్లతో పెద్ద ఎత్తున కంటివెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఉచిత చికిత్సతో పాటు, కళ్లద్దాలు కూడ ఇస్తాం. మూడేళ్ల కాలంలో ఆరు దశల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఇంటిలో ఈ పథకం ద్వారా వెలుగులు నింపాలి. అక్టోబర్ 10 నుంచి 16 వరకు తొలి దశ కార్యక్రమంలో మొత్తం 70 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తాం. పథకం గురించి అందరికీ చెప్పండి కంటి పరీక్ష తర్వాత చికిత్స అవసరం అయితే నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రెండో దశ స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు ఉచితం. ప్రజలు పైసా ఖర్చు లేకుండా కంటి వైద్యం చేయించుకోవచ్చు. మళ్లీ ఫిబ్రవరి 1 నుంచి 3,4,5,6 విడతల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తాం. 3,4,5,6 దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు జరుగుతాయి. ఏపీలో ఉన్న 5.4 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తాం. వైఎస్సార్ కంటి పథకం గురించి అందరికీ చెప్పండి. డయాలసిస్ పేషెంట్లకు రూ. 10 వేల పెన్షన్ త్వరలో 432 కొత్త 108 వాహనాలను ప్రారంభిస్తాం. అదేవిధంగా 676 కొత్త 104 వాహనాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. వెనకబడిన ప్రాంతాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. పలాస, మర్కాపురం ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తాం. డిసెంబర్లో ప్రజలందరికీ కొత్త ఆరోగ్యకార్డులు ఇస్తాం. మొత్తం 2 వేల వ్యాధులను ఆరోగ్య శ్రీలో చేరుస్తాం. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం. జనవరి 1 నుంచి డయాలసిస్ పేషెంట్లకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తాం. నవంబర్ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. నేను అనంతపురం జిల్లా మనవడిని.. మా అమ్మ విజయమ్మ మీ జిల్లా ఆడపడుచు. మీ జిల్లా రూపురేఖలు మారుస్తానని హామీ ఇస్తున్నాను’అని సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. -
విశాఖ జిల్లాలో 'వైఎస్సార్ కంటివెలుగు' ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గురువారం గాజువాక హైస్కూల్లో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ మాట్లాడుతూ... వైఎస్సార్ కoటి వెలుగుకు మద్దతుగా తాను నేత్ర దానం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి కంటి చూపు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని అన్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం నోవాటెల్లో మీటింగ్లు నిర్వహిస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజల మధ్యే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. గాజువాక అగనంపుడిలో 800 కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ సత్య నారయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, వీఎమ్మార్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కన్వీనర్లు అక్కరమని విజయ నిర్మల, మళ్ళ విజయ ప్రసాద్, కోలా గురువులు, విశాఖ జిల్లా వైద్యాధికారి తిరుపతి రావు, జీవీఎంసీ కమిషనర్ సృజన, జాయింట్ కలెక్టర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ నర్సీపట్నం: నియోజకవర్గంలోని నర్సీపట్నం బాలికల పాఠశాలలో వైఎస్సార్ కంటివెలుగు పథకాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమ శంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోవిందరావు పాల్గొన్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పథక ప్రారంభ కార్యక్రమంలో ఏర్పాట్లు పేలవంగా ఉండటంతో.. స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నిర్వాహకులపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. చోడవరం: చోడవరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఘనంగా ప్రారంభించారు. కశింకోట మండలం తాళ్లపాలెంలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. -
పథకం గురించి అందరికీ చెప్పండి
-
‘జగన్ లాంటి సీఎం ఉంటే కళ్లజోడు వచ్చేది కాదు’
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం గిలకలదిండి మున్సిపల్ స్కూల్లో మంత్రి పేర్నినాని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తో కలిసి వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. తన చినన్నప్పుడే వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉండి వుంటే ఇప్పుడు తనకు కళ్ళజోడు లేకపోయేదని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వ్యాఖ్యానించారు. అలాగే పామర్రు జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ 'వైఎస్సార్ కంటివెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభించగా, కార్యక్రమంలో కాకర్ల వెంకటేశ్వరరావు, ఆరుమళ్ళ శ్రీనాధరెడ్డి, దేవిరెడ్డి బాలవెంటేశ్వరరెడ్డి, ఆరేపల్లి శ్రీనివాసరావు, కొచ్చెర్ల శ్రీనివాసరావు, పెయ్యేల రాజు, నవుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గం కానూరు జడ్పీ హైస్కూలులో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని శాసనసభ్యుడు కొలుసు పార్థసారధి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. జడ్పీటిసి సభ్యురాలు తాతినేని పద్మావతి, స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఛాన్ బాషా కార్యక్రమంలో పాల్గొన్నారు. మైలవరం మండలం పొందుగల గ్రామం మండల పరిషత్ పాఠశాలలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన గ్రామ సచివాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యేకు సన్మానం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కూచిపూడిలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ను ఆటో యూనియన్ వర్గాలు ఘనంగా సన్మానించాయి. -
‘వైఎస్సార్ కంటి వెలుగు మరో విప్లవాత్మక పథకం’
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కంటి వెలుగు’ మరో విప్లవాత్మకమైన పథకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో దృష్టిలోపం నివారించే దిశగా బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. రెండు విడతల్లో 70 లక్షల మంది విద్యార్థులకు వైయస్ఆర్ కంటి వెలుగు పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, అనంతపురం జిల్లాలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రారంభించారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. తొలి దశలో ఈనెల 10 నుంచి 16 వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మలి దశలో దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. -
గుంటూరు: జిల్లాలో 'వైఎస్సార్ కంటివెలుగు' ప్రారంభం
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నిజాపట్నంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినుకొండ గర్ల్స్ హైస్కూల్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి హోలీ ఫ్యామిలీ స్కూల్లో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సరావుపేట అంబేద్కర్ స్కూల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పెనుమాములిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి(ఆర్కే), తెనాలి కోగంటి శివయ్య హైస్కూల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, గుంటూరు రూరల్ మండంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిలు వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
‘వైఎస్సార్ కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం జగన్
-
విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే...
