మంచంపై పడుకుని ఆన్లైన్ లైవ్లోకి వచ్చిన వ్యక్తి
పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజి్రస్టార్
కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు
సాక్షి , అమరావతి : ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేయాలన్న సదుద్దేశంతో తీసుకొచి్చన కోర్టు లైవ్ ప్రొసీడింగును కొందరు వ్యక్తులు అపహాస్యం చేస్తున్నారు . కోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలో లాగిన్ అయి అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఆన్లైన్ విచారణలో నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు.
ఇది హైకోర్టులో కలకలం రేపింది. ఈ నెల 15వ తేదీన కిట్టు అనే పేరుతో ఓ వ్యక్తి మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా 17వ కోర్టులోకి లాగిన్ అయ్యాడు . బట్టలు లేకుండా మంచంపై పడుకుని మాట్లాడుతూ కోర్టు కార్యకలాపాలకు విఘాతం కలిగించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని బ్లాక్ చేశారు. ఘటనపై హైకోర్టు ఐటీ రిజి్రస్టార్ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment