అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును మరో ప్రైవేట్ ట్రావెల్స్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రమిది. రెండేళ్ల క్రితం విడుదలైన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. రష్మిక మందన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడు మిల్లి లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment