డీఎస్సీ క్వాలిఫై అయి 1:3 నిష్పత్తి ప్రకారం ఎంపికై న అభ్యర్థుల అందరికీ ఫోన్ కాల్స్ ద్వారా తప్పనిసరిగా సమాచారం ఇచ్చి ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సజావుగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయ అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు ఎంతమంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు.. ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.. ఒక్కొక్కరికి ఎంత సమయం పడుతుంది.. అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. జిల్లాలో 285 పోస్టులకు గాను 885 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలిస్తున్నామని డీఈఓ గోవిందరాజులు కలెక్టర్కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment