నేవీ ప్రహరీ నిర్మాణానికి వ్యతిరేకంగా నాలుగు రోజులుగా పెదకలవలాపల్లి గ్రామంలో చేస్తున్న ఎంపీటీసీ మాజీ సభ్యుడు రావి దేముళ్ల నిరవధిక నిరాహార దీక్షను రాంబిల్లి పోలీసులు ఆదివారం అర్ధరాత్రి భగ్నం చేశారు. ఆయనను రాంబిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోడ నిర్మాణం వల్ల నష్టపోతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్షకు దిగిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆస్పత్రికి బలవంతంగా తరలించారు. దీంతో సోమవారం గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించి నేవీ రక్షణ గోడ వద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, సీఐటీయూ నేతలు మాట్లాడుతూ అధికారులు, కూటమి ప్రభుత్వం నేతలు తమ సమస్యలపై కనీసం పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న పరిస్థితులపై ఆరా తీయలేదన్నారు. అధికారులు స్పందించి తక్షణం తమకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment