జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన క్రీడాకారులు జా తీయస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటా రు. రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జనవరి 27నుంచి 30 వర కు నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో 14 పతకాలతో సత్తా చాటారు. ఇందులో రెండు స్వర్ణం, ఆరు రజతం, ఆరు కాంస్య పతకాలు న్నాయి. క్రీడాకారుల్లో విద్మహి ఓ స్వర్ణంతో పా టు రజతం, కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. వందన శ్రీ స్వర్ణ పతకం సాధించగా, ఏంజెల్ రజత, కాంస్య పతకాలతో నిలిచింది. ఇక కీర్తన, శృతి, దివ్య, వనితలు రజత పతకాలు సాధించగా, వీరేష్, శివకుమార్, ప్రణ య్, అభి కాంస్యాలతో సత్తా చాటారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, కార్యదర్శి వీరేష్ తెలిపారు. సత్తా చాటిన క్రీడాకారులకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, శ్రీహరి, వెంకటస్వామి తదితరులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment