కొనసాగుతున్న ఇంటర్ ప్రయోగ పరీక్షలు
గద్వాలటౌన్: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు రెండో రోజు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 43 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉండగా.. 34 కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం జరిగిన జనరల్ విభాగంలో 605 మంది విద్యార్థులకు గాను 581 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 505 మందికి గాను 454 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన జనరల్ విభాగం ప్రయోగ పరీక్షలకు 339 మందికి గాను 333 మంది హాజరు కాగా.. ఆరుగురు గైర్హాజరయ్యారు. వృత్తివిద్యా కోర్సులో 461 మంది విద్యార్థులకు గాను 443 మంది హాజరయ్యారు. గద్వాల, పుల్లూరులో కళాశాలల్లో ప్రయోగ పరీక్షలను డీఐఈఓ హృదయరాజు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment