సింగిల్‌ నామినేషన్‌.. | Sakshi
Sakshi News home page

సింగిల్‌ నామినేషన్‌..

Published Fri, Apr 19 2024 1:35 AM

- - Sakshi

మహబూబాబాద్‌: మానుకోట పార్లమెంట్‌ నియోజకవర్గ నామినేషన్ల స్వీకరణ కోసం స్థానిక కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. తొలిరోజు గురువారం ఒక్క నామినేషన్‌ దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్‌ పరిధిలోని మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామ శివారు గుర్రపు తండాకు చెందిన బానోత్‌ లింగ్యానాయక్‌ నామినేషన్‌ పత్రాలను జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి అద్వైత్‌కుమార్‌ సింగ్‌కు అందజేశారు. ఆ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టరేట్‌ ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్వో కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు నలుగురిని అనుమతించారు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్‌ అధికారులు, అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌ టొప్పో, డేవిడ్‌, ఆర్డీఓలు అలివేలు, నర్సింహారావు, తహసీల్దార్లు భగవాన్‌రెడ్డి, దామోదర్‌, శ్వేత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement