కె.కోటపాడు: విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కింతాడ పంచాయతీ రామచంద్రపురానికి చెందిన యువకుడు కన్నూరు రాజు(30)పై కేసు నమోదు చేసినట్టు కె.కోటపాడు పోలీసులు సోమవారం తెలిపారు. ఎస్ఐ లక్ష్మీనారాయణ వివరాల మేరకు... సింగన్నదొరపాలెం శివారు కొత్త అగ్రహారం గ్రామానికి చెందిన విద్యార్థిని(12) పాఠశాలకు రెండు రోజుల సెలవు కావడంతో తాతగారి ఊరు జోగన్నపాలెం వెళ్లింది. అక్కడ పొలం పనుల్లో భాగంగా శీతలపానీయాలు తీసుకెళ్తోంది. ఆ సమయంలో రోడ్డుపై అటువైపు బైక్ మీద వెళ్తున్న కన్నూరు రాజు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని మెడపై చేయి వేసి ఈ విషయం ఎవ్వరికై నా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. అదేసమయంలో అటువైపు వస్తున్న పాదచారులను చూసి అతడు ఉడాయించాడు. ఈ మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment