జిల్లా ఆస్పత్రిలో అనాధ వృద్ధురాలి మృతి | Sakshi
Sakshi News home page

జిల్లా ఆస్పత్రిలో అనాధ వృద్ధురాలి మృతి

Published Tue, Apr 23 2024 8:35 AM

జిల్లా ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన అనాధ తాయమ్మ  
 - Sakshi

మదనపల్లె : స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అనాధ వృద్ధురాలు తాయమ్మ(70) సోమవారం మృతి చెందింది. నెల రోజులుగా పట్టణంలో భిక్షాటన చేస్తూ మతిస్థిమితం లేక దేవతానగర్‌ వద్ద పడి ఉండగా, స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రెండు రోజులకే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. యాచించుకుంటూ తిరిగి నడవలేని స్థితిలో ఆస్పత్రి ఆవరణలో చెట్టు కింద ఉండగా స్థానికులు కొందరు మానవత్వంతో ఆమెకు సపర్యలు చేశారు. ఈనెల 10వ తేదీన ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదురుగా అనాధగా పడి ఉన్న తాయమ్మను క్యాజువాలిటీ వద్దకు వచ్చినమెడికల్‌ కాలేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎమ్మెస్‌ రాజు గమనించి జిల్లా ఆసుపత్రి ఐసీయూ విభాగంలో చేర్పించారు. ఆ సమయంలో వివరాలు అడగగా తన పేరు తాయమ్మ అని కర్ణాటక రాష్ట్రం కే జి ఎఫ్‌ కు చెందిన రామస్వామి భార్యగా పేర్కొంది. బంధువులు ఎవరూ లేకపోవడంతో, ఆమెకు ఐసీయూ విభాగంలో చికిత్సలు అందించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అప్పటినుంచి ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతూ సోమవారం పరిస్థితి విషమించి అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. ఆమె బంధువులు ఎవరైనా ఉంటే టూ టౌన్‌ పోలీసులను సంప్రదించాల్సిందిగా సీఐ యువరాజు కోరారు.

Advertisement
Advertisement