పోలీసు అధికారులకు సేవా పతకాలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులకు సేవా పతకాలు

Published Tue, Oct 15 2024 12:54 AM | Last Updated on Tue, Oct 15 2024 12:54 AM

పోలీసు అధికారులకు సేవా పతకాలు

● 12 మందికి అతిఉత్కృష్ట, ఆరుగురికి ఉత్కృష్ట అవార్డులు ● ఆదిలాబాద్‌ డీఎస్పీకి దక్కిన ‘అతిఉత్కృష్ట’

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో విశిష్ట సేవలు అందిస్తున్న పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. ఇందులో 12 మంది అతిఉత్కృష్ట, ఆరుగురు ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. 25ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి అతిఉత్కృష్ట, 15ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి ఉత్కృష్ట అవార్డులు అందించనున్నారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి అతిఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈ విభాగంలో ట్రాఫిక్‌ ఏఎస్సై జాదవ్‌ సుభాష్‌, ఆదిలాబాద్‌ ఏఎస్సైలు మహ్మద్‌ ఖైసర్‌, కొండూరి రమేశ్‌, బోథ్‌ ఏఎస్సై వన్నెల గంగారెడ్డి, ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన హెడ్‌కానిస్టేబుళ్లు రవీందర్‌ రెడ్డి, పవార్‌ ధన్‌లాల్‌, విజయ్‌కుమార్‌, ఐఆర్‌, డీసీఆర్‌బీ హెడ్‌కానిస్టేబుళ్లు సత్యనారాయణ, స్వామి, అబ్దుల్‌ అలీం, కానిస్టేబుల్‌ సుదర్శన్‌ ఉన్నారు. ఉత్కృష్ట సేవా పతకాలకు ఆదిలాబాద్‌ మహిళా పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ అల్లూరి ప్రకాశ్‌రెడ్డి, మావల స్టేషన్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌రావు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ దర్శన్‌ భూమన్న, రాథోడ్‌ రామారావు, పవార్‌ శేష్‌రావు, ముకుంద్‌ ఎంపికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement