కొంగాల గ్రామసభలో రసాభాస
బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025
వాజేడు మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో రసాభాస చోటుచేసుకుంది. వివిధ పథకాలకు అర్హులైన వారి వివరాలను అధికారులు చదువుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెనుమళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు నాయకులు గ్రామసభ వద్దకు చేరుకుని ఆరుగ్యారంటీలను అమలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాట్ల కాళీకృష్ణ బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటని ఎదురు ప్రశ్నించసాగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే ఎస్సై రాజ్కుమార్, అధికారులు ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో గ్రామసభ యధావిథిగా కొనసాగింది.
న్యూస్రీల్
Comments
Please login to add a commentAdd a comment