సాక్షి, ఒంగోలు : బడికి వెళ్లే విద్యార్థిని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని మున్సిపల్ హైస్కూల్లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. తమ పిల్లలకు బడికి పంపిస్తున్న ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 15వేలు ఇచ్చేందుకు కార్యచరణను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. -
‘వైఎస్సార్ కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అనంతపురం: ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడతారు. గురువారం ఉదయం అనంతకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఏపీలోని 62 వేల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించగా, అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో మంత్రి కొడాలి నాని, చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో కలెక్టర్ శేషగిరిబాబు, ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ ముత్యాలరాజు ప్రారంభించారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చికిత్సలు వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత రెండో దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స చేస్తారు. కళ్లద్దాలు, క్యాటరాక్ట్ ఆపరేషన్లు, ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములవుతారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)కు నేత్ర పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపించారు. 42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మొత్తం ఆరు దశల్లో మూడేళ్లపాటు అమలు చేస్తారు. -
ఇంటింటా కంటి వెలుగు
సాక్షి, ఒంగోలు: ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకం కింద ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి 16వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 4,80,405 మందికి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 4402 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 911 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఒక ఆరోగ్య కార్యకర్త, ఒక ఆశ కార్యకర్త ఉంటారు. రోజుకు 100 నుంచి 150 మందికి పరీక్షలు నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రతి విద్యార్ధికి ఒక కార్డు.. వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక కార్డు ఇవ్వనున్నారు. ఆ కార్డులో విద్యార్థి పేరు, ఆధార్కార్డు నంబర్, తల్లిదండ్రుల పేర్లు, పాఠశాల పేరు ఉంటాయి. విద్యార్థికి కంటి పరీక్ష నిర్వహించిన అనంతరం ఎలాంటి సమస్య ఉందో ఆ కార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. నార్మల్, అబ్ నార్మల్, కంటి చూపు సమస్య ఉంటే ఆ వివరాలను కార్డులో నమోదు చేస్తారు. కంటి చూపు సమస్యతో విద్యార్థులు బాధపడుతుంటే తదుపరి స్టేజీకి సంబంధించి రిఫర్ చేసే వివరాలను కూడా ఆ కార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రెండవ దశలో మరింత సూక్ష్మంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ల జోళ్లు అవసరమైన వారికి వాటిని అందిస్తారు. ఒకవేళ శస్త్ర చికిత్సలు అవసరమైతే అలాంటి వారిని ఆసుపత్రికి సిఫార్సు చేస్తారు. ఉపాధ్యాయుని సంతకం తప్పనిసరి.. కంటి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రతి విద్యార్థికి ఒక కార్డును సిద్ధం చేశారు. పాఠశాలల వారీగా విద్యార్థులకు కార్డులను అందించనున్నారు. పరీక్ష వివరాలను నమోదు చేసిన ప్రతిసారీ ఆ కార్డుపై సంబంధిత వి«ధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సంతకం చేయాలి. ఉపాధ్యాయులకు టీఏ.. వైఎస్సార్ కంటి వెలుగు కింద విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు నియమితులైన ఉపాధ్యాయులకు టీఏ అందించనున్నారు. ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులు వెళ్లి కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కానుండటంతో వారికి టీఏ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. ఒంగోలులో బాలినేని, వైపాలెంలో సురేష్... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని రాంనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తుండగా, రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించనున్నారు. ఇంటింటా కంటి వెలుగు సీఎం జగన్ ధ్యేయం : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెం: డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటింటా కంటి వెలుగు ను నింపాలన్న బృహత్తర ఆలోచనతో ఉన్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆది మూలపు సురేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం గురువారం ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన యర్రగొండపాలెంలోని స్వగృహంలో బుధవారం సంబంధిత డాక్టర్లు, విద్యాశాఖాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. చిన్న పిల్లలు కావడం వలన విజన్ సక్రమంగా చెప్పలేక పోవచ్చని, వారిని ముందుగా అవగాహన పరచి విజన్ను తీయాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు అనంతరం అవసరం ఉన్నవారికి మందులు, కంటి అద్దాలు ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందని, మరింతగా కంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు తదుపరి దశలో సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయంలో డాక్టర్లకు ఆయా పాఠశాలల హెడ్మాష్టర్లు, ఆశా వర్కర్లు సహకరించాలని ఆయన ఆదేశించారు. హెచ్ఎంలు హాజరు కావాలి.. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో గురువారం ఉదయం 10.30 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీశైలం ఐటీడీఏ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలల హెడ్మాష్టర్లు విద్యార్థులను సమన్వయపరచుకొని కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ కె.నెహ్రూబాబు, ఎంఈఓ పి.ఆంజనేయులు, పాలుట్ల, వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సురేష్, ఎంఆర్ఐ వీరయ్యలు పాల్గొన్నారు.