చెంపలు వాయించి పోలీసులకు అప్పగించిన ప్రిన్సిపల్
విజయవాడ వన్టౌన్ శ్రీచైతన్య స్కూల్లో ఘటన
చిట్టినగర్ (విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యా ర్థినులు చెప్పడంతో తల్లిదండ్రుల సమక్షంలో ప్రిన్సిపల్ నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.
సేకరించిన వివరాల ప్రకారం.. వన్టౌన్ వాగుసెంటర్కు చెందిన పోతిన హేమంత్ (36) చిట్టినగర్ సమీపంలోని శ్రీ చైతన్య స్కూల్లో 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు గణితం సబ్జెక్ట్ చెబుతుంటాడు. కొంత కాలంగా ఆయన 8వ తరగతి విద్యార్థినీని బ్యాడ్ టచ్ చేస్తున్నాడు. వారు క్లాస్లోకి వచ్చే క్రమంలో గుమ్మం వద్ద అడ్డుగా నిలబడి, తగలరాని చోట తగులుతూ ఇబ్బందికరంగా వ్యవహరించసాగాడు.
దీంతో విద్యా ర్థిని తల్లిదండ్రులు బుధవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం స్కూల్కు వచ్చి ప్రిన్సిపల్కు జరుగుతున్న వేధింపుల గురించి వివరించారు. క్లాస్లో ఉన్న హేమంత్ని ప్రిన్సిపల్ తన కార్యాలయానికి పిలిపించి చెంపలు వాయించారు. అతడిని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment